వన్ధన్ వికాస కేంద్రాలు వృద్ధి చెందాలి
పార్వతీపురం: ఐటీడీఏ పరిధిలోని వన్ధన్ వికాస కేంద్రాలు వృద్ధి చెందాలని ఐటీడీఏ పీఓ అశుతోష్ శ్రీవాత్సవ పేర్కొన్నారు. ఈ మేరకు మంగళవారం ఆయన తన కార్యాలయంలో వీడీవీకేల నిర్వహణ, యంత్రాల కొనుగోలుపై సంబంధిత అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వీడీవీకేల ఉత్పత్తులు పెంచేందుకు అవసరమైన యంత్ర సామగ్రిని వారికి సమకూర్చి, వాటిపై శిక్షణ కార్యక్రమాలను నిర్వహించి, ఉత్పత్తులకు ఆకర్షణీయమైన ప్యాకింగ్ ఏర్పాటు చేసి మార్కెటింగ్ సదుపాయం కల్పించాలని ఆదేశించారు. ఈ వీడియో కాన్ఫరెన్స్లో వెలుగు ఏపీడీ, వెలుగు 8మండలాల ఏపీఎంలు, హెడ్క్వార్టర్ ఏపీఎంలు పాల్గొన్నారు.
ఐటీడీఏ పీఓ అశుతోష్ శ్రీవాత్సవ
Comments
Please login to add a commentAdd a comment