రాజధాని స్థాపన దినోత్సవానికి సన్నాహక సమావేశం | - | Sakshi
Sakshi News home page

రాజధాని స్థాపన దినోత్సవానికి సన్నాహక సమావేశం

Published Sat, Apr 5 2025 1:00 AM | Last Updated on Sat, Apr 5 2025 1:00 AM

రాజధాని స్థాపన దినోత్సవానికి సన్నాహక సమావేశం

రాజధాని స్థాపన దినోత్సవానికి సన్నాహక సమావేశం

భువనేశ్వర్‌: రాజధాని స్థాపన దినోత్సవం ఈ నెల 13, 14 తేదీల్లో వరుసగా రెండు రోజులు జరుపుకోనున్నారు. కార్యక్రమం జయప్రదం చేసేందుకు ప్రభుత్వ యంత్రాంగం చర్యలు తీసుకుంటోంది. ఇటీవల ముగిసిన ఉన్నత స్థాయి సమావేశం తీర్మా నాల వాస్తవ కార్యాచరణకు సంబంధించి శుక్రవా రం ప్రత్యేక సమావేశం నిర్వహించారు. స్థానిక క్యాపిటల్‌ ఉన్నత పాఠశాల సమావేశం హాలులో అదనపు జిల్లా మేజిస్ట్రేట్‌ రుద్ర నారాయణ్‌ మహంతి అధ్యక్షతన ఈ సమావేశం జరిగింది. ఈ ఏడాది రాజధాని స్థాపన దినోత్సవం వైభవంగా ఆకర్షణీ య ప్రదర్శనలతో జరుపుకోవాలని నిర్ణయించారు. విద్యార్థుల కవాతు కళాశాల స్థాయికి పరిమితం చేశారు. ఈ సందర్భంగా వివిధ పోటీలను నిర్వహించాలని ఉత్సవ నిర్వాహక మండలి నిర్ణయించింది. రాష్ట్రంలో వేసవి వేడిని దృష్టిలో ఉంచుకుని పరేడ్‌ బ్యాండ్‌లు ఉన్న అన్ని ప్రభుత్వ, ప్రైవేట్‌ విద్యా సంస్థల విద్యార్థులకు మాత్రమే పరేడ్‌లో పాల్గొనేందుకు అనుమతించనున్నారు. మన రాజ ధాని శీర్షికపై పాఠశాల, కళాశాల విద్యార్థుల మధ్య వివిధ నృత్య, పాటల పోటీలు నిర్వహిస్తారు. స్థాని క రవీంద్ర మండపంలో ఈ పోటీలు జరుగుతాయ ని ప్రకటించారు. రాజధాని నగరం స్థాపన దినోత్స వం పురస్కరించుకుని వరుసగా రెండు రోజులు సాయంత్రం స్థానిక ఉత్కళ్‌ మండపంలో సదస్సు, చర్చ కార్యక్రమాలు నిర్వహిస్తారు.

సమావేశంలో రాజధాని స్థాపన దినోత్సవ నిర్వాహక కమిటీ చైర్మన్‌ ప్రదోష్‌ పట్నాయక్‌, భువనేశ్వర్‌ మున్సిపల్‌ కార్పొరేషన్‌ బీఎంసీ సహాయ కమిషనర్‌ కె. గణేష్‌, మాధ్యమిక విద్యా విభాగం సహాయ డైరెక్టర్‌ హిమాన్షు శేఖర్‌ బెహరా, భువనేశ్వర్‌ మండల విద్యాధికారి బీఈఓ డాక్టర్‌ ప్రజ్ఞా పరమిత జెనా, ఖుర్ధా మండల విద్యాధికారి బీఈఓ సంధ్యారాణి రౌత్‌, క్యాపిటల్‌ హై స్కూల్‌ ప్రిన్సిపాల్‌ అనుపమ మంగరాజ్‌, క్యాపిటల్‌ ఫౌండేషన్‌ డే కమిటీ వైస్‌ చైర్మన్‌ ప్రద్యుమ్న కుమార్‌ మహంతి, ప్రధాన కార్యదర్శి సనత్‌ మిశ్రా, వివిధ విద్యా సంస్థల ఉపాధ్యాయులు, సిబ్బంది పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement