వైభవంగా భావనాఋషి పెళ్లి కుమారుడి ఉత్సవం
మంగళగిరి: పాత మంగళగిరి భావనాఋషి స్వామి వారి పెళ్లి కుమారుడి ఉత్సవం వైభవంగా నిర్వహించారు. స్వామి వారిని పెండ్లి కుమారుడిగా అలంకరించి ప్రత్యేక పూజలు నిర్వహించారు. భక్తులు పెద్ద సంఖ్యలో హాజరై స్వామి వారి ఉత్సవాన్ని తిలకించారు. ఉదయం స్వామి వారి మూలవిరాట్ల్లకు అభి షేకం నిర్వహించి భావనాఋషి స్వామి, శ్రీ భద్రావతి దేవి వార్లను పెండ్లి కుమారుడు, పెండ్లి కుమార్తెలుగా పురోహితులు వేదమంత్రాల మధ్య అలంకరించారు. ఉత్సవ కై ంకర్యపరులుగా డాక్టర్ తాడిపర్తి మురళి వెంకటేశ్వరరావు, విజయభారతి, డాక్టర్ తాడిపర్తి శ్రీనివాసమూర్తి దంపతులు పూజలు నిర్వహించారు. శనివారం స్వామి వారి కళ్యాణ మహోత్సవం నిర్వహించడం జరుగుతుందని, ఈ సందర్భంగా రాజీవ్ సెంటర్లో సాంస్కృతిక కార్యక్రమాలు , బాణసంచా కాల్పులు, కళాకారుల నృత్యాలు నిర్వహించబడతాయన్నారు.
కార్యక్రమంలో పద్మశాలీయ బహుత్తమ సంఘ ప్రతినిధులు చింతికింది కనకయ్య, గుత్తికొండ ధనుంజయరావు, దామర్ల కుబేరస్వామి, గంజి రవీంద్ర నాఽథ్, రామనాథం పూర్ణచంద్రరావు, మునగపాటి వెంకటేశ్వరరావు, వంగర లక్ష్మయ్య, జంజనం భిక్షారావు తదితరులు పాల్గొన్నారు.
రేపు కళ్యాణ మహోత్సవం
Comments
Please login to add a commentAdd a comment