సత్రశాలలో మహాశివరాత్రికి పకడ్బందీ ఏర్పాట్లు
దేవదాయశాఖ డెప్యూటీ కమిషనర్ బసవ శ్రీనివాసరావు
సత్రశాల(రెంటచింతల): మహాశివరాత్రి పర్వదినం పురష్కరించుకుని ఫిబ్రవరి 26న సత్రశాల గంగా భ్రమరాంబ సమేత మల్లికార్జునస్వామిని దర్శించుకునే భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా మెరుగైన సేవలు అందించాలని గుంటూరు దేవదాయశాఖ డెప్యూటీ కమిషనర్ కామినేని బసవ శ్రీనివాసరావు కోరారు. శుక్రవారం స్థానిక దేవస్థానం ప్రాంగణంలో ఆయన ఎండోమెంట్ ఈఓ గాదె రామిరెడ్డితో కలిసి మహాశివరాత్రి ఏర్పాట్లపై చర్చించి సూచనలు చేశారు. సత్రశాల వరకు ఉన్న రహదారికి ఇరువైపులా ఉన్న గుంతలను వెంటనే పూడ్చే పనులు చేపట్టాలని ఆదేశించారు. ముందుగా ఆయన దేవస్థానంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆయన వెంట అర్చకులు మల్లికార్జునశర్మ నీలం మల్లయ్య, మున్నా లింగయ్య తదితరులు ఉన్నారు.
పెండింగ్ కేసులు త్వరగా దర్యాప్తు చేయాలి
డీఎస్పీ రామాంజనేయులు
చందోలు(కర్లపాలెం): పెండింగ్ కేసులు త్వరగా దర్యాప్తు చేసి పరిష్కరించాలని బాపట్ల డీఎస్పీ జి.రామాంజనేయులు ఆదేశించారు. చందోలు పోలీస్స్టేషన్ను శుక్రవారం డీఎస్పీ రామాంజనేయులు ఆకస్మిక తనిఖీ చేశారు. రికార్డులు తనిఖీ చేసి పెండింగ్ కేసుల పరిష్కరించేందుకు సిబ్బందికి పలు సూచనలు చేశారు. ఈసందర్భంగా డీఎస్పీ మాట్లాడుతూ ద్విచక్ర మోటారు వాహనాలపై ప్రయాణించే వారు హెల్మెట్ పెట్టుకునే విధంగా కారులో ప్రయాణించే వారు సీటు బెల్టు పెట్టుకునే విధంగా సిబ్బంది అవగాహన కల్పించాలని చెప్పారు. మండలంలో కోడి పందేలు, పేకాటలపై నిఘా ఉంచాలని చెప్పారు. కార్యక్రమంలో ఎస్ఐ ఆర్.స్వామి శ్రీనివాస్, సిబ్బంది ఉన్నారు.
Comments
Please login to add a commentAdd a comment