వైభవంగా పునర్వసు పట్టాభిషేకం
నెల్లిమర్ల రూరల్: సుప్రసిద్ధ పుణ్యక్షేత్రం రామతీర్థంలోని శ్రీ సీతారామస్వామి దేవస్థానంలో పునర్వసు పట్టాభిషేకం కార్యక్రమాన్ని అర్చకులు ఆదివారం ఘనంగా నిర్వహించారు. వేకువజామున స్వామికి ప్రాతఃకాలార్చన, బాలభోగం నిర్వహించిన తరువాత యాగశాలలో సుందరకాండ హవనం జరిపించారు. అనంతరం ఆలయంలో వెండి మంటపం వద్ద సీతారామస్వామిని నూతన పట్టు వస్త్రాలతో సుందరంగా అలంకరించి స్వామి వారి నిత్య కల్యాణ మహోత్సవ ఘట్టాన్ని కనుల పండువగా నిర్వహించారు. ఉత్సవమూర్తుల వద్ద రామాయణంలో పట్టాభిషేకం సర్గ విన్నవించి శ్రీరామచంద్రమూర్తికి పాలు, పెరుగు, తేనె, నెయ్యి, వివిధ రకాల ఫల రసాలతో విశేష అభిషేకాలు, పట్టాభిషేక మహోత్సవాన్ని వైభవంగా జరిపించారు. కార్యక్రమంలో అర్చకులు, సిబ్బంది, భక్తులు పాల్గొన్నారు.
వైభవంగా పునర్వసు పట్టాభిషేకం
Comments
Please login to add a commentAdd a comment