నీలగిరి తోటలు దగ్ధం
వేపాడ: మండలంలోని వీలుపర్తి పంచాయతీ శివారు కొత్తూరు గ్రామం సమీపంలో బుధవారం జరిగిన అగ్ని ప్రమాదంలో నీలగిరి, టేకు తోటలు దగ్ధమయ్యాయి. ఎస్.కోట అగ్నిమాపక సిబ్బందికి సమాచారం అందడంతో ఫైర్స్టేషన్ అధికారి ఎస్.కె మదీనా నేతృత్వంలో సిబ్బంది శ్రీనివాసరావు, లక్ష్మణరావు, వెంకటరావులు సంఘటానా స్థలానికి చేరుకుని మంటలను అదుపు చేశారు. కొత్తూరు గ్రామానికి చెందిన బోజంకి ఎరుకునాయుడు, బోజంకి ఈశ్వర్రావు, జూరెడ్డి దేముడు తదితర 15 మందికి సంబంధించిన నీలగిరి, టేకు చెట్లు సుమారు పది ఎకరాల్లో కాలిపోయినట్లు అగ్నిమాపక సిబ్బంది చెప్పారు. సుమారు రూ.నాలుగు లక్షల ఆస్తి నష్టం ఉంటుందని స్థానికులు అంచనా వేస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment