ఎమ్మెల్యే ఇంటిని ముట్టడిస్తాం | - | Sakshi
Sakshi News home page

ఎమ్మెల్యే ఇంటిని ముట్టడిస్తాం

Published Sun, Apr 6 2025 1:59 AM | Last Updated on Sun, Apr 6 2025 1:59 AM

ఎమ్మెల్యే ఇంటిని ముట్టడిస్తాం

ఎమ్మెల్యే ఇంటిని ముట్టడిస్తాం

● ప్రభుత్వం రైతులకు వెంటనే పంట నష్టం పరిహారం చెల్లించాలి ● బీజేపీ జిల్లా అధ్యక్షుడు కర్రె సంజీవరెడ్డి

జూలపల్లి(పెద్దపల్లి): అకాల వర్షాలతో పంటలు నష్టపోయిన అన్నదాతలకు ప్రభుత్వం పరిహా రం చెల్లించకుంటే రైతులతో కలిసి పెద్దపల్లి ఎ మ్మెల్యే ఇంటిని ముట్టడిస్తామని బీజేపీ జిల్లా అ ధ్యక్షుడు కర్రె సంజీవరెడ్డి హెచ్చరించారు. మండ ల కేంద్రంలో శనివారం ఆయన విలేకరులతో మాట్లాడారు. అకాల వర్షాలతో పంటలు నష్టపోయిన రైతులను ఎమ్మెల్యే కంటితుడుపుగా పరామర్శించి వెళ్లిపోయారని, పరిహరంపై ఇంకా స్పష్టత ఇవ్వలేదన్నారు. ఎకరాకు రూ.50వేల ప రిహారం చెల్లించాలని ఆయన డిమాండ్‌ చేశారు. లేనిపక్షంలో కాంగ్రెస్‌ ఎమ్మెల్యేలను గ్రామాల్లో తిరగనివ్వబోమని హెచ్చరించారు. నాయకులు ప్రదీప్‌కుమార్‌, జ్యోతిబసు, పెద్దోల్ల ఐలయ్య, తీగెల లశోక్‌గౌడ్‌, దోడ్ల రాజిరెడ్డి, వెల్పుల ఓదెలు, గుమ్మడి శ్రీనివాస్‌ పాల్గొన్నారు.

బీజేపీని విస్తరించాలి

సుల్తానాబాద్‌: బీజేపీ అన్ని రంగాల్లో విస్తరించినప్పుడే ముందు వరుసలో ఉంటుందని ఆ పార్టీ జిల్లా అధ్యక్షుడు కర్రె సంజీవరెడ్డి అన్నారు. సుల్తానాబాద్‌ బార్‌ అసోసియేషన్‌ గ్రంథాలయం కార్యదర్శిగా గుడ్ల వెంకటేశ్‌ ఎన్నిక సందర్భంగా స్థాని క పార్టీ కార్యాలయంలో ఆయనను సన్మానించా రు. ఈసందర్భంగా సంజీవరెడ్డి మాట్లాడారు. నా యకులు కడారి అశోక్‌రావు, సౌదరి మహేందర్‌యాదవ్‌, కూకట్ల నాగరాజు, నాగులమల్యాల తిరుపతి, సంతోష్‌ తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement