‘హుజూరాబాద్‌ ఎన్నికల కోసమే కేసీఆర్‌ నీటి గొడవలు’ | AP BJP Leader TG Venkatesh Slams KCR Over Water Issue | Sakshi

‘హుజూరాబాద్‌ ఎన్నికల కోసమే కేసీఆర్‌ నీటి గొడవలు’

Jul 6 2021 3:03 PM | Updated on Jul 6 2021 3:42 PM

AP BJP Leader TG Venkatesh Slams KCR Over Water Issue - Sakshi

సాక్షి, కర్నూలు: తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌పై బీజేపీ నేత టీజీ వెంకటేష్‌ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ‘‘హుజూరాబాద్‌ ఎన్నికల కోసమే కేసీఆర్‌ నీటి గొడవలు మొదలుపెట్టారు.. మాకు హైదరాబాద్‌ వచ్చే హక్కు ఉందని’’ తెలిపారు. ఈ సందర్భంగా టీజీ వెంకటేష్‌ మాట్లాడుతూ..  కరోనా బాధితులను చెక్‌పోస్ట్‌ల వద్ద ఆపేశారు. విభజన హామీలను మరిచిపోతే ఎలా. శ్రీశైలం ప్రాజెక్ట్‌లో ఇష్టమొచ్చినట్లు విద్యుదుత్పత్తి చేస్తామనడం సిగ్గుచేటు అంటూ విమర్శించారు. 

‘‘పోతిరెడ్డిపాడుకు నీళ్లు రావాలంటే శ్రీశైలంలో 854 అడుగుల నీటిమట్టం ఉండాలి. పోతిరెడ్డిపాడు, తెలుగుగంగ తెలంగాణ ప్రాజెక్టుల కంటే ముందే కట్టారు..మాకు నీళ్లిచ్చిన తర్వాతే తెలంగాణకు నీళ్లివ్వాలి. పోలీసులతో ప్రాజెక్ట్‌ను మోహరించడం కరెక్ట్‌ కాదని’’ బీజేపీ నేత టీజీ వెంకటేష్‌ మండిపడ్డారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Photos

View all

Video

View all
Advertisement