huzurabad
-
వింత ఆచారం: కీడు సోకిందని ఊరు ఖాళీ
జమ్మికుంట (హుజూరాబాద్): ఊరుకు కీడు సోకిందని, అందుకే తరచూ గ్రామంలో ఎవరో ఒకరు చనిపోతున్నారని గ్రామస్తులంతా ఊరు విడిచి బయటకు వెళ్లిన ఘటన కరీంనగర్ జిల్లా జమ్మికుంట మండలం విలాసాగర్లో గురువారం జరిగింది. గ్రామస్తులు తెలిపిన వివరాలు.. విలాసాగర్లో కొన్ని నెలలుగా ఒకరు మృతి చెందిన వెంటనే వారి దశదిన కర్మలు పూర్తి కాకుండానే మరొకరు చనిపోతున్నారు. ఇలా గ్రామంలో వరుసగా 11 మంది మృతిచెందడంతో ఆయా కులాల పెద్దలందరూ వేదపండితులను ఆశ్రయించారు. గ్రామానికి కీడు సోకిందని తెలుసుకొని ఊరంతా గురువారం వేకువజామున 5 గంటలకు ముందే ఇళ్లకు తాళాలు వేసి సమీపంలోని మానేరు పరీవాహక ప్రాంతం బ్రిడ్జి వద్దకు తరలివెళ్లారు. అక్కడే వంటలు చేసుకొని సాయంత్రం వరకు గడిపి చీకటిపడ్డాక ఇంటిబాట పట్టారు. దీంతో గ్రామంలో నిశ్శబ్ధ వాతావరణం నెలకొంది. గతంలో కూడా ఇలాగే బయటకు వెళ్లామని, ఫలితం కనబడిందని గ్రామస్తులు తెలిపారు. -
కౌశిక్రెడ్డికి అస్వస్థత.. ఆస్పత్రికి తరలింపు
కరీంనగర్,సాక్షి: కరీంనగర్ జిల్లా హుజురాబాద్లో ఉద్రిక్తత చోటుచేసుకుంది. దళితబంధు కోసం ఎమ్మెల్యే పాడి కౌశిక్రెడ్డి ధర్నా చేపట్టారు. కౌశిక్రెడ్డి, నిరసనకారులను పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ క్రమంలో కౌశిక్రెడ్డి అస్వస్థతకు గురయ్యారు. దీంతో వెంటనే ఆయన్ను స్థానిక ఆస్పత్రికి తరలించారు. రెండోవిడత దళితబంధు ఇవ్వాలంటూ దరఖాస్తుదారులతో కలిసి ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి ధర్నాకు దిగారు. దరఖాస్తుదారులతో కలిసి ధర్నా కోసం అంబేద్కర్ చౌక్ కు వెళ్తున్న ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి, దరఖాస్తుదారులను పోలీసులు అడ్డుకునేందుకు ప్రయత్నించారు. దీంతో పోలీసులు, నిరసనకారులకు మధ్య వాగ్వాదం, తోపులాట చోటుచేసుకుంది. ధర్నాకు దిగిన ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి, నిరసనకారులను పోలీసులు అరెస్ట్ చేశారు. దీంతో హుజూరాబాద్ అంబేద్కర్ చౌక్ వద్ద ధర్నా ఉద్రిక్తంగా మారింది. -
డ్రగ్స్ కేసులో ఇరికించే కుట్ర.. కేటీఆరే అసలు టార్గెట్!
-
హుజూరాబాద్ అంబేద్కర్ చౌరస్తాలో భారీ అగ్ని ప్రమాదం
కరీంనగర్ జిల్లా హుజూరాబాద్ పట్టణం అంబేద్కర్ చౌరస్తాలో భారీ అగ్ని ప్రమాదం సంభవించింది. ఈ ఘటనలో 20 చిరు వ్యాపారుల దుకాణాలు అగ్నికి ఆహుతయ్యాయి. అరటి పండ్ల బండ్లు పూర్తిగా దగ్ధమయ్యాయి. అగ్నిప్రమాదంపై సమాచారం అందుకున్న స్థానికులు, అగ్నిమాపక సిబ్బంది వాహనాలు, ఇతర దుఖాణాలకు మంటలు వ్యాపించకుండా అదుపులోకి తెచ్చారు. అర్ధరాత్రి దాటాక జరిగిన ప్రమాదం..షార్ట్ సర్క్యూట్ వల్లేనని తెలుస్తోంది. అగ్నిప్రమాదంపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. -
హుజురాబాద్ క్యాంప్ ఆఫీస్ లో వింత శబ్దాలు
-
బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డిపై క్రిమినల్ కేసు నమోదు
కరీంనగర్: హుజురాబాద్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి వార్తల్లో నిలిచారు. నిన్న(మంగళవారం) జడ్పీ సమావేశంలో ఎమ్మెల్యే వ్యవహారించిన తీరుపై జడ్పీ సీఈవో ఫిర్యాదు మేరకు పోలీసులు క్రిమినల్ కేసు నమోదు చేశారు. కలెక్టర్ పమేలా సత్పతి బయటికి వెళ్లే సమయంలో అడ్డుకునేందుకు ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి బైఠాయించారు. జడ్పీ సీఈవో ఫిర్యాదు మేరకు.. భారత్ న్యాయ్ సంహిత యాక్ట్ ప్రకారం 221, 126 (2) సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు పోలీసులు. బీఎన్ఎస్ చట్టం అమల్లోకి వచ్చిన రెండవ రోజే కౌశిక్ రెడ్డిపై నమోదు అయంది. బీఎన్ఎస్ యాక్టు కింద కేసు నమోదైన మొట్టమొదటి ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి కావడం గమనార్హం. కౌశిక్ రెడ్డి కేసుపై కేటీఆర్ ఆగ్రహంహుజురాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డిపై కేసు నమోదు చేయటంపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రభుత్వ అవినీతిపై పోరాటం చేస్తున్నందుకే కౌశిక్ రెడ్డిపై అక్రమ కేసు నమోదు చేసినట్లు మండిపడ్డారు. ఇలాంటి బెదిరింపులకు బీఆర్ఎస్ పార్టీ నాయకులు భయపడేది లేదన్న కేటీఆర్ తేల్చిచెప్పారు. -
Telangana: లంచం తీసుకుంటూ ఏసీబీకి చిక్కిన పలువురు అధికారులు
సాక్షి, హన్మకొండ/నల్లగొండ జిల్లా: లంచం తీసుకొని అవినీతికి పాల్పడుతున్న పలువురు అధికారుల్ని తెలంగాణ అవినీతి నిరోధక శాఖ (ఏసీబీ) అధికారులు రెడ్ హ్యాండెడ్గా పట్టుకుంటుతున్నారు. తాజాగా పలువురు అధికారులు లంచం తీసుకుంటూ ఏసీబీ వలకు అడ్డంగా దొరికిపోయారు. హన్మకొండ జిల్లా ఎల్కతుర్తి మండల కేంద్రంలోని ఓ హోటల్లో లంచం తీసుకుంటూ హుజురాబాద్ ఆర్టీసీ డిపో మేనేజర్ శ్రీకాంత్ ఏసీబీకి చిక్కారు. హుజురాబాద్ డిపోలో పనిచేస్తున్న ఎల్కతుర్తి మండలం దండేపల్లి గ్రామానికి చెందిన తాటికొండ రవీందర్ అనే ఆర్టీసీ డ్రైవర్ విధులు సక్రమంగా నిర్వహించడం లేదని చార్జిమెమో అందించారు. అయితే శాఖా పరమైన కేసు కొట్టివేయడం కోసం డిపో మేనేజర్ శ్రీకాంత్ లంచం డిమాండ్ చేశారు. బాధితుడు గతంలోనే రూ. 10,000 అందించగ.. మంగళవారం మరో రూ. 20000 రూపాయలు లంచం ఇస్తున్న క్రమంలో ఏసీబీ ఆయన్ను అరెస్ట్ చేసింది. అదే విధంగా.. రూ.18 వేలు లంచం తీసుకుంటూ నల్గొండ డ్రగ్ ఇన్స్పెక్టర్ సోమశేఖర్ ఏసీబీకి చిక్కారు. ఓ ప్రైవేటు ఆస్పత్రిలో ఫార్మసీకి అనుమతి ఇచ్చేందుకు సోమశేఖర్ లంచం డిమాండ్ చేయగా.. బాధితుడు ఏసీబీని ఆధ్రయించడంతో అధికారులు పక్కా ప్రణాళికతో ఆయన్ని అదుపులోకి తీసుకున్నారు. ఆసిఫాబాద్లో ఎస్సై రాజ్యలక్ష్మి రూ. 25వేలు లంచం తీసుకుంటూ పట్టుబడ్డారు. స్టేషన్ బెయిల్ ఇచ్చేందుకు ఓ వ్యక్తి నుంచి ఆమె రూ.40 వేలు డిమాండ్ చేసినట్లు తెలుస్తోంది. చదవండి: ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో కీలక పరిణామం -
ప్రాణం తీసిన మూలమలుపు.. మట్టి లారీ బైక్ను ఢీకొట్టడంతో..
సాక్షి, కరీంనగర్: కరీంనగర్ జిల్లాలో విషాదకర ఘటన చోటుచేసుకుంది. హుజూరాబాద్ మండలంలో ఓ లారీ.. బైక్ను ఢీకొన్న ఘటనలో ఒకే కుటుంబానికి చెందిన అన్నాచెల్లెతో సహా మరో యువతి మృతిచెందింది. దీంతో, కుటుంబం సభ్యులు కన్నీటిపర్యంతమవుతున్నారు. వివరాల ప్రకారం.. హుజూరాబాద్ మండలం బోర్నపల్లి మూలమలుపు వద్ద మొరం లోడ్తో వస్తున్న లారీ.. బైకును ఢీకొట్టింది. ఈ క్రమంలో లారీలో ఉన్న మొరం బైక్పై వెళ్లున్న వారిపై పడింది. మట్టిలో వారు ముగ్గురు కూరుకుపోవడంతో అక్కడికక్కడే మృతిచెందారు. అనంతరం, జేసీబీ సాయంతో వారి మృతదేహాలను బయటకు తీశారు. ఇక, ఈ ఘటనలో మృతిచెందిన వారిలో ఒకే కుటుంబానికి చెందిన అన్నాచెల్లెలు ఉన్నారు. మృతి చెందిన వారిని విజయ్, సింధుజ, వర్షలుగా గుర్తించారు. దీంతో, కుటుంబ సభ్యులు కన్నీటిపర్యంతమవుతున్నారు. కాగా, బోర్నవల్లిలో పెద్దమ్మ తల్లి బోనాల జాతరకు వెళ్లి తిరిగి వస్తుండగా ఈ ఘటన చోటుచేసుకుంది. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు తెలిపారు. -
ఈటలకు మల్కాజ్గిరి ఫిక్స్!.. బీజేపీ నేతలతో కీలక భేటీ?
సాక్షి, హైదరాబాద్: రానున్న లోక్సభ ఎన్నికల్లో తెలంగాణలో మెజార్టీ స్థానాల్లో గెలుపే లక్ష్యంగా బీజేపీ పావులు కదుపుతోంది. ఈ క్రమంలో బీజేపీ హైకమాండ్ మరో కీలక నిర్ణయం తీసుకున్నట్టు సమాచారం. మల్కాజ్గిరి ఎంపీ టికెట్ను ఈటల రాజేందర్కు కేటాయించినట్టు తెలుస్తోంది. దీంతో, ఆయన పోటీ ఆసక్తికరంగా మారనుంది. వివరాల ప్రకారం.. తెలంగాణలో లోక్సభ ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థులపై బీజేపీ హైకమాండ్ కసరత్తు చేస్తోంది. ఈ క్రమంలోనే మల్కాజ్గిరి లోక్సభ స్థానంలో ఈటల రాజేందర్ను బరిలోకి దింపాలని నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు మల్కాజ్గిరి స్థానం ఈటలకు కన్ఫర్మ్ అయినట్టు సమాచారం. దీంతో, ఈటల శామీర్పేటలోని ఆయన నివాసంలో బీజేపీ నేతలతో బ్రేక్ ఫాస్ట్ మీటింగ్ ఏర్పాటు చేస్తున్నారు. పార్టీ కార్యకర్తలు, నేతలకు ఈ మేరకు మెసేజ్లు వెళ్తున్నట్టు సమాచారం. ఇదిలా ఉండగా.. సార్వత్రిక ఎన్నికల సంసిద్ధతలో భాగంగా బీజేపీ కోర్ కమిటీ తెలంగాణలో పార్టీ బలాబలాలపై రాష్ట్ర నాయకత్వంతో మేధోమథనం చేపట్టింది. పార్టీ లోక్సభ అభ్యర్థుల తొలి జాబితా విడుదలకు సంబంధించి కసరత్తు నిర్వహించింది. అభ్యర్థుల ఎంపికపై ప్రాథమిక కసరత్తు పూర్తి చేసినట్లు పార్టీ వర్గాల విశ్వసనీయ సమాచారం. ముఖ్యంగా సికింద్రాబాద్–జి.కిషన్రెడ్డి, కరీంనగర్–బండి సంజయ్, నిజామాబాద్–ధర్మపురి అర్వింద్, మహబూబ్నగర్–డీకే అరుణ, చేవెళ్ల–కొండా విశ్వేశ్వర్రెడ్డి, మెదక్–ఎం.రఘునందన్రావు, భువనగిరి–బూర నర్సయ్యగౌడ్ అభ్యర్థిత్వాలపై ఏకాభిప్రాయం వ్యక్తమైనట్టుగా పార్టీ నాయకులు చెబుతున్నారు. ఆయా పేర్లకు నడ్డా, షా ఆమోదముద్ర వేసినట్లు సమాచారం. ఇవి కాకుండా మరో రెండు సీట్లలోనూ విజయావకాశాలు మెండుగా ఉన్నాయని అంచనా వేస్తున్నట్లు తెలిసింది. ఈ నెల 29న జరిగే బీజేపీ పార్లమెంటరీ పార్టీ భేటీ మెజార్టీ స్థానాలకు అభ్యర్థులను అధికారికంగా ప్రకటించే అవకాశాలున్నట్లు పార్టీ వర్గాలు చెబుతున్నాయి. -
రెండు చోట్లా ఓటమి.. మున్ముందు మరింత కఠిన పరీక్ష తప్పదా?
ఎప్పుడు ఎన్నిక జరిగినా అక్కడ ఆయనదే గెలుపు. నియోజకవర్గం మారినా ఇప్పటికి ఏడుసార్లు వరుసగా అసెంబ్లీకి ఎన్నికయ్యారు. 2021 ఉప ఎన్నికలో ఓడిపోతారనే ప్రచారం సాగింది. గులాబీ బాస్ను ధిక్కరించి ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి ఉప ఎన్నిక తెప్పించారు. పార్టీ మారారు. కాని కారు దెబ్బకు ఢీలా పడతారని అందరూ భావించారు. అయితే అర్జునుడిలా పద్మవ్యూహాన్ని ఛేదించి విజయుడిగా నిలిచారు. తాజా ఎన్నికల్లో మాత్రం అభిమన్యుడిలా ఓడిపోయారు. ఇంతకీ ఆయన ఎవరో? ఆయన కథేంటో చూద్దాం. ఈటల రాజేందర్.. తెలంగాణా రాష్ట్ర రాజకీయాల్లో అందరికీ పరిచయమైన పేరు. అప్పటి సీఎం కేసీఆర్ ను ఎదిరించి గులాబీ పార్టీ నుంచి బయటకు వచ్చినా..తన పంథాకు భిన్నమైన కమలం పార్టీ నీడకు చేరారు. ఆ పార్టీలో చేరాక తన సొంత జిల్లాకు చెందిన నాటి పార్టీ రాష్ట్ర అధ్యక్షుడైన బండి సంజయ్ తో పొసగకున్నా...తాజా ఎన్నికల్లో తాను ప్రాతినిథ్యం వహిస్తున్న హుజూరాబాద్ తో పాటు.. సవాల్ విసిరి మరీ గజ్వేల్ లో కేసీఆర్ పై బరిలోకి దిగి, రెండు స్థానాల్లోనూ ఓటమిపాలయ్యారు. అటు కమలాపూర్ నియోజకవర్గం నుంచి..ఇటు హుజూరాబాద్ నుంచి వరుసగా ఏడుసార్లు గెలిచిన విజేతగా తెలంగాణ రాజకీయాల్లో ఈటల రాజేందర్ ప్రత్యేక స్థానం సంపాదించుకున్నారు. బీఆర్ఎస్ ను వీడి బయటకు వచ్చాక జరిగిన 2021 ఉపఎన్నిక యావత్ దేశం దృష్టినీ ఆకర్షించింది. అప్పుడు ఈటలపై అధికార బీఆర్ఎస్ పెద్ద ఎత్తున ఫోకస్ చేసింది. ఈటల ఓటమి కోసం గులాబీ పార్టీ సర్వశక్తులూ ఒడ్డింది. నాటి ఉపఎన్నికలో అభిమన్యుడిని చుట్టుముట్టినట్టు చుట్టుముట్టింది. కానీ, ఈటల మాత్రం తన ఏడో విజయాన్నందుకున్నారు. దాంతో ఈటల క్రేజ్ కమలం పార్టీలో మరింతగా పెరిగింది. రోజులెప్పుడూ ఒకేలా ఉండవు. ఓడలు బండ్లవుతాయి.. బండ్లు ఓడలవుతాయి. అదే పరిస్థితి ఈటల విషయంలో ఎనిమిదో ఎన్నికలో జరిగింది. ఇంతకాలం ఎదురులేని మనిషిగా నిల్చిన ఈటల.. తాజా ఎన్నికల్లో తనపైన ఎవ్వరూ అంత ఫోకస్ చేయకపోయినా తాను నమ్ముకున్న హుజూరాబాద్ లో ఓటమి పాలయ్యారు. అక్కడి ఓటర్లు విలక్షణ తీర్పునిచ్చారు. 2018 ఎన్నికల్లో ఈటలపై కాంగ్రెస్ నుంచి బరిలోకి దిగి ఓటమిపాలైన కౌశిక్ రెడ్డిని బీఆర్ఎస్ అభ్యర్థిగా.. ఈసారి ఎన్నికల్లో గెలిపించి పట్టం కట్టారు. ఈటలను ఓడగొడుతానని సవాల్ విసిరిన కౌశిక్కు.. సెంటిమెంట్ రాజకీయాలు కూడా ఈసారి కలిసివచ్చాయనే టాక్ ఎలాగూ ఉంది. అటు గజ్వేల్ లో తొడగొట్టి గులాబీ పార్టీ బాస్ కేసీఆర్ను ఓడగొట్టేందుకు వెళ్లి అక్కడా ఈటల భంగపడ్డారు. తాను ప్రచారంలో లేని లోటును పూడ్చేందుకు హుజూరాబాద్లో తన సతీమణి జమునను ప్రచారంలోకి దింపారు. రెండు నియోజకవర్గాల్లోనూ ఈటలకు ఓటమి తప్పలేదు. ఈటల వచ్చాక బీజేపీలో జరుగుతున్న మార్పులపై ఓ పెద్ద చర్చే జరుగుతున్న క్రమంలో...బీజేపీని అంటిపెట్టుకుని ఉన్న సంప్రదాయవాదుల్లో కొంత వ్యతిరేకత కూడా అంతర్లీనంగా కనిపిస్తున్న నేపథ్యంలో.. ఇప్పుడు ఈటల గెలిస్తే ఆయనకు కొంత ప్లస్సయ్యేది. కానీ అలా జరగలేదు. ఇప్పుడు ఈటల రీగెయిన్ కావడానికి తన శైలిని కొంచెం మార్చుకోవాల్సి ఉందని.. ఆచితూచి అడుగులు వేస్తేనే రాజకీయాల్లో ఇప్పటివరకూ తనకున్న ప్రత్యేకతను కాపాడుకోగలుగుతారనే వాదన వినిపిస్తోంది. కేసీఆర్ చెంతనే ఎక్కువ కాలం రాజకీయాలు చేసిన ఈటల రాజేందర్లో కొంతమేర ఉన్న అహంకార పోకడలు ఆయనకు మైనస్గా మారాయనే వారూ ఉన్నారు. గతంలో హుజూరాబాద్ లోనే ఉంటూ హైదరాబాద్ మంత్రిగా కాకుండా.. హుజూరాబాద్ మంత్రిగా పేరు పడ్డ ఈటల.. ఈమధ్య హుజూరాబాద్కు దూరమవ్వడం కూడా ఆయనలో వస్తున్న తేడాను ఇక్కడి ఓటర్లు పసిగట్టారనే టాక్ కూడా నడుస్తోంది. ఇక హుజూరాబాద్ నియోజకవర్గ అభివృద్ధికి ప్రతిపక్షంలో ఉన్న ఈటల చేసేదెంత?.. అధికారపక్షంలో ఉన్నవారైతే అయ్యే అభివృద్ధి ఎంత అనే లెక్కలతో పాటు...ఉపఎన్నికల్లో డిపాజిట్ కూడా దక్కని కాంగ్రెస్ కు ఈసారి పెద్దఎత్తున ఓట్లు పోలవ్వడం..కౌశిక్ రెడ్డిపై వెల్లువెత్తిన సానుభూతి కూడా కలిసి.. ఈటల ఓటమికి ఆయన నమ్ముకున్న హుజూరాబాద్లోనే బీజం పడింది. రెండు నియోజకవర్గాల్లో ఓటమి ఈటల రాజకీయ జీవితాన్ని కొంత సంక్షోభంలోకి నెట్టింది. అంతేకాదు కాంగ్రెస్ అభ్యర్థిగా వొడితెల ప్రణవ్ లీడర్గా ఎదుగుతున్న క్రమంలో.. ఇప్పటికే విజయంతో ఊపుమీదున్న కౌశిక్ రెడ్డితో.. మున్ముందు ఫైట్ కూడా ఈటలకు మరింత టఫ్గానే ఉంటుందంటున్నారు రాజకీయ పరిశీలకులు. చదవండి: AP: కాంగ్రెస్తో టీడీపీ పొత్తు పెట్టుకుంటే.. జరిగేది ఇదేనా? -
హుజురాబాద్ బీజేపీ సకల జనుల విజయ సంకల్ప సభ
-
హుజూరాబాద్ లో బీఆర్ఎస్ గెలుపు ఖాయం: కౌశిక్ రెడ్డి
-
హుజురాబాద్లో బీజేపీకి మూడో స్థానమే : హరీశ్రావు
సాక్షి, హుజురాబాద్ : హుజురాబాద్లో సర్వేలన్నీ కౌశిక్ రెడ్డికి మొదటి స్థానాన్ని ఇస్తున్నాయని మంత్రి హరీశ్రావు తెలిపారు. ఇక్కడ కాంగ్రెస్ రెండవ స్థానంలో ఉందని, బీజేపీ అయితే మూడో స్థానానికి పడిపోయిందని చెప్పారు. హుజురాబాద్లో జరిగిన ప్రజా ఆశీర్వాద సభలో హరీశ్ రావు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ‘కౌశిక్ రెడ్డి ప్రజా జీవితంలో ఆల్ రౌండర్. కౌశిక్ రెడ్డి అంటే ముఖ్యమంత్రికి చాలా ఇష్టం. కౌశిక్ రెడ్డి గెలిచిన తర్వాత సీఎం వద్దకు వెళ్లి నియోజకవర్గ కోసం నిధులు తీసుకొస్తాడు. ఉప ఎన్నికల్లో గెలుపొందిన ఈటల గెలిచిన నియోజకవర్గంలో తట్టెడు మన్ను కూడా పోయలేదు. ఇక్కడి ప్రజలను పూర్తిగా విస్మరించాడు. కాంగ్రెస్, బీజేపీల్లో ఏ పార్టీ గెలిచినా తెలంగాణ మరోసారి అంధకారంలోకి వెళ్లిపోతుంది. బీఆర్ఎస్ మేనిఫెస్టోలో సౌభాగ్య లక్ష్మి పథకం కింద ప్రతి మహిళకు నెలకు 3వేల రూపాయలు అందిస్తాం. ఆరోగ్యశ్రీని ఐదు లక్షల నుంచి 15 లక్షలకు పెంచుతాం. గ్యాస్ సిలిండర్ను కేవలం రూ. 400కు అందిస్తాం. కేసీఆర్ ధీమా ఇంటింటికి బీమా కింద రేషన్ కార్డు ఉన్న కుటుంబంలో ఎవరైనా మరణిస్తే 5 లక్షలు ఇస్తాం. ఇదీ చదవండి..సీబీఐ, ఈడీ విచారణకు కేసీఆర్ సిద్ధమా?: రేవంత్ సవాల్ హుజురాబాద్లో పేదలకిచ్చిన అసైన్ భూములన్నిటికీ బీఆర్ఎస్ గెలిచిన తర్వాత పట్టాలు ఇస్తాం. కాంగ్రెస్ పార్టీకి ఏది కావాలన్నా ఢిల్లీ దగ్గర మోకరిల్లాల్సిందే. మొన్న కర్ణాటక నుంచి డీకే శివకుమార్ వచ్చి అక్కడ రోజుకు 5 గంటల కరెంటు ఇస్తున్నాం అని చెప్పాడు. డీకేకు తెలంగాణలో 24 గంటల కరెంటు ఉన్నది అనే విషయం కూడా తెలియదు. తెలంగాణలో మళ్లీ కాంగ్రెస్ వస్తే మోటర్లు జీపులో వేసుకొని పోతారు. దొంగ రాత్రి కరెంటు వస్తుంది. కాంగ్రెసోళ్లు కర్ణాటకలో ఆరు నెలలు గడవకముందే ఇచ్చిన హామీలను ఎగ్గొడుతున్నారు. కాంగ్రెస్ నాయకుడు ఉత్తమ్కుమార్ రెడ్డి రైతుబంధు దుబారా అని మాట్లాడారు. రైతుకు రైతుబంధు ఇవ్వడం దుభారా అవుతుందా.. అలాగే పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి రైతులకు ఇచ్చే రైతు బంధును బిచ్చమేస్తున్నాం అన్నాడు. రైతుబంధు తీసుకునే రైతులను బిచ్చగాళ్ళ తో పోలుస్తూ మాట్లాడటం సిగ్గుచేటు. కాంగ్రెస్ పార్టీని నమ్మి ఓటేస్తే ప్రజల పరిస్థితి అధోగతి పాలవుతుంది’ అని హరీశ్ రావు హెచ్చరించారు. ఇదీ చూడండి.. మిషన్ తెలంగాణ -
బీఆర్ఎస్తోనే తెలంగాణ అభివృద్ధి సాధ్యం: మంత్రి కేటీఆర్
-
ఎవరెన్ని గిమ్మిక్కులు చేసినా మూడోసారి బీఆర్ఎస్దే అధికారం: హరీశ్రావు
-
TS Election 2023: ఈ నియోజకవర్గానికి.. ఇప్పటివరకు 17సార్లు..!
సాక్షి, కరీంనగర్, పెద్దపల్లి: 'ఉద్యమాలకు కేంద్ర బిందువైన హుజూరాబాద్ 1957లో (ఎస్సీ రిజర్వ్) నియోజకవర్గంగా ఏర్పడి మూడేళ్లకే జనరల్ స్థానంగా మారింది. ఇందులో హుజూరాబాద్, భీమదేవరపల్లి తాలూకాలుగా ఉండేవి. ఈ నియోజకవర్గానికి ఇప్పటివరకు 17సార్లు ఎన్నికలు జరిగాయి. ఇందులో మూడు ఉప ఎన్నికలు. ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ నాలుగుసార్లు, టీడీపీ, స్వతంత్రులు మూడుసార్లు చొప్పున, ఇక బీఆర్ఎస్ ఏకంగా ఆరుసార్లు విజయం సాధించింది. 2021లో వచ్చిన ఉప ఎన్నికలో బీజేపీ గెలిచింది. ఇక్కడి నుంచి గెలిచిన ఇనుగాల పెద్దిరెడ్డి, కెప్టెన్ లక్ష్మీకాంతారావు మంత్రులుగా పని చేశారు. 2009లో నియోజకవర్గాల పునర్విభజనలో భాగంగా కమలాపూర్ నియోజకవర్గకేంద్రంతోపాటు ఆ నియోజకవర్గంలో ఉన్న జమ్మికుంట, వీణవంక, ఇల్లందకుంట(కొత్తగా ఏర్పడిన మండలం), హుజూరాబాద్ (మొత్తం ఐదు మండలాలు)తో కలిపి ముఖచిత్రంగా మారింది. ఇక కమలాపూర్ నియోజకవర్గం పూర్తిగా కనుమరుగైంది.' ఇప్పటివరకు జరిగిన ఎన్నికలు ఇలా.. 1957లో ఏర్పడిన హుజూరాబాద్కు ఇప్పటివరకు 17 సార్లు ఎన్నికలు జరిగాయి. 2009లో నియోజకవర్గాల పునర్విభజన జరగడంతో ఈ నియోజకవర్గంలో ఉన్న సైదాపూర్, భీమదేవరపల్లి, ఎల్కతుర్తి మండలాలను హుస్నాబాద్ నియోజకవర్గంలో.. కమలాపూర్ నియోజకవర్గ కేంద్రంతోపాటు జమ్మికుంట, వీణవంక మండలాలను హుజూరాబాద్లో కలిపారు. అప్పటివరకు ఉన్న శంకరపట్నం, మానకొండూర్ మండలాలను విడదీసి కొత్తగా ఏర్పడిన మానకొండూర్ నియోజకవర్గంలో కలిపారు. హుజూరాబాద్ నుంచి 1957లో ఇద్దరు స్వతంత్రులే బరిలో దిగగా.. పోలుసాని నర్సింగరావును గెలిపించారు. 1962లో గాడిపల్లి రాములు (కాంగ్రెస్), 1967లో తిరిగి పోలుసాని నరసింగరావు (కాంగ్రెస్), 1972లో వొడితెల రాజేశ్వరరావు (కాంగ్రెస్), 1978లో దుగ్గిరాల వెంకట్రావు (కాంగ్రెస్), 1983లో కొత్త రాజిరెడ్డి (స్వతంత్ర), 1985లో దుగ్గిరాల వెంకట్రావు (టీడీపీ), 1989లో స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసిన కేతిరి సాయిరెడ్డి విజయం సాధించారు. ఇక 1994, 1999లో వరుసగా ఇనుగాల పెద్దిరెడ్డి (టీడీపీ) గెలుపొందారు. 2004లో జరిగిన ఎన్నికల్లో టీఆర్ఎస్ అభ్యర్థి కెప్టెన్ లక్ష్మీకాంతరావును ఆదరించారు. 2008లో జరిగిన ఉప ఎన్నికల్లోనూ లక్ష్మీకాంతారావు టీఆర్ఎస్ నుంచి గెలిచారు. పునర్విభజన అనంతరం 2009లో జరిగిన సాధారణ ఎన్నికల్లో టీఆర్ఎస్ నుంచి ఈటల రాజేందర్, 2010లో జరిగిన ఉప ఎన్నికల్లోనూ ఈటల ఘన విజయం సాధించారు. 2014, 2018లో తెలంగాణ రాష్ట్రంలో జరిగిన ఎన్ని కల్లోనూ ఈటల రాజేందర్ టీఆర్ఎస్ నుంచే గెలిచి హ్యాట్రిక్ కొట్టారు. రాజకీయ పరిణామాల నేపథ్యంలో 2021లో జరిగిన ఉప ఎన్నికల్లో ఈటల రాజేందర్ బీజేపీ నుంచి పోటీ చేసి విజయం సా ధించారు. 2004వరకు జమ్మికుంటలో నామినేషన్ వేసే ఇక్కడి అభ్యర్థులు.. 2009 నుంచి హుజూరాబాద్ నియోజకవర్గ కేంద్రంలోనే వేస్తున్నారు. నియోజకవర్గ ప్రత్యేకతలు.. నియోజకవర్గం వ్యవసాయ ఆధారితం. ఎస్సారెస్పీ నుంచి ప్రవహించే కాకతీయకాలువ ద్వారా ఈ ని యోజకవర్గంలోని నా లుగు మండలాల్లో 59 వేల ఎకరాలకు సాగునీరు అందుతుంది. జమ్మికుంటలోని పత్తిమార్కెట్ ఉత్తర తెలంగాణలోనే అతి పెద్దదిగా పేరుగాంచింది. సీడ్ ఉత్పత్తిలోనూ హుజూరాబాద్ దేశంలోనే పేరుగాంచింది. జమ్మికుంటలోని కృషి విజ్ఞాన కేంద్రం రైతులకు వ్యవసాయంలో సూచనలు చేస్తూ కొత్త వంగడాల ఉత్పత్తిని ప్రోత్సహిస్తోంది. జమ్మికుంట, ఉప్పల్, బిజిగిర్షరీఫ్లో ఉన్న రైల్వేస్టేషన్ ద్వారా ప్రయాణికులకు రవాణా సులువవుతోంది. మొత్తం ఓటర్లు 2,44,514 హుజూరాబాద్ నియోజకవర్గంలో ఐదు మండలాలు ఉన్నాయి. వీటి పరిధిలో మొత్తం 106 గ్రామాలు, రెండు మున్సిపాలిటీలు ఉండగా, మొత్తం 305 పోలింగ్ స్టేషన్లు ఉన్నాయి. 2,44,514 మంది ఓటర్లుగా ఉన్నారు. వీరిలో 1,19,676 మంది పురుషులు, 1,24,833 మహిళలు, ఇతరులు ఐదుగురు ఉన్నారు. -
ఈటల హుజూరాబాద్ బరిలో ఉంటారా? ఉండరా?
-
ప్రాణాలకు తెగించి కరెంట్ ఇచ్చిన లైన్మ్యాన్
-
ఈటల రాజేందర్కు తృటిలో తప్పిన ప్రమాదం
సాక్షి, హైదరాబాద్: బీజేపీ హుజురాబాద్ ఎమ్మెల్యే ఈటల రాజేందర్కు తృటిలో పెను ప్రమాదం తప్పింది. మానకొండూరు వద్ద ఈటల కాన్వాయ్లోని ఒక కారును మరో కారు ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఈటలకు ఎలాంటి గాయాలు తగలకపోవడంతో అంతా ఊపిరిపీల్చుకున్నారు. వివరాల ప్రకారం.. ఈటల రాజేందర్ ఆదివారం హుజురాబాద్ నుంచి హైదరాబాద్కు వస్తున్నారు. ఈ క్రమంలో మానకొండూరు మంలంలోని లలితాపూర్ వద్ద గొర్రెల మంద అడ్డుగా వచ్చింది. దీంతో, ఈటల కారు డ్రైవర్ సడెన్ బ్రేక్ వేయడంతో వాహనం ఒక్కసారిగా ఆగిపోయింది. ఈ సందర్భంగా ఈటల కాన్వాయ్లోని మిగతా కార్లు ఒక్కదానినొకటి ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో ఈటలకు ఎలాంటి గాయాలు కాకపోవడంతో సిబ్బంది, నేతలు ఊపిరిపీల్చుకున్నారు. ఇది కూడా చదవండి: TS/AP: రైలు ప్రయాణికులకు గుడ్న్యూస్.. -
కేసీఆర్ పొలిటికల్ దాడి.. ఈటల రూటు మార్చేశారా?
ఈటల రాజేందర్ రూట్ మార్చేశారా?.. గతంలో మంత్రిగా ఉన్నపుడు హుజూరాబాద్కే పరిమితమయ్యేవారు. ఇప్పుడు ప్రతిపక్ష ఎమ్మెల్యేగా అటువైపు రావడమే మానేశారా?. గులాబీ బాస్ వ్యూహాలకు ప్రతివ్యూహాలు రచించే క్రమంలో రూట్ మార్చారా? తనపైనే ఫోకస్ చేస్తూ.. పదవులు కట్టబెడుతున్న తరుణంలో.. తానెక్కడి నుంచి బరిలోకి దిగుతారనే విషయంలో కన్ఫ్యూజ్ చేయాలనుకుంటున్నారా? వచ్చే ఎన్నికల్లో హుజూరాబాద్ నుంచే బరిలో ఉంటారా? ప్లేస్ మార్చుతారా? ఈటల ఆలోచన ఏంటి? అనేది హాట్ టాపిక్గా మారింది. గులాబీ బాస్ కేబినెట్లో మంత్రిగా ఉన్నపుడు ఈటల రాజేందర్ ఎప్పుడూ తన నియోజకవర్గమైన హుజూరాబాద్లోనే కనిపించేవారు. కేసీఆర్ను ధిక్కరించి బయటకొచ్చాక కూడా నియోజకవర్గానికి ఎన్నడూ దూరంగా లేరు. అయితే, గత ఉప ఎన్నికలో తనను టార్గెట్ చేస్తూ గులాబీ దళం చేసిన ముప్పేట దాడితో ఈటల ఉక్కిరిబిక్కిరి అయింది వాస్తవం. గులాబీ పార్టీ ఎన్ని ప్రయత్నాలు చేసినా విజయం మాత్రం ఈటలనే వరించింది. ఈ పరిణామం గులాబీ దళపతిని మరింత అసహనానికి గురిచేసింది. వచ్చే ఎన్నికల్లో ఎలాగైనా హుజూరాబాద్లో గులాబీ జెండా ఎగరేయాలని నిర్ణయించుకున్నారు. దానికి అనుగుణంగానే ఈ ప్రాంతం నుంచి నలుగురికి రాష్ట్రస్థాయి కార్పోరేషన్ పదవులు కట్టబెట్టారు. కాంగ్రెస్ నుంచి వచ్చిన కౌశిక్ రెడ్డిని ఎమ్మెల్సీ చేసి.. విప్గా క్యాబినెట్ హోదా కల్పించడమ కాకుండా.. హుజూరాబాద్ ఇన్చార్జ్ బాధ్యతలు కూడా అప్పగించారు. జరుగుతున్న పరిణమాలన్నీ ఇప్పుడు ఈటలలో మధనానికి కారణమయ్యాయా అనేది ఇప్పుడు చర్చకు దారి తీసింది. తెలంగాణ అంతటా ఈటల పర్యటన.. కేసీఆర్ వ్యూహ రచన గురించి బాగా తెలిసినవాళ్లలో ఈటల రాజేందర్ కూడా ఒకరు. ఈ క్రమంలో గులాబీబాస్ వ్యూహాలకు ప్రతివ్యూహంగా ఈటల అడుగులు వేస్తున్నారా..? అందుకే తరచూ పర్యటిస్తూ ఉండే సొంత నియోజకవర్గానికి దూరంగా ఉంటున్నారా..? బీజేపీ ఎలక్షన్ మేనేజ్ మెంట్ కమిటీ చైర్మన్ హోదాను ఆసరా చేసుకుని.. రాష్ట్రవ్యాప్తంగా తిరుగుతూ.. రాబోయే ఎన్నికల నాటికి తన ఛరిష్మాను ఇంకా పెంచుకోవడంతో పాటు.. తానెక్కడ నిలబడ్డా గెలవగలిగే అనుకూల పరిస్థితులను సృష్టించుకుంటున్నారా?. ఈక్రమంలో ఏ నియోజకవర్గం అయితే తనకు అనుకూలంగా ఉంటుందనే అంచనాలు వేసుకుంటున్నారా అని చర్చ జరుగుతోంది. రాష్ట్రమంతా పర్యటిస్తున్న ఈటల ఎప్పుడూ లేనివిధంగా తన నియోజకవర్గానికి దూరంగా ఉంటుండటంతో.. అసలు వచ్చే ఎన్నికల్లో హుజూరాబాద్ నుంచి పోటీ చేస్తారా? మరో నియోజకవర్గం ఎంచుకుంటారా? అనేది హాట్ టాపిక్గా మారింది. ప్లాన్ మార్చనున్న ఈటల? ఈటల రాజేందర్ హుజూరాబాద్ నుంచే మళ్లీ బరిలోకి దిగొచ్చూ, లేకపోవచ్చు.. ఎన్నికలనాటికి రాజకీయ సమీకరణాల ఆధారంగా పరిస్థితులు మారిపోతాయి. కానీ, తననే ఫోకస్ చేస్తూ తనను ఎలాగైనా ఓడించాలన్న కసితో ఉన్న గులాబీబాస్నే ఒకింత కన్ఫ్యూజ్ చేసే క్రమంలోనే ఈటల అడుగులెటువైపో తెలియకుండా వ్యూహాత్మకంగా వ్యవహరిస్తున్నారా అనేది చర్చనీయాంశంగా మారింది. తన చిరకాల ప్రత్యర్థిలా మారిన గులాబీ బాస్ కేసీఆర్ మీద లేదంటే జిల్లాలో ప్రధాన ప్రత్యర్థిగా తయారైన మంత్రి గంగుల కమలాకర్ మీద గానీ ఈటల బరిలోకి దిగే అవకాశాలున్నట్టుగా ప్రచారం సాగుతోంది. ఈ నేపథ్యంలో ఈటల ఎక్కడి నుంచి బరిలోకి దిగుతారన్నది ఆసక్తికరంగా మారింది. ఇది కూడా చదవండి: హలో కేటీఆర్గారూ.. ఈ ఫొటో గుర్తుందా? -
తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం.. ఈటలకు భద్రత పెంపు
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. హుజురాబాద్ బీజేపీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్కు వై ప్లస్ భద్రత కల్పించింది. ఈటల ప్రాణాలకు ముప్పు ఉందని వస్తున్న ప్రచారాల నేపథ్యంలో ఎమ్మెల్యేకు బుల్లెట్ ప్రూఫ్ వెహికల్ సహా 16 మంది సెక్యూరిటీని కేటాయించింది. ఈ మేరకు ఈటలకు భద్రత పెంచుతూ శుక్రవారం ఉత్తర్వులు జారీ చేసింది. శనివారం నుంచి ఈటలకు వై ప్లస్ కేటగిరీ భద్రత కల్పించనుంది. కాగా ఎమ్మెల్యే ఈటల రాజేందర్ హత్యకు ప్లాన్ జరిగిందంటూ ఈటల జమున తీవ్ర ఆరోపణలు చేసిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఈటల భద్రతపై తెలంగాణ సర్కార్ ఫోకస్ పెట్టింది. ఈటల రాజేందర్ భద్రతపై మంత్రి కేటీఆర్ ఆరా తీశారు. తనను చంపేందుకు కుట్ర జరుగుతోందన్న ఈటల వ్యాఖ్యల నేపథ్యంలో తెలంగాణ డీజీపీ అంజనీ కుమార్కు ఫోన్ చేసి ఎమ్మెల్యే భద్రతపై సీనియర్ ఐపీఎస్తో వెరిఫై చేయాలని సూచించారు. ఈ క్రమంలో ఈటల రాజేందర్ నివాసానికి గురువారం డీసీసీ సందీప్ రావు చేరుకొని ఆయన భద్రత అంశంపై చర్చించారు. అనంతరం ఎమ్మెలయే భద్రతపై డీసీపీ సందీప్ రావు.. డీజీపీ అంజనీకుమార్కు నివేదిక ఇచ్చారు. అయితే ఈటలకు కేంద్ర ప్రభుత్వం సెక్యూరిటీ పెంపు వార్తల నేపథ్యంలో తాజాగా ప్రభుత్వమే వై ప్లస్ భద్రత కల్పిస్తున్నట్లు ప్రకటించింది. చదవండి: కేటీఆర్కు నిరసన సెగ.. ఇద్దరు ఎమ్మెల్యేలకు షాక్ ఇచ్చిన మంత్రి -
ఈటల నివాసానికి పోలీసులు.. భద్రతపై చర్చ
సాక్షి, హైదరాబాద్: హుజురాబాద్ బీజేపీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ హత్యకు ప్లాన్ జరిగిందంటూ ఈటల జమున తీవ్ర ఆరోపణలు చేసిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఈటల భద్రతపై తెలంగాణ సర్కార్ ఫోకస్ పెట్టింది. ఈ క్రమంలో ఈటల రాజేందర్ నివాసానికి డీసీసీ సందీప్ రావు చేరుకున్నారు. ఈ సందర్బంగా ఈటల భద్రత అంశంపై ఆయనతో సమావేశమై అరగంట పాటు చర్చించారు. అనంతరం, ఈటల ఇంటి నుంచి డీసీపీ వెళ్లిపోయారు. ఇక, వీరి భేటి నేపథ్యంలో ఈటల భద్రతపై డీసీపీ సందీప్ రావు.. డీజీపీ అంజనీకుమార్కు నివేదిక ఇవ్వనున్నారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ ఈటల రాజేందర్ చెప్పిన అంశాలను డీజీపీ వివరిస్తామని స్పష్టం చేశారు. ఇదిలా ఉండగా.. ఈటల ఇంటి పరిసరాలను అధికారులు నిన్న(బుధవారం) పరిశీలించారు. అయితే, ఈటల భద్రతను సమీక్షించాలని మంత్రి కేటీఆర్.. డీజీపీని ఆదేశించారు. దీంతో, రాజేందర్ భద్రత పెంపుపై డీజీపీ అంజనీకుమార్ నేతృత్వంలో సమీక్ష జరిగింది. మరోవైపు.. తన హత్యకు కుట్ర జరుగుతోందని, ప్రాణహాని ఉందని ఈటల ఇప్పటికే తెలిపారు. ఈ క్రమంలో ఈటలకు కేంద్రం వై కేటగిరి భద్రత పెంపు వార్తల నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం అలర్ట్ అయ్యింది. ఇది కూడా చదవండి: ఈటల భద్రతపై కేటీఆర్ ఆరా.. రంగంలోకి సీనియర్ ఐపీఎస్ -
ఈటల భద్రతపై కేటీఆర్ ఆరా..
సాక్షి, హైదరాబాద్: బీజేపీ నేత, హుజూరాబాద్ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ హత్యకు కుట్ర జరుగుతోందంటూ ఆయన భార్య జమున సంచలన ఆరోపణలు చేసిన విషయం తెలిసిందే. ఈ మేరకు జమున.. ఈటలను హత్య చేసేందుకు రూ. 20 కోట్లు ఖర్చు చేస్తానని ఎమ్మెల్యే పాడి కౌశిక్రెడ్డి అన్నాడని ఆమె తెలిపారు. కేసీఆర్ ప్రోత్సాహంతోనే కౌశిక్రెడ్డి చెలరేగిపోతున్నాడు. మహిళలపై ఇష్టమొచ్చినట్లు మాట్లాడితే చెప్పుల దండ వేస్తారని కౌశిక్పై ఈటల జమున మండిపడ్డారు. మరోవైపు ఈ వ్యవహారంపై మంత్రి కేటీఆర్ రియాక్ట్ అయ్యారు. దీంతో, ఈటల రాజేందర్ భద్రతపై మంత్రి కేటీఆర్ ఆరా తీశారు. తనను చంపేందుకు కుట్ర జరుగుతోందన్న ఈటల వ్యాఖ్యల నేపథ్యంలో కేటీఆర్.. తెలంగాణ డీజీపీ అంజనీ కుమార్కు ఫోన్ చేశారు. ఈటల భద్రతపై సీనియర్ ఐపీఎస్తో వెరిఫై చేయాలని సూచించినట్టు తెలుస్తోంది. కేంద్ర ప్రభుత్వం సెక్యూరిటీ పెంపు వార్తల నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం తరఫునే సెక్యూరిటీ ఇవ్వాలని కేటీఆర్ చెప్పినట్టు సమాచారం. ఈ క్రమంలో ఈటల రాజేందర్కు భద్రత పెంపుపై డీజీపీ అంజనీ కుమార్ సమీక్ష చేయనున్నారు. దీంతో, సీనియర్ ఐపీఎస్ కాసేపట్లో ఈటల ఇంటికి వెళ్లనున్నారు. ఇదిలా ఉండగా.. ఈటల జమున కామెంట్స్పై ఎమ్మెల్సీ కౌశిక్రెడ్డి స్పందించారు. ఈటల రాజేందర్ దంపతులు చేసిన వ్యాఖ్యలు నిజాలు కావని తెలిపారు. రూ. 20 కోట్లు ఇచ్చి తాను ఈటలను హత్య చేయిస్తాననేది పచ్చి అబద్దమని పేర్కొన్నారు. ఈటల రాజేందర్ చేసే అన్ని ఆరోపణలపై తాను బహిరంగ చర్చకు నేను సిద్ధమని సవాల్ విసిరారు. హత్యా రాజకీయాలను ఈటల కంటే గొప్పగా ఎవరూ చేయలేరని విమర్శించారు. ఎక్కడ హుజురాబాద్లో ఒడిపోతాడనే భయంతో తనను హత్య చేస్తాడేమోననిపిస్తుందని పేర్కొన్నారు. ఈ క్రమంలోనే తాను రాజకీయాల్లోకి వచ్చిందే ఈటల రాజేందర్ను ఓడించేందుకని స్పష్టం చేశారు. ఆయన్ను ఓడిస్తేనే నాకు సంతృత్తి ఉంటుందంటూ హాట్ కామెంట్స్ చేశారు. ఇది కూడా చదవండి: ఎమ్మెల్యే రాజయ్యపై సర్పంచ్ నవ్య ఆరోపణలు.. కడియం కీలక వ్యాఖ్యలు -
ఈటల రాజేందర్ హత్యకు కుట్ర... స్పందించిన కౌశిక్ రెడ్డి
సాక్షి, హైదరాబాద్: బీజేపీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ సతీమణి జమున రెడ్డి వ్యాఖ్యలపై ఎమ్మెల్సీ పాడి కౌశిక్ రెడ్డి కౌంటర్ ఇచ్చారు. ఈటల రాజేందర్ దంపతులు చేసిన వ్యాఖ్యలు నిజాలు కావని తెలిపారు. రూ. 20 కోట్లు ఇచ్చి తాను ఈటలను హత్య చేయిస్తాననేది పచ్చి అబద్దమని పేర్కొన్నారు. ఈటల రాజేందర్ చేసే అన్ని ఆరోపణలపై తాను బహిరంగ చర్చకు నేను సిద్ధమని సవాల్ విసిరారు. ఈటల రాజేందర్వి హత్యా రాజకీయాలని పాడి కౌశిక్ రెడ్డి మండిపడ్డారు. హత్యా రాజకీయాలను ఆయనక కంటే గొప్పగా ఎవరూ చేయలేరని విమర్శించారు. 2014లో బాల్రాజ్ అనే వ్యక్తిని ఈటల రాజేందర్ హత్య చేయించారని ఆరోపించారు. ఉద్యమకారుడు ప్రవీణ్ యాదవ్ను థర్డ్ డిగ్రీ పెట్టించి వేధిస్తే ఆయన ఆత్మహత్య చేసుకున్నాడని ఆరోపణలు గుప్పించారు. 2018 మర్రిపల్లిగూడెంలో ఈటల తనను చంపించే ప్రయత్నం చేశారని అన్నారు. ఎక్కడ హుజురాబాద్లో ఒడిపోతాడనే భయంతో తనను హత్య చేస్తాడేమోననిపిస్తుందని పేర్కొన్నారు. చదవండి: అంతా తెలుసు.. టీ కాంగ్రెస్ నేతలకు రాహుల్ స్ట్రాంగ్ వార్నింగ్ ‘నేను రాజకీయాల్లోకి వచ్చిందే ఈటెల రాజేందర్ను ఓడించేందుకు. ఆయన్ను ఓడిస్తేనే నాకు సంతృత్తి ఉంటుంది. బీసీలపై గౌరవం ఉంటే ఎందుకు ముదిరాజ్ కోడల్ని, అల్లున్ని తెచ్చుకోలేదు. కోళ్లఫామ్ పెట్టుకున్న వ్యాపారులు దివాళ తీస్తంటే ఈటల రాజేందర్ మాత్రం వేల కోట్లు సంపాదిస్తున్నారు. ఆయన పెంచే కోళ్లు ఏమైనా బంగారు గుడ్లు పెడుతున్నాయా? ఈటల రాజేందర్ కాస్త ఇవాళ చీటర్ రాజేందర్గా మారారు. రోడ్డు పొడిగింపు కోసం అమర వీరుల స్థూపాన్ని తొలగించేందుకు తీర్మానం చేశారు. కొత్తగా ఏర్పాటు చేసిన అమరుల స్తూపం శిలాఫలకంపై ఈటల రాజేందర్ పేరు ఉంది. కేసీఆర్ తెలంగాణ ఉద్యమం మొదలుపెట్టినప్పుడు ఈటల లేడు’ అని పేర్కొన్నారు. కాగా ఈటల రాజేందర్ సతీమణి జమున తన భర్తను హత్య చేసేందుకు కుట్ర జరుగుతోందని తీవ్ర ఆరోపణలు చేసిన విషయం తెలిఇసందే. ఈటల హత్యకు రూ. 20 కోట్లు ఖర్చు చేస్తానని ఎమ్మెల్సీ కౌశిక్ రెడ్డి తన అనుచరులతో అన్నారని చెప్పారు. సీఎం కేసీఆర్ ప్రోత్సాహంతోనే కౌశిక్ రెడ్డి చలరేగిపోతున్నారని జమున వ్యాఖ్యానించారు -
ఎమ్మెల్సీ కౌశిక్రెడ్డికి తప్పిన ప్రమాదం
మానకొండూర్: ఎమ్మెల్సీ పాడి కౌశిక్రెడ్డికి ప్రమాదం తప్పింది. అతడు ప్రయాణిస్తున్న ఫార్చునర్ కారు ద్విచక్రవాహనదారుడిని ఢీ కొని, అదుపుతప్పి రోడ్డు కిందకు దూసుకెళ్లింది. బెలూన్స్ ఓపెన్కావడంతో కౌశిక్రెడ్డి, గన్మెన్లు, డ్రైవర్ స్వల్పగాయాలతో బయటపడ్డారు. ఈ ఘటన మానకొండూర్ మండలం శంషాబాద్ వద్ద చోటుచేసుకుంది. స్థానికులు, పోలీసుల వివరాల ప్రకారం.. ఎమ్మెల్సీ పాడి కౌశిక్రెడ్డి తనకారులో సోమవారం ఉదయం కరీంనగర్ నుంచి హుజూరాబాద్ బయల్దేరా డు. మానకొండూర్ మండలం శంషాబాద్ చేరుకోగానే అదే గ్రామానికి చెందిన బూస సంపత్ ద్విచక్రవాహనంతో రోడ్డు దాటుతుండగా కౌశిక్రెడ్డి ప్రయాణిస్తున్న ఫార్చునర్ కారు అతడిని ఢీకొట్టింది. కారు డ్రైవర్ అప్రమత్తమై కుడివైపు తిప్పగా.. రోడ్డు కిందకు దిగింది. రెండు చెట్లను ఢీకొట్టబోతుండగా డ్రైవర్ తప్పించడంతో చిన్నపాటి కందకంలో దిగింది. కారు ముందుభాగం దెబ్బతింది. ప్రమాదసమయంలో కౌశిక్రెడ్డి ముందుసీట్లో కూర్చుకున్నాడు. బెలూన్స్ ఓపెన్కావడంతో కారులోని వారికి ప్రమాదం తప్పింది. ద్విచక్రవాహనదారుడికి గాయాలు కాగా.. కరీంనగర్ ఆస్పత్రికి తరలించారు. కౌశిక్రెడ్డి మరోకారులో హుజూరాబాద్ వెళ్లిపోయారు. కాగా.. కౌశిక్రెడ్డి డ్రైవర్ అతివేగంగా, అజాగ్రత్తగా కా రు నడపడంతో తనతండ్రి ప్రమాదానికి గురయ్యాడని సంపత్ కొడుకు మహేందర్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ రాజ్కుమార్ వివరించారు. -
ప్రేమించి పెళ్లి చేసుకున్న జంట.. దారిలో షాకిచ్చిన వధువు ఫ్యామిలీ
సాక్షి, హుజురాబాద్: ప్రేమపెళ్లి చేసుకున్న ఓ నవ వధువు సినీఫక్కీలో కిడ్నాప్కు గురైంది. హుజురాబాద్ అంబేద్కర్ చౌరస్తా వద్ద నిన్న రాత్రి చోటుచేసుకున్న ఈ ఘటన కలకలం రేపింది. కొండగట్టులో ప్రేమ పెళ్లి చేసుకుని హన్మకొండ వైపుగా కొత్త జంట వెళుతోంది. కారును అడ్డగించిన 15 మంది.. వరుడిపై దాడి చేసి, వధువును తీసుకెళ్లారు. వధూవరులిద్దరు హన్మకొండకు చెందినవారు. కొంతకాలంగా ప్రేమించుకున్న వీరు పెళ్లితో ఒక్కటయ్యారు. ప్రేమ పెళ్లి ఇష్టం లేకపోవడంతో పెళ్లికూతురు బంధువులు ఈ ఘటనకు పాల్పడినట్లు తెలుస్తోంది. తమ అమ్మాయి కనిపించడం లేదంటూ ఫిర్యాదు చేయడంతో రెండు రోజుల క్రితం మిస్సింగ్ కేసు నమోదైంది. పోలీసుల సమక్షంలోకి వధువును తీసుకురానున్నట్లు సమాచారం. -
అన్న ప్రభుత్వ ఉద్యోగి, తమ్ముడు సాఫ్ట్వేర్.. ఊహించని రోడ్డు ప్రమాదంలో
సాక్షి, హన్మకొడ: హన్మకొండ జిల్లాలో విషాదం చోటుచేసుకుంది. రోడ్డు ప్రమాదం ఇద్దరు అన్నదమ్ముల్ని పొట్టన పెట్టుకుంది. హసన్పర్తి మండలం అనంతసాగర్ క్రాస్ వద్ద గుర్తు తెలియని వాహనం బైక్ను ఢీ కొట్టడంతో ఇద్దరు యువకులు మృతిచెందారు. సోమవారం తెల్లవారుజామున ఈ ప్రమాదం చోటుచేసుకుంది. మృతులను కరీంనగర్ జిల్లా హుజురాబాద్ మండలం కందుగులకు చెందిన ఇప్పలపల్లి శివరాం, హరికృష్ణగా గుర్తించారు. వివరాలు.. హుజూరాబాద్ కందుగుల గ్రామానికి చెందిన ఇప్పలపల్లి మనోహర్కు ఇద్దరు కుమారులు. పెద్ద కుమారుడు శివరామకృష్ణ (25), చిన్న కుమారుడు హరికృష్ణ (23). శివరామకృష్ణ రైల్వే శాఖలో ఉద్యోగానికి ఎంపికై మౌలాలీ (సికింద్రాబాద్)లో శిక్షణ పొందుతున్నాడు. హరికృష్ణ హైదరాబాద్లోని ఓ ప్రైవేట్ కంపెనీలో సాఫ్ట్వేర్ ఇంజినీర్గా పని చేస్తున్నాడు. కాగా ఇటీవల పెద్దకుమారుడు శివరామకృష్ణకు పోస్టల్ శాఖలో మరో ఉద్యోగం వచ్చింది. ఈ విషయం చెప్పడం కోసం ఆదివారం స్వగ్రామం కందుగులకు వచ్చాడు. తిరిగి సోమవారం డ్యూటీకి వెళ్లాలని ఉదయం 4.30 గంటలకు ఇంటి నుంచి తమ్ముడితో కలిసి స్కూటీపై హైదరాబాద్కు బయలుదేరాడు. ఈ క్రమంలో హనుమకొండ జిల్లా హసన్పర్తి మండలం అనంతసాగర్ క్రాస్ రోడ్డు వద్ద 5.30 గంటల ప్రాంతంలో గుర్తు తెలియని వాహనం వారి స్కూటీని ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో శివరామకృష్ణ, హరికృష్ణ తలలకు బలమైన గాయాలై అక్కడికక్కడే మృతి చెందారు. విషయం తెలిసిన కుటుంబసభ్యులు ఘటనా స్థలానికి చేరుకొని కన్నీరుమున్నీరుగా విలపించారు. ఇద్దరు కొడుకులు మృతి చెందడంతో తల్లిదండ్రుల రోదనలు మిన్నంటాయి. తండ్రి మనోహర్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. ప్రమాదానికి కారణమైన వాహనాన్ని గుర్తించేందుకు స్థానికంగా ఉన్న సీసీ ఫుటేజ్ను పోలీసులు పరిశీలిస్తున్నారు. -
ఈటలను మళ్లీ టార్గెట్ చేసిన కేసీఆర్.. హుజూరాబాద్లో ఏం జరుగుతోంది?
ఈటల రాజేందర్. ఒకప్పుడు గులాబీ పార్టీలో సంచలనం. బాస్ మీదే తిరుగుబాటు చేసిన ఈటల కాషాయ తీర్థం పుచ్చుకున్నారు. సవాల్ చేసి హుజూరాబాద్లో కమలం గుర్తు మీద గెలిచారు. బీఆర్ఎస్ ఎన్ని ఎత్తులు వేసినా తుత్తునియలు చేశారు. కానీ ఇప్పుడు మరోసారి గులాబీ బాస్కు టార్గెట్ అయ్యారు. అసలు హుజూరాబాద్లో ఏం జరుగుతోంది? తెలంగాణ ఉద్యమంలో తొలినుంచీ కేసీఆర్ వెంట ఉన్న ఈటల రాజేందర్.. అనేక రాజకీయ పరిణామాల తర్వాత కేసీఆర్ ఆగ్రహానికి గురయ్యారు. కాషాయ కండువా కప్పుకుని ఉప ఎన్నికలలో తన సీటును కాపాడుకున్నారు. హుజూరాబాద్లో ఈటలను ఓడించడానికి గులాబీ బాస్ చేయని ప్రయత్నం అంటూ లేదు. ఆ ఉప ఎన్నికలోనే దళిత బంధు వంటి ప్రతిష్టాత్మక పథకానికి శ్రీకారం చుట్టారు కేసీఆర్. బీజేపీలో కూడా అంతర్గత కలహాలతో ఈటల ఇబ్బంది పడుతున్నారన్న ప్రచారం ఇటీవల జరుగుతోంది. ఈటల తిరిగి బీఆర్ఎస్ బాట పడతారా అన్న చర్చకు దారితీసింది. ఈటల మాత్రం కాషాయ పార్టీలోనే ఉండేందుకు సిద్ధమయ్యారు. బీజేపీలో తనకు దక్కాల్సిన స్థాయిలో ప్రాధాన్యత దక్కడంలేదనే ఓ భావన ఉన్నప్పటికీ.. ఇప్పటికిప్పుడు ఎలాంటి స్టెప్స్ తీసుకోవడం బాగుండదనుకున్నారో... ఏమో మొత్తానికి ఈటల బీఆర్ఎస్ కవ్వింపులకైతే పడిపోలేదు. పైగా బీజేపీ నెక్స్ట్ రాష్ట్రాధ్యక్షుల లిస్ట్లో ఈటల పేరు కూడా వినిపిస్తుండటంతో.. మరోసారి గులాబీ బాస్ ఇప్పుడు హుజూరాబాద్ నియోజకవర్గంపైనా.. మరీ ముఖ్యంగా ఈటల రాజేందర్పైనా ఫోకస్ చేసినట్టుగా చర్చ జరుగుతోంది. హుజూరాబాద్ ఉప ఎన్నికలో డబ్బును మంచినీళ్లలా ఖర్చు పెట్టడంతో పాటు.. దళితబంధు వంటి పథకాలతో బీఆర్ఎస్ అక్కడి జనం మనసుని.. ముఖ్యంగా దళితుల ఓట్లనీ తనవైపు తిప్పుకునేలా ప్లాన్ చేసింది. ఎన్నికల్లో విజయం రాజేందర్నే వరించింది. కొంతకాలం పాటు అటువైపు పెద్దగా దృష్టి పెట్టని గులాబీ బాస్ ఇప్పుడీ నియోజకవర్గంపై మళ్లీ ప్రధానంగా ఫోకస్ పెట్టడం చర్చనీయాంశంగా మారుతోంది. ఇప్పటికే కాంగ్రెస్ నుంచి బయటికొచ్చి కారెక్కిన కౌషిక్ రెడ్డికి ఎమ్మెల్సీ ఇచ్చి ప్రోత్సహించడంతో పాటు.. ఉప ఎన్నికలో ఈటలపై పోటచేసి ఓటమిపాలైన గెల్లు శ్రీనివాస్ యాదవ్కు తెలంగాణ రాష్ట్ర పర్యాటక అభివృద్ధి శాఖ చైర్మన్ పదవిచ్చారు. హైదరాబాద్లో అంబేడ్కర్ అతి పెద్ద విగ్రహావిష్కరణ కార్యక్రమం పెట్టుకుని.. దానికి ముందు హుజూరాబాద్కి అంబేడ్కర్ ముని మనవడైన ప్రకాష్ యశ్వంత్ అంబేడ్కర్ ను ప్రత్యేక చాపర్ లో పంపించారు. హుజూరాబాద్లో అమలవుతున్న దళితబంధు పథకాన్ని.. లబ్దిదారులు ఆయనకు వివరించేలా ఇంటరాక్షన్ ప్రోగ్రామ్ ని కూడా అరేంజ్ చేశారు. ఈ మొత్తం వ్యవహారం చూస్తుంటే.. ఈటల పైనా.. ఆయన నియోజకవర్గంపైనా గులాబీ బాస్ ఎప్పుడూ ఓ కన్నేసే ఉంచుతున్నారనిపిస్తోంది. ఈటల రాజేందర్పైన ఎప్పుడూ విరుచుకుపడే కౌషిక్ రెడ్డి.. తన నియోజకవర్గానికి సంబంధం లేకున్నా తన చిరకాల ప్రత్యర్థిలా ఈటలను భావించే మంత్రి గంగుల కమలాకర్ కే ఈ బాధ్యతలను అప్పజెప్పడం వెనుకా గులాబీబాస్ ఆలోచనలు ఏంటన్నది ఇప్పుడో పెద్ద చర్చ. మరి ఇంతగా ఫోకస్ అవుతూ.. ఓ ముఖ్యమంత్రి చూపునే తనవైపు తిప్పుకునేలా చేయడం ఒకవైపు ఈటెలకున్న స్టామినాను చెబుతుంటే... ఇంకోవైపు ఇంతగా ఫోకస్ అవుతూ తానే లక్ష్యంగా జరుగుతున్న ఒత్తిడిని ఈటెల ఏవిధంగా ఎదుర్కొంటారోనన్న ఆసక్తీ ఇప్పుడు ఈ నియోజకవర్గంలో కనిపిస్తోంది. -పొలిటికల్ ఎడిటర్, సాక్షి వెబ్ డెస్క్ చదవండి: రేవంత్, ఈటల సవాళ్లపై విజయశాంతి కీలక వ్యాఖ్యలు.. -
కేసీఆర్ ఒక్కరు పోరాడితేనే తెలంగాణ రాలేదు
హుజూరాబాద్: ముఖ్యమంత్రి కేసీఆర్ ఒక్కరు పోరాడితేనే తెలంగాణ రాష్ట్రం రాలేదని, సకల జనులు కలసికట్టుగా పోరాడితేనే తెలంగాణ స్వప్నం సాకారమైందని తెలంగాణ జన సమితి (టీజేఎస్) అధ్యక్షుడు ఎం.కోదండరాం అన్నారు. శనివారం కరీంనగర్ జిల్లా హుజూరాబాద్లో తెలంగాణ బచావో సభకు సంబంధించిన పోస్టర్లను విడుదల చేశారు. ఈ సందర్భంగా కోదండరాం మాట్లాడుతూ.. మిలియన్ మార్చ్ స్ఫూర్తితోనే హైదరాబాద్లో æమార్చి 10న తెలంగాణ బచావో సభ ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. ఈ సభలో వచ్చే సూచనల ఆధారంగా భవిష్యత్ కార్యాచరణను రూపొందిస్తామని ప్రకటించారు. తెలంగాణ ఉద్యమంలో పాలుపంచుకున్న వారు, తెలంగాణ అభివృద్ధిని కోరుకునే వారు పాల్గొనాలని ఆయన పిలుపునిచ్చారు. బీఆర్ఎస్ ప్రభుత్వం ఎలా అధికార దుర్వినియోగానికి పాల్పడుతోందో ఢిల్లీ లిక్కర్ పాలసీ కుంభకోణం తేటతెల్లం చేస్తోందని తెలిపారు. కుంభకోణంలో తమ వాటా కోసం ఓ కుటుంబం ప్రయత్నించిందన్నారు. బీఆర్ఎస్ నాయకులు భూకబ్జాలకు పాల్పడేందుకు ధరణి పోర్టల్ రూపొందించారని విమర్శించారు. ఉద్యమ సమయంలో కేసీఆర్ చెప్పింది ఏంటి? ఇప్పుడు చేసేదేంటి? అని కోదండరాం ప్రశ్నించారు. టీఆర్ఎస్ పార్టీ పేరును బీఆర్ఎస్గా మార్చినప్పుడే ఆ పార్టీ తెలంగాణలో ఉనికి కోల్పోయిందని పేర్కొన్నారు. కార్యక్రమంలో టీజేఎస్ రాష్ట్ర కార్యదర్శి ముక్కర రాజు, పెద్దపల్లి జిల్లా కన్వీనర్ నర్సింగ్, ప్రధాన కార్యదర్శి స్రవంతి తదితరులు పాల్గొన్నారు. -
మెడికల్ కాలేజీల్లో ర్యాగింగ్ పూర్తిగా బంద్ కాలేదు : ఈటల
-
హుజూరాబాద్లో హీటెక్కిన పాలిటిక్స్.. చేతులు కలిపిన బీజేపీ, బీఆర్ఎస్ నేతలు!
సాక్షి ప్రతినిధి, కరీంనగర్: ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో జగిత్యాల మున్సిపల్ చైర్పర్సన్ రాజీనామా వ్యవహారం చల్లబడిందో లేదో మళ్లీ హుజూరాబాద్ మున్సిపల్ పాలకవర్గం పంచాయితీ తెరపైకి వచ్చింది. హుజూరాబాద్ మున్సిపల్ చైర్ పర్సన్ గందె రాధికపై బీఆర్ఎస్, బీజేపీ కౌన్సిలర్లు గురువారం ఏకంగా కలెక్టరేట్ ఏవో నారాయణకు ఫిర్యాదు ప్రతులను అందజేశారు. హుజూరాబాద్ నుంచి నేరుగా బీఆర్ఎస్కు చెందిన 22 మంది, బీజేపీకి చెందిన ముగ్గురు కౌన్సిలర్లు కొత్తకొండ వీరభద్రస్వామి దేవస్థానం వద్దకు చేరుకొని చైర్పర్సన్పై అవిశ్వాసం విషయంలో ఏకతాటిపై ఉండాలని ప్రతిజ్ఞ చేసిన అనంతరం కరీంనగర్కు చేరుకొని ఫిర్యాదు చేసినట్లు సమాచారం. దీంతో హుజూరాబాద్ అవిశ్వాస వ్యవహారం అధికార బీఆర్ఎస్ పార్టీలో చర్చనీయాంశమైంది. ఇదే బాటలో జమ్మికుంట పాలకవర్గంలో కూడా అవిశ్వాస ముసలం పుట్టినట్లు సమాచారం. గతనెల 31వ తేదీన జమ్మికుంటలో భారీ బహిరంగ సభలో బీఆర్ఎస్ అగ్రనేతలంతా బీజేపీ విధానాలపై దుమ్మెత్తిపోసిన రెండురోజులకే అదే పార్టీ నేతలతో కలిసి అవిశ్వాసానికి వెళ్లడం గమనార్హం. ఏకపక్ష నిర్ణయాల వల్లే... హుజూరాబాద్ మున్సిపల్ చైర్ పర్సన్ గందె రాధిక భర్త గందె శ్రీనివాస్ వ్యవహార శైలి వల్లే అవిశ్వాసం వరకు అసమ్మతి రగడ రాజుకుందనే ప్రచారం మెండుగా ఉంది. గతంలో శ్రీనివాస్ వ్యవహారంపై అప్పటి మంత్రి ఈటల రాజేందర్, ప్రస్తుత మంత్రి గంగుల కమలాకర్కు, మరికొంత మంది పార్టీ ముఖ్యనేతలకు ఫిర్యాదు చేశారు. అయినా ఆయన వ్యవహార శైలిలో మార్పులేకపోవడం వల్లే అసమ్మతి గళాన్ని వినిపిస్తున్నట్లు సమాచారం. అభివృద్ధి పనుల విషయంలో తోటి కౌన్సిలర్లకు సమాచారం ఇవ్వకుండా, బినావీులతో కాంట్రాక్టు పనులు చేయిస్తూ మెజార్టీ కౌన్సిలర్ల మనోభావాలను పరిగణనలోకి తీసుకోకుండా, అధికారులను భయబ్రాంతులకు గురి చేయడం వల్లే ఈ నిర్ణయానికి మెజార్టీ సభ్యులు తోడైనట్లు తెలిసింది. పాలకవర్గంలో 30 మంది సభ్యులుండగా ఒకరు మృతి చెందారు. 25 మంది కౌన్సిలర్లు కలెక్టర్కు ఫిర్యాదు చేశారు. చైర్పర్సన్కు ముగ్గురు కౌన్సిలర్లు మాత్రమే మద్దతుగా మిగిలారు. ఎమ్మెల్సీ వద్దకు పంచాయితీ.. 25 మంది కౌన్సిలర్లు గురువారం సాయంత్రం హుజూరాబాద్లో ఉన్న ఎమ్మెల్సీ కౌశిక్రెడ్డిని కలిసి విషయాన్ని వివరించినట్లు సమాచారం. పార్టీ అధిష్టానం నిర్ణయించిన మేరకు నడుచుకోవాలని, సమస్యను పార్టీ దృష్టికి తీసుకెళ్లి పరిష్కరిస్తానని, ఎలాంటి తొందరపాటు నిర్ణయాలకు తావివ్వద్దని ఎమ్మెల్సీ వారికి సూచించినట్లు సమాచారం. అయినప్పటికీ మెజార్టీ కౌన్సిలర్లు పార్టీ నిర్ణయమే శిరోధార్యమని, తమ ఫిర్యాదును పరిగణలోకి తీసుకోవాలని, పార్టీకి చెడ్డ పేరు వచ్చే విధంగా తాము వ్యవహరించమని, మెజార్టీ సభ్యుల మనోభావాలను గుర్తించి నిర్ణయం తీసుకోవాల్సిందేనని మొరపెట్టుకున్నట్లు వినికిడి. దీంతో ఈ విషయాన్ని ఆయన ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు బి.వినోద్కుమార్ దృష్టికి తీసుకెళ్లారని తెలిసింది. హుజూరాబాద్ తరహాలోనే జమ్మికుంట మున్సిపల్ పాలకవర్గంలో కూడా ముసలం పుట్టినట్లు సమాచారం. వరుస పరిణామాలతో అధికార పార్టీలో గందరగోళం నెలకొంది. - గత పాలకవర్గంలోనూ ఇదే తరహాలో అర్ధంతరంగా అవిశ్వాసం ఎదుర్కోవాల్సి వచ్చింది. ఈటల రాజేందర్ మంత్రిగా ఉన్న సమయంలో 2018 ఆగస్టులో అప్పుడు చైర్మన్గా ఉన్న విజయ్కుమార్తో రాజీనామా చేయించారు. అనంతరం ఆ స్థానంలో మందా ఉమాదేవి చైర్పర్సన్గా బాధ్యతలు చేపట్టగా.. ఆమె 10 నెలలపాటు పదవిలో కొనసాగారు. ఆ తరువాత ప్రత్యేకాధికారుల పాలన సాగింది. అనంతరం 2020 జనవరిలో మున్సిపల్ ఎన్నికలు జరగ్గా.. జనవరి 27న గందె రాధిక నేతృత్వంలో నూతన పాలకవర్గం కొలువుదీరింది. మూడేళ్లు పూర్తి చేసుకున్న క్రమంలో రాష్ట్రాల అవిశ్వాసాలకు తెరలేవగా.. ఆ మంటలు ఇక్కడ కూడా అంటుకున్నాయి. చైర్పర్సన్ రేసులో ముగ్గురు..! బీఆర్ఎస్–బీజేపీ కౌన్సెలర్లు అవిశ్వాస తీర్మానం ఇవ్వగా.. అన్నీ అనుకూలిస్తే అవిశ్వాసం విజయవంతమైతే చైర్పర్సన్ స్థానానికి ముగ్గురు పోటీలో ఉన్నారు. మందా ఉమాదేవి, దండ శోభ, వైస్ చైర్పర్సన్ కొల్లిపాక నిర్మల రేసులో ఉన్నట్లు తెలిసింది. ఈ విషయంలో అధిష్టానం నిర్ణయమే ఫైనల్ కానుంది. -
జమ్మికుంట సభలో హుజురాబాద్ అభ్యర్థిని ప్రకటించిన కేటీఆర్!
కరీంనగర్: జమ్మికుంటలో బీఆర్ఎస్ బహిరంగ సభలో మంత్రి కేటీఆర్ మాట్లాడారు. హుజురాబాద్లో ఈసారి బీఆర్ఎస్ జెండా ఎగరాలని పిలుపునిచ్చారు. ఎమ్మెల్సీ కౌశిక్ రెడ్డి ఈ విశ్వాసం కల్పించారని చెప్పి పరోక్షంగా ఆయనే అభ్యర్థి అని ప్రకటించారు. ఎన్నికలు వచ్చే వరకూ ప్రజల్లోనే ఉండాలని, ప్రజల సమస్యలు తెలుసుకోవాలని సూచించారు బీఆర్ఎస్ జెండా మారలేదు, ఎజెండా మారలేదు, అదే డీఎన్ఏ అని కేటీఆర్ స్పష్టం చేశారు. హుజూరాబాద్లో మళ్లీ పొరపాటు జరగొద్దన్నారు. అందరికీ భరోసా ఇచ్చే బీఆర్ఎస్ కావాలా? మోసం చేసే పార్టీలు కావాలా? రైతన్నలారా ఆలోచించండి అని కేటీఆర్ విజ్ఞప్తి చేశారు. ఈ రాష్ట్రానికి, దేశానికి ఏ పార్టీ అరిష్టమో ఆలోచించండి అన్నారు. మోదీ ఎవరికి దేవుడు? 'మోదీ ఎవరికి దేవుడు? ఎవనికి దేవుడు? రూ.400 సిలిండర్ను రూ1,200 చేసిన మోదీ దేవుడా? 2 కోట్ల ఉద్యోగాలు ఇవ్వకుండా యువతకు మోసం చేసిన మోదీ దేవుడా? పెట్రోల్ ధరలు పెంచారు. మోదీ రూ.100 లక్షల కోట్లు అప్పు చేయలేదా? దమ్ముంటే చెప్పు ఈటల రాజేందర్. చేనేతపై ఏ ప్రధాని వేయని పన్ను మోదీ వేశారు. పద్మశాలీలు ఆలోచించాలి. బండి సంజయ్ దమ్ముంటే కరీంనగర్ జిల్లాకు మెడికల్ కాలేజ్ తీసుకు రావాలి' అని కేటీఆర్ వ్యాఖ్యానించారు. '14 నెలల కిందట బీజేపీ అభ్యర్థి ఈటల రాజేందర్ను గెలిపించారు. ఇది చేస్తాం అది చేస్తాం అమిత్ షాను తీసుకొస్తాం అని కల్లబొల్లి కబుర్లు చెప్పారు. ఒక్క రూపాయి వచ్చిందా? మాటలు కోటలు దాటాయి. చేతలు గడప కూడా దాటలేదు. కేసీఆర్ పాలన రాష్ట్రానికి అరిష్టం అని ఈటల అన్నారు. బాధ అనిపించింది. అసలు ఈటల రాజేందర్ను హుజూరాబాద్కు పరిచయం చేసింది తండ్రి లాంటి కేసీఆర్ కాదా? తల్లి పాలు తాగి రొమ్ము గుద్దినట్టు కాదా? 33 మంది పోటీ పడితే ఈటలకు టికెట్ ఇవ్వలేదా?' అని కేటీఆర్ వ్యాఖ్యానించారు. బండి సంజయ్ని కరీంనగర్ నుంచి ఎందుకు గెలిపించాని కేటీఆర్ ప్రశ్నించారు. మసీదులు తవ్వడం కాదు, దమ్ముంటే కాలువలు తవ్వుదాం రా.. అని సవాల్ విసిరారు. మాట్లాడితే పాకిస్తాన్, హిందూస్తాన్ అంటారని ధ్వజమెత్తారు. బండి సంజయ్కు గుజరాతీల చెప్పులు మోసే సోకు ఉండొచ్చని ఎద్దేవా చేశారు. 14 నెలల్లో ఈటల, బండి హుజూరాబాద్కు చిల్లిగవ్వ కూడా తేలేదని కేటీఆర్ ఫైర్ అయ్యారు. చదవండి: పట్టించుకోని కేసీఆర్ సర్కార్.. తీర్థం ఇచ్చేందుకు సిద్ధమైన కమలం పార్టీ -
Karimnagar: ఉమక్క, రమేశ్ బావ క్షమించండి.. కంటతడి పెట్టిస్తోన్న లేఖ
సాక్షి, కరీంనగర్: హుజూరాబాద్ పట్టణం సాయిబాబా గుడి సమీపంలో అద్దె ఇంట్లో ఒంటరిగా ఉంటున్న ఓ అనుమానాస్పద స్థితిలో మృతిచెందిన ఘటననాలస్యంగా వెలుగుచూసింది. దీనికి సంబంధించి కాలనీవాసులు, పోలీసుల కథనం ప్రకారం.. పట్టణానికే చెందిన జంగిలి రాజు (30) స్థానిక సాయిబాబా గుడి సమీపంలో అద్దె ఇంట్లో ఉంటూ స్థానిక ఓ వైన్షాపులో కూలీగా పనిచేస్తున్నాడు. కరోనా సమయంలో అతడి తల్లి మృతిచెందింది. అప్పటినుంచి ఒంటరిగానే ఉంటున్నాడు. రాజు ఉండే ఇంటి పరిసరాల నుంచి సోమవారం దుర్వాసన రావడంతో స్థానికులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. వారు వచ్చి ఇంటి తలుపులు తెరిచి చూడగా రాజు కుళ్లిపోయిన స్థితిలో శవమై కనిపించాడు. ఆయన చుట్టూ రక్తం ఉండడం.. శరీరం నుంచి ద్రవాలు వెలువడడంతో ముఖమంతా ఏర్పడకుండా మారిపోయింది. అతడి సెల్ఫోన్ సైతం స్విచ్ ఆఫ్ అయి ఉంది. బంధువులకు సమాచారం అందించగా.. వారం నుంచి అతడి సెల్ స్విచ్ ఆఫ్ అని వస్తోందని తెలిపారు. అయితే రాజు ఆత్మహత్యకు పాల్పడ్డాడా..? మరేదైనా కారణమా..? అనే విషయం విచారణ చేసిన తర్వాతే తెలిసే అవకాశం ఉందని పో లీసులు చెబుతున్నారు. గది లోపలి నుంచి తలుపులకు తాళం వేసి ఉండడంతో మనస్తాపంతోనే ఆత్మహత్య చేసుకున్నాడా..? అనే కోణంలోనూ దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. చదవండి: హైదరాబాద్లో దారుణం.. ఆర్డర్ ఆలస్యమైందని, ఫుడ్ డెలివరీ బాయ్పై దాడి సూసైడ్ నోట్లో ముగ్గురి పేర్లు.. రాజు మృతదేహం వద్ద సూసైడ్ నోట్ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. అందులో తన చావుకు చిన్నమ్మ అనసూర్య, శ్రీధర్, శివ కారణమని రాసి ఉంది. తన అమ్మ చనిపోయిన తర్వాత అక్క, బావ చేరదీశారని, అయితే పై ముగ్గురితో మానసికంగా ఇబ్బందిపడ్డానని, అనసూర్య, ఆమె కొడుకులు తనను కొడుతున్నారని, వారివల్లనే జీవితంపై విరక్తి కలిగిందని, అందుకే ఇంజక్షన్ తీసుకుంటున్నానని రాసి ఉంది. తన చావుకు కారణమైన వారిపై చర్య తీసుకోవాలని కూడా ఆ ఉత్తరంలో కోరాడు. ఉమక్క, రమేశ్బావ క్షమించండి.. ‘ఉమక్క నన్ను క్షమించు’ అంటూ రాజు రాసిన లేఖ కంటతడి పెట్టించింది. ‘ఉమక్క భయం వేస్తుంది. నాకు చావాలని లేదు. నన్ను జంగిలి అనసూర్య, శివ, శ్రీధర్ తిడుతూ కొడుతున్నారు. వాళ్ల వల్లే చనిపోతున్నా. ఇంజక్షన్ వేసుకున్నాక ఎలా ఉంటుందో నాకు తెల్వది. ఆ ఇంజక్షన్ వేసుకున్న తర్వాత చస్తే నా బాడీ కుళ్లిపోయి వాసన వచ్చేవరకు ఎవరూ రారేమో. బహుశా మీరు కూడా చూసే అవకాశం ఉండదేమో. ఎందుకంటే అంతగా నా బాడీ కుళ్లి పోయి ఉంటుంది. కనుక నన్ను క్షమించండి’ అంటూ లేఖలో పేర్కొన్నాడు. లేఖలోని విషయాలపైనా పో లీసులు లోతుగా విచారణ చేస్తున్నట్లు సమాచారం. మనిషికి ఉండేది ఒక్కటే జీవితం. ఆత్మహత్య అన్ని సమస్యలకు పరిష్కారం కాదు.. ఒక్క క్షణం ఆలోచించండి, రోషిణి కౌన్సెలింగ్ సెంటర్ను ఆశ్రయించి సాయం పొందండి. ఫోన్ నెంబర్లు: 040-66202000/040-66202001 మెయిల్: roshnihelp@gmail.com -
ప్రేమించి పెళ్లి చేసుకున్నారని ప్రియుడి ఇల్లును దగ్ధం చేసిన ప్రియురాలి బంధువులు
-
కరీంనగర్లో దారుణం.. లవ్ మ్యారేజ్ చేసుకున్నారని..
సాక్షి, కరీంనగర్: కరీంనగర్ జిల్లా హుజూరాబాద్ ఇందిరానగర్లో దారుణం చోటుచేసుకుంది. ప్రేమించి పెళ్లి చేసుకున్నారనే కారణంతో ప్రియుడి ఇంటిని ప్రియురాలి తరపు బంధువులు దగ్ధం చేశారు. అయితే తమ ఇష్టప్రకారమే పెళ్లి చేసుకున్నామని తమకు రక్షణ కల్పించాలని ఆ ప్రేమ జంట పోలీసులను ఆశ్రయించింది. ఘటనలో రూ.3 నుంచి రూ.5 లక్షల వరకు నష్టం వాటిల్లినట్లు తెలుస్తోంది. పోలీసులు ఇరు వర్గాలను స్టేషన్కు పిలిపించి కౌన్సిలింగ్ ఇస్తున్నారు. చదవండి: (ఎయిమ్స్లో సీటు సాధించాలనే కోరిక.. ఆ ఒత్తిడితోనే..) -
హుజురాబాద్లో గన్ కలకలం.. నాకేం జరిగినా కేసీఆర్దే బాధ్యత: ఈటల షాకింగ్ కామెంట్స్
సాక్షి, హుజురాబాద్: బీజేపీ హుజురాబాద్ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ షాకింగ్ కామెంట్స్ చేశారు. కరీంనగర్ జిల్లా హుజురాబాద్లో ఓ కార్యక్రమంలో పాల్గొన్న ఓ నాయకుడి వద్ద గన్ కనిపించడం కలకలం రేపింది. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది. కాగా, బహిరంగ కార్యక్రమంలో ఇలా గన్తో పాల్గొనడం వివాదాస్పదంగా మారింది. అయితే, దీనికి సంబంధించిన వీడియోపై బీజేపీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ స్పందించారు. ఈ సందర్భంగా ఈటల రాజేందర్ మాట్లాడుతూ.. హుజురాబాద్లో గన్ లైసెన్స్లు విచ్చలవిడిగా ఇస్తున్నారు. నాకు, నా కుటుంబ సభ్యులకు ఏం జరిగినా సీఎం కేసీఆర్దే బాధ్యత. మా రక్తం బొట్టు చిందినా సీఎందే పూర్తి బాధ్యత. ఇటువంటి బెదిరింపులకు భయపడేది లేదు. నాపై నయిమ్ గ్యాంగ్ రెక్కీ నిర్వహించినప్పుడే భయపడలేదన్నారు. ఇక, గన్ లైసెన్స్లపై కరీంనగర్ పోలీసు కమిషనర్ సత్యనారాయణ స్పందించారు. ఈ క్రమంలో సీపీ మాట్లాడుతూ.. గడిచిన రెండేళ్లలో హుజురాబాద్లో కేవలం ఇద్దరికి మాత్రమే గన్ లెసెన్స్ ఇచ్చినట్టు తెలిపారు. ఈ మధ్య కాలంలో ఒక్కరూ కూడా గన్ లైసెన్స్ కోసం దరఖాస్తున చేసుకోలేదని స్పష్టం చేశారు. ఇక, గన్తో కనిపించిన నేతను సైతం పోలీసులు స్టేషన్కు పిలిపించుకుని మరోసారి ఇలా జరిగితే లైసెన్స్ రద్దు చేస్తామని వార్నింగ్ ఇచ్చినట్టు సమాచారం. -
వాసాలమర్రిలో వడివడి.. హుజూరాబాద్లో తడబడి..
హుజూరాబాద్ నుండి, సాక్షి ప్రత్యేక ప్రతినిధి: దళితబంధు.. తెలంగాణ దళితుల సంక్షేమం, అభివృద్ధిలో ఓ విప్లవం. ఒక్కో కుటుంబానికి రూ.10 లక్షల ఆర్థిక సహాయంతో ఉపాధి మార్గాన్ని చూపే ఓ కొత్త వెలుగు. ఒక్క రూపాయి కూడా తిరిగి చెల్లించాల్సిన అవసరం లేకుండా పూర్తి మొత్తాన్ని ప్రభుత్వమే భరిస్తూ దళితుల స్థితిగతులను మార్చేందుకు వాసాలమర్రిలో పురుడుపోసుకున్న ఈ పథకం హుజూర్బాద్లో విస్తరించి ఏడాదిని పూర్తి చేసు కుంటోంది. అయితే లక్ష్యాలు, నిబంధనలు ఒక్కటే అయినా, యాదాద్రి జిల్లా వాసాలమర్రి లబ్ధిదారుల్లో వెలుగులు నింపుతున్న ఈ పథకం..హుజూరాబాద్లో మాత్రం తడబడుతోంది. తక్కువ సంఖ్యలో లబ్ధిదారులు, సరైన యూనిట్ల ఎంపిక, అధికారుల పర్యవేక్షణ, మెరుగైన అమలు తీరు వాసాలమర్రి దళితులను విజయపథంలో నడిపిస్తుంటే..యూనిట్ల ఎంపికలో అవగాహన లోపం, సరైన మార్గదర్శకత్వ లేమి కారణంగా హుజూరాబాద్లో ఆశించిన ఫలితాలు ఇవ్వడం లేదు. ప్రత్యేక సర్వే.. పకడ్బందీగా అమలు వాసాలమర్రిలో స్థానిక మార్కెట్ పరిస్థితి, లబ్ధిదారుల అభిరుచులు, వారి సాంకేతిక సామర్థ్యాల పరిశీలన అనంతరం యూనిట్లను మంజూరు చేశారు. ఆపై వారు నిలదొ క్కుకునేందుకు ప్రత్యేక శిక్షణ, పరిశీలనతో ముందుకు వెళ్తుండటంతో ఇక్కడ సక్సెస్ రేటు ఊహించినదానికంటే అధికంగా ఉంది. మెజారిటీ లబ్ధిదారుల పరిస్థితి ప్రభుత్వం ఆశించిన విధంగా మెరుగుపడుతోంది. స్థానిక అవసరాల మేరకు యూనిట్లు ‘వాసాలమర్రిలో తొలుత ప్రత్యేకంగా సర్వే చేసి స్థానిక పరిస్థితులు, అవసరాలను గుర్తించాం. ఇదే సమయంలో లబ్ధిదారుల్లో సామర్థ్యాన్ని పరిశీలించి వారు కోరుకున్నవి కాకుండా అక్కడ అవసరం ఉన్న యూనిట్లు పెట్టించాం. 75 మందికి 19 రకాల పనులు అప్పగించి చేయూతనిస్తున్నాం. మెజారిటీ లబ్ధిదారుల ఆర్థికస్థితి ఇప్పుడిప్పుడే మారుతోంది..’ అని ఎస్సీ కార్పొరేషన్ ఈడీ శ్యాంసుందర్ చెప్పారు. ఇక్కడ కోరుకున్న వారికి కోరుకున్నట్టుగా..! హుజూరాబాద్లో 15,710 కుటుంబాలకు దళితబంధు అందజేయాలన్న లక్ష్యంతో ఇప్పటికి 12,007 మందికి అందజేశారు. అయితే ఇక్కడ స్థానిక పరిస్థితులు, లబ్ధిదారుల సామర్ధ్యం, మార్కెట్లో డిమాండ్ – సప్లయితో సంబంధం లేకుండా యూనిట్ల పంపిణీ సాగుతోంది. దీంతో లబ్ధిదారుల్లో తమకు రూ.10 లక్షల సహాయం అందుతుందన్న సంతోషం ఉన్నా, ఆశించిన ఆదాయం రావటం లేదన్న అసంతృప్తి వెంటాడుతోంది. హుజూరాబాద్ మండలం చిల్పూరులో 324 కుటుంబాలకు యూనిట్లు మంజూరు చేస్తే అందులో 142 యూనిట్లు వాహనాలే కావటం విశేషం. ఇక ఎక్కువ సంఖ్యలో బర్రెలు తీసుకున్నవారూ సంతృప్తిగా లేరు. హరియాణాæ నుండి తెచ్చిన బర్రెలు ఆశించిన విధంగా పాలు ఇవ్వకపోగా, అనారోగ్యం పాలవున్న తీరు లబ్ధిదారులను ఆందోళనకు గురిచేస్తోంది. లబ్ధిదారుల అవగాహన లోపం, సరైన చర్యలు తీసుకోవడంలో అధికారుల వైఫల్యం కారణంగానే ఈ పరిస్థితి తలెత్తిందనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి. వాసాలమర్రిలో ‘లక్ష్మీ’ కటాక్షం దళితబంధు పథకంతో తన పేరు నిజంగా సార్ధకమైందని అంటోంది..వాసాలమర్రికి చెందిన చెన్నూరి లక్ష్మి. నలుగురు పిల్లల తల్లయిన లక్ష్మి గతంలో అద్దెకు తీసుకున్న ఆటోలో భర్తతో కలిసి ఊరూరూ తిరుగుతూ కూరగాయల వ్యాపారం చేసేది. కానీ వచ్చిన లాభంలో 75 శాతం ఆటో అద్దెకే పోయేది. ఈ నేపథ్యంలో దళితబంధు కింద లక్ష్మి ఆటో ట్రాలీ తీసుకుంది. కూరగాయలు కొని అమ్మితే లాభం ఉండదని భావించింది. తనకున్న భూమిలో బోరు వేసి తాను కూడా కాయగూరల సాగు మొదలుపెట్టింది. ఇప్పటికే నలుగురు కూతుళ్లలో ఇద్దరి వివాహాలు చేయగా, బీటెక్, ఎంబీఏ చదువుతున్న ఇంకో ఇద్దరు అమ్మాయిలున్నారు. ప్రస్తుతం ఎంబీఏ చదువుతున్న కుమార్తె మానసతో కలిసి లక్ష్మి చుట్టుపక్కల పల్లెలకు ఆటోలో వెళ్లి వస్తూ వ్యాపారం చేస్తోంది. సొంత ఆటో, వ్యవసాయ పంటలతో ప్రస్తుతం లక్ష్మిఆదాయం నెలకు రూ.50 వేల వరకు చేరింది. ఇక దీపం వత్తులు చేస్తున్న బొల్లారం లావణ్య, పేపర్ గ్లాస్లు తయారు చేసి విక్రయిస్తున్న బొల్లారం రేఖలు చిన్నపాటి పారిశ్రామికవేత్తలుగా మారిపోయారు. తమ ఆదాయాన్ని గణనీయంగా పెంచుకున్నారు. ఈ తరహా మార్పు వాసాలమర్రిలోని 80 శాతం లబ్ధిదారుల్లో కనిపిస్తోంది. వరినాటు మెషీన్ తీసుకున్నాం కానీ.. గతంలో కూలీ పనులు చేసుకొని బతికేటోళ్లం. దళితబంధులో మా చిన్నాన్న అయిలయ్యతో కలిసి వరి నాటు వేసే మెషీన్ తీసుకున్నం. ఇప్పటివరకు 80 ఎకరాల్లో నాట్లు వేసినం. గంటకు ఎకరం వరకు నాటు వేస్తుంది. అయితే ఆ యంత్రాన్ని నడపడం మాకు రాకపోవడంతో బాపట్ల నుంచి డ్రైవర్, టెక్నీషియన్లను తీసుకొచ్చాం. వచ్చిన ఆదాయంలో అత్యధికం డ్రైవర్, టెక్నీషియన్తో పాటు డీజిల్కే పోయింది. మాకు సరిపడా మిగిలే పరిస్థితి ఉంటే బాగుంటుంది. –పాంకుంట అనిల్, ధర్మరాజుపల్లి (హుజూరాబాద్) కేసీఆర్కు రుణపడి ఉంటాం మాకు ఎకరన్నర పొలం ఉంది. మా ఆయన వ్యవసాయం చేస్తోంటే నేను ఊళ్లోనే కూలి పనికి పోయి బతికేది. మాకు ఇద్దరు కొడుకులు, ఒక కూతురు. దళితబంధులో నెల క్రితం 4 బర్రెలు వచ్చినై. రెండు బర్లు పాలిస్తున్నై. 15 రోజులకు రూ.6 వేల వరకు వచ్చినయి. సీఎం కేసీఆర్కు రుణపడి ఉంటాం. అయితే పాల దిగుబడి ఊహించినట్టుగా లేదు. – పుల్ల సరోజని, చెల్పూరు (హుజూరాబాద్) అడ్డా మీద పెట్టనివ్వలేదు.. రెండు నెలల క్రితం మాకు మా నాన్న పేరుమీద ఆటో ట్రాలీ ఇచ్చారు. ఊరిలో సరిపడా గిరాకీ దొరకటం లేదు. జమ్మికుంట అటో అడ్డాకు పోతే.. సభ్యత్వం కోసం 7 వేలు కట్టమన్నారు. అంతమొత్తం లేక ఆటో ఊరిలోనే పెట్టా. ఇక్కడ గిరాకీ దొరికితే పోతున్న. – గోపీచంద్, చెల్పూరు (హుజూరాబాద్) చేయి విడువని వ్యవస్థ కావాలి దళితబంధు అనేది సంక్షేమ రంగంలోనే అత్యద్భుతం. అయితే యూనిట్ ఎంపిక, నిర్వహణ, భవిష్యత్తులో వచ్చే సమస్యల తక్షణ పరిష్కారానికి ప్రత్యేక వ్యవస్థ అవసరం. ఇది ప్రభుత్వంతో పాటు దళిత ప్రజాస్వామిక సంఘాల బాధ్యత. వచ్చే ఐదేళ్ల పాటు లబ్ధిదారులకు అన్నివిధాలా సహాయకారిగా ఉండేలా చేయి విడువని వ్యవస్థ ఏర్పాటు చేస్తేనే పథకం లక్ష్యం నెరవేరుతుంది. – మల్లేపల్లి లక్ష్మయ్య, చైర్మన్, సెంటర్ ఫర్ దళిత్ స్టడీస్ అన్నివిధాలా అండగా ఉండాలి రాష్ట్రంలో 19 లక్షల దళిత కుటుంబాలున్నాయి. రూ.3,100 కోట్లతో 29 వేల మంది లబ్ధిదారులకు పథకాన్ని వర్తింపజేస్తున్నారు. ఈ పథకంతో దళితుల జీవితాల్లో మార్పులు రావాలంటే ప్రభుత్వం తక్షణం తీసుకోవాల్సిన పలు చర్యలను నిపుణులు సూచిస్తున్నారు. ►యూనిట్ల మంజూరుతోనే సరి పెట్టుకోకుండా లబ్ధిదారులకు అన్నివిధాలా అండగా నిలవాలి. అవసరమైన సహాయ సహకారాలు అందించాలి. ►లబ్ధిదారులు స్థానిక పరిస్థితులు, వారి సామర్థ్యానికి అనుగుణంగా యూనిట్లు ఎంపిక చేసుకునేలా చూడాలి. యూనిట్ల పంపిణీ కంటే ముందుగానే వాటిపై పూర్తి అవగాహన కల్పించాలి. అవసరమైన సాంకేతిక శిక్షణ ఇవ్వాలి. మార్కెట్ మెలకువలు కూడా వివరించాలి. ►దళితబంధు లబ్ధిదారుల పర్యవేక్షణ కోసం ప్రతి మండలానికి ఓ ప్రత్యేక అధికారిని నియమించి యూనిట్లు లాభాల బాట పట్టేలా మిగతా విభాగాలతో సమన్వయం చేయాలి. ►ప్రతి నెలా కలెక్టర్ ఆధ్వర్యంలో సమీక్ష నిర్వహించి, లోపాలు సరిదిద్దడంతో పాటు లబ్ధిదారులకు అవసరమైన సహాయ సహకారాలు అందించాలి. ►ప్రభుత్వ విభాగాల్లో ప్రైవేటు వాహనాల వినియోగం స్థానే.. దళితబంధు యూనిట్లకు ప్రాధాన్యవ్వాలి. ►జిల్లా స్థాయిలో గ్రీవెన్స్సెల్ పెట్టి వచ్చే ఫిర్యాదులపై తక్షణ పరిష్కారం చూపాలి. -
హుజూరాబాద్లో ఉద్రిక్తత: టీఆర్ఎస్-బీజేపీ బాహాబాహీ!
హుజూరాబాద్(కరీంగనగర్ జిల్లా): టీఆర్ఎస్-బీజేపీ కార్యకర్తలు బాహాబాహీకి దిగారు. హుజురాబాద్లోని అంబేద్కర్ చౌరస్తా వద్ద ఇరు పార్టీల కార్యకర్తలు తీవ్ర స్థాయిలో ఘర్షణ వాతావరణం సృష్టించారు. ఫ్లెక్సీల అంశానికి సంబంధించి గురువారం సాయంత్రం ప్రాంతంలో టీఆర్ఎస్-బీజేపీ కార్యకర్తలు బహిరంగ చర్చ సవాళ్లతో హంగామా సృష్టించారు. ఈ క్రమంలోనే ఇరు వర్గాల మధ్య తోపులాట జరిగి పరిస్థితి ఉద్రిక్తతలకు దారి తీసింది. -
చర్చకు రమ్మంటే ముఖం చాటేస్తున్న ఈటల: ఎమ్మెల్సీ పాడి కౌశిక్ రెడ్డి
హుజూరాబాద్: ఉప ఎన్నికల్లో గెలిచిన తర్వాత ప్రజలకు ఏం అభివృద్ధి చేశారో చెప్పాలని కోరితే సమాధానం చెప్ప కుండా ఎమ్మెల్యే ఈటల రాజేందర్ ముఖం చాటేస్తున్నా రని ఎమ్మెల్సీ పాడి కౌశిక్ రెడ్డి విమర్శించారు. బుధవారం హుజూరాబాద్లోని టీఆర్ఎస్ కార్యాలయంలో ఆయన విలేకరులతో మాట్లాడుతూ.. హుజూరాబాద్ అభివృద్ధికి కేంద్ర ప్రభుత్వం నుంచి నిధులు తీసుకురావాలని సవాల్ విసిరినా ఈటల స్పందించకపోవడం తన తప్పును అంగీకరించినట్లేనని స్పష్టం చేశారు. 5న హుజూ రాబాద్ అంబేడ్కర్ చౌరస్తా వద్ద నియోజకవర్గ ప్రజల మధ్యే అభివృద్ధిపై చర్చ పెట్టుకుందామన్నారు. సమావేశంలో ఎస్సీ కార్పొరేషన్ చైర్మన్ బండ శ్రీనివాస్, జెడ్పీ చైర్పర్సన్ కనుమల్ల విజయ, మున్సిపల్ చైర్పర్సన్ రాధిక పాల్గొన్నారు. -
Women's Day 2022: రూ. 20తో మొదలై.. ఇప్పుడు కోటికి పైగా నిధులతో..
పొదుపు.. ఒక వ్యక్తి ఆర్థిక క్రమశిక్షణ కలిగి ఉన్నారని చెప్పడానికి నిదర్శనం. ఒక్కో నీటి చుక్క సముద్రమైనట్టు.. సంపాదించే దాంట్లో ఎంతో కొంత కూడబెడుతూ ఉంటే... ఒకానొక నాడు పెద్ద మొత్తం చేతికి వస్తుంది. అత్యవసర సమయంలో మనల్ని ఆదుకుంటుంది. ఇక పొదుపు మంత్రం పాటించడంలో మహిళలు ముందుంటారన్న విషయం ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ముఖ్యంగా గృహిణులు ‘ఇంటి పెద్ద’ ఇచ్చే మొత్తం నుంచే కుటుంబ సభ్యులందరి అవసరాలు తీర్చేలా ప్రణాళికలు రూపొందిస్తారు. ఉద్యోగినులకైతే నెలవారీ ఆదాయం ఉంటుంది కాబట్టి వారితో పోలిస్తే పెద్దగా సమస్యలు ఎదురుకాకపోవచ్చు. ఇదంతా సగటు మధ్య తరగతి కుటుంబాలకు చెందిన స్త్రీల గురించే! అన్ని ఖర్చులు పోనూ కొంతమొత్తాన్ని పొదుపు చేసి అవసరాలకు వాడుకోవడం సహజం. అయితే, వ్యక్తిగత పొదుపు కంటే కూడా సామూహిక పొదుపు ఎల్లప్పుడూ అదనపు మేలు చేస్తుంది. గ్రామీణ ప్రాంతాల్లోని మహిళా పొదుపు సంఘాలు ఇందుకు చక్కని ఉదాహరణ. అవసరమైన సమయంలో తక్కువ వడ్డీకి అప్పు ఇచ్చి ఆదుకుంటాయి. అలాంటి వాటిలో కరీంనగర్ జిల్లా హుజురాబాద్ మండలంలోని తుమ్మనపల్లి గ్రామం కూడా ఒకటి. ఎలాంటి ఆటంకాలు, అవకతవకలు లేకుండా విజయవంతంగా 25 ఏళ్లు పూర్తి చేసుకుంది ఈ గ్రామానికి చెందిన ఝాన్సీ మహిళా సంఘం. ఇటీవలే సిల్వర్ జూబ్లీ వేడుకలు చేసుకుంది. తమ చేత, తమ కోసం ఏర్పడ్డ ఈ సంఘాన్ని ఆదర్శ సంఘంగా తీర్చిదిద్దిన ఘనత మహిళా శక్తిదే. ముఖ్యంగా వ్యవస్థాపక అధ్యక్షురాలిగా ఉన్న బొక్కల పుష్పలీల ఇప్పటికీ ఆ పదవిలో కొనసాగడం ఓ రికార్డు అనే చెప్పాలి. ఆమెకు చేదోడువాదోడుగా నిలిచే పాలవర్గ సభ్యులు.. అన్నిటికీ మించి తీసుకున్న అప్పును సరైన సమయంలో చెల్లిస్తున్న సభ్యుల సహకారం వల్లే ఈ సంఘం నిర్వహణ విజయవంతంగా కొనసాగుతోంది. 20 రూపాయల(మొదటి సభ్యత్వం)తో మొదలై నేటికి కోటికి పైగా నిధులు సమకూర్చుకుంది. మార్చి 8న అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా వీరి గురించి ప్రత్యేక కథనం. అలా మొదలైంది.. 1997 ఏప్రిల్లో 100 మంది సభ్యులతో ఝాన్సీ మహిళా సంఘం ఏర్పాటైంది. ప్రస్తుతం ఈ సంఘంలో 750 మంది సభ్యులు, 58 మంది మార్గనిర్దేశకులు ఉన్నారు. పాలనా విభాగంలో అధ్యక్షులు, ఉపాధ్యక్షులు, పాలకవర్గ సభ్యులు(డైరెక్టర్లు) ఉంటారు. మొదట్లో ఒక్కో సభ్యురాలు 20 రూపాయలు పొదుపు కట్టేవారు. 600 రూపాయలు జమ అయిన తర్వాత 1800 రూపాయలు అప్పుగా పొందవచ్చు. నెలకు కొంత అసలు, వడ్డీ కలిపి కట్టాల్సి ఉంటుంది. ప్రస్తుతం నెలకు 50 రూపాయల మేర పొదుపు చేస్తున్నారు. తొలినాళ్లలో వడ్డీ వందకు రూ. 2. అయితే, నిధులు సమకూరిన కొద్దీ వడ్డీని తగ్గిస్తూ వచ్చారు. ప్రస్తుతం 75 పైసలుగా ఉంది. ఒక సభ్యురాలికి నియమిత పొదుపును బట్టి గరిష్టంగా 70 వేల రూపాయల వరకు అప్పు ఇస్తారు. క్రమం తప్పకుండా చెల్లించే వారికి ప్రత్యేక అప్పు కింద మరో 40 వేలు ఇస్తారు. కాబట్టి ఏవైనా అవసరాలు ఉన్నవారు వడ్డీ వ్యాపారుల వద్దకు వెళ్లకుండా తమ సంఘం నుంచే తక్కువ వడ్డీకి అప్పు పొందవచ్చు. సభ్యులకు సంఘం ఇన్సూరెన్స్ ప్రీమియం కూడా చెల్లిస్తుంది. ఫిక్స్డ్ డిపాజిట్లు కూడా చేసుకునే వెసలుబాటు ఉంటుంది. గరిష్టంగా లక్ష వరకు ఎఫ్డీ చేసుకోవచ్చు. 8 ఏళ్లకు మెచ్యూర్ అవుతుంది. 9 శాతం వడ్డీ చెల్లిస్తారు. మొదట్లో ఎవరూ పెద్దగా ఆసక్తి చూపలేదు కానీ.. నేను వరంగల్ సహకార సంఘానికి సంబంధించిన శిక్షణ కార్యక్రమానికి వెళ్లినపుడు మా గ్రామంలో కూడా ఇలాంటి సంఘం ఉంటే ఎంతో బాగుంటుంది అనిపించింది. అందుకే ఊరికి తిరిగి రాగానే కొంత మంది మహిళలను కలిసి నా ఆలోచనను పంచుకున్నాను. అందరం కలిసి గ్రామ పంచాయతీ కార్యాలయం వద్దకు వెళ్లి తీర్మానం చేసుకున్నాం. ఇంటింటికీ తిరిగి అవగాహన కల్పించాం. అప్పట్లో రోజూవారీ కూలీ 20 రూపాయలు. అందుకే ఒక్కరోజు వేతనాన్ని పొదుపు మలచుకుందాం అనే నినాదంతో ముందుకు వెళ్లాము. అలా నెలరోజుల్లో 100 మంది సభ్యులుగా చేరారు. తర్వాత కొన్ని వ్యతిరేక గళాలు వినిపించినా ఆత్మవిశ్వాసంతో ముందుకు సాగాం. దినదినాభివృద్ధి చెందుతూ ఇక్కడి దాకా చేరుకున్నాం. కోటికి పైగా నిధులు సమకూరాయి. లెక్కలు చూసేందుకు గణకులు ఉంటారు. ప్రతి ఏడాది ఆడిట్ చేయిస్తాం. ఏడాదికోసారి మహాసభ పెట్టి లెక్కలన్నీ అందరికీ వినిపిస్తాం. మాకంటూ సొంత భవనం ఉంది. 25 ఏళ్లుగా నేను అధ్యక్షురాలిగా ఉన్నాను. ఈ ప్రయాణంలో కొన్ని ఆటుపోట్లు చవిచూశాను. అలాంటి సమయంలో నా భర్త ఎల్లారెడ్డి అందించిన ప్రోత్సాహం మరువలేనిది. -బొక్కల పుష్పలీల, ఝాన్సీ మహిళా సంఘం అధ్యక్షురాలు. అకౌంటెంట్గా పనిచేస్తున్నా సంఘంలో సభ్యురాలిని. 2001 నుంచి ఇక్కడ గణకులుగా పనిచేస్తున్నా. ఉదయం 9 గంటలకు ఆఫీసు తెరుస్తాను. మధ్యాహ్నం ఒంటి గంట వరకు సభ్యులు వచ్చి పొదుపు జమ, అప్పు, వడ్డీ చెల్లిస్తూ ఉంటారు. మొదట్లో నా జీతం 300 రూపాయలు. ఇప్పుడు నెలకు 9600. అధ్యక్షులు, పాలకవర్గ సభ్యుల సూచన మేరకు నా విధి నిర్వర్తిస్తాను. మంచి సంఘంగా మాకు గుర్తింపు ఉంది. -బిజ్జిగిరి తిరుమల, గణకులు నేను సైతం.. సంఘం గురించి వినగానే నేను కూడా అందులో సభ్యురాలినైతే బాగుంటుందని భావించా. రూ. 20 కట్టి సభ్యత్వం తీసుకున్నా. నాతో పాటు నలుగురిని చేర్పించా. ఒక్కో గ్రూపులో ఐదుగురు సభ్యులు ఉంటారు. కుటుంబానికి అవసరం వచ్చిన ప్రతిసారి సంఘం నుంచి అప్పు తీసుకోవడం.. సరైన సమయంలో చెల్లించడం జరుగుతోంది. కొంత డబ్బు ఫిక్స్డ్ కూడా చేసుకున్నా. దానిపై లోన్ తీసుకునే అవకాశం కూడా ఉంటుంది. ఇప్పటికీ మూడుసార్లు డైరెక్టర్గా ఎన్నికయ్యాను. ఏడాదిపాటు ఉపాధ్యక్షురాలిగా పనిచేశాను. సాధారణ నెలవారీ సమావేశాలకు పన్నెండు మంది డైరెక్టర్లు హాజరవుతారు. ఐదో తేదీ నుంచి 30 వరకు అప్పు కట్టే వీలుంటుంది. మొండి బకాయిలు ఉంటే ఇంటికి వసూలుకు వెళ్తాం. -వై. రత్నమాల, డైరెక్టర్ అప్పు పుట్టని పరిస్థితుల్లో ఆపద్భాందవిగా పొలంలో చల్లేందుకు ఎరువులు కొనేందుకు అప్పు పుట్టని పరిస్థితుల్లో సంఘం నన్ను ఆదుకుంది. అవసరం ఉన్నపుడు అప్పు తీసుకోవడం, తర్వాత చెల్లించడం పరిపాటిగా మారింది. నిజంగా పాలిట సంఘం ఆపద్భాందవి అనే చెప్తాను. ఇంత పెద్ద కుటుంబంలో సభ్యురాలిని కావడం సంతోషంగా ఉంది. -శ్రీరాముల ఆగమ్మ, పాలకవర్గ సభ్యురాలు నన్ను సంఘమే ఆదుకుంది సొంత వ్యవసాయ భూమి ఉన్నా కొన్ని అనివార్య కారణాల వల్ల ఉపాధి నిమిత్తం మా కుటుంబం వేరే ఊరికి వెళ్లాల్సి వచ్చింది. దాదాపు 10 ఏళ్ల పాటు అక్కడే ఉండి గ్రామానికి తిరిగి వచ్చాం. తిరిగి వ్యవసాయం మొదలుపెట్టాం. అప్పటికే నేను సంఘంలో సభ్యత్వం తీసుకున్నా. చిన్న చిన్న అవసరాలకు, పెట్టుబడికి ఎక్కడికి వెళ్లాల్సిన అవసరం లేకుండా ఇక్కడే అప్పు తీసుకునేదాన్ని. డైరెక్టర్గా పనిచేశాను. క్రమశిక్షణ కలిగిన సంఘంగా పేరు తెచ్చుకున్న సంస్థలో భాగం కావడం సంతోషంగా ఉంది. - నర్ర రజిత, సభ్యురాలు -సుష్మారెడ్డి యాళ్ల, సాక్షి వెబ్డెస్క్ ప్రత్యేకం -
తెలంగాణ హుజూరాబాద్ అయితది
సంస్థాన్ నారాయణపురం: ప్రజలకు ఇచ్చిన హామీల అమలు విషయంలో ఇప్పటికైనా ప్రభుత్వం కళ్లు తెరవకపోతే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా హుజూరాబాద్ ఫలితం వస్తుందని మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్రెడ్డి అన్నారు. యాదాద్రి భువనగిరి జిల్లా సంస్థాన్ నారాయణపురం మండలం కొత్తగూడెం గ్రామంలో ఐదు నిరుపేద కుటుంబాలకు కోమటిరెడ్డి సుశీలమ్మ ఫౌండేషన్ సహకారంతో నిర్మించిన ఇళ్ల గృహ ప్రవేశం శనివారం జరిగింది. ఈ సందర్భంగా రాజగోపాల్రెడ్డి మాట్లాడుతూ.. ఇటీవల కేసీఆర్ సర్వే చేయిస్తే.. రాజగోపాల్రెడ్డికి ప్రజల్లో మంచి పేరుందని తేలిందని, అందుకే మంత్రి జగదీశ్వర్రెడ్డిని మునుగోడు నియోజకవర్గంలో తిప్పుతున్నాడన్నారు. రోడ్ల అభివృద్ధికి నిధులు తీసుకునిరా.. ఇళ్లులేని వారికి ఇళ్లు ఇప్పించు.. పింఛన్లు లేని వారి ఫింఛన్లు ఇప్పించు.. రేషన్ కార్డులు ఇవ్వు అని ఆయన మంత్రిని డిమాండ్ చేశారు. అవి నెరవేరిస్తే మంత్రిని గౌరవిస్తాం,. సన్మానం చేస్తామన్నారు. అభివృద్ధికి రూపాయి తీసుకురాకున్నా.. కల్యాణలక్ష్మి చెక్కులు, రేషన్ కార్డులు ఇచ్చేందుకు మంత్రి రావాలా? అని ఆయన ప్రశ్నించారు. -
ఉద్యమ బిడ్డను.. భూమి, ఆకాశం ఒక్కటి చేస్తా: ఈటల
హుజూరాబాద్: ‘పేదవారికి నష్టం జరిగితే ఊరుకునేది లేదు. ఈటల అమాయకుడే కావొచ్చు. కానీ, ఉద్యమ బిడ్డ అని మర్చిపోవద్దు. భూమి ఆకాశం ఒకటి చేస్తా’ అని హుజూరాబాద్ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ ప్రభుత్వాన్ని హెచ్చరించారు. హుజూరాబాద్ ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో సోమవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. ప్రగతి భవన్ నుంచి కేసీఆర్, సింగాపూర్లో కూర్చొని హరీశ్ రావు ఎన్నికల సమయంలో హామీలు ఇచ్చారని గుర్తు చేశారు. ‘ఒడ్డు ఎక్కేదాక ఓడ మల్లన్న, ఒడ్డు ఎక్కిన తరువాత బోడ మల్లన్న’ అన్నట్లు కేసీఆర్ పనితీరు ఉందన్నారు. హుజూరాబాద్ ఎన్నికలు అనగానే సీఎంకు దళితులు గుర్తుకొచ్చారని, హుజూరాబాద్లో 21 వేల దళిత కుటుంబాలకు, రూ.21 వేల కోట్లు కలెక్టర్ దగ్గర డిపాజిట్ చేసి, రాత్రికి రాత్రి పాస్బుక్లు ఇచ్చి దళితుల ఓట్లు కొల్లగొట్టే ప్రయత్నం చేశారని విమర్శించారు. దళితబంధు రూ.10 లక్షల మీద కలెక్టర్, బ్యాంక్ల పెత్తనం వద్దని, అన్ని కుటుంబాలకు రూ.10 లక్షలు ఇవ్వాలని డిమాండ్ చేశారు. సీఎం కేసీఆర్పై ప్రజలకు విము ఖత ఉందని తెలిపారు. ‘ఇకనైనా దిగిరా.. ప్రజలకు విశ్వా సం కల్పించు. ఇష్టమొచ్చినట్టు మాట్లాడి ఇదే మా భాష అని తెలంగాణను కించపరచకు’ అని హితవు పలికారు. -
పార్టీ ఆదేశిస్తే కేసీఆర్పైనా పోటీకి సిద్ధం..
సాక్షి, హైదరాబాద్: పార్టీ నాయకత్వం ఆదేశిస్తే సీఎం కేసీఆర్పైనా పోటీ చేసేందుకు సిద్ధమని బీజేపీ నేత, ఎమ్మెల్యే ఈటల రాజేందర్ ప్రకటించారు. అయితే ప్రస్తుతం తాను హుజురాబాద్ ఎమ్మెల్యేగా ఉన్నానని, వచ్చే ఎన్నికల్లో అక్కడి నుంచే పోటీచేయాలని భావిస్తున్నట్టు తెలిపారు. బీజేపీలో తాను మనస్ఫూర్తిగానే కొనసాగుతున్నానని, పార్టీ లు మారే సంస్కృతి తనది కాదని స్పష్టం చేశారు. అన్ని రకాలుగా ఆలోచించుకున్న తర్వాతే తాను బీజేపీలో చేరినట్టు తెలిపారు. టీఆర్ఎస్ను కూడా తాను వీడలేదని, వాళ్లే వెళ్లగొట్టారని స్పష్టం చేశారు. తెలంగాణ జర్నలిస్ట్ యూనియన్ ఆధ్వర్యంలో అధ్యక్షుడు కప్పర ప్రసాదరావు సమన్వయకర్తగా గురువారం జరిగిన ‘మీట్ ద ప్రెస్’కార్యక్రమంలో మీడియా ప్రతినిధుల ప్రశ్నలకు ఈటల బదులిచ్చారు. ‘‘టీఆర్ఎస్ ఎన్నికల మేనిఫెస్టో ఒక చిత్తు కాగితంగా మారింది. అందులోని అంశాలేవి ఆచరణకు నోచుకోవడం లేదు. ఇప్పుడు టీఆర్ఎస్లో ఎవరూ సంతోషంగా లేరు. ఆ పార్టీలో తమకు భవిష్యత్ లేదని చాలా మంది భావిస్తున్నారు. మంత్రిగా నేను ప్రగతిభవన్లోకి వెళ్లకుండా అడ్డుకున్నారు. డబుల్ బెడ్రూం ఇళ్లపై కేబినెట్ సబ్ కమిటీ సిఫార్సులు లేకుండానే విధాన నిర్ణయాలు ప్రకటించారు. ఎన్నికల్లో స్టార్ క్యాంపెయినర్గా అవకాశమివ్వలేదు. చాలా సందర్భాల్లో నా ఆత్మగౌరవాన్ని దెబ్బతీశారు. ఎన్నో రూపాల్లో అవమానించారు. కేబినెట్ మంత్రిగా కాదు... కనీసం మనిషిగా గుర్తించలేదు. నాకే కాదు గతంలో నాయిని నర్సింహారెడ్డి, మహమూద్ అలీ, తదితరులకు కూడా ఇలాంటి అవమానాలు ఎన్నో ఎదురయ్యాయి. తన ముని మనమడు వరకు అధికారంలో ఉండాలంటే తెలంగాణ చైతన్యాన్ని చంపేయాలని కేసీఆర్ కంకణం కట్టుకున్నారు. తెలంగాణలో బీజేపీ జెండా ఎగరడం ఖాయం. రాష్ట్ర పార్టీ అధ్యక్షుడు బండి సంజయ్, కేంద్ర మంత్రి కిషన్రెడ్డి, ఇంకా ఎవరితోనూ విభేదాలు లేవు. అందరం కలిసి బీజేపీని అధికారంలోకి తీసుకొస్తాం’’అని ఈటల అన్నారు. తనలాంటివారికి, వందల ఎకరాలున్న వారికి కూడా రైతుబంధు ఇవ్వడం ఏమిటని ఈటల ప్రశ్నించారు. వడ్ల కొనుగోలు, ఇతర అంశాలపై ముందుచూపు లేకుండా, తన వైఫల్యాలను కేంద్రంపై నెట్టే ప్రయత్నం కేసీఆర్ చేస్తున్నారని విమర్శించారు. -
ఆశ పోయింది.. శ్వాస ఆగింది..కొనుగోలు కేంద్రంలోనే ఆగిన రైతు గుండె
హుజూరాబాద్/జమ్మికుంట: ధాన్యంరాశి వద్ద ఇరవై రోజులుగా పడిగాపులు కాసినా, కొనే నాథుడులేడనే ఆవేదనతో అన్నదాత కన్ను మూశా డు. ఈ విషాదకర ఘటన కరీంనగర్ జిల్లాలో మంగళవారం జరిగింది. జమ్మికుంట మున్సిపల్ పరిధిలోని ఆబాది జమ్మికుంటకు చెందిన బిట్ల ఐలయ్య (59)కు 15 గుంటల వ్యవసాయ భూమి ఉంది. అందులో పండించిన ధాన్యాన్ని అమ్ముకునేందుకు 20 రోజుల క్రితం పీఏసీఎస్ కొనుగోలు కేంద్రానికి తీసుకొచ్చాడు. ధాన్యం తేమగా ఉందని అధికారులు కొర్రీ పెట్టడంతో ఐలయ్య అక్కడే ధాన్యం ఆరబోసి 20 రోజులుగా పడిగాపులు కాస్తున్నాడు. ఎప్పటిలాగే మంగళ వారం మధ్యాహ్నం ఇంటికి వెళ్లి భోజనం చేసి మళ్లీ కొనుగోలు కేంద్రానికి వచ్చాడు. ధాన్యాన్ని గన్నీ సంచుల్లో నింపుతుండగా ఒక్కసారిగా అస్వస్థతకు గురై వడ్ల రాశిపైనే కుప్పకూలి విగతజీవిగా మారాడు. ఆయనకు భార్య లక్ష్మి, కూతురు నిత్య ఉన్నారు. కొనుగోలులో జాప్యం చేయడం వల్లే ఐలయ్య మృతి చెందాడని, మృతుడి కుటుంబానికి రూ.20 లక్షల ఎక్స్గ్రేషియా ఇవ్వాలని బీజేపీ జిల్లా ఉపాధ్యక్షుడు సంపత్రావు డిమాండ్ చేశారు. వడ్లు తెచ్చి 20 రోజులైతాంది వడ్లను కేంద్రానికి తీసుకొచ్చి 20 రోజులైతాంది. తేమ ఉందని ఆరబెట్టాలని సార్లు చెప్పిన్లు. అప్పటిసంది కేంద్రంలోనే రోజూ ధాన్యం ఎండబెడుతున్నం. ఈ రోజు నా భర్త భోజనం చేసి, వడ్లను బస్తాలలో నింపేందుకు పోయిండు. కొద్దిసేపటికే చనిపోయిండని చెప్పిన్లు. నాకు దిక్కెవరు. ప్రభుత్వం ఆదుకోవాలె. – లక్ష్మి, మృతుడి భార్య టోకెన్ ఇచ్చాం ఐలయ్య వారం క్రితం కేంద్రానికి ధాన్యం తీసుకొచ్చాడు. ఆరబెట్టిన తర్వాత ఈ టోకెన్ జారీ చేశాం. ఈరోజు గన్నీ తీసుకొని నింపుతుండగా అస్వస్థతకు గురై గుండెపోటుతో చనిపోయాడని తెలిసింది. – తిరుపతి, పీఏసీఎస్ సెంటర్ ఇన్చార్జి ఐలయ్యది ఆకస్మిక మరణం: అదనపు కలెక్టర్ శ్యాం ప్రసాద్ లాల్ ఐలయ్య ధాన్యాన్ని గన్నీ సంచుల్లో నింపే సమయంలో గుండెపోటుతో మృతి చెందారని అదనపు కలెక్టర్ శ్యాం ప్రసాద్ లాల్ ఒక ప్రకటనలో తెలిపారు. డిసెంబర్ 4న 10–10 రకానికి చెందిన దాదాపు 50 బస్తాల ధాన్యాన్ని తీసుకురాగా, 6న టోకెన్ జారీచేశామని పేర్కొన్నారు. ఐలయ్య మృతిపై జిల్లా సహకార అధికారి కార్యాలయం సీనియర్ ఇన్స్పెక్టర్ ప్రసూనతో విచారణ జరిపించినట్లు పేర్కొన్నారు. -
‘అమ్మానాన్న నన్ను క్షమించండి.. నేను ఉండలేకపోతున్నా’
జమ్మికుంట(హుజూరాబాద్): నిరుద్యోగం, ఆర్థిక ఇబ్బందుల కారణంగా నాలుగు నెలల కిందట భర్త ఆత్మహత్య చేసుకుంటే.. నేడు అతని జ్ఞాపకాలు మరువలేక భార్య ఉరేసుకుంది. నిరుద్యోగి షబ్బీర్ కుటుంబాన్ని విధి వెక్కిరించడాన్ని తల్చుకుంటూ జమ్మికుంట వాసులు కన్నీటిపర్యంతమవుతున్నారు. సీఐ రాంచందర్రావు తెలిపిన వివరాల ప్రకారం.. ఇల్లందకుంట మండలంలోని సిరిసేడు గ్రామానికి చెందిన షబ్బీర్, జమ్మికుంట పట్టణంలోని అంబేద్కర్ కాలనీకి చెందిన రేష్మ(26) 2020లో ప్రేమ వివాహం చేసుకున్నారు. తర్వాత జీవనోపాధి కోసం హైదరాబాద్ వెళ్లారు. ఐటీఐ, డిగ్రీ పూర్తి చేసిన షబ్బీర్ అక్కడ ఓ ప్రైవేటు కంపెనీలో చేరాడు. చదవండి: వ్యభిచార గృహాలపై పోలీసుల దాడి.. నలుగురు అరెస్ట్ కరోనా కారణంగా ఉద్యోగం కోల్పోయి, భార్యతో కలిసి జమ్మికుంట వచ్చాడు. స్థానిక హౌజింగ్బోర్డు కాలనీలో గది అద్దెకు తీసుకున్నారు. కానీ ఇక్కడా అతనికి పని దొరకలేదు. ఉద్యోగ నోటిఫికేషన్లు వస్తే సన్నద్ధం అవుదామనుకుంటే రాలేదు. ప్రైవేటు ఉద్యోగాలకు ప్రయత్నించినా దొరకలేదు. గది అద్దె చెల్లించేందుకు, భార్యను పోషించుకునేందుకు డబ్బు లేకపోవడంతో తీవ్ర మనస్తాపానికి గురయ్యాడు. సూసైడ్ నోట్ రాసి, ఈ ఏడాది ఆగస్టు 1న జమ్మికుంట రైల్వేస్టేషన్లో రైలు కింద పడి, ఆత్మహత్య చేసుకున్నాడు. భర్త మృతి చెందినప్పటి నుంచీ రేష్మ అంబేద్కర్ కాలనీలోని తల్లిగారింట్లో ఉంటోంది. చదవండి: ప్రముఖ సింగర్ హరిణి కుటుంబం అదృశ్యం, ఏకే రావు మృతదేహం లభ్యం ఈ క్రమంలో బుధవారం ఇంట్లో ఎవరూ లేని సమయంలో చున్నీతో ఫ్యాన్కు ఉరేసుకుంది. సీఐ రాంచందర్రావు సంఘటన స్థలాన్ని పరిశీలించారు. అక్కడ సూసైడ్ నోట్ లభించింది. ‘అమ్మానాన్న.. నన్ను క్షమించండి.. నేను ఉండలేకపోతున్న.. షబ్బీర్ జ్ఞాపకాలు ప్రతీ క్షణం గుర్తుకు వస్తున్నాయి. ఇలా క్షణక్షణం చస్తూ బతకడం నా వల్ల కావట్లేదమ్మా.. అందుకే నేను చనిపోవాలని అనుకుంటున్నాను.. చింటు, పప్పుగా అమ్మను, నాన్నను జాగ్రత్తగా చూసుకోండి.. నన్ను క్షమించండి’ అని అందులో రాసిందని సీఐ పేర్కొన్నారు. మృతురాలి సోదరుడు గోపీచంద్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని, దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు. -
ఈటల రాజేందర్పై పూనమ్ కౌర్ ఆసక్తికర వ్యాఖ్యలు
నటి పూనమ్ కౌర్ ఈ మధ్య తరచూ వార్తల్లో నిలుస్తుంది. ఆమె ఎప్పుడు, ఎవరి మీద కామెంట్స్ చేస్తుందో ఎవరికి తెలియదు. ఎందుకు చేస్తుందో కూడా తెలియదు. తాజాగా ఈ పంజాబీ బ్యూటీ హుజూరాబాద్ ఎమ్మెల్యే ఈటల రాజేందర్పై ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. ఇటీవల జరిగిన ఉప ఎన్నికల్లో ఈటల చారిత్రాత్మక విజయాన్ని సొంతం చేసుకున్న సంగతి తెలిసిందే. అయితే ఈ ఎన్నికల్లో గెలుపోటముల గురించి తాజాగా పూనమ్ స్పందించింది. View this post on Instagram A post shared by Poonam kaur (@puunamkhaur) గురునానక్ జయంతి సందర్భంగా ఈటలను ప్రత్యేకంగా కలిసి ఏక్ ఓంకార్ అనే తన మతంలో పవిత్రమైన గుర్తును కానుకగా ఇచ్చింది పూనమ్. అంతేకాకుండా ఆయనతో కలిసి శాంతి కపోతమైనా పావురాన్ని ఎగుర వేసింది. ఈ ఫోటోలను తన ఇన్స్టాలో పోస్ట్ చేస్తూ.. ధర్మ యుద్ధం ఎప్పుడూ గెలుస్తుందంని కామెంట్ చేసింది. అలాగే రైతు చట్టాలు రద్దు చేయడంతో మళ్లీ స్వేచ్ఛ స్వాతంత్ర్యం వచ్చినట్లు అనిపించిందని పూనమ్ కౌర్ అభిప్రాయపడింది. మొత్తానికి పూనమ్ కౌర్ ఇలా కనిపించడంతో నెటిజన్లకు కొత్త అనుమానాలు పుట్టుకొచ్చాయి. పూనమ్ కౌర్ కొంపదీసి బీజేపీలో చేరుతుందా? అని నెటిజన్స్ కామెంట్ చేస్తున్నారు. View this post on Instagram A post shared by Poonam kaur (@puunamkhaur) -
ఢిల్లీకి తాకిన హుజురాబాద్ సెగ
-
హుజూరాబాద్ జోష్; బీజేపీలో విందు రాజకీయాలు
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ బీజేపీలో నేతల విందు రాజకీయాలు జోరందుకుంటున్నాయి. హుజూరాబాద్ ఉపఎన్నికలో పార్టీ అభ్యర్థి ఈటల రాజేందర్ గెలుపుతో జోరు మీదున్న నాయకులు తమ పార్టీలోని నాయకులతో కలిసి విందులు చేసుకుంటున్నారు. కొన్ని నెలలుగా అలుపెరగకుండా వివిధ కార్యక్రవలు, ఆందోళనలు, నిరసనల్లో పాల్గొన్న వారు సేదతీరే ప్రయత్నం చేస్తున్నారు. హుజూరాబాద్ ఉపఎన్నిక, ధాన్యం కొనుగోళ్లు, దళితబంధు అమలు, నిరుద్యోగ సమస్య, రైతుల సమస్యలపై రాష్ట్ర ప్రభుత్వాన్ని ఇరుకున పెట్టేలా పోటాపోటీ కార్యక్రమాల్లో పార్టీ నాయకులు, శ్రేణులు నిమగ్నమైన సంగతి తెలిసిందే. ఈనెల 16న నిరుద్యోగ మిలియన్ మార్చ్, 21 నుంచి రెండో విడత ప్రజాసంగ్రామ యాత్రను మొదలుపెట్టాలని భావించారు. అయితే శాసనమండలిలో స్థానికసంస్థల ప్రతినిధులు, తదితర సీట్లకు ఏర్పడనున్న ఖాళీల భర్తీకి ఈసీ ఎన్నికల షెడ్యల్ విడుదలతో ఈ కార్యక్రమాల నిర్వహణపై పార్టీ పునరాలోచనలో పడింది. ఇదిలా ఉండగా శనివారం రాత్రి నగర శివార్లలోని తమ వ్యవసాయ క్షేత్రంలో రాష్ట్ర పార్టీ నాయకులకు బీజేపీ జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణ విందునిచ్చారు. ఈ విందుకు పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్, జాతీయ కార్యవర్గసభ్యులు, రాష్ట్ర పార్టీ పదాధికారులు, వివిధ మోర్చాల నాయకులు హాజరయ్యారు. నాయకులకు విందు ఇవ్వనున్నట్లు తెలుస్తోంది. వీరి బాటలోనే మరికొందరు ముఖ్యనేతలు కూడా విందులిచ్చేందుకు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నట్లు పార్టీ వర్గాల సవచారం. ఇదిలా ఉంటే.. బీజేపీలో ముఖ్యనేతల మధ్య ఏర్పడిన అంతరాలు, అసంతృప్తులను దూరం చేసుకునేందుకు ఒక రహస్య ప్రదేశంలో శనివారం సమావేశమవుతున్నట్లు కొన్ని సామాజిక మాధ్యమాల్లో పెద్దఎత్తున ప్రచారం జరగడం విందు రాజకీయాలకు కొసమెరుపుగా చెప్పొచ్చు. ముఖ్యనేతల మధ్య ఏదైనా రహస్యభేటీ ఉంటే పరిమితంగా ఐదారు మంది కలుసుకుంటారే తప్ప రాష్ట్ర పార్టీ నాయకులంతా ఒక చోట చేరరన్న విషయాన్ని అర్థం చేసుకోవాలంటూ ఓ బీజేపీ నేత ఈ ప్రచారాన్ని కొట్టిపారేశారు. అయితే శనివారం ఒక ముఖ్య నేత ఇంట్లో జరిగిన సమావేశానికి రాష్ట్ర నేతలు హాజరైనట్లుగా ప్రచారం జరుగుతోంది. ఈ భేటీలో కొందరు నాయకుల మధ్య ఏర్పడిన అంతరాలు, అసంతృప్తులపై చర్చించారని కొందరు చెబుతున్నా అది ధ్రువీకరణ కాలేదు. -
హుజురాబాద్ ఓటమిపై ఏఐసీసీ సమీక్ష
-
హుజురాబాద్ ఫలితాలపై కాంగ్రెస్ అధిష్టానం సీరియస్
-
ఒక ఎలక్షన్ వస్తది.. పీకుతది అది ఇష్యూనే కాదు
-
మ్యాగజైన్ స్టోరీ 04 November 2021
-
నా విజయం ప్రజలకు అంకితం
హుజూరాబాద్: అధికార పార్టీ బెదిరింపులను లెక్క చేయకుండా తనకు అండగా నిలిచిన నియోజకవర్గ ప్రజలకు తన విజయాన్ని అంకితమిస్తున్నట్లు మాజీ మంత్రి, హుజూరాబాద్ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ తెలిపారు. తన చర్మం ఒలిచి చెప్పులు కుట్టించినా వారి రుణం తీరదన్నారు. నియోజకవర్గ ప్రజలంతా కలిసికట్టుగా ఉండి కేసీఆర్ చెంప చెళ్లుమనిపించారని చెప్పారు. బుధవారం హుజూరాబాద్లో ఆయన విలేకరులతో మాట్లాడారు. చరిత్రలో ఇలాంటి ప్రలోభాల ఎన్నిక ఇప్పటివరకు జరగలేదని ఈటల అన్నారు. అధికార పార్టీ ఎన్ని కుట్రలు పన్నినా, నియోజకవర్గ ప్రజలు గుండెను చీల్చి, తమ ఆత్మను ఆవిష్కరించి తనను గెలిపించారంటూ భావోద్వేగానికి గురయ్యారు. కులాల పరంగా చీలిక తెచ్చినా, అధికార పార్టీ నేతలందరూ బెదిరింపులకు పాల్పడినా, ప్రజలు తనను తమ గుండెల్లో పెట్టుకుని భారీ విజయాన్ని అందించారని తెలిపారు. తనను టీఆర్ఎస్ బయటకు పంపాక బీజేపీ అక్కున చేర్చుకుందని, కేంద్రమంత్రి అమిత్షా సంపూర్ణ సహకారం అందించారని చెప్పారు. పార్టీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా, రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ మద్దతుగా నిలిచారని తెలిపారు. ఓయూ, కేయూకు చెందిన వారితో పాటు ఎందరో విద్యార్థులు సహకరించారని, సోషల్ మీడియా వేదికగా కేసీఆర్ కుయుక్తులను చీల్చి చెండాడారని వివరించారు. పోలీసులే డబ్బుల పంపిణీ చేయించారని, హుజూరాబాద్ ప్రజలను అన్ని రకాలుగా భయభ్రాంతులకు గురిచేశారని ఆరోపించారు. కుట్రదారుడు కుట్రలలోనే నాశనం అయిపోతాడన్నారు. రెండు గుంటల భూమి ఉన్న వ్యక్తి రూ.400 కోట్ల డబ్బు ఎలా ఖర్చుపెట్టాడని ప్రశ్నించారు. 2వ తేదీనే నాకు దీపావళి దేశవ్యాప్తంగా ఈ నెల 4న దీపావళి జరుపుకొంటుంటే.. తాను రెండో తేదీనే జరుపుకున్నట్లు ఈటల పేర్కొన్నారు. గతంలో కంటే ఈసారి ఎక్కువ ఓట్లు సాధించానని చెప్పారు. ఇది కేసీఆర్ అహంకారంపై ప్రజల విజయంగా అభివర్ణించారు. దళితబంధు కింద రూ.10 లక్షలు పదిసార్లు ఇచ్చినా తనను మర్చిపోబోమని దళితులు అండగా నిలిచారన్నారు. విలేకరుల సమావేశానంతరం స్థానిక అంబేడ్కర్ విగ్రహానికి పూలమాల వేసి నివాళి అర్పించారు. ఈటల వెంట మాజీ ఎంపీ వివేక్ వెంకటస్వామి, బీజేపీ జిల్లా అధ్యక్షుడు గంగాడి కృష్ణారెడ్డి, మాజీ ఎమ్మెల్యే ఏనుగు రవీందర్రెడ్డి, జిల్లా పరిషత్ మాజీ చైర్పర్సన్ తుల ఉమ ఉన్నారు. ఈటలపై కేసు నమోదు కరీంనగర్ క్రైం: ఎన్నికల నిబంధనలు ఉల్లంఘించి విజయోత్సవర్యాలీలో పాల్గొన్నందుకు హుజూరాబాద్ ఎమ్మెల్యే ఈటల రాజేందర్పై కేసు నమోదు చేసినట్లు కరీంనగర్ త్రీటౌన్ సీఐ దామోదర్రెడ్డి తెలిపారు. సీఐ తెలిపిన వివరాల ప్రకారం.. మంగళవారం రాత్రి ఎన్నికల ఫలితాలు వెలువడిన తర్వాత గెలిచిన ఈటల రాజేందర్, తన అనుచరులు ఊరేగింపుగా కోర్టుప్రాంతం వద్దకు వచ్చారు. ఎన్నికల నియమావళితో పాటు పలు నిబంధనలు ఉల్లంఘించడంతో ఈటల, అతని అనుచరులపై పోలీసులు కేసు నమోదు చేశారు. -
కాంగ్రెస్ లో కాక రేపుతున్న హుజురాబాద్ ఫలితం
-
కుట్రలు, ప్రలోభాలను హుజురాబాద్ ప్రజలు తిప్పికొట్టారు
-
కేసీఆర్ కు హుజురాబాద్ ప్రజలు బుద్ధి చెప్పారు
-
ఆటలో అరటి పండులా మారిన తెలంగాణ కాంగ్రెస్
-
హుజురాబాద్ ఉప ఎన్నికలో టీఆర్ఎస్ కు షాక్
-
హుజూరా‘బాద్’షా ఈటలే...
-
సొంత ఇలాకాలో తిరుగులేదని నిరూపించిన ఈటల
-
TRS అబద్దాలు ప్రజలు అర్ధం చేసుకున్నారు
-
Dalit Bandhu: కేసీఆర్కు షాకిచ్చిన శాలపల్లి ఓటర్లు.. ఈటలకే మద్ధతు
సాక్షి, కరీంనగర్: టీఆర్ఎస్ ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకొచ్చిన దళిత బంధు పథకం హుజురాబాద్లో పెద్దగా ప్రభావం చూపించలేదు. దళిత బంధును తమకు భారీ విజయాన్ని కట్టబెడుతుందని భావించిన కారు పార్టీకి ఎన్నికల ఫలితాల్లో ప్రతికూల పరిస్థితే ఎదురైంది. ఒక్క 8వ రౌండ్, 11వ రౌండ్ మినహా మిగతా అన్నింటిలోనూ బీజేపీ అభ్యర్థి ఈటలకే ఓటర్లు మద్దతు పలికారు. దళిత బంధుతో గెలుపు తమదేనని టీఆర్ఎస్ నేతలు ధీమా వ్యక్తం చేయగా.. అంచనాలకు విరుద్ధంగా ఓటర్లను ఈ పథకం ఏమాత్రం ఆకట్టుకోలేకపోయారు. ముఖ్యంగా ముఖ్యమంత్రి కేసీఆర్ దళితబంధు పథకం ప్రారంభించిన శాలపల్లిలోని ఓటర్లు టీఆర్ఎస్కు బిగ్ షాకిచ్చారు. శాలపల్లిలో టీఆర్ఎస్పై బీజేపీ 129 ఓట్లు ఆధిక్యత సాధించింది. మొత్తం గ్రామంలో బీజేపీకి 311 ఓట్లు పడగా, టీఆర్ఎస్కు 182 ఓట్లు పడ్డాయి. దీంతో టీఆర్ఎస్ ప్రయోగించిన దళితబంధు అస్త్రం ఈ ఎన్నికల్లో ఫలించలేదని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. మొత్తం 22 రౌండ్ల ఫలితాలకు గాను మెజార్టీ రౌండ్లలో బీజేపీ ఆధిక్యం కనబరిచింది. 20 రౌండ్లలో బీజేపీ అభ్యర్థి ఈటల రాజేందర్ ఆధిక్యం సాధించగా, టీఆర్ఎస్ అభ్యర్థి గెల్లు శ్రీనివాస్ 2 రౌండ్లలో మాత్రమే ఆధిక్యం సాధించారు. ఫలితంగా ఈటల 24వేల పైగా ఓట్ల భారీ ఆధిక్యంతో గెలుపొందారు. చదవండి: హుజురాబాద్లో కాషాయ జెండా ఎగరబోతోంది: బండి సంజయ్ -
హుజూరాబాద్ ఉప ఎన్నిక: పోస్టల్ బ్యాలెట్లో టీఆర్ఎస్ ఆధిక్యం
-
Telangana: రాష్ట్రంలో 3 కోట్ల మంది ఓటర్లు!
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ల సంఖ్య మూడు కోట్లు దాటింది. ప్రత్యేక ఓటర్ల జాబితా సవరణ కార్యక్రమం–2022లో భాగంగా ముసాయిదా ఓటర్ల జాబితా సోమవారం ప్రచురించారు. ముసాయిదా జాబితా ప్రకారం రాష్ట్రంలో మొత్తం 3,03,56,665 మంది ఓటర్లు ఉండగా, వీరిలో 1,52,57,690 మంది పురుషులు, 1,50,97,292 మంది మహిళలు, 1,683 మంది ట్రాన్స్జెండర్లు ఉన్నారు. 13,965 మంది పురుషులు, 538 మంది మహిళలు కలిపి మొత్తం 14,503 మంది సర్వీసు ఓటర్లు ఉన్నారు. 5,01,836 మంది దివ్యాంగ ఓటర్లు ఉన్నారు. మరో 2,742 మంది ఎన్ఆర్ఐ ఓటర్లున్నారు. ఈ నెల 30 వరకు ముసాయిదా ఓటర్ల జాబితాపై అభ్యంతరాలతో పాటు కొత్త ఓటర్ల నమోదుకు దరఖాస్తులు స్వీకరించనున్నారు. 2022 జనవరి 1 అర్హత తేదీగా ఆ నాటికి 18 ఏళ్లు నిండిన వ్యక్తులందరూ ఓటర్లుగా నమోదు చేసుకోవడానికి అర్హులు. ఓటర్ల నమోదును ప్రోత్సహించేందుకు ఈ నెల 6, 7, 27, 28 తేదీల్లో ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించాలని ఎన్నికల సంఘం ఆదేశించింది. ముసాయిదా జాబితాపై వచ్చిన అభ్యంతరాలతో పాటు కొత్త ఓటర్ల నమోదుకు వచ్చిన దరఖాస్తులను డిసెంబర్ 20 నాటికి పరిష్కరించి వచ్చే ఏడాది జనవరి 5న తుది ఓటర్ల జాబితా ప్రకటించనున్నారు. 6న హుజూరాబాద్ ముసాయిదా జాబితా.. రాష్ట్రంలో 116 అసెంబ్లీ నియోజకవర్గాలుండగా, 115 నియోజకవర్గాల ముసాయిదా జాబితాలు మాత్రమే ప్రకటించారు. ఉప ఎన్నికలు జరిగిన హుజూరాబాద్ స్థానానికి సంబంధించిన ముసాయిదా జాబితాను ఈ నెల 6న ప్రకటించనున్నారు. డిసెంబర్ 6 వరకు ముసాయిదా జాబితాపై అభ్యంతరాలు, కొత్త ఓటర్ల నమోదుకు దరఖాస్తులను స్వీకరించి డిసెంబర్ 27లోగా పరిష్కరించనున్నారు. 115 అసెంబ్లీ నియోజకవర్గాలతో కలిపి హుజూరాబాద్ స్థానం తుది ఓటర్ల జాబితాను వచ్చే జనవరి 5న ప్రకటిస్తారు. -
హుజురాబాద్ ఉప ఎన్నిక కౌంటింగ్ కు ఏర్పాట్లు పూర్తి
-
హుజురాబాద్ ఉప ఎన్నిక: అవును.. ఆ ఊళ్లో 95.11 శాతం పోలింగ్
సాక్షి, కరీంనగర్: పోలింగ్ 95.11 శాతమేంటీ అనుకుంటున్నారా.. మీరు చదివేది నిజమండి హుజూరాబాద్ ఉప ఎన్నికలో ఓ పోలింగ్ బూత్లో నమోదైన ఓటింగ్ శాతమిది. జిల్లా ఎన్నికల చరిత్రలో హుజూరాబాద్ ప్రత్యేకత చాటుతుండగా ఉప ఎన్నికలో.. అత్యధికంగా ధర్మరాజుపల్లిలో 95.11 శాతం (పోలింగ్ బూత్ 72లో) నమోదైంది. ఇక్కడ 1,002 ఓటర్లకు గాను 953 మంది తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. అత్యల్పంగా జమ్మికుంట 67.13 శాతం(పోలింగ్ బూత్ 170), పోలింగ్ బూత్ 172), హుజూరాబాద్లోని పోలింగ్ కేంద్రం 40లో 69.10 శాతం ఓటింగ్ నమోదవగా మిగతా అన్ని పోలింగ్ బూత్ల్లో 80శాతం దాటడం ఆహ్వానించదగ్గ పరిణామం. చదవండి: Huzurabad Bypoll: బెట్టింగ్ 50 కోట్లు! ఆ 30 గ్రామాలు.. 90 శాతంపైనే ఉప ఎన్నికలో రికార్డు స్థాయిలో 86.33% పోలింగ్ నియోజకవర్గంలోని వీణవంక, జమ్మికుంట, కమలాపూర్, ఇల్లందకుంట మండలాల్లోని పలు గ్రామాల్లో పోలింగ్ 90శాతం దాటడం శుభపరిణామం. ఎక్కడో సుదూర ప్రాంతాల్లో ఉన్నా ఓటు హక్కును సద్వినియోగం చేసుకున్నారు. కార్మికులు, విద్యార్థులు, ఉద్యోగులు వివిధ రాష్ట్రాల్లో ఉన్నప్పటికీ ఓటుపై మమకారం చాటారు. మల్యాల పోలింగ్ బూత్ 235లో 93.57శాతం నమోదవగా, 1,011 మంది ఓటర్లకు గాను 946 మంది ఓటేశారు. గునిపర్తి 282 పోలింగ్ కేంద్రంలో 93.41శాతం నమోదవగా 607కు 567 మంది ఓటు వేశారు. నేరెళ్ల (284)లో 92.96 శాతం నమోదవగా 582కు 541 మంది ఓటు వేశారు. చదవండి: Huzurabad Bypoll: ఉప ఎన్నికలో రికార్డు స్థాయిలో 86.33% పోలింగ్ సిరిసేడులో 92.94 శాతం, చిన్నకోమట్పల్లి (223)లో 92.81 శాతం, హుజూరాబాద్(27)లో 92.70 శాతం, దేశ్రాజ్పల్లి (302)లో 92.51 శాతం, టేకుర్తి (222)లో 92.31 శాతం, గంగారాం(125)లో 91.92 శాతం, మల్లన్నపల్లి(119)లో 91.87 శాతం, సీతంపేటలో 91.86 శాతం, నాగంపేట, కందుగులలో 91.68 శాతం, వంతడ్పుల 91.61 శాతం, శాయంపేట 91.41 శాతం, నాగారం 91.32 శాతం, వంగపల్లి, పంగిడిపల్లి, కనగర్తి, భీంపల్లి, వెంకటేశ్వర్లపల్లి, అంబాల, వంతడ్పుల, గూడూరు, కేశవపూర్, గండ్రపల్లి, బేతిగల్, బొంతుపల్లి, దమ్మక్కపేట గ్రామాల్లో 90 శాతానికి పైగా ఓటర్లు తమ ఓటును వినియోగించుకున్నారు. -
కేసీఆర్ ప్రజావిశ్వాసాన్ని కోల్పోయారు
హుజూరాబాద్: ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రజావిశ్వాసం కోల్పోయారని మాజీ మంత్రి, బీజేపీ నేత ఈటల రాజేందర్ అన్నారు. గెలవలేక నీచమైన పనులు చేస్తున్నారని ఆరోపించారు. ధర్మాన్ని కాపాడుకునేందుకు హుజూరాబాద్ ప్రజలు చేసిన సాహసం చరిత్రలో నిలిచిపోతుందన్నారు. హుజూరాబాద్లో ఆదివారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మాట్లాడారు. హుజూరాబాద్లో ఆర్నెల్లుగా అధికార పార్టీ ఆగడాలను నిలువరించడంలో కలెక్టర్, సీపీలు ఉదాసీనంగా వ్యవహరించారన్నారు. ఎన్నికల నోటిఫికేషన్ వచ్చిన తరువాత సీఎం కేసీఆర్ దళితబంధు జీవో ఇవ్వడం పెద్ద ఉల్లంఘన అన్నారు. మంత్రులు, ఎమ్మెల్యేలు, నాయకులు ఇక్కడే తిష్టవేసి ఓటువేయకుంటే దళితబంధు, పెన్షన్ రాదని ప్రజలను బెదిరించారని, కలెక్టర్, సీపీకి ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదని తెలిపారు. ప్రజాస్వామ్యాన్ని అధికారపార్టీ ఖూనీ చేసిందని, డబ్బు, మద్యం వాహనాలను పోలీసు ఎస్కార్ట్ పెట్టి మరీ తరలించిందని, డబ్బులు పంచేవారికి పోలీసులు బందోబస్తు కల్పించారని ఆరోపించారు. టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు స్వయంగా డబ్బులు పంచి వెళ్లారన్నారు. బస్సుల్లో తరలిస్తున్న ఈవీఎంలను మార్చినట్టు వార్తలు వస్తున్నాయని, దీనిపై ఎన్నికల కమిషన్కు ఫిర్యాదు చేస్తామని తెలిపారు. ధర్మానిదే అంతిమ విజయమని ఈటల ధీమా వ్యక్తం చేశారు. సమావేశంలో పార్టీ జిల్లా అధ్యక్షుడు గంగాడి కృష్ణారెడ్డి, జెడ్పీ మాజీ చైర్పర్సన్ తుల ఉమ, నాయకులు సంపత్రావు ఉన్నారు. -
వీవీ ప్యాట్ల అంశంపై సమగ్ర వివరణకు సీఈవో ఆదేశం
హైదరాబాద్: హుజురాబాద్ ఉప ఎన్నికల సందర్భంగా వీవీ ప్యాట్లు తారుమారయ్యాయని బీజేపీ నాయకులు రాష్ట్ర ఎన్నికల అధికారి శశాంక్ గోయల్కు ఫిర్యాదు చేసిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో.. సీఈవో శశాంక్ గోయల్ ఎన్నికల అధికారులతో ఆదివారం వీడియో కాన్ఫరెన్స్ సమావేశం నిర్వహించారు. వీవీ ప్యాట్ల అంశంపై సమగ్ర వివరణ ఇవ్వాలని కలెక్టర్, వీఆర్వోలకు ఆదేశాలు జారీచేశారు. రేపు (సోమవారం) అన్ని పార్టీల నేతలతో సీఈవో శశాంక్ గోయల్ భేటీకానున్నారు. చదవండి: టీఆర్ఎస్ ఎమ్మెల్యేలే స్వయంగా డబ్బు పంచారు: ఈటల -
కొన్నిచోట్ల డబ్బుల పంపిణీపై ఫిర్యాదులు వచ్చాయి: శశాంక్ గోయల్
-
హుజురాబాద్ ఎన్నికల పోలింగ్ (ఫోటోలు)
-
Huzurabad Bypoll: కౌశిక్ రెడ్డిని అడ్డుకున్న గ్రామస్థులు
-
ఇల్లంతకుంట మండలం మల్లాల గ్రామంలో ఉద్రిక్తత
-
ఓటేసిన ఈటల దంపతులు
-
కొనసాగుతున్న హుజూరాబాద్ ఉప ఎన్నిక పోలింగ్
-
Huzurabad Bypoll: రేపు ఉపఎన్నికకు పోలింగ్
-
ఓటరు ఎటువైపు?.. కీలకంగా చివరి 24 గంటలు
సాక్షి, హైదరాబాద్: హుజూరాబాద్ ఉప ఎన్నిక పోలింగ్కు ఇంకా ఒక్క రోజే ఉండటంతో సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. ఓటర్ల తీర్పు ఎటువైపు ఉం టుందోనన్న ఆసక్తి కనిపిస్తోంది. శనివారం ఉద యం 7 గంటలకు పోలింగ్ ప్రారంభం కానుండటంతో.. ప్రధాన పార్టీలు ఓటర్లకు గాలం వేసేందుకు చివరి ప్రయత్నాలు చేస్తున్నాయి. కీలక నేతలు నియోజకవర్గాన్ని వదిలి వెళ్లినా కూడా ఫోన్ల ద్వారా స్థానిక నేతలతో పూర్తిస్థాయిలో టచ్లో ఉంటున్నారు. పరిస్థితిని ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తూ.. ఉన్న కాస్త సమయాన్ని ఎలా ‘సద్వినియోగం’ చేసుకోవాలనే దానిపై ఆదేశాలు, సూచనలు ఇస్తున్నారు. ఏ మాత్రం పరిస్థితి చేయి దాటిపోకుండా అభ్యర్థులు, వారి అనుచరులు సర్వశక్తులు ఒడ్డుతున్నారు. ఈ క్రమంలో డబ్బు, మద్యం, ఇతర బహుమతుల పంపిణీ భారీ ఎత్తున కొనసాగుతోందని స్థానికులు చెప్తున్నారు. (చదవండి: Jagtial Crime News: ముగ్గురు స్నేహితురాళ్ల ఆత్మహత్య?) అంచనాలకు అందకుండా.. ఉప ఎన్నికపై రాష్ట్రవ్యాప్తంగా అనేక ఊహాగానాలు సాగుతున్నాయి. కానీ హుజూరాబాద్ నియోజకవర్గం పరిధిలో మాత్రం పరిస్థితి అంచనాలకు అందడం లేదని విశ్లేషకులు చెప్తున్నారు. ప్రచారంలో టీఆర్ఎస్, బీజేపీ శ్రేణులు నువ్వా, నేనా అన్నట్టుగా వ్యవహరించాయని.. పోలింగ్ మొదలైతేగానీ ఎవరి ప్రభావం ఎంతవరకు ఉంటుందన్నది స్పష్టంగా తెలిసే అవకాశం లేదని అంటున్నారు. ఇక ఓటర్లలో చాలా వరకు గుంభనంగా వ్యవహరిస్తున్నారని ప్రధాన పార్టీల స్థానిక నేతలు చెప్తున్నారు. ఎవరినైనా పలకరిస్తే.. ఇప్పుడే ఏమీ చెప్పలేం అంటున్నారని, పోలింగ్ నాడే నిర్ణయించుకుంటామని చెప్తున్నారని పేర్కొంటున్నారు. ప్రతిష్టాత్మకంగా తీసుకుని.. టీఆర్ఎస్, బీజేపీ, కాంగ్రెస్ పార్టీలకు ఈ ఉప ఎన్నిక ప్రతిష్టాత్మకంగా మారింది. టీఆర్ఎస్కు రాజీనామా చేసి బీజేపీ తరఫున బరిలోకి దిగిన ఈటల రాజేందర్.. ఎలాగైనా గెలిచి పరువు నిలబెట్టుకోవాలన్న ఆలోచనతో ఉన్నారు. ఈటలను ఓడించి, తమ అభ్యర్థిని గెలిపించుకుని ప్రజల మద్దతు తమకే ఉందని నిరూపించుకోవాలని టీఆర్ఎస్ పట్టుదలతో వ్యవహరిస్తోంది. మరోవైపు రేవంత్రెడ్డి పీసీసీ చీఫ్ అయిన తర్వాత జరుగుతున్న తొలి ఉప ఎన్నిక కావడం, రాష్ట్రంలో తిరిగి బలం పుంజుకోవాలన్న ఉద్దేశంతో కాంగ్రెస్ పార్టీ ప్రచారం నిర్వహించింది. మొత్తంగా ప్రధాన పార్టీలన్నీ కూడా ఏ చిన్న అవకాశాన్ని కూడా వదులుకోవద్దు అన్నట్టుగా శ్రమిస్తున్నాయి. భారీగా డబ్బు, మద్యం పంపిణీ జరుగుతోందంటూ ప్రచారం జరుగుతుండటంతో ఎన్నికల సంఘం కూడా స్పందించింది. గట్టిగా నిఘా పెట్టాలని, శాంతిభద్రతల సమస్య తలెత్తకుండా చర్యలు చేపట్టాలని అధికారులు, పోలీసు సిబ్బందిని ఆదేశించింది. (చదవండి: బద్వేలు బరిలో లోపాయికారీ పొత్తులు!) ప్రలోభాల ‘వార్’! డబ్బులు, మద్యం పంపిణీకి సంబంధించి వాట్సాప్, ఫేస్బుక్ తదితర సోషల్ మీడియా యాప్స్లో విపరీతంగా పోస్టులు హల్చల్ చేస్తున్నాయి. ఒకపార్టీ ఓటుకు రూ.6 వేలు, ప్రతిగా మరోపార్టీ రూ.10 వేలు పంచుతున్నట్టుగా వీడియోలు వైరల్ అయ్యాయి. ఇందుకు అనుగుణంగా తమకు డబ్బులు రావడం లేదంటూ పలు గ్రామాల్లో జనం ఆందోళనలు చేయడం మరింత ఆసక్తిగా మారింది. బుధవారం హుజూరాబాద్, జమ్మికుంట మండలాల్లో రెండు, మూడు చోట్ల కొందరు నిరసనలు తెలిపారు. గురువారం కూడా హుజూరాబాద్, వీణవంక, ఇల్లందకుంట, జమ్మికుంట, కమలాపూర్ మండలాల్లో, రెండు మున్సిపాలిటీల పరిధిలోని పలుప్రాంతాల్లో కొందరు గుమిగూడి తమకు డబ్బులు రాలేదంటూ ధర్నాలు చేశారు. స్థానిక నేతలు తమకు పంచాల్సిన డబ్బును నొక్కేస్తున్నారని కొందరు ఆరోపణలు చేయడం, తమకు ఇవ్వడం లేదని నిలదీయడం వంటి ఘటనలు జరిగాయి. జోరుగా బెట్టింగ్లు రాష్ట్రవ్యాప్తంగా హుజూరాబాద్ ఉప ఎన్నికపై ఆసక్తి నెలకొనగా.. దీనిని సొమ్ము చేసుకునేందుకు బెట్టింగ్ దందాలు మొదలైనట్టు సమాచారం. శనివారం ఓటింగ్ సరళి ఎలా ఉండబోతోంది? పోలింగ్ శాతం పెరుగుతుందా, తగ్గుతుందా? ఎవరు గెలుస్తారు? ఎంత మెజార్టీ వస్తుంది? అన్న దానిపై విస్తృతంగా బెట్టింగ్ జరుగుతున్నట్టు తెలిసింది. ప్రస్తుతమున్న అంచనాల మేరకు పోటాపోటీ నెలకొనే అవకాశం ఉందని.. అందువల్ల ప్రధాన పార్టీల మధ్య సమాన స్థాయిలో పందేలు నమోదవుతున్నాయని స్థానికులు చెప్తున్నారు. శనివారం పోలింగ్ సరళిని బట్టి బెట్టింగ్ ఊపందుకునే అవకాశం ఉందని పేర్కొంటున్నారు. ఎవరి ధీమా వారిదే.. హుజూరాబాద్ ఉప ఎన్నికలో గెలుపు తమదంటే తమదని టీఆర్ఎస్, బీజేపీ ముఖ్య నేతలు ధీమా వ్యక్తం చేస్తుండగా.. కాంగ్రెస్ గణనీయంగా ఓట్లు సాధిస్తుందని ఆ పార్టీ వర్గాలు చెప్తున్నాయి. టీఆర్ఎస్ తరఫున అన్నీతానే ప్రచారాన్ని ఉరకలెత్తించిన మంత్రి హరీశ్రావు.. ఏడున్నరేళ్ల పాలనలో సాధించిన అభివృద్ధే తమను గెలిపిస్తుందని విశ్వాసాన్ని వ్యక్తం చేస్తున్నారు. దుబ్బాక, జీహెచ్ఎంసీ ఎన్నికల్లో తరహాలోనే హుజూరాబాద్లోనూ బీజేపీ ఊపు ఉంటుందని, గెలిచేది తామేనని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ ధీమాగా చెప్తున్నారు. టీఆర్ఎస్, బీజేపీ రెండూ అధికార దుర్వినియోగానికి, ప్రలోభాలకు దిగాయని.. ప్రజలు తమ కోసం పోరాడే కాంగ్రెస్ పార్టీని గెలిపించుకుంటారని పీసీసీ అధ్యక్షుడు రేవంత్రెడ్డి అంటున్నారు. (చదవండి: ఎవరిని మభ్య పెట్టడానికి దీక్ష?) -
హుజురాబాద్: ఓటర్లను కొనుగోలు చేస్తున్న పార్టీలు
-
హుజురాబాద్ లో గందరగోళం
-
దళిత బంధుపై దాఖలైన 4 పిటిషన్లను కొట్టివేసిన హైకోర్టు
-
దళిత బంధుపై దాఖలైన 4 పిటిషన్లను కొట్టివేసిన హైకోర్టు
సాక్షి, హైదరాబాద్: దళిత బంధుపై దాఖలైన నాలుగు పిటిషన్లను తెలంగాణ హైకోర్టు కొట్టివేసింది. ఎలక్షన్ కమిషన్ ఉత్తర్వులను రద్దు చేయాలన్న అభ్యర్థనను హైకోర్టు తోసిపుచ్చింది. ఈసీ విషయంలో తాము జోక్యం చేసుకోలేమని హైకోర్టు స్పష్టం చేసింది. కాగా హుజురాబాద్ ఉప ఎన్నిక నేపథ్యంలో అక్కడ దళితబంధును ఆపాలంటూ కేంద్ర ఎన్నికల సంఘం ఉత్తర్వులు జారీ చేయగా.. ఈసీ ఉత్తర్వులను సవాలు చేస్తూ సామాజిక కార్యకర్త మల్లేపల్లి లక్ష్మయ్య, కాంగ్రెస్ నేత జడ్సన్లు వేర్వేరుగా పిటిషన్లు దాఖలు చేసిన విషయం తెలిసిందే. చదవండి: హుజురాబాద్:అసలీ పోలింగ్ కేంద్రమేంటి? ఎవరెవరి పాత్ర ఎంత? ఓటు వేయడమెలా? అలాగే ఉప ఎన్నిక పూర్తయ్యే వరకు ప్రజలకు నేరుగా లబ్ధి చేకూర్చే పథకాలను నిలిపివేయాలంటూ వాచ్ వాయిస్ ఆఫ్ పీపుల్స్ సంస్థ దాఖలు చేసిన పిటిషన్లను కూడా కలిపి విచారణ జరిపిన ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సతీష్చంద్ర శర్మ, జస్టిస్ ఎ.రాజశేఖర్రెడ్డిలతో కూడిన ధర్మాసనం.. గురువారం నాలుగు పిటిషన్లను కొట్టివేస్తూ తీర్పునిచ్చింది. నిష్పక్షపాత ఎన్నికల కోసం తగిన నిర్ణయాలు తీసుకునే అధికారం ఈసీకి ఉంటుందని హైకోర్టు పేర్కొంది. ఈ మేరకు మల్లేపల్లి లక్ష్మయ్య, జడ్సన్ పిటిషన్లను హైకోర్టు కొట్టివేసింది. చదవండి: హుజురాబాద్ ఉప ఎన్నిక: 2 రోజులు..రూ.3 కోట్ల కిక్కు -
హుజూరాబాద్కు సంజయ్ చేసిందేంటి?
హుజూరాబాద్: ఎంపీగా హుజూరాబాద్ నియోజకవర్గానికి బండి సంజయ్ చేసిందేమీ లేదని పశుసంవర్ధక శాఖ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ ఆరోపించారు. బుధవారం హుజూరాబాద్లోని టీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో ఏర్పాటుచేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. రాష్ట్ర ప్రభుత్వం చేసిన అభివృద్ధి ఏమిటో చెప్తామని.. ప్రజలకు మీరేం చేశారో చెప్పే ధైర్యం బీజేపీ నాయకులకు ఉందా అని ప్రశ్నించారు. గడిచిన ఏడేళ్ల కాలంలో జరిగిన అభివృద్ధి కళ్ల ముందు కనిపిస్తోందన్నారు. పెట్రోల్, డీజిల్, గ్యాస్ ధరలు పెంచడమే బీజేపీ చేసిన అభివృద్ధా అని ప్రశ్నించారు. ఓటమి భయంతోనే బీజేపీ నాయకులు ప్రభుత్వంపై లేనిపోని ఆరోపణలు చేస్తున్నారని మండిపడ్డారు. ఎంపీగా వ్యవహరిస్తున్న బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు.. రాష్ట్ర ముఖ్యమంత్రిపై చేసిన వ్యాఖ్యలు బాధ్యతారాహిత్యంగా ఉన్నాయని, నోరు అదుపులో పెట్టుకొని మాట్లాడాలని బీజేపీ నాయకులకు హితవు పలికారు. మరో మంత్రి గంగుల కమలాకర్ మాట్లాడుతూ, రైతులు పండించిన ధాన్యాన్ని కొనలేమని కేంద్ర ప్రభుత్వమే రాష్ట్ర పౌరసరఫరాల శాఖకు లేఖ రాసిందని, బీజేపీ నాయకులు పచ్చి అబద్ధాలు మాట్లాడుతున్నారని విమర్శించారు. ఈటల రాజేందర్ చేసిన ఆరోపణలపై మంత్రి ఓటర్లకు డబ్బులు పంచుతున్నారని బండి సంజయ్ టీఆర్ఎస్పై బురద జల్లే ప్రయత్నం చేస్తున్నారని చెప్పారు. మంత్రి కొప్పుల ఈశ్వర్ మాట్లాడుతూ, దళిత బంధుపై బీజేపీ నాయకులు అసత్యాలు మాట్లాడుతున్నారని ఆరోపించారు. -
హుజురాబాద్: మంత్రులు బస చేసిన కిట్స్ కాలేజీలో సోదాలు
-
హుజురాబాద్ ఉపఎన్నిక ప్రచారానికి నేటితో తెర
-
చివరి దశకు చేరుకున్న బుద్వేలు, హుజురాబాద్ ఉపఎన్నికల ప్రచారం
-
బీజేపీ గెలిచేది లేదు.. ప్రభుత్వం వచ్చేది లేదు
హుజూరాబాద్: ‘హుజూరాబాద్ ఉపఎన్నికల్లో బీజేపీ గెలిచేది లేదు. ప్రభుత్వం వచ్చేది లేదు. ఈటల మంత్రి అయ్యేది లేదు’ అని ఆర్థిక శాఖమంత్రి హరీశ్రావు వ్యాఖ్యానించారు. మంగళవారం మండలంలోని సింగాపురంలో జరిగిన టీఆర్ఎస్ ఎన్నికల ప్రచారంలో ఆయన మాట్లాడారు. తమకు అన్నం పెట్టి, ఆతిథ్యం ఇచ్చిన ఊరు సింగాపురం అన్నారు. ‘ఆసరా పింఛన్, కల్యాణలక్ష్మి కడుపు నింపవని రాజేందర్ అన్నడు. కేసీఆర్ కిట్ పనికి రాదట. రైతుబంధు దండగ అట. ఆసరా పెన్షన్ పరిగ ఏరుకున్నట్లు అని రాజేందర్ అన్నడు’ అని చెప్పారు. ‘రాజేందర్ నీవు శ్రీమంతుడివి. నీకు అవసరం లేకపోవచ్చు కానీ ఓ అవ్వకు కొండంత ఆత్మవిశ్వాసం కల్పించింది ఆసరా పెన్షన్’ అని తెలిపారు. బీజేపీ, ఈటల రాజేందర్ హుజూరా బాద్కు ఏం చేశారో చెప్పాలని డిమాండ్ చేశారు. అబద్ధాల బీజేపీ మాటలు నమ్మొద్దని, టీఆర్ఎస్ ప్రభుత్వం మంచిగా నడుస్తుందని, ధరలు పెంచిన బీజేపీ తమకెందుకని ప్రశ్నించారు. -
ఏమిచ్చినా తీసుకోండి.. ఒట్టు వేయకండి
ఇల్లందకుంట (హుజూరాబాద్)/ కమలాపూర్: ‘టీఆర్ఎస్ పార్టీ ఏమిచ్చినా తీసుకోండి. కానీ ఒట్టు పెట్టకండి. అధికార పార్టీ ఓడిపోతుందని నిర్ధారణ అయింది. అందుకే నా మీద దాడికి ప్రయత్నం చేస్తున్నారు. నాకు అండగా ఉండండి’ అంటూ మాజీ మంత్రి బీజేపీ అభ్యర్థి ఈటల రాజేందర్ అన్నారు. మంగళవారం కరీంనగర్ జిల్లా ఇల్లందకుంట మండలంలోని శ్రీరాములపల్లి, కనగర్తి, లక్ష్మాజిపల్లి, మల్యాల గ్రామాల్లో ఆయన ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఈటల మాట్లాడుతూ, డబ్బులు ఇచ్చి ప్రమాణం చేయమని మాట తీసుకుంటున్నారని, ఈ విషయంపై ఎన్నికల కమిషన్కు ఫిర్యాదు చేస్తానని తెలిపారు. కేసీఆర్ అహంకారం వల్ల వచ్చిన ఎన్నికలలో ప్రజలు తగిన గుణపాఠం చెప్పాలని కోరారు. ఇప్పటివరకు తడిసిపోయిన వడ్ల మొఖం చూడలేదుగానీ.. తనను ఓడగొట్టడమే లక్ష్యంగా టీఆర్ఎస్ మంత్రులు, ఎమ్మెల్యేలు పనిచేస్తున్నారని ధ్వజమెత్తారు. కేసీఆర్ ఇచ్చిన హామీలు అమలు చేసేవరకు ప్రజల గొంతుకగా అసెంబ్లీలో అడుగుపెడతానని అన్నారు. ఈటల గెలిస్తే ప«థకాలు వెనక్కిపోతాయని అంటున్నారని, ఏ ఒక్క పథకం కూడా పోదని పేర్కొన్నారు. దళితబంధు పథకం దళితులందరికీ షరతులు లేకుండా ఇవ్వాలని, అలాగే బీసీబంధు కూడా ఇవ్వాలని ఓబీసీ మోర్చా జాతీయ అధ్యక్షుడు లక్ష్మణ్బాబు కోరారు. కార్యక్రమంలో మాజీ ఎంపీ జితేందర్రెడ్డి, బాబూమోహన్, జూజుల శ్రీనివాస్, బొడిగె శోభ తదితరులు పాల్గొన్నారు. స్వేచ్ఛ, హక్కులను కాలరాస్తున్నారు.. ప్రజల వ్యక్తిగత స్వేచ్ఛను, హక్కులను టీఆర్ఎస్ కాలరాస్తోందని ఈటల రాజేందర్ ఆరోపించారు. హనుమకొండ జిల్లా కమలాపూర్లో మంగళవారం ఆయన మీడియాతో మాట్లాడారు. హుజూరాబాద్ లో ఆరు నెలలుగా లిక్కర్ బాటిళ్లు, నోట్ల కట్టలు, కుట్రలు, కుతంత్రాల పర్వం కొనసాగుతోం దన్నారు. టీఆర్ఎస్కు ప్రచారం చేయకపోయినా, ఓటు వేయకపోయినా ఔట్ సోర్సింగ్ ఉద్యోగులను ఉద్యోగాల నుంచి తీసేస్తున్నారని, పర్మనెంట్ ఉద్యోగులను బదిలీ చేస్తున్నారని.. ఇన్ని ప్రతిబంధకాల మధ్య హుజూరాబాద్ ప్రజలు నలిగిపోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. అయినప్పటికీ తమ గుండెలో ఉన్న ఈటలకే ఈనెల 30న ఓటు వేసి గెలిపిస్తామని ప్రజలు చెబుతున్నారన్నారు. -
హుజురాబాద్ లో కాషాయ జెండా ఎగరేస్తాం
-
హుజురాబాద్ లో ఎన్నికల ప్రచారంలో మంత్రి హరీష్ రావు
-
పొమ్మనలేక పొగపెట్టారు: ఈటల
హుజూరాబాద్: ‘నాకు అవకాశాలిచ్చారు. తమ్ముడన్నారు. నా జీతం కూడా ఈటల రాజేందర్ ఇస్తారు అన్నవారు ఎందుకు గొంతు నులిమారు? ఎర్రబెల్లి, మల్లారెడ్డి, సబితాలాగా నేను మధ్యలో వచ్చిన వాణ్ణి కాదు. సొంత పార్టీ నేతల్ని కొన్న నీచపు పార్టీ టీఆర్ఎస్. నన్ను పొమ్మనలేక పొగపెట్టి వెన్ను పోటు పొడిచారు. 18 ఏళ్లు ఉద్యమంలో వాడుకుని తెలంగాణ వచ్చిన తర్వాత బయటికి పంపిం చిండు’ అని మాజీమంత్రి, బీజేపీ అభ్యర్థి ఈటల రాజేందర్ ఆవేదన చెందారు. శనివారం హుజూ రాబాద్ మండలం సింగాపూర్, మాందాడిపల్లి, చిన్నపాపయ్యపల్లి, తుమ్మనపల్లి, హుజూరాబాద్ పట్టణాల్లోని పలు వార్డుల్లో ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈటల మాట్లాడుతూ..తాను సంక్షేమ పథకాలకు వ్యతిరేకం కాదని, ప్రభుత్వసొమ్ము పేదలకు మాత్రమే చేరాలని అన్నానని చెప్పారు. రైతుబంధు డబ్బున్నవారికి ఇవ్వొద్దని, కౌలు రైతులకు ఇవ్వాలని చెప్పడం తప్పా? అది ధిక్కారం అవుతుందా? అని నిలదీశారు. ‘పదవుల కోసం పెదవులు మూయవద్దు. జెండాకి ఓనర్లం అని చెప్పిన. అప్పటి నుంచే కేసీఆర్ రాసి రంపాన పెట్టిండు. కేసీఆర్ వారసత్వం ఎప్పుడు వస్తుందో నన్న ఆశతో అవమానాలు భరిస్తూ హరీశ్రావు అక్కడే ఉంటున్నార’ని అన్నారు. కేటీఆర్ ఈ ఎన్నికలు చిన్నవి అంటూ రూ.350 కోట్లు ఎందుకు ఖర్చు పెట్టారని ప్రశ్నించారు. కేసీఆర్ పాలనపై బీజేపీ జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణ హుజూరాబాద్లో చార్జ్షీట్ విడుదల చేశారు. అనంతరం విలేకరులతో మాట్లాడుతూ కేసీఆర్ తెలంగాణతల్లిని బందీని చేసి దోచుకుంటున్నారని, మోసం చేయడం ఆయన నైజమని విమర్శించారు. -
ఇంత బరితెగింపు ఎక్కడా చూడలేదు
సాక్షి ప్రతినిధి, వరంగల్: తెలంగాణ రాష్ట్రంలో కేసీఆర్ కుటుంబపాలన సాగుతోందని కేంద్ర పర్యాటక, సాంస్కృతిక శాఖల మంత్రి జి.కిషన్రెడ్డి విమర్శించారు. తండ్రీకొడుకులు, మామ అల్లుళ్లు, బావబామ్మర్దుల పాలనకు ప్రజలు త్వరలోనే చరమగీతం పాడుతారన్నారు. అబద్ధాలు ప్రచారంచేసి, అడ్డదారిలో అధికారంలోకి రావాలనుకునే రోజులు పోయాయని, హుజూరాబాద్ ఉప ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థి గెలుపు ఖాయమని పేర్కొన్నారు. శనివారం హనుమకొండలోని హరిత కాకతీయ హోటల్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో కిషన్రెడ్డి మాట్లాడారు. ‘దేశంలో ఎన్నో రాష్ట్రాలు, ఎన్నో ప్రాంతాల్లో ఎన్నికలు చూశాం. కానీ హుజూరాబాద్ లాంటి ఉప ఎన్నికలు ఎప్పుడూ చూడలేదు. రాష్ట్రంలో అధికారంలో ఉన్న పార్టీ ఇంతగా బరితెగించింది ఎక్కడా లేదు. డబ్బు, మద్యం పంచడంతోపాటు ప్రజలను ప్రలోభాలకు, బెదిరింపులకు గురి చేస్తూ టీఆర్ఎస్ అధికార దుర్వినియోగానికి పాల్పడుతోంది’అని ఆయన ఆరోపించారు. దేశవ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీ తమకు బద్దశత్రువని, అలాంటి పార్టీతో చీకటి ఒప్పందం జరిగిందని ఆరోపించడం సిగ్గుచేటన్న కిషన్రెడ్డి, ఏ పార్టీల మధ్య చీకటి ఒప్పందం, బహిరంగ ఒప్పందాలున్నాయో ప్రజలకు తెలుసని అన్నారు. టీఆర్ఎస్ ఎన్ని ప్రలోభాలకు గురిచేసినా, డబ్బులు, మద్యం ఏరులై పారించినా హుజూరాబాద్ నియోజకవర్గ ప్రజలు బీజేపీ వైపే ఉన్నారన్నారు. శవాల దగ్గర పేలాలు ఏరుకునే స్వభావమున్న నేతలు పెట్రోల్ ధరలపై రాద్ధాంతం చేస్తున్నారని, లీటర్కు రూ.40 పైచిలుకు రాష్ట్రానికి ఆదాయం వస్తుండగా, సీఎం ఎందుకు తగ్గించడం లేదని ఎద్దేవా చేశారు. హుజూరాబాద్ ఎన్నికల ఫలితాలు తప్పకుండా రాష్ట్ర రాజకీయాలపై ప్రభావం చూపుతాయని, భవిష్యత్లో టీఆర్ఎస్కు ప్రజలు గుణపాఠం చెప్తారని విలేకరులు అడిగిన ఓ ప్రశ్నకు సమాధానంగా కిషన్రెడ్డి చెప్పారు. హుజూరాబాద్లో టీఆర్ఎస్ అరాచకాలకు, బెదిరింపులకు, దాడులకు పాల్పడుతోందని, రోడ్షోలో ఉన్న తనపైనే దాడికి యత్నించడం అమానుషమని కిషన్రెడ్డి తెలిపారు. కేంద్ర హోం మంత్రి అమిత్ షా పర్యటన ఇంకా ఖరారు కాలేదని చెప్పారు. బీజేపీ హనుమకొండ జిల్లా అధ్యక్షురాలు రావు పద్మ అధ్వర్యంలో జరిగిన విలేకరుల సమావేశంలో మాజీ మంత్రి డీకే అరుణ, జిల్లా ఇన్చార్జి డాక్టర్ మురళీధర్గౌడ్, మాజీ శాసనసభ్యులు, రాష్ట్ర ఉపాధ్యక్షులు ఎన్వీఎస్ఎస్ ప్రభాకర్, సంకినేని వెంకటేశ్వర్లు తదితరులు పాల్గొన్నారు. -
‘గ్యాస్ పన్ను’పై బీజేపీ అబద్ధాలు
హుజూరాబాద్/ ఇల్లందకుంట: గ్యాస్ సిలిండర్ ధరలో రాష్ట్ర ప్రభుత్వానిది 291 రూపాయల పన్ను ఉందని బీజేపీ నాయకులు అబద్ధం ఆడుతున్నారని, అది నిరూపిస్తే తాను ఆర్థిక మంత్రి పదవికి రాజీనామా చేస్తానని హరీశ్రావు కేంద్ర మంత్రి కిషన్రెడ్డి, మాజీ మంత్రి ఈటల రాజేందర్కు సవాల్ విసిరారు. జమ్మికుంట మండలంలోని నాగంపేట గ్రామంలో శనివారం ఏర్పాటు చేసిన ధూంధాం కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. బీజేపీ ప్రభుత్వం ఏడు సంవత్సరాలుగా పెట్రోల్, డీజిల్ ధరలు కొద్దికొద్దిగా పెంచుకుంటూ కొత్తగా 28 రూపాయలు, పాతది రూ.10 కలిపి మొత్తం లీటర్ మీద రూ.38 తీసుకుంటోందన్నారు. దమ్ముంటే కిషన్రెడ్డి బడ్జెట్కు సంబంధించిన పుస్తకాలు తీసుకొని టీవీ చానళ్లకుగానీ, బహిరంగ చర్చకుగానీ రావాలని సవాల్ చేశారు. అబద్ధాలు చెప్పే బీజేపీ కావాలా.. నమ్మకాలు నిలబెట్టే టీఆర్ఎస్ పార్టీ కావాలా ప్రజలు ఆలోచించుకోవాలని కోరారు. కరోనా కష్టకాలంలో కూడా రైతులు ఇబ్బందులు పడకుండా రైతుబంధు పథకం అమలు చేశామని, టీఆర్ఎస్ హయాంలో ప్రజలు చాలా సంతోషంగా ఉన్నారని తెలిపారు. రానున్న రోజుల్లో సొంత జాగాలు ఉన్న వారికి ఇల్లు కట్టుకునేందుకు రూ.5 లక్షల 4 వేలు సాయం అందిస్తామని, మహిళలకు అభయ హస్తం డబ్బులు వడ్డీలతో చెల్లించేందుకు ముఖ్యమంత్రి ప్రణాళికలు చేస్తున్నారని తెలిపారు. ‘ఈటల ఎలాగూ గెలిచేది లేదు. తన స్వార్థ ప్రయోజనాల కోసం ప్రజలను ఇబ్బందులకు గురిచేస్తున్నారు’అని హరీశ్ పేర్కొన్నారు. గెల్లు శ్రీనివాస్ యాదవ్ గెలిస్తే ప్రజలందరికీ మేలు జరుగుతుందని చెప్పారు. కార్యక్రమంలో వర్ధన్నపేట ఎమ్మెల్యే ఆరూరి రమేశ్ తదితరులు పాల్గొన్నారు. బీజేపీకి హరీశ్ 15 ప్రశ్నలు ‘టీఆర్ఎస్ సంపద పెంచింది. రైతుల అప్పు మాఫీ చేసింది. బీజేపీ పేద రైతుల పన్నులు పెంచి బడా పారిశ్రామిక వేత్తలకు అప్పులు మాఫీ చేసింది. హుజూరాబాద్ రైతులు బీజేపీకి ఎందుకు ఓట్లు వేయాలి’అని హరీశ్రావు ప్రశ్నించారు. శనివారం హుజూరాబాద్లోని టీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో హరీశ్ విలేకరుల సమావేశంలో మాట్లాడా రు. ‘బీజేపీకి 15 ప్రశ్నలు వేస్తున్నాం. వాటికి కేంద్ర మంత్రి కిషన్రెడ్డి, బండి సంజయ్ సమాధానం ఇవ్వాలి’అని బహిరంగ లేఖ విడుదల చేసినట్లు తెలిపారు. బీజేపీ రైతు వ్యతిరేక విధానాల వల్ల సంవత్సర కాలంగా రైతులు పోరాడుతున్నారని, కానీ ఆ పార్టీకి చీమ కుట్టినంత బాధ కూడా లేదని, ఇంత క్రూరంగా ప్రవర్తించిన ప్రభుత్వం బీజేపీ తప్ప మరోటి లేదన్నారు. రైతులను లాఠీలతో చితక్కొట్టండని బీజేపీకి చెందిన హరియాణా ముఖ్యమంత్రి ఖట్టర్ అన్నారని పేర్కొన్నారు. రైతులను చితక్కొట్టండని ఆదేశించిన బీజేపీకి రైతులు ఎందుకు ఓట్లు వేయాలని కిషన్రెడ్డిని ప్రశ్నించారు. సమావేశంలో ప్రభుత్వ విప్ బాల్క సుమన్, ఎమ్మెల్యేలు సండ్ర వెంకటవీరయ్య, పెద్ది సుదర్శన్రెడ్డి, ఎస్సీ కమిషన్ మాజీ చైర్మన్ ఎర్రోళ్ల శ్రీనివాస్, టీఆర్ఎస్ నేత పాడి కౌశిక్రెడ్డి పాల్గొన్నారు. -
కేటీఆర్ వ్యాఖ్యలపై భట్టి అభ్యంతరం
సాక్షి, హైదరాబాద్: గాంధీభవన్లోకి గాడ్సేలు దూరారన్న టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ వ్యాఖ్యలపట్ల కాంగ్రెస్ శాసనసభాపక్షం (సీఎల్పీ) నేత భట్టి విక్రమార్క అభ్యంతరం వ్యక్తం చేశారు. గాంధీ భవన్లో గాడ్సేలు ఉన్నారని ఆయన ఎలా మాట్లాడతారని ఫైర్ అయ్యారు. కాంగ్రెస్ భావజాలాన్ని తూ.చా తప్పకుండా అమలు చేసే వ్యక్తులు మాత్రమే గాంధీ భవన్లో ఉంటారని భట్టి అన్నారు. అసెంబ్లీ మీడియా పాయింట్ వద్ద శనివారం ఆయన మాట్లాడారు. హుజురాబాద్ ప్రజలు టీఆర్ఎస్ ను ఓడించాలని చాలా స్పష్టంగా ఉన్నారని భట్టి జోస్యం చెప్పారు. ఎన్.ఎస్.యూ.ఐ అధ్యక్షుడుగా వెంకట్ చాలా ఏళ్లుగా విద్యార్థి, యువత కోసం గట్టిగా పోరాటం చేస్తున్నారని తెలిపారు. ఇటువంటి పోరాటాలు చేసే అభ్యర్థిని శాసనసభకు పంపించాలని హుజూరాబాద్ ప్రజలు ఆలోచన చేస్తున్నారని పేర్కొన్నారు. (చదవండి: పిట్టపోరు.. హెల్మెట్లు లేకపోతే అంతే!) దోచుకోవడం వల్లనే ఉప ఎన్నిక ‘అసలు ఈ ఉప ఎన్నిక ఎందుకు వచ్చింది? ఎన్నికల కమిషన్ ఎన్నికను రద్దు చేయడం వల్లనో, లేక దురదృష్టకర ఘటన వల్లనో ఉప ఎన్నిక రాలేదు. కేవలం ఏడేళ్లు టీఆర్ఎస్ ప్రభుత్వంలో మంత్రిగా ఉన్న ఈటల రాజేందర్ విపరీతమైన అవినీతికి పాల్పడ్డాడు కాబట్టి తాను మంత్రి పదవినుంచి తొలిగిస్తున్నట్లు కేసీఆర్ చెప్పారు. అంతేకాక ఆయన మీద ఎంక్వైరీ వేశారు. నేనొక్కడినే కాదు అవినీతి చేసింది.. స్కూటర్ మీద వచ్చిన టీఆర్ఎస్ నాయకత్వం లక్షల కోట్లు రాష్ట్ర ఆదాయాన్ని దోచుకున్నారని రాజేందర్ అంటున్నారు. దోపిడీ దొంగలు ఒకరు బీజేపీ నుంచి మరొకరు టీఆర్ఎస్ నుంచి పోటీ చేస్తున్నారు. హుజారాబాద్ ప్రజలు ఈ దోపిడి దొంగలను ఆపాలంటే కాంగ్రెస్ అభ్యర్థికి ఓటేయాలని ఆలోచన చేస్తున్నారు’ అని భట్టి పేర్కొన్నారు. (చదవండి: సీఎంను పట్టుకుని ఆ బూతులేంటి?: కేటీఆర్) -
హుజురాబాద్లో ఓట్లు చీల్చేందుకే టిఆర్ఎస్ కుట్ర
-
అడ్డగోలు ఇల్లు కిరాయి.. వారం రోజులకే రూ.10 వేలు..అయినా కష్టమే?
సాక్షి, కరీంనగర్: హుజూరాబాద్ ఉప ఎన్నిక ప్రచారంతో అద్దెకుండే వారికి ఇళ్లు కరువయ్యాయి. కళాకారులు, కార్యకర్తలు, నేతలు, అనుచరులు ఉండేందుకు ఇళ్లకు విపరీత డిమాండ్ పెరిగింది. పోలింగ్ ముందు వరకు ఉండేందుకు కేవలం వారం రోజుల వ్యవధికే రూ.10వేల కిరాయి చెల్లిస్తున్నారు. టీఆర్ఎస్, బీజేపీ, కాంగ్రెస్ అభ్యర్థులతో పాటు ఇతర వర్గాలంతా ఇక్కడే బస చేస్తుండటంతో ఒక్కసారిగా గృహ యజమానులకు డిమాండ్ ఏర్పడింది. హుజూరాబాద్ పట్టణంలో ఇళ్లు దొరకకపోవడంతో ఇప్పల నర్సింగపూర్, సింగపూర్ గ్రామాల్లో అద్దె ఇళ్ల కోసం అన్వేషిస్తున్నారు. చదవండి: సెక్షన్ 49 పీ: మీ ఓటును మరెవరైనా వేశారా? వెంటనే ఇలా చేయండి.. కాగా మరో ఏడు రోజుల్లో అంటే ఈ నెల 30 న హుజురాబాద్ ఉప ఎన్నిక పోలింగ్ జరుగనుంది. నవంబర్2న ఓట్లు లెక్కించి ఫలితాలను విడుదల చేయనున్నారు. ఈ ఎన్నికలో ప్రముఖంగా మూడు పార్టీల మధ్య తీవ్ర పోటీ నెలకొంది. బీజేపీ, టీఆర్ఎస్, కాంగ్రెస్ హోరాహోరీగా ప్రచారం కొనసాగిస్తున్నాయి. ఇక బీజేపీ నుంచి ఈటల రాజేందర్, టీఆర్ఎస్ నుంచి గెల్లు శ్రీనివాస్ యాదవ్, కాంగ్రెస్ నుంచి బల్మూరి వెంకట్లో బరిలో నిలిచిన విషయం తెలిసిందే. చదవండి: అనగనగా.. ఓ ఈవీఎం.. దీని జీవితకాలమెంతో తెలుసా? -
ఉపఎన్నిక వాయిదాకు సీఎం కుట్ర: బండి
హుజూరాబాద్/కమలాపూర్: ‘హుజూరాబాద్ ఉపఎన్నికలో వేల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టినా ప్రజల మనసు మార్చలేమని సీఎం కేసీఆర్ గ్రహించారు. ప్రజాప్రతినిధులను కొనుగోలు చేసినా ఫలితం లేదనిఆయనకు అర్థమైంది. ప్రజలను భయభ్రాంతులకు గురిచేసి శాంతిభద్రతల సమస్యను సృష్టించి ఎన్నికలను వాయిదా వేయించేందుకు కేసీఆర్ కుట్ర చేస్తున్నారు’అని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు, ఎంపీ బండి సంజయ్కుమార్ ఆరోపించారు. శుక్రవారం హుజూరాబాద్లో విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. కేంద్రమంత్రి కిషన్రెడ్డి ప్రచారం చేస్తుండగా టీఆర్ఎస్ నేతలు దాడి చేసి అడ్డుకునే ప్రయత్నం చేయడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామని, సీఎం కేసీఆర్ డైరెక్షన్లో ఈ దాడి జరిగిందని ఆరోపించారు. పోలింగ్కు ప్రజలు రాకుండా భయభ్రాంతులకు గురిచేసేలా కేసీఆర్ కుట్ర చేస్తున్నారని, జీహెచ్ఎంసీ ఎన్నికల సమయంలోనూ టీఆర్ఎస్ రెచ్చగొట్టే ప్రయత్నం చేసి విఫలమైందని విమర్శించారు. బీజేపీ దాడులు చేస్తోందని, మత కల్లోలాలు సృష్టించే కుట్ర చేస్తోందంటూ ఆనాడు దుష్ప్రచారం చేసి విఫలమయ్యారని, హుజూరాబాద్ ఉపఎన్నికలోనూ మళ్లీ ఇదే కుట్రను అమలు చేయబోతున్నారని ధ్వజమెత్తారు. కేంద్రమంత్రి ప్రచారంపై దాడులకు పాల్పడుతున్నా.. పోలీసులు ప్రేక్షకపాత్ర పోషించడం దారుణమన్నారు. ఓటుకు రూ.20 వేలు పంపిణీ చేయాలని యత్నించి విఫలమవుతుండటంతో ఆ పార్టీ నాయకులతోనే కేసీఆర్ భౌతిక దాడులకు పురిగొల్పుతున్నారని ఆరోపించారు. కేంద్ర కేబినెట్ మంత్రి వస్తే, కనీస భద్రత ఇవ్వకపోవడం దారుణమని, దాడులకు నిరసనగా శనివారం రాష్ట్రవ్యాప్తంగా బీజేపీ ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమాలకు పిలుపునిస్తున్నట్లు ప్రకటించారు. ఓటమి భయంతోనే దాడి ‘ఓటమి భయంతోనే టీఆర్ఎస్ నేతలు కేంద్రమంత్రి కిషన్రెడ్డి క్యాంపెయిన్పై దాడి చేశారు. ప్రజలను భయభ్రాంతులకు గురిచేసి మేం ఏమైనా చేస్తామనే సందేశాన్ని ఇవ్వాలని టీఆర్ఎస్ యత్నిస్తోంది. బీజేపీ ప్రచారాన్ని టీఆర్ఎస్ నేతలు జీర్ణించుకోలేకపోతున్నారు. డబ్బుతో ఓట్లను కొంటాం. రాష్ట్రాన్ని కొల్లగొట్టినం. అవినీతి సొమ్మంతా మా దగ్గరుంది. ఏదైనా చేస్తామని కేసీఆర్ అనుకుంటున్నారు’అని బీజేపీ జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణ మండిపడ్డారు. ఉపఎన్నికను అధికారాన్ని అడ్డుపెట్టుకుని గెలవాలనే తీరును చూస్తుంటే జాలేస్తోందని ఎద్దేవా చేశారు. కేసీఆర్ తాటాకు చప్పుళ్లకు బీజేపీ భయపడదన్నారు. లీటర్ పెట్రోల్పై రాష్ట్ర సర్కారు రూ.41 దోపిడీ పెట్రోల్, డీజిల్ ధరల పెంపుపై ముఖ్యమంత్రి కేసీఆర్సహా టీఆర్ఎస్ నేతలు కేంద్రంపై దుష్ప్రచారం చేస్తున్నారని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు, కరీంనగర్ ఎంపీ బండి సంజయ్ కుమార్ మండిపడ్డారు. పన్నుల పేరిట కేసీఆర్ ప్రభుత్వం ఒక్కో లీటర్ పెట్రోల్పై రూ.41 దోచుకుంటోందని ఆరోపించారు. ప్రజలపై కేసీఆర్కు నిజంగా ప్రేమ ఉంటే ఆ పన్ను మినహాయించి లీటర్ పెట్రోల్ను రూ.60కే ఇవ్వొచ్చన్నారు. హనుమకొండ జిల్లా కమలాపూర్ మండలం శనిగరం, కమలాపూర్ల్లో శుక్రవారం సాయంత్రం నిర్వహించిన ఎన్నికల ప్రచారంలో ఆయన మాట్లాడారు. యూరియా ఫ్రీగా ఇస్తామని ప్రగల్భాలు పలికిన కేసీఆర్ ఇంతవరకు ఇచ్చిన పాపాన పోలేదని ఎద్దేవా చేశారు. కేసీఆర్ కమీషన్ల కోసం బ్రోకర్గా వ్యవహరిస్తూ రైతులను బెదిరిస్తున్నారని ఆరోపించారు. రాష్ట్రానికి 3 లక్షల ఇళ్ల నిర్మాణానికి రూ.10 వేల కోట్లు కేంద్రం కేటాయిస్తే ఒక్క ఇల్లు కూడా కట్టకుండా ఆ డబ్బును దారి మళ్లించి కేంద్రాన్ని కేసీఆర్ అప్రతిష్టపాలు చేస్తున్నారని విమర్శించారు. -
దోపిడీకి మారుపేరు కల్వకుంట్ల కుటుంబం
ఇల్లందకుంట (హుజూరాబాద్): అమరుల త్యాగాల ఫలితంగా వచ్చిన తెలంగాణలో కల్వకుంట్ల కుటుంబం దోపిడీకి మారుపేరుగా మారిందని మాజీమంత్రి, బీజేపీ అభ్యర్థి ఈటల రాజేందర్ అన్నారు. శుక్రవారం ఆయన ఇల్లందకుంట మండలంలోని వంతడుపుల, బుజూనూర్, సీతంపేట, మర్రివానిపల్లి, సిరిసేడు గ్రామాల్లో ఎన్నికల ప్రచారం నిర్వహించారు. టీఆర్ఎస్కు ఓటు వేయకపోతే పెన్షన్, రేషన్ కార్డులు రావని బెదిరిస్తున్నారని ఆరోపించారు. ప్రజలకు ఇచ్చే రేషన్ బియ్యంలో 29 రూపాయల ఖర్చు కేంద్రం భరిస్తే కేవలం రెండు రూపాయలు రాష్ట్రం భరిస్తోందన్నారు. తాను హరీశ్లా ఆరు అడుగులు లేకపోవచ్చు కానీ తెలివిలో ఆయన కంటే ఒక ఆకు ఎక్కువేనని పేర్కొన్నారు. హుజూరాబాద్ నుంచే కేసీఆర్ పతనం ప్రారంభమైందని, రానున్న రోజుల్లో బీజేపీ జెండా ఎగురుతుందని ధీమా వ్యక్తంచేశారు. తాను బీజేపీలో ఉండనని, వేరే పార్టీలోకి వెళ్లిపోతానని టీఆర్ఎస్ నేతలు ప్రచారం చేస్తున్నారని, నిజానికి రానున్నరోజుల్లో ఆ పార్టీయే కనుమరుగవుతుందన్నారు. -
హుజురాబాద్లో ఈటల గెలుపు తథ్యం: కేంద్రమంత్రి కిషన్రెడ్డి
-
బ్లాక్మనీ తెచ్చి పేదల అకౌంట్లలో వేస్తామన్నారు..వేశారా?
-
రావణరాజ్యం పోవాలంటే బీజేపీ గెలవాలి
సాక్షి ప్రతినిధి, కరీంనగర్: రావణరాజ్యం పోయి రాముని రాజ్యం రావాలంటే బీజేపీని గెలిపించాలని మాజీ ఎంపీ విజయశాంతి అన్నారు. గురువారం ఆమె హుజూరాబాద్, జమ్మికుంటల్లో బీజేపీ అభ్యర్థి ఈటల రాజేందర్ తరఫున ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా జరిగిన రోడ్షోల్లో మాట్లాడుతూ, కేసీఆర్కు ఉద్యమకారులను మోసం చేయడం అలవాటేనని.. గతంలో ఆలె నరేంద్ర, తర్వాత తనను, నేడు ఈటలను పార్టీ నుంచి వెళ్లగొట్టారని విమర్శించారు. హుజూరాబాద్ ప్రజలు, సోషల్ మీడియాలో నెటిజన్ల ఉత్సాహం చూస్తుంటే రాజేందర్ విజయం ఖాయమైనట్లేనని విజయశాంతి అన్నారు. ఎన్నికల కోసమే ఈ పథకాన్ని తీసుకువచ్చారని దళితబంధు పథకాన్ని మూడునెలల కిందట ప్రకటించినా.. లబ్ధిదారులందరికీ రూ.10 లక్షలు ఎందుకు ఇవ్వలేదన్నారు. -
దళిత బంధు నిలుపుదలపై తెలంగాణ హైకోర్టులో పిల్
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా ప్రారంభించిన దళిత బంధు పథకం నిలుపుదలపై హైకోర్టులో ప్రజా ప్రయోజన వ్యాజ్యం(పిల్) దాఖలైంది. సామాజికవేత్త మల్లేపల్లి లక్ష్మయ్య కోర్టులో ఈ పిల్ దాఖలు చేశారు. కాగా హుజురాబాద్ ఉప ఎన్నికల నేపథ్యంలో దళిత బంధు ఆపాలని ఎలక్షన్ కమిషన్ ఆదేశాలను ఇచ్చిన సంగతి తెలిసిందే. దీంతో ఆ ఆదేశాలను రద్దు చేయాలని కోరుతూ లక్ష్మయ్య పిల్ వేశారు. పిల్లో.. ప్రభుత్వ పథకాలు అన్ని అమలు అవుతున్నప్పుడు కేవలం దళిత బంధును మాత్రమే ఆపాలని ఎన్నికల సంఘం ఆదేశాలు ఇచ్చిందని, కనుక దళిత బంధు పథకాన్ని యధావిధిగా అమలయ్యేలా చూడాలని పిటిషనర్ పేర్కొన్నారు. చదవండి: వెలుగులోకి మాజీ ఎమ్మెల్యే కొడుకు, ట్రైనీ ఐఏఎస్ నిర్వాకం.. -
మాట ముచ్చట: అయిలన్నా.. ఏం నడ్తందే?
సాక్షి, ఇల్లందకుంట(హుజురాబాద్): హుజూరాబాద్ ఎలక్షన్ హీటెక్కింది. ఎక్కడ విన్నా ఎన్నికల ముచ్చట్లే. ఇద్దరు, ముగ్గురు వ్యక్తులు కలిస్తే ఎన్నికలపైనే చర్చ. ఈ క్రమంలో నియోజకవర్గంలోని ఓ గ్రామానికి చెందిన ఇద్దరు వ్యక్తులు ఇలా ముచ్చటిస్తున్నారు. చదవండి: ఈ విషయం తెలుసా..? టీఆర్ఎస్కు మూడు గుర్తులు కొమురయ్య: నమస్తే అయిలన్న. అంతా మంచిదేనా? ఏందే గీలొల్లి. పొద్దటి నుంచి రాత్రి దాకా ఒకటే గిలగిల. ఏం నడ్తందే హుజూరాబాద్లా? అయిలయ్య: లొల్లంటవేందే.. ఓట్లన్నంక గీమాత్రం ఉండదా. కొమురయ్య: హే.. నేనుపుట్టి గిన్నేండ్లయింది. గిసొంటీ ఓట్లను నేనెన్నడూ సూళ్లే. అయిలయ్య: నువ్వొక్కనివేందే.. గిసోంటి ఎలచ్చన్లను ఎవ్వలుగూడ జూడలేదు. ఇక మీద గూడా జూడరు. కొమురయ్య: గిన్నినెలల నుంచి మైకులతోనే నడిచింది. ఈ మధ్య ఎక్కడెక్కడొల్లో వచ్చి ఊళ్లళ్లనే మకాం పెట్టిండ్రు. ఇక్కడనే వండుకుంట, ఉండకుంట, పొద్దుమాపు ఇండ్లసుట్టు తిరుగుతుండ్రు. అయిలయ్య: ఇది వరకు జరిగిన ఎలచ్చన్లు వేరు. ఈ ఎలచ్చన్లు వేరు. అప్పుడంటే ఎవ్వలఇంట్ల వాళ్లు సక్కబెట్టుకునే వరకు యాళ్లాయే. ఇప్పుడు వేరేటోల్లు కూడా ఈడనే అడ్డా పెట్టిన్రు. కొమురయ్య: మంది ముచ్చట పక్కకుపెట్టే. మందు, పైసలు గిట్ల బాగానే పంచుతుండ్రట కదా. అయిలయ్య: మందు, పైసల గురించి మనకెందుకే. గవన్ని ఇచ్చేటోళ్లు ఇస్తరు. తీసుకునేటోళ్లు తీసుకుంటరు. అదంతా పెద్దపెద్దోళ్లకు సంబంధించిన ముచ్చట. మనదాకా రానిత్తరానే. కొమురయ్య: ఇదివరకు ఊర్లపొంటి జరిగిన ఎలచ్చన్లకు పైసలు తీసుకుని ఓట్లేసినోళ్ల పరిస్థితి ఎట్లున్నదో మనం చూసినం. అయిలయ్య: నిజమేనే గీమందు, పైసలు మూడ్రోజుల ముచ్చటనే. వచ్చేటోళ్లు వస్తరు. పోయేటోళ్లు పోతరు. గనీ ఈ సారి మాత్రం ఎవరో చెప్పిన్నని కాకుండా మంచోన్నే గెలిపించుకోవాల్నే. కొమురయ్య: సరేనే గట్లనే నువ్వు జెప్పినట్లే చేద్దాం. కానీ చివరకు ఒక ముచ్చట. గిసోంటి ఎలచ్చన్లు జీవితంలో ఇంకారావు కావచ్చు కాదా.. సరేనే ఆకలి అయితాంది.. ఇంటికి పోతన్న. సాయంత్రం గలుద్దామే. -
దళిత బంధు రాజకీయం
-
Huzurabad Bypoll: దేశంలోనే ఖరీదైన ఎన్నిక
సాక్షి, హైదరాబాద్: హుజూరాబాద్ ఉప ఎన్నికను దేశంలోని అన్ని ఎన్నికల కంటే ఖరీదైన ఎన్నికగా మార్చారని టీపీసీసీ చీఫ్, మల్కాజిగిరి ఎంపీ రేవంత్రెడ్డి వ్యాఖ్యానించారు. మంత్రి హరీశ్రావు, బీజేపీ అభ్యర్థి ఈటల రాజేందర్ అన్ని రకాల నిబంధనలను తుంగలో తొక్కారని విమర్శించారు. మంగళవారం బుద్ధభవన్లో ఎన్నికల కమిషనర్ శశాంక్ గోయల్ను కలిసిన రేవంత్రెడ్డి, హుజూరాబాద్ ఉప ఎన్నికపై ఫిర్యాదు చేశారు. యూత్ కాంగ్రెస్ జాతీయ ప్రధాన కార్యదర్శి అనిల్, యూత్ కాంగ్రెస్ రాష్ట్ర అధ్యక్షుడు శివసేనరెడ్డి, టీపీసీసీ ప్రధాన కార్యదర్శి హారిక వేణుగోపాల్ తదితరులు ఆయన వెంట ఉన్నారు. ఈ సందర్భంగా రేవంత్రెడ్డి మాట్లాడుతూ.. హుజూరాబాద్లో టీఆర్ఎస్, బీజేపీలు వందల కోట్ల రూపాయలు వెదజల్లుతున్నాయని ఆరోపించారు. వందల కోట్ల రూపాయలు ఖర్చు పెడుతున్న హరీశ్రావుపై చర్యలు తీసుకోవాలని ఎన్నికల అధికారి కి ఫిర్యాదు చేశామని తెలిపారు. ఎన్నికలు ఏదైనా ఒక సమస్య మీద జరగాలి కానీ, హుజూరాబాద్ ఎన్నికల్లో ఏ సమస్య కూడా చర్చకు రావడం లేదన్నారు. పంపకాలలో వచ్చిన తేడా వల్లే హరీశ్రావు, ఈటల మధ్య మాటల యుద్ధం మొదలైందని చెప్పారు. దళితబంధుపై చర్చకు రావాలి నిరోషా అనే మహిళ ఉద్యోగాలు, నిరుద్యోగభృతి గురించి మంత్రి హరీశ్రావు దృష్టికి తీసుకెళ్తే టీఆర్ఎస్ నేతలు దాడి చేయడం ఏమిటని రేవంత్ ప్రశ్నిం చారు. ప్రభుత్వ తప్పిదాలను వెలికితీసిన బల్మూరి వెంకట్పై దాడులు చేశారని, ఆ వెంకట్నే హుజూరాబాద్ కాంగ్రెస్ అభ్యర్థిగా బరిలో దింపామని తెలిపారు. ఇంటికి ఒక్క ఓటు కాంగ్రెస్కు అనే నినాదంతో ముందుకు వెళ్తున్నామన్నారు. దుబ్బాక, హుజూర్నగర్, నాగార్జునసాగర్లో టీఆర్ఎస్, బీజేపీలకు అవకాశం ఇచ్చినా అక్కడి పరిస్థితులు మారలేదని.. అందువల్ల హుజూరాబాద్లో కాంగ్రెస్కు అవకాశం ఇవ్వాలని కోరారు. టీఆర్ఎస్, బీజేపీ రెండూ తోడు దొంగలని, తమ వ్యూహంలో భాగంగానే దళిత బంధును ఆపారని విమర్శించారు. దళితులకు పది లక్షలు అనేదంతా నాటకమన్నారు. దీనిపై కేటీఆర్ నవంబర్ 15 లోపు బహి రంగ చర్చకు రావాలని సవాల్ విసిరారు. -
‘ఈటల మేలు చేస్తడు.. కీడు చెయ్యడు’
హుజూరాబాద్: ‘దళితబంధు వెంటనే అమలు చేయాలని నేనే డిమాండ్ చేశాను. కలెక్టర్ల పెత్తనం, బ్యాంకుల పెత్తనం ఉండొద్దని కోరింది నేనే. హుజూరాబాద్ ప్రజలపై ప్రేమతో ఇచ్చావో, ఓట్లపై ప్రేమతో ఇచ్చావోగానీ, తెలంగాణ వ్యాప్తంగా ఇవ్వాలని డిమాండ్ చేశాను. ఎప్పటిలోగా ఇస్తావో చెప్పాలని కోరాను. అన్ని కులాల్లోని పేదలకు కూడా ఇలాంటి స్కీం పెట్టాలని కోరింది నేనే. ఈటల రాజేందర్ మేలు చేస్తాడు తప్ప కీడు చెయ్యడు’ అని మాజీ మంత్రి, బీజేపీ అభ్యర్థి ఈటల రాజేందర్ అన్నారు. మంగళవారం హుజూరాబాద్ మండలంలోని శాలపల్లి, చెల్పూర్, రాజపల్లి, రంగాపూర్, రాంపూర్, కనుకులగిద్ద, చిన్నపాపయ్యపల్లిల్లో ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. దళితబంధు ఆపాలని తానే ఎన్నికల కమిషన్కు ఫిర్యాదు చేసినట్లు ప్రచారం చేస్తున్నారని.. తాను వద్దని లేఖ రాసినట్టు నిరూపిస్తారా అని సవాల్ విసిరారు. ‘70 రోజులు అమలు కాని దళితబంధు ఏడు రోజుల్లో అమలవుతుందా? దళితుల మీద ప్రేమ ఉంటే దళితులకు సీఎం పదవి ఎందుకు ఇవ్వలేదు? మూడు ఎకరాల భూమి ఎవరు అడ్డుకున్నారు?’ అని ఈటల ప్రశ్నిం చారు. కేసీఆర్ రాజ్యాంగ ఉల్లంఘనకు పాల్పడుతున్నారని ఈటల ఆరోపించారు. ఓటుకు రూ.20 వేలు, రూ.30 వేలతో బేరం చేస్తున్నారని ఆరోపించారు. కేసీఆర్ గెలిస్తే బానిసత్వంలో మగ్గిపోతామని, హుజూరాబాద్లో జరుగుతున్న యుద్ధంలో ధర్మం వైపు నిలబడాలని ప్రజలను కోరారు. -
కాంగ్రెస్–బీజేపీలది చీకటి ఒప్పందం
ఇల్లందకుంట(హుజూరాబాద్)/కమలాపూర్: హుజురాబాద్లో బీజేపీ, కాంగ్రెస్ చేతులు కలిపి చీకటి ఒప్పందాలు చేసుకున్నాయని ఆర్థిక శాఖ మంత్రి హరీశ్రావు ఆరోపించారు. మంత్రి హరీశ్రావు సమక్షంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు మంగళవారం టీఆర్ఎస్లో చేరారు. మంత్రి మాట్లాడుతూ దేశంలోని అన్ని రాష్ట్రాలకు తెలంగాణ రోల్ మోడల్గా ఉందని, బీజేపీ పాలిత రాష్ట్రాల్లోని ఎమ్మెల్యేలు సైతం తెలంగాణ పథకాలను గౌరవిస్తున్నారని తెలిపారు. దేశంలో రైతు బీమా, ఉచిత కరెంట్, రెసిడెన్షియల్ విద్యతోపాటు అనేక సదుపాయాలు కల్పిస్తున్న ప్రభుత్వం టీఆర్ఎస్ మాత్రమేనన్నారు. రాష్ట్రంలోని వనరులను ఇతర రాష్ట్రాలకు తరలించేందుకు కేంద్రం ప్రయత్నిస్తోందని ఆరోపించారు. బీజేపీ పాలిత ప్రాంతాలలో కార్మికులకు 12 గంటల పని విధానముందని విమర్శించారు. ఈటల రాజేందర్ ఎందుకు రాజీనామా చేశారో ఇప్పటివరకు ప్రజలకు చెప్పలేదని, ఆస్తులను కాపాడుకోవడానికే బీజేపీలో చేరారని మండిపడ్డారు. ఇక కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర ఇన్చార్జ్ మాణిక్యం ఠాగూర్ సైతం బీజేపీకి అనుకూలంగా మాట్లాడుతున్నారన్నారు. నిజాయితీగా పనిచేసిన వారికి టీఆర్ఎస్లో తగిన గుర్తింపు ఉంటుందని, దానికి నిదర్శనం గెల్లు శ్రీనివాస్యాదవ్ అని అన్నారు. కార్యక్రమంలో మంత్రి కొప్పుల ఈశ్వర్ తదితరులు పాల్గొన్నారు. సిలిండర్కు దండం పెట్టి బీజేపీని బొందపెట్టాలి హుజూరాబాద్ ఉప ఎన్నికల్లో ఓటు వేసేందుకు వెళ్లే ముందు వంటింట్లోని సిలిండర్కు దండం పెట్టి బీజేపీని బొంద పెట్టాలని మంత్రి తన్నీరు హరీశ్రావు అన్నారు. హనుమకొండ జిల్లా కమలాపూర్ మండలం ఉప్పల్, మర్రిపల్లిగూడెంల్లో మంగళవారం జరిగిన ధూంధాం కార్యక్రమాల్లో ఆయన మాట్లాడారు. కేసీఆర్కు మానవత్వం ఉందా అని ఈటల అంటున్నాడు కానీ దేశంలో కేసీఆర్ అంత మానవతావాది మరొకరు లేడన్నారు. గ్యాస్ సిలిండర్పై రూ.291 రాష్ట్ర పన్ను ఉంటే ముక్కు నేలకు రాస్తానని సవాల్ చేశానని, వారం దాటినా చప్పుడు లేదని ఎద్దేవా చేశారు. ప్రచారంలో గెల్లు శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. -
రేవంత్.. హుజూరాబాద్ ఎందుకు వెళ్లడం లేదు?
సాక్షి, హైదరాబాద్: ‘రేవంత్రెడ్డి.. కాంగ్రెస్ రాష్ట్ర అధ్యక్షుడు అయ్యాక జరుగుతున్న తొలి ఉప ఎన్నికలో తనని తాను నిరూపించుకోవాలి కదా.. మరెందుకు హుజూరాబాద్ వెళ్లడం లేదు? తాను పీసీసీ చీఫ్ కాగానే కాంగ్రెస్ ఏదో అయిందంటున్న రేవంత్ హుజూరాబాద్లో డిపాజిట్ తెచ్చుకొని చూపించాలి. కొడంగల్లో ఓడిపోతే రాజకీయ సన్యాసం చేస్తానన్న సన్నాసి ఎందుకు చేయలేదు? హుజూరాబాద్లో వంద శాతం టీఆర్ఎస్ గెలుస్తుంది’ అని టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, రాష్ట్ర మంత్రి కల్వకుంట్ల తారక రామారావు వ్యాఖ్యానించారు. తెలంగాణ భవన్లో మంగళవారం ఆయన మీడియా ప్రతినిధులతో ఇష్టాగోష్టిగా మాట్లాడారు. హుజూరాబాద్ ఉప ఎన్నిక, టీఆర్ఎస్ సంస్థాగత ఎన్నికల ప్రక్రియ, కాంగ్రెస్–బీజేపీ మ్యాచ్ ఫిక్సింగ్ వంటి పలు అంశాలపై ఆయన వ్యంగాస్త్రాలు విసిరారు. కేటీఆర్ చిట్చాట్ ఆయన మాటల్లోనే సమయం, సందర్భం ఉంటది.. కేసీఆర్ జాతీయ రాజకీయాల్లోకి, కేటీఆర్ సీఎం అన్నది సోషల్ మీడియా సృష్టి. దేనికైనా సమయం, సందర్భం ఉంటది. కేసీఆర్కు ఉప రాష్ట్రపతి పదవి అనేది ‘వాట్సాప్ యూనివర్సిటీ’ప్రచారం మాత్రమే. నేను వేరే వారిలాగా చిలుక జోస్యం చెప్పలేను. జానారెడ్డి కన్నా పెద్ద లీడరా?.. రాజకీయాల్లో గండరగండడు జానారెడ్డినే నాగార్జునసాగర్లో 35 ఏళ్ల పిల్లవాని చేత ఓడించాం. జానారెడ్డి కన్నా ఈటల రాజేందర్ పెద్ద నాయకుడు కాదు కదా? ఆయన బీజేపీలో ఎందుకు చేరాడో, బీజేపీ గెలిస్తే ఏం చేస్తదో చెప్తలేడు. ఈటల ఇప్పటికీ బీజేపీని ‘ఓన్’చేసుకోలేదు. జై బీజేపీ, జై శ్రీరాం బదులు జై ఈటల అంటున్నడు. బీజేపీలోకి దిగిన తరువాత రొచ్చు అంటొద్దంటే ఎట్ల? 17 ఏళ్లు టీఆర్ఎస్లో అన్ని పదవులను ఎంజాయ్ చేసి బీజేపీలోకి ఎందుకు పోయిండు? హుజూరాబాద్లో వెయ్యి నామినేషన్లు వేయిస్తం అన్నవాళ్లు ఎక్కడికి పోయారు? రాజేందర్ తన బాధను ప్రపంచం బాధ అనుకుంటున్నడు. ఏడాది తరువాత ఈటల కాంగ్రెస్లోకి పోతడు. వివేక్ కూడానట. హుజూరాబాద్లో కాంగ్రెస్, బీజేపీతో కుమ్మక్కైంది. అందుకే పెద్దపల్లికి చెందిన ఓ అనామకుడిని కాంగ్రెస్ డమ్మీ అభ్యర్థిగా నిలబెట్టింది. ఏ పార్టీనో తెలియని మాజీ ఎంపీ విశ్వేశ్వర్రెడ్డి.. బీజేపీకి ఓటేయమని చెప్తున్నడు. లోక్సభ ఎన్నికల్లో కరీంనగర్, నిజామాబాద్ నుంచి బండి సంజయ్, అరవింద్ కూడా మ్యాచ్ ఫిక్సింగ్తో గెలిచి రెండు పార్టీల ఉమ్మడి ఎంపీలుగా ఉన్నారు. హుజూరాబాద్ కోసం దళితబంధు రాలేదు రాజేందర్ రాజీనామాతో దళితబంధు రాలే. ఆయన మంత్రిగా ఉన్నప్పుడు ఆమోదించిన బడ్జెట్లోనే దళిత్ ఎంపవర్మెంట్ స్కీం కింద నిధులు కేటాయించాం. రూ.1.70 లక్షల కోట్ల దళితబంధు పథకాన్ని ఒక్క హుజూరాబాద్ ఉప ఎన్నిక కోసం తెస్తామా? అసలు కేంద్రం నుంచి మీరెన్ని నిధులు తెస్తారో? ఏ పథకాలు తెస్తారో చెప్పండి. బీజేపీకి గత ఎన్నికల్లో 107 స్థానాల్లో డిపాజిట్లు రాలేదు. నేను హుజూరాబాద్ ఉప ఎన్నిక ప్రచారానికి వెళ్లడం లేదు. నాగార్జునసాగర్, దుబ్బాక ఉప ఎన్నిక ప్రచారానికి కూడా వెళ్లలేదు. సీఎం కేసీఆర్ ప్రచారం ఉండొచ్చు. ఇంకా షెడ్యూల్ ఖరారు కాలేదు. టీఆర్ఎస్ పథకాలను కేంద్రం కాపీ కొట్టి పేరు మార్చి అమలు చేస్తోంది. ఆరోగ్యశ్రీ మంచి పథకమని కేసీఆరే అన్నారు.. కాంగ్రెస్లో భట్టి విక్రమార్క ఒక్కరే మంచి వ్యక్తి. కానీ, ఆ పార్టీలో ఆయనది నడవట్లేదు. గట్టి అక్రమార్కులదే నడుస్తోంది. పార్టీలో గ్రూపులు మా బలం. బహుళ నాయకత్వం ఉన్న నియోజకవర్గాల్లో సమస్యలను కూర్చొని పరిష్కరించుకుంటం. మంచి పనులు ఎవరు చేసినా చెప్పుకోవాలి. వైఎస్సార్ తీసుకొచ్చిన ఆరోగ్యశ్రీని మంచి పథకంగా కేసీఆర్ చాలాసార్లు ప్రస్తావించారు. ఎన్నికల్లో గెలుపు, ఓటములు ఓ ప్రక్రియ. అసెంబ్లీ ఎన్నికల్లో ఓడిన రేవంత్, బండి సంజయ్, కిషన్రెడ్డి ఇంట్లో దుప్పటి కప్పుకుని పడుకోలేదు.. అయితే, కేసీఆర్ ప్రతి ఎన్నికను ప్రతిష్టాత్మకంగా తీసుకుంటారు. కోవిడ్ ప్రభావం తగ్గింది. ఇప్పటికే 93శాతం వ్యాక్సినేషన్ అయిపోయింది. మరో 15 రోజుల్లో 98 శాతం వరకు పూర్తవుతుంది. దళితబంధు ఆగదు.. తెలంగాణ పథకాలు దేశానికి దిక్సూచిగా మారాయి. కేసీఆర్ విజనరీ నేత.. మిగతా పార్టీల నేతలు టెలివిజనరీలు. దళితబంధును ఎవరూ ఆపలేరు. నవంబర్ 3 నుంచి యథాతథంగా కొనసాగుతుంది. నవంబర్ 15న ఆర్టీసీ బస్సులన్నీ వరంగల్కే.. టీఆర్ఎస్ ఆవిర్భవించి 20 ఏళ్లు పూర్తయిన సందర్భంగా ఉత్సవాలు నిర్వహిస్తున్నం. కేసీఆర్ను అధ్యక్షుడిగా బలపరుస్తూ ఇప్పటికే 10 సెట్ల నామినేషన్లు దాఖలయ్యాయి. రాష్ట్ర అధ్యక్షుని ఎన్నిక ఈనెల 25న ప్లీనరీలో జరుగుతుంది. నవంబర్ 15న వరంగల్లో విజయగర్జన పేరుతో భారీ బహిరంగ సభ నిర్వహిస్తం. ఇందుకోసం 7 వేల ఆర్టీసీ బస్సులను అద్దె చెల్లించి తీసుకుంటున్నం. ప్రజలు ఆ రోజు ప్రయాణాలు వాయిదా వేసుకోవాలని విజ్ఞప్తి చేస్తున్నా. టీఆర్ఎస్ను తమిళనాడులోని డీఎంకే, అన్నాడీఎంకే తరహాలో స్వీయ రాజకీయ అస్తిత్వ శక్తిగా తీర్చిదిద్దాలని నిర్ణయించుకున్నం. -
హుజురాబాద్ ఉప ఎన్నిక: కండువా కప్పుకుంటే ఎంతిస్తావ్?
సాక్షి, కరీంనగర్: ఏ ఎండకు ఆ గొడుగు చందంగా రాజకీయ నాయకులు పార్టీల గోడలు దూకడం తెలిసిందే. ప్రస్తుత హుజూరాబాద్ ఉపఎన్నిక సందర్భంగా ఆయా పార్టీలు ఓ అడుగు ముందుకేసి, జనాలనూ మార్చేస్తున్నాయి. అభ్యర్థుల ముందు ఆ సమయానికి కండువా కప్పుకుంటే చాలంటున్నారు నేతలు. ఫొటోలు క్లిక్మనిపిస్తూ ఆ జనసమూహాన్ని తమ సైన్యంగా చూపించుకునేందుకు పార్టీలు ప్రయత్నిస్తున్నాయి. ఇది సామాన్యులకూ లాభదాయకంగా మారింది. ఆ రోజుకు బీరు, బిర్యానీతోపాటు రూ.500 ఇస్తున్నారు. తమ అధినేతల వద్ద మార్కులు కొట్టేసేందుకు కొందరు గల్లీ నాయకులు పక్క వీధిలోని అపరిచితుల్నీ పార్టీలోకి ఆహ్వానిస్తూ కండువా కప్పిస్తున్నారు. తామే ఎక్కువ మందిని పార్టీలో చేర్పించామని గొప్పల డప్పులు కొట్టుకుంటున్నారు. ఈ క్రమంలో ఇవాళ ఒకరిచేత కండువా కప్పించుకున్న గల్లీ కార్యకర్తలు మరుసటిరోజు మరో పార్టీ కండువా కప్పుకుంటే ఎంతిస్తావ్ అని బేరాలాడుతున్నారు. ఇదో ఎన్నికల చిత్రం! చదవండి: హుజూరాబాద్లో దళితబంధుకు బ్రేక్ గరిటె తిప్పేటోళ్లు కావాలండోయ్ కరీంనగర్ అర్బన్: హుజూరాబాద్ ఉప ఎన్నిక పుణ్యమాని వంట తయారీదారులకు డిమాండ్ పెరిగింది. ప్రచారపర్వంలో భాగంగా సమావేశాలకు హాజరయ్యే వారికి అభ్యర్థులు ఉదయం అల్పాహారంతోపాటు రెండుపూటలా భోజనం ఏర్పాటు చేయిస్తున్నారు. దీంతో గరిటె తిప్పేటోళ్లకు భలే గిరాకీ లభిస్తోంది. అభ్యర్థులు వంటవారిని ఎన్నికల ప్రక్రియ ముగిసేవరకు తమ వద్దే పనిచేసేలా ఒప్పందం చేసుకుంటున్నారు. ఏదేమైనా ఉపఎన్నిక పాక ప్రావీణ్యులకూ కలిసొచ్చిందని చెప్పవచ్చు. అంతటా ఒకే బ్రాండ్ మద్యం కరీంనగర్టౌన్: హుజూరాబాద్ ఉప ఎన్నికను ప్రధాన పార్టీలు సవాలుగా తీసుకొని, గెలుపు కోసం సర్వశక్తులు ఒడ్డుతున్నాయి. ఓటర్లను మభ్యపెట్టేందుకు మద్యం, మాంసం, డబ్బును ఎరచూపి ఓట్లు వేయించుకోవాలని ఆరాటపడుతున్నాయి. ఇందుకోసం గ్రామగ్రామాన తమ అనుచరగణాన్ని దింపి, పోలీసుల కంటపడకుండా ఇంటింటి పంపిణీకి శ్రీకారం చుట్టాయి. అయితే ప్రజలు మాత్రం పార్టీలు పంచే మందుపై ఆసక్తి చూపడం లేదు. గత కొద్ది రోజులుగా అందరూ ఒకే బ్రాండ్ మందు బాటిళ్లను ఇస్తుండటమే ఇందుకు కారణమని తెలిసింది. ఇదెలా సాధ్యమని ఆరా తీస్తే కొత్త విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. ఇటీవల ఓ ప్రధాన పార్టీకి చెందిన నాయకుడు టికెట్ ఆశించి, భంగపడినట్లు సమాచారం. సదరు నాయకుడు గతంలోనూ హుజూరాబాద్ టికెట్ ఆశించినట్లు తెలిసింది. ఆయనను శాంతింపజేసేందుకు సదరు పార్టీకి చెందిన ఓ ముఖ్యనేత ఏకంగా విస్కీ డీలర్షిప్ దక్కేలా కృషి చేసినట్లు ప్రచారం జరుగుతోంది. దీంతో ఆ నాయకుడు తమ పార్టీతోపాటు ఇతర పార్టీలకు కూడా ఒకే బ్రాండ్కు చెందిన మందు బాటిళ్లు సరఫరా చేస్తున్నట్లు పలువురు అనుకుంటున్నారు. ఇతర బ్రాండ్లు తెచ్చే ప్రయత్నం చేసినా పోలీసులకు దొరికే ఛాన్స్ ఉండటంతో అన్ని పార్టీల నేతలు తప్పనిసరి పరిస్థితుల్లో అదే బ్రాండ్ మందు పంపిణీ చేయక తప్పడం లేదని సమాచారం. మొత్తమ్మీద హుజూరాబాద్ పోరులో పార్టీల మధ్య తేడాలున్నా మద్యం విషయంలో మాత్రం అందరూ ఒకే బ్రాండ్ను నమ్ముకుంటున్నారని ప్రజలు చర్చించుకుంటున్నారు. రిటైర్డ్ పోలీసులు పాలిటిక్స్లోకి.. కరీంనగర్టౌన్: ప్రత్యక్షంగా, పరోక్షంగా ప్రజలకు సేవ చేసే అవకాశం పోలీసులకు, పొలిటీషియన్లకు మాత్రమే దక్కుతుంది. అయితే రాజకీయ నాయకులు జీవితకాలం తమ సేవలను కొనసాగిస్తే, పోలీసులు మాత్రం ఉద్యోగ విరమణ పొందేవరకు మాత్రమే సేవలందించగలుగుతారు. ఆ తర్వాత ప్రజాక్షేత్రంలో ప్రత్యక్షంగా ఉండాలంటే పొలిటీషియన్గా మారడం ఒక్కటే మార్గంగా ఎంచుకుంటున్నారు. పూర్తిగా భిన్న ధృవాలుగా ఉండే ఈ రెండు వర్గాలు పోలీసుల రిటైర్మెంట్ తర్వాత ఒక్కటవుతున్నాయి. ఈ క్రమంలో హుజూరాబాద్ ఉప ఎన్నిక సందర్భంగా ఎన్నో సిత్రాలు చోటుచేసుకుంటున్నారు. మాజీ పోలీసు అధికారి దాసరి భూమయ్య గత నెలలో గులాబీ తీర్థం పుచ్చుకున్నారు. అదే బాటలో వరంగల్కు చెందిన రిటైర్డ్ ఎస్సై ఉపేందర్రావు సోమవారం కిట్స్ కళాశాలలో టీఆర్ఎస్ కండువా కప్పుకున్నారు. గతంలో చాలా మంది పోలీసు అధికారులు పొలిటీషియన్లుగా మారి, ఎమ్మెల్యే, ఎంపీ, మంత్రి పదవుల్లో కొనసాగిన సందర్భాలు ఉన్నాయి. ఇదిలా ఉంటే మరికొంత మంది రిటైర్డ్ పోలీసులు కూడా పొలిటికల్ కేరీర్ను ఎంచుకునేందుకు సిద్ధపడుతున్నట్లు సమాచారం. -
గుజరాత్తోపాటే రాష్ట్రంలో ఎన్నికలు
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో ముందస్తు ఎన్నికలు రాబోవని సీఎం కేసీఆర్ చెప్పడం హాస్యాస్పదంగా ఉందని టీపీసీసీ చీఫ్ ఎ.రేవంత్రెడ్డి వ్యాఖ్యానించారు. గుజరాత్తో పాటు తెలంగాణలో కూడా అసెంబ్లీ ఎన్నికలు రావడం ఖాయమని జోస్యం చెప్పారు. ముందస్తు ఎన్నికల గురించి కేసీఆర్ను ఎవరు అడిగినట్లు చెబుతున్నారంటూ ఎద్దేవా చేశారు. సోమవారం అసెంబ్లీలోని సీఎల్పీ కార్యాలయంలో మీడియాతో రేవంత్ ఇష్టాగోష్టి మాట్లాడారు. అసెంబ్లీ టికెట్లు సజావుగా ఇచ్చే పరిస్థితి టీఆర్ఎస్లో లేదని, ఈ నేపథ్యంలోనే ఆ పార్టీ నేతలు అప్రమత్తం కావొద్దనే ఉద్దేశంతో ముందస్తు ఎన్నికలు ఉండబోవని కేసీఆర్ చెబుతున్నారని వివరించారు. 2022 ఆగస్టు 15తో దేశానికి స్వాతం త్య్రం వచ్చి 75 ఏళ్లు అవుతుందని, ఇది కొత్త శకానికి నాంది అంటూ కేసీఆర్ ముందస్తుకు వెళ్లడం ఖాయమని పేర్కొన్నారు. గుజరాత్ ఎన్నికల సమయానికి తెలంగాణ ప్రభుత్వాన్ని సీఎం కేసీఆర్ రద్దు చేస్తారని, టీఆర్ఎస్లో జరుగుతున్న పరిణామాలన్నీ ముందస్తు ఎన్నికలకు సంకేతమేనని అభిప్రాయపడ్డారు. ప్రభుత్వాన్ని నడపాల్సిన సమయంలో పార్టీపై కేసీఆర్ దృష్టి పెడుతున్నది కూడా అందుకోసమేనని చెప్పా రు. హుజూరాబాద్ ఉప ఎన్నికల తర్వాత టీఆర్ఎస్లో తిరుగుబాటు వస్తుందని పేర్కొన్నా రు. ఆ భయంతోనే పార్టీ ప్లీనరీ, విజయగర్జన సభలు పెడుతున్నారని రేవంత్ ప్రశ్నించారు. హరీశ్రావును కూడా త్వరలోనే పార్టీ నుంచి బయటకు పంపుతారని వ్యాఖ్యానించారు. కేసీఆర్కు ప్రజల మీద సర్జికల్ స్ట్రైక్స్ చేయడం అలవాటని, వారు అప్రమత్తంగా లేనప్పుడు దాడులు చేస్తారని చెప్పారు. గెలిచినా ఓడినా లాభం లేదు హుజూరాబాద్ ఉప ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థి ఈటల రాజేందర్ గెలిచినా ఓడినా ఎవరికీ లాభం లేదని రేవంత్ వ్యాఖ్యానించారు. ఉత్తరప్రదేశ్ ఎన్నికల్లో కేసీఆర్ సహకారం బీజేపీకి ఉంటుందని, తనపై కేసులు పెట్టకుండా, దాడులు చేయకుండా అంతర్గత ఒప్పందం కుదుర్చుకున్నారని ఆరోపించారు. దళితులకేదీ ప్రాధాన్యం? టీఆర్ఎస్ మేనిఫెస్టోలో దళిత, గిరిజనులకు మూడెకరాల భూమి ఇస్తామని ఉందని, అయినా వారిని మోసం చేశారని విమర్శించారు. దళితబంధు కూడా ఎవరూ అడగలేదని, దళితులు అడిగింది ఎస్సీల వర్గీకరణ అని అన్నారు. ఈ విషయంలో ప్రధాని మోదీని ఎన్నిసార్లు కలిసి అడిగారో చెప్పాలని డిమాండ్ చేశారు. కేసీఆర్ దళిత ద్రోహి అని, టీఆర్ఎస్లో దళితులకు ప్రాధాన్యం లేదని చెప్పారు. పార్టీ అధ్యక్ష పదవికి కేసీఆర్ నామినేషన్ వేసే సమయంలో ఒక్క దళిత నాయకుడు లేడని, ఆదివారం జరిగిన పార్టీ సమావేశంలో కూడా ఒక్క దళిత నేతను వేదికపై కూర్చోబెట్టలేదని విమర్శించారు. దళితద్రోహి కేసీఆర్ నాయకత్వంలో దళిత నేత మోత్కుపల్లి నర్సింహులు టీఆర్ఎస్లో చేరారని రేవంత్ ఎద్దేవా చేశారు. తెలంగాణలో కాంగ్రెసే ప్రత్యామ్నాయం ఎవరెన్ని చెప్పినా తెలంగాణలో కాంగ్రెస్ పార్టీయే ప్రత్యామ్నాయమని రేవంత్ అన్నారు. తమ సభలు, సమావేశాలు చూసిన తర్వాతే కేసీఆర్ విజయగర్జన సభ పెడుతున్నారని, ఆయన బయటకు రాక తప్పని పరిస్థితిని కాంగ్రెస్ కల్పించిందని పేర్కొన్నారు. కేసీఆర్ లక్కీ నంబర్ 6 కాబట్లే 15న సభ పెడుతున్నారని, తన లక్కీ నంబర్ 9 కాబట్టి డిసెంబర్ 9న సభ పెడుతున్నామని చెప్పారు. 2014లో టీడీపీ, బీజేపీ సాధించిన ఓట్లను 2023లో బీజేపీ తెచ్చుకోలేదని జోస్యం చెప్పారు. -
బీజేపీని బొంద పెట్టాలి: హరీశ్రావు
హుజూరాబాద్: హుజూరాబాద్ అక్కాచెల్లెళ్లు ఈ నెల 30న ఓటు వేసేందుకు వెళ్లే ముందు గ్యాస్ సిలిండర్కు దండం పెట్టి.. బీజేపీని బొందపెట్టాలని రాష్ట్ర ఆర్థిక మంత్రి తన్నీరు హరీశ్రావు పిలుపునిచ్చారు. సోమవారం హుజూరాబాద్ మండలంలోని కనుకులగిద్ద, జూపాక, బొత్తలపల్లి, రాజపల్లి, శాలపల్లి, రాంపూర్, రంగాపూర్, చెల్పూర్ గ్రామాల్లో టీఆర్ఎస్ అభ్యర్థి గెల్లు శ్రీనివాస్తో కలిసి మంత్రి ఎన్నికల ప్రచారం నిర్వహించారు. హరీశ్రావు మాట్లాడుతూ, ఈటల ఎంతసేపూ తనను పెంచి పెద్దచేసిన కేసీఆర్నే తిడుతున్నారు తప్ప, తాను చేసిన అభివృద్ధి మాత్రం చెప్పడం లేదని విమర్శించారు. బీజేపీ బావుల కాడ మీటర్లు పెట్టమంటోందని.. అందుకు కేసీఆర్ ప్రాణం పోయినా ఒప్పుకోలేదని గుర్తుచేశారు. గెల్లును గెలిపిస్తే పేదలకు ఇళ్లు కట్టిస్తానని.. సొంత జాగా ఉంటే రూ.ఐదు లక్షలు ఇస్తామని భరోసా ఇచ్చారు. ఎప్పటిలాగే ఐకేపీ సెంటర్లు పెట్టి వడ్ల కొనుగోలు ప్రారంభిస్తామని స్పష్టం చేశారు. ధరలు పెంచి పేదల ఉసురు పోసుకుంటున్న పార్టీ బీజేపీ అని, కేసీఆర్ ఎకరానికి రూ.ఐదు వేలు కుడిచేత్తో ఇస్తే, ఎడమ చేత్తో డీజిల్ ధరలు పెంచి గుంజుకుం టున్న పార్టీ బీజేపీ అని విమర్శించారు. రెండున్నరేళ్లు టీఆర్ఎస్ ప్రభుత్వమే ఉంటుందని.. ఎన్నికల తర్వాత ఏ పని జరగాలన్నా సీఎం కేసీఆర్ ఆశీస్సులు ఉండాలన్నారు. బీజేపీ ఉద్యోగాలు ఊడగొడుతోందని, టీఆర్ఎస్ లక్షా 30 వేల ఉద్యోగాలిచ్చిందని, త్వరలో మరో 60 నుం చి 70 వేల ఉద్యోగాలు భర్తీ చేస్తుందని చెప్పారు. -
దళితబంధు ఆపించడం అవివేకం: కొప్పుల ఈశ్వర్
హుజూరాబాద్: దళితబంధు కార్యక్రమాన్ని ఎన్నికలు పూర్తయ్యే వరకు నిలిపివేయాల్సిందిగా ఎన్నికల కమిషన్కు బీజేపీ లేఖలు రాసి అడ్డుకోవడం అవివేకమని రాష్ట్ర సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్ విమర్శించారు. దళితుల జీవితాల్లో వెలుగులు నింపాలనే సదుద్దేశంతో సీఎం కేసీఆర్ ఈ పథకం తెచ్చారని చెప్పారు. ఇప్పటికే 17 వేల మంది దళిత కుటుంబాలకు వారి వారి ఖాతాల్లో డబ్బులు పడ్డాయని తెలిపారు. సోమవారం స్థానిక టీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో ఆయన విలేకరులతో మాట్లాడారు. దళితబంధును పైలెట్ ప్రాజెక్టుగా హుజూరాబాద్ నియోజకవర్గంలో అమలుపరిస్తే, దానిని నిలిపివేయాలని బీజేపీ నాయకుడు ప్రేమేందర్ రెడ్డి లేఖ రాశారని, ఆ లేఖ ఆధారంగానే ఎన్నికల సంఘం దళితబంధును నిలిపివేస్తూ నిర్ణయం తీసుకుందని విమర్శించారు. ఈటల రాజేందర్ కుట్రలో భాగంగానే దళితబంధును నిలిపివేశారని ఆరోపించారు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్.. దళితబంధు పథకాన్ని నిలిపి వేయాల్సిందిగా ఒకవైపు ఎన్నికల సంఘాన్ని డిమాండ్ చేస్తూనే, మరోవైపు సీఎం కేసీఆర్ను నిందించడం వెనుక దగాకోరుతనం తేటతెల్లమవుతోందని అన్నారు. బీజేపీ కుట్రలు దళితులు అర్థం చేసుకోవాలని సూచించారు. ఎమ్మెల్యే బాల్క సుమన్ మాట్లాడుతూ.. అదాని, అంబానీలు బాగుపడితే చాలు, దళిత కుటుంబాలు బాగుపడవద్దనే ఉద్దేశంతోనే బీజేపీ ఇలాంటి నిర్ణయం తీసుకుందన్నారు. బీజేపీని దళిత సమాజం మొత్తం ప్రశ్నించాలన్నారు. అనంతరం బండ శ్రీనివాస్ ఆధ్వర్యంలో ఈటల దిష్టిబొమ్మను స్థానిక అంబేడ్కర్ చౌరస్తా వద్ద దహనం చేశారు. కార్యక్రమంలో ప్రభుత్వ విప్ గువ్వల బాలరాజ్, ఎమ్మెల్యేలు ఆరూరి రమేశ్, సుంకె రవిశంకర్, ఎర్రోళ్ల శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. -
Huzurabad Bypoll: వీళ్లు అభ్యర్థులే కానీ ఇక్కడ ఓటేసుకోలేరు..
సాక్షి, కరీంనగర్: ఎన్నికల సందర్భంగా ఏదైనా పోలింగ్ కేంద్రంలో గరిష్టంగా 1400 మంది ఓటర్లను మాత్రమే ఓటు వేసేందుకు అనుమతిస్తారు. ఎందుకంటే ప్రస్తుతం ఎన్నికల ప్రక్రియలో వినియోగిస్తున్న ఈవీఎంకు అనుసంధానించి ఉండే వీవీ ప్యాట్లోని థర్మల్ కాగితం 1500ల కాగితపు స్లిప్పులను మాత్రమే ముద్రించగలుగుతుంది. 22.5 వోల్టు బ్యాటరీతో పని చేసే వీవీప్యాట్లలో ఓటరు ఎవరికి ఓటు వేసింది. తెలిపేందుకు వీవీ ప్యాట్లోని డిస్ప్లేలో ఓటరు స్లిప్ కనిపిస్తుంది. అయితే ఇందులో 100వరకు కాగితపు స్లిప్పులు పోలింగ్ రోజున జరిగే మాక్ పోలింగ్ ప్రక్రియలోనే ఖర్చవుతాయి. అందుకే ప్రతీ పోలింగ్ స్టేషన్లో గరిష్టంగా 1400 మందికి మాత్రమే ఓటు వేసేందుకు అనుమతి అన్న మాట. చదవండి: ఈటల రాజేందర్ను చిత్తు చిత్తుగా ఓడించండి: హరీశ్ వీళ్లు అభ్యర్థులే కానీ ఓట్లేసుకోలేరు ఎన్నికల బరిలో నిలిచారు.. ఓట్లు అభ్యర్థిస్తున్నారు..తమకే ఓటేయాలని ఊరూరా తిరుగుతున్నారు కానీ ఎన్నికల రోజున మాత్రం ఓటు వేయలేరు. వారి ఓటు వారే వేసుకోలేని పరిస్థితి అన్న మాట. హుజూరాబాద్ ఉపఎన్నికలో ఇతర నియోజకవర్గాల అభ్యర్థులు బరిలో దిగారు. వీరిలో కాంగ్రెస్ అభ్యర్థి బల్మూరి వెంకట్ ఉమ్మడి జిల్లా అయినప్పటికీ హుజూరాబాద్ నియోజకవర్గంలో ఓటు లేదు. హైదరాబాద్లో ఉంది. ఇక రిజిస్టర్డు పార్టీల్లో అలీ మన్సూర్ మహ్మద్ (అన్న వైఎస్సార్ కాంగ్రెస్) నిజామాబాద్ జిల్లావాసి. కన్నం సురేశ్కుమార్(జె స్వరాజ్ పార్టీ)ది మేడ్చల్ జిల్లా. కర్ర రాజిరెడ్డి (ఎంసీపీఐ(యు) శాయంపేట వాసి. లింగిడి వెంకటేశ్వర్లు (ప్రజావాణి పార్టీ)ది సూర్యపేట జిల్లా. చదవండి: మీకు తెలుసా.. ఓట్లు ఎన్నిరకాలుగా వేయవచ్చో..? స్వతంత్ర అభ్యర్థుల్లో ఉప్పు రవీందర్, ఉరుమల్ల విశ్వం, కోట శ్యామ్కుమార్ది కరీంనగర్. ఎడ్ల జోగిరెడ్డి తిమ్మాపూర్ మండలం కాగా కుమ్మరి ప్రవీణ్ది కొత్తపల్లి మండలం కమాన్పూర్. గుగులోతు తిరుపతిది సైదాపూర్. గంజి యుగంధర్ది పర్వతగిరి. బుట్టెంగారి మాధవరెడ్డి, సీపీ సుబ్బారెడ్డి, చెలిక చంద్రశేఖర్, కంటే సాయన్నది మేడ్చల్. చిలుక ఆనంద్ జూలపల్లి. పిడిశెట్టి రాజుది కోహెడ. లింగంపల్లి శ్రీనివాస్రెడ్డిది శంకరపట్నం మండలం కాచారం. వేముల విక్రమ్రెడ్డిది ధర్మపురి మండలం జైనలో ఓటు హక్కు ఉంది. మొత్తంగా 30 మంది అభ్యర్థుల్లో 20 మంది వారి ఓటు వారికే వేసుకోలేరు. -
ఎన్ని కుట్రలు చేసినా భయపడను: ఈటల
హుజూరాబాద్: ‘ఏకు మేకయ్యానని నన్ను ఖతం చేయాలని కుట్ర పన్నారు, ఎన్నికుట్రలు పన్నినా భయపడేదిలేద’ని మాజీమంత్రి ఈటల రాజేందర్ పేర్కొన్నారు. సీఎం కేసీఆర్ ప్రగతిభవన్లో పథకం రచిస్తే హరీశ్రావు హుజూరాబాద్లో అమలు చేస్తు న్నారని ఆరోపించారు. ఆదివారం హుజూరాబాద్ మండలం పోతిరెడ్డిపేట, వెంకట్రావ్పల్లి, బోర్నపల్లి, కొత్తపల్లి, ఇప్పల్నర్సింగాపూర్, దమ్మక్కపేట ల్లో ఎన్నికల ప్రచారం నిర్వహించారు. కేసీఆర్ తనను ఓడించాలన్న ఆత్రుతలో కొంచెమైనా రైతుల కష్టాలపై పెడితే రాష్ట్రం అభివృద్ధి చెందుతుందన్నారు. మాటల్లో రైతు ప్రభుత్వమని చెప్పుకుంటూ.. చేతలో రైతు వ్యతిరేక కార్యకలాపాలు చేస్తున్నారని విమర్శించారు. గతంలో వరి ధాన్యం కొన బోమని సీఎం కేసీఆర్ అంటే తానే కొనాలని చెప్పినట్లు గుర్తుచేశారు. తెలంగాణ ధనిక రాష్ట్రమని చెప్తున్న కేసీఆర్ మహిళా సంఘాలకు వడ్డీ రాయితీ ని ఎందుకు విడుదల చేయడం లేదన్నారు. -
ఆస్తులు కాపాడుకోవడానికే బీజేపీలోకి..
వీణవంక (హుజూరాబాద్): ఈటల రాజేందర్ తన స్వార్థం కోసమే రాజీనామా చేశాడని, బట్ట కాల్చి మీద వేయడంలో ఈటల కన్నా మించినోళ్లులేరని ఆర్థిక మం త్రి తన్నీరు హరీశ్రావు అన్నారు. ఆదివారం కరీంనగర్ జిల్లా వీణవంక మండలం మామిడాలపల్లి, ఇప్పలపల్లి, ఎల్బాక, గంగారంతోపాటు పలు గ్రామాల్లో టీఆర్ఎస్ అభ్యర్థి గెల్లు శ్రీనివాస్ యాదవ్తో కలిసి హరీశ్ ఎన్నికల ప్రచారం నిర్వహించారు. తెలంగాణ ఉద్యమకారుడు, పేదింటి బిడ్డ గెల్లు శ్రీనివాస్ను ఆశీర్వదించాలని కోరారు. తన ఆస్తులను కాపాడుకోవడానికే ఈటల బీజేపీ లో చేరారని, రైతుబంధు దండగ అన్న ఈటల రూ.10 లక్షలు రైతుబంధు కింద తీసుకున్నారని, ఇదెక్కడి న్యాయమో ప్రజలే నిర్ణయించాలన్నారు. కేంద్రం అనాలోచిత నిర్ణయాలతో గ్యాస్ సిలిండర్ ధరలు పెరిగాయని, పెరిగిన సిలండర్ ధరలపై ఇప్పటివరకు ఈటల మాట్లాడలేదని విమర్శించారు. మామిడాలపల్లిని దత్తత తీసుకుంటా మామిడాలపల్లిలో 90 శాతం ఓట్లు టీఆర్ఎస్కు పడితే గ్రామాన్ని దత్తత తీసుకుంటా నని హరీశ్రావు ప్రకటించారు. మాజీ మం త్రి ముద్దసాని దామోదర్రెడ్డి పేరును నిలబెట్టేలా మామిడాలపల్లిలో కార్యక్రమా లు చేపడతానని, ఒక్కసారి అవకాశం ఇచ్చి ఆశీర్వదించాలని టీఆర్ఎస్ అభ్యర్థి గెల్లు శ్రీనివాస్ యాదవ్ ఓటర్లను అభ్యర్థించారు. కార్యక్రమంలో ఎమ్మెల్యేలు పెద్ది సుదర్శన్రెడ్డి, సండ్ర వెంకటవీరయ్య, దాసరి మనోహర్రెడ్డి, ఎమ్మెల్సీ నారదాసు లక్ష్మణ్రావు, టీఆర్ఎస్ నేత పాడి కౌశిక్రెడ్డి పాల్గొన్నారు. -
బీజేపీ గెలిస్తే ఢిల్లీకి గులాంగిరీ
హుజూరాబాద్: బీజేపీ గెలిస్తే ఢిల్లీకి గులాంగిరీ చేయాల్సి ఉంటుందని, టీఆర్ఎస్ గెలిస్తే హుజూరాబాద్ ప్రజలకు గులాంగిరీ చేస్తామని ఆర్థిక మంత్రి తన్నీరు హరీశ్రావు అన్నారు. శనివారం హుజూరాబాద్లోని టీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మంత్రి మాట్లాడారు. గ్యాస్ సిలిండర్ ధరలో నిజంగా రాష్ట్ర పన్ను రూ.291 ఉందా? ఏడేళ్లు మంత్రిగా ఉన్న ఆయనకు ఈ విషయం తెలియదా అన్నారు. సిలిండర్పై పన్ను రాష్ట్ర ప్రభుత్వ పరిధిలో లేదని తెలిపారు. టీఆర్ఎస్ ప్రభుత్వం పండుగ పూట వడ్డీలేని రుణం ఇస్తే, బీజేపీ ప్రభుత్వం గ్యాస్ ధర పెంచిందని విమర్శించారు. మద్యం, మాంసం పంచామని, రూ.20 వేలు ఇస్తున్నామని ప్రజలను రాజేందర్ మోసం చేస్తున్నారని మండిపడ్డారు. ‘ఆరుసార్లు ప్రజలు మిమ్మల్ని గెలిపిస్తే హుజూరాబాద్ ప్రజల ఆత్మగౌరవాన్ని దెబ్బతీస్తున్నారు. గ్రైండర్లు, గడియారాలు, కుట్టుమిషిన్లు పంచింది ఎవరు’ అని హరీశ్ ప్రశ్నించారు. ఈటల ఫ్రస్ట్రేషన్లో మాట్లాడుతున్నారని ఎద్దేవా చేశారు. ‘బీజేపీని మీరు ఓన్ చేసుకోవడం లేదు. మిమ్నల్ని బీజేపీ ఓన్ చేసుకోవడం లేదు. ఎక్కడా జై భారత్మాత అనడం లేదు. జై శ్రీరాం అనడంలేదు’ అని విమర్శించారు. సింగరేణి బొగ్గును మన రాష్ట్రం నుంచి తరలించే కుట్ర జరుగుతోందని.. బొగ్గు లేకుండా కుట్ర చేసినందుకు బీజేపీకి ఓటు వేయాలా? అని నిలదీశారు. సమావేశంలో ఎంపీ బండ ప్రకాశ్, ఎమ్మెల్యే వొడితల సతీశ్కుమార్, మాజీ మంత్రి ఇనుగాల పెద్దిరెడ్డి, టీఆర్ఎస్ నేత పాడి కౌశిక్రెడ్డి, జమ్మికుంట మున్సిపల్ చైర్మన్ రాజేశ్వర్రావు పాల్గొన్నారు. -
ప్రతీరోజు మండలానికో ముఖ్యనేత
సాక్షి, హైదరాబాద్: హుజూరాబాద్ ఉప ఎన్నిక ప్రచారం నిమిత్తం బీజేపీ పకడ్భందీ ప్రణాళిక రూపొందిస్తోంది. ఈ నెల 27న ఎన్నికల ప్రచార పర్వం ముగియనున్న నేపథ్యంలో తదనుగుణంగా దశలవారీగా వివిధ స్థాయిల నేతలు ప్రచారంలో పాల్గొనేలా కార్యచరణ రూపొందిస్తోంది. ఉప ఎన్నిక ప్రచార సమయం ముగిసే దాకా రోజూ నియోజకవర్గంలోని ప్రతీ మండలంలో పార్టీకి చెందిన ఎవరో ఒక ముఖ్యనేత ప్రచారంలో పాల్గొనేలా షెడ్యూల్ను రూపొందిస్తోంది. అధికార టీఆర్ఎస్ తరఫున సీఎం కేసీఆర్ 27న హుస్నాబాద్లో లేదా ముల్కనూర్లో ప్రచారాన్ని ముగించే అవకాశాలున్నాయి. దీంతో కేసీఆర్ సభకు ధీటుగా తాము ప్రచారాన్ని సమాప్తం చేయాలని బీజేపీ భావిస్తోంది. హుజూరాబాద్కు ఆనుకుని ఏదో ఒక చోట కేంద్ర హోంమంత్రి అమిత్ షా లేదా జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా పాల్గొనేలా భారీ బహిరంగ సభ నిర్వహించాలనే ఆలోచనతో పార్టీ నాయకత్వం ఉంది. పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి, రాష్ట్రపార్టీ ఇన్చార్జీ తరుణ్ఛుగ్, పార్టీ జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణ, పార్టీ ఓబీసీ మోర్చా జాతీయ అధ్యక్షుడు డా.కె.లక్ష్మణ్, మరికొందరు నేతలు ప్రచారంలో పాల్గొననున్నట్లు సమాచారం. ముఖ్యనేతల ప్రచారంతో ఊపు... రాష్ట్రానికి చెందిన ముఖ్యనేతలు విస్తృత ప్రచారం జరిపేలా ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ నెల 20 నుంచి ప్రచార పర్వం ముగిసే దాకా బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు, ఎంపీ సంజయ్కుమార్ హుజూరాబాద్ వ్యాప్తంగా ప్రచారాన్ని నిర్వహించనున్నారు. మండలాలు, మున్సిపాలిటీలను చుట్టివచ్చేలా కార్యక్రమాలు ఖరారు చేస్తున్నారు. ఈ నెల 21 నుంచి ప్రచారంలో పాల్గొనేందుకు కేంద్ర మంత్రి జి.కిషన్రెడ్డి సిద్ధమవుతున్నారు. ఇదిలాఉంటే సీనియర్ నేత, మధ్యప్రదేశ్ పార్టీ ఇన్చార్జీ మురళీధర్రావు ఆదివారం ఉదయం 10 గంటలకు నియోజకవర్గంలోని పోతిరెడ్డిపేటలో ప్రచారాన్ని ప్రారంభించనున్నారు. ఆదివారం రాత్రి వరకు వివిధ ప్రాంతాల్లో పర్యటించి పార్టీ అభ్యర్థి ఈటల రాజేందర్ తరఫున ఎన్నికల ప్రచారాన్ని నిర్వహిస్తారు. శక్తి కేంద్రాల ద్వారా పర్యవేక్షణ... గ్రామస్థాయిలో పార్టీ కేడర్ను పోలింగ్ బూత్ల వారీగా వర్గీకరించి తదనుగుణంగా ప్రచార నాయకత్వ బాధ్యతలు అప్పగించింది. గ్రామస్థాయిలో కార్యకర్తల మధ్య సమన్వయానికి మూడు, నాలుగు పోలింగ్ సెంటర్లను కలిపి ఒక శక్తి కేంద్రాన్ని ఏర్పాటు చేశారు. ఈ శక్తి కేంద్రాల బాధ్యులు ఆయా పోలింగ్ కేంద్రాల వారీగా ఓటర్లను కలుసుకుని ప్రచారం నిర్వహిస్తున్నారు. పోలింగ్ బూత్ల వారీగా ఓటర్లను కలిసి, సమన్వయం చేసేందుకు పన్నా ప్రముఖ్ (ఓటర్ల జాబితాలోని ఒక్కో పేజీ ఓటర్ల ఇన్చార్జీ)ను కూడా నియమించి.. బీజేపీ ముందుకు సాగుతోంది. -
ముగిసిన నామినేషన్ల ఉపసంహరణ.. బద్వేలు బరిలో 15 మంది
సాక్షి, వైఎస్సార్ కడప: బద్వేలు ఉపఎన్నికల నామినేషన్ల ఉపసంహరణ ప్రక్రియ ముగిసింది. బద్వేలు బరిలో నామినేషన్ వేసిన పలువురు అభ్యర్థులు తమ నామినేషన్లను బుధవారం ఉపసంహరించుకున్నారు. పలువురు అభ్యర్థుల నామినేషన్ ఉపసంహరణ అనంతరం పోటీలో 15 మంది అభ్యర్థులు నిలిచారు. ఈ రోజు ముగ్గురు స్వతంత్ర అభ్యర్ధులు తమ నామినేషన్లను ఉపసంహరించుకున్నారు. నోటిఫికేషన్ విడుదలైన తర్వాత నుంచి నామినేషన్ గడువు వరకూ 27 మంది నామినేషన్ వేశారు. నామినేషన్ల పరిశీలనలో 9 మంది తిరస్కరణకు గురయ్యారు. చివరగా నామినేషన్ల ఉపసంహరణ అనంతరం 15 మంది అభ్యర్థులు బద్వేల్ ఉపఎన్నిక పోటీలో నిలిచారు. హుజూరాబాద్ బరిలో 30 మంది అభ్యర్థులు సాక్షి, కరీంనగర్: హుజూరాబాద్ ఉప ఎన్నిక నామినేషన్ల ఉపసంహరణ ప్రక్రియ ముగిసింది. ఉప ఎన్నిక పోటీ నుంచి 12 మంది నామినేషన్లను ఉపసంహరించుకున్నారు. హుజూరాబాద్ బరిలో 30 మంది అభ్యర్థులు పోటీలో నిలిచారు. హుజురాబాద్లో నామినేషన్ వేసిన మాజీ మంత్రి, బీజేపీ నేత ఈటెల రాజేందర్ సతీమణి జమున తన నామినేషన్ను విత్ డ్రా చేసుకున్నారు. అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ రెబల్ అభ్యర్థి ఒంటెల లింగారెడ్డి, ఇండిపెండెంట్ అభ్యర్తులు సుమన్ నాయక్, వినోద్ కుమార్, రాజ్ కుమార్, నూర్జహాన్ బేగం, మల్లికార్జున్ తదితరులు తమ నామినేషన్లను విత్ డ్రా చేసుకున్నారు. దీంతో 30 మంది అభ్యర్థులకు గాను రెండు ఈవీఎంలతో హుజూరాబాద్ ఉప ఎన్నిక జరగనుంది. -
పేదల కోసమే కొట్లాడుతా
ఇల్లందకుంట(హుజూరాబాద్): ఎవరెన్ని కుట్రలు చేసినా ఎన్ని ఇబ్బందులు పెట్టినా తుదిశ్వాస వరకు పేదల వైపే ఉంటానని వారి కోసమే కొట్లాడు తానని మాజీమంత్రి, బీజేపీ అభ్యర్థి ఈటల రాజేందర్ స్పష్టం చేశారు. ప్రగతిభవన్లో కూర్చొని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్రావు పన్నిన కుట్రలను ఆయన మేనల్లుడు, మంత్రి హరీశ్రావు హుజూరాబాద్లో అమలుపరుస్తున్నారని, త్వరలోనే ఆయనకు కూడా కనువిప్పు కలుగుతుందన్నారు. జమ్మికుంటలో మంగళవారం ఉదయం నుంచి సాయంత్రం వరకు భారీ ర్యాలీ నిర్వహిస్తూ ఆయన ప్రచారం చేశారు. ఈటల మాట్లాడుతూ ఇజ్జత్ లేని బతుకువద్దని, పూలమ్మిన చోటే కట్టెలమ్మ వద్దనే కేసీఆర్ మంత్రివర్గం నుంచి రాజీనామా చేసి బయటకొచ్చానని తెలిపారు. సీఎం కేసీఆర్కు దళితులపై నిజమైన ప్రేమేఉంటే వారికి మూడెకరాల భూమిని ఎందుకివ్వలేదని ప్రశ్నించారు. ప్రవీణ్కుమార్, ఆకునూరి మురళి లాంటి అత్యుత్తమ అధికారులు కేసీఆర్ కుట్రల్ని భరించలేకే రాజీనామాలు చేశారని ఆరోపించారు. సీఎం డబ్బు సంచులకు, మద్యానికి ఇక్కడి ప్రజలు బానిసలుగా ఉండరని, ఈ నెల 30న టీఆర్ఎస్కు ప్రజలు గుణపాఠం చెబుతారన్నారు. కాగా, జమ్మికుంటలో నిర్వహించిన ప్రచారం లో ఎన్నికల నిబంధనలు, భౌతికదూరం పాటించలేదనే ఫ్లయింగ్స్క్వాడ్ ఫిర్యాదు మేరకు ఈటలపై కేసు నమోదు చేసినట్లు సీఐ రాంచందర్రావు తెలిపారు. -
‘సంక్షేమం’లో రాష్ట్రం రోల్మోడల్
హుజూరాబాద్/ఎల్కతుర్తి: సంక్షేమ పథకాల అమలులో తెలంగాణ రోల్మోడల్గా నిలుస్తోందని రాష్ట్ర ఆర్థికమంత్రి తన్నీరు హరీశ్రావు అన్నారు. మంగళవారం హుజూరాబాద్లోని టీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో సీపీఐ జిల్లా కౌన్సిల్ సభ్యులు పొనగంటి శ్రవణ్కుమార్ తన అనుచరులతో కలిసి పార్టీలో చేరగా మంత్రి పార్టీ కండువా కప్పి ఆహ్వానించారు. మంత్రి మాట్లాడుతూ ‘తెలంగాణ అంటే వలసలు, బొగ్గుబాయి పని. ఇప్పుడు ఈ ఏడేళ్లలో ఇతర రాష్ట్రాల వారు వచ్చి ఇక్కడ పనిచేస్తున్నారు. రైతుబంధు తెలంగాణ మోడల్. 24 గంటల ఉచిత విద్యుత్ తెలంగాణ మోడల్. రైతు బీమా తెలంగాణ మోడల్. టీఎస్ ఐపాస్ తెలంగాణ మోడల్. ఇది మనం చెబుతున్నది కాదు. కేంద్ర మంత్రులు, నీతి ఆయోగ్ సభ్యులే అంటున్నారు’ అని చెప్పారు. హుజూరాబాద్లో అరాచానికి.. అభివృద్ధికి మధ్య పోటీ నడుస్తోందని.. ఈటల మాటల్లో ఒక్క నీతివంతమైన మాట ఉందా? అని నిలదీశారు. ‘గ్యాస్ సిలిండర్ ధర బీజేపీ పాలనలో వెయ్యి రూపాయలకు పెరిగింది. రాజేందర్ మాట్లాడుతూ రాష్ట్ర పన్ను రూ.291 ఉందన్నారు. రూ.291 రాష్ట్ర పన్ను ఉంటే నేను ముక్కు నేలకు రాస్తా. దీనిపై హుజూరాబాద్ అంబేద్కర్ చౌరస్తా వద్ద చర్చకు వస్తావా’ అని సవాల్ విసిరారు. సిలిండర్ ధరను రూ.500కు తగ్గిస్తామని చెప్పి బీజేపీ ఓట్లు అడగాలని పేర్కొన్నారు. హుజూరాబాద్ను అభివృద్ధి చేసి చూపిస్తాం.. హుజూరాబాద్ ఎన్నికల్లో గెల్లు శ్రీనివాస్ యాదవ్ను గెలిపిస్తే నియోజక వర్గాన్ని అన్నివిధాలుగా అభివృద్ధి చేసి చూపిస్తామని హరీశ్రావు హామీ ఇచ్చారు. మంగళవారం హనుమకొండ జిల్లా ఎల్కతుర్తి మండలం పెంచికలపేట గ్రామ శివారులో జరిగిన వడ్డెర కుల ఆశీర్వాద సభలో హరీశ్ మాట్లాడారు. ఆత్మగౌరవం అంటూ ఈటల రాజేందర్ వింతగా మాట్లాడుతున్నాడని, నియోజకవర్గ ప్రజలకు గడియారాలు, కుక్కర్లు పంచిననాడే ఆయన ఆత్మగౌరవం మంటకలిసిందని విమర్శించారు. సమావేశంలో మాజీ మంత్రి ఇనుగాల పెద్దిరెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
హుజురాబాద్ ఉప ఎన్నిక: అన్నా.. ఎవరు గెల్తరంటవే?
సాక్షి, ఇల్లందకుంట(హుజూరాబాద్): రాష్ట్రమంతటా బతుకమ్మ, దసరా సందడి కొనసాగుతుంటే.. హుజూరాబాద్ నియోజకవర్గంలో వీటితో పాటు ఎలక్షన్ల పండగకూడా సందడి చేస్తోంది. పిల్లోడి నుంచి ముసలివాళ్ల వరకు ఇద్దరు, ముగ్గురు కలిసిన చోట ఎన్నికల గురించే చర్చ. ‘అన్నా ఈ ఎలచ్చన్లల్ల.. ఎవరు గెల్తరంటవే’ అంటూ ఊరి సావడివద్ద జోరుగా చర్చ కొనసాగిస్తున్నారు. ఇల్లందకుంట మండలకేంద్రంలోని శ్రీసీతారాముల ఆలయం వద్ద ఉన్న రచ్చబండ వద్ద సోమవారం గ్రామానికి చెందిన పలువురు కూర్చుని ఉన్నారు. ఎన్నికల ముచ్చట్లే మాట్లాడుకుంటున్నా రు.ఈ క్రమంలో ‘సాక్షి’వారిని పలుకరించగా.. భిన్నాభిప్రాయాలు వ్యక్తం చేశారు. అభివృద్ధి చేసేవారికి ఓటు వేస్తామని.. ప్రజల మనిషికి పట్టం కడతామని చెబుతున్నారు. ముచ్చటగా మూడోసారి! కరీంనగర్అర్బన్: హుజూరాబాద్ నియోజకవర్గానికి రాజకీయ రణరంగంలో చెరగని ముద్ర. కమలాపూర్ నియోజకవర్గ కేంద్రంగా 1952లో తొలిసారి ఎన్నికలు జరిగాయి. 1952, 1957 సంవత్సరాల్లో జరిగిన అసెంబ్లీ ఎన్నికలు ద్విసభ్యుల ప్రాతినిథ్యంగా సాగాయి. 1952లో పి.నారాయణరావు(కాంగ్రెస్), జి.వెంకటేశం(సోషలిస్టు)లు ఎమ్మెల్యేలుగా గెలుపొందారు. 1957లో జరిగిన ఎన్నికల్లో స్వతంత్ర అభ్యర్థులు పి.నర్సింగరావు, జి.రాములు గెలిచారు. 1962నుంచి ఒకరే ప్రాతినిథ్యంగా ఎన్నికలు జరుగుతున్నాయి. 2008లో హుజూరాబాద్ కేంద్రంగా ఉపఎన్నిక జరగగా తెరాస అభ్యర్థి కెప్టెన్ లక్ష్మీకాంతారావు గెలుపొందారు. 2010లో జరిగిన ఉపఎన్నికలో తెరాస అభ్యర్థి ఈటల రాజేందర్ గెలుపొందారు. తాజాగా మూడో సారి ఉప ఎన్నిక జరుగుతోంది. వృద్ధుల నుంచి యువకుల వరకు పోటీ కరీంనగర్టౌన్: హుజూరాబాద్ ఉప ఎన్నిక బరిలో 61మంది అభ్యర్థులు నామినేషన్లు సమర్పించగా, పరిశీలన తర్వాత 43 మంది మిగిలారు. ఇందులో 68 ఏళ్ల వృద్ధుడి నుంచి 25 ఏళ్ల యువకుడి వరకు పోటీలో నిలవడం ఆసక్తి కల్గిస్తోంది. ప్రధాన పార్టీల అభ్యర్థుల్లో బీజేపీ అభ్యర్థిగా బరిలో నిలిచిన ఈటల రాజేందర్ వయస్సు 57 ఏళ్లు కాగా, ఆ తర్వాతి స్థానంలో టీఆర్ఎస్ అభ్యర్థి గెల్లు శ్రీనివాస్ 38, బల్మూరి వెంకటనర్సింగరావుకు 29 ఏళ్లు ఉన్నారు. ఇక స్వతంత్ర అభ్యర్థుల్లో చెండులూరి వెంకటసుబ్బారెడ్డి వయస్సు 68 ఏళ్లు కాగా, చిన్న వయసు్కడిగా రావుల సునీల్ 25 బరిలో నిలిచారు. ఈనెల 13న నామినేషన్ల విత్డ్రాలు ఉండగా, అప్పటి వరకు బరిలో నిలిచేదెవరో తేలనుంది. రూ.5.55 లక్షలు పట్టివేత పోలీసుల తనిఖీల్లో సోమవారం మధ్యాహ్నం రూ.4.50 లక్షల నగదు పట్టుపడింది. కరీంనగర్ టూ టౌన్ సీఐ టి.లక్ష్మీబాబు, ఎస్సైలు టి.మహేశ్, రవీందర్ సిబ్బందితో కలిసి కోర్టుచౌరస్తా వద్ద తనిఖీలు చేస్తుండగా.. కారులో నగదు పట్టుబడింది. స్వాధీనం చేసుకుని రెవెన్యూ అధికారులకు అప్పగించారు. రూ.1.05లక్షలు ఇల్లందకుంట(హుజూరాబాద్): హుజూరాబాద్ ఉపఎన్నిక సందర్భంగా సోమవారం జమ్మికుంట మండలంలో సీఐ రాంచందర్రావు ఆధ్వర్యంలో విస్తృతంగా తనిఖీలు చేపట్టారు. ఎలాంటి ఆధారాలు లేకుండా తరలిస్తున్న రూ.1.05 లక్షలు పట్టుకున్నట్లు తెలి పారు. ఈ డబ్బును ఎన్నికల అధికారులకు అప్పగించినట్లు పేర్కొన్నారు. ఆ గుర్తులపైనే మక్కువ.. సాక్షి, కరీంనగర్:హుజూరాబాద్ ఉపఎన్నికల్లో ప్రధానపార్టీలతో పాటు స్వతంత్రులు కలిపి 43మంది బరిలోనిలిచారు. నామినేషన్ల సందర్భంగా స్వతంత్ర అభ్యర్థులకు గుర్తులను ఎంపిక చేసుకునే అవకాశాన్ని ఎన్నికల సంఘం ఇచ్చింది. దీంతో ప్రధాన పార్టీల గుర్తులను పోలిఉండే విధంగా చాలా మంది స్వతంత్రులు తమగుర్తులను ఎంపిక చేసుకోవడం గమనార్హం. ముఖ్యంగా కారును, కమలం గుర్తును పోలిఉండే విధంగా ఉండే గుర్తులపైనే చాలా మంది స్వతంత్రులు మక్కువ చూపారు. ట్రక్కు, రోడ్డురోలర్, ఆటోరిక్షా, ట్రాక్టర్, బస్ లారీ, కమలం గుర్తును పోలి ఉండే క్యాలిఫ్లవర్, పైనాపిల్, పెన్నిబ్ విల్ సన్రేస్ గుర్తులు కావాలని ఆప్షన్గా ఎంచుకున్నారు. ఈ గుర్తులతో ప్రధాన పార్టీల అభ్యర్థులను ఇరుకున పెట్టడమే కాకుండా తమకు కూడా కొన్ని ఓట్లు వస్తాయని భావిస్తున్నారు. ఈ గుర్తుల ఎంపిక వెనుక రాజకీయ పార్టీలు వ్యూహాలు కూడా ఉన్నట్లు తెలుస్తోంది. స్వంతంత్రులు కోరుకున్న 50 గుర్తుల్లో ట్రక్కు, బ్యాట్స్మన్, రోడ్డు రోలర్, చపాతిరోలర్, ఫ్రాక్, కప్పుసాసర్, ట్రాక్టర్, గ్లాసుతంబ్లర్, కుండ, టార్చిలైట్, పతంగి, కుట్టుమిషన్, సీలింగ్ఫ్యాన్, టెలివిజన్, ఆటోరిక్షా, సూట్కేస్, పెన్నిబ్ విత్ సెవన్రేస్, హెలికాప్టర్, రైతునాగలి, ఫ్లూట్, విజిల్, కంప్యూటర్, క్యారంబోర్డు, కాలిఫ్లవర్, పైనాపిల్, రింగ్, గ్యాస్సిలిండర్, స్టూల్, టైర్, బ్యాట్, గ్లాస్, సాక్స్, స్టాప్లర్, బాల్, అగ్గిపెట్టె, టేబుల్ఫ్యాన్, డైమండ్, టేబుల్, పండ్ల గంప, ట్రాక్టర్టిల్లర్, డీజిల్ఇంజిన్, హార్మోనియం, ఊయల, ఆపిల్, గ్యాస్స్టవ్, షూ, సీసీ టీవీ కెమెరా, ఇస్త్రీపెట్టె, బస్, లారీ ఉన్నాయి. -
కేసీఆర్ మోకాళ్ల మీద నడిచినా ఓట్లెయరు
కమలాపూర్: ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్రావు మోకాళ్ల మీద నడిచినా, మోచేతుల మీద పబ్బతి పట్టినా టీఆర్ఎస్కు హుజూరాబాద్ ప్రజలు ఓట్లు వేయరని మాజీ మంత్రి, బీజేపీ అభ్యర్థి ఈటల రాజేందర్ అన్నారు. హనుమకొండ జిల్లా కమలాపూర్ మండలం బత్తినివానిపల్లిలోని హనుమాన్ దేవాలయంలో శనివారం ఆయన ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం బత్తినివానిపల్లి, గోపాల్పూర్, శనిగరం, మాదన్నపేట, గూనిపర్తి గ్రామా ల్లో ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఈటల మాట్లాడుతూ..నేను మీకు బక్క పలుచగా కనిపిస్తుండొచ్చని కానీ, చిచ్చర పిడుగునని మాత్రం సీఎం కేసీఆర్ మరిచిపోవద్దన్నారు. ప్రగతి భవన్లో ప్లాన్లు వేసేది కేసీఆర్ అయితే, వాటిని అమలు చేస్తున్నది హరీశ్రావు అన్నారు. నయీం లాంటోడే చంపాలని చూసినా తాను భయపడలేదని, తనకు గన్మెన్లను తొలగించినంతమాత్రాన భయపడిపోతానా అని ప్రశ్నించారు. తాను నమ్ముకున్నది గన్మెన్లను కాదని ప్రజలనని స్పష్టం చేశారు. తనకు ఏమైనా జరిగితే ఒక్క హుజూరాబాద్లోనే కాదు యావత్ రాష్ట్రం కన్నీరు పెడుతుందని చెప్పారు. దసరాకు మందు, మాంసం, నగదు ఇస్తారని ప్రచారం జరుగుతోందని, అవన్నీ తీసుకుని ఓటు మాత్రం కమలం పువ్వుకే వేయాలని ఆయన కోరారు. -
టీఆర్ఎస్, బీజేపీ ఒక్కటే: బల్మూరి
కమలాపూర్: టీఆర్ఎస్, బీజేపీ పార్టీలు రెండూ ఒక్కటేనని, వారి వ్యక్తిగత లాభాల కోసం ఎన్నికలు తీసు కొచ్చాయని హుజూరాబాద్ కాంగ్రెస్ అభ్యర్థి బల్మూరి వెంకట నర్సింగరావు ఆరోపించారు. శనివారం హనుమకొండ జిల్లా కమలాపూర్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. తాను విద్యార్థులు, యువకుల కోసం చేసిన పోరాటం చూసి కాంగ్రెస్ పార్టీ ఈ అవకాశం ఇచ్చిందన్నారు. ప్రజలకు జరుగుతున్న అన్యాయాన్ని గళమెత్తి వినిపించడానికి, ఇక్కడున్న 36 వేలమంది నిరుద్యోగులు, ఫీజు రీయింబర్స్మెంట్ రాక చదువు ఆపేసిన 20 వేల మంది విద్యార్థుల ప్రతినిధిగా పార్టీ తనను అభ్యర్థిగా ఎంపిక చేసిందన్నారు. -
కేటీఆర్ను సీఎం చేయడమే కేసీఆర్ లక్ష్యం
వరంగల్: తన కుమారుడు కేటీఆర్ను రాష్ట్ర ముఖ్యమంత్రిగా చేసేందుకు కేసీఆర్ వ్యూహాలు రచిస్తున్నారని టీపీసీసీ చీఫ్ రేవంత్రెడ్డి అన్నారు. శుక్రవారం ఆయన హుజూరాబాద్ వెళుతూ, మధ్యలో హనుమకొండలోని పీసీసీ ఉపాధ్యక్షుడు వేం నరేందర్రెడ్డి నివాసంలో కొద్దిసేపు ఆగారు. ఈ సందర్భంగా రాష్ట్ర రాజకీయాలు, టీఆర్ఎస్ ప్రభుత్వ వైఖరిపై మీడియాతో ఇష్టాగోష్టిగా మాట్లాడారు. హుజూరాబాద్ ఎన్నికను ప్రతిష్టాత్మకంగా తీసుకున్న సీఎం కేసీఆర్, కేటీఆర్కు ఆ బాధ్యతలు ఎందుకు అప్పగించలేదని ప్రశ్నించారు. ఈటల, హరీశ్లు మంచి మిత్రులే కాకుండా వ్యాపార భాగస్వాములని, వారిని విడగొట్టేందుకే ఉప ఎన్నిక బాధ్యతలను హరీశ్రావుకు అప్పగించారని అన్నారు. ఈటల ఉప ఎన్నికలో ఓటమి పాలైతే బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్, కేంద్ర మంత్రి కిషన్రెడ్డిలు రాజకీయంగా ఇబ్బందులు పడే అవకాశాలున్నాయన్నారు. సీఎం కేసీఆర్, మంత్రి కేటీఆర్లు ఇక్కడ బీజేపీపై ఆరోపణలు చేయడం ఒక డ్రామా అని, ఇటీవల ఢిల్లీకి వెళ్లిన కేసీఆర్.. సీఎంగా కేటీఆర్ను చేసేందుకు కాషాయ అధిష్టానంతో మంతనాలు జరిపారని పేర్కొన్నారు. కాగా, కాంగ్రెస్ పార్టీలోనూ కసబ్లు ఉన్నారని, ఒకరు బయట పడ్డారని, ఇంకా కొందరు పార్టీలోనే ఉన్నారని అన్నారు. అతని హయాంలో జిల్లాకు ఒకరిద్దరు చొప్పున కసబ్లను తయారు చేశారని పేర్కొన్నారు. ఈ సమావేశంలో మాజీ మంత్రి గీతారెడ్డి, డీసీసీ అధ్యక్షుడు నాయిని రాజేందర్రెడ్డి, మాజీ మేయర్ ఎర్రబెల్లి స్వర్ణ తదితరులు పాల్గొన్నారు. -
హరీశ్, ఈటల తోడు దొంగలే..
హుజూరాబాద్: హరీశ్రావు, ఈటల రాజేందర్.. ఇద్దరూ తోడు దొంగలేనని టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్రెడ్డి ఆరోపించారు. శుక్రవారం కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి బల్మూరి వెంకటనరసింగరావు.. మాజీ డిప్యూటీ సీఎం దామోదర రాజనర్సింహ, మాజీ ఎంపీ పొన్నం ప్రభాకర్లతో కలసి నామినేషన్ వేశారు. అనంతరం హుజూరాబాద్ పట్టణంలోని డిపోక్రాస్ వద్ద జరిగిన ఎన్నికల ప్రచారంలో రేవంత్రెడ్డి మాట్లాడారు. విద్యార్థులు, నిరుద్యోగుల త్యాగం వల్ల తెలంగాణ వచ్చిందన్నారు. వారి త్యాగాలు వృథా కాకుండా కేసీఆర్ను గద్దె దించేందుకే విద్యార్థి నాయకుడైన బల్మూరి వెంకట్ను కాంగ్రెస్ పార్టీ పోటీకి నిలిపిందన్నారు. హుజూరాబాద్లో టీఆర్ఎస్, బీజేపీ నాయకులు అక్రమ సంపాదనతో వందల కోట్లు ఖర్చు చేస్తున్నారని, అలాంటి సంపద కాంగ్రెస్ నాయకుల వద్ద లేదని అన్నారు. 25 ఏళ్ల యువకుడికి కాంగ్రెస్ అవకాశం ఇచ్చిందని.. ప్రజలకు సేవ చేసే అవకాశాన్ని కల్పించి యువకుడైన ఎన్ఎస్యూఐ రాష్ట్ర అధ్యక్షుడు వెంకట్ను ఆశీర్వదించాలని ప్రజలను కోరారు. కేసీఆర్, ఈటల వద్ద ఉన్నంత డబ్బు కాంగ్రెస్ అభ్యర్థి దగ్గర లేదన్నారు. కేసీఆర్, ఈటల రాజేందర్లది ప్రజల సమస్య కాదని, పైసలు.. పంపకాల పంచాయతీ అని అన్నారు. హుజూ రాబాద్లో బీజేపీ, టీఆర్ఎస్ కోట్లు పోసి నాయకులను కొంటున్నాయని, అభివృద్ధి జరిగిందని చెబుతున్న టీఆర్ఎస్, ఆత్మగౌరవం అంటున్న ఈటల రాజేందర్లకు నేతలను కొనాల్సిన అవసర మేంటని ప్రశ్నించారు. కేసీఆర్ ఈ ఏడేళ్లలో ప్రజలకు చేసిందేమీ లేదని, కానీ అల్లుడిని అంబానీ, బిడ్డను బిర్లా, కొడుకును టాటా చేశారని విమర్శిం చారు. కసబోడు అమ్ముడు పోయాడని, వాని పేరు తలవడమే తనకు ఇష్టం లేదని పరోక్షంగా పాడి కౌశిక్రెడ్డిని ఉద్దేశించి విమర్శించారు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్, ప్రజల సమస్యలను ఎప్పుడూ పట్టించుకోలేదని పేర్కొన్నారు. ఏడేళ్లుగా ఇటువైపు కన్నెత్తి చూడని వారు ఇప్పుడు హుజూరాబాద్కు వచ్చి అది చేస్తాం, ఇది చేస్తామని చెప్తున్నారని, ఎన్నికల తర్వాత ఎవరూ కనిపించరని ధ్వజమెత్తారు. కేసీఆర్ వంటి నయవంచకుడి మెడలు వంచాలంటే బల్మూర్ను గెలిపించాలని కోరారు. నేను కరీంనగర్ జిల్లా బిడ్డనే.. ‘నేను కరీంనగర్ జిల్లా బిడ్డనే. మారుమూల పల్లె నుంచి వచ్చిన వాడిని. ఎంబీబీఎస్ విద్యార్థినైనా ఇతర విద్యార్థుల సమస్యల పరిష్కారం కోసం ఎంతో పోరాటం చేశాను. హుజూరాబాద్ ఎమ్మెల్యేగా నన్ను గెలిపిస్తే 365 రోజులు మీకు అండగా ఉంటా. విద్యార్థులకు, యువకులకు, ప్రజలకు సేవ చేయమని నా తల్లి పంపింది. ప్రజల సమస్యలపై పోరాడి పరిష్కరించే వరకు పనిచేస్తా. లేనిపక్షంలో రాజకీయాల నుంచి తప్పుకుంటా’అని కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి బల్మూరి వెంకట్ అన్నారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీ జీవన్రెడ్డి, మాజీ ఎంపీలు మధుయాష్కీగౌడ్, పొన్నం ప్రభాకర్, మాజీ మంత్రులు గీతారెడ్డి, షబ్సీర్ అలీ, ఎమ్మెల్యే శ్రీధర్బాబు, మాజీ ఎమ్మెల్సీ ప్రేంసాగర్రావు తదితరులు పాల్గొన్నారు. -
చేతులెత్తి మొక్కుతాం .. టీఆర్ఎస్ను ఓడించండి
సాక్షి ప్రతినిధి, కరీంనగర్: చేతులెత్తి మొక్కుతాం..హుజూరాబాద్లో టీఆర్ఎస్ను ఓడించాలని ఉపాధి హామీ ఫీల్డ్ అసిస్టెంట్లు విజ్ఞప్తి చేశారు. తమను ఉద్యోగాల నుంచి తొలగించినందుకు నిరసనగా ఉపఎన్నికలో నామినేషన్లు వేసేందుకు ఫీల్డ్ అసిస్టెంట్లు గురువారం భారీగా హుజూరాబాద్కు తరలివచ్చారు. అయితే తాము నామినేషన్లు వేయకుండా పోలీసులు, అధికారులు అడ్డుకున్నారని వారు ఆరోపించారు. ఫీల్డ్ అసిస్టెంట్ల సంఘం జేఏసీ చైర్మన్ శ్యామలయ్య నేతృత్వంలో టీఆర్ఎస్కు వ్యతిరేకంగా ప్రచారం నిర్వహించారు. దండం పెడుతూ, గడ్డం పట్టుకుని బతిమాలుతూ ఈ ఉప ఎన్నికల్లో ప్రభుత్వానికి బుద్ధి చెప్పాలని కోరారు. అంతకుముందు హుజూరాబాద్ ఆర్డీవో కార్యాలయం వద్ద ఆందోళనకు దిగారు. సుమారు 150 మంది రోడ్డుపైనే నిరసన చేపట్టారు. -
హుజూరాబాద్లో ప్రజాస్వామ్యం ఖూనీ!
సాక్షి, హైదరాబాద్: హుజూరాబాద్ ఉపఎన్నికలో నామినేషన్లు వేయకుండా రిటర్నింగ్ అధికారి అడ్డుకుంటున్నారని.. ఆ అధికారిని వెంటనే తొలగించాలని వైఎస్సార్ తెలంగాణ పార్టీ అధినాయకురాలు వైఎస్ షర్మిల డిమాండ్ చేశారు. ఈ మేరకు ఆమె గురువారం తెలంగాణ ఎన్నికల ప్రధాన అధికారి శశాంక్ గోయెల్ను కలిసి ఫిర్యాదు చేశారు. హుజూరాబాద్ రిటర్నింగ్ అధికారి సీఎం కేసీఆర్కు అమ్ముడుపోయారని ఆరోపించారు. ఈ క్రమంలోనే రకరకాల కారణాలు చూపుతూ.. నామినేషన్లు వేయకుండా అడ్డంకులు సృష్టిస్తున్నారని మండిపడ్డారు. నామినేషన్ల కోసం రోజుకో రూల్ పెడుతున్నారని ఆక్షేపించారు. ఉపాధి హామీ ఫీల్డ్ అసిస్టెంట్లు నామినేషన్లు వేయడానికి వస్తే తిప్పిపంపేస్తున్నారన్నారు. నామినేషన్ల గడువును పొడిగించాలని రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారిని కోరారు. ఈ మొత్తం వ్యవహారం మీద కోర్టుకు వెళ్తామన్నారు. ఫీల్డ్ అసిస్టెంట్లను తొలగించడం దారుణం పోలీసులు సీఎం కేసీఆర్కు తొత్తులుగా మారారని ఆరోపించారు. హుజూరాబాద్లో పట్టపగలే ప్రజాస్వామ్యం ఖూనీ అవుతోందని వైఎస్ షర్మిల వ్యాఖ్యానించారు. ఫీల్డ్ అసిస్టెంట్లను తొలగించడం దారుణమన్నారు. రైతులు ఆత్మహత్యలకు పాల్పడుతున్నా పట్టించుకోవడం లేదని ఆరోపించారు. -
బానిసత్వ బతుకులకు స్వస్తి పలకాలి
ఇల్లందకుంట(హుజూరాబాద్): తెలంగాణలో బాంచన్ బానిసత్వ బతుకులకు స్వస్తి పలకాలని..మేకల్లాగా కాకుండా పులి బిడ్డలా బతకాలని మాజీమంత్రి, బీజేపీ అభ్యర్థి ఈటల రాజేందర్ పేర్కొన్నారు. జమ్మికుంట పట్టణంలో గురువారం బీజేపీ దళిత మోర్చా, మైనారిటీ మోర్చా ఆధ్వర్యంలో నిర్వహించిన ఆత్మీయ సమ్మేళనంలో ఈటల రాజేందర్ పాల్గొని మాట్లాడారు. చిన్నతనం లోనే దళిత హక్కులు, ఆత్మగౌరవం కోసం కొట్లాడితే తమ కుటుంబాన్ని కుల బహిష్కరణ చేసిన విషయాన్ని ఈ సందర్భంగా గుర్తు చేశారు. సీఎం కేసీఆర్ది నియంత ధోరణి అని ఆరోపించారు. 2018 ఎన్నికల్లోనే తనను ఓడించేందుకు కాంగ్రెస్ అభ్యర్థికి డబ్బులిచ్చి ప్రయత్నం చేశారని..తాను జీతగాణ్ణి కాదని, తాను కూడా గులాబీ జెండాకు ఓనర్నేనని ఆనాడే ప్రకటించానని పేర్కొన్నారు. పదవుల కోసం పెదవులు మూసే వ్యక్తి హరీశ్రావు అని..తాను గొంతెత్తిన తర్వాతే హరీశ్రావుకు మంత్రి పదవి ఇచ్చారని తెలిపారు. దళిత బిడ్డ ప్రదీప్ చంద్ర సీఎస్గా పదవీ విరమణ చేస్తే అక్కడికి వెళ్లకుండా అవమానించారని, ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్, ఆకునూరి మురళి లాంటి దళిత ఐఏఎస్, ఐపీఎస్ అధికారులను మానసిక ఒత్తిళ్లకు గురిచేసి వారి ఉద్యోగాలకు రాజీనామాలు ఇచ్చేలా చేసింది కేసీఆర్ కాదా? అని ప్రశ్నించారు. పార్టీలు జెండాలు, సిద్ధాంతాల కంటే మానవ సంబంధాలు గొప్పవని చెప్పారు. కార్యక్రమంలో మాజీ ఎంపీ వివేక్ వెంకటస్వామి, కర్ణాటక ఎంపీ మునుస్వామి, మాజీ ఎమ్మెల్యే బొడిగె శోభ, మాజీమంత్రులు చంద్రశేఖర్, బాబు మోహన్ పాల్గొన్నారు. -
ఈటల స్వార్థం వల్లే ఉపఎన్నిక
హుజూరాబాద్: ‘హుజూరాబాద్ ఉపఎన్నిక ఈటల రాజేందర్ స్వార్థం వల్ల వచ్చింది. హుజూరాబాద్ జిల్లా కావాలనో, హుజూరాబాద్కు మెడికల్ కాలేజీ కావాలనో ఆయన రాజీనామా చేశారా? స్వలాభం కోసం రాజీనామా చేశారు. వ్యక్తి లాభం ముఖ్యమా.. వ్యవస్థ లాభం ముఖ్యమా అన్నది ప్రజలు ఆలోచన చేయాలి’అని రాష్ట్ర ఆర్థిక మంత్రి తన్నీరు హరీశ్రావు అన్నారు. గురువారం హుజూరాబాద్ మండలంలోని ధర్మరాజుపల్లి, పెద్దపాపయ్యపల్లి, కాట్రపల్లి సిర్సపల్లి, వెంకట్రావ్పల్లి గ్రామాల్లో టీఆర్ఎస్ అభ్యర్థి గెల్లు శ్రీనివాస్తో కలిసి హరీశ్ ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడతూ.. బీజేపీ ప్రజలకు ఏం చేసిందని ఆ పార్టీలో చేరారో ఈటల రాజేందర్ ప్రజలకు చెప్పాలన్నారు. గ్యాస్ సిలిండర్ ధర వెయ్యి రూపాయలు చేసిన బీజేపీ.. నిన్న మరో రూ.15 పెంచి ప్రజలకు వాతలు పెడుతోందని విమర్శించారు. ధరలు పెంచే బీజేపీకి ఓటు వేయాలా? బీజేపీ పాలిత రాష్ట్రాల్లో ఎక్కడైనా ఆడపిల్ల పెళ్లికి లక్ష రూపాయల సాయం చేస్తున్నారా అని ప్రశ్నించారు. ‘ఆరుసార్లు ఈటలను గెలిపించినా ఒక్క ఇల్లు కట్టలేదు. గెల్లుని గెలిపిస్తే డబుల్ బెడ్రూం ఇళ్లు కట్టిస్తామని’హామీఇచ్చారు. కాట్రపల్లి గ్రామానికి రూ.రెండు కోట్లు మంజూరు చేశామని తెలిపారు. ఎంపీ బండి సంజయ్ గెలిచి రెండేళ్లు దాటినా ఒక్క పని అయినా చేశాడా అని నిలదీశారు. కార్యక్రమంలో ఎమ్మెల్యే సతీశ్కుమార్, మాజీ మంత్రి ఇనుగాల పెద్దిరెడ్డి పాల్గొన్నారు. -
హుజురాబాద్ ఉపఎన్నిక: రెండో డోసు సర్టిఫికెట్ ఉంటేనే రండి!
సాక్షి, కరీంనగర్: రాష్ట్రవ్యాప్తంగా అందరి దృష్టిని ఆకర్షిస్తోన్న హుజూరాబాద్ ఉప ఎన్నికలో పలు ఆసక్తికర పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి. తమ నిరసన తెలపాలనుకునేవారికి హుజూరాబాద్ వేదికలా మారితే, కోవిడ్ నిబంధనలు ప్రతిబంధకంగా మారాయి. దీనిపై నామినేషన్ వేసేందుకు వస్తున్న అభ్యర్థులు తీవ్ర అభ్యంతరం తెలుపుతున్నారు. రాష్ట్ర నలుమూలల నుంచి వివిధ వర్గాల వ్యక్తులు, బాధితులు, ఫీల్డ్ అసిస్టెంట్లు, నిరుద్యోగులు తమవాణిని ప్రభుత్వానికి, ప్రజలకు వినిపించాలన్న ఆశయంతో నామినేషన్లు వేసేందుకు ఆసక్తి చూపిస్తున్నారు. ఇలా వచ్చేవారిలో కొందరికి ప్రవర్తనా నియమావళి (ఎంసీసీ)పై అవగాహన లేకపోవడంతో వెనుదిరుగాల్సి వస్తోంది. కోవిడ్ నేపథ్యంలో జరుగుతున్న ఉప ఎన్నికలు కావడంతో అధికారులు సెకండ్ డోస్ సర్టిఫికెట్ తప్పనిసరి చేశారు. వాస్తవానికి ఇది కొత్త నిబంధనేం కాదు, షెడ్యూల్ విడుదలైన సెప్టెంబరు 28వ తేదీన కలెక్టర్ విలేకరుల సమావేశంలో ఈ విషయాన్ని స్పష్టంగా వివరించారు. ఎన్నికలో పోటీ చేసే అభ్యర్థులు, విధుల్లో పాల్గొనే ఉద్యోగులు అంతా సెకండ్ డోస్ సర్టిఫికెట్ కలిగి ఉండాలని, మాస్క్, శానిటైజేషన్ నిబంధన విధిగా పాటించాలని స్పష్టంచేశారు. కానీ, నామినేషన్ మొదలైన రోజు నుంచి వస్తున్న అభ్యర్థుల్లో చాలా తక్కువ మంది మాత్రమే ఈ నిబంధనలను పాటించారు. గుర్తింపులేని పార్టీలు, స్వతంత్ర అభ్యర్థులు భారీగా అనుచరులతో వస్తూ కరోనా నిబంధనలను ఉల్లంఘిస్తున్నారు. నామినేషన్ పత్రాలు సమర్పించే విషయంలోనూ పలు లోపాలు ఉన్న వాటిని అధికారులు తిరస్కరిస్తున్నారు. చదవండి: నేటి నుంచి బతుకమ్మ సంబరాలు మొదలు.. పండుగ నేపథ్యం ఇదే నియోజకవర్గంలో డ్రోన్లతో నిఘా.. ఉప ఎన్నిక నేపథ్యంలో పోలీసు అధికారులు నిఘా, తనిఖీలు ముమ్మరం చేశారు. అభ్యర్థులు నామినేషన్లువేస్తున్న ఆర్డీవో కార్యాలయంతోపాటు పలు సమస్మాత్మక ప్రాంతాల్లో డ్రోన్లను రంగంలోకి దింపారు. కరోనా జాగ్రత్తల నేపథ్యంలో శాంతిభద్రతలతోపాటు, రాజకీయ పార్టీల నాయకులు, సమావేశాలపై నిఘా కోసమే వీటితో పర్యవేక్షణ చేస్తున్నారు. మరోవైపు హుజూరాబాద్కు వెళ్లే అన్ని రహదారులపై పకడ్బందీగా తనిఖీలు చేపడుతున్నారు. హన్మకొండ– కరీంనగర్ జిల్లాసరిహద్దులోని పెంచికల్పేట స్టేజీ వద్ద నిర్వహించిన తనిఖీల్లో సీపీ సత్యనారాయణ, అడిషనల్ డీసీపీ శ్రీనివాస్ (ఎల్ అండ్ వో)లు పాల్గొన్నారు. చదవండి: కుట్ర మామది.. ఆచరణ అల్లుడిది: ఈటల 8న రాజేందర్, వెంకట్ నామినేషన్లు ఈనెల 1వ తేదీన నామినేషన్ల పర్వం మొదలైంది. తొలిరోజు టీఆర్ఎస్ నుంచి గెల్లు శ్రీనివాస్ యాదవ్ రెండు, మరో ఇండిపెండెంట్ ఒక సెట్ నామినేషన్ పత్రాలు దాఖలు చేశారు. తరువాత 2, 3వ తేదీలు సెలవుదినాలు. సోమవారం ఈటల రాజేందర్ సతీమణి జమున ఒక సెట్, ఇద్దరు ఇండిపెండెంట్లు రెండేసి చొప్పున మొత్తం 5 సెట్ల నామినేషన్లు దాఖలు చేశారు. చదవండి: ఏం జరిగినా హుజురాబాద్లో గెలిచేది ఆయనే: కొండా విశ్వేశ్వర్రెడ్డి మంగళవారం కేవలం ఒకే ఒక్కనామినేషన్ దాఖలైంది. కూకట్పల్లికి చెందిన సాప్ట్వేర్ ఇంజినీర్ చాలిక చంద్రశేఖర్ నామినేషన్ దాఖలు చేశారు. స్వతంత్రులు అబ్బాడి బుచ్చిరెడ్డి, నూర్జహాన్ బేగం, రమేష్బాబు, మురుగు రామచంద్రు, బరిగె గట్టయ్య (టీఆర్ఎస్ రెబల్ ), మహ్మద్ మన్సూర్ అలీ (అన్న వైఎస్సార్ పార్టీ), రిటైర్డ్ ఎంప్లాయిస్ను సెకండ్ డోస్ సర్టిఫికెట్ లేదని అధికారులు తిప్పిపంపారు. చేసేదిలేక ఆ అభ్యర్థులంతా వెనుదిరిగారు. కానీ, తహసీల్దార్తో రిటైర్డ్ ఎంప్లాయిస్ వాగ్వాదానికి దిగారు. అధికారుల తీరుపై తాము ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేస్తామని స్పష్టంచేశారు. బుధవారం ఎంగిలిపూల అమావాస్య కావడంతో నామినేషన్లకు ప్రధానపార్టీ అభ్యర్థులెవరూ ఆసక్తి చూపడం లేదు. మిగిలింది 7, 8 తేదీలు. ఈ క్రమంలో ఆఖరు రోజైన అక్టోబరు 8వ తేదీన బీజేపీ నుంచి మాజీ మంత్రి ఈటల రాజేందర్, కాంగ్రెస్ నుంచి ఎన్ఎస్యూఐ అధ్యక్షుడు బల్మూరి వెంకట్లు తమ నామినేషన్ పత్రాలను దాఖలు చేయనున్నారు. కరీంనగర్ నుంచి ఆర్టీసీ కార్గో బస్సులో వచ్చిన ఈవీఎంలు హుజూరాబాద్కు చేరుకున్నాయి. వీటిని సిబ్బంది ప్రభుత్వం హుజూరాబాద్లోని ప్రభుత్వ జూనియర్ కాలేజీలో ఏర్పాటు చేసిన స్ట్రాంగ్ రూంలో భద్రపరిచారు. కరీంనగర్ ఎస్సారార్ కాలేజీలో ఏర్పాటు చేసిన కౌంటింగ్ కేంద్రాన్ని జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ కర్ణన్, ఎన్నికల పరిశీలకులు డాక్టర్ ఓం ప్రకాశ్, అబ్జర్వర్ అనుపమ్ అగర్వాల్ పరిశీలించారు. ఈవీఎంలు, వీవీప్యాట్లు భద్రపరచడం, కౌంటింగ్ ఏర్పాట్లపై చర్చించారు. అదనపు కలెక్టర్లు జీవీ శ్యామ్ ప్రసాద్ లాల్, గరిమ అగర్వాల్, కరీంనగర్ ఆర్డీవో ఆనంద్ పాల్గొన్నారు. నామినేషన్లు వేయకుండా ప్రభుత్వం కుట్ర ప్రభుత్వం మా నామినేషన్లు దాఖలు కాకుండా రోజుకో కుట్ర చేస్తోంది. సోమవారం మాస్కుల్లేవని మా అభ్యర్థులను బయటికి పంపిన అధికారులు మంగళవారం కోవిడ్ వ్యాక్సిన్ సెకండ్ డోస్ సర్టిఫికెట్ లేదని వెళ్లగొట్టారు. మా నామినేషన్లు దాఖలైతే తమకు ఇబ్బందులు తలెత్తుతాయన్న ఆందోళనతో ప్రభుత్వం ఇలా కుట్రలు చేస్తోంది. ఈ రోజు 16 మంది అభ్యర్థులను తిప్పిపంపడం దారుణం. క్యాండిడేట్లను ప్రపోజ్ చేసే స్థానిక అభ్యర్థులు కూడా కోవిడ్ సర్టిఫికెట్ కావాలనడం చాలా అన్యాయం. – శ్యామలయ్య ఫీల్డ్ అసిస్టెంట్ల జేఏసీ చైర్మన్ నిబంధనల ప్రకారమే కేంద్ర ఎన్నికల సంఘం గైడ్లైన్స్ను మాత్రమే అమలు చేస్తున్నాం. కోవిడ్ రెండోడోస్ ఉంటేనే అనుమతించాలని నిబంధనలు స్పష్టం చేస్తున్నాయి. నామినేషన్ వేసేందుకు వచ్చిన అభ్యర్థులంతా వాటిని ఒకసారి చదువుకోవా లి. పోటీ చేసేందుకు ఆసక్తి ఉన్న అభ్యర్థులెవరైనా ఎన్నికల సంఘం నిబంధనలకు అనుగుణంగా నామినేషన్ దాఖలు చేసుకోవచ్చు. – శ్రీనివాస్, అడిషనల్ డీసీపీ (లాఅండ్ఆర్డర్) మంత్రుల వాహనాలు తనిఖీ మంగళవారం హుజూరాబాద్ శివారులో మంత్రి గంగుల కమలాకర్ వాహనాన్ని ఆపిన పోలీసులు తనిఖీలు పంపారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. ప్రతీ ఒక్కరూ పోలీసులకు సహకరించాలని కోరారు. సింగాపురం వద్ద మంత్రి హరీశ్రావుకు చెందిన కారును సైతం పోలీసులు ఆపి తనిఖీలు చేశారు. హుజురాబాద్ ఉపఎన్నికల నేపథ్యంలో మంగళవారం టాస్క్ఫోర్స్, ఫ్లయింగ్ స్క్వాడ్, జమ్మికుంట పోలీసుల ఆధ్వర్యంలో నిర్వహించిన ఆకస్మిక తనిఖీల సందర్భంగా దాదాపు రూ.15లక్షల వరకు స్వాధీనం చేసుకున్నారు. మోత్కులగూడెం వద్ద రూ.4 లక్షలు, జమ్మికుంటలో రూ.5 లక్షలు, ఫ్లై ఓవర్ బ్రిడ్జి పై రూ.1.40 లక్షలను, అలుగునూర్ చెక్పోస్ట్ వద్ద రూ.4.5 లక్షలు స్వాధీనం చేసుకున్నారు. సీవిజిల్ యాప్ ఉపఎన్నిక సమయం.. యాప్లే కీలకం కరీంనగర్ అర్బన్: ఎన్నికల ప్రచారంలో ఓటర్లను ప్రసన్నం చేసుకునేందుకు అభ్యర్థులు పడే పాట్లు వర్ణనాతీతం. గతంలో కార్యాలయాలు, పోలీస్స్టేషన్ల చుట్టూ తిరిగిన అభ్యర్థులు, అనుచరగణం ఇకపై యాప్లపై ఆధారపడాల్సిందే. పైరవీలకు ఆస్కారం లేకుండా అధికారులు పారదర్శకంగా వ్యవహరించనున్నారు. హుజూరాబాద్ ఉపఎన్నిక నేపథ్యంలో ఇప్పటికే సదరు విభాగాలకు నోడల్ అధికారులుగా జిల్లాస్థాయి అధికారులను నియమించారు. ప్రచారానికి సంబంధించిన అనుమతులకు సువిధ యాప్ ఏర్పాటు చేయగా, ఎన్నికల ప్రవర్తనా నియమావళిని ఉల్లంఘిస్తే ఉన్నచోటు నుంచే ఫిర్యాదు చేసేలా సీవిజిల్ యాప్ను అందుబాటులోకి తీసుకువచ్చారు. ఎన్నికల అధికారులు ఈ యాప్ల పని తీరుపై ఎప్పటికప్పు డు అప్రమత్తంగా వ్య వహరించనున్నారు. ప్రతీ నిమిషం విలువైందే.. ∙ఎన్నికల సమయంలో పార్టీలు, అభ్యర్థులకు ప్రతీ నిమిషం విలువైందనే కోణంలో ఎన్నికల సంఘం సువిధ యాప్ను తెరపైకి తెచ్చింది. ఇప్పటికే జిల్లా ఎన్ని కల అధికారికి ఈ విషయమై స్పష్టతనిచ్చింది. అభ్యర్థులు, పార్టీలు ఒకే వేదిక ద్వారా ప్రచార అనుమతులు పొందడానికి అవకాశం కల్పించింది. ఏ పార్టీ అయినా ఈ యాప్ ద్వారా 48 గంటల ముందే దరఖాస్తు చేసుకోవాలి. ఫిర్యాదు చేసిన వెంటనే చర్యలు సీవిజిల్ యాప్ను ఎవరైనా తమ ఫోన్ డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఎన్నికల నిబంధనలు అతిక్రమించినవారిపై ఉన్న చోటు నుంచే ఫిర్యాదు చేయవచ్చు. ఫిర్యాదుదారులు అధికారులను నేరుగా కలవాల్సిన అవసరం లేదు. యాప్లో ఉల్లంఘనులకు సంబంధించిన చిత్రాలను తీసి, ఫిర్యాదు చేస్తే సరి. నిమిషాల వ్యవధిలోనే సంబంధిత అధికారులు చర్యలకు ఉపక్రమిస్తారు. లేదంటే వారే బాధ్యులవుతారు. సమాధాన్, మ్యాట్డాటా, సుగమ్, మాట్దాన్ ఓటర్లు ఫిర్యాదు చేయడానికి సమాధాన్ యాప్ అందుబాటులో ఉంది. ఇదివరకు ఆన్లైన్, టోల్ఫ్రీనంబర్ 1950, ఈ–మెయిల్, ఫ్యాక్స్, ఎస్ఎంఎస్, తపాలా ద్వారా ఫిర్యాదు చేసే మార్గాలున్నాయి. అందరూ సునాయాసంగా స్మార్ట్ఫోన్లు వినియోగిస్తుండటంతో ఈ యాప్ ద్వారానూ ఫిర్యాదు చేయవచ్చు. ఇందులో వచ్చిన ఫిర్యాదులకు ఎన్నికల సంఘం స్పందించి, సమాధానమివ్వనుంది. ఇక పట్టణాల్లో పోలింగ్ కేంద్రం గుర్తించేందుకు మ్యాట్డాటా యాప్ను రూపొందించారు. ఎన్నికల నిర్వహణకు వినియోగించే వాహనాలను నియంత్రించడానికి సుగమ్ యాప్. అలాగే పోలింగ్ రోజున ఓటింగ్ కేంద్రాలను పర్యవేక్షించడానికి ఉపయుక్తమయ్యేది మాట్దాన్. ఇది అధికారులకు మాత్రమే అవసరమయ్యే యాప్. -
కుట్ర మామది.. ఆచరణ అల్లుడిది
ఇల్లందకుంట (హుజూరాబాద్): దేశంలో ఇంత ఖరీదైన ఎన్నికలు ఎప్పుడూ చూడలేదని, హుజూరాబాద్ ఉపఎన్నికల్లో ఎలాగైనా గెలుపొందేందుకు కేసీఆర్ కుట్రలు చేస్తోంటే ఆయన అల్లుడు హరీశ్రావు అమలు చేస్తున్నారని మాజీమంత్రి, బీజేపీ అభ్యర్థి ఈటల రాజేందర్ ఆరోపించారు. హుజూరాబాద్లో ఇప్పటికే రూ.4,700 కోట్లకు సంబంధించిన జీవోలతోపాటు రూ.250కోట్లను ఓటర్లకు పంచిపెట్టారని ఆయన విమర్శించారు. కరీంనగర్ జిల్లా జమ్మికుంటలోని ఓ గార్డెన్లో మంగళవారం జరిగిన నాయీబ్రాహ్మణ, రెడ్డి కులస్తుల ఆత్మీయ సమ్మేళనానికి ఈటల రాజేందర్ హాజరయ్యారు. అనంతరం ఈటల మాట్లాడుతూ..ఎన్నికలప్పుడు మాత్రమే సీఎం కేసీఆర్కు నాయీబ్రాహ్మణులు, రజకులు గుర్తుకొస్తారని...వారి అభివృద్ధికి రూ.500కోట్లు కేటాయించాలని ఓ సమావేశంలో తాను ప్రాతిపాదించగా రూ.28కోట్లే ఇచ్చారని విమర్శించారు. ప్రగతిభవన్లో మంత్రులకు, ఎమ్మెల్యేలకు ప్రవేశంలేదని రాష్ట్రంలో వారికి స్వేచ్ఛలేదని వారంతా రబ్బరు స్టాంపులుగా ఉన్నారని ఈటల ఆరోపించారు. నియంతలా పాలిస్తున్న కేసీఆర్ నుంచి 2023లో ప్రజలకు విముక్తి లభిస్తుందని జోస్యం చెప్పారు. డబ్బు, మద్యంతో ప్రజలను బానిసలుగా మారుస్తున్నారని, మోకాళ్ల మీద నడిచినా హుజూరాబాద్ ప్రజలు టీఆర్ఎస్కు ఓట్లు వేయరని తెలిపారు. కార్యక్రమంలో మాజీ ఎంపీ జితేందర్ రెడ్డి, చల్లా ధర్మారావు, మార్కెట్ కమిటీ మాజీ వైస్ చెర్మన్ సురేందర్ రాజు, శ్రీనివాస్ పాల్గొన్నారు. -
ఏం జరిగినా హుజురాబాద్లో గెలిచేది ఆయనే: కొండా విశ్వేశ్వర్రెడ్డి
సాక్షి, రంగారెడ్డి: తాను ఏ పార్టీలో చేరాలా అనే అంశంపై కన్ఫ్యూజన్లో ఉన్నట్లు కేటీఆర్ బినామీ మీడియాలో తనపై దుష్ట్రచారం చేస్తున్నారని చేవెళ్ల మాజీ ఎంపీ కొండా విశ్వేశ్వర్రెడ్డి అన్నారు. తనకంటూ ఓ స్పష్టత ఉందన్నారు. సోమవారం బంజారాహిల్స్లో సీనియర్ నాయకులు సురేష్రెడ్డి, కొండా రాందేవ్రెడ్డి, రౌతు కనకయ్య, బీమేందర్రెడ్డి, కొండా కృష్ణారెడ్డితో కలిసి విలేకరులతో మాట్లాడారు. ఎన్నికల ముందు అటు దేశంలోనూ, ఇటు రాష్ట్రంలోనూ అనేక సమీకరణాలు జరుగనున్నాయని, అధికారం కోసం జాతీయ పార్టీలు ప్రాంతీయ పార్టీలతో పొత్తులు కుదుర్చుకునే అవకాశం ఉందన్నారు. టీఆర్ఎస్ ఏదో ఒక జాతీయ పారీ్టతో జతకట్టే అవకాశం ఉందని.. ఇది తేలిన తర్వాతే చేరికపై నిర్ణయం తీసుకోనున్నట్లు తెలిపారు. టీఆర్ఎస్కు వ్యతిరేకంగా పని చేసే పారీ్టలోనే చేరనున్నట్లు ప్రకటించారు. అది బీజేపీనా.. కాంగ్రెసా అనేది ఇప్పుడే చెప్పలేనన్నారు. చదవండి: హుజూరాబాద్ ఉప ఎన్నిక: ఉత్సాహవంతులకు ఊహించని దెబ్బ అందుకే ఆ పార్టీని వీడాను.. ఉద్యమ పార్టీగా చెప్పుకొంటున్న టీఆర్ఎస్లో ప్రస్తుతం తెలంగాణ వాదులెవరూ లేరని విశ్వేశ్వర్ రెడ్డి అన్నారు. ఒకరిద్దరు ఉన్నా వారికి ఎలాంటి అధికారం లేదని అధికారమంతా తండ్రీ కొడుకులకే పరిమితమైందని విమర్శించారు. కేసీఆర్, కేటీఆర్ చేతుల్లో బందీగా మారిన తెలంగాణ తల్లికి విముక్తి కల్పించేందుకు కలిసి వచ్చే పార్టీలతో పని చేస్తానని స్పష్టం చేశారు. కేసీఆర్ నియంతృత్వ పోకడలకు నిరసనగానే ఆ పార్టీని వీడాల్సి వచి్చందన్నారు. నా మద్దతు ఈటలకే వందల కోట్లు ఖర్చు చేసినా.. భారీగా పోలీసులను మోహరించినా హుజురాబాద్లో గెలిచేది మాత్రం ఈటల రాజేందరేనని జోస్యం చెప్పారు. బీజేపీలో చేరకపోయినా తన సంపూర్ణ మద్దతు ఆయనకేనని పునరుద్ఘాటించారు. ఒకప్పుడు తనకు వ్యతిరేకంగా పని చేసినప్పటికీ.. తాను మాత్రం ఆయనకు అనుకూలంగా పని చేయనున్నట్లు వెల్లడించారు. చదవండి: ఎన్నిక వచ్చినప్పుడల్లా సవాలేనా?: ఎమ్మెల్సీ కవిత రంగారెడ్డి జిల్లాకు తీరని అన్యాయం కేసీఆర్ సీఎం అయ్యాక ఉమ్మడి రంగారెడ్డి జిల్లాకు తీరని అన్యాయం చేశారన్నారు. రూ.15,000 కోట్లు ఖర్చు చేసిన పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకాన్ని పక్కన పెట్టి.. కమీషన్ల కోసం కాళేశ్వరం ప్రాజెక్ట్ను చేపట్టారని ఆరోపించారు. జిల్లాకు సాగునీరిస్తానని చెప్పి, ఎడారిగా మార్చేశారన్నారు. ఉస్మానియా ఆస్పత్రి నిర్మాణాన్ని గాలికొదిలేసి జిల్లాలో కొత్తగా మరో మూడు ఆస్పత్రులు నిర్మిస్తామని చెప్పడం హాస్యాస్పదంగా ఉందన్నారు. -
హుజూరాబాద్ ఉప ఎన్నిక: ఉత్సాహవంతులకు ఊహించని దెబ్బ
సాక్షి, కరీంనగర్/హుజూరాబాద్: హుజూరాబాద్ ఉప ఎన్నికలో నామినేషన్లు వేసేందుకు రాష్ట్రవ్యాప్తంగా అభ్యర్థులు పోటెత్తుతున్నారు. అయితే.. వారిలో పోటీ చేసేందుకు ఉత్సాహం ఉన్నా.. సరైన విధానంలో పత్రాలు తీసుకురావడంలో విఫలమవుతున్నారు. సోమవారం ఇదే విధంగా నామినేషన్ వేసేందుకు హుజూరాబాద్ వచ్చిన పలువురు అభ్యర్థులు నిరాశగా వెనుదిరిగారు. నూర్జహాన్ బేగం అనే మహిళ హైదరాబాద్ నుంచి వచ్చారు. సుపరిపాలన ధ్యేయంగా తాముపోటీ చేస్తున్నామని తెలిపారు. కానీ.. ఆమెను సమర్థిస్తూ పది మంది స్థానికుల సంతకాలు కావాలని అధికారులు సూచించడంతో తీసుకువస్తామని చెప్పి అక్కడ నుంచి వెళ్లిపోయారు. చదవండి: అయ్యయ్యో.. వద్దమ్మా! డబ్బులు తీసుకోం గానీ, సుపరిపాలనతోనే సుఖీభవ ►జమ్మికుంటకు చెందిన ప్రజాయుక్త పార్టీ/ఇండిపెండెంట్ సిలివేరు శ్రీకాంత్ సోమవారం రెండుసెట్ల నామినేషన్లు దాఖలు చేశారు. శుక్రవారం ఈయన నామినేషన్ను సాంకేతిక కారణాలతో తిప్పిపంపిన విషయం తెలిసిందే. ►మురుగు రామచంద్రు కూడా నామినేషన్ వేసేందుకు లోపలికి వెళ్లారు. కానీ.. సాంకేతిక కారణాలతో ఆయన దరఖాస్తును అధికారులు తిరస్కరించారు. ►ఎంఐఎం (టీఎస్) పార్టీ నుంచి తాహెర్ కమాల్ కుంద్మిరీ నామినేషన్ వేయడానికి వచ్చినా.. స రైన పత్రాలు లేవని అధికారులు తిప్పిపంపారు. చదవండి: కేసీఆర్ డిపాజిట్ పోవడం ఖాయం: ఈటల ► హైదరాబాద్కు చెందిన చంద్రశేఖర్ అనే సాఫ్ట్వేర్ ఇంజినీర్ నిరుద్యోగ యువతకు ఉపాధి కల్పిస్తానని అన్నారు. ఇతను దరఖాస్తు కూడా అధికారుల ఆమోదం పొందలేదు. ► నామినేషన్లు దరఖాస్తులు తీసుకుంటున్న ఆర్డీవో కార్యాలయానికి మాస్కులు లేకుండా వచ్చి కొందరు విధులకు ఆటంకం కలిగించారని ఆర్ఐ సతీశ్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ మేరకు పోలీసులు కేసు నమోదుచేశారు. ►సోమవారం ఈటల రాజేందర్ సతీమణి ఈటల జమున (ఒక సెట్), సిలివేరు శ్రీకాంత్ (రెండు సెట్లు), రేకల సైదులు (రెండుసెట్లు) మొత్తం ఐదు సెట్ల నామినేషన్లు దాఖలు చేశారు. చదవండి: హుజూరాబాద్: పోటీకి 1,000 మంది ఫీల్డ్ అసిస్టెంట్లు పకడ్బందీగా నియమావళి అమలు హుజూరాబాద్ శాసనసభ నియోజకవర్గ ఉపఎన్నిక సందర్భంగా ఎన్నికల ప్రవర్తనా నియమావళిని పకడ్బందీగా అమలు చేస్తామని ఎన్నికల సాధారణ పరిశీలకుడు డాక్టర్ ఓం ప్రకాశ్ ఐఏఎస్ ఒక ప్రకటనలో తెలిపారు. సోమవారం హుజూరాబాద్లోని రిటర్నింగ్ అధికారి కార్యాలయం, హుజూరాబాద్ ప్రభుత్వ జూనియర్, డిగ్రీ కళాశాలలోని డిస్ట్రిబ్యూషన్ కమ్ రిసెప్షన్ సెంటర్ను కలెక్టర్ కర్ణన్తో సందర్శించి ఏర్పాట్లను పరిశీలించారు. అనంతరం ఆయన ప్రకటన విడుదల చేశారు. అభ్యర్థుల ఖర్చులపై నిఘా ఉంటుందని, ఓటర్లను ప్రలోభపెట్టేలా డబ్బు, నగదు, బహుమతుల పంపిణీని నివారిస్తామన్నారు. చదవండి: Huzurabad Bypoll: రసవత్తరంగా మారిన హుజూరాబాద్ ఉపఎన్నిక నియోజకవర్గ సరిహద్దుల్లో ఏర్పాటు చేసిన చెక్ పోస్టుల వద్ద వాహనాలను చేస్తామన్నారు. అభ్యర్థులు పెట్టే ఖర్చుల వివరాలను ఎక్స్ పెండీచర్ బృందాలు రోజూ నమోదు చేయాలని ఆదేశించారు. ఉపఎన్నిక పూర్తయ్యే వరకు ఇక్కడే ఉంటానని పేర్కొన్నారు. ఎన్నికల ప్రవర్తనా నియమావళిపై ఉల్లంఘనపై ఫిర్యాదులు ఉంటే తనకు 6281552166 నెంబర్కు సమాచారం అందించాలని, ప్రతిరోజూ ఉదయం 9.30 గంటల నుంచి 10.30 గంటల వరకు తనను కరీంనగర్లోని ఎక్సైజ్ భవన్ అతిథి గృహంలో కలవచ్చనని ఓం ప్రకాశ్ సూచించారు. -
అయ్యయ్యో.. వద్దమ్మా! డబ్బులు తీసుకోం గానీ, సుపరిపాలనతోనే సుఖీభవ
‘అయ్యయ్యో, వద్దమ్మా.. ఈ మధ్యనే ఓటు అర్హత వచ్చింది.. తొలిసారి ఓటు హక్కు వినియోగిస్తున్నా..డబ్బులు తీసుకోం గానీ, సుపరిపాలనతోనే సుఖీభవ’ ఇదీ తొలిసారి టుహక్కు వచ్చిన యువత మనోగతం సాక్షి, కరీంనగర్/హుజూరాబాద్: ప్రజాస్వామ్యంలో రాజ్యాంగం కల్పించిన శక్తిమంతమైన ఆయుధం ఓటు హక్కు. పరిపాలకులను ఎంచుకునే అరుదైన అవకాశం అరుదుగా వస్తుంటుంది. అలాంటి వజ్రాయుధమైన ఓటును యువతకు బీరు, బిర్యానీ, క్రికెట్ కిట్లు, సెల్ఫోన్లు తదితర ప్రలోభాలను ఎరవేసి కొనేందుకు రాజకీయనాయకులు ప్రయత్నిస్తుంటారు. కానీ, తాము మాత్రం అలా కాదని నేటితరం యువత కుండబద్దలు కొడుతోంది. డబ్బు, ప్రలోభాలకు నేటియువత లొంగదని, సుపరిపాలన అందించేవారికి పట్టం కట్టడమే తమ లక్ష్యమని స్పష్టంచేశారు. ఇటీవల ఓటు హక్కు వచ్చిన కొందరు యువతను ‘సాక్షి’ కదిలించింది. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. తొలిసారిగా తమకు ఓటు హక్కు వచ్చిందని, దాన్ని పూర్తిగా సద్వినియోగం చేసుకుంటామని తెలిపారు. సమర్థులు, ప్రయోజకులకే తాము ఓటేస్తామని చెప్పారు. ఓటు అనే వజ్రాయుధాన్ని సరిగ్గా వాడితే, అద్భుతాలు సృష్టించవచ్చని అభిప్రాయపడ్డారు. అదే సమయంలో విధిగా ఓటు వేసే మధ్యవయస్కులు, సీనియర్ సిటిజన్లు కూడా నాయకుల తలరాతలు మార్చేది.. యువత ఓటింగే కీలకమని అభిప్రాయపడుతున్నారు. -
గెల్లును గెలిపించండి
హుజూరాబాద్/ సిద్దిపేట: హుజూరాబాద్ ఎన్నికల్లో టీఆర్ఎస్ అభ్యర్థి గెల్లు శ్రీనివాస్యాదవ్ను గెలిపించాలని, హుజూరాబాద్ అభివృద్ధి బాధ్యత తమదని రాష్ట్ర ఆర్థిక మంత్రి తన్నీరు హరీశ్రావు అన్నారు. శనివారం హుజూరాబాద్, సిద్దిపేటలో మంత్రి పలు కార్యక్రమాల్లో పాల్గొన్నారు. సింగాపూర్లో పోతిరెడ్డిపేట గ్రామానికి చెందిన పలువురు టీఆర్ఎస్ చేరగా, వారికి హరీశ్రావు గులాబీ కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఆరుసార్లు ఎన్నికల్లో గెలిచిన ఈటల రాజేందర్ హుజూరాబాద్కు చేసిందేమీ లేదని, నాలుగు వేల ఇళ్లు సీఎం కేసీఆర్ ఈ నియోజకవర్గ ప్రజల కోసం మంజూరు చేస్తే ఒక్క ఇల్లు కూడా ఈటల కట్టలేదని విమర్శించారు. ఏడేళ్లలో 21సార్లు ధరలు పెంచిన కేంద్రం కేంద్ర ప్రభుత్వం తీరుతో వంటింట్లో మహిళల కం ట్లో కన్నీరు వస్తోందని, అడ్డూఅదుపూ లేకుండా పెరిగిపోతున్న గ్యాస్ సిలిండర్ ధరలు సామాన్య ప్రజలకు, నిరుపేదలకు గుదిబండగా మారుతున్నాయని హరీశ్రావు ఆగ్రహం వ్యక్తం చేశారు. సిద్ది పేట జిల్లా కేంద్రంలో పేదల డబుల్ బెడ్రూం (కేసీఆర్ నగర్) కాలనీలో ఇంటింటికి పైప్లైన్ ద్వారా గ్యాస్ సరఫరాకోసం ప్లాంట్ ప్రారంభం, 360 డబుల్ బెడ్రూం ఇళ్ల సామూహిక గృహ ప్రవేశాలు, బతుకమ్మ చీరల పంపిణీ కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. కేంద్ర ప్రభుత్వం గడిచిన ఏడేళ్లలో 21 సార్లు పెట్రోల్, డీజిల్, వంట గ్యాస్ సిలిండర్ల ధరలను పెంచి ప్రజల నడ్డి విరిచిందని విమర్శించారు. జిల్లాలోని తన ఇంటికి, జిల్లా కలెక్టర్ ఇంటికి కూడా పైప్లైన్ గ్యాస్ సరఫరా లేదని, మొదటిసారిగా పేదల ఇళ్లకు ఈ అవకాశం రావడం సంతోషంగా ఉందన్నారు. సీఎం కేసీఆర్ ఆశీస్సులతో సిద్దిపేట పట్టణంలో ఇప్పటికే 1,976 డబుల్ బెడ్రూం ఇళ్లను పంపిణీ చేశామని, మరో వెయ్యి ఇళ్ల పంపిణీ కోసం త్వరలో లబ్ధిదారులను ఎంపిక చేస్తామన్నారు. -
నేను గెలిస్తే కేసీఆర్ రోడ్డుమీదకు: ఈటల రాజేందర్
ఇల్లందకుంట (హుజూరాబాద్): హుజూరాబాద్ ఉప ఎన్నికలో తాను గెలిస్తే తెలంగాణ ముఖచిత్రం మారుతుందని, ఫౌంహౌస్లో ఉన్న కేసీఆర్ రోడ్డు మీదకు వస్తారని మాజీ మంత్రి ఈటల రాజేందర్ అన్నారు. కరీంనగర్ జిల్లా జమ్మికుంట మండలం నాగారం, నగురం, వావిలాల, పాపక్కపల్లి, గోపాల్పూర్లలో శుక్రవారం ఆయన ఇంటింటికీ తిరిగి ప్రచారం చేశారు. చదవండి: టీఆర్ఎస్ అభ్యర్థి చేతిలో కేవలం 10 వేలే, బంగారం, బండి లేనే లేదు ఈ సందర్భంగా ప్రజలనుద్దేశించి మాట్లాడుతూ.. ‘నాది రేశంగల పుట్టుక. దళితబంధు వద్దు అని నేను, కాళ్లు మొక్కుతా బాంఛన్ అని లేఖ రాస్తానా? టీఆర్ఎస్ పార్టీ ఆదేశాల మేరకు కొంతమంది ఫేక్గాళ్లు అసత్య ప్రచారాలు చేస్తున్నారు. కేసీఆర్కు జాతి, నీతి, మానవత్వం లేదు. 2023లో గోల్కొండ కోటపై కాషాయ జెండా ఎగరడం ఖాయం’అని అన్నారు. కేసీఆర్ ధర్మంతో ఆడుకుంటున్నారని, అందుకు తగిన మూల్యం చెల్లించుకోక తప్పదని జోస్యం చెప్పారు. ప్రజలకు ఏ పథకం కావాలన్నా ఇంటి మీద టీఆర్ఎస్ జెండా ఉండాలని బెదిరింపులకు గురిచేస్తున్నారని, మద్యం ద్వారా ప్రభుత్వానికి రూ.30 వేల కోట్లు వస్తున్నాయని, కానీ పెన్షన్ల మీద ఖర్చు పెట్టేది కేవలం రూ.9 వేల కోట్లు మాత్రమే అని పేర్కొన్నారు. అనంతరం పలు గ్రామాలకు చెందిన నాయకులు ఈటల రాజేందర్ సమక్షంలో బీజేపీలో చేరారు. -
టీఆర్ఎస్ అభ్యర్థి చేతిలో కేవలం 10 వేలే, బంగారం, బండి లేనే లేదు
సాక్షి, హుజురాబాద్: ఉప ఎన్నికలో టీఆర్ఎస్ అభ్యర్థిగా పోటీ చేస్తున్న గెల్లు శ్రీనివాస్ యాదవ్కు సొంత వాహనం లేదంట. ఒక్క గ్రాము బంగారం కూడా తన వద్ద లేదని ఎన్నికల అఫిడవిట్లో పేర్కొన్నాడు. ఇక తన చేతిలో కేవలం రూ.10 వేలు ఉన్నాయని వెల్లడించాడు. శ్రీనివాస్ శుక్రవారం నామినేషన్ దాఖలు చేసిన విషయం తెలిసిందే. రెండు సెట్ల నామినేషన్ పత్రాలు సమర్పించాడు. అయితే గెల్లు శ్రీనివాస్ అఫిడవిట్లో సమర్పించిన వివరాలు ఆసక్తికరంగా మారింది. తన వద్ద కేవలం రూ.10 వేలు, తన భార్య వద్ద రూ.5 వేల నగదు మాత్రమే ఉందని శ్రీనివాస్ పేర్కొన్నాడు. బ్యాంకుల్లో రూ.2,82,402 డిపాజిట్లు అతడి వద్ద ఉన్నాయి. అదే విధంగా భార్యకు 25 తులాల బంగారం, బ్యాంకు డిపాజిట్ల కింద రూ.11,94,491 చూపించారు. వీటితోపాటు వీణవంకలో సొంతిల్లు, 10.25 గుంటల స్థలం విలువను రూ.20 లక్షలుగా చూపించారు. అలాగే గెల్లు శ్రీనివాస్కు సొంత వాహనం, కనీసం గ్రాము బంగారం కూడా లేకపోవడం గమనార్హం. పేరు : గెల్లు శ్రీనివాస్ యాదవ్ విద్యార్హతలు : ఎంఏ, ఎల్ఎల్బీ భార్య : గెల్లు శ్వేత కేసులు : మూడు -
హుజురాబాద్ ఉప ఎన్నిక: ‘మీ ఉద్యమ బిడ్డను ఆశీర్వదించండి’
సాక్షి ప్రతినిధి, కరీంనగర్/ హుజూరాబాద్: ‘హుజూరాబాద్ బరిలో పోటీ చేస్తున్న మీ ఉద్యమబిడ్డను ఆశీర్వదించండి’అని టీఆర్ఎస్ అభ్యర్థి గెల్లు శ్రీనివాస్ యాదవ్ ప్రజలను కోరారు. శుక్రవారం మధ్యాహ్నం ఆయన రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు వినోద్కుమార్, మంత్రి గంగుల కమలాకర్, మాజీ మంత్రి ఇనుగాల పెద్దిరెడ్డిలతో కలసి నామినేషన్ వేసేందుకు హుజూరాబాద్ ఆర్డీఓ కార్యాలయానికి వచ్చారు. తొలిరోజు గెల్లు శ్రీనివాస్ రెండు సెట్ల నామినేషన్లు దాఖలు చేసిన అనంతరం గెల్లు శ్రీనివాస్ మాట్లాడుతూ.. హుజూరాబాద్లోని ప్రతీ ఒక్క ఓటరును వ్యక్తిగతంగా కలసి తనకు ఓటేయాల్సిందిగా కోరుతానని.. తాను గెలిచిన తరువాత నియోజకవర్గాన్ని ఉత్తమ నియోజకవర్గంగా తీర్చిదిద్దే బాధ్యత తీసుకుంటానని చెప్పారు. ఈటల ఆత్మగౌరవం ఎక్కడ దెబ్బతిందో.. అనంతరం రాష్ట్ర ప్రణాళికాసంఘం ఉపాధ్యక్షుడు వినోద్కుమార్ మాట్లాడుతూ, విద్యార్థి దశ నుంచి తెలంగాణ కోసం పోరాడిన బడుగు బలహీనవర్గాల బిడ్డ గెల్లు శ్రీనివాస్ సేవలు గుర్తించి సీఎం కేసీఆర్ బీఫామ్ ఇచ్చారన్నారు. అన్నంపెట్టిన పార్టీకి వెన్నుపోటు పొడిచిన ఈటల రాజేందర్, ఆత్మగౌరవం పేరుతో భారతీయ జనతా పార్టీ పంచన చేరారని విమర్శించారు. వ్యవసాయ చట్టాల పేరుతో రైతుల ఆత్మగౌరవాన్ని దెబ్బతీసిన పార్టీ బీజేపీ అని మండిపడ్డారు. మాట్లాడితే ఆత్మగౌరవం అంటున్న ఈటల రాజేందర్.. ఎక్కడ ఆయన ఆత్మగౌరవానికి భంగం కలిగిందో చెప్పాలని డిమాండ్ చేశారు. మంత్రి గంగుల కమలాకర్ మాట్లాడుతూ.. 2001 నుంచి తెలంగాణ ఉద్యమాల్లో పాలుపంచుకున్న గెల్లు శ్రీనివాస్ను గెలిపించాలని ప్రజలను కోరారు. కాగా అన్న వైఎస్సార్ పార్టీ నుంచి నిజామాబాద్ జిల్లాకు చెందిన మహ్మద్ మన్సూర్ అలీ అనే వ్యక్తి హుజురాబాద్ నుంచి పోటీకి నిలబడ్డారు. ఆయన ఒక సెట్ నామినేషన్ దాఖలు చేశారు. -
నేడు బద్వేల్ ,హుజురాబాద్ ఉపఎన్నికకు నోటిఫికేషన్
-
టీఆర్ఎస్ మీటింగ్ల్లో పస లేదు.. నాకే బ్రహ్మరథం
హుజూరాబాద్: టీఆర్ఎస్కు తెలంగాణగడ్డపై పుట్టగతులు ఉండవని, 2023లో పార్టీ పతనం ఖాయమని మాజీమంత్రి ఈటల రాజేందర్ అన్నారు. 30న జరిగే ఎన్నికల్లో హుజూరాబాద్ ఆ దిశగా సంకేతం ఇవ్వబోతోందని జోస్యం చెప్పారు. కరీంనగర్ జిల్లా జమ్మికుంటలోని ఎంపీఆర్ గార్డెన్స్లో గురువారం నిర్వహించిన వడ్డెర సంఘం సమావేశంలో ఈటల రాజేందర్ మాట్లాడుతూ.. వడ్డెర కులస్తులను టీఆర్ఎస్లో చేరకుంటే జేసీబీలు, ట్రాక్టర్లు నడవనీయమని, వృత్తి చేసుకోబోనివ్వమని బెదిరించినట్లు తనదృష్టికి వచ్చిందని తెలిపారు. అందుకు ఓట్లతో సమాధానం చెప్పాలని సూచించారు. 18 ఏళ్లు హుజూరాబాద్ నాయకుడిగా సమర్థవంతమైన పాలన అందించానని తెలిపారు. చదవండి: ఎమ్మెల్యేగా 18 ఏళ్లు ఉండి ఈటల ఒక్క ఇల్లయినా కట్టిచ్చిండా? ‘బండ కొట్టుకునే వడ్డెరులను అటవీ అధికారులు కేసుల పేరుతో వేధిస్తున్నారు. రూ.5 కోట్ల విలువైన పనుల్లో ఈఎండీ లేకుండా కాంట్రాక్టులు ఇవ్వాలి. వడ్డెరలకు, ఇతర సంచార జాతులకు, పేదలందరికీ దళితబంధులాంటి పథకం వర్తింపజేయాలి. టీఆర్ఎస్ మీటింగుల్లో పసలేదని, నేను ప్రచారానికి వెళ్తే ప్రజలు బ్రహ్మరథం పడుతున్నారు. నేను రాజీనామా చేస్తేనే హుజూరాబాద్లో పనులు జరుగుతున్నాయి’ అని తెలిపారు. కార్యక్రమంలో కర్ణాటక మాజీ మంత్రి, ఎమ్మెల్యే అరవింద్ లింబావలి, జాతీయ డీ నోటిఫైడ్ కాస్ట్ కమిషన్ సభ్యుడు నరసింహ, బీజేపీ సీనియర్ నాయకులు ధర్మారావు, రమేశ్రాథోడ్, యెండల లక్ష్మీనారాయణ, వడ్డెర సంఘం అధ్యక్షుడు వెంకటేశ్ పాల్గొన్నారు. చదవండి: యువ రైతు కన్నీటి వ్యథ: 13 ఎకరాల్లో పంట నీట మునక.. తట్టుకోలేక -
ఎమ్మెల్యేగా 18 ఏళ్లు ఉండి ఈటల ఒక్క ఇల్లయినా కట్టిచ్చిండా?
హుజూరాబాద్: ఎమ్మెల్యేగా 18 ఏళ్లకు పైగా హుజూరాబాద్లో ఎమ్మెల్యే పదవిని అనుభవించిన ఈటల రాజేందర్ నియోజకవర్గంలో ఒక్క ఇల్లయినా కట్టించిండా అని మంత్రి హరీశ్రావు ప్రశ్నించారు. టీఆర్ఎస్ గెలుపుతోనే హుజూరాబాద్ అభివృద్ధి ముడిపడి ఉందని స్పష్టం చేశారు. కరీంనగర్ జిల్లా హుజూరాబాద్ మండలంలోని సింగాపూర్లో గురువారం పర్యటించారు. ఈ సందర్భంగా నియోజకవర్గంలోని పలు మండలాలకు చెందినవారు టీఆర్ఎస్లో చేరారు. మంత్రి గులాబీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. చదవండి: టీఆర్ఎస్ మీటింగ్ల్లో పస లేదు.. నాకే బ్రహ్మరథం అనంతరం మంత్రి హరీశ్రావు మాట్లాడుతూ.. 18 ఏళ్ల పాటు ఈటల రాజేందర్ను గెలిపించిన ప్రజలు, ఎంత మేరకు అభివృద్ధి చేశాడో ఆలోచన చేయాలని కోరారు. ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రతీ మంత్రికి నాలుగు వేల ఇళ్లు ప్రజలకు నిర్మించి ఇవ్వాలని ఆదేశిస్తే.. అందరూ వారివారి నియోజకవర్గాల్లో పూర్తిచేశారని తెలిపారు. అయితే ఒక్క ఇల్లు కూడా నిర్మించని మంత్రిగా ఈటల రాజేందర్ మిగిలిపోయారని చెప్పారు. తన సమస్యలను ప్రజలపై రుద్దుతున్నారని ఆరోపించారు. ఈటల రాజేందర్ ప్రజల సమస్యలను పట్టించుకోలేదని ఆరోపించారు. ప్రజలకు సొంతంగా స్థలం ఉంటే.. ఇల్లు కట్టించే బాధ్యతను తాను తీసుకుంటానని హామీ ఇచ్చారు. రెండున్నరేళ్ల అభివృద్ధి కోసం టీఆర్ఎస్ అభ్యర్థి గెల్లు శ్రీనివాస్ యాదవ్ను గెలిపించాలని కోరారు. కార్యక్రమంలో నాయకులు సంపత్రావు, శ్రీనివాస్, శంకర్రావు, దుర్గారెడ్డి, సాయికుమార్ పాల్గొన్నారు. -
అయోమయంలో తెలంగాణ కాంగ్రెస్
-
కమలంలో కొత్త గోల
-
హుజురాబాద్ బీజేపీ అభ్యర్థిగా ఈటల పేరు ఖరారు
-
హుజురాబాద్: ప్రతి గడప తొక్కుదాం.. ఒక్క ఓటు వదలొద్దు
సాక్షి ప్రతినిధి, కరీంనగర్: హుజూరాబాద్ ఉప ఎన్నిక షెడ్యూల్ విడుదలైన నేపథ్యంలో ఒక్కసారిగా కరీంనగర్ జిల్లా రాజకీయాలు వేడెక్కాయి. అక్టోబరు 1వ తేదీన నోటిఫికేషన్ విడుదల కానుండడంతో ప్రచార వ్యూహాలపై ప్రధాన పార్టీలైన టీఆర్ఎస్- బీజేపీ కసరత్తు ప్రారంభించాయి. ప్రతీ ఓటరును నేరుగా కలిసేలా పక్కాగా ప్రణాళికలు రూపొందిస్తున్నాయి. కోవిడ్ నిబంధనల నేపథ్యంలో రోడ్షోలు, ర్యాలీలకు కేంద్ర ఎన్నికల సంం అనుమతించలేదు. ఫంక్షన్హాళ్లలో పెట్టుకునే సభలకు 200 మంది, ఆరుబయట నిర్వహించే సభకు 1000 మందిని మాత్రమే అధికారులు అనుమతిస్తారు. చదవండి: జీ‘హుజుర్’ ఎవరికో.. వారిద్దరి మధ్యే తీవ్ర పోటీ కానీ.. ఇంటింటి ప్రచారానికి ఈసీ షరతులతో అనుమతి ఇచ్చిన సంగతి తెలిసిందే. అందుకే.. ప్రధాన పార్టీలు ఇంటింటి ప్రచారానికి మొగ్గుచూపుతున్నాయి. కోవిడ్ నిబంధనలు తప్పకుండా పాటించాల్సిన వేళ భారీ బహిరంగ సభలు, ఇండోర్ సభల కంటే ఇంటింటి ప్రచారం ప్రభావవంతంగా పనిచేస్తుందన్న నిర్ణయానికి పార్టీలు వచ్చాయి. అందుకే.. ఒకటో తేదీ నుంచి ప్రతీ గడపకు వెళ్లేలా మండల, గ్రామ, వార్డు ఇన్చార్జీలను సన్నద్ధం చేస్తున్నారు. మొత్తం 28 రోజులపాటు ప్రచారం చేసుకునే వీలుంది. నియోజకవర్గంలో ఐదు మండలాలు, రెండు మున్సిపాలిటీలలోని ప్రతీ ఇంటికి కనీసం వారంలో రెండుసార్లు అయినా వెళ్లాలని, ప్రతీ ఓటరును కలవాలని నిర్ణయానికి వచ్చాయి. చదవండి: పత్తి ఏరాల్సిన చోట.. చేనులో చేపల వేట రెండుసార్లు సీఎం సభ..! ఎన్నికల నోటిఫికేషన్ విడుదలైన అనంతరం టీఆర్ఎస్ పార్టీ ప్రచారాన్ని హోరెత్తించనుంది. ఇప్పటికే పార్టీలో ట్రబుల్ షూటర్గా పేరొందిన మంత్రి హరీశ్రావు ఇన్చార్జి బాధ్యతలు తీసుకున్నారు. దాదాపు 16 వారాలుగా హరీశ్రావు హుజూరాబాద్లోనే మకాం వేశారు. ఆయనకు తోడుగా మంత్రులు గంగుల కమలాకర్, కొప్పుల ఈశ్వర్, ఎమ్మెల్సీలు పల్లా రాజేశ్వర్రెడ్డి, నారదాసు లక్ష్మణరావు, ఎమ్మెల్యేలు రసమయి బాలకిషన్, సుంకె రవిశంకర్, సతీశ్బాబు, బాల్క సుమన్, కోరుకంటి చందర్తోపాటు స్థానిక మున్సిపల్ చైర్మన్లు, ఎంపీటీసీలు, ఎంపీపీలు, సర్పంచ్లు, వార్డు సభ్యులు, మండల-గ్రామ-వార్డు కార్యకర్తలతో మెగా బృందమే పనిచేస్తోంది. సంఖ్యాపరంగా, ప్రచారం పరంగా టీఆర్ఎస్ చాలా దూకుడుగా ఉంది. ఆగస్టు 11వ తేదీన అభ్యర్థిగా గెల్లు శ్రీనివాస్యాదవ్ను ప్రకటించి అదేరోజు నుంచి అభ్యర్థితో ప్రచారం ప్రారంభించింది. ఆగస్టు 16వ తేదీన హుజూ రాబాద్ మండలం శాలపల్లి సభలో సీఎం కేసీఆర్ సభతో పార్టీకి కొత్త ఉత్సాహం వచ్చింది. అందుకే.. అక్టోబర్లో రెండుసార్లు ముఖ్యమంత్రి సభకు ప్రణాళికలు రచిస్తున్నారు. అక్టోబర్ 2వ వారంలో తొలి, అక్టోబర్ 25 తేదీకి కాస్త అటుఇటుగా రెండో సభ ఉంటుందని పార్టీ వర్గాలు తెలిపాయి. బీజేపీ గేరు మారుస్తుందా? టీఆర్ఎస్ నుంచి ఆరుసార్లు ఎమ్మెల్యేగా గెలిచిన ఈటల రాజేందర్ ఒకప్పుడు పార్టీలో అత్యంత కీలకమైన వ్యక్తుల్లో ఒకరు. కానీ.. ఈ వేసవిలో చోటుచేసుకున్న అనూహ్య పరిణామాల నేపథ్యంలో మంత్రి, ఎమ్మెల్యే, పార్టీ పదవులకు రాజీనామా చేయాల్సి వచ్చింది. ఆ వెంటనే బీజేపీలో చేరారు. ఆయన పార్టీలో చేరినప్పటికీ పార్టీ విధానాల కంటే వ్యక్తిగత చరిష్మాతోనే ముందుకు సాగే ప్రయత్నం చేస్తున్నారు. ఆయనకు మద్దతుగా బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్, ఎంపీ అర్వింద్, ఎమ్మెల్యే రఘునందన్రావు, మాజీ ఎంపీలు వివేక్, జితేందర్రెడ్డి, మాజీ ఎమ్మెల్యే బొడిగె శోభ ప్రచారం చేశారు. ఇటీవల నిర్మల్ సభలోనూ కేంద్ర హోంమంత్రి అమిత్షా తనమాటలతో ఈటల రాజేందర్ను ఆకాశానికెత్తేశారు. ఏ రకంగా చూసినా టీఆర్ఎస్కు బీజేపీ ఢీ అంటే ఢీ అన్న స్థాయిలో పోరాడుతోంది. అయితే.. టీఆర్ఎస్ ఎలాగైనా ఈ స్థానాన్ని గెలవాలవాలని భారీబలగంతో సర్వశక్తులు ఒడ్డుతోంది. అదే సమయంలో జాతీయపార్టీ అయిన బీజేపీ నాయకత్వం ఆ స్థాయిలో మాత్రం నాయకులను రంగంలోకి ఇంకా దించడం లేదు. ప్రస్తుతం రాజేందర్ అన్నీ తానై వ్యవహరిస్తున్నారు. సీఎం కేసీఆర్ విధానాలు, ప్రభుత్వం ఇతర మంత్రులను టార్గెట్ చేస్తూ ముందుకుసాగుతున్నారు. నోటిఫికేషన్ రాకపోయి ఉంటే కేంద్రమంత్రి నరేంద్ర సింగ్ తోమర్, కర్ణాటక మంత్రి అరవింద్ లింబావలితో నియోజకవర్గంలో ప్రచారం చేయించాలని జిల్లా నాయకత్వం అనుకుంది. కానీ.. నోటిఫికేషన్తో వారి పర్యటన రద్దయింది. దీంతో బీజేపీ ప్రచారం స్పీడులో గేరు ఎప్పుడు మారుతుందన్న ఆసక్తి మొదలైంది. అక్టోబరు 20న కరీంనగర్లో సభ హుజూరాబాద్లో పోటీ చేయబోయే అభ్యర్థి విషయంలో కాంగ్రెస్ పార్టీ నేడు నిర్ణయానికి రానున్నట్లు సమాచారం. ఓ వైపు టీఆర్ఎస్, బీజేపీ నువ్వా-నేనా అన్నట్లుగా తలపడుతూ ప్రచారంలో దూసుకుపోతున్నాయి. మరోవైపు కాంగ్రెస్ ఇంతవరకూ ప్రచార రేసులో కాలు మోపనే లేదు. అభ్యర్థి ఎంపికలో కాంగ్రెస్ పార్టీకి ఇంకా బాలారిష్టాలు తప్పడం లేదు. సెప్టెంబరు మొదటివారంలో కొంత హడావిడి చేసినా ఆ తరువాత చల్లబడ్డారు. అక్టోబరు 1వ తేదీన ఉప ఎన్నిక నోటిఫికేషన్ రానున్న నేపథ్యంలో ఒకరోజు ముందుగానే అభ్యర్థిని ప్రకటించే యోచనలో కాంగ్రెస్ అధిష్టానం ఉందని సమాచారం. మరోవైపు రాష్ట్రంలో అక్టోబరు 2 నుంచి డిసెంబరు 9వ వరకు వివిధ సమస్యలపై పోరాటానికి కాంగ్రెస్ పిలుపునిచ్చింది. విద్యార్థి, నిరుద్యోగ జంగ్ రన్ పేరుతో ఉమ్మడి జిల్లాల వర్సిటీల్లో భారీ ఆందోళనలకు వ్యూహం రచించింది. ఇందులో భాగంగా అక్టోబరు 20వ తేదీన కరీంనగర్ శాతవాహన వర్సిటీలో విద్యార్థులు, నిరుద్యోగులతో ఈ నిరసన నిర్వహించనున్నట్లు తెలిసింది. -
2023 ఎన్నికలకు సెమీఫైనల్గా హుజురాబాద్ ఉప ఎన్నిక ..!
-
హుజురాబాద్లో టీఆర్ఎస్ దూకుడు
-
హుజురాబాద్లో ఈటెల రాజేందర్కు చేదు అనుభవం
-
మందు బాబులకు పండగ.. దసరాకు ముందే కిక్కు
సాక్షి,కరీంనగర్: నోటిఫికేషన్కు ముందే హుజూరాబాద్ ఉప ఎన్నికకు మద్యం కిక్కు ఎక్కుతోంది. ఈటల రాజేందర్ రాజీనామాతో నియోజకవర్గంలో ఎన్నికల వేడి ప్రారంభం కాగా.. అప్పటి నుంచే మద్యం అమ్మకాలు జోరందుకున్నాయి. ఇక హుజూరాబాద్లో ఉప ఎన్నికకు ఈసీ పచ్చజెండా ఊపడంతో మద్యం మరింత ఏరులైపారనుంది. ఇప్పటికే రికార్డుస్థాయిలో మద్యం అమ్ముడుపోతుండగా.. పార్టీలు, కులసంఘాలు, సమావేశాలు ఏవైనా మద్యం కిక్కు తప్పనిసరిగా మారింది. ఐదు మాసాలుగా హుజూరాబాద్, జమ్మికుంట ప్రాంతాల్లో రూ.వందలకోట్లలో లిక్కర్ అమ్మకాలు జరుగుతన్నాయి. ఈ ప్రభావం మరో రెండునెలలు ఉండనుంది. మొత్తంగా ఉప ఎన్నిక నేపథ్యంలో దసరాకు ముందే ఇక్కడివారికి కిక్కు ఎక్కుతోందని చెప్పుకుంటున్నారు. అమ్మకాల జోరు.. పక్క జిల్లాల నుంచి దిగుమతి ► హుజూరాబాద్లో ఉప ఎన్నిక వేడి ప్రారంభమైనప్పటి నుంచి నియోజకవర్గంలో మద్యం అమ్మకాలు గణనీయంగా పెరిగాయి. నియోజకవర్గంలోని హుజూరాబాద్, జమ్మికుంట ఎక్సైజ్ సర్కిల్లో మొత్తం 29 దుకాణాలున్నాయి. గతేడాది జనవరి నుంచి సెప్టెంబర్ వరకు రూ.125కోట్ల మద్యం అమ్మకాలు జరగ్గా.. 2021లో రూ.170కోట్ల అమ్మకాలు జరిగాయి. గతేడాదికన్నా సుమారు రూ.45 కోట్ల వ్యాపారం అధికంగా జరిగింది. ► గతేడాది ఆగస్టు వరకు రూ.3.60 లక్షల బీర్లు, లిక్కర్లు అమ్ముడవగా, ప్రస్తుతం లిక్కరు,బీర్లు కలిపి 3,92,616 కేసుల మద్యం అమ్ముడైంది. ముఖ్యంగా గత మూడు నెలల నుంచే రెట్టింపు మద్యం అమ్మకాలు జరిగినట్లు తెలుస్తోంది. జిల్లామొత్తం రూ.320 కోట్ల వ్యాపారం జరగ్గా.. 55శాతం అమ్మకాలు ఇక్కడే జరగడం విశేషం. నోటిఫికేషన్తో అమ్మకాల జోరు మరింత పెరగనుంది. ► హుజూరాబాద్ నియోజకవర్గానికి కేవలం కరీంనగర్ జిల్లాకు చెందిన మద్యమే కాకుండా, వివిధ జిల్లాల నుంచి కూడా దిగుమతి అవుతోంది. ఉప ఎన్నిక నేపథ్యంలో ఇప్పటికే పెద్దఎత్తున మద్యం నిల్వలు హుజూరాబాద్కు చేరుకున్నాయని సమాచారం. ఎన్నికల నేపథ్యంలో ఆబ్కారీశాఖకు కూడా భారీగానే ఆదాయం పెరగనుంది. ► ఎన్నికల షెడ్యూలు ఖరారవడం... దసరా తర్వాత ఎన్నికలు ఉండడంతో మద్యం అమ్మకాలు మరింత పెరగనున్నాయి. యేటా దసరాకు రూ.కోట్ల మద్యం అమ్మకాలు జరుగుతాయి. అయితే ఈసారి హుజూరాబాద్లో ఇటు ఎన్నికలు, అటు దసరా పండగ మరింత కిక్కునిస్తుందని తెలుస్తోంది. చదవండి: వేడెక్కిన రాజకీయం: హుజూరా‘బాద్షా’ ఎవరో? -
హుజూరాబాద్ ఫైట్
-
హుజురాబాద్ ప్రజలు నా వెంటే ఉన్నారు: ఈటల
సాక్షి, కరీంనగర్: హుజురాబాద్ ప్రజలు తన వెంటే ఉన్నారని, ఓటర్లను బెదిరించే ప్రయత్నం చేస్తే శిక్ష తప్పదని మాజీ మంత్రి, బీజేపీ నేత ఈటల రాజేందర్ అన్నారు. ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ఎన్ని కుట్రలు చేసినా గెలుపు తనదే అని ధీమా వ్యక్తం చేశారు. సుదీర్ఘ నిరీక్షణకు తెరపడిందని, రాజీనామా చేసి ఐదు నెలలు అయిందని అన్నారు. ఐదు నెలల నుంచి ముఖ్యమంత్రి ప్రగతి భవన్ నుంచి మంత్రి హరీష్ రావు రంగనాయక సాగర్ నుంచి అరడజను మంది మంత్రులు హుజురాబాద్ మీద పడ్డారని విమర్శించారు. ప్రజాస్వామ్యాన్ని ఆపహస్యం చేసేలా వ్యవహరించారని, హుజురాబాద్ ప్రజానీకాన్ని భయబ్రాంతులకు గురి చేసి అనేక ప్రలోభాలకు గురి చేశారని దుయ్యబట్టారు. ఎన్ని ఇబ్బందులు పెట్టిన తొనకకుండా జంకకుండా అండగా హుజురాబాద్ ప్రజానీకం నిలిచిందన్నారు. చదవండి: హుజురాబాద్, బద్వేల్ నియోజకవర్గాల ఉప ఎన్నిక షెడ్యూల్ విడుదల స్వయంగా మంత్రి హరీష్రావు సర్పంచ్ల మీద ఎంపీటీసీల మీద చిందులేశాడని ఫైర్ అయ్యారు. తాను దమ్మనపేటలోని సమ్మిరెడ్డి ఇంటికి వెళితే 10 రోజుకు అతన్ని ఇబ్బందులు పెట్టారని మండిపడ్డారు. హుజురాబాద్లో సర్పంచ్లు ఇతర ప్రజా ప్రతినిధులు, కుల సంఘాల మీద నమ్మకము లేదని, సిద్దిపేట, ఇతర ప్రాంతాలను నుంచి జనాల్సి తీసుకువస్తున్నారని ఎద్దేవా చేశారు. ఇసుక ట్రాక్టర్ నడవాలంటే, పెన్షన్ రావాలంటే టీఆర్ఎస్కు ఓటు వేయాలని బెదిరిస్తున్నారని ధ్వజమెత్తారు. దళితబంధు రావాలంటే టీఆర్ఎస్ జెండా కట్టాలని, ఆశ వర్కర్, ఏఎన్ఎమ్ల కుటుంబ సభ్యులు వేరే పార్టీలతో తిరగవద్దని హుకుం జారీ చేశారని మండిపడ్డారు. తనలో ఓ కండక్టర్ కరచాలము చేస్తే అతన్ని తీసుకుపోయి సిరిసిల్లకు పంపారని తెలిపారు. ధైర్యం ఉంటే ప్రజాస్వామ్య బద్దంగా పోరాడాలని అన్నారు. తాను చేసిన 18 సంవత్సరాల సేవ ఇప్పుడు కనబడుతుందని తెలిపారు. బెదిరింపులు, కుట్రలతో హుజురాబాద్ ప్రజలను ఏమి చేయలేరని ఈటల అన్నారు. -
హుజురాబాద్ ఉప ఎన్నిక: జీ‘హుజుర్’ ఎవరికో..
వెబ్ ప్రత్యేకం: మరో ఉప ఎన్నికకు షెడ్యూల్ విడుదలవడంతో తెలంగాణలో ఒక్కసారిగా రాజకీయ వాతావరణం వేడెక్కింది. కరీంనగర్ జిల్లా హుజురాబాద్ అసెంబ్లీ నియోజకవర్గానికి ఉప ఎన్నికకు మంగళవారం ఎన్నికల సంఘం షెడ్యూల్ విడుదల చేసింది. అయితే ఈ ఎన్నికలో ఎవరు విజయం సాధిస్తారనే చర్చ సర్వత్రా జరుగుతోంది. ఈటల రాజేందర్పై భూకబ్జా ఆరోపణలు రావడంతో మంత్రివర్గం నుంచి ప్రభుత్వం బర్తరఫ్ చేసింది. అయితే తనను పొమ్మనలేక పొగబెట్టారని పేర్కొంటూ ఈటల టీఆర్ఎస్ సభ్యత్వంతో పాటు ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసిన విషయం తెలిసిందే. దీంతో హుజురాబాద్ అసెంబ్లీకి ఉప ఎన్నిక అనివార్యంగా మారింది. ప్రస్తుతం షెడ్యూల్ విడుదలవడంతో ఆ నియోజకవర్గంలో ఎవరు గెలుస్తారో.. హజురాబాద్ ఎవరికీ ‘జీ హుజుర్’ అంటుందో చూద్దాం.. చదవండి: కాంగ్రెస్కు భారీ షాక్.. బీజేపీలో చేరనున్న మాజీ సీఎం? అయితే ఈ ఎన్నిక పార్టీల పరంగా కాదు ఈటల రాజేందర్ వర్సెస్ టీఆర్ఎస్గా మారింది. అయితే ఇప్పటివరకైతే ఒక్క టీఆర్ఎస్ పార్టీ మినహా ఏ పార్టీలు తమ అభ్యర్థులను ఖరారు చేయలేదు. టీఆర్ఎస్ నుంచి గెల్లు శ్రీనివాస్ యాదవ్ గులాబీ పార్టీ బరిలోకి దింపింది. ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసిన ఈటల రాజేందర్ బీజేపీ అభ్యర్థిగా పోటీ చేయనున్నారు. అయితే బీజేపీ మాత్రం అధికారికంగా ప్రకటించలేదు. కాంగ్రెస్ పార్టీ మాత్రం అభ్యర్థి విషయంలో ఇంకా ఓ స్పష్టత రాలేదు. బీజేపీ (ఈటల రాజేందర్) ఈ ఉప ఎన్నికల ఈటల రాజేందర్ వర్సెస్ టీఆర్ఎస్ మధ్య ఉన్నట్టు స్పష్టంగా తెలుస్తోంది. బీజేపీ తనను అభ్యర్థిగా ప్రకటించపోయినప్పటికీ ఈటల బరిలో దిగనున్నారు. రాజీనామా చేసిన నాటి నుంచి ఈటల ప్రజాక్షేత్రంలోనే ఉన్నారు. కొన్ని రోజులు పాదయాత్ర చేపట్టారు. అస్వస్థతకు గురవడంతో పాదయాత్రకు ముగింపు పలికి నియోజకవర్గంలో సుడిగాలి పర్యటనలు చేస్తున్నారు. ఇప్పటికే నియోజకవర్గవ్యాప్తంగా రెండుసార్లు చుట్టేశారు. 2004 కమలాపూర్ నియోజకవర్గం నుంచి, 2009, 10 (ఉప ఎన్నిక), 2014, 2018 ఎన్నికల్లో హుజురాబాద్ స్థానం నుంచి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. చదవండి: ప్రపంచంలోనే అతిపెద్ద ఎకో అర్బన్ ‘తెలంగాణలో..’ ఐదు సార్లు ఎమ్మెల్యేగా పని చేసిన అనుభవం.. ప్రజలందరికీ చేరువ కావడం ఈటలకు కలిసొచ్చే అంశం. అన్ని మండలాలు ఆయనకు సుపరిచితమే. ప్రతిఒక్కరినీ పేరుపేరున పలకరించేంత ప్రజల్లో కలిసిపోయారు. పైగా స్థానికుడు. ఈటలపై ఉద్దేశపూర్వకంగా ప్రభుత్వం బహిష్కరించిందనే సానుభూతి ప్రజల్లో ఏర్పడడం, నరేంద్ర మోదీ హవా కూడా కనిపించే అవకాశం ఉంది. బలహీనతల విషయానికి వస్తే హుజురాబాద్ అభివృద్ధిలో వెనకపడి ఉండడం.. అవినీతి ఆరోపణలు రావడం వంటివి ఈటలకు చేటు చేసేలా ఉంది. బీజేపీ నాయకత్వం సహకరించపోవడం కూడా కొంత ప్రభావం చూపనుంది. ఈ ఎన్నిక ఈటలకు ప్రతిష్టాత్మకంగా మారింది. ఈ ఎన్నిక ఆయనకు చావో రేవోగా పేర్కొంటున్నారు. టీఆర్ఎస్ (గెల్లు శ్రీనివాస్ యాదవ్) హుజురాబాద్లో టీఆర్ఎస్ బలంగా ఉంది. అభ్యర్థిని కొన్ని నెలల ముందటే ప్రకటించారు. స్థానికుడైన గెల్లు శ్రీనివాస్ యాదవ్ను వ్యూహాత్మకంగా అభ్యర్థిగా ప్రకటించి బీసీ ఓటర్లకు గాలం వేసింది. పైగా కాంగ్రెస్లో కీలక నాయకుడిగా ఉన్న పాడి కౌశిక్రెడ్డిని పార్టీలోకి చేర్చుకోవడం.. ఈ నియోజకవర్గానికే చెందిన వ్యక్తికి ఎస్పీ కార్పొరేషన్ ఛైర్మన్ పదవి కట్టబెట్టింది. వీటికితోడు దేశంలోనే ప్రప్రథమంగా రూ.10 లక్షల నగదు సాయం పథకం ‘దళితబంధు’ ప్రకటించడం టీఆర్ఎస్కు కలిసొచ్చే అంశం. నియోజకవర్గ బాధ్యతలు పార్టీ అప్పగించడంతో మంత్రి హరీశ్ రావు హుజురాబాద్లోనే కొన్ని నెలలుగా ఉంటున్నారు. తరచూ పర్యటనలు.. అభివృద్ధి కార్యక్రమాల ప్రారంభోత్సవాలు చేస్తున్నారు. మంత్రులు, ఎమ్మెల్యేలు నియోజకవర్గంలోనే తిష్ట వేశారు. ఈ గెలుపు టీఆర్ఎస్కు ప్రతిష్టాత్మకంగా మారింది. నాగార్జునసాగర్, పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల విజయంతో ఊపు మీదున్న టీఆర్ఎస్.. హుజురాబాద్తో విజయయాత్ర కొనసాగించాలని భావిస్తోంది. అయితే ప్రతికూలతలు ఏమున్నాయంటే.. ఈటలను అకారణంగా మంత్రివర్గం నుంచి తొలగించారని స్థానికుల్లో ఆగ్రహం. ఏడున్నరేళ్ల ప్రభుత్వంపై వ్యతిరేకత చేటు చేసేలా ఉంది. దృష్టి సారించని కాంగ్రెస్ ఈ ఉప ఎన్నికపై కాంగ్రెస్ పార్టీ ఇప్పటివరకు దృష్టి సారించలేదు. ఈ నియోజకవర్గంపై ఓ కమిటీ ఏర్పాటు చేసి చేతులు దులిపేసుకుంది. ఇప్పటివరకు పార్టీ అభ్యర్థినే ఖరారు చేయలేదు. ఇక్కడ పార్టీకి నాయకులు కరువయ్యారు. ఉన్నగానొక్క పాడి కౌశిక్రెడ్డి పార్టీని వీడడం హస్తం పార్టీకి ఊహించని దెబ్బ తగిలింది. ఇక పార్టీ శ్రేణులంతా కౌశిక్ వెంట తరలివెళ్లారు. పార్టీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డిపై ఈ నియోజకవర్గంలో వ్యతిరేకత వ్యక్తమవుతోంది. పార్టీ అభ్యర్థిగా పరిశీలనలో ఉన్న మాజీ మంత్రి కొండా సురేఖ పోటీపై విముఖంగా ఉన్నారు. అయితే భవిష్యత్ దృష్ట్యా పార్టీ ఆదేశాల మేరకు పోటీ చేసేందుకు సంసిద్ధత వ్యక్తమవుతోంది. కాంగ్రెస్ నామమాత్ర పోటీ కూడా ఇవ్వదని సొంత పార్టీ వర్గాల్లోనే చర్చ నడుస్తోంది. బరిలో మరికొందరు ఇక తెలుగుదేశం పార్టీ గురించి అసలు చర్చించనవసరం లేదు. రాష్ట్రంలో ఉన్న మాదిరే హుజురాబాద్లో ఆ పార్టీకి దిక్కూదివానం లేదు. ఇక మరికొన్ని చిన్న పార్టీలు కూడా ఈ ఉప ఎన్నికలో పోటీ చేసే అవకాశం ఉంది. మరికొందరు రాష్ట్ర ప్రభుత్వ తీరును నిరసిస్తూ భారీ సంఖ్యలో స్వతంత్రులుగా నిలిచేందుకు సిద్ధమవుతున్నారట. నిజామాబాద్ లోక్సభ ఎన్నికలో జరిగినట్టు హుజురాబాద్ ఉప ఎన్నికకు భారీగా అభ్యర్థులు పోటీలో ఉంటారని వార్తలు వస్తున్నాయి. అది జరిగితే ఈ ఎన్నిక మరోసారి దేశవ్యాప్త చర్చ జరిగే అవకాశం ఉంది. ఏది ఏమైనా ఎన్నాళ్లుగానో ఊరిస్తున్న ఉప ఎన్నిక కొద్ది రోజుల్లో రానుంది.