‘రేవంత్‌ను నమ్మిన పాపం.. రైతులకు స్మశానమే దిక్కైంది’ | BRS KTR Serious Comments On Revanth Reddy | Sakshi
Sakshi News home page

‘రేవంత్‌ను నమ్మిన పాపం.. రైతులకు స్మశానమే దిక్కైంది’

Published Thu, Apr 17 2025 10:39 AM | Last Updated on Thu, Apr 17 2025 12:27 PM

BRS KTR Serious Comments On Revanth Reddy

సాక్షి, హైదరాబాద్‌: తెలంగాణలో కాంగ్రెస్‌ ప్రభుత్వంపై ఆగ్రహం వ్యక్తం చేశారు బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌. రేవంత్‌ను నమ్మిన పాపానికి.. రైతులకు స్మశానమే దిక్కయింది అంటూ ఆవేదన వ్యక్తం చేశారు. చివరికి రైతులు బతికుండగానే.. ఇలా వల్లకాడుకు చేర్చిన పాపం.. కాంగ్రెస్‌ను వెంటాడటం ఖాయం అని ఘాటు వ్యాఖ్యలు చేశారు.

మాజీ మంత్రి, బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యే కేటీఆర్‌ ట్విట్టర్‌ వేదికగా..

రేవంత్ ను నమ్మిన పాపానికి..
రైతులకు స్మశానమే దిక్కయింది

భూముల "అమ్మకాల్లో" బిజీగా ఉన్న సర్కారు
ధాన్యం "కొనుగోళ్లనే" పూర్తిగా మరిచిపోయింది

15 రోజులైనా కొనుగోలు కేంద్రం తెరుచుకోక
స్మశానంలో పడుకునే దుస్థితి దుర్మార్గమైనది

ఇప్పటికే రాష్ట్రంలో వ్యవసాయ సంక్షోభంతో..
రైతుల మరణమృదంగం మోగుతోంది.

చివరికి రైతులు బతికుండగానే.. 
ఇలా వల్లకాడుకు చేర్చిన పాపం.. 
కాంగ్రెస్ ను వెంటాడటం ఖాయం

జై కిసాన్

#CongressFailedTelangana అంటూ ఘాటు విమర్శలు చేశారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement