‘శివరాజ్‌ సింగ్‌ భారీ గెలుపుతో.. ఢిల్లీ మొత్తం తలవంచింది’​ | Shivraj Singh Chouhan son says entire Delhi bowing down before his father | Sakshi
Sakshi News home page

‘శివరాజ్‌ సింగ్‌ భారీ గెలుపుతో.. ఢిల్లీ మొత్తం తలవంచింది’​

Published Sun, Jun 23 2024 9:16 AM | Last Updated on Sun, Jun 23 2024 10:38 AM

Shivraj Singh Chouhan son says entire Delhi bowing down before his father

భోపాల్‌:  లోక్‌సభ ఎన్నికల్లో తన తండ్రి​, కేంద్ర వ్యవసాయం శాఖ మంత్రి శివరాజ్‌సింగ్‌ చౌహన్‌పై గెలుపుతో ఢిల్లీ మొత్తం తలవంచిందని కార్తికేయ సింగ్‌ అన్నారు. ఆయన శుక్రవారం బుధ్నీ  అసెంబ్లీ స్థానంలో నిర్వహించిన ఓ సభలో మాట్లాడుతూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. 

‘నేను ఢిల్లీ నుంచి వచ్చాను. అయతే మన నేత(శివరాజ్‌ సింగ్‌ చౌహన్‌)  ఒక ముఖ్యమంత్రిగా చాలా పాపులర్‌. అయిన ఇప్పుడు సీఎం కాకున్నా మరింత పాపుల్‌ అయ్యారు. మన నేత భారీ విజయం సాధించారు.  దీంతో ఢిల్లీ మొత్తం ప్రస్తుతం మన నేత ముందు తలవంచంది. ఢిల్లీ మొత్తానికి ఆయనేంటో తెలుసు. అదేవిధంగా ఆయనకు గుర్తింపు, గౌరవం ఇస్తుంది. ఒక్క ఢిల్లీనే కాదు.. కశ్మీర్‌ నుంచి కన్యాకుమారి వరకు ఆయన్ను గౌరవిస్తారు. దేశవ్యాప్తంగా ఉన్న పెద్ద నేతల జాబితాలో శివరాజ్‌సింగ్‌ ఒకరుగా నిలుస్తారు’అని తండ్రిపై ప్రశంసలు కురిపించారు.

లోక్‌సభ ఎన్నికల  విదిశ పార్లమెంట్‌ స్థానంలో బీజేపీ తరఫున బరిలోకి దిగిన మాజీ  మధ్యప్రదేశ్‌ సీఎం శివరాజ్‌ సింగ్‌ చౌహన్‌ 8.20 లక్షల ఓట్ల భారీ మెజార్టీతో ఘన విజయం సాధించారు. దీంతో ఆయన కేంద్ర కేబినెట్‌లో చోటుదక్కించుకొని వ్యవసాయ శాఖ మంత్రిగా బాధ్యతలు చేపట్టారు.

ఇక.. తన తండ్రిపై కార్తికేయ సింగ్‌ చేసిన వ్యాఖ్యలపై మధ్యప్రదేశ్‌ కాంగ్రెస్‌ చీఫ్‌ జితూ పట్వారీ  ఎక్స్‌ వేదికగా విమర్శలు గుప్పించారు.  కార్తికేయ  సింగ్ వ్యాఖ్యలతో ఢిల్లీకి అసమ్మతి భయం ఉన్నట్లు  స్పష్టంగా తెలుస్తోందని అన్నారు.

‘కేంద్ర మంత్రి కుమారుడు (యువరాజు) కార్తికేయ ఢిల్లీ భయంతో ఉందని ఉంటున్నారు. ఇది 100 శాతం నిజం. ఎందుకంటే దేశం భయంతో ఉన్న ఓ నియంతను నిశితంగా పరిశీలిస్తోంది. పార్టీలో  వ్యక్తం అవుతున్న అసమ్మతి స్వరం. రెబెల్‌ అవుతున్న పెద్ద నేతలు. సంకీర్ణ ప్రభుత్వ సమన్వయం. ప్రభుత్వానికి మద్దతు తగ్గటం వల్ల భయంతో అధికార పీఠం కదులుతోంది’అని  జితూ పట్వారీ  అన్నారు. 

మరోవైపు.. శివరాజ్‌ సింగ్‌ కేంద్రమంత్రి కావటంతో బుధ్నీ అసెంబ్లీ నియోజకర్గం నుంచి పోటీ చేయడానికి ఆయన కుమారుడు కార్తికేయ సింగ్‌ చౌహాన్‌కు లైన్‌ క్లియర్‌ అయినట్లు తెలుస్తోంది.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement
 
Advertisement
 
Advertisement