ఇక మరింత దూకుడుగా వైఎస్సార్‌సీపీ పోరుబాట | YSRCP Fight More Aggressively Against Kutami Prabhutvam, Check Out More Details Inside | Sakshi
Sakshi News home page

ఇక మరింత దూకుడుగా వైఎస్సార్‌సీపీ పోరుబాట

Dec 14 2024 10:28 AM | Updated on Dec 14 2024 11:15 AM

YSRCP fight more aggressively Against Kutami Prabhutvam

గుంటూరు, సాక్షి: అన్నదాతకు అండగా కార్యక్రమం సూపర్‌ సక్సెస్‌కావడంతో వైఎస్సార్సీపీ శ్రేణులు ఫుల్‌ జోష్‌లో ఉన్నాయి. ఈ ఊపులోనే.. పరిపాలన పట్టించుకోని కూటమి ప్రభుత్వానికి బుద్ధి వచ్చేలా మరిన్ని పోరాటాలను చేయాలని పార్టీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి పిలుపు ఇస్తున్నారు.

కూటమి అధికారంలోకి వచ్చాక.. ‘‘వాళ్లు ప్రస్తుతం హానీమూన్‌లో మునిగి తేలుతున్నారని, అది ముగిసేదాకా అయ్యేదాకా వేచిచూద్దామని.. ఆ తర్వాత వాళ్ల సంగతి తేలుద్దామని’’ వైఎస్‌ జగన్‌, వైఎస్సార్సీపీ శ్రేణులకు సూచించారు. ఆయన చెప్పినట్లుగానే ఆర్నెల్ల టైం ముగిసింది. ఎన్నికల టైంలో ఇచ్చిన సూపర్‌ సిక్స్‌ హామీల్లో ఓ ఒక్కటీని పరిపూర్ణంగా అమలు చేయలేకపోయింది కూటమి ప్రభుత్వం. పైగా..

పైగా అన్నివర్గాలను బాబు ప్రభుత్వం మోసం చేస్తూ వస్తోంది. ఈ మోసం తారాస్థాయికి చేరడం, పరిపాలన గాడి తప్పడంతో ఇక ఉపేక్షించకూడదని వైఎస్‌ జగన్‌ నిర్ణయించుకున్నారు.  తొలి విడతగా రైతులు, కరెంట్‌ ఛార్జీలు, స్కూల్‌ ఫీజుల బకాయిలు లాంటి ప్రధాన సమస్యలపై పోరాడేందుకు పిలుపు ఇచ్చారు.

ఇదీ చదవండి: బాబు దగా పాలన.. తొలిపోరు విజయవంతం

కూటమి ప్రభుత్వానికి వ్యతిరేకంగా రైతు పోరుబాట పేరిట వైఎస్సార్‌సీపీ చేపట్టిన నిరసన కార్యక్రమానికి ప్రజలు, రైతుల నుంచి అద్భుతమైన స్పందన లభించింది. రాష్ట్రంలో రైతు సమస్యలను తక్షణమే పరిష్కరించాలని డిమాండ్‌ చేస్తూ...కలెక్టర్లకు  డిమాండ్‌ పత్రాలను అందజేశారు. చంద్రబాబు పోలీసులను ఉపయోగించుకుని వైఎస్సార్‌సీపీ నాయకులపైన, రైతులపైన హౌస్‌ అరెస్టులకు, బెదిరింపులకు దిగినా ఎక్కడా వెనకడుగు వేయకుండా, వారు తమ డిమాండ్లు వినిపించడం హర్షణీయం. 

ఈ క్రమంలో.. ప్రజల తరఫున కూటమి సర్కార్‌పై మరిన్ని పోరాటాలు చేయాలని.. ప్రజా సమస్యల పరిష్కారమే ఈ పోరాటాల ఎజెండాగా ఉండాలని పార్టీ నేతలకు వైఎస్‌ జగన్‌ సూచించారు. దీంతో.. ఇక నుంచి పోరుబాటలో వైఎస్సార్‌సీపీ మరింత దూకుడుగా ముందుకెళ్లే పరిస్థితి కనిపిస్తోంది.

  • పెంచిన కరెంటు ఛార్జీల పెంపును వ్యతిరేకిస్తూ ధర్నాలకు వైఎస్సార్‌సీపీ పిలుపు
  • ఈ నెల 27న కరెంట్‌ ఛార్జీలు తగ్గించాలంటూ నిరసన కార్యక్రమాలు
  • ప్రజలపై రూ.15,500 కోట్ల కరెంట్‌ భారం వేసిన చంద్రబాబు ప్రభుత్వం
  • ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలను విడుదలకు మరో పోరాటం
  • జనవరి 3న వైఎస్సార్‌సీపీ ఆధ్వర్యంలో  రాష్ట్రవ్యాప్త ధర్నాలు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement