
గుంటూరు, సాక్షి: వైఎస్సార్సీపీ నుంచి ఎంఆర్సీ రెడ్డి సస్పెండ్ అయ్యారు. పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్నట్లు ఆయనపై ఫిర్యాదులు వచ్చాయి. ఈ నేపథ్యంలో విచారణ జరిపి క్రమశిక్షణ కమిటీ సిఫార్సుల మేరకు పార్టీ వేటు నిర్ణయం ప్రకటించింది. పార్టీ అధినేత, సీఎం జగన్ ఆదేశాలతో తిరుపతి జిల్లా చంద్రగిరి నియోజకవర్గానికి చెందిన ఎంఆర్సీ రెడ్డి చర్యలు తీసుకున్నట్లు పార్టీ కేంద్ర కార్యాలయం ఒక ప్రకటనలో తెలిపింది.