ఎమ్మెల్సీ ఎన్నికలను సీరియస్‌గా తీసుకోండి | - | Sakshi
Sakshi News home page

ఎమ్మెల్సీ ఎన్నికలను సీరియస్‌గా తీసుకోండి

Published Tue, Feb 11 2025 12:39 AM | Last Updated on Tue, Feb 11 2025 12:40 AM

ఎమ్మెల్సీ ఎన్నికలను సీరియస్‌గా తీసుకోండి

ఎమ్మెల్సీ ఎన్నికలను సీరియస్‌గా తీసుకోండి

● స్థానిక సంస్థల్లో ఈ ఫలితం ప్రభావం

● ఏడుగురు మంత్రులకు 42 నియోజకవర్గాల బాధ్యతలు

● పీసీసీ చీఫ్‌ మహేశ్‌కుమార్‌ గౌడ్‌

కరీంనగర్‌ కార్పొరేషన్‌: ‘ఎమ్మెల్సీ ఎన్నిక మనకు ప్రతిష్టాత్మకం. ఈ ఎన్నికల్లో విజయంతోనే వచ్చే స్థానిక సంస్థల ఎన్నికల విజయానికి బాటలు పడతాయి. అలసత్వం వద్దు... సీరియస్‌గా తీసుకోండి’.. అంటూ ప్రదేశ్‌ కాంగ్రెస్‌ అధ్యక్షుడు మహేష్‌కుమార్‌గౌడ్‌ పార్టీ శ్రేణులు, నాయకులకు దిశానిర్దేశం చేశా రు. సోమవారం కరీంనగర్‌, మెదక్‌, నిజామాబాద్‌, ఆదిలాబాద్‌ పట్టభద్రుల నియోజకవర్గ కాంగ్రెస్‌ అభ్యర్థి వి.నరేందర్‌రెడ్డి నామినేషన్‌ ప్రక్రియలో పాల్గొన్నారు. అనంతరం మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, పార్టీ నాయకులతో ఓ హోటల్‌లో అంతర్గత సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మహేశ్‌ కుమార్‌ గౌడ్‌ మాట్లాడుతూ.. రానున్న స్థానిక సంస్థల ఎన్నికలపై ఈ ఎన్నిక ఫలితం ప్రభా వం చూపుతుందన్నారు. ఎమ్మెల్సీ నియోజకవర్గం పరిధిలోని 42అసెంబ్లీ నియోజకవర్గాల బాధ్యతలను ఏడుగురు మంత్రులకు అప్పగిస్తున్నట్లు తెలిపారు. మరో పదిహేను రోజు లే గడువు ఉన్నందున మంగళవారం నుంచి క్షేత్రస్థాయిలో ప్రచారాన్ని ఉధృతం చేయాలని సూచించారు. పట్టభద్రుల అభ్యర్థి వి.నరేందర్‌రెడ్డి మాట్లాడుతూ తనకు ఎమ్మెల్సీ టి.జీవన్‌రెడ్డి రోల్‌ మాడల్‌ అన్నారు. మంత్రులు దుద్దిళ్ల శ్రీధర్‌బాబు, పొన్నం ప్రభాకర్‌, ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, జూపల్లి కృష్ణారావు, సీత క్క, కొండా సురేఖ, ప్రభుత్వ విప్‌లు ఆది శ్రీనివాస్‌, అడ్లూరి లక్ష్మణ్‌కుమార్‌, ఎమ్మెల్సీ టి.జీవన్‌రెడ్డి,ఎమ్మెల్యేలు విజయరమణారా వు, కవ్వంపల్లి సత్యనారాయణ, మక్కాన్‌సింగ్‌రాజ్‌ఠాకూర్‌, మేడిపల్లి సత్యం, ఎడమ బొజ్జ, మైనంపల్లి రోహిత్‌, మాజీ ఎమ్మెల్సీ షబ్బీర్‌అలీ, తూర్పు నిర్మల జగ్గారెడ్డి, జిల్లా గ్రంథాలయ సంస్థ అధ్యక్షుడు సత్తు మల్లేశం, సుడా చైర్మన్‌ కె.నరేందర్‌రెడ్డి పాల్గొన్నారు. నరేందర్‌రెడ్డి నామినేషన్‌ సందర్భంగా ఎస్‌ఆర్‌ఆర్‌ కళాశాల నుంచి కలెక్టరేట్‌ వరకు భారీ ర్యాలీ నిర్వహించారు.

ఇంతకీ ఎన్ని వేల ఉద్యోగాలు?

ర్యాలీలో మాట్లాడిన వారంతా తమ ప్రభుత్వం వచ్చాక వేల ఉద్యోగాలు భర్తీ చేసిందని చెప్పడానికి ప్రాధాన్యం ఇచ్చారు. ఒక్కొక్కరు ఒక్కో రకమైన సంఖ్య చెప్పారు. ఒకరు 53 వేల ఉద్యోగాలని....మరొకరు 54 వేలని... 55 వేలని...56 వేల ఉద్యోగాలు భర్తీ చేసామని మంత్రులు, నాయకులు చెప్పడంతో పార్టీ శ్రేణులు గందరగోళానికి గురయ్యారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement