మొండి బకాయిదారులపై చట్టపరమైన చర్యలు | - | Sakshi
Sakshi News home page

మొండి బకాయిదారులపై చట్టపరమైన చర్యలు

Published Fri, Feb 14 2025 10:26 PM | Last Updated on Fri, Feb 14 2025 10:26 PM

మొండి బకాయిదారులపై చట్టపరమైన చర్యలు

మొండి బకాయిదారులపై చట్టపరమైన చర్యలు

కరీంనగర్‌ కార్పొరేషన్‌: నగరపాలకసంస్థకు పన్నులు చెల్లించని మొండి బకాయిదారులపై చట్టపరంగా చర్యలు తీసుకుంటామని కమిషనర్‌ చాహత్‌ బాజ్‌పేయి హెచ్చరించారు. గురువారం నగరపాలకసంస్థ కార్యాలయంలో పన్నుల వసూళ్లపై ఆమె సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ అధికారులు ప్రభుత్వ,ప్రైవేట్‌ సంస్థలకు సంబంధించిన పన్నుల వసూళ్లపైనా దృష్టి పెట్టాలన్నారు. కొద్ది సంవత్సరాలుగా ఆస్తి పన్నులు చెల్లించని మొండి బకాయిదారులకు నోటీసులు జారీ చేయాలని ఆర్‌ఐలను ఆదేశించారు. ఇటీవల డ్రాలో షెట్టర్లు పొంది, ఒప్పందం చేసుకోని వ్యాపారులకు నోటీసులు ఇవ్వాలన్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement