క్రీడలతో శారీరక దారుఢ్యం | - | Sakshi
Sakshi News home page

క్రీడలతో శారీరక దారుఢ్యం

Published Fri, Mar 7 2025 9:24 AM | Last Updated on Fri, Mar 7 2025 9:19 AM

క్రీడలతో శారీరక దారుఢ్యం

క్రీడలతో శారీరక దారుఢ్యం

మొయినాబాద్‌రూరల్‌: క్రీడలతో శారీరక దారుఢ్యంతో పాటు స్నేహ బంధాలు పెంపొందుతాయని ఇండియన్‌ కబడ్డీ ప్లేయర్‌ గంగాధరి మల్లేశ్‌ అన్నారు. గురువారం మండల పరిధిలోని జేబీ ఇంజనీరింగ్‌ కళాశాలలో విద్యాసంస్థల కార్యదర్శి కృష్ణారావు ఆధ్వర్యంలో రాష్ట్ర స్థాయి క్రీడా పోటీలను నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన మల్లేష్‌ మాట్లాడుతూ.. విద్యార్థులు విద్యతో పాటు క్రీడల్లోనూ రాణించాలన్నారు. ఈ కార్యక్రమంలో ప్రిన్సిపాల్‌ కృష్ణామాచారి, డైరెక్టర్‌ సంజయ్‌, డీన్‌ క్రటిజ్ఞాన్‌, స్టూడెంట్‌ ఎంపైర్స్‌ డాక్టర్‌ సలావుద్దీన్‌, ఫిజికల్‌ డైరెక్టర్‌ విగ్నేష్‌ తదితరులు పాల్గొన్నారు.

ఇండియన్‌ కబడ్డీ ప్లేయర్‌ మల్లేశ్‌

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement