ఇంటర్ విద్యార్థులకు మరోసారి అవకాశం
సంగారెడ్డి ఎడ్యుకేషన్: ఇటీవలే ఇంటర్మీడియెట్ ప్రాక్టికల్ పరీక్షలకు గైర్హాజరైన జనరల్, ఒకేషనల్ విద్యార్థులకు విద్యాశాఖ మరోసారి అవకాశం కల్పిస్తున్నట్లు ఇంటర్మీడియెట్ జిల్లా అధికారి గోవిందరాం ఆదివారం ఓ ప్రకటనలో తెలిపారు. ఈ ప్రాక్టికల్ పరీక్షలు ఈ నెల 18 నుంచి 22వ తేదీ వరకు జరుగనున్నాయని తెలిపారు. ఈ పరీక్షలు సంగారెడ్డిలోని బాలుర జూనియర్ కళాశాలలో ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు, మధ్యాహ్నం 2 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు జరుగుతాయన్నారు. గైర్హాజరైన విద్యార్థులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.
Comments
Please login to add a commentAdd a comment