విద్యుదాఘాతంతో ఇల్లు దగ్ధం
మెదక్ మున్సిపాలిటీ: విద్యుదాఘాతంతో ఇల్లు దగ్ధమైన ఘటన మెదక్ పట్టణంలోని కుమ్మరిగల్లిలో సోమవారం చోటు చేసుకుంది. బాధిత కుటుంబీకులు, స్థానికుల కథనం మేరకు .. మెదక్ పట్టణం కుమ్మరి గడ్డకి చెందిన కుమ్మరి సంతోష్ ఇంట్లో షార్ట్ సర్క్యూట్తో మంటలు చెలరేగి పూర్తిగా కాలిపోయింది. సంతోష్ మెడికల్ ల్యాబ్ ఏర్పాటు కోసం సమకూర్చుకున్న రూ.4 లక్షల నగదు, 15 తులాల బంగారు ఆభరణాలు, ఫ్యాషన్ ప్రో బైక్, ఫ్రిడ్జ్, టీవీ, తదితర సామగ్రి కాలి బూడిదయ్యాయి. సంతోష్, అతడి భార్యకు సంబంధించి విద్యార్హత సర్టిఫికెట్లు అన్నీ కాలిపోయాయి. సమాచారం అందుకున్న ఫైర్ సిబ్బంది వచ్చి మంటలార్పారు. అయితే అప్పటికే ఇంట్లోని సామగ్రి పూర్తిగా కాలిపోయింది. రెవెన్యూ ఇన్స్పెక్టర్ ఘటనా స్థలాన్ని సందర్శించి పంచనామా నిర్వహించారు. తమను ప్రభుత్వం ఆదుకోవాలని బాధితుడు సంతోష్ విజ్ఞప్తి చేశాడు.
బైక్, ఇంట్లోని సామగ్రి,
సర్టిఫికెట్లు కాలి బూడిద
రూ.20 లక్షల ఆస్తినష్టం
Comments
Please login to add a commentAdd a comment