
కంటైనర్ను ఢీకొన్న డీసీఎం
ఇరుక్కుపోయిన డ్రైవర్.. తీవ్ర గాయాలు
తూప్రాన్: ముందు వెళుతున్న కంటైనర్ను వెనకాల నుంచి డీసీఎం ఢీకొనడంతో డ్రైవర్ క్యాబిన్లో ఇరుక్కుపోయాడు. ఈ సంఘటన 44వ జాతీయ రహదారిపై మాసాయిపేట స్టేషన్ సమీపంలో శుక్రవారం చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. హైదరాబాద్ నుంచి నిజామాబాద్ వైపు వెళ్తున్న కంటైనర్ లారీని వెనకాల నుంచి డీసీఎం అతివేగంగా ఢీకొంది. ఈ ఘటనలో కర్ణాటక రాష్ట్రానికి చెందిన డీసీఎం డ్రైవర్ కబ్రేజ్ క్యాబిన్లోనే ఇరక్కుపోయాడు. కుడికాలు నుజ్జునుజ్జయింది. జీఎమ్మార్ హైవే సిబ్బంది ఘటన స్థలానికి చేరుకొని క్షతగాత్రున్ని బయటకు తీసి గాంధీ ఆసుపత్రికి తరలించారు. ఈ ప్రమాదం కారణంగా హైవేపై వాహనాలు స్తంభించి పోయాయి.