
పారిస్ ఒలింపిక్స్ వరల్డ్ బాక్సింగ్ క్వాలిఫయింగ్ టోర్నీలో తొలి రోజు బరిలోకి దిగిన ఇద్దరు భారత బాక్సర్లకు నిరాశే ఎదురైంది. ఆదివారం ఇటలీలో జరిగిన పురుషుల 51 కేజీల విభాగంలో దీపక్... +92 కేజీల విభాగంలో నరేందర్ తొలి రౌండ్లోనే నిష్క్రమించారు.
నిజాత్ హుసెనోవ్ (అజర్బైజాన్)తో జరిగిన బౌట్లో దీపక్ 2–3తో... టియాఫాక్ (జర్మనీ)తో జరిగిన బౌట్లో నరేందర్ 0–5తో ఓడిపోయారు. హరియాణాకు చెందిన దీపక్ గత ఏడాది ప్రపంచ చాంపియన్íÙప్లో కాంస్య పతకం సాధించాడు.
Comments
Please login to add a commentAdd a comment