Deepak
-
హీరోయిన్ ఇంట్లో తీవ్ర విషాదం.. డైరెక్టర్ కన్నుమూత!
సినీ ఇండస్ట్రీలో తీవ్ర విషాదం నెలకొంది. కన్నడ చిత్రసీమకు చెందిన ప్రముఖ యువ దర్శకుడు దీపక్ ఆరస్ కన్నుమూశారు. మూత్రపిండాల వ్యాధితో బాధపడుతున్న ఆయన ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ శుక్రవారం ఉదయం కన్నుమూశారు. డైరెక్టర్ ఆకస్మిక మరణం శాండల్వుడ్ సినీ పరిశ్రమను దిగ్భ్రాంతికి గురి చేసింది. దర్శకుడి మరణవార్త విన్న సినీ ప్రముఖులు సంతాపం ప్రకటించారు. ఈ విషయాన్ని ఆయన చెల్లెలు, నటి అమూల్య సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. తమ కుటుంబంలో తీవ్ర విషాదంలో ఉందని ఎమోషనలైంది.కాగా.. దర్శకుడు దీపక్ ఆరస్ మనసాలజీ (2012), షుగర్ ఫ్యాక్టరీ (2023) లాంటి చిత్రాలతో ఫేమస్ అయ్యారు. అతని తొలిచిత్రం మనసాలజీతోనే విజయం అందుకున్నారు. 2023లో విడుదలైన షుగర్ ఫ్యాక్టరీ అనే కామెడీ ఎంటర్టైనర్ చిత్రానికి దర్శకత్వం వహించాడు. ఇందులో డార్లింగ్ కృష్ణ ప్రధాన పాత్రలో నటించారు. కాగా..ఇప్పటికే దీపక్ ఆరస్కు పెళ్లి కాగా.. ఆయనకు ఇద్దరు పిల్లలు ఉన్నారు. ఆయన చెల్లెలు అమూల్య కన్నడలో హీరోయిన్గా పలు చిత్రాల్లో నటించింది. ప్రస్తుతం ఆమె సినిమాలకు దూరంగా ఉంది. -
పోలవరం పూర్తికి గడువు రెండేళ్లే
సాక్షి, అమరావతి: ఏపీ జీవనాడి పోలవరం నిర్మాణం పూర్తి చేయడానికి కేంద్రం రెండేళ్ల గడువు విధించింది. ప్రాజెక్టులో మిగిలిన పనులను 2026 మార్చి నాటికి పూర్తి చేయాలని రాష్ట్ర ప్రభుత్వానికి తేల్చి చెప్పింది. భారీ వరదల వల్ల ఏవైనా ఇబ్బందులు ఉత్పన్నమైతే మరో ఏడాది పొడిగిస్తామని పేర్కొంది. ఈ మేరకు రాష్ట్ర జల వనరుల శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి జి.సాయిప్రసాద్కు కేంద్ర జల్ శక్తి శాఖ సీనియర్ జాయింట్ కమిషనర్ దీపక్ చంద్ర భట్ లేఖ రాశారు.అంతర్జాతీయ నిపుణుల కమిటీ నివేదికను క్షుణ్ణంగా అధ్యయనం చేశాకే కేంద్రం ఈ గడువును విధించినట్లు పోలవరం ప్రాజెక్టు అథారిటీ (పీపీఏ) అధికార వర్గాలు తెలిపాయి. ప్రాజెక్టులో అత్యంత కీలకమైన వరదను మళ్లించే స్పిల్ వే, స్పిల్ ఛానల్, ఎగువ, దిగువ కాఫర్ డ్యాంలు, ప్రధాన డ్యాం గ్యాప్–3లో కాంక్రీట్ డ్యాం, జలాశయంతో కుడి, ఎడమ కాలువలను అనుసంధానం చేసే కనెక్టివిటీస్, ఎడమ కాలువలో కీలకమైన పనులను గత వైఎస్సార్సీపీ ప్రభుత్వమే పూర్తి చేసింది.వీటి నిర్మాణం పూర్తవడంతో గతంలో వరదలకు దెబ్బతిన్న డయాఫ్రం వాల్ స్థానంలో కొత్త వాల్ను ఒకే సీజన్లో నిర్మించడానికి, ప్రధాన డ్యాం నిర్మాణాన్ని శరవేగంగా పూర్తి చేయడానికి మార్గం సుగమమైందని నీటి పారుదల రంగ నిపుణులు చెబుతున్నారు. గ్యాప్–1,2ల్లో ప్రధాన డ్యాం పనులు చేపట్టి.. 2026 మార్చికల్లా పూర్తి చేయవచ్చని తెలిపారు.41.15 మీటర్ల కాంటూర్ వరకు నీటిని నిల్వ చేసి, ఆయకట్టుకు నీరందించడానికి వీలుగా కేంద్రం ఇప్పటికే రూ.12,157.53 కోట్లు మంజూరు చేసింది. ఇప్పుడు ప్రభుత్వం చిత్తశుద్ధి, అంకిత భావంతో పనిచేస్తే రెండేళ్లలోగా ప్రాజెక్టును పూర్తి చేయవచ్చని నిపుణులు స్పష్టం చేస్తున్నారు.చంద్రబాబు తప్పులను సరిదిద్దిన జగన్కమీషన్ల కక్కుర్తితో కేంద్రమే నిర్మించాల్సిన పోలవరం ప్రాజెక్టు నిర్మాణ బాధ్యతలను 2016 సెప్టెంబర్ 7న అర్ధరాత్రి అప్పటి సీఎం చంద్రబాబు తన చేతుల్లోకి తీసుకున్నారు. 2013–14 ధరల ప్రకారం కేవలం నీటి పారుదల విభాగానికి అయ్యే వ్యయాన్ని ఇస్తే చాలని, ప్రాజెక్టును పూర్తి చేస్తామని అంగీకరించారు. ప్రొటోకాల్ ప్రకారం గోదావరి ప్రవాహాన్ని మళ్లించేలా స్పిల్ వే, స్పిల్ ఛానల్, అప్రోచ్ ఛానల్, పైలట్ ఛానల్ను పూర్తి చేయాలి. ఆ తర్వాత ఎగువ, దిగువ కాఫర్ డ్యాంలను నిర్మించి.. వాటి మధ్య డయాఫ్రం వాల్ వేసి.. దానిపై ప్రధాన డ్యాం నిర్మించాలి. కానీ.. చంద్రబాబు ప్రొటోకాల్ను తుంగలో తొక్కి కమీషన్లు అధికంగా వచ్చే పనులనే చేపట్టారు. వరద మళ్లించేలా స్పిల్ వే, స్పిల్ ఛానల్ను పూర్తి చేయకుండానే 2018కే ప్రధాన డ్యాం గ్యాప్–2లో పునాది డయాఫ్రం వాల్ నిర్మించారు. దీంతో అది 2018 వరదలకే దెబ్బతింది. ఆ తర్వాత ఎగువ, దిగువ కాఫర్ డ్యాంల పనులు చేపట్టి.. వాటిని పూర్తి చేయలేక ఇరువైపులా ఖాళీ ప్రదేశాలను వదిలేసి చేతులెత్తేశారు. తర్వాత గోదావరి వరద జలాలు ఖాళీ ప్రదేశాల గూండా అధిక ఉధృతితో ప్రవహించడంతో డయాఫ్రంవాల్, ప్రధాన డ్యాం నిర్మాణ ప్రాంతం తీవ్రంగా దెబ్బతింది. 2019 మే 30న సీఎంగా జగన్ బాధ్యతలు స్వీకరించాక.. కరోనా ప్రతికూల పరిస్థితులు, ఆర్థిక ఇబ్బందులను అధిగమిస్తూ.. ప్రాజెక్టు నిర్మాణంలో చంద్రబాబు చేసిన తప్పులను సరిదిద్దారు. స్పిల్ వే, స్పిల్ ఛానల్, ఎగువ కాఫర్ డ్యాంను పూర్తి చేసి 2021 జూన్ 11న గోదావరి ప్రవాహాన్ని మళ్లించారు. ప్రధాన డ్యాం గ్యాప్–1లో డయాఫ్రం వాల్, గ్యాప్–3లో కాంక్రీట్ డ్యాంను పూర్తి చేశారు. దెబ్బతిన్న డయాఫ్రం వాల్ భవితవ్యాన్ని తేల్చి.. తాజా ధరల మేరకు నిధులిచ్చి పోలవరాన్ని పూర్తి చేయడానికి సహకరించాలని కేంద్రాన్ని కోరుతూ వచ్చారు. వైఎస్ జగన్ వినతికి సానుకూలంగా సమ్మతించిన కేంద్రం.. తాజా ధరల మేరకు పోలవరానికి నిధులిచ్చేందుకు గత ఏడాది జూన్ 5న అంగీకరించిన విషయం తెలిసిందే. -
‘గొడుగుల పాఠశాల’ పై కలెక్టర్ సీరియస్
నెన్నెల: తరగతి గదులు కురుస్తుండటంతో విద్యార్థులు గొడుగులు పట్టుకుని పాఠాలు విన్న ఘటనపై మంచిర్యాల జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ సీరియస్ అయ్యారు. నెన్నెల మండలం కుశ్నపల్లి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలను ఆయన గురువారం సందర్శించారు. బాధ్యతారాహిత్యంగా వ్యవహరించారంటూ పాఠశాల ప్రధానోపాధ్యాయుడు ఠాకూర్ ఇందన్సింగ్ను సస్పెండ్ చేశారు. కలెక్టర్ ఆదేశాల మేరకు డీఈవో యాదయ్య ఉత్తర్వులు జారీ చేశారని ఎంఈవో మహేశ్వర్రెడ్డి పేర్కొన్నారు. మరో మూడు గదులున్నా వాటిని ఉపయోగించుకోకుండా కురుస్తున్న గదిలోనే పిల్లలను గొడుగులు పట్టుకుని కూర్చోబెట్టి ఉద్దేశపూర్వకంగా ప్రభుత్వాన్ని అప్రతిష్టపాలు చేసే ప్రయత్నం చేశారని అధికారులు పేర్కొన్నారు. ఫొటోలు, వీడియోలు తీయించి సామాజిక మాధ్యమాల్లో వైరల్ చేయడంలో హెచ్ఎం ప్రమేయం ఉందని భావించి చర్యలు తీసుకున్నారు. విచారణ పూర్తయ్యే వరకు అనుమతి లేకుండా హెడ్ క్వార్టర్స్ వదిలి వెళ్లరాదని ఆదేశించారు. ఆ గదిలో ఎందుకు కూర్చోబెట్టారు? గదులు కురుస్తున్నాయని తెలిసినా విద్యార్థులను అదే గదిలో ఎందుకు కూర్చోబెడుతున్నారని ఉపాధ్యాయులను కలెక్టర్ కుమార్ దీపక్ ప్రశ్నించారు. వర్షాలు తగ్గే వరకు విద్యార్థులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా, పొడిగా ఉన్న ఇతర గదుల్లో కూర్చోబెట్టాలని ఆదేశించారు. పాఠశాల స్థాయిలో పరిష్కారమయ్యే సమస్యను ఎందుకు పెద్దగా చేస్తున్నారని టీచర్లను మందలించారు. స్టాఫ్రూమ్, ల్యాబ్ రూమ్లతోపాటు డైనింగ్ హాల్లో విద్యార్థులను సర్దుబాటు చేయాలని ఆదేశించారు. వర్షాలు తగ్గాక మరమ్మతులు చేయించి సమస్య పరిష్కరిస్తామని చెప్పారు. అనంతరం పక్కనే ఉన్న గిరిజన ఆశ్రమ పాఠశాలను తనిఖీ చేశారు. వార్డెన్ లచ్చన్న విధుల్లో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని గ్రామస్తులు కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లడంతో ఐటీడీఏ పీఓకు చెప్పి షోకాజ్ నోటీసు ఇప్పిస్తానన్నారు. కలెక్టర్ ఆదేశాల మేరకు డీఈఓ యాదయ్య పాఠశాలకు చేరుకుని సమస్యలు తెలుసుకున్నారు. -
Lok Sabha Election 2024: పెళ్లిపత్రికలోనూ ఈవీఎంపై వ్యతిరేకత!
లాతూర్: మా పెళ్లికి విచ్చేసి భోజనతాంబూలాదులు స్వీకరించి మమ్మానందింపజేయ ప్రార్థన. ఇది చాలా పెళ్లిపత్రికల్లో కనిపించే ఒక విన్నపం. కానీ ఇక్కడ ఒక పత్రికలో విజ్ఞాపనకు బదులు ‘వ్యతిరేకత’ కనిపించింది. ‘‘ఎల్రక్టానిక్ ఓటింగ్ మెషీన్(ఈవీఎం)లను నిషేధించండి, ప్రజాస్వామ్యాన్ని కాపాడండి’’ అంటూ కొటేషన్ను పెట్టాడు ఒక పెళ్లికొడుకు. మహారాష్ట్రలోని ఛాకూర్ తహసీల్ పరిధిలోని అజన్సోందా(ఖుర్ద్) గ్రామానికి చెందిన దీపక్ కుంబ్లే పెళ్లి వచ్చే నెల ఎనిమిదో తేదీన లాతూర్ పట్టణంలో జరగనుంది. కుంబ్లే అందరికీ పంచిన తన వివాహ ఆహా్వన పత్రికలో ఇలా ఈవీఎంలపై తన అసంతృప్తి వెళ్లగక్కాడు. సాధువులు, సంఘ సంస్కర్తలు, స్వాతంత్య్ర సమరయోధుల ఫొటోలను ఆ వెడ్డింగ్ ఇని్వటేషన్ కార్డులో ప్రచురించాడు. తనకు పాఠాలు బోధించిన స్కూలు టీచర్ల ఫోటోలకు ఈ ఆహ్వానపత్రికలో స్థానం కలి్పంచాడు. ఈయన అఖిలభారత వెనకబడిన, మైనారిటీ వర్గాల ఉద్యోగుల సంఘం(బామ్సెఫ్) సభ్యుడు. ‘‘ ఈవీఎంల వ్యతిరేక ఉద్యమం సార్వత్రిక ఎన్నికలకు ముందే ఊపందుకుంది. బంధువులు, స్నేహితుల్లోనూ ఉద్యమంపై మరింత అవగాహన పెంచాలనే ఇలా ఈవీఎంల అంశాన్ని పెళ్లికార్డులో ప్రస్తావించా’ అని కుంబ్లే చెబుతున్నారు. కార్డులో కథాకమామిషు, ఫొటోలను చూసి ముక్కున వేలేసుకున్న వాళ్లూ లేకపోలేదు. కార్డు ఎలాగుంటే మనకెందుకు? పెళ్లికెళ్లి నాలుగు అక్షింతలు వేసి భోంచేసి వచ్చేద్దాం అని ఊళ్లో చాలా మంది డిసైడ్ అయ్యారట! -
నాడు మోదీకి వంట వండిన దీపక్.. ఇప్పుడేం చేస్తున్నారు?
అది 1995.. దేశంలోని హర్యానాలో చౌదరి బన్సీలాల్ ప్రభుత్వం అధికారంలో ఉంది. భారతీయ జనతా పార్టీ నరేంద్ర మోదీని హర్యానా రాష్ట్ర ఇంచార్జిగా నియమించింది. మోదీకున్న అనుభవాన్ని పరిగణనలోకి తీసుకుని, పార్టీ అతనికి హర్యానా బాధ్యతలను అప్పగించింది. నాటి రోజుల్లో పార్టీకి సొంత కార్యాలయం లేదు. పార్టీ సమావేశాలు అద్దె భవనంలో జరిగేవి.నరేంద్ర మోదీ తొలిసారిగా పార్టీ కార్యాలయానికి వచ్చినప్పుడు అతని చూపు అక్కడున్న దీపక్ అనే 12 ఏళ్ల బాలునిపై పడింది. ఆ కుర్రాడు సంఘ్ కార్యక్రమాలకు హాజరుకావడంతోపాటు, బీజేపీ కార్యాలయంలో వంటమనిషిగా కూడా పనిచేసేవాడు. మోదీ ఆ కుర్రాడి యోగక్షేమాలు తెలుసుకున్నారు. మరుసటి రోజు రోహ్తక్ లో జరిగే బీజేపీ సమావేశానికి తనతో పాటు దీపక్ను కారులో తీసుకెళ్లారు.నాటి అనుభవాల గురించి దీపక్ మీడియాతో మాట్లాడుతూ ‘నాడు రోహ్తక్ నుంచి తిరిగి వస్తుండగా కిలా రోడ్డులో కారు ఆపిన మోదీ తనకు డబ్బులు ఇచ్చి , ఒక షార్ట్, టీ షర్ట్ కొనుక్కోమని చెప్పారు. తరువాత వాటిని వేసుకుని చూపించమన్నారు. కొద్దిసేపటి తరువాత కిచిడీ ఎలా చేయాలో చూపించారు. అలాగే మిగిలిపోయిన ఆహారాన్ని ఎలా ఉపయోగించాలో కూడా నాకు నేర్పించారు.ఇక్కడికి వచ్చినప్పుడల్లా, నేను తయారుచేసిన కిచిడీని తినేవాడు. నేను అప్పటికి తొమ్మిదో తరగతి చదువుతున్నాను. చదువు మానవద్దని చెబుతూ, నా స్కూలు ఫీజు కట్టేవారు. నన్ను చదువుకోవాలని ఎప్పుడూ ప్రోత్సహించేవారు. మోదీ ఆరేళ్లపాటు హర్యానా బీజేపీకి ఇన్ఛార్జ్గా ఉన్నారు. ఆ తర్వాత గుజరాత్ ముఖ్యమంత్రి అయ్యారు.2002లో మోదీ.. దీపక్కు ఫోన్ చేశారు. అలాగే 2004, 2006లో కూడా దీపక్తో ఫోన్లో మాట్లాడారు. 2009లో మోదీ హిస్సార్లో జరగబోయే ర్యాలీకి వెళ్తుండగా హెలికాప్టర్ చెడిపోయింది. ఈ విషయం తెలుసుకున్న దీపక్.. మోదీని కలుసుకున్నారు. 2014, 2019 లోక్సభ ఎన్నికల్లో కూడా ప్రధాని మోదీ.. దీపక్ను వేదికపైకి పిలిచి ప్రశంసించారు.తాజాగా ప్రధాని నరేంద్ర మోదీపై డాక్యుమెంటరీని రూపొందిస్తున్న పీఎంవో కార్యాలయ బృందం దీపక్ను ఇంటర్వ్యూ చేసింది. దీపక్ ఆచార్య నేపాల్కు చెందిన వ్యక్తి. ప్రస్తుతం ఆయన హర్యానా బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో కో-ఇన్చార్జిగా పనిచేస్తున్నారు. -
తొలి రౌండ్లోనే దీపక్ పరాజయం
పారిస్ ఒలింపిక్స్ వరల్డ్ బాక్సింగ్ క్వాలిఫయింగ్ టోర్నీలో తొలి రోజు బరిలోకి దిగిన ఇద్దరు భారత బాక్సర్లకు నిరాశే ఎదురైంది. ఆదివారం ఇటలీలో జరిగిన పురుషుల 51 కేజీల విభాగంలో దీపక్... +92 కేజీల విభాగంలో నరేందర్ తొలి రౌండ్లోనే నిష్క్రమించారు. నిజాత్ హుసెనోవ్ (అజర్బైజాన్)తో జరిగిన బౌట్లో దీపక్ 2–3తో... టియాఫాక్ (జర్మనీ)తో జరిగిన బౌట్లో నరేందర్ 0–5తో ఓడిపోయారు. హరియాణాకు చెందిన దీపక్ గత ఏడాది ప్రపంచ చాంపియన్íÙప్లో కాంస్య పతకం సాధించాడు. -
వధూవరులకు సీఎం జగన్ ఆశీస్సులు
సాక్షి, అమరావతి/కంకిపాడు: మాజీ మంత్రి, గుడివాడ ఎమ్మెల్యే కొడాలి శ్రీ వెంకటేశ్వరరావు(నాని) మేనకోడలు వివాహ వేడుకలో సీఎం వైఎస్ జగన్ పాల్గొన్నారు. కోనేరు లీలాప్రసాద్, రాజ్యలక్ష్మి విజయ చాముండేశ్వరిదేవి కుమార్తె డాక్టర్ స్నేహ, డాక్టర్ అనురాగ్ దీపక్ల వివాహం గురువారం కృష్ణా జిల్లా కంకిపాడులోని అయాన్ కన్వెన్షన్ సెంటర్లో జరిగింది. ఈ వేడుకకు హాజరైన సీఎం వైఎస్ జగన్ నూతన వధూవరులకు ఆశీస్సులు అందించారు. ఈ వేడుకలో మంత్రి జోగి రమేశ్, కలెక్టర్ పి.రాజాబాబు, ఎస్పీ జాషువా, ఎమ్మెల్యేలు కొలుసు పార్థసారథి, కైలే అనిల్కుమార్, దూలం నాగేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. -
Fact Check: ఈనాడు ఆరోపణలు అవాస్తవం
సాక్షి, అమరావతి: డాక్టర్ వైఎస్సార్ ఆరోగ్యశ్రీ పథకం కింద ఆస్పత్రుల ఎంపానల్మెంట్ ప్రక్రియను ఆన్లైన్లో పూర్తి పాదర్శకంగా నిర్వహిస్తున్నట్టు వైఎస్సార్ ఆరోగ్యశ్రీ హెల్త్కేర్ ట్రస్ట్ ముఖ్య కార్యనిర్వహణాధికారి (సీఈవో) దీపక్ సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు. ‘ముడుపులు అందితేనే ఆస్పత్రులకు ఆరోగ్యశ్రీ అంటూ ఈనాడులో సోమవారం ప్రచురించిన కథనంలో చేసిన ఆరోపణలు అవాస్తవమని పేర్కొన్నారు. ఎంపానల్మెంట్ అవడానికి నిర్దేశించిన సదుపాయాలున్న ఆస్పత్రులు ఆరోగ్యశ్రీ పోర్టల్ అందుబాటులో ఉండే ఆన్లైన్ అప్లికేషన్ ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చని తెలిపారు. ఆ దరఖాస్తుల్ని నిర్ణీత సమయపాలనతో పరిశీలిస్తున్నట్లు తెలిపారు. ఎంపానల్మెంట్ ప్రక్రియలో మాన్యువల్ ప్రమేయం ఏమీ ఉండదని పేర్కొన్నారు. ఏవైనా లోపాలుంటే ఆ వివరణలతో ఆన్లైన్లోనే ఆస్పత్రులకు నోటీసులు వెళతాయని తెలిపారు. ఇక రోగులకు వైద్యసేవల కోసం ముందస్తు అనుమతులు (ప్రీ ఆథరైజేషన్), క్లెయిమ్లు ఆన్లైన్లో వివిధ స్థాయిల్లో స్పెషలిస్ట్ డాక్టర్ల ద్వారా పరిశీలిస్తున్నట్లు తెలిపారు. ఆరోగ్యశ్రీకి సంబంధించి ఆస్పత్రులను, వైద్యసేవలకు సంబంధించి ప్రజలను ఎవరైనా లంచాలు డిమాండ్ చేస్తే నేరుగా 104 (ఆరోగ్యశ్రీ ఫిర్యాదుల నంబరు), 14400 (అవినీతి నిరోధక విభాగం) నంబర్లకు ఫోన్చేసి ఫిర్యాదు చేయవచ్చని వివరించారు. ఆస్పత్రుల సమస్యల పరిష్కారం కోసం ఫిర్యాదుల పరిష్కార సెల్ ఏర్పాటు చేసినట్లు తెలిపారు. ఆస్పత్రుల యాజమాన్యాలు సమస్యలను cgro@aarogyasri.ap.gov.in కు మెయిల్ చేయవచ్చని ఆయన పేర్కొన్నారు. -
ఆటతో...
చైతన్య పసుపులేటి, హీనా రాయ్ జంటగా నటించిన చిత్రం ‘జీటీఏ’. దీపక్ సిద్ధాంత్ దర్శకత్వంలో డా. సుశీల నిర్మించిన ఈ చిత్రం అక్టోబర్ 6న విడుదల కానుంది. ఈ చిత్రం విడుదల తేదీ పోస్టర్ను రచయిత–దర్శకుడు కృష్ణ చైతన్య రిలీజ్ చేసి, మాట్లాడుతూ– ‘‘కొత్త కాన్సెప్ట్తో రాబోతున్న ఈ సినిమా హిట్ అవ్వాలి’’ అన్నారు. ‘‘క్రైమ్ యాక్షన్ డ్రామాగా జీటీఏ అనే ఆట ఆధారంగా ఈ చిత్రకథ సాగుతుంది’’ అన్నారు దీపక్ సిద్ధాంత్. ఈ చిత్రానికి సంగీతం: మార్క్ కె. రాబిన్, కామెరా: కేవీ ప్రసాద్. -
అజ్ఞాతం వీడండి
సాక్షి, హైదరాబాద్: మావోయిస్టు రాష్ట్ర కమిటీ సభ్యులు, తెలంగాణకు చెందిన అగ్రనేతలు, కేడర్ అజ్ఞాతం వీడి పోలీసులకు లొంగిపోవాలని డీజీపీ అంజనీకుమార్ విజ్ఞప్తి చేశారు. మావోయిస్టులు అజ్ఞాతం వీడి రాష్ట్రాభివృద్ధిలో భాగస్వాములు కావాలన్నారు. మావోయిస్టు కేంద్ర కమిటీ సభ్యుడు సంజోయ్ దీపక్రావును శుక్రవారం ఉదయం కూకట్పల్లిలోని మలేషియన్ టౌన్షిప్లో అరెస్టు చేసినట్టు డీజీపీ తెలిపారు. నాలుగు రోజుల క్రితం హైదరాబాద్కు వచ్చిన దీపక్రావు ఛత్తీస్గఢ్లోని మాడ్ ప్రాంతంలో ఓ మావోయిస్టు సమావేశానికి హాజరుకావాల్సి ఉందని, ఆయన కదలికలపై ఎస్ఐబీ (స్పెషల్ ఇంటెలిజెన్స్ బ్యూరో)కు అందిన విశ్వసనీయ సమాచారం మేరకు సైబరాబాద్ పోలీసులు అరెస్టు చేశారన్నారు. ఒక రివాల్వర్, ఆరు లైవ్రౌండ్లు(బుల్లెట్లు), రూ.47,250 నగదు స్వాధీనం చేసుకున్నట్టు తెలిపారు. మలేషియన్ టౌన్షిప్లో ఉండే మహేంద్రటెక్ యూనివర్సిటీ ప్రొఫెసర్ రంజిత్శంకరన్, మాదాపూర్కు చెందిన ఓ సినీ దర్శకుడు బి.అజిత్కుమార్లు దీపక్రావుకు ఆశ్రయం ఇచ్చినట్టు గుర్తించామన్నారు. శుక్రవారం డీజీపీ కార్యాలయంలో మీడియాతో మాట్లాడారు. కొన్నేళ్లుగా తెలంగాణ నుంచి మావోయిస్టుల రిక్రూట్మెంట్ పూర్తిగా శూన్యమని, సంజోయ్ దీపక్రావు అరెస్టుతో ఆ పార్టీకి ఎదురుదెబ్బ తగిలినట్టయ్యిందన్నారు. దీపక్రావు మావోయిస్టు అగ్రనేతలు గణపతి, బస్వరాజ్, కోసాలతో నేరుగా సంబంధాలున్నట్టు తెలిపారు. నాలుగు రాష్ట్రాల పోలీసులకు మోస్ట్ వాంటెడ్ సంజోయ్ దీపక్రావు ప్రస్తుతం కేంద్ర కమిటీతోపాటు సౌత్ రీజియన్ బ్యూరో ఇన్చార్జ్గా, వెస్ట్రన్ ఘాట్ స్పెషల్ జోన్ కమిటీ కార్యదర్శిగా ఉన్న ఆయన మహారాష్ట్ర, కేరళ, కర్ణాటక, తమిళనాడు రాష్ట్రాల పోలీసులతోపాటు జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్ఐఏ)కు మోస్ట్వాంటెడ్గా ఉన్నారు. దీపక్రావుపై మహారాష్ట్ర ప్రభుత్వం రూ.25 లక్షల రివార్డు ప్రకటించింది. మహారాష్ట్రలోని థానే జిల్లా అంబర్నాథ్ ఈస్ట్ పోలీస్స్టేషన్ పరిధిలోని శివగంధనగర్కు చెందిన సంజయ్ దీపక్రావు జమ్మూకశ్మీర్లో 1984లో బీటెక్ పూర్తి చేశారు. 1999లో సీపీఐఎంఎల్ రవూఫ్ గ్రూఫ్లో తొలుత చేరారు. నక్సల్బరీ గ్రూప్నకు మహారాష్ట్ర ఇన్చార్జ్గా పనిచేశారు. 2000లో ఓసారి అరెస్టు, తర్వాత విడుదలై మళ్లీ అజ్ఞాతంలోకి వెళ్లారు. 2002లో అనంతపురం జిల్లా రాయదుర్గం ప్రాంతంలో మావోయిస్టు కార్యకలాపాల వ్యాప్తికి కీలకంగా పనిచేశారు. 2014లో నక్సల్బరీ, సీపీఐ మావోయిస్టులో విలీనం కావడంలో కీలక పాత్ర పోషించారు. నవంబర్ 2021లో పశ్చిమ కనుమల ప్రత్యేక జోనల్ కమిటీ కార్యదర్శి బీజీ కృష్ణమూర్తి అరెస్టు తర్వాత, ఆ జోనల్కు ప్రత్యేక జోనల్ కమిటీకి కార్యదర్శిగా నియామకం కాగా, అప్పటి నుంచి అక్కడే పనిచేస్తున్నారు. -
ఫైనల్లో బెర్త్ కోసం బరిలో భారత బాక్సర్లు
World Boxing Championships 2023: ప్రపంచ పురుషుల బాక్సింగ్ చాంపియన్షిప్లో నేడు ముగ్గురు భారత బాక్సర్లు కీలకపోరుకు సిద్ధమయ్యారు. తెలంగాణకు చెందిన హుసాముద్దీన్ (57 కేజీలు), హరియాణాకు చెందిన దీపక్ భోరియా (51 కేజీలు), నిశాంత్ దేవ్ (71 కేజీలు) సెమీఫైనల్ బౌట్లలో పోటీపడనున్నారు. 2022 యూరోపియన్ చాంపియన్ బిలాలా బెనామా (ఫ్రాన్స్)తో దీపక్; సైడెల్ హోర్టా (క్యూబా)తో హుసాముద్దీన్; 2022 ఆసియా చాంపియన్ అస్లాన్బెక్ షింబెర్జనోవ్ (కజకిస్తాన్)తో నిశాంత్ దేవ్ తలపడతారు. సెమీఫైనల్లో గెలిస్తే ఫైనల్ చేరి స్వర్ణ–రజత పతకాల బరిలో ఉంటారు. ఓడితే కాంస్య పతకాన్ని గెల్చుకుంటారు. భారత కాలమానం ప్రకారం శుక్రవారం సాయంత్రం గం. 5:30కు దీపక్ బౌట్ ఉంది. ఆ తర్వాత హుసాముద్దీన్, నిశాంత్ దేవ్ బౌట్లు జరుగుతాయి. ఫ్యాన్కోడ్ యాప్లో ఈ బౌట్లను ప్రత్యక్షంగా తిలకించవచ్చు. ప్రపంచ చాంపియన్షిప్ చరిత్రలో ఇప్పటి వరకు భారత్ నుంచి ఒక్కరే ఫైనల్కు అర్హత సాధించారు. 2019లో అమిత్ పంఘాల్ (52 కేజీలు) ఫైనల్లో ఓడిపోయి రజత పతకం గెల్చుకున్నాడు. -
పోలీసుల ముందే ఫైటింగ్..!
-
సైన్యాధికారిణిగా గల్వాన్ అమరుని అర్ధాంగి
న్యూఢిల్లీ: గల్వాన్ లోయలో చైనా సైన్యంతో ఘర్షణల్లో అమరుడైన భారత సైనికుడు నాయక్ దీపక్ సింగ్ అడుగుజాడల్లో నడుస్తూ ఆయన సతీమణి సైతం కదనరంగంలోకి దూకారు. చెన్నై కేంద్రంగా పనిచేసే ఆఫీసర్స్ ట్రైనింగ్ అకాడమీ(ఓటీఏ)లో విజయవంతంగా ఆర్మీ శిక్షణ పూర్తిచేసుకున్నాక 29 ఏళ్ల లెఫ్టినెంట్ రేఖా సింగ్.. ఆర్మీ ఆర్డ్నన్స్ కోర్ విభాగంలో శనివారం విధుల్లో చేరారు. తూర్పు లద్దాఖ్లో ఫ్రంట్లైన్ యూనిట్లో ఆమె కర్తవ్య దీక్షను మొదలుపెట్టారని ఆర్మీ ఉన్నతాధికారులు చెప్పారు. ఆర్మీ మెడికల్ కోర్లో సభ్యుడైన నాయక్ దీపక్ సింగ్ ఆ తర్వాతికాలంలో బిహార్ రెజిమెంట్ 16వ బెటాలియన్లో నర్సింగ్ అసిస్టెంట్గా చేరారు. 2020 జూన్లో గల్వాన్లోయలో చైనా సైనికులతో పోరాడింది ఈ బెటాలియన్ బృందమే. ఘర్షణల్లో గాయపడినా కూడా నాయక్ తోటి 30 మంది క్షతగాత్రులైన సైనికులకు అత్యవసర వైద్యసాయం చేసి అద్భుత ధైర్యసాహసాలు ప్రదర్శించారని నాడు కేంద్రం శ్లాఘించింది. -
పీఎఫ్ఆర్డీఏ చైర్మన్గా దీపక్ మొహంతీ
న్యూఢిల్లీ: పెన్షన్ ఫండ్ రెగ్యులేటరీ అండ్ డెవలప్మెంట్ అథారిటీ (పీఎఫ్ఆర్డీఏ) చైర్మన్గా దీపక్ మొహంతీను ప్రభుత్వం నియమించింది. జనవరిలో పదవీకాలం ముగిసిన సుప్రతిమ్ బంద్యోపాధ్యాయ స్థానంలో ఆయన నియామకం జరిగింది. ప్రస్తుతం పీఎఫ్ఆర్డీఏ సభ్యునిగా ఆయన పనిచేస్తున్నారు. మొహంతీ ఆగస్టు 2020లో మూడేళ్ల కాలానికి లేదా 62 ఏళ్ల వయస్సు వచ్చే వరకు పీఎఫ్ఆర్డీఏ మెంబర్గా (ఎకనామిక్) గతంలో నియమితులయ్యారు. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్గా పనిచేసిన అపార అనుభవం కూడా ఆయనకు ఉంది. తాజా నియామకానికి సంబంధించి వెలువడిన ప్రభుత్వ నోటిఫికేషన్ ప్రకారం, ఇళ్లు, కారు సౌకర్యం లేకుండా మొహంతీ నెలకు రూ.4.50 లక్షల కన్సాలిడేటెడ్ వేతనం పొందుతారు. పదవి బాధ్యతలు స్వీకరించిన తేదీ నుంచి 65 ఏళ్లు వచ్చే వరకు లేదా తదుపరి ఉత్తర్వులు వెలువడే వరకు ఈ బాధ్యతల్లో ఆయన పనిచేస్తారు. మెంబర్గా...మమతా శంకర్ మొహంతీ తాజా నియామకం నేపథ్యంలో ఆయన స్థానంలో పీఎఫ్ఆర్డీఏ మెంబర్గా (ఎకనామిక్) మమతా శంకర్ నియమితులయ్యారు. ఇండియన్ ఎకనమిక్ సర్వీస్ (1993)లో ఉన్న ఆమె ప్రస్తుతం ఆహార, ప్రజా పంపిణీ వ్యవహారాల శాఖలో సీనియర్ ఎకనమిక్ అడ్వైజర్గా పనిచేస్తున్నారు. మూడేళ్ల కాలానికి లేదా 62 ఏళ్ల వయస్సు వచ్చే వరకు లేదా తదుపరి ఉత్తర్వులు వచ్చే వరకు (ఏది ముందుగా అయితే) ఆమె ఈ బాధ్యతల్లో కొనసాగుతారని ప్రత్యేక నోటిఫికేషన్ పేర్కొంది. పెన్షన్ నిధులు ఇలా... నేషనల్ పెన్షన్ సిస్టమ్ (ఎన్పీఎస్) అలాగే అటల్ పెన్షన్ యోజన కింద నిర్వహణలో ఉన్న మొత్తం ఆస్తుల (ఏయూఎం) విలువ 2023 మార్చి 4వ తేదీ నాటికి రూ. 8.81 లక్షల కోట్లు. దేశంలోని పెన్షన్ పరిశ్రమను ప్రోత్సహించడం, నియంత్రించడం, అభివృద్ధి చేయడం లక్ష్యంగా 2003లో పీఎఫ్ఆర్డీఏ ఏర్పాటయ్యింది. దీనిని మొదట్లో ప్రభుత్వ ఉద్యోగుల కోసం ప్రత్యేకంగా నిర్దేశించడం జరిగింది. అయితే తదుపరి స్వయం ఉపాధి పొందుతున్న వ్యక్తులు, ఎన్ఆర్ఐలుసహా అన్ని భారత పౌరులు అందరికీ అథారిటీ సేవలను విస్తరించడం జరిగింది. వ్యవస్థీకృతంగా పెన్షన్ నిధుల ప్రోత్సాహం, అభివృద్ధి, నియంత్రణ వంటి కీలక కార్యకలపాలాను అథారిటీ నిర్వహిస్తుంది. ప్రజల వృద్ధాప్య ఆదాయ అవసరాలను, వనరులను స్థిర ప్రాతిపదికన అందించడంలో ఎన్పీఎస్ కీలక పాత్ర పోషిస్తోంది. -
Kurnool: ట్రిపుల్ ఐటీ విద్యార్థికి రూ.1.3 కోట్ల వేతనం
కర్నూలు సిటీ: కర్నూలు నగర శివారులోని ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, డిజైన్ అండ్ మ్యానుఫాక్చరింగ్ (ట్రిపుల్ ఐటీ)కి చెందిన విద్యార్థి ఏడాదికి రూ.1.30 కోట్ల వార్షిక వేతనంతో ఉద్యోగానికి ఎంపికయ్యాడు. ఇటీవల ట్రిపుల్ ఐటీలో అమెజాన్ సంస్థ నిర్వహించిన క్యాంపస్ సెలక్షన్లలో పాల్గొన్న విద్యార్థుల్లో ఉత్తరప్రదేశ్కు చెందిన దీపక్ రాథోడ్ (బీటెక్, సీఎస్ఈ) అత్యధిక వార్షిక వేతనానికి ఎంపికయ్యాడని ట్రిపుల్ ఐటీ ప్లేస్మెంట్ సెల్ బుధవారం ఓ ప్రకటనలో తెలిపింది. ఈ సందర్భంగా విద్యార్థి దీపక్ రాథోడ్ను ట్రిపుల్ ఐటీ డైరెక్టర్ డీవీఎల్ఎన్ సోమయాజులు అభినందించారు. చదవండి: (Varadapuram Suri: అక్రమాల ‘వరద’పై ఎందుకింత ప్రేమ!) -
Deepak Chauhan: నవ్విస్తే ఏమొస్తుంది.. బోలెడు డబ్బులు వస్తాయి గురూ.. నమ్మరా!
Youtuber Laughing King Deepak Chauhan Successful Journey In Telugu: కాస్త సరదాగా మొదలెడదాం... నవ్వితే ఏమొస్తుంది? నవ్వే వస్తుంది. నవ్విస్తే ఏమొస్తుంది? బోలెడు లైక్లు వస్తాయి. సొంతకాళ్ల మీద నిలబడేంత డబ్బులు వస్తాయి! యూట్యూబ్ చానల్ ‘స్టార్’ చేయడం చాలా వీజి. దాన్ని ‘స్టార్’ చేయడం వెరీ కష్టమ్ అంటారు యూట్యూబ్ తత్వవేత్తలు. దీపక్ చౌహాన్ చానల్ మొదలుపెడితే ‘స్టార్’ కావడం తప్ప స్టార్టింగ్ ట్రబుల్స్,ఆ తరువాత ట్రుబుల్స్ అంటూ ఏమీ ఉండవు. దీపక్ విజయమంత్రం... హాస్యం! నోయిడా (ఉత్తర్ప్రదేశ్)కు చెందిన దీపక్ బీటెక్ కంప్యూటర్ సైన్స్ చదువుకునే రోజుల్లో నటనపై మనసు మళ్లింది. కాలేజీలో జరిగే సాంస్కృతిక కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొనేవాడు. అందరిలాగే తనను యూట్యూబ్ ఆకర్షించింది. దీపక్కు వ్గోగ్స్(వీడియో బ్లాగింగ్) అంటే ఇష్టం. ఇద్దరు ఫ్రెండ్స్(శుభమ్గాంధీ, పియూష్ గుర్జర్)తో కలిసి ‘దీపక్ శుభమ్ పియూష్ వ్లోగ్స్’ వ్గోగ్ మొదలుపెట్టాడు. 3.5 లక్షల సబ్స్క్రైబర్స్తో అది దూసుకెళ్లింది. ఆ తరువాత సొంతంగా ‘దీపక్ చౌహాన్’ యూట్యూబ్ చానల్ మొదలు పెట్టాడు. 60కె సబ్స్రైబర్స్తో శబ్భాష్ అనిపించుకుంది. తన ఫ్రెండ్స్ శుభమ్ గాంధీ, పియూష్లతో కలిసి మొదలు పెట్టిన ‘రియల్హిట్’ 3.25 మిలియన్ సబ్స్క్రైబర్స్తో మోస్ట్ పాప్లర్ అండ్ ట్రెండింగ్ యూట్యూబ్ చానల్లలో ఒకటిగా నిలిచింది. దీపక్ కుటుంబంలో అందరూ ఉన్నత విద్యావంతులే. పెద్ద ఉద్యోగాలు చేస్తున్నవారే. తాను మాత్రం ఈ ఫీల్డ్ ఎంచుకున్నాడు. ప్రస్తుతం తన చానల్లో వెబ్సిరీస్ మొదలుపెట్టడానికి సన్నాహాలు చేసుకుంటున్నాడు దీపక్. చానల్ సక్సెస్ కాగానే ‘ఇక వెనక్కి తిరిగిచూసుకోవాల్సిన అవసరం లేదు’ అనే ఆత్మవిశ్వాసంతో ఉండేవాళ్లు అక్కడే ఉండిపోతారు. కానీ దీపక్కు మాత్రం ఏ రోజుకు ఆరోజు కొత్త. ప్రతిరోజూ ఒక పరీక్ష. సృజనాత్మక శక్తులు మనలో బలపడాలంటే ఏసీ రూమ్లో కూర్చుంటే సరిపోదు. నిరంతరం ప్రజాసమూహాల మధ్య ఉండాలనే ఎరుక దీపక్కు ఉంది. అందుకే పెళ్లి ఫంక్షన్ల నుంచి పుట్టిన రోజు ఫంక్షన్ల వరకు తప్పకుండా హాజరవుతాడు. అక్కడికి వచ్చిన వారి హావభావాలు, హాస్యచెణుకులు, కొత్త పదాలు...అన్ని సీరియస్గా గమనిస్తాడు. ఇక్కడి నుంచే తనకు అవసరమైన ముడిసరుకు దొరుకుతుంది. వాటికి తన కల్పన జోడించి షార్ప్గా ‘షార్ట్స్’ తయారుచేసి వదులుతాడు. ఒకరోజు ఒక పెళ్లి ఫంక్షన్కు వెళ్లాడు దీపక్. ఒక పెద్దావిడ తనను వెదుక్కుంటూ వచ్చింది. ‘మా ఆయనను పూర్తిగా మార్చేశావయ్యా’ అంది చాలా గంభీరంగా. ‘నేను మార్చడమేమిటి!’ అనుకున్నాడు దీపక్. ఆమె ఇలా చెప్పింది... ‘మా ఆయన నవ్వడం పెళ్లయిన కొత్తలో చూశాను. ఇక అంతే...ఎప్పుడూ సీరియస్గా ఉండేవాడు. అందరిలా నవ్వితే తన పెద్దరికం ఎక్కడ పలచబారుతుందో అన్నట్లుగా ఉండేవాడు. అలాంటి మా ఆయన నీ వీడియోలు చూసి చిన్నపిల్లాడిలా నవ్వుతూనే ఉన్నాడు....’ చెప్పుకుంటూపోతూనే ఉంది ఆమె. ఇంతకీ దీపక్ ఎక్కడ? క్లౌడ్9పై అని వేరే చెప్పాలా! చదవండి: -
‘హెచ్సీఏపై సీబీఐ అవసరం’
సాక్షి, న్యూఢిల్లీ : హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ (హెచ్సీఏ)పై సీబీఐ దర్యాప్తు అవసరమని సుప్రీంకోర్టు అభిప్రాయ పడింది. క్రికెట్లో రాజకీయ ప్రాధాన్యం సంతరించుకుంటోందని వ్యాఖ్యానించింది. హెచ్సీఏ అంబుడ్స్మెన్, ఎథిక్స్ అధికారిగా జస్టిస్ దీపక్ వర్మను నియమించాలని అపెక్స్ కౌన్సిల్ తీసుకున్న నిర్ణయాన్ని సస్పెండ్ చేస్తూ సిటీ సివిల్ కోర్టు ఇచ్చిన తీర్పును హైకోర్టు పక్కన పెట్టడంతో హెచ్సీఏ, బడ్డింగ్స్టార్ క్రికెట్ క్లబ్ సుప్రీంకోర్టును ఆశ్రయించాయి. ఈ పిటిషన్పై గురువారం జస్టిస్ ఎన్వీ రమణ, జస్టిస్ సూర్యకాంత్, జస్టిస్ హిమ కోహ్లిలతో కూడిన ధర్మాసనం విచారించింది. విచారణ సందర్భంగా హెచ్సీఏ వ్యవహారాలపై ధర్మాసనం అసంతృప్తి వ్యక్తం చేసింది. ‘‘ కొంత మంది మంచి వ్యక్తుల్ని నియమిస్తాం. విచారణకు సుప్రీంకోర్టు లేదా హైకోర్టు విశ్రాంత న్యాయమూర్తులను నియమిస్తాం. హెచ్సీఏలోని రెండు గ్రూపులు మేనేజ్మెంట్ నుంచి బయటకు వెళ్లాల్సి ఉంటుంది. సీబీఐ దర్యాప్తు అవసరం. న్యాయవ్యవస్థను కూడా లాగాలని వారు చూస్తున్నారు’’ అని ధర్మాసనం వ్యాఖ్యానించింది. ‘‘జస్టిస్ వర్మను ఎలాంటి ఆర్డర్ ఇవ్వొద్దని తెలపండి. ఆయన పదవీ కాలం త్వరలోనే ముగియనుంది. బుధవారానికి విచారణ వాయిదా వేస్తాం. ఈ లోగా విచారణ నిమిత్తం కొందరు విశ్రాంత న్యాయమూర్తుల పేర్లు పరిశీలిస్తాం’’ అని ధర్మాసనం పేర్కొంది. తదుపరి విచారణ ఈ నెల 27కు వాయిదా వేసింది. -
మిశ్రమ సూచిక పద్ధతిలో ముడిబియ్యం పరీక్ష
సాక్షి, హైదరాబాద్: కస్టంమిల్డ్ రైస్(సీఎంఆర్) సేకరణలో కొత్త విధానాన్ని కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిందని భారత ఆహార సంస్థ(ఎఫ్సీఐ) రాష్ట్ర జనరల్ మేనేజర్ దీపక్ శర్మ తెలిపారు. సెంట్రల్ పూల్ సీఎంఆర్లో పాత బియ్యం ఆమోదించేందుకు ముందుగా మిశ్రమ సూచిక పద్ధతిలో తనిఖీ చేయనున్నట్లు చెప్పారు. కేంద్రప్రభుత్వం ఈ కొత్త ప్రామాణిక ఆపరేటింగ్ విధానాన్ని ప్రవేశపెట్టిందని దీని ప్రకారం సెంట్రల్ పూల్ కింద సీఎంఆర్ సేకరణ కోసం మిల్డ్ ముడి బియ్యాన్ని క్షుణ్ణంగా తనిఖీ చేస్తామన్నారు. ఆకుపచ్చ/అవకాడో ఆకుపచ్చలో ఉన్న నమూనాలను మాత్రమే ఆమోదిస్తామని, పసుపు/పసుపు నారింజ/నారింజ తదితర రంగులో ఉన్న నిల్వలను తిరస్కరిస్తామని తెలిపారు. వాటాదారులకు ఈ పద్ధతి గురించి అవగాహన కల్పిస్తామని, తెలంగాణ ప్రభుత్వం భారత ఆహార సంస్థ కొనుగోలు కేంద్రాల్లో రైస్ మిల్లర్లతో ఈ విధానంపై అవగాహన ప్రదర్శనలు ఏర్పాటు చేస్తున్నట్లు వివరించారు. -
వాహనాల డిమాండ్ పెరిగింది, ఆటో మొబైల్ రంగం పుంజుకుంది
న్యూఢిల్లీ: దేశీయ ఆటో పరిశ్రమ భవిష్యత్తు ఆశాజనకంగా మారింది. ముడి సరుకుల ధరల పెరుగుదల, లాజిసిక్ట్ సవాళ్ల నేపథ్యంలోను దేశీయ ఆటో పరిశ్రమ క్రమంగా కోలుకుంటుందని ఆటోమోటివ్ కాంపోనెంట్ మాన్యుఫాక్చరర్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా (ఏసీఎంఏ) తెలిపింది. ఆర్ధిక వ్యవస్థ క్రమంగా సాధారణ స్థితికి చేరుకోవటం, వాహనాల డిమాండ్ పెరగడంతో ఈ ఆర్ధిక సంవత్సరంలో పరిశ్రమ పనితీరు ఆశాజనకంగా ఉంటుందని అంచనా వేసింది. కోవిడ్ థర్డ్ వేవ్పై ఆధారపడి పరిశ్రమ పనితీరు ఆధారపడి ఉంటుందని తెలిపింది. గత ఫైనాన్షియల్ ఇయర్లో పరిశ్రమ టర్నోవర్లో 3 శాతం క్షీణతతో రూ.3.40 లక్షల కోట్లకు చేరిందని ఏసీఎంఏ ప్రెసిడెంట్ దీపక్ జైన్ తెలిపారు. సెమీకండక్టర్ల లభ్యత, ముడిసరుకుల ధరల వృద్ధి, లాజిస్టిక్స్ ఇబ్బందులు, కంటైనర్ల అధిక ధరలు వంటివి పరిశ్రమ రికవరీకి అడ్డంకులుగా మారాయని చెప్పారు. వివిధ సవాళ్ల కారణంగా నిలిచిపోయిన పెట్టుబడులు పరిశ్రమ వృద్ధితో ఇన్వెస్ట్ చేయడానికి సిద్ధమవుతున్నాయని పేర్కొన్నారు. ఆటో పరిశ్రమ బిలియన్ డాలర్ల పెట్టుబడి అవకాశాలను కోల్పోయిందని.. ఇది ఇండస్ట్రీ వృద్ధిని చూసినప్పుడు 2018–19లో మొత్తం క్యాపెక్స్గా ఉండేదని ఆయన తెలిపారు. పరిశ్రమ వ్యయాల తగ్గింపు, స్థానికీకరణ చర్యలపై దృష్టిపెడుతుందని చెప్పారు. ప్రస్తుతం ఆటోమోటివ్ పరిశ్రమలో 60–70 శాతం సామర్థ్య వినియోగం ఉన్పప్పటికీ ఉద్యోగుల పరిస్థితి స్థిరంగా ఉందన్నారు. తక్కువ దిగుమతి సుంకాలు కోరుకుతున్న టెస్లా.. స్థానిక తయారీపై దృష్టి సారిస్తే ఏసీఎంఏ మద్దతు ఇస్తుందని చెప్పారు. హర్యానాలో స్థానికులకు 75 శాతం ఉద్యోగ రిజర్వేషన్లు ఉండటంతో పరిశ్రమపై ప్రభావం చూపించిందని.. ఇలాంటి నిర్ణయాలు పోటీతత్వాన్ని తగ్గిస్తుందని ఆయన అభిప్రాయపడ్డారు. -
బ్యాంకులకు రూ200 కోట్లు టోకరా వేసిన నిండుతుండి అరెస్ట్
-
ఫన్నీ వీడియో: పాపం హరితేజ భర్త.. చివరకు ఇలా అయ్యాడేంటి?
ప్రముఖ నటి, యాంకర్ హరితేజ ఇటీవల పండంటి ఆడ బిడ్డకు జన్మనిచ్చిన సంగతి తెలిసిందే. ఇటీవల తమ చిన్నారి ఫోటోని సోషల్ మీడియా ద్వారా అభిమానులతో పంచుకుంటూ.. కూతురికి భూమి దీపక్రావు అని నామకరణం చేసినట్లు వెల్లడించింది. అయితే పాప పూర్తి ఫోటోని మాత్రం ఇంతవరకు రివీల్ చేయలేదు హరితేజ. కానీ అప్పుడప్పుడు కూతురిని తన భర్త దీపక్రావు ఆడిస్తున్న కొన్ని వీడియోలను సోషల్ మీడియా ద్వారా అభిమానులతో పంచుకుంటుంది. రీసెంట్గా హరితేజ షేర్ చేసిన ఒక వీడియో నెటిజన్లను బాగా ఆకట్టుకుంటుంది. అందులో దీపక్ రావు కూతురిని చేతుల్లో ఎత్తుకొని ఆడిస్తూ ఉంటాడు. ఇలా రోజూ ఆడించడం అలవాటుపడిన దీపక్ రావు.. ఒకసారి చేతుల్లో కూతురు లేకున్నా.. అదేపనిగా చేతులు ఊపుతుంటాడు. ఈ ఫన్నీ వీడియోని హరితేజ తన ఇన్స్ట్రాగ్రామ్లో షేర్ చేస్తూ.. ‘ఫాదర్ ఆన్ డ్యూటీ’అని హాష్ట్యాగ్ ఇచ్చింది. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో తెగవైరల్ అవుతోంది. ‘క్యూటెస్ట్ డాడీ’అంటూ నెటిజన్లు కామెంట్ పెడుతున్నారు. -
బాలుకు ఏదైతే అవసరమో.. అదంతా చేశాం
వైద్యం చేసేటప్పుడు డాక్టర్లు భావోద్వేగాలకు దూరంగా ఉండటానికి ప్రయత్నిస్తారు. కాని ఎస్.పి.బాలు వంటి నిత్య జీవన గాయకుడితో అలా దూరంగా ఉండటం సాధ్యం కాదు. అటువంటి గాయకుడిని పోగొట్టుకునే సందర్భానికి సాక్షిగా మారడం సామాన్యమైన గుర్తు కాదు. బాలు వైద్యం తీసుకున్న చెన్నై ఎం.జి.ఎం హాస్పిటల్లో ఆయనకు వైద్యం చేసిన లేప్రోస్కోపిక్–బేరియాట్రిక్ సర్జన్ డాక్టర్ దీపక్ సుబ్రమణియన్ తాజాగా ఇచ్చిన ఒక ఇంటర్వ్యూలో ఆ రోజులను మరువలేక పోతున్నానన్నారు. ఆయన పంచుకున్న విషయాలు... ‘‘శశికుమార్ అని నా ఫ్రెండ్ క్లినిక్ ఉంది. ఒకరోజు అర్జంటుగా రమ్మని తను ఫోన్ చేస్తే వెళ్లాను. అక్కడ బాలు సార్, చరణ్ (బాలూ తనయుడు) వెయిట్ చేస్తున్నారని శశికుమార్ నాతో చెప్పలేదు. బాలూగారిని వ్యక్తిగతంగా నేను కలిసింది ఆ రోజునే. ఓ ఆరేళ్లు అయ్యుంటుంది. ఏదో చిన్న మెడికల్ ఇష్యూస్ చెబితే పరిష్కరించాం. ఆ తర్వాత వాళ్ల ఫ్యామిలీ మెంబర్స్కి ఏవైనా ఆరోగ్య సమస్యలుంటే నాకు ఫోన్ చేసేవారు. ఆయన ఫ్రెండ్స్కి ఎవరికైనా ‘గ్యాస్ట్రో ఇంటెస్టినల్’ ఇష్యూస్ ఉంటే నన్ను కలవమని చెప్పేవారు. నా ప్రతి బర్త్ డేకి ఒక వాయిస్ నోట్ పంపేవారు. ఏదైనా పాటలో రెండు లైన్లు పాడి, పంపేవారు. అది నాకు చాలా స్పెషల్. అంతకుముందే చరణ్ నాకు ఫ్రెండ్. కాకపోతే బాలూతో పరిచయం అయినది మాత్రం శశికుమార్ ద్వారానే.’’ ‘‘ఆగస్ట్ 3న రాత్రి 8 గంటల ప్రాంతంలో చరణ్ ఫోన్ చేసి, ‘నాన్నకు జ్వరం ఉంది’ అంటే ముందు మందులు ఇద్దామనుకున్నాను కానీ ఆ తర్వాత ఆయన వయసుని దృష్టిలో పెట్టుకుని టెస్ట్ చేస్తే మంచిదని చేశాం. కోవిడ్ పాజిటివ్ వచ్చింది. ‘హైరిస్క్లో ఉన్నారు. కొన్ని రోజులు ఆస్పత్రిలో ఉండండి. ఏమీ సమస్య లేకపోతే అప్పుడు ఇంటికి వెళ్లొచ్చు’ అన్నాను.’’ ‘‘ఆయన ఎంత పెద్ద గాయకుడు అయినా అదేం చూపించేవారు కాదు. కాని నేను మాత్రం ఆయన గతంలో ఎప్పుడు హాస్పిటల్కు వచ్చినా స్పెషల్గా ట్రీట్ చేసేవాణ్ణి. ‘అలా ఏం వద్దు. వెయిట్ చేస్తాను. అందరిలానే నేను’ అనేవారు. వచ్చే ముందు ఫోన్ చేసి చెప్పేవారు. అంతే.. వెరీ డౌన్ టు ఎర్త్. అందరిలో ఒకడిగా ఉండాలనుకునేవారు.’’ ‘‘ముందు ఐసొలేషన్ రూమ్లోనే ఉంచాం. కానీ అడ్మిట్ అయిన మూడు రోజులకే ఆయనకు శ్వాస తీసుకోవడంలో ఇబ్బందులు మొదలయ్యాయి. అప్పుడు ఐసీయూకి షిఫ్ట్ చేశాం. మామూలు రూమ్లో ఉన్నప్పుడు ఆయన బుక్స్ చదివారు. టీవీ చూసేవారు. నెట్ఫ్లిక్స్ షోస్ చూసేవారు. కానీ శ్వాస సమస్య ఎక్కువయ్యాక ఆక్సిజన్ అవసరం ఏర్పడింది. బాలూగారి ఆరోగ్యానికి సంబంధించిన ప్రతి విషయాన్నీ ఇలా జరిగే అవకాశం ఉందని ముందే ఊహించి, అందుకు అనుగుణంగా చికిత్సను ప్లాన్ చేశాం. ఎక్మో వెంటిలేటర్ మీదే చికిత్స జరుగుతున్నప్పటికీ కొన్ని రోజులకు కాస్త కోలుకున్నారు. ఫుల్ కాన్షియస్లోకి వచ్చారు. అప్పుడు పదిరోజులకు ముందు వచ్చిన మెసేజ్లు, వీడియోలు చూపించారు చరణ్. కుడివైపు ఉండి చరణ్ చూపిస్తుంటే ఎడమ వైపుకి రమ్మన్నారు. కుడివైపు మెషీనులు ఉంటాయి కాబట్టి. అప్పుడే ఇళయరాజా మెసేజ్ చూశారు. ‘ఇటువైపు రా’ అన్నట్లు చరణ్ని చూసి, ఆయన సైగ చేశారు. చరణ్ ముందుకెళితే, ‘నువ్వు కాదు.. ఫోన్’ అన్నట్లు ఫోన్ని తన చేతిలోంచి తీసుకుని ముద్దు పెట్టుకున్నారు. అది చాలా టచింగ్ మూమెంట్. ఆయన హాస్పిటల్లో ఉన్న 52 రోజుల్లో నా కళ్లు చెమర్చిన ఇలాంటి సంఘటనలు చాలా ఉన్నాయి.’’ ‘‘వీడియోలు, మెసేజ్లు మెంటల్లీ ఆయన్ను బూస్ట్ చేసేవి. గ్రాండ్ చిల్డ్రన్ పంపిన గ్రీటింగ్స్ చూపించేవాళ్లం. ఉదయం భక్తి పాటలు, ఆ తర్వాత ఆయన–ఇళయరాజా కాంబినేషన్లో వచ్చిన పాటలు, వేరే పాటలు వినిపించేవాళ్లం. అదంతా హెల్ప్ఫుల్గా ఉండేది. ముఖ్యంగా ఆయన భార్య సావిత్రిగారు, కుమారుడు చరణ్, కుమార్తె పల్లవి వచ్చినప్పుడు సార్ ముఖం బ్రైట్గా అయ్యేది. ఇక బాగా రికవర్ అయ్యారనుకున్నప్పుడు చివరి 48 గంటల్లో ఆయన ఆరోగ్యం క్లిష్ట పరిస్థితుల్లో పడిపోయింది.’’ ‘‘చికిత్సాకాలంలో సార్కి స్వల్పంగా ఇన్ఫెక్షన్ వస్తూ తగ్గుతుండేది. యాంటీ బయాటిక్స్ ఇచ్చేవాళ్లం. శుక్రవారం ఆయన చనిపోయారు. బుధవారం మధ్యాహ్నం నుంచి ఇన్ఫెక్షన్ పెరగడం మొదలైంది. ఏ మందూ దాన్ని అరికట్టలేనంత వేగంగా ఇన్ఫెక్షన్ వ్యాప్తి చెందింది. దాంతోపాటు బ్రెయిన్లో బ్లీడింగ్ అయింది. ఆయనకు 74 ఏళ్లు. శరీరం తట్టుకోలేకపోయింది.’’ ‘‘చరణ్ నాకు అంతకుముందే మంచి స్నేహితుడు. ఒక స్నేహితుడిగా, డాక్టర్గా రెండు రోల్స్ నావి. ఎక్మో ట్రీట్మెంట్లో ఏమైనా జరగొచ్చని ముందే చరణ్కి చెప్పాం. అయిన్నప్పటికీ బాగా రికవర్ అవుతున్న సమయంలో ఇలా జరగడం ఓ షాక్. లంగ్ ట్రాన్స్ ప్లాంట్ చేస్తే ఆయన్ను కాపాడగలిగి ఉండేవాళ్లమని కొంతమంది అన్నారు. ఎవరికేది ఇష్టం వస్తే అది రాశారు. కానీ మేం మాత్రం ఏం చేయాలో అంతా చేశాం. డాక్టర్స్ అందరం కలిసి ప్రతి రోజూ గడచిన 24 గంటల్లో ఏం జరిగింది? అనేది చర్చించేవాళ్లం. మధ్యాహ్నం చరణ్కి మొత్తం రిపోర్ట్ చెప్పేవాళ్లం. యూఎస్ డాక్టర్స్తో వీడియో కాల్ మాట్లాడేవాళ్లం. ఏదైతే అవసరమో అదే చేశారని అందరూ అన్నారు. మెడికల్ టీమ్, చరణ్ అండ్ ఫ్యామిలీ అవసరమైన దానికంటే అంతకంటే ఎక్కువే చేశామని నమ్ముతున్నారు. శుక్రవారం అంబులెన్స్లో ఆయన భౌతికకాయాన్ని ఇంటికి తీసుకెళ్లారు. ఇక ఆ తర్వాత రెండు రోజులు నేను ‘షటాఫ్’. వేరే ఏ కేసులూ చూడకుండా అలా ఉండిపోయాను. ఎందుకంటే ఇలా జరుగుతుందని ఊహించలేదు. చాలా బాధగా అనిపించింది. ఆయన పాట రూపంలో మన మధ్య ఉంటారు.’’ -
వేదనిలయంలోకి దీపక్
సాక్షి, చెన్నై: పోయెస్గార్డెన్లోని దివంగత సీఎం జయలలిత నివాసం వేద నిలయంలోకి వెళ్లేందుకు ఆమె అన్న జయకుమార్ కుమారుడు దీపక్ మంగళవారం ప్రయత్నించారు. ఆయన్ను అక్కడి భద్రతా సిబ్బంది అడ్డుకున్నారు. చివరకు పక్కనే ఉన్న మరో భవనంలోకి వెళ్లి కాసేపు కూర్చుని బయటకు వచ్చేశారు. పోయెస్గార్డెన్లోని జయలలిత నివాసం వేదనిలయంను స్మారకమందిరంగా మార్నేందుకు ప్రభుత్వం కసరత్తుల వేగాన్ని పెంచిన విషయం తెలిసిందే. ఇందు కోసం సీఎం నేతృత్వంలో ఓ ట్రస్ట్ సైతం ఏర్పడింది. అదే సమయంలో జయలలిత ఆస్తులకు ఆమె అన్న జయకుమార్ కుమారుడు దీపక్, కుమార్తె దీప వారసులుగా కోర్టు ప్రకటించింది. దీంతో వేదనిలయంపై తమకు హక్కులు ఉన్నట్టు దీప, దీపక్ పేర్కొంటూ వస్తున్నారు. ఈ పరిస్థితుల్లో మంగళవారం మధ్యాహ్నం దీపక్ హఠాత్తుగా పోయెస్గార్డెన్లోకి వచ్చారు. అక్కడి వేదనిలయంలోకి వెళ్లేందుకు యత్నించారు. అయితే, పోలీసులు ఆయన్ను లోనికి అనుమతించలేదు. చివరకు తన వద్ద కోర్టు ఉత్తర్వులు ఉన్నాయని, లోనికి అనుమతించాలని పట్టుబట్టారు. అయితే, పోలీసులు ఏ మాత్రం తగ్గలేదు. ఆ ఉత్తర్వుల కాపీని పరిశీలించి మౌనంగానే ఉండిపోయారు. లోనికి ఎవర్నీ అనుమతించే అధికారం తమకు లేదని భద్రతా సిబ్బంది స్పష్టం చేశారు. అర్థం చేసుకోవాలని దీపక్కు సూచించారు. చివరకు వేదనిలయం పక్కనే ఉన్న పాత కార్యాలయంలోకి వెళ్లేందుకు అనుమతి ఇవ్వాలని కోరారు. ఇందుకు పోలీసులు అంగీకరించడంతో కాసేపులోపల కూర్చుని బయటకు దీపక్ వచ్చేశారు. అనంతరం కారులో ఆయన వెళ్లిపోయారు. జయ ఆస్తిపై పూర్తి హక్కులు వారికే చరిత్రలో నిలిచిపోయేలా 'అమ్మ' స్మారకం -
జయ ఆస్తిపై పూర్తి హక్కులు వారికే
సాక్షి, చెన్నై: దివంగత ముఖ్యమంత్రి జయలలిత ఆస్తుల వ్యవహారం మరో మలుపు తిరిగింది. జయ ఆస్తులకు దీప, దీపక్ ప్రత్యక్ష వారసులని మద్రాసు హైకోర్టు శుక్రవారం తీర్పు చెప్పింది. జయ ఆస్తికి వారిద్దరూ రెండో తరం వారసులని గురువారం ప్రకటించిన కోర్టు శుక్రవారం తీర్పును సవరిస్తున్నట్లుగా ప్రత్యక్ష వారసులని స్పష్టం చేసింది. అనారోగ్యకారణాలతో జయలలిత అకస్మాత్తుగా కన్నుమూసిన నాటి నుంచి రెండు అంశాలపై రసవత్తరమైన చర్చకు తెరలేచింది. ఒకటి రాజకీయ వారసులు ఎవరు, రెండు అపారమైన ఆమె ఆస్తికి వారసులు ఎవరు..? అన్నాడీఎంకే అధినేత్రి జయలలిత పార్టీలో ఎవ్వరినీ నెంబరు టూ స్థాయిలో కూర్చో బెట్టలేదు. ఒకటి నుంచి వంద వరకూ అన్నీ తానై వ్యవహరించారు. ఆస్తుల కేసులో జైలు జీవితం గడిపినపుడు పన్నీర్సెల్వంకు సీఎం బాధ్యతలు అప్పగించినా అది అంతవరకే. పార్టీలో, ప్రభుత్వంలో పన్నీర్సెల్వం సహా అందరూ కిందిస్థాయి నేతలుగానే కొనసాగారు. ఆ రెండింటిలో మొదటిదాన్ని కైవసం చేసుకునే యత్నంలో శశికళ బొక్కబోర్లాపడి జైలు జీవి తం గడుపుతోంది. జయ స్థాయిలో శశికళ పార్టీలో చక్రం తిప్పినా అదంతా అనధికారమే. కొంత జయకు తెలియకుండా సాగిపోయినదే. ఇక ఆస్తిని దక్కించుకునేందుకు సైతం శశికళ, టీటీవీ దినకరన్ ప్రయత్నాలు చేసి విఫలమైనారు. జయ అవివాహిత కావడంతో ప్రత్యక్ష వారసులు లేరు. తాను నటుడు శోభన్బాబు, జయలలితకు జన్మించిన కుమార్తెను, ఆమె ఆస్తికి తానే వారసురాలినంటూ వేర్వేరుగా ఇద్దరు యువతులు కొన్నాళ్లపాటు హడావిడి చేశారు. వీరిలో బెంగళూరుకు చెందిన యువతి కోర్టులో కేసు కూడా వేసింది. ఆమె వాదనకు బలం లేకపోవడంతో కొద్దిరోజుల్లోనే కనుమరుగైంది. ఇక జయలలిత అన్న జయకుమార్ కుమార్తె దీప, కుమారుడు దీపక్ సైతం వారసత్వపోరును ప్రారంభించారు. పారీ్టకి, ప్రాపరీ్టకి సైతం తామే వారసులమని దీప మీడియా ముందుకొచ్చారు. చెన్నై పోయస్ గార్డెన్లోని నివాసాన్ని జయ స్మారకమందిరంగా మార్చాలని ముఖ్యమంత్రి ఎడపాడి పళనిస్వామి ప్రభుత్వం చేసిన ప్రయత్నాలను న్యాయస్థానం ద్వారా అడ్డుకున్నారు. చదవండి: పోయెస్ గార్డెన్పై పోరు.. చిన్నమ్మకు చిక్కే జయకు రక్తసంబందీకులుగా దీప, దీపక్ మాత్రమే చలామణిలో ఉండడంతో న్యాయస్థానం తీర్పు కూడా వారిద్దరికీ అనుకూలంగా వచ్చింది. పోయస్గార్డెన్ ఇంటిని స్మారకమందిరం చేయాలనే అంశంపై నిర్ణయం తీసుకునేందుకు ప్రభుత్వానికి అధికారం ఉందని గురువారం ఇచ్చిన తీర్పులో పేర్కొంది. జయ ఆస్తులకు దీప, దీపక్ రెండోతరం వారసులని పేర్కొంది. ముందురోజు చెప్పిన తీర్పులో సవరణలు చేస్తూ జయ ఆస్తులకు దీప, దీపక్ ప్రత్యక్ష వారసులని మద్రాసు హైకోర్టు శుక్రవారం మరో తీర్పు వెలువరించింది. ఇతర ఆస్తుల మాటెలా ఉన్నా చెన్నై పోయస్గార్డెన్పై అటు ప్రభుత్వం ఇటు దీప, దీపక్ పట్టుబటి ఉన్నారు. పోయస్గార్డెన్ ఇంటిని స్మారక మందిరం చేసే అధికారం ప్రభుత్వానికి ఉందని న్యాయస్థానమే చెప్పిందని న్యాయశాఖా మంత్రి సీవీ షణ్ముగం తీర్పు వెలువడగానే మీడియా ముందు ధీమా వెలిబుచ్చారు. తాజా తీర్పుతో పోయస్గార్డెన్ ఇంటిపై దీప, దీపక్కు పూర్తిస్థాయి అధికారం వచ్చినట్లు భావించవచ్చు. జయ ఆస్తుల వ్యవహారంలో ఇంతవరకు శశికళ ప్రత్యక్ష జోక్యం చేసుకోలేదు. త్వరలో అదే జరిగితే ఈ వ్యవహారం మరెన్ని మలుపులు తిరుగుతుందో వేచిచూడాలి. చదవండి: వారిద్దరూ అమ్మ వారసులే ఈ తీర్పును ఊహించలేదు: దీప మద్రాసు హైకోర్టు శుక్రవారం తాజా తీర్పును వెలువరించిన అనంతరం మీడియాతో దీప మాట్లాడారు. ఇలాంటి తీర్పును నేను ఊహించలేదు. అన్నాడీఎంకే సైతం ఈ తీర్పును స్వాగతించాలి. పోయెస్గార్డెన్ రోడ్డులోకి ప్రవేశించకుండా నిరోధించారు. వారు ఎవరో మీకు తెలుసు. అత్త (జయలలిత) కడసారి చూపులకు కూడా నోచుకోకుండా చేసింది అన్నాడీఎంకే ప్రభుత్వమే. పోయెస్గార్డెన్ ఇంట్లోనే పుట్టాను. అయితే ఆ ఇంటిలోకి నేను వెళ్లకుండా అడ్డుకున్నారు. తమిళనాడు ప్రభుత్వం తమపై అనవసరమైన నిందలు మోపింది. అయితే చట్టం నుంచి ఎవ్వరూ తప్పించుకోలేరు. మద్రాసు హైకోర్టుకు శిరసు వంచి నమస్కరిస్తున్నాను. జయ ఆస్తులపై మాకు కోర్టు సర్వాధికారం ఇచ్చింది. ప్రత్యక్ష వారసులమని ప్రకటించిన తరువాత ఏఏ హక్కులు వస్తాయో పరిశీలించాలి. అన్ని ఆస్తులు మాకు అప్పగించాలి. వేదనిలయాన్ని జయ స్మారకమందరంగా మార్చాలని ప్రభుత్వం తీసుకొచ్చిన ఆర్డినెన్స్పై, ఆ ఇంటిపై హక్కు కల్పించాలని కోరుతూ గవర్నర్ను కలుస్తాను. అన్నాడీఎంకే నుంచి ఇకపై వచ్చే సమస్యలను న్యాయస్తానంలోనే ఎదుర్కొంటాను. జయ ఆస్తుల విషయంలో అన్నాడీఎంకేకు అడ్డంకులు ఎదురవడంతో నన్ను టార్గెట్ చేస్తున్నారు. మాలో కొన్ని భయాలు నెలకొన్నందున సాయుధ పోలీసు బందోబస్తు కల్పించాలి. చదవండి: రక్త సంబంధీకులు వారసులు కారా? జయ ఆస్తుల చిట్టా జయలలిత ఆస్తులను అధికారికంగా లెక్కకట్టేందుకు ఉన్న ఆధారాలు ఎన్నికల నామినేషన్ల పత్రాల్లో ఆమె చూపిన వివరాలు మాత్రమే. తన వార్షిక ఆదాయం రూ.9.34 కోట్లని 1996లో ఆదాయపు పన్నుశాఖకు లెక్కచూపారు. అధికశాతం వ్యవసాయంపై వచ్చే ఆదాయమని పేర్కొన్నారు. నెలకు ఒక్కరూపాయి జీతం పొందుతున్నట్లు ఆ లెక్కల్లో తెలిపారు. 2011 ఎన్నికల్లో పోటీచేసినపుడు రూ.51.4 కోట్ల ఆస్తి చూపారు. 2016లో రూ.113.73 కోట్ల ఆస్తిని నామినేషన్ పత్రాల్లో పేర్కొన్నారు. చరాస్థి కింది రూ.42 కోట్ల విలువైన బంగారు నగలను చూపారు. స్థలాలు, నిర్మాణాల కింద మరో రూ.72 కోట్ల ఆస్తులను ఆమె చూపారు. బ్యాంకుల్లో రూ.10.63 కోట్ల డిపాజిట్టు చూపగా ఇందులో రెండుకోట్లు ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో సీజ్కు గురయ్యాయి. వివిధ కంపెనీల్లో రూ.27.44 కోట్లు పెట్టుబడులున్నాయి. ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో 21289.30 గ్రాముల బంగారం, 1250 కిలోల వెండిని సీజ్ చేశారు. రూ.2.4 కోట్ల అప్పుకూడా ఉందని ఆమె పేర్కొన్నారు. 1992లో కొడనాడులో 900 ఎకరాల టీ ఎస్టేట్ను కొనుగోలు చేసి క్రమేణా 1,800 ఎకరాలకు విస్తరించినట్లు తెలుస్తోంది. బహిరంగ మార్కెట్లో ఒక్కో ఎకరా రూ.1 కోటికి పలుకుతుంది. ఇక లగ్జరీ వసతులతో కొడనాడు బంగ్లా కూడా ఉంది. కొడనాడు ఎస్టేట్ తనకు సొంతమని శశికళ చెబుతున్నారు. జయలలిత పేరున మొత్తం 173 ఆస్తులున్నట్లు సమాచారం. వీటిల్లో కనీసం వంద ఆస్తుల్లోనైనా జయలలితకు పెద్దవాటా ఉండే అవకాశం ఉంది. జయ ఆస్తులపై న్యాయస్థానంలో వాదోపవాదాల్లో రూ.913 కోట్ల ఆస్తులుగా చూపారు. -
పోయెస్ గార్డెన్పై పోరు.. చిన్నమ్మకు చిక్కే
సాక్షి ప్రతినిధి, చెన్నై: ఒకప్పటి పవర్ఫుల్ రాజకీయకేంద్రమైన చెన్నై పోయెస్ గార్డెన్లోని జయలలిత నివాసం స్మారకమందిరం వివాదంలో నలిగిపోతోంది. జయ వారసులు దీప, దీపక్ ఒకవైపు, ప్రభుత్వం మరోవైపు సమరం సాగిస్తున్నారు. దివంగత ముఖ్యమంత్రి జయలలిత చెన్నై పోయెగార్డెన్లో అత్యంత విలాసవంతమైన భవనంలో నివసించేవారు. రాజకీయ వర్గాలు ‘గార్డెన్’ అని ముద్దుగా పిలుచుకునేవారు. జయలలిత అధికారంలో ఉన్నపుడు ‘గార్డెన్’ నుంచి ఆదేశాలు వచ్చాయా అని ముందుగా ప్రశ్నించేవారు. సచివాలయం కంటే పోయెగార్డెన్ కే ప్రాధాన్యతతో రాజకీయ, అధికార కేంద్రంగా వెలిగిపోయేది. జయ మరణించిన తరువాత కూడా దాని ప్రాభవం తగ్గలేదు. జయకు వందలకోట్ల రూపాయల ఆస్తులున్నా గార్డెన్హౌస్ చుట్టూనే రాజకీయాలు చక్కర్లు కొడుతున్నాయి. జయకు సొంతమైన వందల కోట్ల రూపాయల విలువజేసే ఆస్తికి ఆమె అన్న కుమార్తె దీప, కుమారుడు దీపక్ వారసులని మద్రాసు హైకోర్టు తేల్చడంతో ఇంతకూ ఆస్తులెక్కడెక్కడ ఉన్నాయి, వాటి విలువ ఎంత అనే అంశంపై జోరుగా చర్చ బయలుదేరింది. (వారిద్దరూ అమ్మ వారసులే) అవినీతి నిరోధకశాఖ కోర్టులో దాఖలు చేసిన జాబితాలో ఎన్నికల సమయంలో జయలలిత దాఖలు చేసిన నామినేషన్ పత్రంలో చూపిన ఆస్తులనే పేర్కొన్నారు. జయకు వారసులమని తమను ప్రకటించి ఆమె ఆస్తుల పర్యవేక్షణ బాధ్యతను తమకు అప్పగించాల్సిందిగా దీప, దీపక్ గతంలో వేర్వేరుగా మద్రాసు హైకోర్టులో దాఖలు చేసిన పిటిషన్లపై బుధవారం వెలువడిన తీర్పుతో స్పష్టత వచ్చింది. వారిద్దరూ జయ ఆస్తికి రెండోతరం వారసులని కోర్టు పేర్కొంది. జయ ఆస్తులపై పర్యవేక్షణాధికారం వారిద్దరికీ ఉంటుందని తెలిపింది. పోయెస్ గార్డెన్లోనిఇంటిని జయ స్మారక మందిరంగా మార్చాలనే నిర్ణయాన్ని పునఃపరిశీలించాల్సింది ప్రభుత్వాన్ని కోర్టు సూచించింది. ఈ తీర్పు వెలువడిన వెంటనే హర్షం వ్యక్తంచేసిన దీప, దీపక్ ఇద్దరూ కలిసి చెన్నై మెరీనాబీచ్లోని జయ సమాధికి వెళ్లి అంజలి ఘటించారు. గార్డెన్లోనే కాపురం: దీప కోర్టు తీర్పులో సైతం గార్డెన్కు ప్రాధన్యత ఇవ్వడంతో జయ నివాసం మరోసారి చర్చనీయాంశమైంది. ఈ సందర్భంగా దీప మీడియాతో మాట్లాడుతూ, చెన్నై పోయెస్గార్డెన్లోని వేదనిలయం తమ పూర్వీకుల ఆస్తి, ఆ భవనం తమకు సొంతమని కోర్టు ఇచ్చిన తీర్పు ఎంతో సంతోషాన్ని ఇచ్చిందని ఆమె అన్నారు. జయకు నేరుగా వారసులు లేకపోవడంతో ఆమె ఆస్తిని కాజేయాలని ఎందరో చేసిన ప్రయత్నాలకు కోర్టు అడ్డుకట్టవేసింది. పోయెస్గార్డెన్ ఇంటిని జయ స్మారకమందిరంగా మార్చడాన్ని అంగీకరించం. ఇందుకోసం ప్రభుత్వం తీసుకొచ్చిన అత్యవసర చట్టంపై కోర్టులో అప్పీలు చేస్తాం. జయకు చెందిన ఆస్తులన్నీ మాకే సొంతం. వాటిని స్వాధీనం చేసుకునేందుకు న్యాయవాదులతో చర్చిస్తున్నాం. జయ ఆస్తులను ఆక్రమించిన వారికి నోటీసులు జారీచేస్తాం. చట్టపరమైన సమస్యలు పరిష్కారం కాగానే పోయెస్గార్డెన్లో నివసిస్తాం. జయ ఆస్తులను స్వాధీనం చేసుకుని కాపాడే బాధ్యత మాపై ఉంది. జయ పేరున మేమే ట్రస్టును ఏర్పాటు చేసి పేద బడుగు బలహీన వర్గాలకు సేవచేస్తామని దీప చెప్పారు. దీపక్ మాట్లాడుతూ, పోయెస్గార్డెన్ ఇల్లు వారసత్వంగా మాకు సంక్రమించిన ఆస్తి, దాన్ని స్మారకమందిరంగా మార్చేందుకు తీసుకొచ్చిన చట్టాన్ని అంగీకరించే ప్రసక్తేలేదని అన్నారు. జయ స్మారకమందిరంగా ప్రభుత్వం మార్చదలచుకుంటే తాముగా ఇవ్వాలేగాని వారు ఏకపక్ష నిర్ణయం తీసుకునేందుకు వీలులేదు. వేద నిలయంను సీఎం క్యాంపాఫీస్ చేయా లన్న సూచన కూడా సరికాదు. డీఎంకే అధి కారంలోకి వచ్చి స్టాలిన్ ముఖ్యమంత్రి అయిన పక్షంలో అందులో ఉంటారా. మాకు సాయుధ పోలీస్ బందోబస్తు కావాలని కోరలేదు. ఒక ఆస్తి కోసం నన్ను హత్యచేస్తే అందుకు బాధ్యులెవరు. ఎడపాడి, పన్నీర్సెల్వం తమ పూర్వీకుల ఆస్తిని జయ స్మారకమందిరంగా చేసుకుంటే మంచిదని దీపక్ వ్యాఖ్యానించారు.(స్మారక మందిరంగా జయలలిత నివాసం) చిన్నమ్మకు చిక్కే.. జయ ఆస్తులపై కోర్టు ఇచ్చిన తీర్పు శశికళను చిక్కుల్లో పడేసే అవకాశం ఉంది. జయలలిత, శశికళ సంయుక్తంగా అనేక సంస్థలు నడుపుతుండేవారు. వాటిల్లోని జయ వాటాను దీప, దీపక్లకు కేటాయించాల్సి ఉంటుంది. లేదా జయ ఆస్తులన్నీ ట్రస్ట్ కిందకు తీసుకొస్తే మారుమాట్లాడకుండా శశికళ అప్పగించాల్సి రావచ్చు. కొడనాడు ఎస్టేట్, హైదరాబాద్లోని ద్రాక్ష తోట వివాదాలు కుదుటపడవచ్చు. ప్రభుత్వానికే అధికారం: సీవీ షణ్ముగం చెన్నై పోయెస్గార్డెన్లోని జయ నివాసాన్ని స్మారక మందిరంగా మార్చే అధికారం ప్రభుత్వానికి ఉందని కోర్టు తీర్పుతో స్పష్టమైందని న్యాయశాఖా మంత్రి సీవీ షణ్ముగం వ్యాఖ్యానించారు. జయ ఇంటిని స్మారకమందిరంగా మార్చడంపై పునరాలోచించాలని, ఒక భాగం స్మారక మందిరం, మరో భాగం సీఎం క్యాంప్ ఆఫీస్గా మార్చవచ్చని కోర్టు సూచించిన విషయాన్ని ఆయన గుర్తు చేశారు. కోర్టు తీర్పు ప్రతులు అందిన తరువాత క్షుణ్ణంగా అధ్యయనం చేసి బదులు పిటిషన్ దాఖలు చేస్తామని ఆయన తెలిపారు. -
ఆరువందల ఏళ్ల కథ
దీపక్, శేఖర్వర్మ, వివ్య శాన్త్లు ముఖ్యపాత్రల్లో నటించిన చిత్రం ‘అంగుళీక’. ప్రేమ్ ఆర్యన్ దర్శకత్వంలో కోటి తూముల, ఎ.జగన్మోహన్రెడ్డి నిర్మించారు. త్వరలో ఈ చిత్రాన్ని విడుదల చేయాలనుకుంటున్నారు. ఈ సినిమా విలేకరుల సమావేశంలో ప్రేమ్ మాట్లాడుతూ– ‘‘మొత్తం ఏడు రకాల సూర్యగ్రహణాలు ఉంటాయి. సూర్య భగవానుడి అంశలో జన్మించిన ఒక అమ్మాయికి, అంగుళీక సూర్యగ్రహణానికి ఒక లింక్ ఉంది. ఆరువందల ఏళ్ల క్రితం జరిగిన వాస్తవ కథను తీసుకొని ఈ సినిమా తీశాం’’ అన్నారు. కోటి మాట్లాడుతూ– ‘‘ఎంతో కష్టపడి, ఇష్టపడి చేసిన చిత్రమిది. కొన్ని కారణాల వల్ల సినిమా డిలే అయ్యింది’’ అన్నారు. ‘‘మంచి సినిమాలో భాగం కావటం సంతోషంగా ఉంది. ఈ సినిమా రిలీజ్ వరకూ వచ్చిందంటే మా నిర్మాత, దర్శకుడే కారణం’’ అన్నారు హీరో శేఖర్. -
దీపక్ కిడ్నాప్ మిస్టరీ వీడింది!
-
దీపక్ కిడ్నాప్ మిస్టరీ వీడింది!
సాక్షి, హైదరాబాద్: సికింద్రాబాద్ గాంధీ ఆస్పత్రిలో కిడ్నాపైన ఏడాదిన్నర బాలుడు దీపక్ ఆచూకి లభ్యమైంది. అర్ధరాత్రి బాలున్ని గుర్తి తెలియని వ్యక్తులు వదిలివెళ్లారు. చిలకలగూడ పోలీసులు కిడ్నాపర్ల కోసం గాలిస్తున్నారు. గాంధీ ఆస్పత్రిలో దీపక్ను ముగ్గురు మహిళలు కిడ్నాప్ చేసినట్లు పోలీసులు గుర్తించిన సంగతి తెలిసిందే. కొంతమంది మహిళలు ముఠాగా ఏర్పడి ఇద్దరు చిన్నారులతో కలిసి బాలుడిని కిడ్నాప్ చేసినట్లు తెలుస్తోంది. మౌలాలికి చెందిన రాధిక, తులసీరామ్ దంపతులకు నలుగురు సంతానం.. వారు రాము(9), ధనిరాం(6), లక్ష్మణ్(4), దీపక్ (18 నెలలు). తులసీరామ్ ఓ కేసులో జైలులో ఉన్నాడు. డెలివరీ కోసం వచ్చిన బంధువును పరామర్శించేందుకు రాధిక ముగ్గురు పిల్లలతో కలిసి ఆస్పత్రికి వెళ్లింది. ఆస్పత్రిలోని విజిటర్స్ షెడ్డులోనే ఆమె ఉంటోంది. గత నెల 5న ఉదయం నిద్రలేచి చూడగా దీపక్ కనిపించలేదు. చుట్టుపక్కల వెతికినా ఆచూకీ లభించకపోవడంతో పోలీసులకు ఫిర్యాదు చేసింది. సీసీ ఫుటేజీలను పరిశీలించిన పోలీసులు ఓ ముఠా బాలుడిని తీసుకెళ్లినట్లు గుర్తించారు. ముఠాలో ముగ్గురు మహిళలతోపాటు 12 ఏళ్ల బాలుడు, పదేళ్ల బాలిక ఉన్నట్లు సమాచారం. -
విమానయాన సంస్థలతో తల్వార్ లింకులపై దర్యాప్తు
న్యూఢిల్లీ: కార్పొరేట్ లాబీయిస్ట్ (వ్యవహారాల నేర్పరి) దీపక్ తల్వార్కు దేశ, విదేశాలకు చెందిన 50 సంస్థలతో ఉన్న సంబంధాలపై దర్యాప్తు ఏజెన్సీలు దృష్టి సారించాయి. తన విదేశీ క్లయింట్లకు అనుకూలంగా ఎయిర్ ట్రాఫిక్ హక్కులను సంపాదించేందుకు గాను ప్రభుత్వ ఉద్యోగులు, రాజకీయనేతలకు తల్వార్ లంచాలు ఇచ్చినట్టు.. తద్వారా విమానయాన సంస్థల నుంచి తల్వార్కు రూ.272 కోట్లు ముట్టినట్టు దర్యాప్తు నివేదిక స్పష్టం చేస్తోంది. యూపీఏ హయాంలో తల్వార్ లాబీయింగ్ వ్యవహారాలు, ముఖ్యంగా విమానయాన రంగానికి సంబంధించిన వాటిపై ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్, సీబీఐ దర్యాప్తు చేస్తున్నాయి. ప్రస్తుతం తల్వార్ జ్యుడీషియల్ కస్టడీలో ఉన్నాడు. ఈ ఆరోపణలను ఆయన ఖండించడం గమనార్హం. ఎయిర్ఇండియా ప్రయోజనాలకు గండికొట్టి.. 2008–09లో మూడు విదేశీ విమానయాన కంపెనీలకు అనుకూలంగా ట్రాఫిక్ హక్కులను తల్వార్ సంపాదించిపెట్టినట్టు దర్యాప్తు ఏజెన్సీలు అభియోగాలు మోపాయి. -
ఆ దర్శకుడిపై కేసు వేస్తా: జయలలిత మేనల్లుడు
సాక్షి, చెన్నై : దర్శకుడు గౌతమ్మీనన్ మరోసారి వివాదాల్లో చిక్కుకున్నారు. ఈయనపై కోర్టులో కేసు వేస్తానని దివంగత ముఖ్యమంత్రి జయలలిత సోదరుడి కుమారుడు దీపక్ అంటున్నారు. జయలలిత జీవిత చరిత్రను తెరకెక్కించడానికి కోలీవుడ్లో పోటీ నెలకొన్న విషయం తెలిసిందే. ఇప్పటికే దర్శకుడు విజయ్ తలైవీ పేరుతో జయలలిత బయోపిక్ను తెరకెక్కించడానికి సన్నాహాలు చేస్తున్నారు. ఇందులో బాలీవుడ్ సంచలన నటి కంగనారనౌత్ అమ్మగా నటించనుంది. అదే విధంగా నవ దర్శకురాలు ప్రియదర్శిని ‘ది ఐరన్ లేడీ’ పేరుతో జయలలిత జీవిత చరిత్రను తెరకెక్కించడానికి సన్నాహాలు చేస్తున్నారు. ఇందులో జయలలితగా నటి నిత్యామీనన్ నటించనుంది. కాగా దర్శకుడు గౌతమ్మీనన్ జయలలిత జీవిత చరిత్రను వెబ్ సిరీస్గా రూపొందించేశారు. క్వీన్ పేరుతో రూపొందించిన ఇందులో జయలలితగా నటి రమ్యకృష్ణ నటించారు. ఈ వెట్ సిరీస్ ఫస్ట్లుక్ పోస్టర్ను ఇటీవలే విడుదల చేశారు. ఈ వెబ్ సిరీస్కు జయలలిత సోదరుడి కొడుకు దీపక్ వ్యతిరేకతను వ్యక్తం చేస్తున్నారు. దీని గురించి ఆయన ఒక ప్రకటన విడుదల చేస్తూ జయలలిత గురించి దర్శకుడు గౌతమ్మీనన్కు ఏం తెలుసని ప్రశ్నించారు. జయలలిత బయోపిక్ను గౌతమ్మీనన్ రూపొందిస్తే ఆయనకు వ్యతిరేకంగా కోర్టులో కేసు వేస్తానని హెచ్చరించారు. దీంతో రమ్యకృష్ణ నటించిన క్వీన్ వెబ్ సిరీస్ ప్రసారానికి చిక్కులు ఎదురవుతున్నాయి. దీనికి దర్శకుడు గౌతమ్మీనన్ ఎలా స్పందిస్తారో చూడాలి. -
భారత్ పంచ్ అదిరింది
బ్యాంకాక్: ఆసియా సీనియర్ బాక్సింగ్ చాంపియన్షిప్లో భారత బాక్సర్ల పంచ్ పవర్ కొనసాగుతోంది. పురుషుల విభాగంలో అమిత్ పంగల్ (52 కేజీలు), కవిందర్ సింగ్ బిష్త్ (56 కేజీలు), దీపక్ (49 కేజీలు)... మహిళల విభాగంలో సోనియా చహల్ (57 కేజీలు) సెమీఫైనల్లోకి దూసుకెళ్లి కనీసం కాంస్య పతకాలను ఖాయం చేసుకున్నారు. అయితే లవ్లీనా బొర్గోహైన్ (69 కేజీలు), సీమా పూనియా (ప్లస్ 81 కేజీలు), రోహిత్ టోకస్ (64 కేజీలు) పోరాటం క్వార్టర్ ఫైనల్లో ముగిసింది. అదే ఫలితం: సోమవారం జరిగిన బౌట్లలో అమిత్, కవిందర్ తమ అద్వితీయ ప్రదర్శనతో అదరగొట్టారు. రియో ఒలింపిక్స్ చాంపియన్ హసన్బాయ్ దస్మతోవ్ (ఉజ్బెకిస్తాన్)పై అమిత్... ప్రపం చ చాంపియన్ కైరాట్ యెరాలియెవ్ (కజకిస్తాన్)పై కవిందర్ అద్భుత విజయాలు సాధించారు. గతేడా ది జకార్తా ఆసియా క్రీడల ఫైనల్లో దస్మతోవ్ను ఓడించి స్వర్ణం నెగ్గిన అమిత్ ఈసారీ అదే ఫలితాన్ని పునరావృతం చేశాడు. తొలి రౌండ్ నుంచే పక్కా ప్రణాళికతో దూకుడుగా ఆడిన అమిత్ 4–1తో దస్మతోవ్ను ఓడించాడు. ఇటీవలే ఫిన్లాండ్లో జరిగిన గీబీ అంతర్జాతీయ టోర్నీలో స్వర్ణం సాధించిన కవిందర్ ఫామ్ను కనబరుస్తూ క్వార్టర్ ఫైనల్లో ప్రపంచ చాంపియన్ను బోల్తా కొట్టించాడు. తొలి రౌండ్లో కైరాట్ ఆధిపత్యం చలాయించినా... తదుపరి రెండు రౌండ్లలో కవిందర్ తన ప్రత్యర్థి పంచ్లను కాచుకొని అవకాశం దొరికినపుడల్లా ఎదురుదాడి చేశాడు. చివరకు కవిందర్ను 3–2తో విజయం వరించింది. దీపక్ సింగ్తో క్వార్టర్ ఫైనల్లో తలపడాల్సిన అఫ్గానిస్తాన్ బాక్సర్ రామిష్ రహ్మాని గాయం కారణంగా బరిలోకి దిగలేదు. దాంతో దీపక్ను విజేతగా ప్రకటించారు. మహిళల 57 కేజీల క్వార్టర్ ఫైనల్లో జో సన్ వా (కొరియా)పై సోనియా 3–2తో విజయం సాధించి సెమీస్ బెర్త్ ఖాయం చేసుకుంది. ఇతర క్వార్టర్ ఫైనల్స్లో లవ్లీనా 0–5తో చెన్ నియెన్–చిన్ (చైనీస్ తైపీ) చేతిలో... సీమా పూనియా 0–5తో యాంగ్ జియోలి (చైనా) చేతిలో... రోహిత్ 2–3తో చిన్జోరిగ్ బాతర్సుక్ (మంగోలియా) చేతిలో ఓడిపోయారు. -
భారత బాక్సర్ల శుభారంభం
బ్యాంకాక్: ప్రతిష్టాత్మక ఆసియా బాక్సింగ్ చాంపియన్షిప్లో భారత బాక్సర్లు శుభారంభం చేశారు. పోటీల తొలి రోజు శుక్రవారం బరిలోకి దిగిన ఐదుగురు బాక్సర్లు కూడా గెలుపొందడం విశేషం. పురుషుల విభాగంలో జాతీయ చాంపియన్ దీపక్ (49 కేజీలు), రోహిత్ టొకాస్ (64 కేజీలు), సతీశ్ కుమార్ (ప్లస్ 91 కేజీలు), ఆశిష్ (69 కేజీలు)... మహిళల విభాగంలో సోనియా (57 కేజీలు) తొలి రౌండ్ బౌట్లలో నెగ్గి ప్రిక్వార్టర్ ఫైనల్లోకి ప్రవేశించారు. ఆసియా చాంపియన్షిప్లో స్వర్ణాలు గెలిచిన భారత బాక్సర్లు సెప్టెంబరులో జరిగే ప్రపంచ చాంపియన్షిప్లో పాల్గొంటారని భారత బాక్సింగ్ హై పెర్ఫార్మెన్స్ డైరెక్టర్ శాంటియాగో నీవా తెలిపారు. తొలి రౌండ్ బౌట్లలో దీపక్ 5–0తో లోయ్ బుయ్ కాంగ్డాన్ (వియత్నాం)పై, రోహిత్ 5–0తో చు యెన్ లాయ్ (చైనీస్ తైపీ)పై, ఆశిష్ 5–0తో సోపోర్స్ (కంబోడియా)పై, సతీశ్ 5–0తో ఇమాన్ (ఇరాన్)పై నెగ్గగా... సోనియా 5–0తో డో నా యువాన్ (వియత్నాం)ను ఓడించింది. మొత్తం 34 దేశాల నుంచి పురుషుల విభాగంలో 198 మంది... మహిళల విభాగంలో 100 మంది బాక్సర్లు ఈ మెగా ఈవెంట్లో పాల్గొంటున్నారు. ఈ టోర్నీ బౌట్లను స్లో మోషన్లో కూడా రికార్డు చేస్తున్నారు. ఫలితాలపై ఎవరికైనా అభ్యంతరం ఉంటే బౌట్ ముగిసిన నిమిషంలోపు అప్పీల్ చేసుకోవాలి. ఒకవేళ వీడియో పరిశీలించిన తర్వాత అప్పీల్లో నిర్ణేతలు నిర్ణయం సరైనదేనని తేలితే మాత్రం అప్పీల్ చేసిన వారు వెయ్యి డాలర్లు పెనాల్టీగా చెల్లించాలి. -
దీపక్ తల్వార్,రాజీవ్ సక్సేనాకు ఈడీ కస్టడీ
-
దీపక్ కొచర్కు మళ్లీ ఐటీ నోటీసులు
న్యూఢిల్లీ: వీడియోకాన్కు ఐసీఐసీఐ బ్యాంకు రుణం ఇచ్చిన కేసులో బ్యాంకు సీఈఓ చందా కొచర్ భర్త దీపక్ కొచర్కు ఆదాయపన్ను శాఖ మరోసారి నోటీసులు జారీ చేసింది. ఈ వ్యవహారంలో పన్ను ఎగవేత అంశాన్ని ఐటీ శాఖ దర్యాప్తు చేస్తుండటం తెలిసిందే. దీపక్ కొచర్కు వ్యక్తిగత హోదాలోనే ఈ నోటీసులు జారీ చేశామని, నూపవర్ రెన్యువబుల్స్ కంపెనీ ఎండీగా దీపక్ కొచర్ వ్యక్తిగత ఆర్థిక అంశాలు, లావాదేవీల వివరాలు కోరామని ఐటీ వర్గాలు తెలిపాయి. పది రోజుల్లోగా డాక్యుమెంట్లు సమర్పించాలని నోటీసుల్లో ఐటీ శాఖ కోరింది. మారిషస్కు చెందిన రెండు సంస్థల (ఫస్ట్ లాండ్ హోల్డింగ్స్ లిమిటెడ్, డీహెచ్ రెన్యువబుల్స్ హోల్డింగ్స్) నుంచి నూపవర్ రెన్యువబుల్స్లోకి రూ.325 కోట్ల నిధుల రాకపై ఐటీ శాఖ తన దర్యాప్తులో ప్రత్యేకంగా దృష్టి సారించింది. -
585 ఏళ్ల ప్రేమగాథ
ప్రియమణి టైటిల్ పాత్రలో తెరకెక్కిన చిత్రం ‘అంగుళీక’. దీపక్ కథానాయకుడు. ప్రేమ్ ఆర్యన్ని దర్శకునిగా పరిచయం చేస్తూ కోటి తూముల, ఎ.హితేష్ రెడ్డి నిర్మించిన ఈ సినిమా టీజర్ని ప్రముఖ దర్శకులు కోడి రామకృష్ణ విడుదల చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ –‘‘ఈ సినిమా కథ నాకు తెలుసు. నిర్మాతలిద్దరూ నాకు కావాల్సిన వారు కావడంతో ఎప్పటికప్పుడు అప్ డేట్స్ ఇచ్చేవారు. టీజర్ టైమింగ్, కటింగ్ చూశాక దర్శకుడు సినిమాని బాగా తీసుంటాడని అర్థమైంది. ఈ చిత్రం విజయవంతమై నిర్మాతలకు లాభాలు, దర్శకుడికి మంచి పేరు రావాలి’’ అన్నారు. ప్రేమ్ ఆర్యన్ మాట్లాడుతూ –‘‘కోడి రామకృష్ణగారి స్ఫూర్తితో ‘అంగుళీక’ చిత్రాన్ని డైరెక్ట్ చేశా. కాల చక్రంతో ముడిపడిన ఇద్దరు ప్రేమికుల వీరగాథే ఈ సినిమా. కాలచక్రం, సూర్యగ్రహణం ఈ రెండు అంశాల చుట్టూ సినిమా తిరుగుతుంది. సూర్యగ్రహణం ఘడియల్లో విడిపోయిన ప్రేమజంట మళ్లీ సూర్యుడి ఆశీస్సులతో 585 ఏళ్ల తర్వాత కలుసుకుంటారు. అదే సమయంలో పగతో రగిలిపోతున్న దుష్ట ఆత్మ ఆ జంటపై పగ తీర్చుకుందా? ఆ ప్రేమ జంట ఆత్మలకు ఎలా మోక్షం కలిగింది– అనేది సినిమాకు హైలెట్’’ అన్నారు. కోటి తూముల, ఎ.హితేష్ రెడ్డి పాల్గొన్నారు. ఈ చిత్రానికి సంగీతం: శామ్ కె. ప్రసన్, కెమెరా: చిట్టిబాబు, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్స్: శశి బాణాల, శివ సిర్రి. -
యువతిపై అత్యాచారం.. కాబోయే భర్తకు ఫొటోలు!
టీనగర్: యువతిపై అత్యాచారానికి పాల్పడ్డ కేసులో చెన్నైకి చెందిన క్రీడాకారుడిని పోలీసులు అరెస్టు చేశారు. చెన్నై ట్రిప్లికేన్కు చెందిన ఓ యువతి(22) కీల్పాక్కంలోని ప్రైవేటు కళాశాలలో ఎంబీఏ మొదటి సంవత్సరం చదువుతోంది. ఆమె తండ్రి హర్డిల్స్ క్రీడా కేంద్రం నిర్వహిస్తున్నారు. అక్కడ టీపీ సత్రం జ్యోతియమ్మాల్ నగర్కు చెందిన దీపక్ అలియాస్ డేనియల్(22) శిక్షణ పొందుతున్నాడు. తండ్రి నిర్వహిస్తున్న హర్డిల్స్ కేంద్రానికి ఆ యువతి తరచుగా వస్తుండడంతో దీపక్ ఆమెతో స్నేహంగా మెలిగాడు. అనంతరం డేనియల్, యువతి ప్రేమించుకున్నారు. ఇటీవల కొన్ని విషయాల్లో వీరి మధ్య అభిప్రాయభేదాలు వచ్చాయి. నెలరోజులుగా ఆ యువతి దీపక్తో మాట్లాడలేదు. అనేకసార్లు సెల్ఫోన్లో ప్రయత్నించినా ఆమె సమాధానం చెప్పలేదు. ఇలా ఉండగా ఆ యువతి ప్రేమ వ్యవహారం తల్లిదండ్రులకు తెలిసింది. దీంతో ఆమెకు వివాహం చేసేందుకు వరుడి కోసం అన్వేషించారు. ఈ విషయం తెలియగానే దీపక్ ఆ యువతిని ప్రశ్నించాడు. అందుకామె తల్లిదండ్రులు చూసిన వ్యక్తినే పెళ్లి చేసుకుంటానంది. దీంతో ఆగ్రహించిన దీపక్ ఆమెతో తాను తీసుకున్న ఫొటోను ఇంటర్నెట్లో విడుదల చేస్తానని బెదిరించాడు. ఆమెకు కాబోయే భర్తకు వాట్సప్ ద్వారా ఫోటో పంపాడు. దీంతో దిగ్భ్రాంతి చెందిన యువతి ఆ విషయం తల్లిదండ్రులకు తెలిపింది. తల్లిదండ్రులు దీపక్పై కీల్పాక్కం మహిళా పోలీసు స్టేషన్లో ఫిర్యాదు చేశారు. దీపక్ను పోలీసులు అరెస్ట్ చేశారు. నిందితుడి వాంగ్మూలం పోలీసులకు ఇచ్చిన వాంగ్మూలంలో తమ అభిప్రాయభేదాలకు మునుపు ఒకరోజు ఆమెను స్నేహితుల గదికి తీసుకువెళ్లి, శీతలపానీయంలో మత్తుమందు ఇచ్చి అత్యాచారం జరిపానని దీపక్ వాగ్మూలం ఇచ్చాడు. తనపై జరిగిన దారుణాన్ని ఆమె తన తల్లిదండ్రులకు బెబుతానని తనను బెదిరించిందన్నాడు. దీంతో ఆమె అసభ్య చిత్రాలను చూపగా కోపంగా వెళ్లిపోయి తల్లిదండ్రులకు చెప్పినట్టు వివరించాడు. ఈ నేపథ్యంలో దీపక్కు అనేకమంది యువతులతో సంబంధాలు ఉన్నాయా? అనే కోణంలోనూ పోలీసులు విచారణ జరుపుతున్నారు. -
ఇక.. చొరబాటే
► చట్టపరంగా కసరత్తులు ► మేనత్త స్థానం నాతోనే భర్తీ : దీప ► ఆస్తులన్నీ మావే : దీపక్ దివంగత ముఖ్యమంత్రి జయలలిత మేనకోడలు, మేనల్లుడు మేనత్త ఆస్తుల కోసం మళ్లీ తెర ముందుకు వచ్చారు. పోయెస్ గార్డెన్లోకి చొరబడేందుకు సిద్ధమైనట్టు, పార్టీని కైవసం చేసుకునేందుకు చట్టపరంగా కసరత్తులు మొదలెట్టినట్టుగా దీప ప్రకటించారు. మేనత్తకు చెందిన ఆస్తులన్నింటికీ తామే వారసులం అని, చిన్న అత్త శశికళ కుటుంబీకులు తప్పుకుంటే మంచిదని దీపక్ హెచ్చరించారు. సాక్షి, చెన్నై : దివంగత సీఎం జయలలిత ఆస్తులకు తామే వారసులం అని ఆమె అన్న జయకుమార్ కుమారుడు దీపక్, కుమార్తె దీప పేర్కొంటూ వస్తున్న విషయం తెలిసిందే. ఈ ఇద్దరి మధ్య ఐక్యత లేని దృష్ట్యా, తరచూ వివాదం బయలుదేరుతోంది. గత ఆదివారం పోయెస్ గార్డెన్ వేదికగా, అక్క, తమ్ముడు కయ్యానికి కాలు దువ్వుకున్నారు. ఈ నేపథ్యంలో శనివారం దీప మీడియా ముందుకు వచ్చారు. అలాగే, దీపక్ మరో మీడియాతో ప్రత్యేకంగా మాట్లాడుతూ, ఆస్తులన్నీ తమదేనని, తామిద్దరికీ అన్ని హక్కులు అంటూ వ్యాఖ్యానించారు. అయితే, దీపక్ వ్యాఖ్యలు ఓ రకంగా సాగితే, దీప వ్యాఖ్యలు అందుకు భిన్నంగా ఉండటం గమనార్హం. గార్డెన్ను కైవసం చేసుకుంటా: టీ.నగర్లోని తన నివాసంలో దీప మీడియాతో మాట్లాడుతూ ఇక, ఎవర్నీవదలి పెట్టే ప్రసక్తే లేదని మాటల తూటాల్ని అందుకున్నారు. పోయేస్ గార్డెన్ను కైవశం చేసుకుంటానని, ఎవరు అడ్డు వచ్చినా, ఎదురించి చొరబడటమే లక్ష్యంగా పేర్కొన్నారు. ఆస్తుల కైవశం లక్ష్యంగా చట్ట నిపుణులతో చర్చిస్తున్నానని, చట్టపరంగా అన్నీ సొంతం చేసుకుంటానని ధీమా వ్యక్తంచేశారు. పోయేస్ గార్డెన్లో ఏదో జరుగుతోందన్న అనుమానం కల్గుతోందన్నారు. తాను వేద నిలయంలోకి వెళ్లిన సమయంలో ఎవ్వరూ లేరనీ, వివాదం సాగగానే, లోపలి నుంచి గుర్తుతెలియని వ్యక్తులు చొచ్చుకు రావడం అనుమానాలకు బలం చేకూరుస్తున్నాయని ఆరోపించారు. శశికళ ఫోటోను తాను బయటపడేయడానికి ప్రయత్నించిన సమయంలో ఆ వ్యక్తులు చొచ్చుకు వచ్చారని పేర్కొన్నారు. ప్రధాని నరేంద్ర మోదీ తనకు అపాయింట్మెంట్ ఇస్తారన్న ఆశాభావంతో ఉన్నట్టు తెలిపారు. ఆయన దృష్టికి అన్ని వివరాలను తీసుకెళ్తానని పోయేస్ గార్డెన్ ఇంటినే కాదు, పార్టీని కూడా దక్కించుకుంటానని దీప ధీమా వ్యక్తంచేశారు. మేనత్త స్థానాన్ని తన ద్వారా భర్తీ చేయడానికి అన్నాడీఎంకే కేడర్ ఎదురుచూస్తున్నదని, వారి అభీష్టం మేరకు రెండాకుల చిహ్నం రక్షిస్తానని, పార్టీలోకి అడుగుపెట్టి, మేనత్త స్థానాన్ని భర్తీ చేస్తానని వ్యాఖ్యానించారు. పదవులు ఉన్నంత వరకే సీఎం, మాజీ సీఎంల చుట్టూ కేడర్ ఉంటుందని, ఆ పదవులు దూరం కాగానే, తన వైపునకు నేతలు వచ్చి తీరుతారన్న ఆశాభావాన్ని వ్యక్తంచేశారు. ఎన్నికల కమిషన్ తనకు మరింత సమయాన్ని కేటాయిస్తూ మరో రెండు లక్షల అంశాలతో కూడిన ప్రమాణ పత్రం దాఖలుకు సిద్ధంగా ఉన్నట్టు తెలిపారు. జయ పేరవై తరహాలో అన్నాడీఎంకేకు అనుబంధంగా ఎంజీఆర్, అమ్మ, దీప పేరవై ఉంటుందని పేర్కొన్నారు. ఆస్తులన్నీ మావే ఓ మీడియాతో ప్రత్యేకంగా దీపక్ మాట్లాడుతూ తమ అవ్వ గతంలో మేనత్త పేరిట ఆస్తుల వీలునామా రాసినట్టు, అవన్నీ మేనత్త పేరుతోనే ఉన్నాయని వివరించారు. గతంలో రాసిన వీలునామా మేరకు, మేనత్త కోర్టుకు సమర్పించిన జాబితాలోని ఆస్తుల మేరకు ప్రస్తుతం తాను తన సోదరి మాత్రమే వారసులం అని వ్యాఖ్యానించారు. తమ ఇద్దరి మధ్య ఎలాంటి విబేధాలు లేవనీ, చిన్నత్త శశికళ ఫోటోను బయటకుపడేయడాన్ని తాను వ్యతిరేకించడంతో దీప ఆగ్రహించినట్టు తెలిపారు. అంతకు ముందు తామిద్దరం అక్కడే అల్పాహారం కూడా తీసుకున్నట్టు, అయితే, చిన్నత్త సెక్యూరిటీ అడ్డుకుంటే, తాను ఏం చేయగలనని ప్రశ్నించారు. తాను ఇప్పుడూ.. ఎప్పుడూ ఒక్కటే చెబుతానని, మేనత్తకు చెందిన అన్ని ఆస్తులకు తామిద్దరం మాత్రమే వారసులం అని, మరెవ్వరూ లేదని స్పష్టంచేశారు. కొన్ని ఆస్తులు వేరే వ్యక్తులు గుప్పెట్లో ఉన్నాయని, వారు తప్పుకుంటే మంచిదని హెచ్చరించారు. గార్డెన్లోని ఇంటికి తాను తరచూ వెళ్లి వస్తున్నాననీ.. అక్కడ ఎలాంటి అనుమానాస్పద విషయాలు, దాడులు తనకు ఎదురుకాలేదని స్పష్టంచేశారు. ఈ ఆస్తులన్నీ చిన్నత్త శశికళ కుటుంబీకుల చేతిలో ఉన్నట్టు సంకేతాలు ఉన్నాయని, దయచేసి వారుగా ముందుకు వచ్చి తమకు అప్పగించాలని కోరారు. -
జయలలిత ఆస్తులన్నీ మావే
► మేనత్త స్థానం నాతోనే భర్తీ : దీప ► ఆస్తులన్నీ మావే :దీపక్ చెన్నై : మేనత్త ఆస్తి కోసం మేనకోడలు, మేనల్లుడు పోటీ పడుతున్నారు. అత్తమ్మ ఆస్తులకు తామే అసలైన వారసులమంటూ ఎవరికి వారే ప్రకటించుకుంటున్నారు. దివంగత ముఖ్యమంత్రి జయలలిత ఆస్తుల కోసం ఆమె సోదరుడి సంతాపం అయిన దీపక్, దీపలు ఒకరిపై ఒకరు కయ్యానికి కాలు దువ్వుతున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో శనివారం టీ నగర్లోని తన నివాసంలో దీప మీడియాతో మాట్లాడుతూ ఇక ఎవర్నీ వదలిపెట్టే ప్రసక్తే లేదని మాటల తూటాల్ని సంధించారు. పొయస్ గార్డెన్ను కైవసం చేసుకుంటానని, ఎవరు అడ్డొచ్చినా ఎదిరించి చొరబడటమే లక్ష్యమని పేర్కొన్నారు. ఆస్తుల కైవసం లక్ష్యంగా చట్ట నిపుణులతో చర్చిస్తున్నానని, చట్టపరంగా అన్నీ సొంతం చేసుకుంటానని దీప ధీమా వ్యక్తం చేశారు. పొయస్ గార్డెన్లో ఏదో జరుగుతోందన్న అనుమానం వస్తోందన్నారు. తాను వేద నిలయంలోకి వెళ్లిన సమయంలో ఎవ్వరూ లేరని, శశికళ ఫోటోను తాను బయట పడేయడానికి ప్రయత్నించిన సమయంలో లోపలి నుంచి గుర్తు తెలియని వ్యక్తులు చొచ్చుకు రావడం అనుమానాలకు బలం చేకూరుస్తున్నదని అన్నారు. ప్రధాని మోదీ తనకు అపాయింట్మెంట్ ఇస్తారన్న ఆశాభావంతో ఉన్నానని, ఆయన దృష్టికి అన్ని వివరాలను తీసుకెళ్తానని, పొయస్ గార్డెన్నే కాదు పార్టీని కూడా దక్కించుకుంటానని దీప ధీమా వ్యక్తం చేశారు. మేనత్త స్థానాన్ని తన ద్వారా భర్తీ చేయడానికి అన్నాడీఎంకే కేడర్ ఎదురు చూస్తున్నదని, వారి అభీష్టం మేరకు రెండాకుల చిహ్నాన్ని రక్షిస్తానని చెప్పారు. పదవులు ఉన్నంత వరకే సీఎం, మాజీ సీఎంల చుట్టూ కేడర్ ఉంటుందని, ఆ పదవులు దూరం కాగానే తన వైపుకు నేతలు వచ్చి తీరుతారన్న ఆశాభావాన్ని వ్యక్తం చేశారు. జయ పేరవై తరహాలో అన్నాడిఎంకేకు అనుబంధంగా ఎంజీఆర్, అమ్మ, దీప పేరవై ఉంటుందన్నారు. ఆస్తులన్నీ మావే మరోవైపు జయ మేనల్లుడు దీపక్ మీడియాతో మాట్లాడుతూ తమ నానమ్మ గతంలో మేనత్త పేరిట ఆస్తుల వీలునామా రాసిందని, అవన్నీ అత్త జయలలిత పేరుతోనే ఉన్నాయని పేర్కొన్నారు. గతంలో రాసిన వీలునామా మేరకు మేనత్త కోర్టుకు సమర్పించిన జాబితాలోని ఆస్తులకు ప్రస్తుతం తాను,తన సోదరి మాత్రమే వారసులం అని వ్యాఖ్యానించారు. తమ ఇద్దరి మధ్య ఎలాంటి విబేధాలు లేవని, చిన్నత్త శశికళ ఫోటోను బయట పడేయడాన్ని తాను వ్యతిరేకించడంతో దీప ఆగ్రహించినట్టు తెలిపారు. అంతకుముందు తామిద్దరం అక్కడే అల్పాహారం కూడా తీసుకున్నట్టు, అయితే చిన్నత్త సెక్యూరిటీ అడ్డుకుంటే తాను ఏమి చేయగలనని ప్రశ్నించారు. తాను ఇప్పుడు, ఎప్పుడూ ఒక్కటే చెబుతానని, మేనత్తకు చెందిన అన్ని ఆస్తులకు తామిద్దరం మాత్రమే వారసులం అని, మరెవ్వరూ లేరని స్పష్టం చేశారు. కొన్ని ఆస్తులు వేరే వ్యక్తుల గుప్పెట్లో ఉన్నాయని, వారు తప్పుకుంటే మంచిదని హెచ్చరించారు. గార్డెన్లోని ఇంటికి తాను తరచూ వెళ్లి వస్తున్నట్టు, అక్కడ ఎలాంటి అనుమానాస్పద విషయాలు, దాడులు తనకు ఎదురు కాలేదని స్పష్టం చేశారు. తొలుత చిన్నమ్మ శశికళకు అనుకూలంగా వ్యవహరించిన దీపక్ తదుపరి పరిణామాలతో తన సోదరికి దగ్గరయ్యే విధంగా వ్యవహరించడం మొదలెట్టారు. -
బైక్ ఎక్కాలంటూ యువతికి వేధింపులు
సాక్షి, బెంగళూరు: మహిళల రక్షణ కోసం రాష్ట్ర హోంశాఖ బెంగళూరులో మూడు రోజుల క్రితం ప్రారంభించిన పింక్ హొయ్సళ కార్యాచరణ మొదలుపెట్టింది. బైకు ఎక్కాంలటూ వేధిస్తున్న యువకుడిని అరెస్ట్ చేసి అతని బారి నుంచి ఓ యువతిని రక్షించింది. సదరు ఆకతాయిని కటకటాల వెనక్కు నెట్టింది. నగరంలోని మైసూరురోడ్ టింబర్యార్డు ప్రాంతానికి చెందిన దీపక్, ప్రేమ కొద్ది సంవత్సరాలుగా ప్రేమించుకుంటున్నారు. ఇటీవల దీపక్ ప్రవర్తనలో తేడా రావడంతో దూరం పెట్టసాగింది. తనను నిర్లక్ష్యం చేస్తుందనే ఆక్రోశంతో దీపక్ ఆ యువతిని వేధించసాగాడు. ఈ క్రమంలో మంగళవారం మధ్యాహ్నం ప్రేమ కత్రిగుప్పె వాటర్ ట్యాంకర్ వద్ద ఉండగా అక్కడికి చేరుకున్న దీపక్.. బైక్పై ఎక్కి కూర్చోవాలంటూ వేధించడం ప్రారంభించాడు. స్థానికులు ఇచ్చిన సమాచారంతో పోలీసులు పింక్హొయ్సళ సిబ్బందిని అప్రమత్తం చేశారు. అక్కడికి చేరుకున్న సిబ్బంది దీపక్ను అదుపులోకి తీసుకుని స్థానిక పోలీస్స్టేషన్ లో అప్పగించగా అరెస్ట్ చేసి కటకటాల వెనక్కు పంపారు. ఇదిలా ఉండగా మంగళవారం రాత్రి వరకు 5,724 మంది సురక్షయాప్ను డౌన్లోడ్ చేసుకున్నట్లు పింక్ హొయ్సళ కమాండ్ సెంటర్ అధికారి తెలిపారు. -
డబ్యూటీఓలో భారత రాయబారి దీపక్
న్యూఢిల్లీ: ప్రపంచ వాణిజ్య సంస్థ(డబ్ల్యూటీఓ–వరల్డ్ ట్రేడ్ ఆర్గనైజేషన్)లో భారత రాయబారి(భారత శాశ్వత ప్రతినిధి)గా టెలికం కార్యదర్శి జె.ఎస్. దీపక్ నియమితులయ్యారు. 1982 బ్యాచ్ ఐఏఎస్ అధికారి అయిన దీపక్ ఉత్తరప్రదేశ్కు చెందినవారు. 2010లో స్పెక్ట్రమ్ ఈ–వేలం ద్వారా ప్రభుత్వానికి రూ.1.06 లక్షల కోట్లు విజయవంతంగా రావడానికి ఈయనే ముఖ్య కారణం. ఐఐఎం, అహ్మదాబాద్లో ఎంబీఏ చదివిన దీపక్ వాషింగ్టన్ డీసీకి చెందిన పాలసీ ప్రాజెక్ట్కు కన్సల్టెంట్గా పనిచేశారు. -
లాఠీ పట్టనున్న సిమ్రాన్..!
జస్ట్ టెన్ ఇయర్స్ వెనక్కి వెళితే... అప్పుడు సిల్వర్ స్క్రీన్పై సందడి చేసిన తారల్లో సిమ్రాన్ గుర్తుకు మానరు. అటు నార్త్, ఇటు సౌత్లో కలిపి ఇప్పటివరకూ ఆమె కథానాయికగా చేసిన చిత్రాలు 70పైనే ఉంటాయి. అతిథి పాత్రలతో కలుపుకుంటే దాదాపు 85 సినిమాలుంటాయి. ఈ 85 సినిమాల్లో 18 సినిమాల్లో సిమ్రాన్ గెస్ట్ రోల్స్ చేశారు. 2003లో దీపక్ని పెళ్లి చేసుకున్నాక స్లో అయ్యారామె. ఆ తర్వాత రెండు మూడు సినిమాల్లో నాయికగా చేసినా అవి అంతగా క్లిక్ కాలేదు. అందుకే మనసుకు నచ్చిన గెస్ట్ రోల్స్కి గ్రీన్ సిగ్నల్ ఇస్తూ వస్తున్నారు. ఆ విధంగా గడచిన నాలుగేళ్లల్లో తమిళంలో ఆమె నాలుగు గెస్ట్ రోల్స్ చేశారు. ఇప్పుడు ఐదో గెస్ట్ రోల్కి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. ‘రోజా’ ఫేం అరవింద్ స్వామి హీరోగా తెరకెక్కనున్న ఈ సినిమాలో సిమ్రాన్ పోలీస్ గెటప్లో కనిపించనున్నారు. సిమ్రాన్ పోలీస్ పాత్ర చేయడం ఈ చిత్రానికి ఎక్స్ట్రా మైలేజ్ ఇస్తుందని చిత్రబృందం అంటోంది. ఇది పవర్ఫుల్ పోలీసాఫీసర్ పాత్ర అట. మేజిక్ బాక్స్ ప్రొడక్షన్ హౌస్ పతాకంపై రూపొందనున్న ఈ చిత్రానికి సెల్వా దర్శకత్వం వహించనున్నారు. రితిక హీరోయిన్గా ఎంపికైంది. టైటిల్ ఇంకా ఖరారు చేయలేదు. ఆ సంగతలా ఉంచితే.. ఎప్పటి నుంచో నిర్మాతగా మారాలని సిమ్రాన్ అనుకుంటున్నారు. ఈ ఏడాది ఆ కలను నెరవేర్చుకోవాలనుకుంటున్నారట. -
చర్లపల్లి జైలులో ఖైదీ ఆత్మహత్య
హైదరాబాద్: చర్లపల్లి జైలులో ఓ రిమాండ్ ఖైదీ బలవన్మరణం చెందాడు. దొంగతనం నేరంపై అరువు దీపక్ అనే నిందితుడు ఫిబ్రవరి నుంచి జైలులో ఉన్నాడు. అతడు శనివారం ఉదయం తన సెల్లోని ఫ్యాన్కు టవల్తో ఉరి వేసుకున్నాడు. కొద్దిసేపటి తర్వాత జైలు సిబ్బంది అతడిని గమనించి, కిందికి దించేసరికే అతను మృతి చెందాడు. మృతదేహాన్ని గాంధీ ఆస్పత్రికి తరలించారు. -
సిమెంట్ కర్మాగారంలో ప్రమాదం..ఇద్దరి మృతి
తాండూరు మండలం మల్కాపూర్ సమీపంలోని ఇండియా సిమెంట్స్ కర్మాగారంలో సోమవారం రాత్రి ప్రమాదం జరిగింది. కర్మాగారంలో నిద్రిస్తున్న ముగ్గురు కార్మికులను గమనించని జేసీబీ డ్రైవర్ వారిపై నుంచి పోనివ్వడంతో ఈ ప్రమాదం చోటుచేసుకుంది. ఈ ఘటనలో దీపక్, సంజయ్ అనే ఇద్దరు అక్కడికక్కడే మృతిచెందగా. తిలక్ అనే మరో వ్యక్తికి తీవ్రగాయాలయ్యాయి. క్షతగాత్రుడిని చికిత్స నిమిత్తం దగ్గరలోని ఓ ప్రైవేటు ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. -
భర్తను విలన్గా మార్చిన సిమ్రాన్
ఒక నాటి మేటి నటి సిమ్రాన్. పెళ్లికి ముందు ఇటు కోలీవుడ్లోనూ అటు టాలీవుడ్లోనూ నాయకిగా ఇరగదీశారు.చాలా మంది ప్రముఖ హీరోయిన్లు వివాహానంతరం నటనకు కొంత గ్యాప్ ఇచ్చి కొంత కాలం తరువాత రీఎంట్రీ అయ్యి వివిధ రకాల పాత్రలతో బిజీ అవుతుండడం చూస్తున్నాం. నటి జ్యోతిక లాంటి కొందరు రీఎంట్రీలోనూ మంచి పాత్రలను ఎంపిక చేసుకుని కథానాయకిగానే కొనసాగుతున్నారు. నటి సిమ్రాన్ కూడా దీపక్ను పెళ్లి చేసుకుని కొంత కాలం తరువాత నటనకు తిరిగొచ్చారు. అలా ఆహా కల్యాణం, త్రిషా ఇల్లన్న నయనతార, కరైయోరం లాంటి చిత్రాల్లో క్యారెక్టర్ ఆర్టిస్ట్గా నటించినా, పెద్దగా రాణించలేకపోయారు. అవకాశాలు కూడా అంతగా లేవనే చెప్పక తప్పదు. మధ్యలో సొంత చిత్ర నిర్మాణం, బుల్లి తెర సీరియళ్ల నిర్మాణాల ప్రయత్నాలు చేశారు. అయితే కారణాలేమైనా అవి కార్యరూపం దాల్చలేదు. ఇక తన భర్తను హీరోగా పరిచయం చేయాలన్న కోరిక ఫలించలేదు. ఇతర ప్రముఖ కథానాయకుల చిత్రాల్లో అవకాశాల కోసం ప్రయత్నించినా అవీ జరగలేదు. ఇలా హీరో అవకాశాల కోసం ఎదురు చూస్తూ కూర్చుంటే పుణ్యకాలం గడిచి పోతుందని భావించేరో ఏమో, ఇప్పుడు తన భర్త దీపక్ను విలన్గా మార్చేశారు. అవును ఓడు రాజా ఓడు చిత్రంలో దీపక్ విలన్గా నటిస్తున్నారు. జోకర్ గురుసోమసుందర్ ప్రధాన పాత్ర పోషిస్తున్న ఈ చిత్రంలో నాజర్,చారుహాసన్ ముఖ్య పాత్రల్లో నటిస్తున్నారు. నిశాంత్ రవీంద్రన్, జతిన్ శకర్రాజా ద్వయం దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రం నిర్మాణంలో ఉంది. ఇది పూర్తి వినోదభరిత కథా చిత్రం అని యూనిట్ వర్గాలు చెబుతున్నారు. -
అల్లరే నటుడ్ని చేసింది
‘మిణుగురులు’ నా జీవితంలో స్పెషల్ ‘లెజెండ్’తో మరింత గుర్తింపు ‘లవ్ కె రన్’తో హీరోగా ప్రమోషన్ బాల నటుడిగా 42 చిత్రాలు ఇదీ విశాఖ కుర్రోడు దీపక్ సరోజ్ సినీ ప్రొఫైల్ విశాఖపట్నం : దీపక్.. ఈ పేరు ఎందుకు పెట్టారో తెలియదు కానీ, వెండితెరపై ఆ కుర్రాడు దేదీప్యమానంగా వెలిగిపోతున్నాడు. చిన్నప్పుడు ఎవరైనా అల్లరి చేయడం సహజం. కానీ ఆ పిల్లాడి అల్లరిని తట్టుకోవడం మాత్రం తల్లిదండ్రులకు చాలా కష్టంగా మారింది. కానీ వారికి అప్పుడు తెలియదు..తమ పిల్లాడిలో ఉన్నది అల్లరి కాదు ‘హైపర్ యాక్టివ్’అని. (ఇటీవల ఓ చిత్రంలో ఇదే అంశాన్ని ప్రధానంగా ప్రస్తావించారు). అయితే అతని ఇష్టాన్ని గుర్తించగలిగారు. డాన్స్మాస్టర్ శివకుమార్ వద్ద చేర్పించారు. అల్లరి చేసే సమయం ఇవ్వకుండా స్మిమ్మింగ్, స్కేటింగ్, క్యాషియో వంటివి నేర్పించే వారు. అలా తెలియకుండానే వినోద సంబంధిత రంగాలతో ఆ పిల్లాడు మమేకమైపోయాడు. వాటికి అలవాటు పడి, ఇష్టంగా మార్చుకున్నాడు. తన డాన్స్ పెర్ఫార్మెన్స్తో బహుమతులు అందుకోవడం ప్రారంభించాడు. అప్పటికి అతని వయసు కేవలం ఐదేళ్లు. ఆ తర్వాత ప్రముఖ నటనా శిక్షకుడు సత్యానంద్ వద్దకు చేరడంతో దీపక్ జీవితం పూర్తిగా మారిపోయింది. బాల నటుడిగా సినీ రంగంలో అడుగుపెట్టేలా చేసింది. మిణుగురులు అనే చిత్రంతో ఆస్కార్ నామినేషన్ వరకూ వెళ్లి అంతర్జాతీయ గుర్తింపు తెచ్చుకున్నాడు. ఇప్పటి వరకూ దాదాపు 42 చిత్రాల్లో బాల నటుడిగా తానేంటో నిరూపించుకున్న దీపక్ తాజాగా లవ్ కె రన్ చిత్రంతో హీరో అయ్యాడు. ఈ సందర్భంగా హీరో దీపక్ సరోజ్తో ‘సాక్షి’ ప్రత్యేక ఇంటర్వ్యూ. సాక్షి: బాలనటుడిగా ఇప్పటి వరకూ చాలా చిత్రాల్లో నటించారు. ఎలా మొదలైంది మీ ప్రస్థానం. దీపక్ : సినిమాల్లోకి రావాలని అసలు అనుకోలేదు. చిన్నప్పుడు నా అల్లరి భరించలేక అమ్మా, నాన్న నాకు డ్యాన్స్ నేర్పించారు. ఐదేళ్ల వయసులో సత్యానంద్ మాస్టర్ దగ్గర నటనలో శిక్షణ ఇప్పించారు. అప్పట్లో ఓ టీవీ చానల్లో డుండుం డిగాడిగా అనే డాన్స్ ప్రోగ్రాం వచ్చేది. దానిలో స్టేట్ ఫస్ట్ వచ్చాను. ఆ తర్వాత జగపతిబాబు హీరోగా పెదబాబు చిత్రం మొదలుపెడుతున్నప్పుడు ఆయన చిన్నప్పటి పాత్రకు నన్ను ఎంపిక చేశారు. ఆ వెంటనే ఆర్య చిత్రంలో అవకాశం వచ్చింది. ప్రారంభంలోనే పెద్ద చిత్రాల్లో అడుగుపెట్టడంతో అక్కడి నుంచి వరుసగా ఆఫర్లు వచ్చాయి. అలా ఇప్పటికి 42 చిత్రాల్లో నటించాను. సాక్షి: వాటిలో ప్రత్యేకంగా చెప్పుకోవాల్సి వస్తే.. దీపక్ : అతడు, భద్ర, పౌర్ణమి, అసాధ్యుడు, డాన్, సోగ్గాడు, ఆంధ్రుడు, బావ, వంటి చాలా చిత్రాలతో మంచి గుర్తింపు వచ్చింది. నా జీవితంలో ‘మిణుగురులు’ చిత్రాన్ని ఎప్పటికీ మర్చిపోలేను. ఆ చిత్రానికి సెలక్షన్లకు వెళ్లినపుడు కళ్లు కనిపించని పిల్లాడ్ని ఇంటికి వచ్చిన వ్యక్తి అవమానిస్తే ఎలా స్పందిస్తాడో చేసి చూపించమని అయోధ్య కుమార్ కృష్ణంశెట్టి చెప్పినపుడు పది నిమిషాలు సమయం ఇవ్వండి పాత్ర ను ఇమాజిన్ చేసుకుని చేస్తానన్నాను. ఆ మాటే ఆయనకు నచ్చిందని 15 రోజుల తర్వాత యు ఆర్ సెలెక్ట్టెడ్ అని చెబుతూ అన్నారు. 800 మంది ఉన్న పోటీలో నేను సెలెక్ట్ కావడం ఇప్పటికీ ఆశ్చర్యమే. మిణుగురులు కోసం 40 కిలోల బరువు సహజంగా తగ్గాను. ఆ కష్టం ఆస్కార్ వరకూ వెళ్లినపుడు మర్చిపోయాను. ఆ చిత్రం తర్వాత మళ్లీ పూర్తి భిన్నమైన ఛాలెంజింగ్ రోల్ ‘లెజెండ్’లో దొరికింది. బాలయ్య చిన్నప్పటి పాత్ర అది. తర్వాత రాజేంద్రప్రసాద్తో టామీ చిత్రంలో నటించి కొంత గ్యాప్ తీసుకుని ఇప్పుడు హీరోగా ప్రేక్షకుల ముందుకు వచ్చాను. సాక్షి: చిన్నప్పుడే సినిమా ఇండస్ట్రీకి వెళ్లిపోయారు. దాని ప్రభావం చదువుపై పడలేదా? దీపక్ : లేదు..నేను మొదట్నుంచీ బాగా చదువుతాను. టెన్త్లో 95 పర్సంట్ మార్క్స్ వచ్చాయి. చెన్నై ఎస్ఆర్ఎంలో ఇటీవలే బీబీఎం పూర్తి చేశాను. ఎంబీఏ చేయడానికి సిద్ధమవుతున్నాను. నిజానికి నటనా రంగం నాకు గిఫ్ట్గా దొరికింది. నాకు నేనుగా నేర్చుకున్నది క్రికెట్. అదంటే చాలా ఇష్టం. ఓ రోజు లెజెండ్ సినిమా సెట్లో బాల కృష్ణను అవుట్ చేసి ‘వీడు ఫర్ఫెక్ట్’ అనిపించుకున్నాను. జిల్లా స్థాయి క్రికెట్ పోటీల్లో కూడా పాల్గొన్నాను. సీసీఎల్కు ఆడే అవకాశం ఉంది. సాక్షి: ఇండస్ట్రీలో ఎవరంటే ఇష్టం దీపక్ : ఒక్కరని చెప్పడం కష్టం. ప్రతి ఒక్కరిలోనూ ఏదో ఒక టాలెంట్ ఉంటుంది. అయితే వ్యక్తి గతంగా చిరంజీవి అంటే పిచ్చి. ఇప్పటి హీరోల్లో అందరూ ఇష్టమే. రామానాయుడు వంటి పెద్దవాళ్లు నువ్ పెద్దవాడివి ఎప్పుడవుతావురా హీరోని చేద్దాం అనేవారు. విశ్వనాథ్ వంటి గొప్పవారు నా నటనను మెచ్చుకునేవారు. టామీ చిత్రం చూసి ఎమ్మెస్ నారాయణ పిలిచి అభినందించారు. సాక్షి: భవిష్యత్ను ఎలా ప్లాన్ చేసుకుంటున్నారు దీపక్ : హీరోగా కంటే నటుడిగా అందరికీ గుర్తుండాలనుకుంటాను.ప్రయోగాలు చేయడం ఇష్టం. కమల్హాసన్, నసీరుద్దీన్షా,విక్రమ్, కోటా శ్రీనివాసరావు, ప్రకాష్రాజ్ వంటి వాళ్ల నటనను చూసి నేర్చుకుంటుంటాను. ‘లవ్ కె రన్’ కూడా మంచి కథ. ఈ చ్రితంలో మళయాల హీరోయిన్ మాళవిక మీనన్ నాకు జతగా చేసింది. ఇక ముందు చేయబోయే ప్రాజెక్టులపై మరింత శ్రద్ధ అవసరం. చదువుకు కూడా ఎక్కువ ప్రాధాన్యతనిస్తూ మంచి అవకాశం కోసం ఎదురు చూడాలనుకుంటున్నాను. -
పరువు హత్య కేసులో ప్రియుడు, తల్లి అరెస్ట్
-
పరువు హత్య కేసులో ప్రియుడు, తల్లి అరెస్ట్
మృతురాలి ప్రియుడిపై పోక్సో చట్టం కింద కేసు నమోదు సాక్షి, విజయవాడ : విజయవాడలో జరిగిన పరు వు హత్య కేసులో మృతురాలు నజ్మా ప్రియుడు దీపక్ను, హత్య చేసిన తల్లి బీబీజానీని పోలీసు లు శుక్రవారం అరెస్టు చేశారు. తన కుమార్తెను లైంగికంగా ఇబ్బందిపెట్టాడని, ఇద్దరూ తీయిం చుకున్న ఫోటోలతో బ్లాక్ మెయిల్ చేసి పెళ్లికాకుండా చేస్తానని బ్లాక్మెయిల్ చేశాడని నజ్మా తండ్రి మైసూర్ జాన్ ఇచ్చిన ఫిర్యాదుతో దీపక్ను పోక్సో చట్టం కింద అరెస్టు చేశారు. దీపక్ కాల్డేటాను పరిశీలించి ఫోన్ను స్వాధీనం చేసుకున్నారు. హత్య చేసిన నజ్మా తల్లి బీబీజానీని కూడా అరెస్టు చేశారు. ఈ కేసులో సీఐ సహేరా బేగం నిర్వహించిన విచారణలో పలు వాస్తవాలు వెలుగుచూశాయి. నజ్మా కుటుంబం మూడునెలలుగా వాంబే కాలనీలో ఉంటోంది. ఎంబీయే చదివి భార్య నుంచి విడాకులు తీసుకున్న దీపక్ అదే కాలనీలో తన సోదరి ఇంట్లో ఉంటున్నాడు. రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తున్న దీపక్ రెండు నెలలుగా నజ్మాతో ప్రేమాయణం సాగిస్తున్నాడు. ఈ వ్యవహారంపై మందలించినా నజ్మా వినకపోవడంతో తల్లి బీబీజాని ఆమెను చంపేసింది. మైనర్ కావటంతోనే పోక్సో చట్టం 17ఏళ్ల బాలిక నజ్మాను ప్రేమపేరుతో వేధించాడని, పరోక్షంగా ఆమె మరణానికి కారకుడయ్యాడనే ఆరోపణలతో ప్రొటెక్షన్ ఆఫ్ చిల్డ్రన్ ఫ్రం సెక్స్యువల్ అఫెన్సెస్ యాక్ట్ -2012 (పోక్సో చట్టం), కిడ్నాప్ తదితర కేసులను పోలీసులు దీపక్పై నమోదు చేసి అరెస్ట్ చేశారు. పోక్సో చట్టం ప్రకారం.. బాలిక ఇష్టపూర్వకంగా ప్రియుడితో బయటకు వెళ్లినా అతడిదే నేరం అవుతుంది. బాలికల్ని ప్రేమించటం నేరం. -
పరువు కోసం పేగుబంధాన్ని తెంచుకుంది!
ప్రేమలో పడిందని కూతుర్ని కడతేర్చిన తల్లి * విజయవాడలో దారుణం వీరులపాడు: పేగుబంధం విలువ.. నవమాసాలు మోసిన తల్లికి మాత్రమే తెలుస్తుందంటారు. కానీ ఓ కన్నతల్లి పరువు కోసం కూతురి ఉసురు తీసింది. పెళ్లయి ఓ పాప కూడా ఉన్న వ్యక్తి ప్రేమలో పడిందంటూ కుమార్తెను కడతేర్చింది. పోలీసులు తెలిపిన వివరాలు.. కృష్ణాజిల్లా వీరులపాడు మండలం జుజ్జూరుకు చెందిన మైసూర్ జానీకి 20 ఏళ్ల కిందట బీబీజానీతో వివాహమైంది. వీరికి ఇద్దరు కుమార్తెలు. విజయవాడ వాంబే కాలనీలో నివాసముంటున్నారు. చిన్న కుమార్తె నజ్మా(16) నగరంలోని ఓ ఫర్నిచర్ దుకాణంలో పనిచేస్తోంది. ఆమె వారు నివాసముంటున్న అపార్ట్మెంట్ పైఅంతస్తులో ఉండే దీపక్ అనే వివాహితుడితో ప్రేమలో పడింది. ఈ విషయం తల్లికి తెలియడంతో నజ్మాను మందలించింది. అయినా వినకపోవడంతో బుధవారం నిద్రపోతున్న కుమార్తెను హతమార్చింది. కాగా, నజ్మా మృతిపై దీపక్ ఫిర్యాదు చేయడంతో విజయవాడ నున్న పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. జుజ్జూరులో కూతురి మృతదేహానికి దహన సంస్కారాలు నిర్వహించడానికి సిద్ధమవుతున్న తల్లిదండ్రులను విచారించారు. మృతదేహాన్ని స్వాధీనం చేసుకొని విజయవాడ ప్రభుత్వాసుపత్రిలో పోస్టుమార్టం నిర్వహించారు. అనంతరం అదేరోజు రాత్రి కుటుంబసభ్యులకు అందజేయడంతో వారు కూతురి అంత్యక్రియలు నిర్వహించారు. చెప్పినా వినలేదని.. బీబీజానీ గురువారం జుజ్జూరులో విలేకరులతో మాట్లాడింది. వివాహితుడైన దీపక్తో నజ్మా ప్రేమలో పడిందని తెలిసి మందలించానని చెప్పింది. తన కూతురి జీవితం నాశనం చేయొద్దని దీపక్ను వేడుకున్నానంది. కానీ అతను వినకపోగా నజ్మాతో తన పెళ్లి జరిపించాలని, లేకుంటే తామిద్దరం దిగిన ఫొటోలను నెట్లో పెడతానని బెదిరించాడని తెలిపింది. దీంతో బుధవారం మధ్యాహ్నం దీపక్తో కలసి ద్విచక్రవాహనంపై వచ్చిన నజ్మాను మరోసారి మందలించగా తనను ఇష్టమొచ్చినట్లు తిట్టిందని చెప్పింది. కుటుంబ పరువు పోతుందన్నా వినలేదనే ఆక్రోశంతో నిద్రపోతున్న కూతురి మొహంపై దిండును అదిమి ఊపిరాడకుండా చేసి చంపేసినట్లు చెబుతూ కన్నీటిపర్యంతమైంది. కన్న కూతురిని కడతేర్చినట్లు బీబీ జానీ స్వయంగా ఒప్పుకోవడంతో పోలీసులు ఆమెను అదుపులోకి తీసుకున్నారు. -
కుక్కర్ పేలి నలుగురు విద్యార్థులకు తీవ్ర గాయాలు
అంగన్వాడి కేంద్రంలో కుక్కర్ పేలి నలుగురు విద్యార్థులు గాయపడిన ఘటన బుధవారం డాబాగార్డెన్స్లో చోటుచేసుకుంది. వివరాలు.. నగరంలోని 21వ వార్డులో ఉన్న అంగన్వాడి కేంద్రంలో అన్నం వండుతుండగా ప్రమాదవశాత్తు కుక్కర్పేలి మురళీకృష్ణ (4) , దీపక్ (4), మరో ఇద్దరు విద్యార్థులు తీవ్రంగా గాయపడ్డారు. చికిత్స నిమిత్తం వీరిని కింగ్ జార్జ్ ఆసుపత్రికు తరలించారు. -
దిగంబర పూజలు చేస్తున్నాడు: భార్య ఫిర్యాదు
బయటపెట్టిన రెండో భార్య టీ.నగర్: వైద్య కళాశాల ప్రిన్సిపల్ కావాలని కోరుతూ ఇంటిలో నగ్న పూజలు నిర్వహించిన ప్రొఫెసర్ వింత వైఖరి వెలుగులోకి వచ్చింది. ధర్మపురి ప్రభుత్వ వైద్య కళాశాలలో ప్రొఫెసర్గా పని చేస్తున్నారు దీపక్. ఈయన మొదటి భార్య మృతి చెందడంతో సేలం జిల్లా ఆడయాంపట్టికి చెందిన మరొక యువతిని రెండో వివాహం చేసుకున్నారు. ఈమె కూడా ఇది వరకే వివాహమై భర్తను కోల్పోయింది. ఈ క్రమంలో నగ్న పూజలో పాల్గొనాలనిభర్త తనను చిత్రహింసలకు గురి చేస్తున్నట్టు ఆరోపిస్తూ ఓమలూరు ప్రభుత్వ ఆసుపత్రిలో చేరింది. దీని గురించి ఆమె మాట్లాడుతూ తమ వివాహానంతరం తరచూ పూజలు చేయాలని భర్త బయటికి వెళ్లి వస్తుండేవాడని ఆరంభంలో దీనిని తాను పెద్దగా పట్టించుకోలేదన్నారు. కాలక్రమంలో ఇంటిలోనే నగ్నంగా కూర్చొని పూజలు ప్రారంభించారన్నారు. తాను ఇటువంటి పూజలు చేయడం సరికాదని అనేక సార్లు తెలిపినప్పటికీ అతను పట్టించుకోవడం లేదని తనను దిగంబర పూజల్లో పాల్గొనాల్సిందిగా ఒత్తిడి తెచ్చేవాడని తెలిపింది. దీంతో తమ మధ్య తరచుగా తగాదాలు జరిగేవన్నారు. దాంతో తాను తరచూ పుట్టింటికి వచ్చేదాన్నని, ఈ క్రమంలో తనకు విడాకుల నోటీసు పంపారన్నారు. దిగ్భ్రాంతి చెందిన తాను కుటుంబసభ్యులతో ధర్మపురికి వెళ్లానని ఆ సమయంలో కూడా అతను నగ్న పూజల్లో పాల్గొనడం ఆందోళన కలిగించిందన్నారు. అదే సమయంలో దీని గురించి నిలదీయగా తనపై దాడి చేశాడని దీంతో చికిత్సలు పొందుతున్నట్లు తెలిపారు. తన భర్త దిగంబర పూజ చేస్తున్న సమయంలో తీసిన ఫొటోలను ఆమె విడుదల చేసింది. -
ప్రేమకు వందనం
ప్రేమలో మూడో కోణాన్ని ఆవిష్కరిస్తూ అందమైన ప్రేమకథగా రూపొందిన చిత్రం ‘వందనం’. దీపక్, మాళవికా మీనన్ జంటగా కోటపాటి శ్రీను దర్శకత్వంలో కందిమల్ల చంద్రశేఖర్ ఈ చిత్రాన్ని నిర్మించారు. దర్శకుడు మాట్లాడుతూ- ‘‘ప్రేమించుకుని పెళ్లి చేసుకునేది ఒక కోణమైతే, ప్రేమించుకుని విడిపోయి, పెద్దలు కుదిర్చిన పెళ్లి చేసుకోవడం రెండో కోణం. మరి మూడో కోణం ఏంటనేది ఆసక్తికరంగా తెరకెక్కించాం’’ అని చెప్పారు. ‘‘అక్టోబరు 10న పాటలను, నవంబరు మొదటి వారంలో చిత్రాన్ని విడుదల చేయనున్నాం’’ అని నిర్మాత తెలిపారు. ఈ చిత్రానికి సంగీతం: జె.పి, కెమెరా: సూర్య, సమర్పణ: కందిమల్ల పద్మావతి. -
మంత్రి విమర్శల ‘బార్’
బార్ను ప్రారంభించిన మంత్రి శిందే - తీవ్రంగా విమర్శించిన విపక్షాలు - రాజీనామా చేయాలని పట్టబట్టిన కాంగ్రెస్ - బార్ కాదు..రెస్టారెంట్ ప్రారంభించాన్న మంత్రి ముంబై: అహ్మద్ నగర్లో ఓ బార్ ప్రారంభోత్సవంలో పాల్గొన్న రాష్ట్ర హోంశాఖ సహాయ మంత్రి రామ్శిందే తీవ్ర విమర్శల పాలయ్యారు. అహ్మద్నగర్ - పుణే రహదారిపై సుపా టోల్నాకా సమీపంలో బార్ ప్రారంభోత్సం జరిగింది. కార్యక్రమంలో ఆర్థిక శాఖ సహాయక మంత్రి దీపక్ కేసర్కర్, ఎమ్మెల్యే సుధీర్ తాంబే తదితర నాయకులు కూడా పాల్గొన్నారు. ఈ విషయమై కాంగ్రెస్ అధికార ప్రతినిధి సచిన్ సావంత్ మాట్లాడుతూ.. రాష్ట్ర మంత్రి బార్ను ప్రారంభించడం దురదృష్టకరమన్నారు. కార్యక్రమం చట్ట విరుద్ధం కాకపోయినప్పటికీ ఓ మంత్రి బార్ను ప్రారంభించడం సరికాదని ఎన్సీపీ అధికార ప్రతినిధి నవాబ్ మాలిక్ అన్నారు. మద్యం ప్రకటనలపై నిషేధం ఉందని, మంత్రులు ఇలాంటి కార్యక్రమాలకు హాజరైతే మద్యానికి ప్రకటన ఇవ్వడం లాంటిదే అని ఆయన చెప్పారు. మరోవైపు శిందే మాట్లాడుతూ.. అవసరమైన అన్ని అనుమతులు బార్ పొందిదన్నారు. హోటల్ రాయరీ పార్క్ వద్ద కీర్తీ ఫ్యామిలి రెస్టారెంట్ను ప్రారంభించానని, అదేమీ చట్ట విరుద్ధం కాదన్నారు. బీర్ బార్ తాను ప్రారంభించిన రెస్టారెంట్ రాయ్రీ పార్క్ యజమానిదే అని తెలిపారు. బార్ ప్రారంభానికి వెళ్లలేదు: దీపక్ బార్ ప్రారంభించిన మంత్రి రామ్ శిందేపై ప్రతిపక్షాలతోపాటు సొంతపార్టీకి చెందిన నాయకులు కూడా విమర్శలు గుప్పిస్తున్నారు. శిందే ప్రారంభోత్సవానికి వెళ్లకుండా ఉండాల్సిందని రెవిన్యూ శాఖమంత్రి ఏక్నాథ్ ఖడ్సే అన్నారు. మరోవైపు రామ్ శిందే రాజీనామా చేయాలని కాంగ్రెస్ డిమాండ్ చేసింది. ఇది ఇలా ఉండగా ఇదే ప్రారంభోత్సవం పాల్గొన్న ఆర్థిక శాఖ సహాయక మంత్రి దీపక్ కేసర్కర్ ఈ విషయంపై స్పందించారు. తాను బీర్ బార్ ప్రారంభోత్సవానికి వెళ్లలేదని.. ఫ్యామిలి రెస్టారెంట్ ప్రారంభోత్సవమని వెళ్లానన్నారు. మద్య నిషేధం జరిగిన మూడో జిల్లా విదర్భలోని చంద్రపూర్ జిల్లాలో మద్యం నిషేధించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే. అనంతరం రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల్లో కూడా మద్యాన్ని నిషేధించాలనే డిమాండ్లు వెల్లువెత్తాయి. ఈ నేపథ్యంలో ఈ బీర్ బార్, పర్మిట్ రూమ్ను ఇద్దరు సహాయక మంత్రులు ప్రారంభించడం సర్వత్రా చర్చనీయాంశమైంది. కాగా, విదర్భలో వార్దా, గడ్చిరోలి తర్వాత మద్య నిషేధం జరిగిన మూడో జిల్లా చంద్రాపూర్. -
సేవ్ లవ్..!
ప్రేమించుకుని పెళ్లి చేసుకునేవాళ్లు ఒక తరహా అయితే, పెద్దలు ఒప్పుకోలేదని విడిపోయే ప్రేమికులు మరో తరహా. ఈ నేపథ్యంలో రూపొందుతోన్న చిత్రం ‘వందనం’. దీపక్, మాళవికా మీనన్ జంటగా కందిమల్ల మూవీమేకర్స్ పతాకంపై కందిమల్ల చంద్రశేఖర్ నిర్మిస్తున్న ఈ చిత్రానికి కోటపాటి శ్రీను దర్శకుడు. ఈ సినిమా చిత్రీకరణ పూర్తిచేసుకుంది. దర్శకనిర్మాతలు మాట్లాడుతూ -‘‘వైజాగ్, హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో చిత్రీకరణ జరిపాం. ‘సేవ్ లవ్’ అనే నినాదం చుట్టూ ఈ కథాంశం తిరుగుతుంది. ఈ నెలాఖరులో పాటలను, జూన్లో ఈ చిత్రాన్ని విడుదల చేస్తాం’’ అని చెప్పారు. ఈ చిత్రానికి మాటలు: స్వర్ణ సుధాకర్, సమర్పణ: కందిమల్ల పద్మావతి. -
డాక్టర్ కిడ్నాప్ కేసులో మరొకరి అరెస్ట్
భీమారం : హన్మకొండలోని అదాలత్ ప్రాం తంలో జరిగిన పిల్లల డాక్టర్ సురేందర్రెడ్డి కిడ్నాప్ కేసులో మరో నిందితుడిని పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ వ్యవహారంలో కిడ్నాపర్లు 40 నిమిషాల్లోనే రూ.21 లక్షలు డిమాండ్ చేసి రాబట్టుకున్నారు. ఈ ఘటనలో హన్మకొండకు చెందిన ఉతకం దీపక్, గోకుల్నగర్కు చెందిన కొడారి రాజు, కాజీపేటకు చెందిన నాగెల్లి సంతోష్, వర్ధన్నపేటకు చెందిన వడ్లకొండ హరీన్ పాల్గొనగా వీరిలో దీపక్, సంతోష్ను ఇటీవల అరెస్ట్ చేసి, జైలుకు పంపిన విషయం తెలిసిందే. పరారీలో ఉన్న హరీన్, కొడారి రాజు కోసం గాలిస్తుండగా హరీన్ సోమవారం పోలీసులకు చిక్కాడు. అతడి వద్ద సుమారు రూ.1.20 లక్షలు స్వాధీనం చేసుకున్నారు. అతడు ప్రస్తుతం ఉతకం దీపక్కు కారు డ్రైవర్గా పనిచేస్తున్నాడని హన్మకొండ డీఎస్పీ దక్షిణామూర్తి చెప్పారు. ఈ కేసులో మరో నిం దితుడు కొడారి రాజు పరారీలో ఉన్నట్లు ఆయ న తెలిపారు. అతడి కోసం ప్రత్యేక బృందాలతో గాలిస్తున్నట్లు వివరించారు. వ్యక్తిగత అవసరాల కోసమే డాక్టర్ను కిడ్నాప్ చేశారని తమ విచారణలో వెల్లడైనట్లు ఆయన వెల్లడిం చారు. విలేకరుల సమావేశంలో సీఐ దేవేందర్రెడ్డి, కానిస్టేబుల్ శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. -
నగ్నంగా తిరుగుతూ విద్యార్థినులకు వేధింపులు
హైదరాబాద్ : నగ్నంగా తిరుగుతూ పాఠశాల విద్యార్థులతో అసభ్యంగా ప్రవర్తిస్తున్న యువకుడిని బంజారాహిల్స్ పోలీసులు అరెస్ట్ చేశారు. పోలీసులు కథనం ప్రకారం... బంజారాహిల్స్ రోడ్ నెం.7లోని ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో చదువుకునే విద్యార్థినులు రోడ్ నెం.10 అవర్ ప్లేస్ హోటల్ వైపు నుంచి పార్కు మీదగా నడిచి వస్తుంటారు. ఇదే ప్రాంతంలో నివసిస్తున్న నేపాల్కు చెందిన దీపక్ తన ఇద్దరు అనుచరులతో కలిసి నిత్యం ఈ విద్యార్థినుల వెంటపడుతున్నాడు. తన దుస్తులు విప్పేసుకుని వారితో అసభ్యంగా ప్రవర్తించి భయభ్రాంతులకు గురి చేస్తున్నాడు. దీంతో పాఠశాల ఉపాధ్యాయులు బంజారాహిల్స్ పోలీసులకు ఫిర్యాదు చేయగా...దీపక్ను అరెస్ట్ చేశారు. అతని అనుచరుల కోసం గాలిస్తున్నారు. పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు. (ఇంగ్లీషు కథనం ఇక్కడ చదవండి) -
మూగవానికి మాట..
ఏడుకొండలవాడి మహిమేనంటున్న ఎన్నారై కుటుంబం సాక్షి, తిరుమల: ఆపద మొక్కులవాడా.. అనాథ రక్షకా.. గోవిందా.. గోవిందా.. అంటూ భక్తితో కొలిచే భక్తులను శ్రీవేంకటేశ్వరుడు కంటికి రెప్పలా కాపాడతాడని పురాణ గాథల్లో చదివాం.. ఇప్పుడు ప్రత్యక్షంగా రుజువైంది. శ్రీవారినే నమ్ముకున్న ఓ బధిరుడికి మాటలు వచ్చాయి. పుట్టుకతో మూగవాడైన తన కుమారుడు దీపక్ (18) శ్రీనివాసుని దర్శనం తర్వాతే బాగా మాట్లాడగలుగుతున్నాడని ఇంగ్లండ్లో స్థిరపడిన ప్రవాస భారతీయురాలు ప్రతిమ మీడియాకు వెల్లడించారు. ఆమె తెలిపిన వివరాల మేరకు.. ఢిల్లీకి చెందిన ప్రతిమ, సుభాష్ దంపతులు వృత్తిరీత్యా ఇంగ్లండ్లోని హ్యారో నగరంలో స్థిరపడ్డారు. వీరికి ఇద్దరు కుమారులు, కుమార్తె ఉన్నారు. దీపక్ (18) పుట్టు మూగ . చిన్నపాటి శారీరక సమస్యలు కూడా ఉన్నాయి. కుమారుడికి మాటలు రావాలని, ఆరోగ్యం కుదుటపడాలని దీపక్కు నాలుగేళ్ల వయసులో తల్లి ప్రతిమ తిరుమల శ్రీవారికి మొక్కుకున్నారు. అనేక రకాల థెరపీలు చేయించగా 14 ఏళ్లు వయసులో చిన్నచిన్న మాటలు చెప్పటం ప్రారంభించాడు. శ్రీవారికి మొక్కులు చెల్లిస్తే ఫలితం ఉంటుందని భావించిన వారు శనివారం స్వామివారిని దర్శించుకున్నారు. తన కుమారుడికి మాటలు రప్పించాలని తల్లి ప్రతిమ స్వామికి మొరపెట్టుకున్నారు. అంతే... ఆలయంలో ఉండగానే అద్భుతం జరిగిందని, అంతవరకు పొడిపొడిగా మాట్లాడే దీపక్ బాగా మాడ్లాడటం ప్రారంభించాడని ప్రతిమ చెమ్మగిల్లిన కళ్లతో చెప్పారు. అనంతరం దీపక్ స్వామి వారికి తలనీలాలు సమర్పించి, మొక్కులు పరిపూర్ణం చేశారు. తర్వాత టీటీడీ ఈవో జి.గోపాల్ను కలసి ఈ విషయాన్ని వారితో పంచుకున్నారు. శ్రీవేంకటేశ్వర స్వామి లీలలు ఇన్నాళ్లు విన్నామని, శనివారం ప్రత్యక్షంగా చూశామని టీటీడీ అధికారులు ఆనందం వ్యక్తం చేశారు. ఇలాంటి సంఘటనలు దేవదేవుని సన్నిధిలో నిత్యం జరుగుతుంటాయని, అయితే కొన్నే వెలుగులోకి వస్తాయని ప్రధాన అర్చకుడు రమణ దీక్షితులు చెప్పారు. -
ఘరానా దొంగలు
సాక్షి, ముంబై : చోరీ సొత్తుతో జల్సాలు చేసే దొంగలను చూశాం.. ఇంకా ఎన్నో సంఘవిద్రోహక కార్యకలాపాలకు వినియోగించేవారి గురించి విన్నాం. కానీ ఈ దొంగలు మాత్రం అందుకు భిన్నం. ఇళ్లలోని విలువైన వస్తువులను లూటీ చేసి విక్రయించగా వచ్చిన సొమ్ముతో వడ్డీ వ్యాపారం చేస్తూ దర్జాగా నెలకు లక్షలు సంపాదిస్తున్నట్లు పోలీసుల విచారణలో వెల్లడైంది. నగర నేర విభాగం అధికారులు 20 కేసులకు పైబడి నమోదైన ఇద్దరు వ్యక్తులను ఇటీవలె అరెస్టు చేసింది. ఈ క్రమంలో ఆసక్తికరమైన వివరాలు వెలుగు చూశాయి. వివరాలిలా ఉన్నాయి...ఈ ఇద్దరు చోరులను ముంబ్రాకు చెందిన పరుశురాం శేండ్గే (30), వర్సోవాకు చెందిన దీపక్ పటాన్కర్గా పోలీసులు గుర్తించారు (20). ఈ ఇద్దరు నగరంలో చాలా ఇళ్లను కొళ్లగొట్టారు. చోరీ చేసిన సొమ్మును వడ్డీకి ఇస్తుంటారు. ఇలా నెలకు కనీసం రూ. లక్షల వడ్డీని సంపాదిస్తున్నారు. అన్ క్లైమ్డ్ మెయిల్ బాక్సులు, ఇంటి ముందు న్యూస్ పేపర్లు పడి ఉండడాన్ని గమనించి సదరు ఇళ్లలో చోరీలకు పాల్పడడంలో ఈ చోరులు దిట్ట. ఇంట్లో ఎవ్వరూ లేనిది చూసి ఇంట్లోకి చొరబడి కేవలం 10 నిమిషాలలో ఇళ్లను ఖాళీ చేస్తారు. వీరు చాలా చలాకీగా వ్యవహరించడమే కాకుండా చోరీలు చేయడంలో ఎంతో నేర్పరితనం కలిగిన వారుగా పోలీసులు పేర్కొన్నారు. జైలు నండి విడుదలయ్యాక ముమ్మరం పరుశురాం 2005లో నేరం చేసిన కేసులో అరెస్టు కాగా, 2006లో విడుదల అయ్యాడు. జైలు నుంచి విడుదల అయిన కొన్ని రోజుల వరకు చోరీలు చేయడాన్ని మానేశాడు. కానీ త్వరలోనే తిరిగి చోరీలు చేయడం ప్రారంభించాడు. డీసెంట్ అయిన దుస్తులు వేసుకొని కేబుల్ ఆపరేటర్గా లేదా ఎంటీఎన్ఎల్ ఉద్యోగిగా అందరిని నమ్మించేవాడు. ఇలా బిల్డింగ్లోపలికి వెళ్లి చోరీలు చేసేవాడని ముంబై క్రైంబ్రాంచ్ అడిషినల్ కమిషనర్ ఆఫ్ పోలీస్ ఎం. ప్రసన్న తెలిపారు. ఇద్దరూ కలిసి ఒక్కసారి భవనాలలోకి ప్రవేశించారంటే తమ లక్ష్యం నెరవేరాల్సిందే. చాలా రోజుల నుంచి పడి ఉన్న న్యూస్ పేపర్లు, పూల మొక్కలను బాగా పరిశీలించేవారు. తర్వాత ఇంట్లో ఎవ్వరూ లేరని గ్రహించి ఇనుప చువ్వలను ఉపయోగించి తాళాలను పగులగొట్టేవారు. తర్వాత ఇంట్లోకి ప్రవేశించి కొన్ని నిమిషాలలో విలువైన వస్తువులను కాజేసేవారు. 2011 నుంచి సాంతక్రూజ్, జూహూ, ఖార్, బాంద్రాలలో ఇలా 40 ఇళ్లను కొల్లగొట్టినట్లు దుండగులు తెలిపారు. తాము ఇతర ప్రదేశాలను కూడా పరిశీలిస్తున్నామనీ, కానీ ఇప్పటి వరకు కేవలం 20 కేసులను మాత్రమే ఛేదించామని క్రైంబ్రాంచ్ అసిస్టెంట్ కమిషనర్ ఆఫ్ పోలీస్ ప్రఫుల్ భోస్లే తెలిపారు. ఈ చోరులు కేవలం చోరీ చేయడమే కాకుండా దొంగిలించిన వస్తువులను విక్రయించడం ద్వారా వచ్చిన డబ్బు, చోరీ చేసిన డబ్బును రెండు శాతం వడ్డీకి ఇతరులకు ఇస్తారని తెలిపారు. వీరు అరెస్టు అయిన సమయంలో రూ.50 లక్షలను చాలా మందికి రెండు శాతం వడ్డీ చొప్పున ఇచ్చారని తేలిందని ప్రఫుల్ భోస్లే తెలిపారు. -
అజ్ఞాతవాసం: రిమీ... కనిపించట్లేదేమి!
అచ్చమైన బెంగాలీ అమ్మాయి. కానీ తెలుగు సినిమాతో నటి అయ్యింది. ‘నీ తోడు కావాలి’ అంటూ దీపక్ని అడిగింది.‘అందరివాడు’తో అందరికీ దగ్గరవ్వాలని చూసింది. కొన్నాళ్లపాటు కెరీర్లో వేగంగా దూసుకుపోయింది. కానీ ఉన్నట్టుండి ఆ వేగానికి బ్రేక్ పడింది. ఇప్పుడామె చేతిలో అవకాశాలు లేవు. అసలామె ఎక్కడా కనిపించడం లేదు. ఎక్కడికెళ్లింది? ఏం చేస్తోంది? అదృష్టం వెతుక్కుంటూ వస్తుందని కొందరు ఎదురు చూస్తుంటారు. కానీ రిమీసేన్ అలా చూడలేదు. తనే అదృష్టాన్ని వెతుక్కుంటూ వెళ్లింది. కోరుకున్న చోటికి చేరుకుంది. కానీ ఉన్నట్టుండి కనిపించకుండా పోయింది. రిమీ అసలు పేరు... శుభోమిత్రాసేన్. 1981, సెప్టెంబర్ 11న కోల్కతాలో పుట్టింది. ఎందుకోగానీ ఊహ తెలిసినప్పట్నుంచీ ముఖానికి మేకప్ వేయాలన్న తపనతోనే ఉంది. కానీ ఇంట్లోవాళ్లు అంగీకరించలేదు. కళలు కూడుపెట్టవు, చదువుకోమన్నారు. మనసులో బాధ ఉన్నా మౌనంగా వారికి తల వంచింది రిమీ. కామర్స్లో డిగ్రీ పూర్తి చేసింది కానీ మనసు మాత్రం కళారంగంవైపే లాగుతూ ఉంది. రిమీ అంతర్మథనాన్ని ఆమె తాతయ్య అర్థం చేసుకున్నారు. వెళ్లి నచ్చింది చేయమన్నారు. దాంతో రిమీ ఆనందానికి అవధులు లేవు. తల్లిని తోడు తీసుకుని ముంబై రెలైక్కింది. అయితే ఆమె ముంబై వచ్చినంత తేలిగ్గా అవకాశాలు ఆమె దగ్గరకు రాలేదు. చాలా కష్టపడింది. ఎలాగో యాడ్స్లో నటించే చాన్స్ సంపాదించింది. చిన్నా చితకా ప్రకటనలు చాలానే చేసింది. కానీ ఆమిర్ఖాన్తో చేసిన కోకో కోలా యాడ్... ఆమె జీవితాన్ని మలుపు తిప్పింది. కోలా యాడ్ చూసిన టాలీవుడ్ దర్శకుడు భీమనేని శ్రీనివాసరావు ‘నీ తోడు కావాలి’ చిత్రంలో రిమీని హీరోయిన్గా తీసుకున్నారు. సినిమా పెద్ద సక్సెస్ కాలేదు. టాలీవుడ్ ఆమెను అంతగా ప్రోత్సహించనూ లేదు. కానీ బాలీవుడ్ మాత్రం ఆమెను సాదరంగా ఆహ్వానించింది. మంచి మంచి అవకాశాలిచ్చింది. హంగామా, బాగ్బన్, ధూమ్, స్వప్నేర్ దిన్, గరం మసాలా, క్యోంకీ, దీవానే హుయే పాగల్, ఫిర్ హేరా ఫేరీ, గోల్మాల్ 2, దోస్త్, ధూమ్ 2, హ్యాట్రిక్, జానీ గద్దార్, దే తాలీ, షకత్ సిటీ, హార్న్ ఓకే, ప్లీజ్, యహాకే హమ్ సికిందర్, థాంక్యూ... ఇలా ఒకదాని తరువాత ఒకటిగా చేసుకుంటూ పోయింది రిమీ. ఈ కమ్రంలోనే 2005లో ‘అందరివాడు’లో చిరంజీవి సరసన నటించింది. ఈ సినిమాతో పాటు ధూమ్ 1, 2 చిత్రాలు కూడా రిమీకి మంచి పేరు తెచ్చిపెట్టాయి. అయితే వాయువేగంతో సాగిపోతోన్న రిమీ కెరీర్కు సడెన్గా బ్రేక్ పడింది. 2011లో ‘షాగిర్ద్’ చిత్రం తరువాత ఆమె మళ్లీ తెర మీద కనిపించలేదు. అటు తెలుగులో కానీ, ఇటు హిందీలో కానీ మెరిసింది లేదు. ఉన్నట్టుండి అలా ఎలా మాయమైపోయింది? అసలేం జరిగింది? కాంట్రవర్సీయే కారణమా... రిమీ కెరీర్ గ్రాఫ్ పడిపోవడానికి, ఆమె సినిమాలకు దూరంగా ఉండాల్సి రావడానికి ఓ కాంట్రవర్సీయే కారణం అన్నమాట బాలీవుడ్లో వినిపిస్తోంది. ‘గోల్మాల్’ రిలీజైన తరువాత ఇచ్చిన ఓ ఇంటర్వ్యూ... రిమీ కెరీర్ని ఖతమ్ చేసిందంటారు చాలామంది. ఆ ఇంటర్వ్యూలో ఆమె గోల్మాల్ దర్శకుడు రోహిత్శెట్టి గురించి చేసిన ఓ కామెంట్ కాంట్రవర్సీకి దారి తీసింది. ‘‘రోహిత్ చాలా గొప్ప దర్శకుడు. తను తలచుకుంటే ఓ నల్ల ఆఫ్రికన్ని కూడా అందంగా చూపించగలడు’’ అంది రిమీ. ఈ కామెంట్ ఓ పెద్ద వివాదాన్నే సృష్టించింది. ఒక బ్రిటిష్ ఆఫ్రికన్ గ్రూప్ రిమీ స్టేట్మెంట్ని బహిరంగంగా ఖండించింది. ‘ఇది అర్థం లేని కామెంట్ మాత్రమే కాదు, ఆఫ్రికన్లను అవమానించే కామెంట్, ఇలా మాట్లాడే అర్హత ఆమెకి లేదు’ అంటూ తీవ్రంగా ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. దాంతో రిమీకి కష్టాలు మొదలయ్యాయి. నోరు సంభాళించుకోకపోతే ఇలాగే ఉంటుంది అంటూ పలువురు బాలీవుడ్ పెద్దలు క్లాస్ పీకారని, అయినా రిమీ లక్ష్యపెట్టకపోవడంతో వాళ్లంతా ఆమెను దూరంగా పెట్టడం మొదలుపెట్టారని, అందుకే ఆమెకు అవకాశాలు రాకుండా పోయాయని వినికిడి. అయితే ధూమ్ 3 తీసినప్పుడు ఆమెని ఓ ఐటెమ్ సాంగ్ చేయమని అడిగారని, ముందు రెండు భాగాల్లో హీరోయిన్గా చేసిన తాను ఇప్పుడు ఐటెమ్ సాంగ్ చేయడమేంటంటూ రిమీ కోప్పడిందనే వార్తలు వచ్చాయి ఆ మధ్య. అది ఎంతవరకూ నిజమో తెలియదు కానీ... రిమీ చేతిలో ఇప్పుడు ఒక్క అవకాశం కూడా లేదన్నది నిజం. ఆమె మన ముందుకొచ్చి మూడేళ్లు అయ్యిందన్నదీ నిజం. చాలాకాలం తరువాత ఆ మధ్య ఓ ఫంక్షన్లో కనిపించిన రిమీ... తెరమీద కూడా మళ్లీ కనిపిస్తుందా? ఇంతకుముందులా బిజీ నటి అవుతుందా? చూద్దాం... ఆ రోజు వస్తుందేమో! -
ఏపీ సర్కారుకు సుప్రీం మొట్టికాయలు
పాఠశాలల్లో కనీస సౌకర్యాలు కల్పించకపోవడంపై ఆగ్రహం న్యూఢిల్లీ: పాఠశాలల్లో విద్యార్థులకు కనీస సౌకర్యాలు కల్పించకపోవడంపై ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి సుప్రీంకోర్టు మొట్టికాయలు వేసింది. ఈ అంశంలో కోర్టు ఆదేశాలను పాటించకపోవడంపై ఆగ్రహం వ్యక్తం చేసింది. చిన్నారులకు పాఠశాలల్లో కనీస సౌకర్యాలైన మంచినీరు, బాలబాలికలకు వేర్వేరు మరుగుదొడ్లు, సబ్జెక్టుల వారీగా విద్యను భోదించేందుకు అవసరమైన టీచింగ్, నాన్ టీచింగ్ సిబ్బంది ఉండాలని, ఇవి లేనట్లయితే అది మొత్తం విద్యా వ్యవస్థపైనే తీవ్ర ప్రభావం చూపుతుందని అభిప్రాయపడింది. విద్యను భోదించే క్రమంలో నిర్లక్ష్యం వహిస్తే.. దేశానికి ఉత్తమ పౌరులను అందించడం అసాధ్యమని ప్రత్యేకించి చెప్పనక్కర్లేదని వ్యాఖ్యానించింది. బాలలకు విద్యను భోదించే ప్రదేశాల్లో మంచినీరు, మరుగుదొడ్ల సౌకర్యం కల్పించడం అనేది కనీస మానవహక్కుల్లో భాగమని జస్టిస్ దీపక్ మిశ్రా, జస్టిస్ వి గోపాలగౌడ్తో కూడిన ధర్మాసనం స్పష్టం చేసింది. పాఠశాలల్లో సౌకర్యాల లేమిపై 2012 అక్టోబర్లో సుప్రీంకోర్టు ఇచ్చిన ఆదేశాలను ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పాటించకపోవడంపై దాఖలైన ధిక్కార పిటిషన్పై ధర్మాసనం శుక్రవారం విచారణ జరిపింది. తమ ముందు వ్యక్తిగతంగా హాజరై వివరణ ఇవ్వాలని ఆంధ్రప్రదేశ్ ముఖ్య కార్యదర్శిని ఆదేశించింది. తదుపరి విచారణను జూలై 7కు వాయిదా వేసింది. -
కుమార్తె ‘పేరు’ కోసం పోలీస్ స్టేషన్కు వెళ్లిన వైనం
హైదరాబాద్, న్యూస్లైన్: తమ కుమార్తెకు పేరు పెట్టే విషయంలో భార్యాభర్తల మధ్య జరిగిన వివాదం చివరికి పోలీసు స్టేషన్కు చేరింది. నగరంలోని యూసుఫ్గూడ బస్తీలో దీపక్ అనే ప్రైవేటు ఉద్యోగి ఏడాదిన్నర క్రితం సాజిదా అనే ముస్లిం యువతిని ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. వీరికి రెండు నెలల క్రితం పాప జన్మించింది. దీపక్ తన కుమార్తెకు లాస్య అని పేరు పెట్టాలని వాదిస్తే.. సాజిదా లీనా అని పెట్టాలని పట్టుపట్టారు. ఇదిలా ఉండగా.. గురువారం ఉదయం దీపక్ తన కుమార్తెను తీసుకుని దగ్గర్లోని సాయిబాబా ఆలయానికి వెళ్లి.. లాస్య అని నామకరణం చేయించి, ఇంటికి తీసుకొచ్చారు. దీంతో తనకు తెలియకుండా పేరు ఎందుకు పెట్టావంటూ సాజిదా గొడవకు దిగారు. కోపం పట్టలేక దీపక్ భార్యపై చేయి చేసుకున్నారు. దీంతో ఆమె బట్టలు సర్దుకుని.. సామాన్లతో సహా ఆటోలో బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్ ముందు దిగారు. తనకు న్యాయం చేయాలని పోలీసులను వేడుకున్నారు. ఇంత చిన్న ఘటనకే భర్తను వదిలి, సామాన్లతో సహా పోలీస్ స్టేషన్కు వచ్చిన సాజిదాను చూసి ఆశ్చర్య పోయిన పోలీసులు. భర్తను పిలిపించారు. వారికి కౌన్సెలింగ్ ఇచ్చి.. సర్దిచెప్పి పంపించారు. -
రోడ్డు ప్రమాదంలో ముగ్గురు యువకుల దుర్మరణం
దొడ్డబళ్లాపురం, న్యూస్లైన్ : డొనేట్ బ్లడ్ బట్ నాట్ ఆన్ రోడ్స్...అనే సందేశాన్ని బైక్పై రాసుకుని తిరిగిన యువకులు అదే బైక్పై వెళ్తూ ప్రమాదానికి గురై దుర్మరణం చెందిన సంఘటన పట్టణ పోలీస్స్టేషన్ పరిధిలో జరిగింది. మృతులు చిక్కబళ్లాపురానికి చెందిన సుశాంత్(23), చింతామణికి చెందిన దీపక్(24), దొడ్డబళ్లాపురానికి చెందిన కార్తీక్(23)గా గుర్తించారు. వీరిలో సుశాంత్, దీపక్లు ఇక్కడి రిట్టల్ ఫ్యాక్టరీ ఉద్యోగులు. డిప్లోమా చదివిన కార్తీక్ ఉద్యోగ ప్రయత్నాల్లో ఉన్నాడు. ఇదిలా ఉంటే ముగ్గురూ ఒకే బైక్పై శుక్రవారం రాత్రి ఇక్కడి ప్రసన్న టాకీస్లో తుఫాన్ సినిమాకు వెళ్లారు. అనంతరం రైల్వేస్టేషన్ సర్కిల్కి వెళ్లి భోజనం చేశారు. అక్కడి నుంచి బెంగళూరు-హిందూపురం రహదారిపై బైక్పై వస్తుండగా, మార్గం మధ్యలో ముత్తూరు వద్ద గుర్తు తెలియని వాహనం ఒకటి వీరి బైక్ను ఢీకొంది. దీంతో ప్రమాదంలో సుశాంత్, దీపక్లు ఇద్దరూ ఘటనాస్థలంలోనే దుర్మరణం చెందారు. తీవ్రంగా గాయపడిన కార్తీక్ను బెంగళూరు ఎంఎస్ రామయ్య ఆస్పత్రికి తరలించగా శనివారం ఉదయం చికిత్స ఫలించక మృతి చెందాడు. యువకుల మృతితో వీరి తల్లితండ్రులు, బంధువులు,స్నేహితులు కన్నీరుమున్నీరయ్యారు. రక్తదానం చేయాలని, అయితే అది రోడ్లపై కాకూడదని సందేశం బైక్పై రాసుకుని తిరిగిన యువకులు చివరకు రోడ్డుపైనే రక్తమోడి దుర్మరణం చెందడం శోచనీయం. పట్టణ పోలీ సులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.