ఇండియా సిమెంట్స్ కర్మాగారంలో సోమవారం రాత్రి ప్రమాదం జరిగింది.
తాండూరు మండలం మల్కాపూర్ సమీపంలోని ఇండియా సిమెంట్స్ కర్మాగారంలో సోమవారం రాత్రి ప్రమాదం జరిగింది. కర్మాగారంలో నిద్రిస్తున్న ముగ్గురు కార్మికులను గమనించని జేసీబీ డ్రైవర్ వారిపై నుంచి పోనివ్వడంతో ఈ ప్రమాదం చోటుచేసుకుంది. ఈ ఘటనలో దీపక్, సంజయ్ అనే ఇద్దరు అక్కడికక్కడే మృతిచెందగా. తిలక్ అనే మరో వ్యక్తికి తీవ్రగాయాలయ్యాయి. క్షతగాత్రుడిని చికిత్స నిమిత్తం దగ్గరలోని ఓ ప్రైవేటు ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.