![Italy Win Against England In UEFA Euro 2020 Final Match - Sakshi](/styles/webp/s3/article_images/2021/07/12/Italy.jpg.webp?itok=VLbT52WQ)
లండన్: ఆదివారం జరిగిన యూరోపియన్ ఛాంపియన్షిప్ ఫైనల్ మ్యాచ్లో ఇంగ్లండ్ టీమ్పై ఇటలీ విజయం సాధించి విజేతగా నిలిచింది. లండన్లోని విఖ్యాత వెంబ్లీ స్టేడియంలో టైటిల్ పోరులో ఇంగ్లండ్, ఇటలీ జట్లు పోటీపడ్డాయి. ఈ మ్యాచ్ ప్రారంభంలో ఇంగ్లండ్ ఆటగాడు ల్యూక్ షా 2వ నిమిషానికే గోల్ కొట్టడంతో ఆధిపత్యంలో కొనసాగింది. అయితే ఇటలీ ఆటగాడు లియోనార్డో బోనుసి 67వ నిమిషంలో గోల్ చేసి స్కోర్ను సమం చేశాడు.
దీంతో నిర్ణీత సమయంలో ఇరుజట్లు 1-1తో నిలవగా.. అదనపు సమయంతో ఆటను పొడిగించారు. అయితే, అప్పుడు ఇరు జట్లు గోల్ చేయలేకపోయకపోవడంతో.. పెనాల్టీ షూటౌట్కు దారితీసింది. ఈ క్రమంలో... గోల్ కీపర్ డోనరుమా ఆఖరి బంతిని అద్భుతంగా అడ్డుకొని ఇటలీ గెలుపును ఖాయం చేశాడు. దీంతో 55 ఏళ్ల తర్వాత ఫైనల్కు చేరిన ఇంగ్లండ్కు నిరాశే మిగిలింది. అంతకుముందు 1968లో ఇటలీ యూరో కప్ విజేతగా నిలిచింది.
Comments
Please login to add a commentAdd a comment