Italy
-
తగ్గేదేలే అంటోన్న అజిత్ కుమార్.. మరో కప్ కొట్టిన టీమ్!
కోలీవుడ్ స్టార్ హీరో అజిత్ కుమార్కు కార్ రేసింగ్ అంటే విపరీతమైన క్రేజ్. ఎక్కడా రేసింగ్ జరిగినా సరే తన టీమ్తో కలిసి అక్కడ ప్రత్యక్షమవుతాడు. ఇటీవలే ఓ రేసింగ్లో గెలిచిన అజిత్ టీమ్.. తాజాగా మరోసారి ఛాంపియన్గా నిలిచారు. తాజాగా ఇటలీలో జరిగిన కార్ రేసింగ్-12 హెచ్ ఛాంపియన్షిప్లో అజిత్ కుమార్ బృందం మూడో స్థానంతో నిలిచి సత్తా చాటారు. ఈ విజయాన్ని తన టీమ్తో కలిసి అజిత్ సంబురాలు చేసుకున్నారు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది. భారత త్రివర్ణ పతాకాన్ని పట్టుకుని పోడియం సందడి చేశారు. కాగా.. ఇటీవలే దుబాయ్- 24 హెచ్ రేసులో అజిత్ కుమార్ రేసింగ్ టీమ్ మూడో స్థానంలో నిలిచిన సంగతి తెలిసిందే.ఇక సినిమాల విషయానికొస్తే అజిత్ చివరిసారిగా విదాముయార్చిలో కనిపించారు. గతనెల థియేటర్లలో విడుదలైన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద పెద్దగా రాణించలేకపోయింది. ప్రస్తుతం అజిత్ మరో యాక్షన్ థ్రిల్లర్ గుడ్ బ్యాడ్ అగ్లీతో ప్రేక్షకుల ముందుకు రానున్నారు. ఈ చిత్రంలో త్రిష హీరోయిన్గా నటించింది. ఈ సినిమాకు అధిక్ రవిచంద్రన్ దర్శకత్వం వహించగా.. మైత్రి మేకర్స్ బ్యానర్లో వై రవిశంకర్, నవీన్ యేర్నేని నిర్మించారు. ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకున్న ఏప్రిల్ 10న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో సందడి చేయనుంది.Victory in style! 🏆🔥 Team @Akracingoffl shines at the 12H Mugello, Italy, celebrating a fantastic podium finish! 🏁Kudos to @fabian_fdx89, @mathdetry, and @BasKoetenRacing for their stellar performance on the track! 🚀🏎️#AKR #AjithKumar | #AjithKumarRacing #24HSeries… pic.twitter.com/1ug9mohbTr— Suresh Chandra (@SureshChandraa) March 23, 2025 -
మహిళా దినోత్సవం– పుష్ప విలాసం
అనేక దేశాలలో అంతర్జాతీయ మహిళా దినోత్సవం రోజున మహిళలకు ఇచ్చే పువ్వులుప్రాంతాలను బట్టి మారుతూ ఉంటాయి. ఈ పువ్వులలో ఎక్కువప్రాచుర్యం పొందింది... యెల్లో మిమోసా. మహిళలకు యెల్లో మిమోసా పువ్వులను బహుమతిగా ఇచ్చే సంప్రదాయం ఇటలీలో ఉంది. సున్నితత్వాన్ని, బలాన్ని సూచించే యెల్లో మిమోసాను ఇటాలియన్ ఫెమినిస్ట్లు మహిళా హక్కుల ఉద్యమానికి చిహ్నంగా ఎంచుకున్నారు. మార్చి ప్రారంభంలో మిమోసా వికసిస్తుంది కాబట్టి వారు ఈ పువ్వును ఎంచుకున్నారు. -
న్యూయార్క్-న్యూఢిల్లీ విమానానికి బాంబు బెదిరింపు.. ఎమర్జెన్సీ ల్యాండింగ్
న్యూయార్క్: ఇటీవలి కాలంలో బాంబు బెదిరింపుల సమస్యలు ఎక్కువయ్యాయి. కొంత మంది ఆగంతకులు, జులాయిలు సరదాగా ఫోన్ చేసి లేక మెయిల్ పెట్టి బెదిరింపులకు తెగబడుతున్నారు. తాజాగా అమెరికన్ ఎయిర్ లైన్స్కు బాంబు బెదిరింపులు రావడంతో ఇటలీ రాజధాని రోమ్లో అత్యవసర ల్యాండింగ్ చేశారు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది.వివరాల ప్రకారం.. అమెరికన్ ఎయిర్లైన్స్కు చెందిన AA292 విమానంలో న్యూయార్క్ నుంచి ఢిల్లీ రావాల్సి ఉంది. ఈనెల 22వ తేదీన జేఎఫ్కే అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి రాత్రి 8.14 గంటల సమయంలో టేకాఫ్ తీసుకుంది. అనంతరం, ఈ విమానంలో బాంబు ఉన్నట్టు బెదిరింపులు వచ్చాయి. దీంతో, అప్రమత్తమైన అధికారులు భద్రతా కారణాలతో విమానాన్ని ఇటలీలోని రోమ్కు దారి మళ్లించారు. దీంతో, రోమ్లోని లియోనార్డో డావిన్సీ ఫియుమిసినో ఎయిర్పోర్టులో సురక్షితంగా ల్యాండ్ చేశారు. ఇటలీ ఎయిర్ ఫోర్స్ విమానాలు రక్షణగా రాగా బోయింగ్ విమానం ల్యాండవుతున్న దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్గా మారాయి.Friends deplaning from AA292 in Rome earlier today after a bomb threat was made over the Caspian Sea. The flight landed while escorted by Italian fighter jets. American airlines 292 is safely on the ground all passengers safe. pic.twitter.com/sXgUAB53iK— Herbert Hildebrandt (@herberandt) February 23, 2025ఈ సందర్బంగా విమానాశ్రయంలో అధికారులు మాట్లాడుతూ.. భద్రతా కారణాల రీత్యా విమానాన్ని అత్యవసరంగా ల్యాండ్ చేయడం జరిగింది. ఈ విమానం ల్యాండింగ్ కారణంగా ఇతర విమానాల రాకపోకలపై ఎలాంటి ప్రభావం పడలేదు. విమానాశ్రయ కార్యకలాపాల్లో ఎలాంటి ఇబ్బంది రాలేదని చెప్పుకొచ్చారు. విమాన సిబ్బంది, ప్రయాణీకులు సురక్షితంగా ఉన్నట్టు తెలిపారు.Breaking: American Airlines Flight AA292, traveling from New York (JFK) to New Delhi (DEL), has made an emergency diversion to Rome following a reported threat. The aircraft is currently being escorted by Eurofighter jets as it approaches the airport. pic.twitter.com/q4DzpURjGc— Brian Krassenstein (@krassenstein) February 23, 2025 -
32 ఏళ్లు ద్వీపంలో ఒంటరిగా బతికాడు! సడెన్గా జనాల్లోకి తీసుకురాగానే..
ఒంటరితనంతో బాధపడుతుంటారు చాలామంది. దీన్నుంచి బయటపడేలే స్నేహితులు లేదా బంధువుల వద్దకు వెళ్లిపోతారు. కానీ ఓ వ్యక్తి ఏరికోరి మరి ఏకాంతంగా ఉండాలని మనిషే కానరాని ఓ దీవిలో ఉంటాడు. అక్కడే అలా ఒకటో, రెండో ఏళ్లు కాదు ఏకంగా ముప్పై ఏళ్లకు పైగా గడిపేశాడు. అయితే అకస్మాత్తుగా ఉన్నపళంగా జనాల మధ్యలోకి వెళ్లక తప్పలేదు. పాపం సడెన్గా అలా జనాల మధ్యలో జీవించాల్సి రావడంతో మనుగడ సాగించలేక అల్లాడిపోయాడు. చూస్తుండగానే ఆరోగ్యం క్షీణించి చనిపోయాడు. ఎవరా వింత వ్యక్తి అంటే..రాబిన్సన్ క్రూసోగా పిలిచే ఇటాలి(Italy)కి చెందిన మౌరో మొరాండి(Mauro Morandi,) ముప్పైళ్లకు పైగా ఒంటిరిగా బుడెల్లి ద్వీపంలో ఒంటిరిగా ఉండేవాడు. ఈ ద్వీపం ఇటలీకి రెండొవ ప్రపంచ యుద్ధ సమయం(World War II)లో ఆశ్రయంగా ఉపయోగపడింది. ఆ తర్వాత ఏ వ్యక్తి ఇక్కడ జీవనం సాగించ లేదు. అలా ఈ ద్వీపం జనసంచారం లేని నిర్మానుష్య ప్రదేశంగా మారింది. అయితే రాబిన్సన్ క్రూసోగా పిలిచే మౌరో మొరాండి 1989లో పాలినేషియాకు చెందిన ఒక మిషన్ కోసం వచ్చి..ఈద్వీపంలోని ఉండిపోవాలని నిర్ణయించకుంటాడు. అలా ఈ ద్వీపంలోనే ఒంటరిగా జీవనం సాగిస్తూ ఉండేవాడు. ఆ ద్వీపం సమీపంలోని బీచ్లను శుభ్రంగా ఉంచేవాడు. అక్కడకు వచ్చే పర్యాటకులు పర్యావరణ వ్యవస్థ గురించి అవగాన కల్పించేవాడు. అతను అక్కడ ఒక ఇంటిని నిర్మించి తాత్కాలికి సౌర విద్యుత్ని ఏర్పాటు చేసుకున్నాడు. చలికాలంలో ఒక సాధారణ పొయ్యితో ఇల్లు వెచ్చగా ఉండేలా చేసుకునేవాడు. అతనిని రాబిన్సన్ క్రూసోగా ఎందుకు పిలిచేవారంటే.. రాబిన్సన్ క్రూట్జ్నేర్ నవలలో ఓ పాత్ర పేరు. ఆ కథలో రాబిన్సన్ అనే వ్యక్తి ఓడ ధ్వసం కావడంతో వెనిజులా నుంచి ట్రినిడాడ్ తీరంలోని నిర్మానుష్య ఉష్ణమండలం దీవికి వస్తాడు. అక్కడే 28 ఏళ్లు గడుపుతాడు.అచ్చం అలాగే ఈ ఇటాలియన్ వ్యక్తి మౌరో మొరాండి ఒంటిరిగా ఈ దీవిలో గడపడంతో అంతా ఆ పాత్ర పేరుతో పిలచేవారు. అయితే 2021లో, లా మాడలీనా జాతీయ ఉద్యానవన అధికారులు ఆ దీవిని పర్యావరణ కేంద్రంగా మార్చాలని ప్లాన్ చేశారు. దీంతో మౌరో మొరాండిని ఆ దీవి నుంచి బలవంతంగా ఖాళీ చేయించారు. దీంతో అతను ఇటలీలో సావర్డినియాలోని ఓ నగరంలో అపార్ట్మెంట్ అద్దెకు తీసుకుని జీవించడం ప్రారంభించాడు. అయితే అప్పటి వరకు ఏకాంతం అలవాటై నగరంలో ఈ రణగొణ ధ్వనుల మధ్య ఉండలేక అల్లాడిపోయాడు. అదీగాక వయసు రీత్యా వార్ధక్య రుగ్మతలు కూడా ఇబ్బంది పెట్టడంతో ఎంతకాలం జీవిచలేకపోయాడు. ఆ దీవి నుంచి వచ్చిన మూడేళ్లకే 85 ఏళ్ల వయసులో మరణించారు మౌరో మొరాండి.(చదవండి: 'ఇంజనీర్ బాబా': ఏరోస్పేస్ ఇంజనీరింగ్, ఫోటోగ్రఫీ వదిలి మరీ..) -
అక్కడ అనారోగ్యం నిషిద్ధం
నిషిద్ధ ప్రకటనలంటే ఎలా ఉంటాయి? చెత్త వేయొద్దనో, ఫలానా ప్రాంతంలోకి ప్రవేశించొద్దనో ఉంటాయి. కదా! కానీ దక్షిణ ఇటలీలో ఉన్న కాలాబ్రియా ప్రాంతంలోని చిన్న పట్టణమైన బెల్కాస్ట్రో మాత్రం వింతైన ప్రకటన చేసింది. ఆ పట్టణంలో ప్రజలు అనారోగ్యానికి గురికావడం నిషిద్ధం! అవును!! ‘‘వైద్య సాయం అవసరమమ్యే ఎలాంటి అనారోగ్యానికీ లోనవొద్దు. ముఖ్యంగా అత్యవసర చికిత్స అవసరమయ్యే ఎలాంటి అనారోగ్యం బారినా పడొద్దు’’అంటూ బెలాస్ట్రో మేయర్ ఆంటోనియో టార్చియా ఉత్తర్వులు జారీ చేశారు! అంతేకాదు.. గృహ ప్రమాదాలను నివారించడానికి హానికారకమైన ఎలాంటి కార్యక్రమాలూ నిర్వహించొద్దని, ఇల్లు విడిచి ప్రయాణాలు చేయొద్దని, ఆటలు నేర్చుకోవద్దని, ఎక్కువ సేపు కదలకుండా కూర్చోవద్దని... ఇలా పలు ఆదేశాలతో ఏకంగా ఆర్డినెన్సే జారీ చేశారు! మరోవైపు పర్యాటకులను తమ పట్టణానికి స్వాగతించారు కూడా. ‘‘మా చిన్న గ్రామంలో ఓ వారం పాటు నివసించండి. సురక్షితంగా ఉండటానికి ప్రయత్నించండి. ఎందుకంటే ఆరోగ్యం పాడైతే ఎలాంటి వైద్య సేవలు కావాలన్నా 45 కి.మీ. దూరంలోని కాటాంజారో వెళ్లాల్సి ఉంటుంది’’అంటూ వారినీ హెచ్చరించారు! నగరానికి పెద్ద దిక్కయిన మేయరే ఇలాంటి ఆదేశాలివ్వడం ఆశ్చర్యమే అయినా అందుకు కారణం లేకపోలేదు. 1,300 మంది జనాభా ఉన్న బెల్కాస్ట్రోలో ఉన్నది ఒకే ఒక ఆరోగ్య కేంద్రం. దాన్నీ తరచూ మూసేస్తారు. వైద్యులు ఎప్పుడూ అందుబాటులో ఉండరు. ఎమర్జెన్సీ వస్తే కాటంజారో నగరమే దిక్కు. పరిస్థితులను మార్చేందుకు ఎన్నోసార్లు విఫలయత్నం చేసిన మీదట మేయర్ చివరికిలా వ్యంగ్య ప్రకటన చేశారు! అదీ సంగతి. సమస్యలను పరిష్కరించేలా ప్రాంతీయ, ఆరోగ్య అధికారులను రెచ్చగొట్టేందుకే ఇలా ఉత్తర్వులిచి్చనట్టు మేయర్ తెలిపారు. పట్టణంలోని ప్రజారోగ్య కేంద్రం క్రమం తప్పకుండా తెరుచుకునేదాకా ఆర్డినెన్స్ అమల్లో ఉంటుందన్నారు. బెలాస్ట్రో ఇటలీలోని అత్యంత పేద ప్రాంతాలలో ఒకటైన కాలాబ్రియా పరిధిలో ఉంటుంది. యువకులు భారీగా నగరాలకు వలస పోతారు. జనాభా క్షీణిస్తుండటంతో పల్లె, పట్టణ ప్రాంతాల్లో నివసిస్తే డబ్బు చెల్లించడానికి కూడా ప్రభుత్వాలు ముందుకొస్తున్నాయి. అక్కడ అనేక పట్టణాలు ఆరోగ్య సమస్యలను ఎదుర్కొంటున్నాయి. – సాక్షి, నేషనల్ డెస్క్ -
ఇంటి ధర రూ.85! రెనొవేషన్కు రూ.3.8 కోట్లు!!
ఇంటి ధర కేవలం రూ.85.. కానీ దాని రెనొవేషన్కు మాత్రం ఏకంగా రూ.3.8 కోట్లు ఖర్చు అయింది.. ‘అదేంటి.. రూ.85కే ఇళ్లు ఎక్కడ దొరుకుతుంది. అద్దె ఇళ్లే దాదాపు రూ.15,000 వరకు ఉంది. మరి అంత తక్కువకు ఇళ్లు ఎవరిస్తారు?’ అని అనుకుంటున్నారా. అలా అయితే మనం ఇటలీలో జరిగిన ఈ సంఘటన గురించి తెలసుకోవాల్సిందే.ఇటలీలోని సాంబుకా డి సిసిలియాలో 2019లో నిరుపయోగంగా ఉన్న ఇళ్లను వేలం వేశారు. అలా చాలా ఏళ్లుగా ఉపయోగంలోలేని ఓ ఇంటిని చికాగోకు చెందిన ఆర్థిక సలహాదారు మెరెడిత్ టాబోన్ కొనుగోలు చేశారు. కేవలం 1.05 డాలర్లు(రూ.85)కే దాన్ని వేలంలో దక్కించుకున్నారు. ఆ ఇంటిని 17 శతాబ్దంలో నిర్మించినట్లు తెలిసింది. దానికి కరెంట్, నీటి సౌకర్యం లేదు. వేలం పూర్తయిన తర్వాతే తాను ఆ ఇంటిని చూశారు. సాంబుకా డి సిసిలియా ప్రాంత్రంలో ఓ మూలన ఉన్న ఆ ఇంటిని మొదటగా చూసి మెరెడిత్ దాన్ని పునరుద్ధరణ చేయించాలనుకున్నారు. దాంతో గడిచిన నాలుగేళ్లల్లో అత్యాధునిక సౌకర్యాలతో తీర్చిదిద్దారు. అందుకు 4,46,000(దాదాపు రూ.3.8 కోట్లు) ఖర్చు అయినట్లు ఆమె తెలిపారు. View this post on Instagram A post shared by Meredith Tabbone (@meredith.tabbone)ఇదీ చదవండి: మళ్లీ డబ్బు పెడుతున్న ఎఫ్పీఐలుమెరెడిత్ టాబోన్ ఇంత ఖర్చు చేసి ఎందుకు దీన్ని పునరుద్ధరించారని ఓ మీడియా సంస్థ అడిగిన ప్రశ్నకు ‘1908లో నా కుంటుంబం యూఎస్కు వెళ్లడానికి ముందు మా ముత్తాత ఈ ప్రాంతంలోనే ఉండేవారు. తన జ్ఞాపకాలకు గుర్తుగా దీన్ని ఎంచుకున్నాను’ అని సమాధానం ఇచ్చారు. ఇంటికి సంబంధించిన వీడియో తన ఇన్స్టాగ్రామ్లో షేర్ చేశారు. అదికాస్తా వైరల్గా మారింది. కాగా, ఇంట్లో ప్రత్యేకంగా డిజైనింగ్, టైల్స్, ఇంటీరియర్.. వంటి వాటికి భారీగా ఖర్చవుతున్నాయి. ప్రస్తుత రోజుల్లో ఇల్లు కట్టేందుకు అయ్యే ఖర్చు ఒకెత్తైతే, మన అభిరుచులకు తగినట్లుగా ఇంటీరియర్ డిజైన్ చేయించేందుకు అయ్యే ఖర్చు తడిసిమోపెడవుతుంది. -
వయసు 28, తులసి పంట రారాజు ఫిలిప్పో సక్సెస్ స్టోరీ, ఆదాయం ఎంతో తెలుసా?
ఫిలిప్పో కర్రర 28 ఏళ్ల యువ రైతు. అతనిది ఇటలీలోని ఉత్తరప్రాంతంలోని పర్మ నగరం. ఇటలీలో పెద్ద కమతాలే ఎక్కువ. ఇప్పుడు సగటు వ్యవసాయ క్షేత్రం విస్తీర్ణం సుమారు 11 హెక్టార్లు. అక్కడ కమతాల సైజు పెరుగుతూ వస్తోంది. 2000వ సంవత్సరంలో 5 హెక్టార్లున్న సగటు కమతం విస్తీర్ణం 2010 నాటికి 8 హెక్టార్లకు, తర్వాత 11 హెక్టార్లకు పెరిగింది. వ్యవసాయక కుటుంబంలో పుట్టిన ఫిలిప్పో చదువు పూర్తి చేసుకొని ఏడేళ్ల క్రితం వ్యవసాయంలోకి దిగాడు. పేరుకు వ్యవసాయమే అయినా వాణిజ్య దృష్టితో సేద్యం చేయటంలో దిట్ట ఫిలిప్పో. అతను పగ్గాలు చేపట్టేటప్పటికి వారి కుటుంబ వ్యవసాయ కంపెనీ పది హెక్టార్లలో పంటలు సాగు చేస్తుండేది. ఈ ఏడేళ్లలోనే 150 హెక్టార్లకు విస్తరించిందంటే యువ రైతు ఫిలిప్పో పట్టుదల, కార్యదక్షతలను అర్థం చేసుకోవచ్చు. 50 హెక్టార్లలో ఇటాలియన్ బసిల్ పంటను పండిస్తున్నాడాయన. బసిల్ తులసి జాతికి చెందిన పంట. ఇందులో తీపి రకం కూడా ఉంటుంది. పచ్చి కూరగాయలు, ఆకుకూరలు, పండ్లతో కూడిన సలాడ్లలో కలుపుకొని తింటారు. బసిల్ నుంచి నూనెను కూడా వెలికితీసి అనేక ఔషధాల్లో వాడుతూ ఉంటారు. 1996లో పుట్టిన ఫిలిప్పోను ఆ దేశంలో కొత్త తరం రైతులకు, వాణిజ్య స్ఫూర్తికి ప్రతీకగా యువత పరిగణిస్తున్నారు. ‘నేను ఏడేళ్ల క్రితం మా వ్యవసాయం బాధ్యతలు తీసుకున్నాను. పది హెక్టార్ల పొలానికి బాధ్యత తీసుకున్నాను. మా తాత ప్రాంరిశ్రామిక పద్ధతుల్లో భారీ విస్తీర్ణంలో టొమాటోలు సాగు చేసేవారు (ఇటలీ ఉత్తర భాగంలో ఎక్కువ టొమాటోలే సాగవుతూ ఉంటాయి). బసిల్ పంటను అధిక విస్తీర్ణంలో పెంచడానికి అనువైనదిగా గుర్తించాను. ఇది అధికాదాయాన్నిచ్చే పంట. అయితే, రైతులు కొద్ది విస్తీర్ణంలోనే సాగు చేస్తున్నారు. నేను భారీ యంత్రాలు ఉపయోగించటం ద్వారా ఎక్కువ విస్తీర్ణంలో సాగు చేయటం ప్రారంభించాను. బసిల్ ఆకులను తాజాగా, సువాసనతో కూడి ఉండాలని దీనితో ఉత్పత్తులు తయారు చేసే కంపెనీలు ఆశిస్తుంటాయి..’ అంటాడు ఫిలిప్పో (బ్రెడ్ఫ్రూట్ (సీమ పనస) : లాభాల గురించి తెలుసా?)మనుషులతో కాకుండా భారీ యంత్రాలతో బసిల్ పంట కోతను చేపట్టాలనుకున్నప్పుడు.. తమ పొలంలో మడుల సైజుకు తగిన విధంగా పంట కోత యంత్రాన్ని ఆయన ప్రత్యేకంగా డిజైన్ చేయించి తయారు చేయించాడు. ఫిలిప్పో ఫిలిప్ఫో బసిల్ ఆకును ఆ రంగంలో వేళ్లూనుకున్న 6 కంపెనీలకు విక్రయిస్తుంటాడు. ‘నేను ఆర్థిక శాస్త్రం, వాణిజ్య శాస్త్రం చదివాను. కానీ, వ్యవసాయం అంటే నాకు చాలా ఇష్టం’ అన్నాడు. ‘ఆరుబయట పొలాల్లో విస్తారంగా బసిల్ పంటను నాణ్యమైన దిగుబడి తీసే విధంగా సాగు చేయటం సవాళ్లతో కూడిన పని. అయితే, ఈ పంటలోనే ఎదిగే అవకాశం ఉందని నేను గుర్తించాను. మా కంపెనీ 3 వేల టన్నుల బసిల్ ఆకులను పండిస్తోంది. టన్ను ధర 550 యూరోలు (సుమారుగా రూ. 49 వేలు). అనేక విషయాలపై ఆధారపడి ఈ ధరలో హెచ్చుతగ్గులుంటాయి అనిఫిలిప్పో చెప్పాడు. 50 ఎకరాల్లో ఏడాదికి రూ. 14.66 లక్షల ఆదాయం పొందుతున్నాడు. (పెరటితోటలో పేనుబంకను వదిలించేదెలా?)ఏప్రిల్ రెండోవారంలో బసిల్ విత్తటం ప్రారంభిస్తాం. మొదటి కోత జూన్ రెండోవారంలో మొదలవుతుంది. అక్టోబర్ వరకు కోతలు కొనసాగుతాయి. ‘ఈ ఏడాది సెప్టెంబర్ రెండో వారం వరకు దిగుబడి, నాణ్యత బాగున్నాయి. భారీ వర్షం కురవటంతో పంట దెబ్బతింది.’ అన్నాడు ఫిలిప్పో. పొద్దున్న, సాయంత్రపు వేళల్లో బసిల్ ఆకుల్ని కత్తిరిస్తే వాటి నాణ్యత, రంగు, వాసన బాగుంటాయి. మేం కత్తిరించిన కొద్ది గంటల్లోనే ఫుడ్ కంపెనీకి చేర్చుతాము అని చెప్పాడు. ఇటలీలో ఒకానొక పెద్ద సహకార బ్యాంకింగ్ వ్యవస్థ ‘ఎలిల్బంక’. ఫిలిప్పో కర్రరకు దీని మద్దతు ఉంది. ఫిలిప్పోకు వ్యవసాయం పట్ల ఉన్న మక్కువ, వ్యాపారాత్మక దృష్టి అమోఘమైనవి’ అని ఎలిల్బంక ప్రతినిధి ఆండ్రియా కలెఫ్పి ప్రశంసించారు. -
నెతన్యాహు అరెస్టవుతారా?
వాషింగ్టన్: గాజాలో యుద్ధ నేరాలకు పాల్పడినందుకు ఇజ్రాయెల్ ప్రధానమంత్రి బెంజమిన్ నెతన్యాహుపై అంతర్జాతీయ క్రిమినల్ కోర్టు(ఐసీసీ) అరెస్టు వారెంట్ జారీ చేసింది. ఆయన నిజంగా అరెస్టవుతారా? అనే దానిపై చర్చ మొదలైంది. ఐసీసీలో మొత్తం 124 సభ్యుదేశాలున్నాయి. అయితే, అన్ని దేశాలూ ఐసీసీ ఆదేశాలను పాటిస్తాయన్న గ్యారంటీ లేదు. అరెస్టు విషయంలో అవి సొంత నిర్ణయం తీసుకోవచ్చు. నెతన్యాహు తమ దేశానికి వస్తే అరెస్టు చేస్తామని ఇటలీ ప్రకటించింది. నెతన్యాహుతోపాటు ఇజ్రాయెల్ రక్షణ శాఖ మాజీ మంత్రి యోవ్ గల్లాంట్ను హమాస్ నేతలతో సమానంగా ఐసీసీ పరిగణించడం సరైంది కాదని ఇటలీ రక్షణ మంత్రి గైడో క్రోసెట్టో చెప్పారు. ఐసీసీ ఆదేశాలను పాటించాల్సిన బాధ్యత తమపై ఉందన్నారు. ఒకవేళ నెతన్యాహు తమ దేశ భూభాగంలోకి ప్రవేశిస్తే చేస్తామని పేర్కొన్నారు. నెతన్యాహు అరెస్టుపై మరికొన్ని యూరోపియన్ యూనియన్ దేశాలు మాత్రం ఆచితూచి స్పందించాయి. ఐసీసీని తాము గౌరవిస్తామని, నెతన్యాహు విషయంలో ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని ఫ్రాన్స్ విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి క్రిస్టోఫీ లెమైన్ చెప్పారు. తమ వైఖరిని ఇప్పుడే వెల్లడించలేమని అన్నారు. ఐసీసీ జారీ చేసిన అరెస్టు వారెంట్ ఒక సాధారణ ప్రక్రియ అని, అది తుది తీర్పు కాదని స్పష్టం చేశారు. నెతన్యాహును అరెస్టు చేయబోమని ఇజ్రాయెల్ మిత్రదేశం జర్మనీ సంకేతాలిచ్చింది. ఇజ్రాయెల్ ప్రధానిపై ఐసీసీ అరెస్టు వారెంట్ను హంగెరీ ప్రధానమంత్రి విక్టన్ ఓర్బన్ బహిరంగంగా ఖండించారు. నెతన్యాహు తమ దేశంపై స్వేచ్ఛగా పర్యటించవచ్చని సూచించారు. పాలస్తీనాకు మద్దతిచ్చే స్లొవేనియా దేశం ఐసీసీ నిర్ణయాన్ని సమర్థించింది. అరెస్టు వారెంట్కు స్లొవేనియా ప్రధానమంత్రి రాబర్ట్ గొలోబ్ మద్దతు ప్రకటించారు. అంతర్జాతీయ క్రిమినల్ కోర్టు నిర్ణయాన్ని అమలు చేయడం అనేది రాజకీయపరమైన ఐచి్ఛకాంశం కాదని, చట్టపరమైన నిబంధన అని యూరోపియన్ యూనియన్ విదేశాంగ విధానం చీఫ్ జోసెఫ్ బోరెల్ చెప్పారు. ఐసీసీ నిర్ణయాన్ని అగ్రరాజ్యం అమెరికా ఖండించింది. ఇలాంటి అరెస్టు వారెంట్లతో పరిస్థితి మరింత విషమిస్తుందని అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ చెప్పారు. రష్యా అధ్యక్షుడు పుతిన్పై ఐసీసీ గత ఏడాది అరెస్టు వారెంట్ జారీ చేసింది. కానీ, ఆయన ఇప్పటికీ అరెస్టు కాలేదు. ఐసీసీ సభ్యదేశాలకు పుతిన్ వెళ్లలేదు. -
ఒక డాలరుకే ఇల్లు.. ట్రంప్ నచ్చని వాళ్లు వచ్చేయండి!
అమెరికా అధ్యక్ష ఎన్నికలు యావత్ ప్రపంచం దృష్టిని ఆకర్షించాయి. రిపబ్లికన్ పార్టీ అభ్యర్థి డొనాల్డ్ ట్రంప్ విజయం సాధించారు. రెండో పర్యాయం పదవీకాలాన్ని వచ్చే జనవరి 20న ప్రారంభించబోతున్నారు.అమెరికన్లు ఎన్నికల ఫలితాలపై మిశ్రమ భావోద్వేగాలతో ఉన్నారు. ఈసారి ట్రంప్ పరిపాలన ఎలా ఉండబోతుందో అన్న ఆందోళన కొంత మందిలో ఉంది. చాలా మంది డెమొక్రాట్ మద్దతుదారులు ఇప్పుడిప్పుడే ఎన్నికల షాక్ నుండి బయటపడుతున్నారు. ఈ పరిస్థితిని అదనుగా తీసుకుని ఇటాలియన్ ద్వీపం సార్డినియాలోని ఒక గ్రామం జనాభాను పెంచుకోవడానికి వినూత్న ఆఫర్తో ముందుకొచ్చింది.వార్తా సంస్థ సీఎన్ఎన్ ప్రకారం.. యూఎస్ ఎన్నికల ఫలితాలతో కలత చెందిన అమెరికన్లకు ఒక డాలర్కే గృహాలను అందిస్తోంది. గ్రామీణ ఇటలీలోని అనేక ఇతర ప్రదేశాల మాదిరిగానే ‘ఒల్లోలై’ గ్రామం కూడా తీవ్రమైన జనాభా కొరతను ఎదుర్కొంటోంది. పునరుద్ధరణ కోసం బయటి వ్యక్తులను ఆకర్షించడానికి చాలా కాలంగా ప్రయత్నిస్తోంది. శిథిలావస్థకు చేరిన ఇళ్లను కేవలం ఒక డాలర్ ధరకే విక్రయిస్తోంది.రాజకీయాలతో అలసిపోయారా?ఇటీవల అమెరికా అధ్యక్ష ఎన్నికల ఫలితాల అనంతరం అమెరికన్ నిర్వాసితులను లక్ష్యంగా చేసుకుని వెబ్సైట్ను ప్రారంభించింది. కొత్త పాలనతో ఆందోళన ఉన్నవారిని తమ గ్రామానికి ఆకర్షిస్తూ చౌకగా గృహాలను అందిస్తోంది. "మీరు ప్రపంచ రాజకీయాల వల్ల అలసిపోయారా? కొత్త అవకాశాలను పొందుతూ మరింత సమతుల్య జీవనశైలిని స్వీకరించాలని చూస్తున్నారా?" అంటూ వెబ్సైట్ అమెరికన్ల దృష్టిని ఆకర్షిస్తోంది.అధ్యక్ష ఎన్నికల నేపథ్యంలో అమెరికన్ ఓటర్లను ఆకర్షించేందుకు ఈ వెబ్సైట్ను ప్రత్యేకంగా రూపొందించినట్లు మేయర్ ఫ్రాన్సిస్కో కొలంబు సీఎన్ఎన్తో చెప్పారు. ఇతర దేశాల నుండి వచ్చేవారిని కూడా తాము వద్దనమని, అయితే అమెరికన్లకు ఫాస్ట్-ట్రాక్ విధానం ఉంటుందని పేర్కొన్నారు.క్రూయిజ్ కూడా..ఈ ఇటాలియన్ గ్రామంతో పాటు అమెరికా ఎన్నికల ఫలితాలతో అసంతృప్తిగా ఉన్న అమెరికన్లు ట్రంప్ కొత్త పాలన నుంచి దూరంగా వెళ్లేందుకు క్రూయిజ్ లైన్ కూడా అందుబాటులోకి వచ్చింది. "స్కిప్ ఫార్వర్డ్" పేరుతో సర్వీస్ ప్రారంభమైంది. దీంతో దేశంలో ట్రంప్ పాలన ముగిసే వరకు 140 దేశాలలో 425 పోర్టులు తిరిగి రావచ్చు. -
18 ఏళ్ల తర్వాత తొలిసారి..
పురుషుల టెన్నిస్ సీజన్ ముగింపు టోర్నమెంట్ ఏటీపీ ఫైనల్స్లో ఈసారి నూతన చాంపియన్ అవతరించనున్నాడు. ఇటలీలోని ట్యూరిన్ వేదికగా జరుగుతున్న ఈ ప్రతిష్టాత్మక టోర్నీలో అమెరికా ప్లేయర్, ఈ ఏడాది యూఎస్ ఓపెన్ రన్నరప్ టేలర్ ఫ్రిట్జ్ ఫైనల్లోకి దూసుకెళ్లాడు. శనివారం జరిగిన పురుషుల సింగిల్స్ తొలి సెమీఫైనల్లో ప్రపంచ ఐదో ర్యాంకర్ టేలర్ ఫ్రిట్జ్(Taylor Fritz) 6–3, 3–6, 7–6 (7/3)తో రెండుసార్లు చాంపియన్ (2018, 2021), ప్రపంచ రెండో ర్యాంకర్ అలెగ్జాండర్ జ్వెరెవ్ (జర్మనీ)పై గెలుపొందాడు.18 ఏళ్ల తర్వాతఫలితంగా 18 ఏళ్ల తర్వాత ఈ మెగా టోర్నీలో ఓ అమెరికా ఆటగాడు టైటిల్ కోసం తలపడనున్నాడు. చివరిసారి 2006లో అమెరికా ప్లేయర్ జేమ్స్ బ్లేక్ ఫైనల్లోకి ప్రవేశించి తుది సమరంలో రోజర్ ఫెడరర్ (స్విట్జర్లాండ్) చేతిలో ఓడిపోయి రన్నరప్గా నిలిచాడు. 1999లో పీట్ సంప్రాస్ తర్వాత మరో అమెరికా ప్లేయర్ ఏటీపీ ఫైనల్స్లో టైటిల్ సాధించలేకపోయాడు.ఇక జ్వెరెవ్తో 2 గంటల 21 నిమిషాలపాటు జరిగిన సెమీఫైనల్లో ఫ్రిట్జ్ 15 ఏస్లు సంధించాడు. ఒకసారి తన సర్వీస్ను కోల్పోయి, ఒకసారి జ్వెరెవ్ సర్వీస్ను బ్రేక్ చేశాడు. 31 విన్నర్స్ కొట్టిన ఫ్రిట్జ్ 34 అనవసర తప్పిదాలు చేశాడు. ఫ్రిట్జ్తో సినెర్ అమీతుమీఇదిలా ఉంటే.. ప్రపంచ నంబర్వన్ యానిక్ సినెర్ (ఇటలీ), ప్రపంచ ఆరో ర్యాంకర్ కాస్పర్ రూడ్ (నార్వే) మధ్య జరిగిన రెండో సెమీఫైనల్లో.. సినెర్ అద్భుత విజయం సాధించాడు. రూడ్ను 6-1, 6-2తో చిత్తు చేసి టైటిల్ పోరుకు అర్హత సాధించాడు. ఈ క్రమంలో టేలర్ ఫ్రిట్జ్తో అమీతుమీ తేల్చుకోనున్నాడు.రొనాల్డో మ్యాజిక్ పోర్టో: యూరోప్ నేషన్స్ లీగ్ ఫుట్బాల్ టోర్నమెంట్లో పోర్చుగల్ జట్టు క్వార్టర్ ఫైనల్ బెర్త్ను ఖరారు చేసుకుంది. పోలాండ్ జట్టుతో జరిగిన గ్రూప్ ‘ఎ’ లీగ్ మ్యాచ్లో క్రిస్టియానో రొనాల్డో నాయకత్వంలోని పోర్చుగల్ జట్టు 5–1 గోల్స్ తేడాతో ఘనవిజయం సాధించింది. పోర్చుగల్ తరఫున రొనాల్డో రెండు గోల్స్ (72వ, 87వ నిమిషాల్లో) సాధించాడు. 87వ నిమిషంలో రొనాల్డో గాల్లో ఎగురుతూ ఓవర్హెడ్ కిక్తో చేసిన గోల్ మ్యాచ్కే హైలైట్గా నిలిచింది. రాఫెల్ లియో (59వ నిమిషంలో), ఫెర్నాండెస్ (80వ నిమిషంలో), పెడ్రో నెటో (83వ నిమిషంలో) పోర్చుగల్కు ఒక్కో గోల్ సాధించి పెట్టారు. పోలాండ్ జట్టుకు మార్జుక్ (88వ నిమిషంలో) ఏకైక గోల్ అందించాడు. -
సరోగసీ టూరిజం నేరం
సరోగసీపై చట్టాన్ని ఇటలీ విస్తృతం చేసింది. సరోగసీ టూరిజాన్ని నేరంగా పరిగణిస్తూ చట్టం చేసింది. బ్రదర్స్ ఆఫ్ ఇటలీ పార్టీ ప్రతిపాదించిన బిల్లును సెనేట్ 58–84 ఓట్ల తేడాతో ఆమోదించింది. ఈ చట్టం 2004 నుంచే ఇటలీలో అమలులో ఉన్న సరోగసీ నిషేధాన్ని యునైటెడ్ స్టేట్స్, కెనడా వంటి దేశాలకు వెళ్లేవారికి వర్తింపజేస్తుంది. దీనిని ఉల్లంఘించిన వారికి ఒక మిలియన్ డాలర్ల వరకు జరిమానా, రెండు సంవత్సరాల జైలు శిక్ష విధించే అవకాశం ఉంది. అయితే సరోగసీ ద్వారా జని్మంచిన పిల్లలను ఇప్పటికే దేశంలో నమోదు చేసుకున్న తల్లిదండ్రులను ఈ చట్టం ప్రభావితం చేయబోదు. అయితే తమ పిల్లలు పాఠశాలలో చేరి్పంచే సమయంలో సమస్యల పాలవుతామని తల్లిదండ్రులు ఆందోళన చెందుతున్నారు. సెనేట్ నిర్ణయాన్ని ప్రధానమంత్రి జార్జియా మెలోని స్వాగతించారు. కాగా, కొత్త చట్టాన్ని వ్యతిరేకిస్తూ సెనేట్ దగ్గర కొందరు నిరసన ప్రదర్శనలు చేశారు. ఎల్జీబీటీక్యూ జంటలను తల్లిదండ్రులుగా మారకుండా చేసే ఈ చట్టాలు మధ్యయుగాల నాటివని విమర్శించారు. మెలోనీ 2022లో పదవీ బాధ్యతలు స్వీకరించినప్పటి నుంచి అత్యంత సాంప్రదాయిక సామాజిక ఎజెండాను అనుసరిస్తున్నారని మండిపడ్డారు. స్వలింగ సంఘాలను చట్టబద్ధం చేసిన చివరి యురోపియన్ దేశాల్లో ఇటలీ ఒకటి. ఇటాలియన్ కేథలిక్ చర్చి ఒత్తిడితో స్వలింగ వివాహాలకు మాత్రం ఇంకా చట్టబద్ధత ఇవ్వలేదు. పోప్ ఫ్రాన్సిస్ సరోగసీపై ఈ సంవత్సరం ప్రారంభంలో ప్రపంచ నిషేధానికి పిలుపునిచ్చారు. పిల్లలు దేవుడు ఇచ్చే బహుమతి అని, వాణిజ్య ఒప్పందం కాదని నొక్కి చెప్పారు. ఎల్జీబీటీక్యూ వ్యక్తులను చర్చికి స్వాగతిస్తూ ఫ్రాన్సిస్ చర్చి విధానాలను మార్చారు. అబార్షన్, సరోగసీలను మాత్రం బలంగా వ్యతిరేకిస్తున్నారు. ఈ కొత్త చట్టం రాజకీయంగా మెలోనికి సవాలుగా మారవచ్చని పరిశీలకులు భావిస్తున్నారు. – సాక్షి, నేషనల్ డెస్క్ -
సినెర్ మెడకు ‘వాడా’ ఉచ్చు
హతవిధి... సినెర్ను అంతర్జాతీయ టెన్నిస్ ఇంటిగ్రిటీ ఏజెన్సీ (ఐటీఐఏ) కరుణించినా... డోపింగ్ మరక మాత్రం నీడలా వెంటాడుతోంది. మార్చిలో దొరికినా... ఆగస్టు దాకా గోప్యంగా ఉంచేందుకు జాగ్రత్త పడినా... ఒక్క విన్నపంతో ఆశ్చర్యకరంగా నిషేధం బారిన పడకపోయినా... ప్రపంచ డోపింగ్ నిరోధక సంస్థ (వాడా) డేగకన్ను నుంచి తప్పించుకోలేకపోయాడు. దీంతో ఈ వివాదం మళ్లీ తెరపైకి వచ్చింది. రోమ్: ప్రపంచ నంబర్వన్ టెన్నిస్ ప్లేయర్ యానిక్ సినెర్ను పాత వివాదం కొత్తగా చుట్టుకుంటోంది. డోపింగ్లో దొరికిపోయినా కనీసం ప్రొవిజనల్ సస్పెన్షన్ (తాత్కాలిక నిషేధం), తదుపరి సస్పెన్షన్ నుంచి తప్పించుకున్న ఈ ఇటలీ స్టార్ ప్రపంచ డోపింగ్ నిరోధక సంస్థ (వాడా) కన్నుగప్పలేకపోయాడు. నిషిద్ధ ఉ్రత్పేరకాలు తీసుకున్నట్లు రెండుసార్లు పరీక్షల్లో తేలినా నిషేధం విధించకపోవడం ఏంటని ‘వాడా’ రంగంలోకి దిగింది. తాజా యూఎస్ ఓపెన్ గ్రాండ్స్లామ్ టోర్నీ చాంపియన్ను ఒకటి లేదా రెండేళ్ల పాటు నిషేధించాల్సిందేనని ‘వాడా’ కోర్ట్ ఆఫ్ ఆర్బిట్రేషన్ ఫర్ స్పోర్ట్స్ (సీఏఎస్) తలుపు తట్టింది. ఈ మేరకు స్విట్జర్లాండ్లోని సీఏఎస్లో ‘వాడా’ అప్పీలు చేసింది. నిజానికి 23 ఏళ్ల సినెర్ దోషిగా తేలాడు. తాజా అప్పీలుపై జరిగే విచారణలో సీఏఎస్ సస్పెన్షన్కు గురైతే మాత్రం యూఎస్ ఓపెన్ టైటిల్ను కోల్పోవాల్సి వస్తుంది. ప్రస్తుతం బీజింగ్లో చైనా ఓపెన్ ఆడుతున్న సినెర్... ‘వాడా’ అప్పీలుకు వెళ్లడంపై విచారం వ్యక్తం చేశాడు. ‘ఇది నన్ను చాలా నిరాశపరుస్తోంది.అంతేకాదు ఆశ్చర్యానికి గురయ్యేలా చేస్తోంది. నిజాయితీగా చెబుతున్నా... నేను ఇదివరకే మూడు విచారణలకు హాజరయ్యా. అన్నింటిలోనూ నాకు అనుకూలంగానే తీర్పు వచ్చింది. ‘వాడా’ అప్పీలును నేను ఊహించలేదు. దీని గురించి నాకు రెండు రోజుల క్రితమే తెలిసింది’ అని సినెర్ అన్నాడు. మరోవైపు ‘వాడా’ అధికారి ఒకరు మాట్లాడుతూ ఇందులో ఎలాంటి తప్పు జరగలేదని, నిర్లక్ష్యపూరితంగా వ్యవహరించలేదని తెలుసుకోవడం ‘వాడా’ లక్ష్యమని అన్నాడు. అప్పుడేం జరిగింది? ఈ ఏడాది మార్చిలో ఇండియన్ వెల్స్ టోర్నీ జరిగింది. ఆ సమయంలో, టోర్నీ ముగిశాక... ఈ రెండు సందర్భాల్లోనూ సినెర్ ఇచ్చిన శాంపిల్స్లో నిషిద్ధ ఉ్రత్పేరకం ‘క్లోస్టెబల్’ ఉన్నట్లు తేలింది. అంటే ఏకంగా ఒకే నెలలో రెండుసార్లు డోపింగ్లో పట్టుబడ్డాడు. దీంతో ఆ టోర్నీలో సెమీస్ చేరడంతో వచ్చిన ప్రైజ్మనీని వెనక్కి తీసుకోవడంతో పాటు, 400 ర్యాంకింగ్ పాయింట్లను కోతగా విధించారు. దీనిపై అప్పీలుకు వెళ్లిన సినెర్ ఉద్దేశపూర్వకంగా తీసుకోలేదదని, తన ఫిజియో మసాజ్ చేసే సమయంలో కొట్టిన స్ప్రేతో శరీరంలోకి ప్రవేశించిందని, ఇకపై ఇలాంటి పొరపాట్లు జరగకుండా డోపింగ్ నిబంధనల్ని నిక్కచ్చిగా పాటిస్తానని విన్నవించాడు. ఐటీఐఏ ఏర్పాటు చేసిన ఇండిపెండెంట్ ప్యానెల్ అతని విన్నపాన్ని మన్నించి... క్లీన్చిట్ ఇవ్వడం అప్పట్లోనే వివాదాస్పదమైంది. అలనాటి అమెరికా టెన్నిస్ దిగ్గజం క్రిస్ ఎవర్ట్ సహా షపవలోవ్ (కెనడా), కిరియోస్ (ఆస్ట్రేలియా) సోషల్ మీడియా వేదికగా తీవ్రస్థాయిలో మండిపడ్డారు. ఒక్కొక్కరికి ఒక్కోలా నిబంధనలుంటాయా అని ప్యానెల్ నిర్ణయాన్ని తప్పుబట్టారు. సూపర్ ఫామ్లో... ఈ ఏడాది సినెర్ సూపర్ ఫామ్లో ఉన్నాడు. రెండు గ్రాండ్స్లామ్ టోర్నీలలో (ఆ్రస్టేలియన్, యూఎస్ ఓపెన్) విజేతగా నిలువడంతోపాటు మరో నాలుగు టోర్నీల్లో టైటిల్స్ సాధించాడు. ప్రస్తుతం బీజింగ్లో జరుగుతున్న చైనా ఓపెన్లో క్వార్టర్ ఫైనల్ చేరుకున్న సినెర్ ఈ ఏడాది 57 మ్యాచ్ల్లో గెలిచి, కేవలం ఐదు మ్యాచ్ల్లో ఓడిపోయాడు. -
ఇటలీ ప్రధానితో డేటింగ్? స్పందించిన మస్క్
ప్రపంచ కుబేరుడు ఎలాన్ మస్క్, ఇటలీ ప్రధాని జార్జియా మెలోనికి సంబంధించిన ఫొటోలు సోషల్ మీడియాలో వైరలయ్యాయి. ఇటీవల వీరు ఓ కార్యక్రమంలో పాల్గొనగా.. ఇద్దరు వారు పక్కపక్కనే కూర్చొని మాట్లాడుకుంటున్న ఫొటోలు చక్కర్లు కొడుతుండటంతో నెట్టింట్లో రూమర్లు గుప్పుమన్నాయి. ఇద్దరూ డేటింగ్లో ఉన్నట్లు పలువురు నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు.ఓ నెటిజన్ స్పందిస్తూ ‘వీరు డేట్కు వెళ్తారని అనుకుంటున్నారా?’ అంటూ పోస్ట్ పెట్టారు. ఈ నేపథ్యంలో మస్క్ తన ఎక్స్ అకౌంట్లో స్పందించారు. తమ మధ్య డేటింగ్ జరగడం లేదంటూ ఆయన పోస్టు చేశారు.Do you think They’ll date? 🤣 pic.twitter.com/XXs1U45kjb— Tesla Owners Silicon Valley (@teslaownersSV) September 24, 2024కాగా మంగళవారం న్యూయార్క్లో జరిగిన అవార్డుల ప్రధానోత్సవం కార్యక్రమంలో.. అట్లాంటిక్ కౌన్సిల్ గ్లోబల్ సిటిజన్ అవార్డును మస్క్ మెలోనీకి అందజేశారు. మస్క్ ఆమెకు పురస్కారాన్ని అందజేస్తూ ప్రశంసలతో ముంచెత్తారు. ఇటలీ ప్రధానికి అవార్డును అందజేయడం గర్వంగా భావిస్తున్నట్లు మస్క్ అన్నారు. కనిపించే అందం కన్నా..ఆమె మనసు మరింత అందమైందని ఆయన పేర్కొన్నారు. రాజకీయ నాయకుల గురించి కొన్ని పదాలను ఎప్పుడూ చెప్పలేం. కానీ, మెలోనీ అలా కాదని, ఆమె నిజాయతీ గల విశ్వసనీయమైన వ్యక్తిగా ప్రశంసించారు. -
ఇటలీ మేటి ఫుట్బాలర్ స్కిలాచీ కన్నుమూత
రోమ్: ఇటలీ మాజీ ఫుట్బాల్ ప్లేయర్ సాల్వటోర్ స్కిలాచీ(Salvatore Schillaci) బుధవారం కన్నుమూశాడు. 59 ఏళ్ల స్కిలాచీ కొంతకాలంగా క్యాన్సర్ వ్యాధితో పోరాడుతున్నాడు. స్వదేశంలో జరిగిన 1990 ప్రపంచకప్ ఫుట్బాల్ టోర్నీలో స్కిలాచీ 6 గోల్స్తో టాప్ స్కోరర్గా నిలిచి ‘గోల్డెన్ బూట్’ అవార్డు గెలిచాడు. అదే విధంగా..‘ప్లేయర్ ఆఫ్ ద టోర్నీ’కి ఇచ్చే ‘గోల్డెన్ బాల్’ అవార్డును కూడా దక్కించుకున్నాడు. ఇక ఈ మెగా ఈవెంట్లో ఇటలీ మూడో స్థానం సాధించింది. ఫైనల్లో డిఫెండింగ్ చాంపియన్ అర్జెంటీనాను ఓడించిన జర్మనీ విజేతగా నిలిచింది. అయితే వ్యక్తిగత ప్రదర్శనతో ఇటలీ స్ట్రయికర్ స్కిలాచీ అభిమానుల్ని అలరించాడు.చదవండి: మాళవిక సంచలనం -
దిగ్గజాలకు గడ్డుకాలం: భవిష్యత్తు అతడిదేనా!
సుదీర్ఘకాలంగా గ్రాండ్స్లామ్ సింగిల్స్ టైటిల్ కోసం ఎదురుచూస్తున్న ఇటలీకి ఈ ఏడాది రెండు టైటిల్స్ దక్కాయి. పురుషుల సింగిల్స్లో ప్రపంచ నంబర్వన్ యానిక్ సినెర్ ఆస్ట్రేలియా ఓపెన్, యూఎస్ ఓపెన్ గ్రాండ్స్లామ్ టోర్నీలలో విజేతగా నిలిచాడు. వందేళ్ల తర్వాత ఒలింపిక్స్లో ఇటలీ ఆటగాడు లొరెంజో ముసెట్టి కాంస్య పతకం సాధించాడు. మహిళల సింగిల్స్లో జాస్మిన్ పావోలిని జోరు సాగిస్తుంటే... డబుల్స్లోనూ లెక్కకు మిక్కిలి జోడీలు టైటిల్స్తో సత్తా చాటుతున్నాయి. టెన్నిస్ కోర్టులో అడుగు పెడితే విజేతగా నిలవడమే లక్ష్యంగా ఇటలీ ప్లేయర్లు ముందుకు సాగుతున్నారు. –సాక్షి క్రీడా విభాగం లొరెంజోఈ ఏడాది అంతర్జాతీయ టెన్నిస్ టోర్నీల్లో ఇటలీ ఆటగాళ్ల జోరు సాగుతోంది. పురుషుల సింగిల్స్లో ప్రపంచ నంబర్వన్ ర్యాంకర్ యానిక్ సినెర్ రెండు గ్రాండ్స్లామ్ టైటిల్స్ను సొంతం చేసుకోవడంతోపాటు మరో నాలుగు ఏటీపీ టోర్నీల్లో విజేతగా నిలిచాడు. ఇక మహిళల సింగిల్స్లో జాస్మిన్ పావోలిని వింబుల్డన్ ఓపెన్, ఫ్రెంచ్ ఓపెన్ గ్రాండ్స్లామ్ టోర్నీల్లో రన్నరప్గా నిలిచింది. ఫ్రెంచ్ ఓపెన్ పురుషుల డబుల్స్లో సిమోన్ బొలెలీ–ఆండ్రియా వవసోరి... మహిళల డబుల్స్లో సారా ఎరాని–జాస్మిన్ పావోలిని రన్నరప్గా నిలిచారు. అదే విధంగా.. ఆస్ట్రేలియా ఓపెన్ పురుషుల డబుల్స్లో సిమోన్ బొలెలీ–ఆండె వవసోరి రన్నరప్గా నిలిచారు. ఇక సీజన్ చివరి గ్రాండ్స్లామ్ టోర్నీ యూఎస్ ఓపెన్లో మిక్స్డ్ డబుల్స్లో సారా ఎరాని–వవసోరకి జోడీ చాంపియన్గా అవతరించింది. ప్రతిష్టాత్మక పారిస్ ఒలింపిక్స్ మహిళల డబుల్స్లో సారా ఎరాని–జాస్మిన్ పావోలిని జంట స్వర్ణ పతకం గెలుచుకోగా... పురుషుల సింగిల్స్లో లొరెంజో ముసెట్టి కాంస్య పతకంతో మెరిశాడు. విశ్వక్రీడల పురుషుల సింగిల్స్లో వందేళ్ల తర్వాత ఇటలీకి ఇదే తొలి పతకం కావడం విశేషం. భవిష్యత్తు అతడిదేనా! సీజన్ ఆరంభ గ్రాండ్స్లామ్ టోర్నీ ఆస్ట్రేలియా ఓపెన్ టైటిల్ గెలవడంతో దాదాపు ఐదు దశాబ్దాల తర్వాత గ్రాండ్స్లామ్ గెలిచిన ఇటలీ ప్లేయర్గా సినెర్ రికార్డుల్లోకి ఎక్కాడు. చివరిసారిగా 1976 ఫ్రెంచ్ ఓపెన్లో ఇటలీ నుంచి ఆండ్రియానో పనట్టా టైటిల్ గెలిచాడు. ఇక సీజన్ చివరి గ్రాండ్స్లామ్ టోర్నీ యూఎస్ ఓపెన్లో చాంపియన్గా నిలవడం ద్వారా ఈ ఘనత సాధించిన తొలి ఇటలీ ప్లేయర్గా చరిత్ర సృష్టించాడు. గత కొంతకాలంగా నిలకడ సాగిస్తున్న 23 ఏళ్ల సినెర్ భవిష్యత్తు తనదే అని చెప్పకనే చెబుతున్నాడు. ఈ ఏడాది అతడు ఆడిన 60 మ్యాచ్ల్లో 55 విజయాలు సాధించాడంటే సినెర్ జోరు ఎలా సాగుతోందో అర్థం చేసుకోవచ్చు. ఆస్ట్రేలియన్ ఓపెన్, యూఎస్ ఓపెన్ గ్రాండ్స్లామ్స్తో పాటు... రోటర్డామ్ ఓపెన్, మయామి మాస్టర్స్, హాలె ఓపెన్, సిన్సినాటి మాస్టర్స్లోనూ చాంపియన్గా నిలిచిన సినెర్ ఈ ఏడాది ఓవరాల్గా ఆరు టైటిల్స్ ఖాతాలో వేసుకున్నాడు. ఇక స్విట్జర్లాండ్ దిగ్గజం రోజర్ ఫెదరర్ ఆటకు వీడ్కోలు పలకగా... స్పెయిన్ బుల్ రాఫెల్ నాదల్ గాయాలతో సతమతమవుతున్నాడు. సెర్బియా వీరుడు నొవాక్ జొకోవిచ్ కూడా కెరీర్ చరమాంకానికి చేరుకోవడంతో సినెర్ ఇదే నిలకడ కొనసాగిస్తే... భవిష్యత్తులో గొప్ప ఆటగాడిగా పేరు తెచ్చుకునే అవకాశం ఉంది. ఇక మహిళల విభాగంలో జాస్మిన్ అనూహ్య ఆటతీరుతో దూసుకొస్తోంది. మంచి రోజులు ముందున్నాయి... దిగ్గజ ఆటగాళ్లు ఒక్కొక్కరుగా వెనుదిరిగుతున్న తరుణంలో భవిష్యత్తు తమ ప్లేయర్లదే అని ఇటలీ టెన్నిస్ సమాఖ్య అధ్యక్షుడు ఏంజెలో బినాఘి అంటున్నారు. ‘కొత్త తరంలోకి అడుగు పెడుతున్నాం. అందుకు ఇటలీ సిద్ధంగా ఉంది. దిగ్గజ ఆటగాళ్లు ఒక్కొక్కరుగా వెనుదిరుగుతున్నారు. ఇలాంటి సమయంలో అవకాశాలను వినియోగించుకుంటూ సత్తాచాటుతున్నాం. మహిళల విభాగంలోనూ మా పురోభివృద్ధి బాగుంది’ అని బినాఘి అన్నారు.ప్రస్తుతం పురుషుల సింగిల్స్ ప్రపంచ ర్యాంకింగ్స్ టాప్–50లో ఏడుగురు ఇటలీ ప్లేయర్లు ఉన్నారు. కేవలం సింగిల్స్లోనే కాకుండా... డబుల్స్లోనూ ఇటలీ ప్లేయర్లు నిలకడ సాగిస్తున్నారు. ఈ ఏడాది గ్రాండ్స్లామ్ ఫలితాలే ఇందుకు నిదర్శనం. ‘దాదాపు యాభై ఏళ్లుగా గ్రాండ్స్లామ్ టైటిల్ కోసం ఎదురుచూస్తుంటే... ఈ సంవత్సరం సినెర్ రెండు టైటిల్స్తో అదరగొట్టాడు. ఇతర టోర్నీల్లోనూ ఇటలీ ప్లేయర్ల ప్రదర్శన బాగుంది. డేవిస్కప్లో డిఫెండింగ్ చాంపియన్ టైటిల్ నిలబెట్టుకోవడంపై దృష్టి పెట్టాం. ఇదే జోరు సాగిస్తూ సొంతగడ్డపై పెద్ద టోరీ్నలో విజయం సాధించడమే తదుపరి లక్ష్యంగా పెట్టుకున్నాం. విజయవంతంగా సాగుతున్న ఈ ప్రయాణాన్ని ఆస్వాదించేందుకు సిద్ధంగా ఉండండి’ అని బినాఘి పేర్కొన్నారు. ఏటీపీ ఫైనల్స్పై దృష్టి విదేశాల్లో వరస విజయాలు సాధిస్తున్న ఇటలీ ప్లేయర్లు... స్వదేశంలో మాత్రం ఆకట్టుకోలేకపోతున్నారు. ఈ ఏడాది ఫుల్ జోష్ లో ఉన్న సినెర్ గాయం కారణంగా ఇటాలియన్ ఓపెన్ బరిలోకి దిగలేదు. 1976 ఇటాలియన్ ఓపెన్లో చివరిసారిగా స్థానిక ఆటగాడు పనట్టా పురుషుల సింగిల్స్ విజేతగా నిలవగా.. 1985లో మహిళల సింగిల్స్లో రఫ్పెల్లా రెగ్గీ టైటిల్ సాధించింది. అప్పటి నుంచి స్థానిక ఆటగాళ్లెవరూ ఇటాలియన్ ఓపెన్ గెలుచుకోలేదు. ఇకపై స్వదేశంలోనూ సత్తా చాటడంపై దృష్టి పెట్టనున్నట్లు బినాఘి తెలిపారు. ఈ ఏడాది నవంబర్లో వరసగా నాలుగోసారి ఇటలీలో ఏటీపీ ఫైనల్స్ టోర్నీ జరగనుంది. గత ఏడాది జొకోవిచ్ చేతిలో ఓడి రన్నరప్గా నిలిచిన సినెర్ ఈసారి టైటిల్ సాధించాలని కసితో ఉన్నాడు. యూఎస్ ఓపెన్ ప్రారంభానికి ముందు డోపింగ్ వివాదంతో వార్తల్లోకి ఎక్కిన సినెర్ తన ఆటతీరుపై ఆ ప్రభావం పడలేదని నిరూపించుకున్నాడు. ఇటీవల యూఎస్ ఓపెన్ పురుషుల సింగిల్స్ ఫైనల్ను ఇటలీలో ప్రతి పది మందిలో ఒకరు వీక్షించారని బినాఘి తెలిపారు. మౌలిక వసతుల కల్పన వల్లే నైపుణ్యం గల ఆటగాళ్లను వెలికి తీయగలిగామని ఆయన పేర్కొన్నారు. సీనియర్ స్థాయిలోనే కాకుండా... జూనియర్ ఈవెంట్స్లోనూ ఇటలీ ప్లేయర్లు హవా సాగిస్తున్నారు. ఈ ఏడాది జూనియర్ సర్క్యూట్లో ఇటలీ ప్లేయర్లు 10 టైటిట్స్ సాధించారు. చదవండి: పీటీ ఉషపై వినేశ్ ఫొగట్ సంచలన ఆరోపణలు -
ఆడి ఇటలీ అధినేత కన్నుమూత.. 10వేల అడుగుల ఎత్తునుంచి కిందపడి
ఆడి ఇటలీ అధినేత 'ఫాబ్రిజియో లాంగో' (Fabrizio Longo) ఇటాలియన్-స్విస్ సరిహద్దుకు సమీపంలోని ఆడమెల్లోని పర్వతాన్ని అధిరోహిస్తున్న సమయంలో 10,000 అడుగుల ఎత్తు నుంచి కిందపడి మరణించారు.ఫాబ్రిజియో లాంగో.. పర్వతానికి చేరువవుతున్న సమయంలో అనుకోని ప్రమాదం జరిగి లోయలోకి పడినట్లు సమాచారం. పర్వతాలను ఎక్కే సమయంలో తగిన జాగ్రత్తలు తీసుకున్నప్పటికీ.. ఈ ప్రమాదం జరిగింది. తోటి పర్వతారోహకులు ఈ సంఘటనను గమనించి రెస్క్యూ బృందాలను అప్రమత్తం చేశారు, వారు వెంటనే ఘటనాస్థలికి చేరుకున్నారు.రెస్క్యూ బృందాలు ఫాబ్రిజియో లాంగో మృతదేహాన్ని 700 అడుగుల లోయలో కనుగొన్నారు. హెలికాప్టర్ రిట్రీవల్ బృందం తదుపరి పరీక్ష కోసం అతని మృతదేహాన్ని కారిసోలోలోని ఆసుపత్రికి తరలించింది. ఈ ప్రమాదం జరగటానికి కారణాలు ఏంటనే దిశగా విచారణ జరుగుతోంది.ఫాబ్రిజియో లాంగో 1962లో ఇటలీలోని రిమినిలో జన్మించాడు. పొలిటికల్ సైన్స్ పూర్తి చేసిన ఈయన.. 1987లో ఫియట్లో తన ప్రయాణాన్ని ప్రారంభించారు, ఆ సమయంలోనే ఆయన తన మార్కెటింగ్ నైపుణ్యాలను మెరుగుపరుచుకున్నారు. ఆ తరువాత 2002లో లాన్సియా బ్రాండ్కు నాయకత్వం వహించారు. 2012లో ఆడి కంపెనీలో చేరారు. 2013లో ఇటాలియన్ కార్యకలాపాలకు డైరెక్టర్ అయ్యారు. -
మీ సోనియా ఇటలీ నుంచి వచ్చారు కదా !
శివాజీనగర: తాను రాజస్థాన్ నుండి వచ్చినవాడైతే మీ పార్టీ అధినాయకురాలు సోనియాగాంధీ ఇటలీ నుండి వచ్చారు, ఆమె కూడా తమ రాష్ట్ర నుండి రాజ్యసభకు ఎంపికయ్యారనేది మరువరాదని మంత్రి ప్రియాంక్ ఖర్గేకు రాజ్యసభ సభ్యుడు లెహర్ సింగ్ ఎదురుదాడికి దిగారు. కేఐఏడీబీ భూముల వ్యవహారాన్ని ప్రశ్నించినందుకు ఖర్గే జూనియర్ వారి స్నేహితులు రాజస్థాన్ వారని తనపై ఆరోపణ చేశారు. తాను అడిగేందుకు ఇష్టపడుతున్నాను. సోనియాగాంధీ రాజస్థాన్ సభ్యురాలిగా ఎన్నికయ్యారు. ఇటలీలో జని్మంచారు. ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి కే.సీ.వేణుగోపాల్ సికార్లో, రణదీప్ సింగ్ సుర్జేవాలా చురులో జని్మంచారు. వారు ఏ రాష్ట్రం నుండి రాజ్యసభకు ఎంపికయ్యారని ఆయన ప్రశ్నించారు. రాజస్థానీ కావటం నేరమా? రాజస్థాన్ పాకిస్థాన్లో లేదని అన్నారు. నెహ్రూ కుటుంబం ఉత్తరప్రదేశ్ నుండి వచ్చిందా లేదా కాశీ్మర్ నుండి వచ్చిందా అని ప్రశ్నించారు. తాను 59 సంవత్సరాల నుండి కర్ణాటకలో నివసిస్తున్నాను. తాను కన్నడ మాట్లాడుతున్నాను. చదువుతాను, రాస్తాను. తాను కర్ణాటక బీజేపీలో కోశాధికారి అని, తాను తన పార్టీలో ఎమ్మెల్సీ, ఎంపీగా సేవలందించాను. తాను రాజకీయం వంశం నుండి వచ్చినవాడు కాదు. రాహుల్ గాని, ఖర్గే జూనియర్.. రాళ్లు వేసే ముందు గాజు గదిలో ఉన్నారనేది తెలుసుకోవాలి అని లెహర్ సింగ్ ధ్వజమెత్తారు. -
దొంగను పట్టించిన పుస్తకం..పాపం చోరికి వచ్చి..!
దొంగతనానికి వచ్చి కొందరు దొంగలు అక్కడ ఏమి లేకపోవడంతో లెటర్ రాసి పెట్టి వెళ్లిన ఘటనలు చూశాం. ఒక దొంగ చోరికి వచ్చి చక్కగా ఏసీ కింద పడుకున్న ఉదంతాన్ని కూడా చూశాం. ఇవన్నీ ఒక ఎత్తైతే పాపం ఈ దొంగను ఓ బుక్ అడ్డంగా బుక్చేసింది. తప్పించుకునేందుకు వీల్లేకుండా పోలీసులకు పట్టుబడేలా చేసింది. ఈ విచిత్ర ఘటన ఇటలీలో చోటు చేసుకుంది. అసలేం జరిగిందంటే..ఇటలీ రాజధాని రోమ్లోని ఒక ఇంటిలో చోరి చేసేందుకు ఒక దొంగ వచ్చాడు. రాత్రిపూట ఆ ఇంటి బాల్కనీ గుండా లోనికి ప్రవేశించి దొంగతనం చేసేందుకు యత్నిస్తుండగా..అక్కడే ఉన్న పుస్తకం దొంగగారిని తెగ ఆకర్షించింది. చదవకుండా ఉండలేకపోయాడు. ఇక అంతే ఆ పుస్తకం తీసుకుని చదవడం ప్రారంభించాడు. ఎంతలా అంటే అందులో నిమగ్నమైపోయాడు. ఇంతలో తెల్లారిపోయింది. మెలుకువ వచ్చి యజమాని చూడగా..అపరిచిత వ్యక్తి పుస్తకం చదువుతూ కనిపించాడు. వెంటనే అప్రమత్తమై పోలీసులకు కాల్ చేశాడు. అతడిని సమీపించి ఎవరు నువ్వు అని తట్టి అడిగేంత వరకు దొంగ ఈ లోకంలో లేనేలేడు. మనోడుకి దొరికిపోయానని అర్థమై.. తప్పించుకునేందుకు వీలుపడలేదు. ఇంతలో పోలీసులు రావడం దొంగని అరెస్టు చేయడం చకచక జరిగిపోయాయి. అయితే ఈ దొంగను ఆకర్షించిన పుస్తకం ఏంటంటే..గ్రీకు పురాణాలకి సంబంధించిన హుమర్స్ ఇలియాడ్ పుస్తకం. అది ఈ దొంగను తెగ ఆకర్షించింది. దీంతో దొంగ ఆ పుస్తక చదవడంలో మునిగిపోయి చోరీ విషయం మర్చిపోయి పట్టుబడ్డాడు. అయితే ఆ ఇంటి యజమాని మాత్రం పాపం అతడు చదవకుండా మధ్య వదిలేయాల్సి వచ్చిన ఆ పుస్తకం కాపీని ఆ దొంగకు పంపిస్తానని అన్నాడు. ఎందుకంటే ఆ పుస్తకమే కదా దొంగతనాన్ని నిరోధించింది. అలాగే ఇది అతడిలో మార్పు తీసుకొచ్చేందుకు ఉపయోగపడుతుందని నమ్మకంగా చెబుతున్నాడు సదరు యజమాని. (చదవండి: చప్పన్ భోగ్ థాలీ అంటే..? ఏం ఉంటాయంటే..) -
లవ్బర్డ్స్ కొత్త ప్రయాణం: సిగ్గులమొగ్గైన కొత్త పెళ్లికూతురు అమీ
నటి, మోడల్ అమీ జాక్సన్ ఎట్టకేలకు తన ప్రియుడిని పెళ్లాడింది. తాజాగా (ఆగస్ట్ 25, 2024న), నటుడు మ్యూజీషియన్ ఎడ్వర్డ్ వెస్ట్ విక్ను వివాహం చేసుకుంది. ఈ విషయాన్ని స్వయంగా ఈ లవ్బర్డ్స్ స్వయంగా సోషల్ మీడియా ద్వారా ప్రకటించారు. సరికొత్త ప్రయాణం మొదలైంది అంటూ తమ సంతోషాన్ని వెల్లడించారు. ఇటలీలో జరిగిన ఈ వివాహ వేడుకలో ఎడ్ వెస్ట్విక్ అమీని ఎత్తుకొని ముద్దుపెట్టుకోవడంతో అమీ జాక్సన్ సిగ్గుల మొగ్గయింది. ఈ ఫోటోలు ఇంటర్నెట్లో సందడి చేస్తున్నాయి.అంతకుముందు బ్రిటిస్ వ్యాపారవేత్త ఆండ్రియాస్ పనాయోటౌతో కొన్నిరోజులు సహజీవనం చేసింది. ఈ క్రమంలోనే వీరికి ఒక మగబిడ్డకూడా పుట్టాడు.కానీ ఆ తరువాత విభేదాల కారణంగా ఇద్దరూ విడిపోయారు. పనాయోటౌతో తన బంధం ముగిసినట్లు స్వయంగా అమీ జాక్సన్ 2021లో ప్రకటించిన సంగతి తెలిసిందే. View this post on Instagram A post shared by Ed Westwick (@edwestwick) -
అమెరికాను బోల్తా కొట్టించి స్వర్ణం గెలిచిన ఇటలీ మహిళల వాలీబాల్ జట్టు
పారిస్ ఒలింపిక్స్లో చివరి రోజు సంచలన ఫలితం వచ్చి0ది. మహిళల వాలీబాల్ ఈవెంట్లో డిఫెండింగ్ చాంపియన్ అమెరికా జట్టుకు ఊహించని పరాజయం ఎదురైంది. తొలిసారి ఫైనల్ చేరిన ఇటలీ జట్టు 25–18, 25–20, 25–17తో అమెరికా జట్టును ఓడించి మొదటిసారి ఒలింపిక్స్లో స్వర్ణ పతకాన్ని సొంతం చేసుకుంది. మ్యాచ్ అనంతరం ఇటలీ సీనియర్ క్రీడాకారిణి, నాలుగోసారి ఒలింపిక్స్లో పోటీపడ్డ మోనికా డి జెనారోను సభ్యులంతా గాల్లో ఎగరేసి సంబరం చేసుకున్నారు. మాజీ చాంపియన్ బ్రెజిల్ 25–21, 27–25, 22–25, 25–15తో టర్కీ జట్టును ఓడించి కాంస్య పతకం సాధించింది. ఫైనల్లో అమెరికా జట్టు ఓడిపోయినా ఒలింపిక్స్ మహిళల వాలీబాల్లో అత్యధికంగా ఏడు పతకాలు సాధించిన జట్టుగా అవతరించింది. అమెరికా జట్టు ఒలింపిక్స్లో ఒక స్వర్ణం, నాలుగు రజతాలు, రెండు కాంస్యాలు దక్కించుకుంది. సోవియట్ యూనియన్, చైనా, జపాన్, బ్రెజిల్ ఆరు పతకాల చొప్పున నెగ్గాయి. -
అక్కడ ఫ్రీగా కావాల్సినంత రెడ్ వైన్ తాగేయొచ్చు..!
ఇటలీ దేశంలో డోరా సర్చెస్ అనే ద్రాక్షతోట యజమానులు ఫ్రీ రెడ్ వైన్ ఫౌంటెన్ ఏర్పాటు చేశారు. ఈ ఫౌంటెన్ వద్ద రెడ్ వైన్ 365 రోజులు ఉచితంగా లభిస్తుంది. వాస్తవానికి ఇటలీ దేశంలో ఉచితంగా వైన్ అందించడం కొత్తకాదు. మారినో అనే పట్టణంలో ప్రతి ఏడాది గ్రేప్ ఫెస్టివల్ జరుగుతుంది. ఒక గంట పాటు ప్రజల కోసం పబ్లిక్ వాటర్ ఫౌంటెన్ ట్యాప్ లలో వైట్ వైన్ డిస్ట్రిబ్యూట్ చేస్తారు. కానీ ఇక్కడ మాత్రం ప్రతిరోజు రెడ్ వైన్ అందుబాటులో ఉండటం విశేషం. ఇటలీ దేశంలో ఉన్న ఈ రెడ్ వైన్ ఉచితంగా అందించే మొదటి ఫౌంటెన్ గా ఇది గుర్తింపు పొందింది.ఎందుకిలా అంటే..ఇటలీ దేశంలో విభిన్నమైన సేవలు అందించాలని ఇక్కడి ద్రాక్ష యజమానులు అప్పట్లో భావించారు. అందులో భాగంగానే ఫ్రీ వైన్ ఫౌంటెన్ ఏర్పాటు చేశారు. ప్రఖ్యాత రోమ్ నగరం నుంచి ఒర్టోనా వరకు 196 మైళ్ళ దూరం ఉంటుంది. ఇంత దూరం ప్రతి ఏడాది సాంస్కృతిక యాత్ర నిర్వహిస్తారు. ఈ కార్యక్రమంలో కొన్ని వేల మంది కేథలిక్ లు పాల్గొంటారు. ఈ దారి వెంట ప్రయాణం సాగించే వారి బడలిక తీర్చేందుకు ప్రసిద్ధ కామినో డి షాన్ టోమ్మాసో దగ్గర ఈ వైన్ ఫౌంటెన్ ఏర్పాటు చేశారు.ప్రయాణికులు ట్యాప్ తిప్పి తమకు కావలసిన పరిమాణంలో వైన్ తాగి ముందుకు వెళ్తారు. మరింత కావలసిన వాళ్లు పెద్ద పెద్ద బాటిల్స్ లో నింపుకొని వెళ్తూ ఉంటారు. వాస్తవానికి దాహం వేసినప్పుడు గుక్కెడు నీళ్లు దొరకడమే గగనమైన ఈ రోజుల్లో ఇటలీ దేశంలో ఏకంగా రెడ్ వైన్ అందించడం.. అది కూడా ఉచితంగా ఇవ్వడం గొప్ప విషయమే కదా.. అయితే ద్రాక్ష తోట యజమానులు తమ ఎస్టేట్లో పండే పండ్లను ఈ వైన్ తయారీ కోసం వినియోగిస్తారు. వేలాది ఎకరాల్లో తోటలు విస్తరించిన నేపథ్యంలో బాగా పక్వానికి వచ్చిన పండ్లతో వారు ఈ వైన్ తయారు చేస్తున్నారు. ఇందులో ఎటువంటి రసాయనాలు కలపకపోవడం విశేషం.(చదవండి: బిడ్డకు తల్లయినా ఎంతో ఫిట్గా ఆలియా.. సీక్రెట్ ఏంటంటే?) -
ఒలింపిక్స్ నుంచి తప్పుకున్న వరల్డ్ నంబర్ వన్
పురుషుల నంబర్ వన్ టెన్నిస్ క్రీడాకారుడు జన్నిక్ సిన్నర్ పారిస్ ఒలింపిక్స్ నుంచి తప్పుకున్నాడు. అస్వస్థత (టాన్సిల్స్) కారణంగా విశ్వ క్రీడల బరి నుంచి వైదొలుగుతున్నట్లు సిన్నర్ ప్రకటించాడు. దేశానికి ప్రాతినిథ్యం వహించే అవకాశం కోల్పోయినందుకు బాధగా ఉందని, ఇంటి నుంచే ఇటలీ అథ్లెట్లను సపోర్ట్ చేస్తానని సిన్నర్ తెలిపాడు. ఒలింపిక్స్లో సిన్నర్ సింగిల్స్తో పాటు డబుల్స్లో పోటీ పడాల్సి ఉండింది. సిన్నర్ వైదొలగడంతో అతని పార్ట్నర్ లొరెంజో ముసెట్టి మరో భాగస్వామిని వెతుక్కోవాల్సి వచ్చింది.సింగిల్స్ పోటీల నుంచి సిన్నర్ తప్పుకోవడంతో ర్యాంకింగ్స్లో రెండో స్థానంలో ఉన్న నొవాక్ జకోవిచ్ (సెర్బియా) టాప్ సీడ్ ఆటగాడిగా బరిలో నిలుస్తాడు. ఒలింపిక్స్ డ్రా ఇవాళ (జులై 25) ప్రకటించే అవకాశం ఉంది. జులై 27 నుంచి తొలి రౌండ్ మ్యాచ్లు మొదలవుతాయి. ఆగస్ట్ 4న అన్ని విభాగాల్లో గోల్డ్ మెడల్ మ్యాచ్లు జరుగుతాయి.సిన్నర్ విషయానికొస్తే.. 22 ఏళ్ల ఈ ఇటలీ ఆటగాడు ఈ ఏడాది తన తొలి గ్రాండ్స్లామ్ (ఆస్ట్రేలియన్ ఓపెన్) టైటిల్ను సాధించాడు. సిన్నర్ ఈ ఏడాది ఫ్రెంచ్ ఓపెన్లో సెమీఫైనల్స్కు చేరాడు. ఆస్ట్రేలియన్ ఓపెన్ ఫైనల్లో సిన్నర్ డేనియల్ మెద్వెదెవ్పై 3–6, 3–6, 6–4, 6–4, 6–3 తేడాతో అద్బుత విజయం సాధించాడు. కాగా, పారిస్ ఒలింపిక్స్ టెన్నిస్ క్రీడలో భారత్ రెండు విభాగాల్లో పోటీపడనుంది. పురుషుల సింగిల్స్లో సుమిత్ నగాల్.. పురుషుల డబుల్స్లో రోహన్ బోపన్న-శ్రీరామ్ బాలాజీ జోడీ తమ అదృష్టాన్ని పరీక్షించుకోనున్నారు. -
అమ్మాయి... సూర్యుడు... జెలాటో
‘‘భగవంతుడు సృష్టించిన ఈ పెద్ద ప్రపంచంలో మనం ఎంత చిన్నవాళ్లమో ప్రకృతి గుర్తు చేస్తుంది. ప్రకృతికి సంబంధించిన ప్రతిదీ చాలా వైశాల్యంతో కూడుకుని ఉంటుంది. చాలా గంభీరంగా, వినయంగా అనిపిస్తుంటుంది. అలాగే ప్రతిదాంట్లోనూ ఓ ఆధ్యాత్మిక ఉట్టిపడుతుంది’’ అంటున్నారు పూజా హెగ్డే.ఈ బ్యూటీ ప్రస్తుతం ప్రకృతి అందాలను ఆస్వాదిస్తున్నారు. షూటింగ్స్కి కాస్త విరామం రావడంతో విహార యాత్రకు ఇటలీలో వాలిపోయారు పూజా హెగ్డే. అక్కడ పలు ప్రదేశాలను సందర్శిస్తూ ఎంజాయ్ చేస్తున్నారు. కలర్ఫుల్ ఫ్రాక్లో సన్ గ్లాసెస్తో, చేతిలో జెలాటో (ఇటలీలో అన్ని రకాల ఐస్క్రీమ్లను జెలాటో అంటారు)తో చిరునవ్వులు చిందిస్తూ దిగిన ఫొటోలను ‘అమ్మాయి... సూర్యుడు... జెలాటో’ అనే క్యాప్షన్ ఇచ్చి, షేర్ చేశారామె.అలాగే పడవ ప్రయాణం చేస్తూ, ప్రకృతిని చూసి పరవశించిన వీడియోను షేర్ చేసి, పై విధంగా పేర్కొన్నారు. ఇక ఈ హాలిడేలో ఫుల్గా రిలాక్స్ అయి, ఇండియా వచ్చాక ఓ నూతనోత్సాహంతో పూజా హెగ్డే షూటింగ్స్లో పాల్గొంటారని చెప్పాచ్చు. -
ఇటలీలో 33 మందితో వెట్టి చాకిరీ.. సూత్రధారులైన ఇద్దరు
రోమ్: ఇటలీలోని వెరోనా ప్రావిన్స్లో వ్యవసాయ క్షేత్రాల్లో 33 మంది భారతీయులతో వెట్టి చాకిరీ చేయిస్తున్న ఆరోపణలపై సూత్రధారులైన ఇద్దరు భారతీయుల్ని పోలీసులు అరెస్ట్ చేశారు. వారి నుంచి 4.33 కోట్ల విలువైన ఆస్తులను స్వాధీనం చేసుకున్నారు. తప్పుడు లెక్కలు చూపుతూ పన్ను ఎగవేతకు పాల్పడుతున్నారని తెలిపారు. ఇదే ప్రావిన్స్లో తోటల్లో పనిచేసే సత్నాం సింగ్ అనే భారతీయుడు ఇటీవల ప్రమాదవశాత్తూ చేతి కోల్పోగా యజమాని అతన్ని రోడ్డు పక్కన వదిలేయడం, వైద్య సాయం ఆలస్యమై మరణించడం తెలిసిందే. దీనిపై దేశవ్యాప్తంగా ఆందోళనలు వెల్లువెత్తాయి. ప్రధాని మెలోనీ కూడా దీన్ని ఖండించారు. ఈ ఘటనతో ఇటలీ వ్యవసాయ క్షేత్రాల్లో అనధికారికంగా పనిచేసే భారతీయ కారి్మకుల దుస్థితి వెలుగులోకి వచి్చంది. సుమారు 2 లక్షల మంది భారతీయులు ఇటలీలోని వ్యవసాయ క్షేత్రాల్లో మగ్గిపోతున్నారని విదేశాంగ శాఖ అంచనా. -
ఇటలీలో బానిసత్వం!.. 33 మంది భారతీయ కార్మికుల విముక్తి
రోమ్: భారతీయ వ్యవసాయ కార్మికులను బానిస వ్యవస్థ నుంచి కాపాడినట్లు ఇటలీ పోలీసులు తెలిపారు. శనివారం ఉత్తర వెరోనా ప్రావిన్స్లో 33 మంది భారత కార్మికులను ఇద్దరు వ్యక్తుల నుంచి విడిపించినట్లు చెప్పారు. నిందితుల నుంచి అర మిలియన్ యూరోలు (సుమారు రూ. 45 లక్షలు) స్వాధీనం చేకున్నామని పేర్కొన్నారు.ఇటలీ పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ‘‘ఈ ముఠా ఇండియా నుంచి సీజనల్ వర్క్ పెర్మిట్తో ఇక్కడి వ్యవసాయ కార్మికులను తీసుకువస్తారు. వారికి మంచి ఉపాధి చూపిస్తాని చెప్పి.. 17000 యూరోలు (సమారు రూ.15లక్షలు) కట్టమని చెబుతారు. వారానికి 7 రోజులు, రోజు 10-12 గంటలు పని. ఒక్క గంటకు నాలుగు యూరోలు ఇస్తామని ఒప్పందం చేయించుకుంటారు. కానీ, అలా చేరిన కార్మికులను బానిసలు పని చేయించుకుంటారు. .. మరికొంత డబ్బు ఇస్తే.. శాశ్వత వర్క్ పర్మిట్ ఇస్తామని నమ్మిస్తారు. కానీ, అది కూడా ఎప్పటికీ జరగదు. బాధిత కార్మికులు ఈ ముఠా సభ్యులు ఇటలీలో భద్రత, ఉపాధి అవకాశాలు, చట్టబద్ధమైన నివాస పత్రాలు అందిస్తామని మోసం చేస్తూ పని బానిసత్వంలోకి దించుతారు’అని పోలీసులు తెలిపారు. ఇతర యూరోపియన్ దేశాలతో పోల్చితే.. ఇటలీలో తీవ్రమైన కార్మికుల కొరత నెలకొంది. దీంతో ఇక్కడికి పని చేయడానికి వచ్చే వారికి కొన్ని ముఠాలు తక్కువ వేతనంతో ఇతర దేశాల వ్యవసాయ కార్మికులను మోసం చేస్తారు. లేబర్ చట్టాల ఉల్లంఘనలను ఇటలీ తీవ్రంగా ఎదుర్కొంటోంది. -
చీర కాల కోరిక నెరవేరింది ఇలా...
చీరకట్టుకోవాలనేది ఆ బామ్మ కల. బామ్మది ఇండియా అయితే ఆమె కల గురించి ఆశ్చర్యపోవాల్సిందే. ‘అదేం భాగ్యం!’ అనుకోవాల్సిందే. అయితే బామ్మగారిది ఇండియా కాదు ఇటలీ. ఇటాలియన్ డీజె, ఇన్ఫ్లు్లయెన్సర్ వోలీ ఎస్సే బామ్మ ఇరవై సంవత్సరాల క్రితం తన కుటుంబంతో మన దేశానికి వచ్చింది. ఇక్కడి సంస్కృతి, సంప్రదాయాలు ఆమెకు బాగా నచ్చాయి. ముఖ్యంగా చీర ఆమెకు బాగా నచ్చింది. అప్పటినుంచి చీర ధరించాలనే కోరిక మనసులో ఉండిపోయింది. ‘ఈరోజు నీ కలను నిజం చేస్తాను’ అని బామ్మను చీరతో సర్ప్రైజ్ చేసింది మనవరాలు వోలీ. చీర ధరించి తన చిరకాల కోరిక నెరవేర్చుకున్న బామ్మ కళ్లలోని వెలుగు చీరకు కొత్త అందం తెచ్చింది. -
భర్తతో హీరోయిన్ ఆలియా భట్ క్యూట్ (ఫొటోలు)
-
Euro Cup 2024: సెల్ఫ్ గోల్తో ఓడిన ఇటలీ
గెల్సెన్కిర్చెన్ (జర్మనీ): యూరో కప్ ఫుట్బాల్ టోరీ్నలో డిఫెండింగ్ చాంపియన్ ఇటలీ జట్టుకు చుక్కెదురైంది. మాజీ విజేత స్పెయిన్తో శుక్రవారం జరిగిన గ్రూప్ ‘బి’ లీగ్ మ్యాచ్లో ఇటలీ 0–1 గోల్ తేడాతో ఓడిపోయింది.మరోవైపు.. వరుసగా రెండో విజయంతో స్పెయిన్ జట్టు ప్రిక్వార్టర్ ఫైనల్ దశకు అర్హత సాధించింది. ఆట 55వ నిమిషంలో స్పెయిన్ ఫార్వర్డ్ అల్వారో మొరాటో హెడర్ షాట్ను ఇటలీ గోల్కీపర్ గియాన్లుగి డొనారుమా నిలువరించాడు.అయితే ఇటలీ గోల్కీపర్ నిలువరించిన బంతి ఇటలీ డిఫెండర్ రికార్డో కాలాఫియోరి కాలికి తగిలి తిరిగి గోల్పోస్ట్లోకి వెళ్లింది. దాంతో ఇటలీ సెల్ఫ్ గోల్తో స్పెయిన్ 1–0తో ఆధిక్యంలోకి వెళ్లి చివరిదాకా ఈ ఆధిక్యాన్ని కాపాడుకుంది. ఇతర మ్యాచ్ల్లో ఆస్ట్రియా 3–1తో పోలాండ్ జట్టుపై, ఉక్రెయిన్ 2–1తో స్లొవేకియాపై గెలిచాయి. చదవండి: T20 WC 2024: దక్షిణాఫ్రికా సూపర్... -
అంబానీ ప్రేయసి: ఈ ఒక్క లుక్ విలువ రూ. 1002కోట్లు! నమ్ముతారా?
అనంత్ అంబానీకి కాబోయే భార్య, రాధికా మర్చంట్ ఫ్యాషన్ ఔట్ఫిట్స్ ఫ్యాన్స్ని మంత్రముగ్దుల్ని చేస్తోంది. రిలయన్స్ వ్యాపార వారసుడు అనంత్ అంబానీ ప్రేయసిగా తన ఫ్యాషన్ స్టయిల్తో కాబోయే అత్తగారు నీతా అంబానీని మించి అభిమానులను ఆకట్టుకుంటోంది. తాజాగా అనంత్- రాధిక ఇటలీ - ఫ్రాన్స్ లగ్జరీ క్రూయిజ్ ప్రీ వెడ్డింగ్ వేడుక అట్టహాసంగా జరిగింది. ఈ వేడుకలో అంబానీ కోడలిగా కాబోయే వదువు రాధిక మెస్మరైజ్ చేసింది. వేలకోట్ల రూపాయలతో నిశ్చితార్థ వేడుక, మొదటి ప్రీ వెడ్డింగ్ వేడుక ఘనంగా జరిగాయి. తాజాగా రెండో ప్రీ-వెడ్డింగ్ బాష్ థీమ్ 'లా వీటా ఇ అన్ వియాజియో' (జీవితం ఒక ప్రయాణం), ఫ్యాషన్ స్టేట్మెంట్లతో ప్రతీ ఈవెంట్, దుస్తులు స్పెషల్ ఎట్రాక్షన్గా నిలిచాయి. అంబానీ ఫ్యాన్ పేజీ అందించిన డ్రెస్ ధలు హాట్ టాపిక్గా నిలుస్తున్నాయి.వైట్ డ్రెస్ మహారాణిలా, ధర రూ.1002 కోట్లురాధికా మర్చంట్ తెల్లటి తమరా రాల్ఫ్ డ్రెస్, డైమండ్ ఆభరణాలతోరాయల్లుక్లో అందంగా మెరిసి పోయింది. స్ప్రింగ్-సమ్మర్ 2024 కలెక్షన్కు చెందిన శాటిన్ గౌనులో రాణిలా కనిపించింది. పట్టు , క్రిస్టల్తో చేసిన గులాబీలు మెడ, నడుముపైనా, తలకు కిరీటంగా అమిరాయి. ఈ మొత్తం లుక్ ధర రూ. 1002కోట్లుక్రూయిజ్ బాష్లో స్టార్రి నైట్ పార్టీ కోసం రాధిక ధరించిన డైమండ్ ఇయర్కఫ్లు, లావెండర్ డ్రెస్, మొత్తం లుక్ ఖర్చు రూ. 896 కోట్లు.రెండో రోజు, టోగా పార్టీకోసం ఏరోస్పేస్ టెక్నాలజీతో తయారు చేసిన డ్రెస్, బంగారు ఆభరణాలతో డైమండ్ నగలు, బ్యాంగిల్స్ , వాచ్తో సహా మొత్తం లుక్ రూ. 697 కోట్లు.అనంత్ ప్రేమను చుట్టుకున్న ఈ లుక్ ధరఅనంత్ తన ప్రేమంతా కురిపించిన లవ్లెటర్తో రాబర్ట్ వున్ డిజైన్ చేసిన గౌను ధరించింది. లేయర్డ్ డైమండ్ నెక్లెస్, మ్యాచింగ్ చెవిపోగులు ధరించింది. ఈమొత్తం లుక్ ఖర్చు రూ. 478 కోట్లు.పాతకాలపు డియోర్ డ్రెస్లో ఖరీదైన యాక్సెసరీస్తో రాధిక అందంగా కనిపించిన మరో డ్రెస్ విలువ రూ. 26 లక్షలు రాధిక మర్చంట్ చిక్ బాల్మైన్ గౌను రూ. 5.43 లక్షలు. ఇంకా చెప్పాలంటే ఈ లిస్ట్ చాలా పెద్దదే. -
పొలంలో తెగిపడిన చేయి, ఇటలీలో భారతీయ కార్మికుడి దుర్మరణం
ఇటలీలో భారతీయ వ్యవసాయ కార్మికుడి పట్ల అమానవీయంగా ప్రవర్తించిన ఘటన ఒకటి కలకలం రేపింది. లాటినా ప్రాంతంలోని ఓ పొలంలో పనిచేస్తుండగా ప్రమాదవశాత్తూ సత్నామ్ సింగ్ చేయి తెగిపోయింది. అయితే తీవ్ర రక్తస్రావంతో ప్రమాదకర స్థితిలో ఉన్న అతడిని ఆసపత్రికి తరలించాల్సిన యాజమానులు నిర్లక్ష్యంగా ప్రవర్తించారు. అతడిని రోడ్డుపై అలానే వదిలేసి అక్కడి నుంచి వెళ్లిపోయారు. ఆసుపత్రికి తరలించడం ఆలస్యం కావడంతో సత్నామ్ సింగ్ కన్నుమూశాడు. ఈ ఘటనపై దేశవ్యాప్తంగా ఆందోళన వ్యక్తమవుతోంది.ఇటలీ కార్మికశాఖ మంత్రి మెరీనా కాల్డెరోన్ పార్లమెంటు వేదికగా ఈ విషయాన్ని వెల్లడించారు. "ఇది నిజంగా అనాగరిక చర్య," అని పేర్కొన్న ఆమె, అధికారులు దర్యాప్తు చేస్తున్నారని, బాధ్యులను శిక్షిస్తామని ప్రకటించారు. అటు ఈ ఘటనను అక్కడి సెంటర్ లెఫ్ట్ డెమోక్రెటిక్ పార్టీ తీవ్రంగా ఖండించింది. గ్యాంగ్మాస్టర్లకు వ్యతిరేకంగా, గౌరవప్రదమైన పని, జీవన పరిస్థితుల కోసం పోరాటం కొనసాగుతుందని ఎక్స్ ద్వారా ప్రకటించింది.పదివేల మంది భారతీయ వలస కార్మికులు నివసించే రోమ్కు దక్షిణంగా ఉన్న గ్రామీణ ప్రాంతంలోని లాటినాలోని పొలంలో సత్నామ్ సింగ్ పనిచేస్తున్నాడు. సోమవారం ప్రమాద వశాత్తూ ఓ యంత్రంలో పడి అతడి చేయి తెగిపోయింది. అయితే రక్తమోడుతూ ప్రాణాపాయ స్థితిలో ఉన్న సత్నామ్ సింగ్ను పట్టించుకోలేదు. ఆలస్యంగా విషయం తెలుసుకున్న బాధితుడి భార్య, స్నేహితులు అత్యవసర సిబ్బందికి సమాచారం అందించారు. దీంతో బాధితుడిని ఎయిర్ అంబులెన్స్ ద్వారా ఆసుపత్రికి తరలించారు. ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న బాధితుడు బుధవారం కన్నుమూశాడు. Flai CGIL ట్రేడ్ యూనియన్ ప్రకారం, సుమారు 31 ఏళ్ల వయస్సున్న సింగ్, చట్టపరమైన పత్రాలేవీ లేకుండా పని చేస్తున్నాడు. బాధితుడినిఆసుపత్రికి తరలించాల్సిన యజమానులు, చెత్త మూటలా వదిలేసి వెళ్లిపోయారని, ఇది హారర్ చిత్రాన్ని తలపిస్తోందని ట్రేడ్ యూనియన్ మండిపడింది. -
వలసలపై పాశ్చాత్యుల నటనలు
లాటిన్ అమెరికా, ఆసియా, ముఖ్యంగా ఆఫ్రికా దేశాల నుంచి యూరప్కు సాగుతున్న వలసలు అక్కడ ఒత్తిడి పెంచుతున్నాయి. ఫ్రాన్స్లోలా అల్లర్లు చెలరేగడం, పలురకాల నేరాలు జరగడం లాంటివి. వీటికి విరుగుడుగా యూరోపియన్ దేశాలు ఆఫ్రికాలో పెట్టుబడులు పెంచితే, అక్కడే అభివృద్ధి జరిగి, వారు యూరప్కు వలస రాకుండా ఉంటారని జీ–7 సమావేశాల్లో ఇటలీ ప్రధాని మెలోని చేసిన ప్రతిపాదన వినడానికి అద్భుతంగా ఉంటుంది. వాస్తవానికి యూరోపియన్లు, అమెరికన్లు వందల ఏళ్లుగా అనుసరించిన విధానాల పర్యవసానమే ఈ వలసలు. ఇప్పుడు ప్రత్యక్ష వలస పాలన నుంచి ఉపసంహరించుకున్నా, పరోక్షంగా నియంత్రిస్తూనే ఉన్నారు. వలసలు ఆగాలన్న చిత్తశుద్ధి వారికి ఉంటే చేయవలసింది పరోక్ష దోపిడీని మానివేయటం.ప్రపంచంలోని పేద దేశాలన్నింటిని ఆరు వందల సంవత్సరాల నుంచి తమ వలసలుగా, నయా వలసలుగా మార్చుకుని అదుపులేని దోపిడీ సాగిస్తూ వస్తున్న పాశ్చాత్య దేశాలు, వారి బాగోగుల కోసం అంటూ మరొకమారు నటనలు చేస్తున్నాయి. ఇటలీలో గత వారాంతంలో జరిగిన జీ–7 సమావేశాలలో ఆ దేశపు ప్రధాని జార్జియో మెలోనీ చేసిన ప్రతిపాదనలను గమనిస్తే, ఈ విషయం స్పష్టమవుతుంది.మెలోనీ చేసిన ప్రతిపాదనలు తమకు తక్షణ సమస్యగా మారిన ఆఫ్రికన్ వలసల గురించి. ఆఫ్రికా ఖండంలోని ఉత్తర భాగాన గల అరబ్ దేశాల నుంచి, దక్షిణాన సహారా ఎడారికి దిగువన గల అనేక ఇతర దేశాల నుంచి ఇటలీతో పాటు యూరప్ అంతటికీ వలసలు పెద్ద ఎత్తున సాగుతుంటాయి. వాటిలో చట్ట ప్రకారం జరిగేవాటి కన్నా, అక్రమంగా జరిగేవి అనేక రెట్లు ఎక్కువ. వారంతా ఆఫ్రికా, యూరప్ల మధ్య గల మధ్యధరా సముద్రం మీదుగా చిన్న చిన్న పడవలలో రహస్యంగా ప్రయాణిస్తారు. యూరోపియన్ దేశాల గస్తీ బోట్లు పట్టుకునేది కొందరినైతే, అనేక మంది పట్టుబడకుండా యూరప్ తీరానికి చేరతారు. అక్కడి నుంచి తమ మిత్రుల ద్వారానో, లేక స్థానిక అధికారులకు, ఏజెంట్లకు డబ్బు ఇచ్చుకునో వివిధ దేశాలకు వెళ్ళిపోతారు. యథాతథంగా ఇదే తమకు సమస్య అని యూరోపియన్ ప్రభుత్వాలు భావిస్తుండగా, మధ్యధరా సముద్రంపై ప్రయాణ సమయంలో పరిస్థితులు అనుకూలించక పడవలు మునిగి ప్రతి యేటా కొన్ని వందలమంది దుర్మరణం పాలవుతుంటారు. ఈ నేపథ్యంలో, జీ–7 సమావేశాలు ముగిసిన రెండురోజులకే ‘బీబీసీ’ ప్రసారం చేసిన ఒక కథనం సంచలనంగా మారింది. మధ్యధరా సముద్రాన్ని ఆనుకుని ఉన్న యూరోపియన్ దేశాలలో ఇటలీ, గ్రీస్ ముఖ్యమైనవి. వాటి మీదుగానే వలసదారులు ఇతర చోట్లకు వెళుతుంటారు. అటువంటి స్థితిలో గ్రీస్ తీరప్రాంత గస్తీ అధికారులు వలసదారులను తరచు తిరిగి సముద్రంలోకి బలవంతాన తీసుకుపోయి మునిగిపోయేటట్లు చేస్తున్నారట. గత మూడేళ్ళలో జరిగిన ఇటువంటి ఘటనలలో కొన్నింటిని ‘బీబీసీ’ బయటపెట్టింది. వలసల నివారణకు ఇటలీ ప్రధాని మెలోనీ చేసిన సూచనల ప్రకారం, యూరోపియన్ దేశాలు ఆఫ్రికాలో పెట్టుబడులు పెంచాలి. ఆ విధంగా అక్కడ అభివృద్ధి జరిగితే అక్కడి ప్రజలకు ఉపాధి లభించి వారు యూరప్కు వలస రాకుండా ఉంటారు. ఈ విధమైన ప్రతిపాదనలు చరిత్ర తెలియని వారికీ, అమాయకులకూ అద్భుతంగా తోస్తాయి. అటువంటి పెట్టుబడులంటూ నిజంగా జరిగితే, అవి సహజంగా ప్రైవేటువి అవుతాయి. వాటి యాజమాన్యాలు తమ ‘జాబ్లెస్ గ్రోత్ టెక్నాలజీ’ వల్ల కొద్దిపాటి ఉపాధులు కల్పించి, వాటికి నికరమైన దీర్ఘకాలిక హామీ ఏదీ లేకుండా చేసి, తమ దృష్టినంతా అక్కడి వనరులను, మార్కెట్లను కొల్లగొట్టటంపై కేంద్రీకరిస్తాయి. ఈ తరహా విధానాల వల్ల వలసల సమస్య, ఆఫ్రికా పేదరికం సమస్య ఎంతమాత్రం పరిష్కారం కావు. యూరోపియన్లు మాత్రం తమ కొత్త పెట్టుబడులకు రాయితీలు సంపాదించి మరింత లాభపడతారు. వాస్తవానికి యూరోపియన్లు, అమెరికన్లు వందల సంవత్సరాలుగా ఈ తరహా ఆర్థిక నమూనాలను అనుసరించిన దాని పర్యవసానమే ఈవిధంగా సాగుతున్న వలసలు. ఈ విషయం ఇటలీ ప్రధాని మెలోనీకి తెలియదని భావించలేము. అసలు మొత్తం పాశ్చాత్య దేశాల చరిత్రే ప్రపంచాన్ని తమ వలసలుగా మార్చుకోవటం; అక్కడి నుంచి లక్షలాది మందిని బానిసలుగా తెచ్చి తమ వాణిజ్య పంటల ఎస్టేట్లలో, ఇతరత్రా భయంకరమైన రీతిలో చాకిరీ చేయించుకోవటం; ఆఫ్రికా, లాటిన్ అమెరికా, ఆసియా సహజ వనరులను యథేచ్ఛగా దోపిడీ చేయటం; తమ ఉత్పత్తులను అక్కడి మార్కెట్లలో బలవంతంగా అమ్మి స్థానిక ఉత్పత్తులను ధ్వంసం చేయటం; స్థానిక పాలకులను రకరకాలుగా లొంగదీసుకుని తుదముట్టించటాలతో నిండిపోయి ఉంది. ఇది అక్కడి నిష్పాక్షికులైన చరిత్రకారులు, మేధావులు నేటికీ ధృవీకరిస్తున్న విషయం. అంతెందుకు, ప్రముఖ వలస రాజ్యాలలో ఒకటైన ఫ్రాన్స్ మాజీ అధ్యక్షుడు జాక్వెస్ షిరాక్ కొద్దికాలం కిత్రం యూరోపియన్ దేశాల ప్రస్తుత సిరి సంపదలకు తమ వలస దోపిడీలు ఒక ప్రధాన కారణమని అంగీకరించారు. యూరోపియన్ వలసల దశ 1940ల నుంచి 1970ల మధ్య దాదాపు ముగిసిపోయింది. వారి దోపిడీలు కూడా అంతటితో ఆగితే ఈరోజున అక్కడి ప్రజలు యూరప్కు గానీ, అమెరికాకు గానీ వలస వెళ్ళవలసిన అగత్యమే ఉండేది కాదు. అక్కడ గల అపారమైన సహజ వనరులు, మానవ నైపుణ్యాలతో వారు స్వయంగా అభివృద్ధి చెంది ఉండేవారు. కానీ పాశ్చాత్యులు ప్రత్యక్ష రాజకీయ వలస పాలన నుంచి ఉపసంహరించుకున్నా, స్థానిక నాయకులను, సైనికాధికారులను, సివిలియన్ అధికారులను, ఆర్థిక రంగానికి చెందిన ప్రముఖులను పరోక్షంగా నియంత్రిస్తూనే వచ్చారు. తమ పెట్టుబడులు, టెక్నాలజీలు, మార్కెటింగ్ వ్యవస్థల ద్వారా మొత్తం ఆర్థిక వ్యవస్థలు వారి ఆధీనంలోనే ఉంటూ వస్తున్నాయి. ఆసియా కొంత మెరుగుపడినా, ఆఫ్రికా, లాటిన్ అమెరికాలలో మార్పులు స్వల్పమే. ఇది మంచి చదువులు, ఉద్యోగాల కోసం వెళుతున్న వారి గురించి అంటున్న మాట కాదు. దిగువ స్థాయి వారికి సంబంధించిన విషయం. ఈ విధంగా వలస వెళుతున్న వారి కారణంగా పాశ్చాత్య దేశాలలో సమస్యలు తలెత్తుతున్న మాట నిజమే. అట్లా వెళ్ళేవారికి ఉపాధి అవకాశాలు ఎక్కువ ఉండవు. వారు మురికి వాడలలో నివసిస్తుంటారు. వారి వల్ల తక్కిన సమాజంపై రకరకాల ఒత్తిడిలు ఏర్పడుతుంటాయి. ఫ్రాన్స్లో వలె ఒక్కోసారి తీవ్రమైన అల్లర్లు, హింస చెలరేగుతాయి. పలురకాల నేరాలు జరుగుతాయి. వారికోసం ఏ ప్రభుత్వమైనా కొన్ని సహాయ చర్చలు తీసుకున్నా అవి ఎంతమాత్రం సరిపోవు. మరొకవైపు వలసలు కొనసాగుతూనే ఉంటాయి. ఇటలీ ప్రధాని మెలోనీ మాటలను ‘చీమా, చీమా ఎందుకు కుట్టావు?’ అన్న నీతికథలో వలె శోధిస్తూపోతే, పైన చెప్పుకున్న వందల ఏళ్ళ పాశ్చాత్య వలస దోపిడీ చరిత్ర ముందుకు వస్తుంది. విచిత్రం ఏమంటే, ఇన్నిన్ని జరుగుతున్నా వారు తమ గత స్వభావాలను, విధానాలను మార్చుకోవటం లేదు. వారికి ఇప్పటికీ చిన్న చిన్న వలస భూభాగాలు, వందలాది సైనిక స్థావరాలు ఉన్నాయి. ఉదాహరణకు ఇటీవలి కాలానికే వస్తే, ఆఫ్రికాలోని మాజీ ఫ్రెంచి వలసలు సుమారు ఆరింటిలో, అక్కడి ఫ్రెంచ్ అనుకూల పాలకులపై తిరుగుబాట్లు జరిగాయి. కొత్తగా అధికారానికి వచ్చిన వారు అక్కడి ఫ్రెంచ్ సైనిక స్థావరాలను ఖాళీ చేయించి వెళ్ళగొట్టారు. దీనిపై ఫ్రెంచ్ అధ్యక్షుడు ఇమ్మాన్యుయేల్ మాక్రాన్ నానా రభస సృష్టించి కొత్త పాలకులపై ఒత్తిడి తెచ్చారు. కానీ వారు ససేమిరా లొంగలేదు. ఇటలీ అధ్యక్షురాలు మెలోనీ నుంచి, అమెరికా అధ్యక్షుడు బైడెన్, మాజీ అధ్యక్షుడు ట్రంప్ల వరకు పాశ్చాత్య నాయకులకు ఇటువంటి వలసలను ఆపాలనే చిత్తశుద్ధి నిజంగా ఉందా? వలసలు యూరప్ అంతటా పెద్ద సమస్య అయినట్లు గత వారమే జరిగిన యూరోపియన్ యూనియన్ ఎన్నికలలో మితవాదుల ఓటు గణనీయంగా పెరగటం రుజువు చేసింది కూడా. వలసలు, జాతివాదమే అక్కడ ముఖ్యమైన అజెండాగా మారుతున్నాయి. అందువల్ల ఆ నాయకులకు చిత్తశుద్ధి ఉంటే చేయవలసింది ఆఫ్రికా, లాటిన్ అమెరికా, కరీబియన్, ఆసియా దేశాల దోపిడీని త్వరగా మానివేయటం. అక్కడి వనరులను, మార్కెట్లను అక్కడి ప్రజల నియంత్రణకు, ఉపయోగానికి వదిలి వేయటం. వారితో అన్ని సంబంధాలను సమతులనంగా, పారదర్శకంగా, ప్రజాస్వామికంగా మార్చుకోవటం. టంకశాల అశోక్ వ్యాసకర్త సీనియర్ సంపాదకుడు -
‘జీ-7 కూటమి అమెరికా ఆధిపత్యం పెంచే పొలిటికల్ టూల్’
బీజింగ్: ఇటలీ వేదికగా జీ-7 దేశాధినేతలు విడుదల చేసిన సంయుక్త ప్రకటనపై చైనా విమర్శలు గుప్పించింది. రష్యాకు ఆయుధాలు సరాఫరా చేయవద్దని జీ-7 దేశాధినేతలు చైనాను హెచ్చరించారు. ఈ మేరకు జీ-7 సమ్మిట్లో సంయుక్త ప్రకటన విడుదల చేశారు. దీనిపై తాజాగా చైనా స్పందించింది. జీ-7 దేశాల సమ్మిట్ విడుదల చేసిన ప్రకటన అహంకారం, పక్షపాతం, అబద్దాలతో కూడినదని విమర్శలు చేసింది. సోమవారం చైనా విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి లిన్ జియాన్ మీడియాతో మాట్లాడారు. ‘జీ-7 దేశాధినేతలు చైనాకు వ్యతిరేకంగా అసత్యాలతో సంయుక్త ప్రకటన విడుదల చేశారు. ఆ దేశాలు చేస్తున్న ఆరోపణలు నిజం కాదు. చట్టబద్ధత, నైతికతకు దూరంగా ఉన్నాయి. జీ-7 సమ్మిట్ ప్రకటన పూర్తిగా అహంకారం, పక్షపాతం, అసత్యాలతో కూడినది. జీ-7 కూటమి ప్రపంచానికి ప్రాతినిధ్యం వహించేంది కాదు. ప్రపంచ జనాభాలో ఆ ఏడు దేశాలు కేవలం పదిశాతం జనాభాను మాత్రమే కలిగి ఉంటాయి. .. ఆ ఏడు దేశాలు మొత్తం కలిసినా కూడా ప్రపంచ ఆర్థిక అభివృద్ధికి అందించే సహాకారం చైనా కంటే తక్కువ. జీ-7 దేశాల కూటమి అంతర్జాతీయ ఆర్థిక పరిస్థితులను స్థిరంగా ఉంచటంలో కీలకంగా వ్యవహరించాలి. కానీ, అమెరికా, పాశ్చాత్య దేశాల ఆధిపత్యాన్ని పెంచే ఒక పోలిటికల్ టూల్గా మారింది’ అని లిన్ జియాన్ మండిపడ్డారు. -
చరిత్ర సృష్టించిన ఆస్ట్రేలియా మాజీ ఓపెనర్
ఆస్ట్రేలియా మాజీ ఓపెనింగ్ బ్యాటర్ జో బర్న్స్ చరిత్ర సృష్టించాడు. అంతర్జాతీయ క్రికెట్లో రెండు దేశాల తరఫున సెంచరీలు (ఆస్ట్రేలియా, ఇటలీ) చేసిన ఆరో ఆటగాడిగా చరిత్ర పుటల్లోకెక్కాడు. ఆస్ట్రేలియా నుంచి ఇటీవలే ఇటలీకి వలస వెళ్లిన బర్న్స్.. టీ20 వరల్డ్కప్ 2026 యూరోపియన్ క్వాలిఫయర్లో భాగంగా రొమేనియాతో జరిగిన మ్యాచ్లో సెంచరీతో మెరిశాడు.ఈ మ్యాచ్లో 55 బంతులు ఎదుర్కొన్న బర్న్స్ 12 ఫోర్లు, 4 సిక్సర్ల సాయంతో అజేయమైన 108 పరుగులు చేశాడు. బర్న్స్ శతక్కొట్టుడుతో పాటు జస్టిన్ మోస్కా (30 బంతుల్లో 72; 9 ఫోర్లు, 4 సిక్సర్లు) మెరుపు అర్దసెంచరీతో విరుచుకుపడటంతో తొలుత బ్యాటింగ్ చేసిన ఇటలీ నిర్ణీత 20 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 244 పరుగుల భారీ స్కోర్ చేసింది.అనంతరం 245 పరుగుల లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన రొమేనియా 17.4 ఓవర్లలో 84 పరుగులకే చాపచుట్టేసి 160 పరుగుల తేడాతో ఘోర పరాజయాన్ని మూటగట్టుకుంది.అంతర్జాతీయ క్రికెట్లో రెండు దేశాల తరఫున సెంచరీలు చేసిన ఆటగాళ్లు వీరే..కెప్లెర్ వెసెల్స్- ఆస్ట్రేలియా (5 సెంచరీలు), సౌతాఫ్రికా (2 సెంచరీలు)ఇయాన్ మోర్గాన్- ఐర్లాండ్ (1), ఇంగ్లండ్ (15)ఎడ్ జాయ్స్- ఐర్లాండ్ (5), ఇంగ్లండ్ (1)గ్యారీ బ్యాలెన్స్- ఇంగ్లండ్ (4), జింబాబ్వే (1)మార్క్ చాప్మన్- హాంగ్కాంగ్ (1), న్యూజిలాండ్ (2)జో బర్న్స్- ఇంగ్లండ్ (4), ఇటలీ (1) -
అనంత్ అంబానీ - రాధిక ప్రీ వెడ్డింగ్ : అనంత్ లవ్ లెటర్ను గమనించారా?
రిలయన్స్ అధినేత ముఖేష్ అంబానీ ఇంట పెళ్లి అంటే ఆ సందడి మామూలుగా ఉండదు. ముఖేష్ అంబానీ, నీతా అంబానీల చిన్న కుమారుడు అనంత్ అంబానీ, వ్యాపారవేత్త వీరేన్మర్చంట్, శైలా విరెన్ మర్చంట్ కుమార్తె రాధిక మర్చంట్ ముందస్తు పెళ్లి వేడుకలే ఇందుకు నిదర్శనం. అనంత్-రాధిక నిశ్చితార్థం వేడుక మొదలు ఇటీవల, ఇటలీలో నిర్వహించిన రెండో ప్రీ వెడ్డింగ్ వేడుకల దాకా ప్రతీదీ అత్యంత ఘనంగా నిర్వహించారు. లగ్జరీ క్రూయిజ్లో 800మందికి పైగా అతిథులతో నిర్వహించిన రెండో ప్రీ వెడ్డింగ్ వేడుకలకు సంబంధించిన విశేషాలు రోజుకొకటి నెట్టింట విశేషంగా మారు తున్నాయి. ముఖ్యంగా కాబోయే వధువు రాధిక మర్చంట్ దుస్తులు, నగలతో పాటు, అత్తగారి హోదాలో నీతా అంబానీ లుక్, ఖరీదైన నగలు చర్చనీయాంశంగా నిలిచాయి. తాజాగా సినీ నిర్మాత రియా కపూర్ రాధిక మర్చంట్ దుస్తులకు సంబంధించిన ప్రత్యేకతలను ఇన్స్టాలో షేర్ చేశారు. రాధిక ధరించిన గౌనుపై అనంత్ లవ్ లెటర్ను అందంగా పొందుపరచడం విశేషం. View this post on Instagram A post shared by Rhea Kapoor (@rheakapoor) అలాగే బంగారు పూతతో తయారు చేసిన మరో అద్భుతమైన డ్రెస్ వివరాలను కూడా రియా అందించారు. అంబానీ రాయల్ వెడ్డింగ్ సెలబ్రేషన్స్లో భాగంగా టోగా పార్టీలో రాధిక ధరించిన గ్రేస్ లింగ్ ‘కోచర్’ని గురించి పరిచయం చేశారు. రాధిక బాడీకి అతికినట్టు సరిపోయింది అంటూ దీన్ని తయారు చేసిన టీంకు అభినందనలు తెలిపారు. అత్యాధునిక 3డీ టెక్నాలజీతో 30 మంది కళాకారులు దీన్ని తయారు చేశారట. -
‘యూరో’లో ఇటలీ శుభారంభం
డార్ట్మండ్ (జర్మనీ): యూరో కప్ ఫుట్బాల్ టోర్నీలో ఇటలీ జట్టు శుభారంభం చేసింది. అల్బేనియాతో జరిగిన గ్రూప్ ‘బి’ తొలి మ్యాచ్లో ఇటలీ 2–1తో గెలిచింది. ఆట మొదలైన 23 సెకన్లకే అల్బేనియా ప్లేయర్ బజ్రామి గోల్ చేయడంతో చేశాడు. 64 ఏళ్ల ఈ టోర్నీ చరిత్రలో అత్యంత వేగంగా నమోదైన గోల్ ఇదే కావడం విశేషం. తొలి నిమిషంలో గోల్ సమరి్పంచుకున్న ఇటలీ వెంటనే తేరుకుంది. 11వ నిమిషంలో బస్తోని... 16వ నిమిషంలో బరెల్లా ఒక్కో గోల్ చేయడంతో ఇటలీ 2–1తో ఆధిక్యంలోకి వెళ్లింది. హాంబర్గ్లో జరిగిన గ్రూప్ ‘డి’ మ్యాచ్లో నెదర్లాండ్స్ జట్టు 2–1తో పోలాండ్ను ఓడించగా... స్టుట్గార్ట్లో డెన్మార్క్, స్లొవేనియా జట్ల మధ్య గ్రూప్ ‘సి’ మ్యాచ్ 1–1తో ‘డ్రా’ అయింది. -
హాట్టాపిక్గా ఇటలీ ప్రధాని జార్జియా మెలోనీ డ్రెస్సింగ్ స్టైల్..!
రోమ్లోని గార్మెటెల్లా జన్మించిన జార్జియా ఇటలి తొలి మహిళా ప్రధానిగా రికార్డు సృష్టించారు. మహిళల్లో స్ఫూర్తినింపేలా ఆమె కెరీర్ సాగింది. ఆమె పవర్ఫుల్ ప్రధానిగా బాధ్యతల నిర్వర్తించడమే గాక చాకచక్యమైన నిర్ణయాలతో అందర్నీ ఆశ్చర్యపరిచారు. ఇక్కడ ఆమె దేశ ప్రధానిగా హుందాగా ఉంటూ ఓ ప్రత్యేకమైన స్టైల్ని సెట్ చేశారు. ప్రధాని అంటే ఇది డ్రెస్సింగ్ స్టైల్ అనేలా ఉంటుంది ఆమె ఆహార్యం..!ప్రపంచవ్యాప్తంగా జార్జియా మెలోని డ్రెస్సింగ్ స్టైల్ హాట్టాపిక్గా ఉంది. ఆ ధరించే ఫ్యాట్ అంటూ సూట్ ఓ ప్రత్యేకతను ఆకర్షణగా హైలెట్గా నిలుస్తాయి. జార్జియా ధరించే అర్మానీ బ్రాండ్ సూట్ ఆమె అధికార దర్పాన్ని చూపించేలా ఉంటాయి. ఒక శక్తిమంతమైన మహిళ అనేలా ఆమె ఆహర్యం కనిపిస్తుంది. మంత్రలతో సమావేశం అయ్యేటప్పుడూ అర్మానీ నల్ల చొక్కా మారిది సూట్ని ధరిం చింది. ఆ తర్వాత హ్యాండ్ఓవర్ మీటింగ్ కోసం అర్మానీ బ్రాండ్ ముదురు చొక్కా సూట్ని ఎంచుకుంది. వీటితోపాటు మధ్య మధ్యలో నేవీ బ్లూ అర్మానీ కూడా ధరిస్తుంది. చెప్పాలంటే అదొక ఆఫీస్ యూనివఫాంలా ఉండి తన చుట్టు ఉన్నవారిని అలర్ట్ చేసేలా ఉంటుంది జార్జియా ఫ్యాషన్. ఆ డ్రెస్సింగ్ శైలి అధికారులు తమ పనిలో అలర్ట్గా వ్యవహరించేలా, వినేలా చెలాయస్తున్నట్లుగా ఉంటుందని చెబుతుంటారు అధికారులు. ఆమె దుస్తులు నుంచి జుట్టు వరకు ప్రతి విషయంలో ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటారు. ఇటాలియన్ ఫ్యాషన్కు ఐకాన్గా ఉంటారు జార్జియా. ఆమె అర్మానీ సూట్లు మేడ్ ఇన్ ఇటలీ అని చెబుతున్నట్లు కనిపిస్తాయి. రాజకీయనాయకులు డ్రెస్సింగ్ శైలీ విభిన్నంగా ఉంటుదని తెలిసిందే. కానీ ఇక్కడ జార్జియా మాత్రం తప డ్రెస్సింగ్ స్టైల్తోనే తన పవర్ ఏంటన్నది చూపిస్తుంది. ఇక జార్జియా కేవలం 15 ఏళ్ల వయసులో ఇటాలియన్ సోషల్ మూవ్మెంట్ యువజన విభాగంలో రిజస్టర్ అయ్యి చురుగ్గా పాల్గొనేది. అంతేగాదు సోషల్ మీడియాలో ఆమె క్లిష్ట పరిస్థితులను అవలీలగా ఎదర్కొనే శక్తిమంతమైన మహిళగా మంచి ఫ్యాన్ ఫోలోయింగ్ ఉది ఆమెకు. (చదవండి: ఒకప్పుడు నాన్న అంటే హడల్..కానీ ఇప్పుడు..!) -
ఖరీదైన నగలు, అదిరే స్టయిల్ : కోడల్ని మించి మెరిసిపోయిన నీతా అంబానీ
రిలయన్స్ అధినేత ముఖేష్ అంబానీ, నీతా అంబానీ చిన్న కుమారుడు అనంత్ అంబానీ రాధిక మర్చంట్ రెండో ప్రీ వెడ్డింగ్ వేడుక ఇటలీలో లగ్జరీ క్రూయిజ్లో ఘనంగా జరిగింది. ఈ వేడుకలో కాబోయే వధూవరులు అందంగా మెరిసిపోయారు. వీరితోపాటు అనంత్ తల్లి,ఫ్యాషన్ ఐకాన్ నీతా అంబానీ మరింత అందంగా స్పెషల్గా కనిపించారు. 60 ఏళ్ల వయసులో కూడా తన అందమైన రూపంతో అందర్నీ ఆకర్షించారు.ప్రముఖ పరోపకారి, ధీరూభాయ్ అంబానీ ఇంటర్నేషనల్ స్కూల్ వ్యవస్థాపకురాలు, రిలయన్స్ పౌండేషన్ ఛైర్ పర్సన్ నీతా తన చిన్న కుమారుడి రెండో ప్రీ వెడ్డింగ్ వేడుకలో రెండో రోజు షియాపరెల్లి బ్రాండ్ వైట్ టోగాలో అద్భుతంగా కనిపించారు. దీనికి జతగా ఇదే బ్రాండ్కు చెందిన లక్షల విలువైన ప్రత్యేక ఆభరణాలతో స్టయలిష్ లుక్లో తన ప్రత్యేకతను చాటుకున్నారు. ఆమె మెడలో ధరించిన మ్యాచింగ్ నెక్లెస్, చెవులకు స్టడ్స్, అలాగే ఒకవైపు మౌత్ బీన్, మరోవైపు బ్రాండ్ సిగ్నేచర్ ‘ఎనామెల్ ఐ’తో రూపొందించిన డబుల్ బ్రూచ్ ప్రత్యేకంగా నిలిచాయి.ఇక నీతా ధరించిన బ్రూచ్ ధర 2 లక్షల రూపాయలకు పై మాటే. అలాగే ఆమెధరించిన ‘కొల్లియర్ రూబన్ స్పైరల్’ అనే ప్రత్యేకమైన నెక్లెస్ ధర రూ. 6.15 లక్షల దాకా ఉంటుందని అంచనా.మే 31 నీతా అంబానీ ఫుల్ స్లీవ్ పర్పుల్ కలర్ పూల ఎంబ్రాయిడరీ గౌనులో మరింత అందంగా ముస్తాబయ్యారు. 4-5 క్యారెట్ల ఎమరాల్డ్-కట్ డైమండ్ నెక్పీస్ని, చెవిపోగులు, వెరైటీ సన్ గ్లాసెస్తో రాధికా అత్తగారిగా తన ఫ్యాషన్ స్టయిల్ను మరో సారి చాటుకున్నారు -
G7 Summit 2024: మరో ‘మెలోడీ’ క్షణం
బరీ(ఇటలీ): జీ7 సదస్సు సందర్భంగా భారత ప్రధాని నరేంద్ర మోదీతో ఆతీ్మయ భేటీని ఇటలీ మహిళా ప్రధాని జార్జియా మెలోనీ సామాజిక మాధ్యమాల వేదికగా పంచుకున్నారు. మూడు సెకన్ల సెల్ఫీ వీడియోను తీసి ‘ఎక్స్’లో షేర్చేశారు. మెలోనీ, మోదీ పేర్లను కలిపి మెలోడీ అనే కొత్త పదాన్ని సృష్టించి దానికి హ్యాష్ట్యాగ్ను తగిలించి గతంలోనే ఆమె విస్తృత ట్రెండింగ్ చేసిన విషయం తెల్సిందే. అదే పంథాలో మరోసారి కొత్త వీడియోను తీసి అందరితో పంచుకున్నారు. శుక్రవారం జీ7 శిఖరాగ్ర సదస్సు జరిగిన ఇటలీలోని అపూలియాలో ఉన్న రిసార్ట్ ఇందుకు వేదికైంది. మోదీని మెలోనీ సాదరంగా ఆహా్వనించినపుడు నమస్కారంతో ఇరువురూ పలకరించుకున్న విషయం తెల్సిందే. తర్వాత ద్వైపాక్షి చర్చలు జరిపాక ఆయనతో కలిసి మెలానీ ‘హలో ఫ్రమ్ ది మెలోడీ టీమ్’ అంటూ ఒక సెల్ఫీ వీడియోను తీసుకున్నారు. ఈ వీడియోను శనివారం ఆమె ‘ఎక్స్’లో షేర్చేయడంతో అది తెగ వైరల్ అయింది.PM Narendra Modi and Italy's PM Giorgia Meloni's selfie on the sidelines of the G7 summit, in Italy. pic.twitter.com/wE1ihPHzeq— ANI (@ANI) June 15, 2024 Hi friends, from #Melodi pic.twitter.com/OslCnWlB86— Giorgia Meloni (@GiorgiaMeloni) June 15, 2024 ‘భారత్–ఇటలీ స్నేహబంధం శాశ్వతంగా కొనసాగాలి’ అని ఆ వీడియోను మోదీ మళ్లీ షేర్ చేశారు. గతేడాది డిసెంబర్లో యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్లోని దుబాయ్ వేదికగా జరిగిన ‘కాప్28’ సదస్సు సందర్భంగా మెలోనీ, మోదీ తీసుకున్న సెల్ఫీ ఆనాడూ తెగ వైరల్ అయిన విషయం విదితమే.1. #COP28 summit in Dubai.2. #G7 summit in Italy#Melodi #Selfie #G7Italie #G72024 pic.twitter.com/otVV1YGaMh— Rai Sahab 🇮🇳 (@raiparas) June 15, 2024 The Moment we all have been waiting for ☺️☺️😂 pic.twitter.com/5hdahECYMa— Amit Shah (Parody) (@Motabhai012) June 14, 2024 Had a very good meeting with PM @GiorgiaMeloni. Thanked her for inviting India to be a part of the G7 Summit and for the wonderful arrangements. We discussed ways to further cement India-Italy relations in areas like commerce, energy, defence, telecom and more. Our nations will… pic.twitter.com/PAe6sdNRO9— Narendra Modi (@narendramodi) June 14, 2024 -
ఇటలీలో జీ-7 సదస్సులో పలు దేశాల ప్రముఖులతో ప్రధాని మోదీ (ఫొటోలు)
-
జీ-7: ముగిసిన మోదీ పర్యటన.. ఏమన్నారంటే
రోమ్: ఇటలీలోని అపులియాలో జరుగుతున్న జీ-7 దేశాల సమ్మిట్ తొలిరోజు పాల్గొనటం చాలా అద్భుతం అనిపించిందని ప్రధాని మోదీ అన్నారు. ఇటలీలోని అపులియాలో నిర్వహిస్తున్న మూడు రోజుల జీ-7 దేశాల సమ్మిట్ తొలిరోజు ప్రధానమంత్రి నరేంద్రమోదీ హాజరై.. పలువురు దేశాధినేతలతో భేటీ నిర్వహించారు.Had a very productive day at the G7 Summit in Apulia. Interacted with world leaders and discussed various subjects. Together, we aim to create impactful solutions that benefit the global community and create a better world for future generations.I thank the people and…— Narendra Modi (@narendramodi) June 14, 2024రోజంతా ఆయా దేశాధినేతలతో ద్వైపాక్షిక చర్చలు జరిపారు. ఇక.. జీ-7 దేశాల సమ్మిట్ పర్యటన ముగించుకొని ప్రధాని మోదీ ఇండియాకు బయల్దేరారు. ఈ సందర్భంగా మోదీ ‘ఎక్స్’లో ట్వీట్ చేశారు.చదవండి: స్వేచ్ఛా వాణిజ్యంపై మోదీ, రిషీ సమీక్ష#WATCH | Apulia, Italy: Prime Minister Narendra Modi leaves for India from Brindisi Airport after attending the G7 Summit. pic.twitter.com/7kiamKGCbH— ANI (@ANI) June 14, 2024 ‘ఇటలీలోని అపులియాలో జరిగిన G-7 సమ్మిట్లో చాలా ఉత్పాదకమైన రోజు. ప్రపంచ నాయకులతో భేటీ అయ్యాను. పలు దేశాధినేతలతో వివిధ అంశాలపై చర్చించాను. గ్లోబల్ కమ్యూనిటీకి ప్రయోజనం చేకూర్చే ప్రభావవంతమైన పరిష్కారాలను రూపొందించటం, భవిష్యత్తు తరాలకు మెరుగైన ప్రపంచాన్ని సృష్టించడం మా లక్ష్యం. ఇటలీ ప్రజలు, ప్రభుత్వం సాదరమైన ఆతిథ్యానికి ధన్యవాదాలు’ అని మోదీ అన్నారు. చదవండి: ఫ్రాన్స్ అధ్యక్షుడు మేక్రాన్తో చర్చలుచదవండి: జీ-7: కృత్రిమ మేధపై పోప్ ఆందోళన -
జీ-7: జర్మన్ ఛాన్సలర్ పుట్టినరోజు.. బర్త్ డే సాంగ్తో శుభాకాంక్షలు
ఇటలీలోని అపులియాలో నిర్వహిస్తున్న మూడు రోజుల జీ-7 దేశాల సమ్మిట్లో తొలి రోజు దేశాధినేతల రాక.. వరుస సమావేశాలతో బిజీబిజీగా గడిచింది. జీ-దేశాల సమ్మిట్ భారత్ తరఫున ప్రధానమంత్రి మోదీ హాజరయ్యారు. మోదీ సైతం పలు దేశాధినేతలతో సమావేశమై ద్వైపాక్షిక చర్చలు జరిపారు. అయితే తోలి రోజు సమావేశాల్లో భాగంగా ఓ ఆసక్తికర ఘటన చోటు చేసుకుంది.యురోపియన్ కమిషన్ ప్రెజిడెంట్ ఉర్సులా వాన్ డెర్ లేయన్, అమెరికా అధ్యక్షుడు జోబైడెన్ మాట్లడాకుంటున్నారు. అంతలోనే లేయన్ అక్కడే ఉన్న జర్మన్ ఛాన్సలర్ ఓలాఫ్ స్కోల్జ్ బర్త్ డే ఈరోజు అని జోబైడెన్తో చెప్పారు. దీంతో ఆయన స్పందిస్తూ.. అయితే ఆయన కోసం మీరు బర్త్ డే సాంగ్ పాడారా? అని అడిగారు.#G7 Italia 2024: #Biden, #Meloni and other world leaders sing happy birthday song for German Chancellor Catch the day's latest news here ➠ https://t.co/mTNeb6ks1i 🗞️ pic.twitter.com/qYordDWk95— Economic Times (@EconomicTimes) June 14, 2024 బైడెన్ ఫ్యామిలీలో అయితే పుట్టినరోజు వేళ బర్త్ డే సాంగ్ పడుతామని అన్నారు. వెంటనే బైడెన్ బర్త్డే సాంగ్ మొదలుపెట్టగా అక్కడికి వచ్చిన దేశాధినేతలు అయనతో పాడుతూ.. ఓలాఫ్ స్కోల్జ్కు శుభాకాంక్షలు తెలిపారు. తనకు బర్త్డే శుభాకాంక్షలు తెలిపిన దేశాధినేతలకు ఓలాఫ్ స్కోల్జ్ కృతజ్ఞతలు తెలిపారు. దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్మీడియాలో వైరల్ అవుతోంది.బ్రిటన్ ప్రధాని రిషి సునక్, ఫ్రెంచ్ అధ్యక్షుడు ఇమ్మాన్యుయేల్ మాక్రాన్, ఇటాలియన్ ప్రధాన మంత్రి జార్జియా మెలోని, యూరోపియన్ కమిషన్ ప్రెసిడెంట్ ఉర్సులా వాన్ డెర్ లేయెన్, కెనడా ప్రధాన మంత్రి జస్టిన్ ట్రూడో ఈ వీడియో కనిపిస్తారు.ఓలాఫ్ స్కోల్జ్ 2021 డిసెంబర్ నుంచి జర్మనీ ఛాన్సలర్గా పని చేస్తున్నారు. ఆయన సోషల్ డెమోక్రటిక్ పార్టీ ఆఫ్ జర్మనీ (SPD)సభ్యుడు. ఛాన్సలర్ కావడానికి ముందు.. స్కోల్జ్ 2018 నుంచి 2021 వరకు మాజీ ఛాన్సలర్ ఏంజెలా మెర్కెల్ సంకీర్ణ ప్రభుత్వంలో వైస్ ఛాన్సలర్, ఆర్థిక మంత్రిగా పని చేశారు. -
G7 Summit: మోదీకి ఆతిధ్యం ఇచ్చే రెస్టారెంట్ ఇదే..!
ఇటలీలో జరగనున్న జీ7 సదస్సులో పాల్గొనేందుకు ప్రధాని నరేంద్ర మోదీ తన బృందంతో కలిసి గురువారమే ఇటలీ చేరుకున్నారు. ప్రపంచనాయకులు పాల్గొనే ఈ కార్యక్రమాన్ని కవర్ చేసేందుకు పాత్రికేయులకు కూడా ఎంట్రీ ఉంటుంది. ఈ ఏడాది ఇటలీలోని పుగ్లియా నగరంలో ఈ కార్యక్రమం జరుగుతుంది. మరీ ఈ సదస్సుకి హాజరుకానున్న మోదీకి ఇటలీలో ఉన్న ఏ భారతీయ రెస్టారెంట్ ఆతిధ్యం ఇవ్వనుందంటే..ఇటీలీలో ఈ జీ7 సదస్సు జూన్ 13 నుంచి జూన్ 15, 2024 వరకు జరుగనుంది. ఈ సదస్సులో ముఖ్యమైన చర్చల తోపాటు ప్రపంచ నాయకులకు ఇచ్చే ఆతిధ్యం కూడా హాటాటాపిక్గా ఉంది. నివేదిక ప్రకారం..ఇటలీ ప్రెసిడెంట్ సెర్గియో మట్టరెల్లా ఆహ్వానితుల కోసం అద్భుతమైన సీఫ్రంట్ గాలా డిన్నర్ను ఏర్పాటు చేసినట్లు సమాచారం. ఇక అమెరికా అధ్యక్షుడు జోబైడన్, రిషి సునాక్ వంటి నాయకులు ఇటాలియన్ ప్రెసిడెంట్ బోర్గ్ ఎంగ్నాజియా రిసార్ట్లో ఆతిథ్యం ఏర్పాటు చేసినట్లు అదికారిక వర్గాలు చెబుతున్నాయి. ఇక ఇటలీ ప్రధాని జార్జియా మెలోనితో ద్వైపాక్షిక సమావేశంలో పాల్గొనే భారత ప్రధాని మోదీకి ఇటలీలోని బారీలో ఉన్న భారతీయ రెస్టారెంట్ ఆతిథ్యం ఇవ్వనుంది. ప్రధాని మోదీ అతని బృందానికి రుచికరమైన భారతీయ వంటాకాలను ఈ రెస్టారెంట్ అందించనుంది. ఇటలీలో భారత్లోని అద్భుతమైన రుచులను అందించడానికి పేరుగాంచిన భారతీయ రెస్టారెంట్ ఇండియానో నమస్తే ప్రధాని మోదీ, అతని బృందానికి ఆతిథ్యం ఇస్తోంది. ఇది సుప్రసిద్ద పంజాబీ వంటకాలకు పేరుగాంచింది. ఇక్కడ స్పైసీ ఫుడ్స్, తందూరీ చికెన్, బిర్యానీలు మంచి ఫేమస్. నోరూరించే భారతీయ వంటకాలకు ఈ ఈ రెస్టారెంట్ కేరాఫ్ అడ్రస్ కూడా. ఇక్కడ ప్రతి కస్టమర్ ఆకలిని తీర్చేలా భోజనం ఉంటుంది. ముఖ్యంగా శాకాహార భోజనం కూడా అదరహో అన్న రేంజ్లో ఉంటుందట. గులాబ్జామున్, గజర్ కా హల్వా వంటి దేశీయ డిజార్ట్లు కూడా బాగా ఫేమస్. ఇటలీలోని భారత ప్రధాని మోదీకి సంప్రదాయ శాకాహార వంటకాలను అందించే మహత్తర బాధ్యతను ఈ రెస్టారెంట్ తీసుకుంది. ప్రధాని మోదీ, అతని బృందానికి తన పాకశాస్త్ర నైపుణ్యాన్ని చూపించేలా వంటకాలను అందించనుంది ఇండియానో నమస్తే రెస్టారెంట్. (చదవండి: ట్రెడ్మిల్ వర్సెస్ వాకింగ్: ఏది బెటర్? నిపుణులు ఏమంటున్నారంటే..) -
G-7 Summit: బైడెన్కు ఏమైంది?.. ఇటలీలో వింత ప్రవర్తన!
ఇటలీ వేదికగా ప్రతిష్ఠాత్మక జీ-7 దేశాల సదస్సుకు పలు దేశాల నేతల హాజరయ్యారు. జీ-7లో అమెరికా సభ్య దేశం కావడంతో సదస్సులో పాల్గొనేందుకు యూఎస్ అధ్యక్షుడు జో బైడెన్ కూడా ఇటలీ చేరుకున్నారు. కాగా, ఇటలీలో జో బైడెన్ వింతగా ప్రవర్తించడం అందరినీ ఆశ్చర్యానికి గురిచేసింది. దీంతో, బైడెన్ ప్రవర్తనపై సోషల్ మీడియాలో చర్చ నడుస్తోంది.ఇటలీ తీరప్రాంత నగరం అపూలియాలో రెండు రోజులపాటు జీ-7 సదస్సు కొనసాగనుంది. ఈ సదస్సులో పాల్గొనేందకు జీ-7 కూటమి దేశాల నేతలు ఇటలీ చేరుకున్నారు. కాగా, సదస్సు ఆరంభం కావడానికి ముందు అపూలియా తీర ప్రాంతాన్ని ఆయా దేశాల నేతలు సందర్శించారు. అక్కడ ఉన్న వాటర్ స్పోర్ట్స్ను వీక్షించారు. పారా గైడ్లింగ్ చేస్తున్న వారిని పలకరించారు. ఆ సమయంలో జో బైడెన్ వింతగా ప్రవర్తించారు. 🇺🇸 President Joe Biden is completely lost at the G7 Summit. pic.twitter.com/LbyiNg7mqE— BRICS News (@BRICSinfo) June 13, 2024 తీర ప్రాంతం వద్ద రిషి సునాక్, జస్టిన్ ట్రూడో, మెలోనీ, ఉర్సులా వాన్ డెర్.. ఒకవైపు ఉండి వాటర్ స్పోర్ట్స్ను తిలకిస్తోండగా.. జో బైడెన్ మాత్రం వారికి దూరంగా వెళ్లి దిక్కులు చూస్తూ నిలబడిపోయారు. అక్కడ ఎవరూ లేకపోయినా ఎవరితోనో ఆయన మాట్లాడుతున్నట్టు సైగలు చేశారు. కుడి చెయ్యి పైకి ఎత్తి పలకరించడం కనిపించింది. ఈ సమయంలో బైడెన్ను గమనించిన మెలోని ఆయన దగ్గరకు వెళ్లి చెయ్యి పట్టుకుని వెనక్కి తీసుకువచ్చారు. ఇక, దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. బైడెన్కు ఏమైందంటూ పలువురు ప్రశ్నిస్తున్నారు.అయితే, బైడెన్ ఇలా వింతగా ప్రవర్తించడం ఇదే తొలిసారి కాదు. అంతుకుముందు పలు సందర్భాల్లో కూడా ఆయన ఇలాగే చేశారు. అమెరికాకు సంబంధించి చిప్స్ అండ్ సైన్స్ చట్టంపై సంతకం చేసే కార్యక్రమంలో సెనేట్ మెజార్టీ లీడన్ చక్ షూమర్ అందరికీ షేక్ హ్యాండ్ ఇచ్చాడు. పొడియం వద్దకు వచ్చిరాగానే ముందుగా బైడెన్కు షేక్హ్యాండ్ ఇచ్చి, ఆ తర్వాత స్టేజ్ మీద ఉన్న మిగతావాళ్లకు ఇచ్చాడు లీడన్. అప్పటికి తను షేక్హ్యాండ్ ఇచ్చిన విషయం మర్చిపోయిన బైడెన్.. మరోసారి షేక్ హ్యాండ్ కోసం చేతిని ముందుకు తీసుకెళ్లారు. అయితే చేతిని కాసేపు అలాగే షేక్ హ్యాండ్ పొజిషన్లో ఉంచి షాక్తో మళ్లి చేతిని కిందకు దించాడు బైడెన్. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది. It took Joe Biden exactly 3 seconds to forget he had already shaken Schumer's hand. pic.twitter.com/V3eEOuaFuz— Gain of Fauci (@DschlopesIsBack) June 12, 2024 గతంలోనూ ఇలాంటి పొరపాటే చేసి మీడియాకు అడ్డంగా దొరికిపోయారు బైడెన్. ఉక్రెయిన్-రష్యా మధ్య యుద్ధం నేపథ్యంలో మీడియాతో మాట్లాడే క్రమంలో రష్యా దేశం, ఆ దేశ అధ్యక్షుడు పుతిన్ పేరు సైతం మర్చిపోవడం, తనతోపాటు పక్కనే ఉన్న అమెరికా ఉపాధ్యక్షురాలను ప్రథమ మహిళ అని సంబోధించి చాలా గందరగోళానికి గురయ్యారు. Pay close attention to Joe Biden’s hands in this video! pic.twitter.com/C5r0ceTNnX— Matt Wallace (@MattWallace888) June 12, 2024 It’s funny to MAGA because Joe Biden physically turned around and faced the WWII D Day veterans instead of having his back turned pic.twitter.com/lLC3I1AXCF— Andrew Mercado (@RealAndyMerc) June 7, 2024 -
వీడియో: జీ-7 సదస్సు వేళ ఇటలీ పార్లమెంట్లో ఉద్రిక్తత.. ఎంపీల కొట్లాట..
రోమ్: జీ-7 సదస్సు జరుగుతున్న వేళ ఇటలీలో ఆసక్తికర పరిణామం జరిగింది. ఇటలీ పార్లమెంట్లో ఉద్రిక్త పరిస్థితి చోటుచేసుకుంది. పార్లమెంట్లోని దిగువ సభలో చట్ట సభ్యులు(ఎంపీలు) ఒకరిపై ఒకరు దాడులు చేసుకున్నారు. ఈ ఘటనలో ప్రతిపక్ష సభ్యుడికి తీవ్ర గాయాలు కావడంతో వెంటనే ఆయనను ఆసుపత్రికి తరలించారు.వివరాల ప్రకారం.. ఇటలీ పార్లమెంట్లో సభ్యులు మధ్య వాగ్వాదం చోటుచేసుకోవడం కారణంగా దాడి జరిగింది. చట్టసభలో ప్రాంతీయ స్వయం ప్రతిపత్తిని విస్తరించే ప్రభుత్వ వివాదాస్పద ప్రతిపాదనలు జరిగాయి. ఈ సందర్భంగా సభలో సభ్యుల మధ్య వాగ్వాదం జరిగింది. అనంతరం, ఒకరిపై ఒకరు దాడులు చేసుకున్నారు. ఈ ఘటనలో గాయపడిన ప్రతిపక్ష సభ్యుడిని వీల్ చైర్లో ఆసుపత్రికి తరలించినట్లు ఆ దేశ మీడియా పేర్కొంది. ITALIAN PARLIAMENT: A fight breaks when Five Star Movement deputy Leonardo Donno unfurls an Italian flag in protest against plans to grant more autonomy from Rome to regions that want it. Protestors argue that it undermines Italy's unity. pic.twitter.com/qf6bVFteC3— Mark Alan Pearce (@PearceAlan1962) June 13, 2024 కాగా, వివాదాస్పద ప్రతిపాదనలను వ్యతిరేకించిన ప్రతిపక్ష సభ్యుడు లియోనార్డో డాన్నో ఆ దేశ జెండాను సభలో మంత్రికి ఇవ్వడానికి ప్రయత్నించిన సమయంలో దాడి జరిగింది. దీనికి సంబంధించిన వీడియో బయటకు వచ్చింది. ఈ ఘటనపై ఇటలీ రాజకీయ నేతలు స్పందించారు. ఇది ఇటలీ ఐకత్యను దెబ్బతిస్తుందని వారు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. -
మోదీ 3.0: తొలి విదేశీ పర్యటనకు ప్రధాని పయనం
సాక్షి, ఢిల్లీ: దేశ ప్రధానిగా ఇటీవల వరుసగా మూడోసారి ప్రమాణ స్వీకారం చేసిన నరేంద్ర మోదీ తొలి విదేశీ పర్యటనకు శ్రీకారం చుట్టారు. జీ7 సదస్సులో పాల్గొనేందుకు గురువారం సాయంత్రం మోదీ ఇటలీలోని అపులియా బయలుదేరారు.మోదీ మూడోసారి ప్రధానమంత్రి బాధ్యతలు చేపట్టిన అనంతరం ఇటలీ ఆయన మొదటి విదేశీ పర్యటన కావటం గమనార్హం. జూన్ 14న తమ దేశంలో జరగనున్న 50వ జీ-7 సమ్మిట్కు హాజరుకావాలని ఇటలీ.. భారత్ను ఆహ్వానించిన విషయం తెలిసిందే. ప్రధాని మోదీ ఇటలీ ప్రధాని జార్జియా మెలోనితో భేటీ కానున్నారు. సమ్మిట్ వచ్చే ఇతర దేశాల నేతలతో సైతం ప్రధాని మోదీ భేటీ అయ్యే అవకాశం ఉంది.ఇక జీ7 50వ సదస్సులో పాల్గొనేందుకు అమెరికా, బ్రిటన్, ఫ్రాన్స్, కెనడా, జర్మనీ, జపాన్ దేశాధినేతలు ఇటలీకి చేరుకున్నారు. ఇటలీ ప్రధాని జార్జియా మెలోని వారికి ఘనస్వాగతం పలికారు. జీ7 కూటమిలో అమెరికా, యూకే, ఫ్రాన్స్, ఇటలీ, జర్మనీ, కెనడా, జపాన్ సభ్యదేశాలుగా ఉన్నాయి. ఈ వార్షిక సమావేశానికి భారత్తో పాటు ఆఫ్రికా, దక్షిణ అమెరికా, ఇండో-పసిఫిక్ ప్రాంతంలోని 11 అభివృద్ధి చెందుతున్న దేశాల నేతలను ఇటలీ ఆహ్వానించింది.కాగా, గత ఏడాది జపాన్లోని హిరోషిమాలో జరిగిన జీ7 దేశాల సదస్సుకు హాజరైన మోదీ.. ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ, ఇతర ప్రపంచ నేతలతో ఆయన చర్చలు జరిపారు. -
జీ-7 సమ్మిట్: బైడెన్తో ప్రధాని మోదీ ప్రత్యేక భేటీ!
ఢిల్లీ: ఇటలీలో రేపు( శుక్రవారం) జరగబోయే జీ-7 దేశాల సమ్మిట్లో భాగంగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ను కలవనున్నట్లు తెలుస్తోంది. ఈ విషయాన్ని అమెరికా నేషనల్ సెక్యూరిటీ అడ్వైజర్ జేక్ సుల్లివన్ బుధవారం తెలిపారు. జీ-7 దేశాల సమ్మిట్కు హాజరయ్యేందుకు ఇటలీ వెళ్తున్న సమయంలో జేక్ మీడియాతో మాట్లాడారు. ‘‘ అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ను ఇటలీలో ప్రధాని మోదీని చూడాలని ఆశిస్తున్నారు. ఇప్పటికే జీ-7 సమ్మిత్కు మోదీ హాజరవుతారని భారత్ అధికారంగా ప్రకటించింది. అయితే మోదీ, బైడెన్ ఇటలీలో కలుసుకునే అవకాశం ఉందని భావిస్తున్నా’’ అని అన్నారు. అదే విధంగా తాము పారిస్లో ఉన్న సమయంలో అధ్యక్షుడు బైడెన్ మోదీకి ఫోన్ చేసినట్లు తెలిపారు. మోదీ మూడోసారి ప్రధాని అయినందుకు బైడెన్ ఫోన్లో శుభాకాక్షలు తెలిపారని అన్నారు.ఇక.. ప్రధాని మోదీ ఇవాళ (గురువారం) ఇటలీ బయల్దేరనున్నారు. మోదీ మూడోసారిగా ప్రధానమంత్రి బాధ్యత్యలు చేపట్టిన అనంతరం ఇటలీ ఆయన మొదటి విదేశి పర్యటన కావటం గమనార్హం. జూన్ 14న తమ దేశంలో జరగనున్న 50వ జీ-7 సమ్మిట్కు హాజరుకావాలని ఇటలీ.. భారత్ను ఆహ్వానించిన విషయం తెలిసిందే. ప్రధాని మోదీ ఇటలీ ప్రధాని జార్జియా మెలోనితో భేటీ కానున్నారని విదేశాంగ కార్యదర్శి వినయ్ మోహన్ క్వాత్రా వెల్లడించారు. అదే విధంగా సమ్మిట్ వచ్చే ఇతర దేశాల నేతలతో సైతం ప్రధాని మోదీ భేటీ అయ్యే అవకాశం ఉన్నట్లు క్వాత్రా తెలిపారు. -
నేడు ఇటలీకి మోదీ.. జీ–7 సదస్సులో పాల్గొననున్న ప్రధాని
న్యూఢిల్లీ: జీ7 అత్యాధునిక ఆర్థిక వ్యవస్థల శిఖరాగ్ర సదస్సులో ప్రధాని మోదీ పాల్గొననున్నారు. ఇందుకోసం జీ7 సదస్సుకు ఆతిథ్యమిస్తున్న ఇటలీకి గురువారం ప్రధాని మోదీ బయల్దేరనున్నారు. మూడోసారి ప్రధానిగా పగ్గాలు స్వీకరించాక మోదీ మొట్టమొదటి విదేశీ పర్యటన ఇదేకావడం విశేషం. గత ఏడాది భారత సారథ్యంలో ముగిసిన జీ20 శిఖరాగ్ర సమావేశాల తర్వాత జరుగుతున్న సదస్సు కావడంతో ఈ భేటీలో తీసుకునే నిర్ణయాలపై ప్రపంచ దేశాలు ఆసక్తిగా ఎదురుచూస్తున్నాయి. ఇటలీలోని అపూలియో ప్రాంతంలోని విలాసవంత బోర్గో ఎగ్నాజియా రిసార్ట్లో జీ7 శిఖరాగ్ర సదస్సు జూన్ 13వ తేదీ నుంచి 15వ తేదీదాకా జరగనుంది. ఉక్రెయిన్ యుద్ధంతోపాటు ఇజ్రాయెల్ దాడులతో శిథిలమవుతున్న గాజా స్ట్రిప్ను ఆదుకునేందుకు, యుద్ధాలను ఆపేందుకు అధినేతలు సమాలోచనలు జరపనున్నారు. అమెరికా అధ్యక్షుడు జో బైడెన్, ఫ్రాన్స్ అధ్యక్షుడు ఎమ్మాన్యుయేల్ మేక్రాన్, జపాన్ ప్రధాని ఫుమియో కిషిదా, కెనడా ప్రధాని జస్టిన్ ట్రూడో, ఇటలీ మహిళా ప్రధాని జార్జియా మెలానీ తదితర అగ్రనేతలు ఈ భేటీకి హాజరవుతున్నారు. రష్యా భీకర దాడులను ఎదుర్కొంటున్న ఉక్రెయిన్ అధ్యక్షుడు వ్లాదిమిర్ జెలెన్స్కీ సైతం ఒక సెషన్లో పాల్గొని రష్యాపై విమర్శల వర్షం కురిపించనున్నారు. మోదీ విదేశీ పర్యటన వివరాలను భారత విదేశాంగ శాఖ కార్యదర్శి వినయ్ ఖ్వాత్రా వెల్లడించారు. ‘‘ చర్చలు, సంప్రతింపుల ప్రక్రియ ద్వారా ఉక్రెయిన్, హమాస్–ఇజ్రాయెల్ యుద్ధాలకు ముగింపు పలికేందుకు భారత్ ఎప్పటిలాగే సదా సిద్ధంగా ఉంది’ అని ఖ్వాత్రా చెప్పారు. స్విట్జర్లాండ్లో జరగబోయే శాంతి సదస్సులోనూ భారత్ ప్రాతినిధ్యం వహిస్తుందని తెలిపారు. అయితే భారత్ తరఫున ఎవరు హాజరవుతారనే వివరాలను ఆయన వెల్లడించలేదు. గాందీజీ ప్రతిమ వద్ద ఖలిస్తానీ రాతలు ఇటలీలో మోదీ గురువారం పర్యటన మొదలుకానున్న ఒక్క రోజు ముందే అక్కడి గాంధీజీ ప్రతిమ వద్ద ఖలిస్తానీ మద్దతుదారులు వేర్పాటువాద రాతలు రాశారు. కెనడాలో హత్యకు గురైన ఖలిస్తానీ వేర్పాటువాది హర్దీప్ సింగ్ నిజ్జర్ అనుకూల నినాదాలనూ ప్రతిమ పీఠం వద్ద నలుపురంగుతో రాశారు. ప్రతిమను ఆవిష్కరించిన కొద్దిసేపటికే వేర్పాటువాదులు ఈ చర్యలకు తెగబడ్డారు. వేర్పాటువాదుల దుశ్చర్యలను భారత్ తీవ్రంగా ఖండించింది. తగిన చర్యలు తీసుకోవాలని ఇటలీ అధికారులకు సూచించామని భారత విదేశాంగ శాఖ కార్యదర్శి వినయ్ ఖ్వాత్రా చెప్పారు. వెంటనే స్థానిక యంత్రాంగం ఘటనాస్థలికి చేరుకుని ఖలిస్తానీ రాతలను తుడిచేసింది. -
జీ7సమ్మిట్కు ముందు.. ఇటలీలో గాంధీ విగ్రహం ధ్వంసం
రోమ్: జాతిపిత మహాత్మా గాంధీ విగ్రహాన్ని ఇటలీలో ఖలిస్తానీ తీవ్రవాదులు బుధవారం(జూన్12) ధ్వంసం చేశారు. అక్కడితో ఆగకుండా మరణించిన ఖలిస్తానీ తీవ్రవాది హర్దీప్సింగ్ నిజ్జర్కు సంబంధించిన నినాదాలను అక్కడ రాసి వెళ్లారు. ఈ ఘటనపై భారత విదేశాంగ శాఖ వెంటనే స్పందించింది. ఇటలీ విదేశీవ్యవహారాల శాఖ దృష్టికి ఈ విషయాన్ని తీసుకువెళ్లినట్లు భారత విదేశీ వ్యవహరాల శాఖ కార్యదర్శి వినయ్ మోహన్ క్వత్రా తెలిపారు. సంఘటన జరిగిన వెంటనే విగ్రహ శిథిలాలను ఇటలీ ప్రభుత్వం అక్కడినుంచి తీసివేసి ఆ ప్రదేశాన్ని శుభ్రం చేయించింది.ప్రధాని మోదీ జీ7 సదస్సుకు ప్రత్యేక ఆహ్వానితుడిగా హాజరవనున్న తరుణంలో ఈ దుశ్చర్యకు తీవ్రవాదులు ఒడిగట్టడం చర్చనీయాంశమవుతోంది. ఇటలీలోని ఎపులియాలో జూన్ 13 నుంచి 15దాకా జీ7 సదస్సు జరగనుంది. ఈ సదస్సుకు ఇటలీ ప్రధాని జార్జియా మెలోని ప్రధాని మోదీని ప్రత్యేకంగా ఆహ్వానించారు. జీ7లో భారత్ సభ్య దేశం కానప్పటికీ మోదీ ప్రత్యేక ఆహ్వానితుడిగా హాజరవనున్నారు. -
మూడోటర్ము.. మోదీ తొలి విదేశీ టూర్ ఇటలీకి..!
న్యూఢిల్లీ: ప్రధానిగా మూడోసారి ప్రమాణస్వీకారం చేసిన తర్వాత మోదీ తొలి విదేశీ పర్యటన ఖరారైనట్లు సమాచారం. జూన్ 13 నుంచి 15 వరకు జరిగే జీ7 సమావేశాల కోసం మోదీ ఇటలీ వెళ్లనున్నట్లు తెలుస్తోంది. ‘జీ7 సమావేశాలకు రావాల్సిందిగా ఇటలీ ప్రధాని మంత్రి జార్జియా మెలోని గురువారం(జూన్6) ఫోన్లో మోదీని ఆహ్వానించారు. ఈ ఆహ్వానానికి మోదీ ఓకే అన్నారు. తనను ఆహ్వానించినందుకు మెలోనికి మోదీ కృతజ్ఞతలు చెప్పారు’అని భారత విదేశీ వ్యవహారాల శాఖ ఒక ప్రకటనలో తెలిపింది. ప్రపంచ ఆర్థికవ్యవస్థ ప్రస్తుత స్థితిగతులు, అంతర్జాతీయ వాణిజ్యం, వాతావరణమార్పులు, రష్యా-ఉక్రెయిన్, ఇజ్రాయెల్-హమాస్ యుద్ధాల ప్రభావం తదితర అంశాలపై జీ7 సదస్సులో చర్చించనున్నారు. కెనడా, ఫ్రాన్స్,జర్మనీ, ఇటలీ,జపాన్, యూకే,అమెరికా జీ7 కూటమిలో సభ్య దేశాలుగా ఉన్నాయి. జీ7 సదస్సు సైడ్లైన్స్లో అమెరికా అధ్యక్షుడు జో బైడెన్తో మోదీ భేటీ అయ్యే అవకాశాలున్నాయి. -
అనంత్-రాధిక ప్రీ వెడ్డింగ్ వేడుకలపై ఆగ్రహం.. కారణం ఇదే..
ముఖేష్ అంబానీ కుమారుడు అనంత్ అంబానీ, సంపన్న పారిశ్రామికవేత్త రాధికా మర్చంట్ల రెండో ప్రీ వెడ్డింగ్ వేడుక సముద్రంపై విలాసవంతమైన క్రూయిజ్లో నాలుగు రోజులపాటు అంగరంగ వైభవంగా జరిగింది. ఇటలీలోని పాలెర్మో నుంచి సౌత్ ఫ్రాన్స్ వరకు సుమారు 4,380 కిలోమీటర్ల దూరం ప్రయాణించిన విలాసవంతమైన క్రూయిజ్ లైనర్లో సుమారు 800 మంది ప్రముఖులు పాల్గొన్నారు. రోమ్, పోర్టోఫినో, జెనోవా, కేన్స్ లలో ఈ నౌకకు ప్రత్యేకంగా స్టాప్లు ఏర్పాటు చేసి వేడుకలు నిర్వహించారు.అయితే ఈ వేడుక పోర్టోఫినోలోని వ్యాపారులు, స్థానిక ప్రజలకు కోపం తెప్పించింది. అనంత్-రాధిక ప్రీ వెడ్డింగ్ వేడుకల కోసం స్థానిక బేను తీసుకుని స్థానికులకు, సందర్శకులకు అందుబాటులో లేకుండా చేయడమే ఇందుకు కారణం. ఇంతకు ముందెన్నడూ ఒక కార్యక్రమం కోసం ఇలా మొత్తం బేను మూసివేయలేదు. ఇక్కడ చాలా మంది సెలబ్రిటీల వివాహ వేడుకలు జరిగాయి. ఆస్ట్రేలియన్ సంగీతకారిణి సియా, రియాలిటీ టీవీ స్టార్ కోర్ట్నీ కర్దాషియాన్ వెడ్డింగ్ ఇక్కడే జరిగింది.మరో వైపు అనంత్ - రాధిక ప్రీ వెడ్డింగ్ వేడుకలో పలు రకాల వంటకాల కోసం స్థానిక ప్రసిద్ధ రెస్టారెంట్లకు ఆర్డర్లు ఇచ్చారు. తమను లోబ్స్టర్ శాండ్విచ్లు తయారు చేయమని అడిగారిని, కానీ వేడుకలకు 20 రోజుల ముందు మాత్రమే తమకు సమాచారం ఇచ్చారని స్టీవెన్ స్పీల్బర్గ్, సర్ ఎల్టన్ జాన్, డెంజెల్ వాషింగ్టన్ మరియు సిల్వియో బెర్లుస్కోనీ వంటివారికి సేవలందించిన ప్రసిద్ధ రెస్టారెంట్ ఇల్ పునీ మేనేజర్ ఆండ్రియా మిరోలి తెలిపారు. ఈ చర్య అవమానకరంగా, అనుచితంగా ఉందని ఆయన వెల్లడించారు.ఇక సోషల్ మీడియాలో స్థానికులు, సందర్శకులు పలు పోర్టోఫినో ప్రదేశాలు తమకు అందుబాటులో లేకపోవడంపై విచారం వ్యక్తం చేశారు. "చాలా మంది ఇతర సెలబ్రిటీలు, బిలియనీర్లు పోర్టోఫినోలో సంబరాలు చేసుకున్నారు, వారిలో ఎవరూ ఇతరులకు ప్రధాన పాయింట్కు యాక్సెస్ లేకుండా చేయలేదు" అని ఎక్స్ యూజర్లలో ఒకరు రాసుకొచ్చారు. -
‘సిండ్రిల్లా’లా మెరిసిన రాధికా మర్చంట్, మురిసిన అంబానీ
రిలయన్స్ అధినేత ముఖేష్ అంబానీ, నీతా అంబానీ చిన్న కుమారుడు అనంత్ అంబానీ, వ్యాపారవేత్త కుమార్తెతో రాధిక మర్చంట్ రెండో ప్రీ వెడ్డింగ్ వేడుక ఇటలీలో క్రూయిజ్ షిప్లో కనీవినీ ఎరుగని రీతిలో ఘనంగా జరిగింది. గుజరాత్లోని జాం నగర్లో ఈ ఏడాది మార్చిలో నిర్వహించిన మొదటి ప్రీ వెడ్డింగ్ వేడుకలతో పోలిస్తే, రెండో ప్రీ వెడ్డింగ్ వేడుకను మరింత ఘనంగా నిర్వహించింది అంబానీ కుటుంబం. అలాగే ఈ వేడుకలో రాధికా మర్చంట్ తన ప్రిన్స్, అనంత్ అంబానీతో రియల్ లైఫ్ సిండ్రిల్లాలా మెరిసిపోయింది. రాధిక, నీలిరంగులోని కార్సెట్ గౌనులో అందంగా కనిపించింది. దీనికి బ్లూ డైమండ్, బ్లూ సఫైర్ నెక్లెస్, చెవిపోగులు ధరించింది. అటు అనంత్ అద్భుతమైన లుక్స్తో ఆకట్టుకున్నాడు. అనంత్ బూజీ బ్లాక్ సెల్ఫ్ డిజైన్ చేసిన బ్లాక్ టక్సేడోలో అందంగా కనిపించాడు. అందంతో మెరిసిపోతున్న ప్రేయసిని చూసి అనంత్ అంబానీ, అటు పెళ్లి కళ ఉట్టిపడుతున్ నకాబోయే కోడల్ని చూసి ముఖేష అంబానీ కూడా మురిసిపోయారు. ఇదే ఈవెంట్లో పింక్ డియోర్ దుస్తులు ధరించింది రాధిక. ఈ గౌను ధర సుమారు మూడు లక్షలట. అలాగే ఈ సందర్భంగా ఆమె ధరించిన బ్యాగ్ ధర రూ. 26 లక్షలట. ఇటలీలోని పోర్టోఫినోలో జరిగిన ఈ వేడుకకు దాదాపు 800 మందికి పైగా అతిథులుతో రూ.7500 కోట్లతో ఘనంగా జరిగిందీ వేడుక. జూలై 12న లవ్బర్డ్స్ అనంత్- రాధిక పెళ్లి పీటలెక్కనున్నారు. -
అంబానీ ఇంట పెళ్లి సందడి: రెండో ప్రీ వెడ్డింగ్ బాష్ ఖర్చు ఎంతో తెలుసా?
బిలియనీర్ ముఖేష్ అంబానీ ఇంట్లో పెళ్లి సందడి, అందులోనూ ఈ తరంలో చివరి పెళ్లి. అందుకే బోలెడంత సందడి. ఇది చాలదన్నట్టు ఘనంగా నిశ్చితార్థం, అంగరంగ వైభవంగా ప్రీ వెడ్డింగ్ వేడుకలు.. ఇపుడు కనీవినీ ఎరుగని రీతిలో రెండో ప్రీ-వెడ్డింగ్ వేడుకలు షురూ అయ్యాయి. దీంతో రోజుకొక వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. తాజాగా మరో ఇంట్రస్టింగ్ న్యూస్ హాట్ టాపిక్గా నిలిచింది.ముఖేష నీతా అంబానీ తనయుడు అనంత్ అంబానీ వివాహం రాధికా మర్చంట్తో జూలై 12న ముంబైలో జరగనుంది. దీనికి ముందుగా దక్షిణ ఫ్రాన్స్లో ఉన్న విల్లాలో దేశ విదేశాలకు చెందిన 800 మంది ముఖ్య అతిథులతో ఇటలీ నుండి ఫ్రాన్స్కు వెళ్లే మార్గంలో విలాసవంతమైన క్రూయిజ్లో రెండో ప్రీ-వెడ్డింగ్ వేడుక జరుగుతోంది. జూన్ 1, 2024న ఇటలీలోని సుందరమైన పోర్టోఫినో నగరంలో ముగుస్తుంది.తాజా సమాచారం ప్రకారం అనంత్ అంబానీ-రాధిక మూడు రోజుల ప్రీ-వెడ్డింగ్లో పాపులర్ అమెరికన్ గాయని-గేయరచయిత, కేటీ పెర్రీ ప్రదర్శన ఇవ్వనుంది. ఈ రోజు సాయంత్రం(మే 31) డార్క్ హార్స్, రోర్, ఎలక్ట్రిక్, హార్లేస్ ఇన్ హవాయి పాటలతో ఈ గ్రాండ్ ఈవెంట్లో సందడి చేయనుంది. 'లా విటా ఇ అన్ వియాజియో' (జీవితం ఒక ప్రయాణం) థీమ్తో ఈ గాలా సాగుతుంది. ఇందుకు కోసం పాప్ ఐకాన్కు భారీ మొత్తంలోనే ముట్ట చెప్పారట. ఖర్చు రూ. 7500కోట్లురూ. 424 కోట్ల విలువైన ఎస్టేట్లో నిర్వహించే రెండో ప్రీ వెడ్డింగ్ బాష్ కోసం అంబానీ కుటుంబం ఏకంగా 7,500 కోట్లు రూపాయలు వెచ్చిస్తోంది. అంతేకాదు క్రూయిజ్లోని ప్రతి సూట్ స్పా, జిమ్, స్విమ్మింగ్ పూల్ మరెన్నో విలాసవంతమైన సౌకర్యాలతో ఉంటుంది. ఒక్కోదానికి ఖర్చు సుమారు రూ. 60 లక్షలు. ఐదు గంటలు పాటు జరిగే మూడో రోజు స్పెషల్ ఈవెంట్లో డీజేలు, బాణా సంచా వెలుగులతో మోత మోగనుంది.కాగా అనంత్ అంబానీ, రాధిక మర్చంట్ జూలై 12, 2024న ముంబైలోని జియో వరల్డ్ కన్వెన్షన్ సెంటర్లో అంగరంగ వైభవంగా వివాహం చేసుకోనున్నారు. అతిరథ మహారథుల సమక్షంలో మూడు రోజుల పాటు పెళ్లి సంబరాలు కొనసాగనున్నాయి. -
Anant - Radhika Cruise Party : షకీరా ఆట పాట, ఫీజు తెలిస్తే ఫ్యూజులెగిరిపోతాయ్!
రిలయన్స్ అధినేత ముఖేష్ అంబానీ నీతా అంబానీల చిన్న కుమారుడు అనంత్ అంబానీ తన ప్రేయసి రాధికా మర్చంట్ను జూలై 12, 2024న వివాహం చేసుకునేందుకు సిద్ధమవుతున్నాడు. ఈ క్రమంలోనే ఈ ఏడాది మార్చిలో గుజరాత్లోని జామ్నగర్లో స్టార్-స్టడెడ్ ప్రీ-వెడ్డింగ్ వేడుకను నిర్వహించారు. ఇపుడిక రెండోసారి ప్రీ వెడ్డింగ్ వేడుకలు అంగరంగ వైభవంగా నిర్వహించేందుకు సర్వం సిద్ధం. బిలియనీర్ స్టేటస్కి తగ్గట్టుగా ఈసారి ఇటలీలో క్రూయిజ్ షిప్లో నిర్వహిస్తుండటం విశేషం.నాలుగు రోజుల ఈవెంట్ల గురించిన వివరాలతో నిండిన రెండవ ప్రీ-వెడ్డింగ్ ఇన్విటేషన్, ప్లాన్, ఫోటోలు ఇంటర్నెట్లో హాట్ టాపిక్గా నిలిచాయి. తాజాగా మరో వార్త హల్చల్ చేస్తోంది. పాపులర్ పాప్ సింగర్, పాటల రచయిత షకీరా అనంత్ రాధిక క్రూయిజ్ ప్రీ వెడ్డింగ్ ఈవెంట్లో ప్రదర్శన ఇవ్వడానికి సిద్ధంగా ఉంది. తాజా నివేదికల ప్రకారం ఈ ఈవెంట్ కోసం రూ.10-15 కోట్లు చార్జ్ చేయనుందని తెలుస్తోంది.కాగా ఇటలీలో మే 29 నుండి జూన్ 1, 2024 వరకు అనంత్ అంబానీ - రాధిక మర్చంట్ల రెండో ప్రీ-వెడ్డింగ్ వేడుకలు జరగనున్నాయి. వెల్కం డిన్నర్, మే 30, 2024న 'రోమన్ హాలిడే' , 'లా డోల్స్ ఫార్ నియెంటె', 'టోగా పార్టీ'. ఆ తర్వాత, మే 31, 2024న ఆకాష్ అంబానీ శ్లోకా మెహతా కుమార్తె, వేద తొలి ఏడాది పుట్టినరోజు వేడుకలు జరగనున్నాయి. కొన్నిఇప్పటికే సల్మాన్ఖాన్, అలియా, రణబీర్దంపతులు, రణ్వీర్ సింగ్, క్రికెటర్ మహేంద్ర సింగ్ ధోనీ ఫ్యామిలీ ఇటలీకి పయనమైన సంగతి తెలిసిందే. సినీ ఇండస్ట్రీలో సెలబ్రిటీలతోపాటు, పలువురు ప్రముఖులు దాదాపు 800మంది పాల్గొనే అవకాశం ఉంది. అయితే జామ్నగర్ ఈవెంట్ కోసం రూ.1259 కోట్లు, కేవలం కేటరింగ్కే ఏకంగా రూ. 210 కోట్లు ఖర్చు చేసిన అంబానీ కుటుంబం ఈ సారి ఎంత వెచ్చిస్తోంది అనే చర్చ జోరుగా సాగుతోంది. -
ఆస్ట్రేలియా మాజీ ఓపెనర్ సంచలన నిర్ణయం
ఆస్ట్రేలియా మాజీ ఓపెనర్ జో బర్న్స్ సంచలన నిర్ణయం తీసుకున్నాడు. సొంతదేశాన్ని వీడి ఇటలీ జాతీయ క్రికెట్ జట్టుకు ప్రాతినిథ్యం వహించాలని నిర్ణయించుకున్నట్లు ప్రకటించాడు. ఇటలీని టీ20 వరల్డ్కప్ 2026కు అర్హత సాధించేలా చేయడమే లక్ష్యంగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించాడు. అలాగే ఈ ఏడాది తనువు చాలించిన తన సోదరుడు డొమ్నిక్ బర్న్స్కు నివాళిగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు పేర్కొన్నాడు. డొమ్నిక్ గౌరవార్ధం తన జెర్సీపై 85 నంబర్ను ధరించనున్నట్లు వెల్లడించాడు. డొమ్నిక్ తన చివరి మ్యాచ్లో ఇదే సంఖ్య గల జెర్సీని ధరించినట్లు చెప్పుకొచ్చాడు. తన తల్లి ఇటలీ పౌరసత్వం కలిగి ఉండటంతో బర్న్స్ ఆ దేశానికి ప్రాతినిథ్యం వహించేందుకు అర్హత సాధించాడు. పై పేర్కొన్న కారణాలే కాకుండా బర్న్స్ ఆస్ట్రేలియాను వీడేందుకు మరిన్ని కారణాలు కూడా ఉన్నాయి. అతనికి ఈ ఏడాది (2024-25) తన సొంత దేశవాలీ జట్టైన క్వీన్స్లాండ్ జట్టు కాంట్రాక్ట్ లభించలేదు. అలాగే బిగ్బాష్ లీగ్తోనూ బర్న్స్ కాంట్రాక్ట్ ముగిసింది. పై పేర్కొన్న కారణాలన్నిటినీ చూపుతూ బర్న్స్ ఆస్ట్రేలియాకు గుడ్ బై చెప్పాలని నిర్ణయించుకున్నట్లు ఇన్స్టా వేదికగా తన సందేశాన్ని పంపాడు. 34 ఏళ్ల బర్న్స్ 2014-2020 మధ్యలో ఆస్ట్రేలియా తరఫున 23 టెస్ట్లు, 6 వన్డేలు ఆడి 1608 పరుగులు చేశాడు. ఇందులో 4 సెంచరీలు (టెస్ట్లు), 8 హాఫ్ సెంచరీలు (7 టెస్ట్, ఒకటి వన్డే) ఉన్నాయి.ఇదిలా ఉంటే, ఇటలీ ఇప్పటివరకు ఏ ఫార్మాట్లోనూ ప్రపంచకప్కు అర్హత సాధించలేదు. ఈ దేశానికి 2026 టీ20 వరల్డ్కప్కు అర్హత సాధించే అవకాశాలు ఉన్నాయి. జూన్ 9 నుంచి జరిగే వరల్డ్కప్ రీజియనల్ క్వాలిఫయర్స్లో ఇటలీ తమ అదృష్టాన్ని పరీక్షించుకోనుంది. ఈ పోటీల్లో ఇటలీ.. ఫ్రాన్స్, ఐసిల్ ఆఫ్ మ్యాన్, లక్సంబర్గ్, టర్కీ జట్లతో పోటీపడుతుంది. -
Anant-Radhika Pre Wedding : ఇటలీకి పయనమైన సెలబ్రిటీలు, ఫోటోలు వైరల్
ఆసియా బిలియనీర్ ముఖేష్ అంబానీ, నీతా అంబానీ దంపతులు చిన్న కుమారుడు అనంత్ అంబానీ -రాధికా మర్చంట్ల పెళ్లి ముచ్చట మరోసారి వార్తల్లో నిలుస్తోంది. ఇప్పటికే ఎంగేజ్మెంట్ పూర్తి చేసుకుని, ప్రీ వెడ్డింగ్ బాష్ను ఘనంగా నిర్వహించుకున్న లవ్బర్డ్స్ త్వరలోనే పెళ్లి పీటలెక్కనున్నారు. ఛలో ఇటలీ..ఈ ఏడాది మార్చిలో జామ్నగర్లో వారి గ్రాండ్ ప్రీ-వెడ్డింగ్ వేడుకల తర్వాత, అనంత్ -రాధిక మర్చంట్ ఇటలీ నుండి ఫ్రాన్స్కు ప్రయాణించే క్రూజ్లో మూడు రోజుల వేడుకను నిర్వహించనున్నారు. కనీవినీ ఎరుగని రీతిలో అంగరంగ వైభవంగా మరో ప్రీ వెడ్డింగ్ వేడుకను నిర్వహించుకునేందుకు రడీగా ఉన్నారు. ఈ వేడుక కోసం బాలీవుడ్, క్రీడా, రాజకీయ రంగ ప్రముఖులు ఇటలీకి పయనమయ్యారు. ముఖ్యంగా ముఖేష్ అంబానీ, నీతా అంబానీతోపాటు,అనిల్ అంబానీ , కాబోయే వధువు రాధిక తండ్రితో కలిసి వెళ్లారు. ( ఇదీ చదవండి: అనంత్ - రాధిక ప్రీవెడ్డింగ్ బాష్ : 800 మందితో గ్రాండ్గా, ఎక్కడో తెలుసా?)అలాగే రాధిక-అనంత్కు మంచి స్నేహితులు బాలీవుడ్ స్టార్ కపుల్ అలియా భట్, రణబీర్ కపూర్ తన ముద్దుల తనయ రాహాలతో కలిసి బయలుదేరారు. దీనికి సంబంధించిన దృశ్యాలు నెట్టింట హల్చల్ చేస్తున్నాయి. అలాగే ప్రముఖ క్రికెటర్ మహేంద్ర సింగ్ ధోనీ భార్య సాక్షి, పాపతో కలిసి ఎయిర్ పోర్ట్లో దర్శనిచ్చారు. అంతేనా సల్మాన్ ఖాన్, రణవీర్ సింగ్ ఇంకా బ్రహ్మాస్త్ర దర్శకుడు అయాన్ ముఖర్జీ కూడా ఈ వేడుకకు హాజరు కానున్నారు. (చిన్న కోడలికి నీతా అంబానీ వెడ్డింగ్ గిఫ్ట్ : రూ.640 కోట్ల దుబాయ్ లగ్జరీ విల్లా)కాగా అనంత్-రాధిక రెండవ ప్రీ వెడ్డింగ్ బాష్ మే 28వ తేదీనుంచి 30 మధ్య దక్షిణ ఫ్రాన్స్ తీరంలో క్రూయిజ్ షిప్లో జరుగుతందని పలు నివేదికల ద్వారా తెలుస్తోంది. క్రూయిజ్ ఇటలీ నుండి బయలుదేరి, 2365 నాటికల్ మైళ్లు (4380 కిమీ) దూరం ప్రయాణించి దక్షిణ ఫ్రాన్స్లో ఉన్న వేదికకు చేరుకుంటుంది. -
ఇటలీలో అడుగెట్టిన టీవీఎస్.. విక్రయాలకు ఈ బైకులు
భారతదేశంలో అత్యంత ప్రజాదరణ పొందిన టూ వీలర్ తయారీ సంస్థ 'టీవీఎస్ మోటార్' గ్లోబల్ మార్కెట్లో తన ఉనికిని నిరంతరం విస్తరిస్తూనే ఉంది. ఇందులో భాగంగానే కంపెనీ తన కార్యకలాపాలను ఇటలీలో కూడా ప్రారంభించింది. ఇప్పటికే 80 దేశాల్లో విస్తరించిన టీవీఎస్ కంపెనీ మరిన్ని దేశాలకు విస్తరించడమే లక్ష్యంగా ముందుకు సాగుతోంది.టీవీఎస్ మోటార్ ఇటాలియా ద్వారా ఇటలీలో తన కార్యకలాపాలను విస్తరిస్తుంది. దీనికి జియోవన్నీ నోటార్బార్టోలో డి ఫర్నారీ నేతృత్వం వహిస్తారు. దీని ద్వారా టీవీఎస్ అపాచీ RTR, అపాచీ RTR 310, టీవీఎస్ రైడర్, టీవీఎస్ NTorq, జుపీటర్ 125 వంటి మోడల్స్ విక్రయించాలని కంపెనీ యోచిస్తోంది.టీవీఎస్ కంపెనీ ఇటలీ మార్కెట్లో ఐక్యూబ్ ఎలక్ట్రిక్ స్కూటర్ కూడా విక్రయించే అవకాశం ఉంది. టీవీఎస్ మోటార్ కంపెనీ హెడ్ గ్రూప్ స్ట్రాటజీ ప్రెసిడెంట్, శరద్ మోహన్ మిశ్రా, కంపెనీ ఇటాలియన్ లాంచ్పై మాట్లాడుతూ.. మా వాహనాలకు ఇటాలియన్ వినియోగదారులను పరిచయం చేయడానికి చాలా ఆసక్తిగా ఉన్నాము. ఇక్కడ కూడా కంపెనీ ఉత్తమ ఆదరణ పొందుతుందని భావిస్తున్నామని అన్నారు. -
పిజ్జా లవ్ : ఇద్దరమ్మాయిలు చేసిన పని తెలిస్తే షాక్ అవుతారు
పిజ్జా అంటే చెప్పలేనంత ప్రేమ ఇద్దరు స్నేహితులు చేసిన తెలిస్తే షాక్ అవుతారు. ఒకరోజు సెలవుపెట్టి ఏకంగా విమానంలో వెళ్లి మరీ పిజ్జా ఆరగించి వచ్చారు. దీనికి ఎంత ఖర్చయిందో తెలుసా? మాంచెస్టర్ ఈవెనింగ్ న్యూస్ ప్రకారం, యూకేకుచెందిన మోర్గాన్ బోల్డ్, ఆమె స్నేహితురాలు జెస్ వుడర్ ఇద్దరూ "ఎక్స్ట్రీమ్ డే ట్రిప్"ని ప్లాన్ చేసారు. అంటే ఒక్క రోజులోనే తిరిగి ఆఫీసుకు వచ్చేసేలా అన్నమాట. దీని ప్రకారం ఇద్దరు స్నేహితులు లివర్పూల్ నుండి పిసాకు (ఇటలీలో) మాంచెస్టర్ విమానాశ్రయంలో విమానంలో వెళ్లారు. డే రిటర్న్ ఫ్లైట్లను బుక్ చేసుకున్నారు. ఏప్రిల్ 24న ఉదయం 6 గంటలకు బయలుదేరి రాత్రి 11 గంటలకు ఇంటికి చేరుకోవడం విశేషం. ఈ సుడిగాలి పర్యటనలో షాపింగ్ చేసుకొని, తమకిష్టమైన పిజ్జాను ఆస్వాదించారు.బోల్డ్, వుడర్ లీనింగ్ టవర్ ఆఫ్ పిసా ముందు ఫోటోలు తీసుకున్నారు. గూగుల్ మ్యాప్లో మంచి పిజ్జాతో రెస్టారెంట్లకు వెతుక్కున్నారు. విమానచార్జీలు, విమానాశ్రయం పార్కింగ్, ఫుడ్ కలిపి మొత్తం పర్యటనకు 170 పౌండ్లు (రూ. 17,715) వెచ్చించామని తెలిపారు. లివర్పూల్నుంచి లండన్కి ఇంతకంటే ఎక్కువ ఖర్చు అవుతుంది. పైగా అక్కడ పిజ్జా ఇతర డ్రింక్స్ ఖరీదు చాలా ఎక్కువ. దాదాపు అదే డబ్బుతో వేరే దేశం వెళలి వచ్చామంటూ చెప్పుకొచ్చారు. పిసా టవర్ను చూస్తూ పిజ్జా తినడం అద్భుతం. ఇక్కడఆహార ధరలు రీజనబుల్గానే ఉన్నాయంటూ వెల్లడించారు. వచ్చిన విమానంలోనే తిరిగి ఇంటికి వెళ్లడం ఇంకా బావుందంటూ తెగ సంబరపడిపోయారు. -
ఇరాన్పై ఇజ్రాయెల్ దాడులు నిజమే: ఇటలీ
క్యాప్రి ఐలాండ్: పశ్చిమాసియాలో రోజురోజుకు ఉద్రిక్తతలు పెరుగుతున్నాయి. ఇరాన్లో శుక్రవారం(ఏప్రిల్ 19) సంభవించిన పేలుళ్లు ఇజ్రాయెల్ పనేనని అమెరికా చెబుతోంది. ఈ దాడులకు సంబంధించి ఇజ్రాయెల్ నుంచి తమకు చివరి నిమిషంలో సమాచారం అందిందని జీ7 దేశాలకు అమెరికా తెలిపింది. ఈ విషయాన్ని ఇటలీలోని క్యాప్రి ఐలాండ్లో జరుగుతున్న జీ7 మీటింగ్లో ఆ దేశ విదేశీ వ్యవహారాల మంత్రి ఆంటోనియో టజానీ తెలిపారు. ఇరాన్లోని ఇస్ఫహాన్ నగరంలోని న్యూక్లియర్ స్థావరాల సమీపంలో పలు డ్రోన్లను కూల్చివేసినట్లు ఇరాన్ తెలిపింది. డ్రోన్ల కూల్చివేత కారణంగానే పేలుళ్ల శబ్దాలు వెలువడ్డాయని వెల్లడించింది. ఇటు ఇరాన్పై దాడుల సమయంలోనే అటు సిరియాపైనా ఇజ్రాయెల్ వైమానిక దాడులు చేసింది. కాగా, ఇటీవల ఇజ్రాయెల్పై ఇరాన్ డ్రోన్లు, మిసైళ్లతో దాడులు చేసింది. అయితే ఈ డ్రోన్లు, మిసైళ్లను ఇజ్రాయెల్ కూల్చివేసింది. ఇరాన్ దాడుల వల్లే ఇజ్రాయెల్ ప్రతిదాడులకు దిగింది. ఇదీ చదవండి.. ఫ్రాన్స్: ఇరాన్ కాన్సులేట్లో మానవ బాంబు కలకలం -
20 ఏళ్లలో ఏ దేశం ఎంత వృద్ధి చెందిందో తెలుసా.. (ఫొటోలు)
-
Kalki Shooting Photos: కల్కి సెట్స్లో ప్రభాస్.. హీరోయిన్తో సెల్ఫీ వైరల్ (ఫోటోలు)
-
ఇటలీలో ప్రభాస్ కొత్త ఇల్లు..
-
ఆ చిల్లర విలువ ఎంత అంటే?
ప్రతి ఏటా లక్షలాదిమంది పర్యాటకులు ఇటలీ రాజధాని రోమ్ను సందర్శిస్తుంటారు. రోమ్ అందాలను చూసినవారు మళ్లీ ఇక్కడికి రావాలని అనుకుంటారు. రోమ్ని సందర్శించే పర్యాటకులు ట్రెవీ ఫౌంటెన్లో ఒక నాణెం లేదా రెండు నాణేలు విసురుతుంటారు. ఈ విధంగా ప్రతి ఏటా సుమారు ఒక మిలియన్ యూరోలు (రూ.9 కోట్లు) ఈ ఫౌంటెన్లో జమ అవుతున్నాయట. ఒక అంచనా ప్రకారం పర్యాటకులు ప్రతిరోజూ సుమారు 3000 యూరో నాణేలను ఈ ఫౌంటెన్లోకి విసిరివేస్తున్నారు. అంటే ప్రతిరోజూ రూ. 2,50,000 అంటే సంవత్సరానికి రూ.9 కోట్లు ఈ ఫౌంటెన్లోకి విసురుతున్నారన్న మాట. ట్రెవీ ఫౌంటెన్లోకి విసిరిన నాణేలను బయటకు తీసి, స్థానిక పేదలు, నిరాశ్రయులైన ప్రజలకు ఆహారం అందించడానికి ఉపయోగిస్తారు. ట్రెవీ ఫౌంటెన్ రోమ్లోని ట్రెవీ నగరంలో ఉంది. ఈ ఫౌంటెన్ 85 అడుగుల ఎత్తు, 161 అడుగుల వెడల్పు కలిగివుంది. ఇది ప్రపంచంలోని అత్యంత అందమైన ఫౌంటెన్లలో ఒకటి. దీనికి ఇటాలియన్ ఆర్కిటెక్ట్ నికోలా సాల్వి రూపమిచ్చారు. పియట్రో బ్రాచి దీనిని నిర్మించారు. దీని నిర్మాణ పనులు 1732లో ప్రారంభమై 1762లో పూర్తయ్యాయి. రోమ్కు వచ్చే దాదాపు ప్రతి పర్యాటకుడు ట్రెవీ ఫౌంటెన్లో నాణెం విసురుతాడు. రోమ్ను మరోమారు సందర్శించాలనుకునే పర్యాటకులు ఈ ఫౌంటెన్లో నాణేలు విసురుతారట. Tourists throw over €1 million into Italy's Trevi Fountain each year. pic.twitter.com/GVAIfciJSg — Historic Vids (@historyinmemes) March 24, 2024 కాగా ఈ పౌంటెన్లో నాణేలు విసిరేందుకు ప్రత్యేక పద్ధతిని అవలంబిస్తారు. ప్రపంచ ప్రసిద్ధి చెందిన ఈ ఫౌంటెన్ దగ్గర సినిమా షూటింగ్లు, ఫ్యాషన్ షోలు తరచూ నిర్వహిస్తుంటారు. 1954లో విడుదలైన ‘త్రీ కాయిన్స్ ఇన్ ది ఫౌంటెన్’ అనే హాలీవుడ్ చిత్రం ఈ ఫౌంటెన్ ఇతివృత్తం ఆధారంగా రూపొందింది. ఈ సినిమా విడుదలైన తర్వాత ఈ ఫౌంటెన్ మరింత ఫేమస్గా మారింది. . -
Meloni: డీప్ఫేక్ వీడియోలపై దావా వేసిన ఇటలీ ప్రధాని
రోమ్: ఇటలీ ప్రధాని జార్జియా మెలోని డీప్ఫేక్ కంటెంట్కు వ్యతిరేకంగా ఉద్యమం మొదలుపెట్టారు. స్వయంగా తానే బాధితురాలినంటూ మీడియా ముందుకు వచ్చారామె. అంతేకాదు.. ఆ వీడియోలను అప్లోడ్ చేసిన వ్యక్తులపై లక్ష యూరోలకు పరువు నష్టం దావా వేశారు. ఇటలీ ప్రధాని జార్జియా మెలోని పేరిట వీడియోలు అశ్లీల సైట్లలో అప్లోడ్ అయ్యాయి. ఓ పోర్న్స్టార్ ముఖానికి మెలోనీ ముఖాన్ని డీప్ఫేక్ టెక్నాలజీతో మార్ఫింగ్ చేసి ఆ వీడియోలను అప్లోడ్ చేశారు ఇద్దరు. ఆ వీడియోలను అమెరికాలో గత కొన్ని నెలలుగా కొన్ని లక్షల మంది వీక్షించారు. ఈ విషయం తన దృష్టికి రావడంతో ఆమె సత్వరమే స్పందించారు. ఆ ఇద్దరిపై లక్ష యూరోల(మన కరెన్సీలో 90 లక్షల రూపాయల దాకా) పరువు నష్టం దావా వేశారామె. ఈ కేసుకు సంబంధించి విచారణ నిమిత్తం జులై 2వ తేదీన ఆమె కోర్టుకు హాజరు కానున్నారు. ఇక.. ప్రధాని లాంటి ఉన్నత పదవిలో ఉన్న తానే డీప్ఫేక్కు వ్యతిరేకంగా ముందుకు వచ్చానని, బాధితులు ముందుకు వచ్చి ధైర్యంగా పోరాడాలని ఆమె పిలుపు ఇచ్చారు. ఇక ఈ కేసులో నిందితుల నుంచి తీసుకునే పరిహారాన్ని హింసకు గురైన మహిళలకు విరాళంగా మెలోనీ ఇస్తారని ప్రధాని లీగల్ టీం ప్రకటించింది. నిందితులను తండ్రీ కొడుకులుగా(40, 72 ఏళ్లు) గుర్తించిన దర్యాప్తు అధికారులు.. స్మార్ట్ ఫోన్ ద్వారా ఆ వీడియోలను అప్లోడ్ చేసినట్లు నిర్ధారించారు. అయితే.. మెలోనీ ప్రధాని కాకముందే 2022లో ఆ వీడియోలు అప్లోడ్ కావడం గమనార్హం. ఇదిలా ఉంటే.. ఇటలీ చట్టాల ప్రకారం ఇలాంటి పరువు నష్టం దావాలు తీవ్రంగా నేరాలుగా పరిగణించబడ్తాయి. బాధితులకు పరిహారం ఇప్పించడంతో పాటు నిందితులకు జైలు శిక్ష విధిస్తారు కూడా. సంబంధిత వార్త: ఇంటర్నెట్ నిండా ఫేక్ ఫొటోలు, అశ్లీల వీడియోలు! -
‘చాలా భయంకరం, ఇలా మీరు చేయకండి’: ఇటలీలో కేరళ వైద్యుడి చేదు అనుభవం
కేరళకు చెందిన జంటకు భయంకరమైన అనుభవం ఎదురైంది. కేరళకు చెందిన వైద్యుడికి చెందిన ఇటలీలో పాస్పోర్ట్లు, క్రెడిట్, డెబిట్ కార్డ్లు , కొంత నగదున్న తన వాలెట్ను జేబు దొంగలు కొట్టేశారు. దీంతో దేశం కాని దేశంలో ఇబ్బందులు పడ్డారు. చివరికి కాంగ్రెస్ ఎంజీ శశిథరూర్ జోక్యంతో అత్యవరసర పాస్పోర్ట్ల జారీలో భారత కాన్సులేట్ సహాయం చేసింది. దీంతో వారు ఊపిరి పీల్చుకున్నారు. ఇంతకీ అసలు ఏం జరిగిందంటే..? ఈ ఘటన మార్చి 5న ఫ్లోరెన్స్కు రైలులో వెళ్లేందుకు ఇటలీలోని మిలన్ సెంట్రల్ రైల్వే స్టేషన్లో ఈ ఘటన జరిగింది. కేరళకు చెందిన డయాబెటిక్ రీసెర్చ్ చేస్తున్న జోతిదేవ్ కేశవదేవ్, అతని భార్య సునీతతో ఇటలీలోని ఫ్లోరెన్స్లో తమ పరిశోధనా పత్రాన్ని సమర్పించడానికి వెళ్లారు. ఫ్లోరెన్స్కు రైలులో వెళ్లేందుకు మిలన్ సెంట్రల్ రైల్వే స్టేషన్కు వెళ్లారు. రైలు కొద్దిగా ఆలస్యమైంది. ఇంతలో రైలు రావడంతో లగేజీతో ప్లాట్ఫారమ్పైకి పరుగెత్తుతున్న సమయంలో ఇదే అదునుగా భావించిన కేటుగాడు (ఆఫ్రికన్-అమెరికన్) వీరి బ్యాగును కొట్టేశాడు. 10 నిమిషాల తర్వాత సునీత తన హ్యాండ్బ్యాగ్ను తెరిచి చూసేసరికి పాస్పోర్ట్లు, క్రెడిట్, డెబిట్ కార్డ్లు నగదుతో ఉన్న పర్సు పోయిందని గ్రహించారు. దీంతో షాక్ తిన్న దంపతులు స్థానిక పోలీసులను ఆశ్రయించారు. ఫిర్యాదు నమోదు తరువాత భారత కాన్సులేట్ను సంప్రదించమని అక్కడి పోలీసులు సూచించారు. దీంతో వాళ్లు తమ ఫ్యామిలీ ఫ్రెండ్, కాంగ్రెస్ ఎంపీ శశి థరూర్ని సంప్రదించారు. ఆయన వేగంగా స్పందించి, ఇటలీలోని భారత కాన్సులేట్కు సమాచారం అందించారు. ఫలితంగా ఇటలీలోని భారత కాన్సులేట్ జనరల్ అతుల్ చవాన్ జోతిదేవ్ దంపతులకు ధైర్యం చెప్పి, అండగా నిలిచి వెంటనే ఇద్దరికీ అత్యవసర పాస్పోర్ట్ను ఏర్పాటు చేశారు. దాదాపు గంటలోపే తమకు రెండు అత్యవసర పాస్పోర్ట్లను అందించారు. దేశం కాని దేశంలో పాస్పోర్ట్, వాలెట్ పోగొట్టుకోవడం ఎంత భయంకరమైందో వివరిస్తూ జోతిదేవ్ సోషల్ మీడియాలో ఒక పోస్ట్ పెట్టారు. అంతేకాదు విదేశాలకు వెళ్లినపుడు, డబ్బులు, ముఖ్యంగా పాస్పోర్ట్ పట్ల చాలా జాగ్రత్తగా ఉండాలని సూచించారు. అజాగ్రత్తగా ఉండటం వల్ల తమకెదురైన ఈ అనుభవం నుంచి తోటి పర్యాటకులు నేర్చుకోవలసిన పాఠం అంటూ చెప్పుకొచ్చారు. మరోవైపు ఈ వ్యవహారం సుఖాంతం కావడంపై శశి థరూర్ ఆనందం వ్యక్తం చేశారు. Glad it all worked out in the end @jothydev ! So pleased our consulate did what was needed so well. @MEAIndia https://t.co/2pTt4DFd4u — Shashi Tharoor (@ShashiTharoor) March 11, 2024 -
కడుపుతో ఉన్నానంటూ ఓ మహిళ..ఏకంగా రూ. 98 లక్షలు..!
కొందరూ ప్రభుత్వం ఇచ్చే పథకాల ప్రయోజనాలు పొందేందుకు ఎంతలా కక్కుర్తిపడుతుంటారో తెలిసిందే. అందుకోసం ఎంతకైనా తెగిస్తారు. ఎలాంటి పనులైన చేస్తారు. కానీ మరీ ఇలా గర్భాల పేరుతో లక్షల్లో డబ్బు కొట్టేయడం చూసి ఉండరు. పోనీ ఒకటో రెండో ప్రశూతి ప్రయోజనాలు కాదు. ఏకంగా ఎన్నిసార్లు ఇలా బూటకపు గర్భాల గురించి అబద్ధాలు చెప్పిందో వింటే కంగుతింటారు. అలాగే ప్రశూతి ప్రయోజనాలకు సంబంధించిన డబ్బు ఎంత మేర కొట్టేసిందో విన్నా వామ్మో! అంటారు. ఏం జరిగిందంటే.. ఇటలీలోని రోమ్కి చెందిన 50 ఏళ్ల బార్బరా నకిలీ గర్భాల పేరుతో దాదాపు రూ. 98 లక్షల దాక ప్రసూతి ప్రయోజనాలను కొట్టేసింది. నిజానికి ఆమె గర్భం దాల్చిన సమయంలో కలిగిన పిల్లల గురించి ఏ ఆస్పత్రిలో నమోదు కాలేదు, అధికారులెవ్వరూ కూడా ఆమె పిల్లలను చూడలేదు కూడా. ఆమె రోమ్లో ఉన్న క్లినిక్ నుంచి పిల్లల జనన ధృవీకరణ పత్రాను దొంగలించి అచ్చం అదే మాదిరిగా తన పేరుతో సర్టిఫికేట్లను సృష్టించి ప్రభుత్వ ప్రయోజనాలు పొందేది. ఇలా 24 ఏళ్ల కాలంలో 12 గర్భస్రావాలు జరిగినట్లు, ఐదు మంది పిల్లలు కలిగినట్లు పేర్కొంది. మొత్తంగా 17 బూటకపు గర్భాలతో అధికారులను మోసం చేసింది. అంతేగాక తాజాగా ఇటీవల గత డిసెంబర్లో తాను మరో బిడ్డను ప్రసవించినట్లు పేర్కొంది. దీంతో అనుమానం వచ్చి ఆ 50 ఏళ్ల మహిళ గురించి గత తొమ్మిది నెలలుగా గట్టి నిఘా పెట్టారు. ఆ విచారణలో ఆమె గర్భం అంతా ఓ బూటకమని తేలింది. బేబీ బంప్లా కనిపించేందుకు దిండ్లను ఉపయోగించనట్లు వెల్లడయ్యింది. పైగా పుట్టబోయే బిడ్డను మోస్తున్నట్లుగా చాలా బరువు మోస్తున్నట్లు ఫోజులిచ్చేదని అధికారుల చెబుతున్నారు. ఆఖరికి ఆమె భర్త డేవిడ్ పిజ్జినాటోని కూడా ఈ విషయమై ప్రశ్నించగా..తన భార్య గర్భవతి కాదని విచారణలో ఒప్పుకున్నాడు. దీంతో పోలీసుల సదరు మహిళ లోయెల్, ఆమె భర్తపై కేసు నమోదు చేసి, కోర్టులో హాజరుపర్చారు. నిందితులిద్దరు ఇటాలియన్ హెల్త్ అసిస్టెన్స్నే మోసం చేశారంటూ మండిపడింది. ప్రజా సంస్థను మోసం చేయడమే గాదు దానికి హాని తలపెట్టారని చివాట్లు పెట్టింది. ప్రజా ప్రయోజనంలో భాగంగా సదరు రాష్ట్రం మహిళలకు అందించే ప్రశూతి ప్రయోజనాలను దుర్వినియో పరిచారని ఫైర్ అయ్యింది. అలాగే తనకు ఐదుగురు పిల్లలు ఉన్నారని పలుసార్లు గర్భస్రావాలు జరిగినట్లు తప్పుడు పత్రాల సమర్పించడమే గాక దాన్నే కొనసాగించే య్నతం చేయడం మరింత నేరం అని స్పష్టం చేసింది. అందుకుగానూ లోయెల్కి ఒక ఏడాది ఆరు నెలల జైలు శిక్ష విధిస్తున్నట్లు కోర్టు పేర్కొంది. అలాగే ఈ నేరంలో సహకరించిన ఆమె భర్తకు కూడా శిక్ష విధించింది. (చదవండి: 'నారీ శక్తి'..'నారీ శక్తి' అంటారుగా!.. చేతల్లో చూపండి!) -
అతిథుల డ్యాన్స్.. కూలిపోయిన రిసెప్షన్ వేదిక
వధువరులు, బంధువులు ఆనందంతో ఎంజాయ్ చేసే వివాహ రిసెప్షన్లో ఒక్కసారిగా విషాదం చోటు చేసుకుంది. వేడుకలో భాగంగా డ్యాన్స్ చేసే క్రమంలో అకస్మాత్తుగా వెడ్డింగ్ హాల్ ఫ్లోర్ కూలిపోయింది. ఈ ఘటన ఇటలీలో చోటు చేసుకుంది. వధువరులతో పాటు సుమారు 30 మంది అతిథులు 25 అడుగుల ఎత్తులో ఉన్న ఫ్లోర్ను నుంచి కిందకు పడిపోయారు. దీంతో గాయపడిన వారిని స్థానిక అస్పత్రికి తరలించారు. వివరాల్లోకి వెళితే... వరుడు పాలో ముగ్నైనీ, వధువు వలేరియా యబరా తమ వివాహాన్ని ఇటలీలోని పిస్టోయాలో ఉన్న ఓ వెడ్డింగ్ హాల్లో ఏర్పాటు చేశారు. హాల్లోని వేదికపై నూతన వధూవరులతో పాటు సుమారు 30 మంది అతిథులు ఉన్నారు. ఆనందంతో వారంతా డ్యాన్స్ చేయటం మొదలు పెట్టారు. దీంతో ఒక్కసారిగా వేదిక కూలిపోయింది. అందరూ వేదిక చెక్కల మధ్య ఇరుక్కుపోయారు. సమాచారం అందుకున్న పోలీసులు.. ఘటనాస్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. శిథిలాలను తొలగించి, గాయపడ్డ వారిని ఆస్పత్రికి తరలించారు. ఆరుగురి పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలిపారు. గాయపడ్డవారంతా పిస్టోయాలోని శాన్ జకోపో ఆస్పత్రిలో చికిత్స పొందతున్నారని వెల్లడించారు. ఈ ఘటనపై పెళ్లి కొడుకు ముగ్నైని మాట్లాడుతూ.. ‘రిసెప్షన్ వేదిక కుప్పకూలే ముందు అంతా సంతోషంగా ఉన్నాం. అతిథులు డాన్స్ చేసేసరికి ఒక్కసారిగా వేదిక కూలిపోయింది. నేను కూడా వాళ్లతోపాటు పడిపోయాను. నాపై చాలా మంది పడ్డారు. వెంటనే నా భార్య వలేరియా ఎక్కడ ఉందో వెతికాను. ఆమె కనిపించకపోయే సరికి తీవ్ర ఆందోళనకు గురయ్యాను. చివరకు ఇద్దరం కలిసి ఆస్పత్రిలో చేరాం.. పక్కపక్క బెడ్లో ఉండి చికిత్స పొందుతున్నాం’ అని ముగ్నైని తెలిపారు. చదవండి: Pakistan: పార్టీ జెండాపై గొడవ.. కన్న కొడుకును హతమార్చిన తండ్రి -
ఓ ఆలోచన.. ఆరేళ్ల కష్టం.. ఫొటోలో వెలకట్టలేని అద్భుతం
ఫొటో అంటే అందమైన జ్ఞాపకం. మళ్లీ మళ్లీ చూడాలనిపించే ఓ జీవితం. ఇప్పుడంటే మితిమీరిన ఫొటోల వల్ల దీనికి విలువ లేకుండా పోయింది గానీ ఒకప్పుడు ఫొటో అంటే అపురూపం. ఆల్బమ్స్లో జాగ్రత్తగా దాచుకునే వెలకట్టలేని అద్భుతం. ఫొటో తీయాలంటే కెమెరా ఉంటే చాలని చాలామంది అనుకుంటారు. కానీ దాని వెనక బోలెడంత తపన ఉండాలనేది ఇప్పటి జనరేషన్కి ఏ మాత్రం తెలియని మాట. (ఇదీ చదవండి: అతిపెద్ద గొయ్యి.. ఇక్కడ తవ్వే కొద్ది వజ్రాలు!) ఇప్పుడు పిల్లాడి దగ్గరి నుంచి పెద్దోళ్ల వరకు అందరూ స్మార్ట్ఫోన్స్ వాడేస్తున్నారు. సెకనుకి పదుల ఫొటోలు తీసి పడేస్తున్నారు. కానీ ఓ ఫొటోగ్రాఫర్.. ఒక్క ఫొటో కోసం ఏకంగా ఆరేళ్లు ఎదురుచూశాడు. నిద్రలేని రాత్రులు గడిపాడు. 2017లో ఓ ఆలోచన పురుడు పోసుకుంటే.. అతడు ఇన్నేళ్ల కష్టానికి తగ్గ ఫలితం 2023 డిసెంబరులో కనిపించింది. తన కెమెరా కంటితో ఓ అద్భుతాన్ని ఆవిష్కరించాడు. ఒక్క ఫొటోలో వంద సినిమాలకు సరిపడా సంతృప్తి పొందుపరిచాడు. ఇటాలియన్ ఫొటోగ్రాఫర్ వలెరియో మినాటో.. ఇటలీలోని టురిన్ అనే ఊరిలో మాన్విసో కొండ.. దాని ముందు చర్చి.. వెనక చంద్రుడు.. ఒక్కటిగా వచ్చే ఫొటో తీశాడు. ఈ ఛాయాచిత్రంలో ముందు చర్చి దాని వెనక ఓ పెద్ద పర్వతం, ఆ వెనక పున్నమి చంద్రుడుని బంధించాడు. అయితే ఇలా ప్రతి డిసెంబరులో మాత్రమే వస్తుంది. 2017 నుంచి ఇలాంటి ఫొటో తీద్దామని ప్రయత్నిస్తుంటే.. వాతావరణం, వెలుతురు సమస్యల ఇతడికి సవాలు విసిరాయి. కానీ గతేడాది డిసెంబరు 20న మాత్రం తను అనుకున్నది సాధించాడు. ప్రపంచం మెచ్చే ఓ అద్భుతాన్ని ఆవిష్కరించాడు. (ఇదీ చదవండి: రాయల్ కరీబియన్ ‘పర్ల్’.. స్పెషల్ ఏంటంటే?) View this post on Instagram A post shared by Valerio Minato (@valeriominato) -
పాలస్తీనాకు మద్దతుగా ఇటలీలో నిరసన
ఇటలీలో నిర్వహిస్తున్న అంతర్జాతీయ అభరణాల ఎగ్జిబిషన్లో పాల్గొన్న ఇజ్రాయెల్ ఎగ్జిబిటర్లకు నిరసన సెగ తగిలింది. ఇజ్రాయెల్ వ్యతిరేక వాదులు పెద్ద ఎత్తున ర్యాలీ చేస్తూ నిరసన వ్యక్తం చేశారు. ఇటలీలోని విసెంజాలో నిరసనకారులు పోలీసులతో ఘర్షణ దిగారు. స్మోక్ బాంబులు అంటించి గందరగోళం సృష్టించారు. పోలీసులు నిరసనకారులపై వాటర్ క్యానన్లు ప్రయోగించారు. ‘పాలస్తీనాను వదిలేయండి.. గాజాపై బాంబుల దాడి ఆపేయండి’ అని నిరసనకారులు పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. 40 దేశాల నుంచి సుమారు1300 మంది ఎగ్జిబీటర్లు విసెంజాలో జరుగుతున్న అభరణాల ప్రదర్శన వచ్చారని ఎగ్జిబిషన్ నిర్వాకులు తెలిపారు. నిరసన కూడా ఎగ్జిబిషన్కు చాలా దూరంలో జరిగిందని.. నిరసన ప్రభావం ఎగ్జిబిషన్పై పడలేదని అన్నారు. ఎగ్జిబిషన్లో ఇజ్రాయెల్ దేశానికి చెందిన ఎగ్జిబిటర్లు ఉన్నారా అన్న విషయంపై స్పష్టతను ఇవ్వలేదు. 🚨 ITALY TODAY: Pro-Hamas Protestors & Police Clash🚨 ⚠️ WATCH: Don’t miss the ending! Violence erupts at an anti-Israel protest during Italy’s jewelry fair. Pro-Hamas demonstrators face a harsh reality check in the streets. 👍 Like and share if Italy’s approach inspires you… pic.twitter.com/jdxP4iS2HB — Shirion Collective (@ShirionOrg) January 20, 2024 ఈ నిరసనలను విసెంజా మేయర్ గియాకోమో పోస్సామై తీవ్రంగా ఖండించారు. హింస చెలరేగే విధంగా నిరసన తెలపటాన్ని పాలస్తీనాకు మద్దతు ఇచ్చినట్లుగా సమర్థించలేమన్నారు. శాంతి, కాల్పుల విరమణ కోసం నిరసనల ద్వారా హింసను ప్రేరేపించటం సరి కాదన్నారు. ఇజ్రాయెల్పై హమాస్ మిలిటెంట్లు అక్టోబర్ 7న చేసిన మెరుపుదాడుల్లో 1140 మంది ఇజ్రాయెల్ పౌరులు మృతి చెందారు. ఇంకా 132 మంది ఇజ్రాయెల్ పౌరులు హమాస్ చేతిలో బంధీలుగా ఉన్నారు. అక్టోబర్ 7 అనంతరం గాజాపై ఇజ్రాయెల్ సైన్యం బీకరంగా దాడుల ప్రారంభించింది. ఇప్పటికీ కొనసాగుతున్న ఇజ్రాయెల్ దాడుల్లో 24,973 మంది పాలస్తీనియా ప్రజలు మృత్యువాత పడ్డారు. చదవండి: Moon Sniper: జపాన్ ల్యాండరుకు శ్రద్ధాంజలి -
ఇటలీలో భారతీయ విద్యార్థి మృతి
రాంచీ: ఇటలీలో భారతీయ విద్యార్థి మృతి చెందాడు. జార్ఖండ్లోని పశ్చిమ సింగ్భమ్ జిల్లాకు చెందిన రామ్ రౌత్ మరణించాడని అధికారులు తెలిపారు. నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేయడానికి రౌత్ తల్లిదండ్రులు అతనికి ఫోన్ చేయడంతో ఈ ఘటన వెలుగులోకి వచ్చింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. రౌత్ ఎంబీఏ చదివేందుకు ఇటలీ వెళ్లాడు. కాల్ లిఫ్ట్ చేయకపోవడంతో రౌత్ తల్లిదండ్రులు అతని వసతి గృహ యజమానిని సంప్రదించారు. విద్యార్థి మరొక ఇంటి వాష్రూమ్లో శవమై కనిపించాడని గుర్తించారు. అతని మృతదేహాన్ని భారతదేశానికి తీసుకురావడానికి జార్ఖండ్లోని సీనియర్ ప్రభుత్వ అధికారులు, ప్రజా ప్రతినిధులను రౌత్ కుటుంబం సంప్రదించింది. ఈ సంఘటనపై వెస్ట్ సింగ్భమ్ డిప్యూటీ కమిషనర్ అనన్య మిట్టల్ మాట్లాడుతూ.. రామ్ రౌత్ మరణం గురించి తమకు సమాచారం అందిందని తెలిపారు. అవసరమైన చర్యల కోసం హోం శాఖ, రాష్ట్ర మైగ్రేషన్ విభాగానికి తెలియజేసినట్లు చెప్పారు. ఈ కేసులో అన్ని పరిణామాలను తాను పర్యవేక్షిస్తున్నానని, బాధిత కుటుంబంతో కూడా టచ్లో ఉన్నానని మిట్టల్ తెలిపారు. ఇదీ చదవండి: ఫ్లోరిడాలో టోర్నడో బీభత్సం -
ఇస్లాంపై ఇటలీ ప్రధాని వ్యాఖ్యలు.. తీవ్ర దుమారం
ఇటలీ ప్రధానమంత్రి జార్జియా మెలోనీ ఇస్లాం మతంపై చేసిన వ్యాఖ్యలతో దుమారం రేగింది. ఇస్లాం సంస్కృతి, యూరోపిన్ నాగరికతలోని విలువలు.. హక్కులకు చాలా తేడాలు ఉన్నాయి. అందుకే యూరప్లో ఇస్లాంకు చోటు ఉండబోదని అభిప్రాయపడ్డారామె. ఈ సందర్భంలో సౌదీ అరేబియాను, షరియా చట్టాల కఠినతత్వాన్ని ఆమె తప్పుబట్టారు. ఇస్లాం సంస్కృతికి, మా యూరోపియన్ నాగరికతకు చాలా తేడాలున్నాయ్. సౌదీ అరేబియా.. ఇటలీలో పలు చోట్ల ఇస్లామిక్ సెంటర్లకు నిధులు అందిస్తున్నాయి. అది తప్పు. ఆ విషయంలో కూడా నాకు సదాభిప్రాయం లేదు అని అన్నారామె. ఈ సందర్భంగా.. సౌదీ అరేబియాలో పాటిస్తున్న కఠినమైన షరియా చట్టాలను ఆమె తప్పుబట్టారు. 🚨Watch: #GiorgiaMeloni: "I believe... there is a problem of compatibility between Islamic culture and the values and rights of our civilization... Will not allow Sharia law to be implemented in italy.... values of our civilization are different! pic.twitter.com/VGWNix7936 — Geopolitical Kid (@Geopoliticalkid) December 18, 2023 షరియా చట్టాల్లో మతభ్రష్టత్వము, స్వలింగ సంపర్కం వంటి విధానాలు తీవ్రమైన నేరాలని తెలిపారు. షరియా అంటే వ్యభిచారానికి కఠిన శిక్ష విధించడం, స్వలింగ సంపర్కాన్ని నేరంగా భావించడమని తెలిపారు. ఈ విధానాలను ఎక్కడైనా అమలుచేయాలని తెలిపారు. యూరప్లోని తమ నాగరికత విలువలకు.. ఇస్లాం విధానాల మధ్య చాలా తేడాలు ఉన్నాయని.. అలా సారూప్యత సమస్య తలెత్తుతోందని అన్నారు. ఈ కార్యక్రమంలో బ్రిటన్ ప్రధాని రిషి సునాక్, బిలియనీర్ ఎలన్ మ్కాస్లు కూడా పాల్గొన్నారు. చదవండి: Mexico: నేరస్తుల చేతికి ప్రభుత్వ డేటా? మెక్సికోలో ఏం జరుగుతోంది? -
ప్రపంచంలోని 10 అత్యంత ప్రసిద్ధ చర్చిలు (ఫొటోలు)
-
#Virushka: అందుకే విరాట్ కోహ్లి పేరును రాహుల్గా మార్చి మరీ!
సరిగ్గా ఆరేళ్ల క్రితం.. ఇదే రోజున.. టీమిండియా స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లి- బాలీవుడ్ హీరోయిన్ అనుష్క శర్మతో కలిసి వైవాహిక బంధంలో అడుగుపెట్టాడు. తమ ప్రేమ బంధాన్ని పెళ్లి పీటలు ఎక్కించి చిరకాల ప్రేయసితో కలిసి ఏడడుగులు నడిచాడు. ఇటలీలోని టస్కనీ వేదికగా ‘విరుష్క’ వివాహం అత్యంత సన్నిహితుల సమక్షంలో అంగరంగ వైభవంగా జరిగింది. కుటుంబ సభ్యులు, ఆప్తమిత్రుల ఆశీర్వాదాలతో డిసెంబరు 11న విరాట్- అనుష్క ఒక్కటయ్యారు. షాంపూ యాడ్ ద్వారా 2013లో పరిచయమైన వీరిద్దరు చాన్నాళ్ల పాటు ప్రేమలో మునిగితేలిన విషయం తెలిసిందే. అయితే, చాలా మంది సెలబ్రిటీల లాగే వీరి బంధం కూడా మూణ్ణాళ్ల ముచ్చటగానే మిగిలిపోతుందంటూ వదంతులు వ్యాప్తి చేసిన వారి మాటలను నీటి మూటలు చేస్తూ విరుష్క వెడ్లాక్తో ముడిపడిపోయారు. కాగా విరాట్- అనుష్క జోడీ పబ్లిసిటీకి కాస్త దూరంగా ఉంటారన్న సంగతి తెలిసిందే. అందుకే ఎలాంటి హడావుడి లేకుండా .. రహస్యంగా పెళ్లి తంతు ముగించేశారు. విరాట్ కాదు రాహుల్! ఈ విషయం గురించి అనుష్క శర్మ గతంలో వోగ్తో మాట్లాడుతూ.. కేవలం 42 మంది అతిథుల సమక్షంలో విరాట్- తాను ఒక్కటయ్యామని తెలిపింది. అంతేకాదు విరాట్ కోహ్లికి ఉన్న క్రేజ్ దృష్ట్యా తమ పెళ్లి వార్త లీక్ కాకుండా నకిలీ పేరు వాడినట్లు వెల్లడించింది. ‘‘మేము నిరాడంబరంగా.. హోమ్ స్టైల్ వెడ్డింగ్ చేసుకోవాలని భావించాం. మా కుటుంబ సభ్యులు, స్నేహితులు కలిసి మొత్తం ఆరోజు 42 మంది ఉన్నారు. అదొక సెలబ్రిటీ జంట పెళ్లిగా కాకుండా.. కేవలం విరాట్- అనుష్కల పెళ్లిలా ఉండాలని కోరుకున్నాం. అంతేకాదు కేటరర్ విషయంలో విరాట్ పేరు బయటికి రాకుండా అతడికి ‘రాహుల్’ అనే నకిలీ పేరును వాడాం. ప్రేమతో రెండు మనసులు ఏకమయ్యే వేడుకకు పబ్లిసిటీ అవసరం లేదని భావించాం. అందుకే హంగూఆర్భాటాలు లేకుండా పవిత్రత, శాంతితో కూడిన వాతావరణంలో పెళ్లి చేసుకోవాలనుకున్నాం’’ అని అనుష్క శర్మ తెలిపింది. అప్పటికే టీమిండియా కెప్టెన్గా విరాట్ పెళ్లినాటికి టీమిండియా సారథిగా విరాట్ కోహ్లి- నటిగా అనుష్క శర్మ తమ కెరీర్లో తారస్థాయిలో ఉన్నారు. అయితే, వ్యక్తిగత జీవితానికి కూడా ప్రాధాన్యం ఇవ్వాలనే తలంపుతో పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకున్నారు. మీడియాకు దూరంగా వామిక ఇక ఈ జంటకు 2021, జనవరి 11న కూతురు జన్మించింది. పాపకు వామికా కోహ్లిగా నామకరణం చేసిన విరుష్క... ఇంతవరకు ఆమె ఫేస్ను మాత్రం రివీల్ చేయలేదు. పబ్లిసిటీకి దూరంగా.. స్టార్ కిడ్గా కాకుండా సాధారణ అమ్మాయిలా తమ కుమార్తెను పెంచాలనే ఉద్దేశంతోనే ఆమెను మీడియాకు దూరంగా ఉంచుతున్నట్లు ఇప్పటికే విరుష్క జోడీ వెల్లడించింది. రికార్డుల రారాజు.. వరల్డ్కప్ ఓటమితో కాగా రికార్డుల రారాజు విరాట్ కోహ్లి వన్డే వరల్డ్కప్-2023 టాప్ రన్ స్కోరర్గా నిలిచిన సంగతి తెలిసిందే. అయితే, ఫైనల్లో టీమిండియా ఆస్ట్రేలియా చేతిలో ఓడిపోవడంతో కోహ్లి తీవ్ర నిరాశకు గురయ్యాడు. ఈ క్రమంలో సెలవులు తీసుకున్న కోహ్లి భార్య అనుష్క, కూతురు వామికాతో కలిసి లండన్ టూర్కు వెళ్లాడు. దక్షిణాఫ్రికాతో టెస్టు సిరీస్ సందర్భంగా ఈ రన్మెషీన్ డిసెంబరు 26న మైదానంలో దిగే అవకాశం ఉంది. చదవండి: క్రికెట్ రికార్డుల రారాజు అతడు.. ప్రతిభావంతురాలైన నటి ఆమె.. అప్పుడప్పుడు అతడూ ‘నటిస్తుంటాడు’.. అదే వారి చూపుల కలయికకు కారణమైంది.. పరిచయం స్నేహంగా.. ఆపై ప్రణయంగా మారి పరిణయానికి దారి తీసింది.. అన్యోన్య దాంపత్యానికి గుర్తుగా పండంటి పాపాయినీ ఇచ్చింది........ Virat Kohli- Anushka Sharma Love Story: అప్పుడప్పుడు నటించేవాడు కూడా.. ‘బ్యాడ్ జోక్’తో మాట కలిపి!.. -
Italy:ఎదురెదురుగా ఢీకొన్న హైస్పీడ్,ఎక్స్ప్రెస్ రైళ్లు
రోమ్: ఇటలీలో రెండు ప్యాసింజర్ రైళ్లు ఎదురెదురుగా ఢీ కొన్నాయి. ఆదివారం అర్ధరాత్రి ఉత్తర ఇటలీలో ఈ ప్రమాదం చోటుచేసుకుంది. బొలోగ్నా, రిమినీ స్టేషన్ల మధ్య ఒక హై స్పీడ్ రైలును మరో ఎక్స్ప్రెస్ రైలు ఢీ కొట్టింది. ఈ ఘటనలో 17 మందికిపైగా ప్రయాణికులు గాయాలపాలైనట్లు అధికారులు తెలిపారు. అయితే తక్కువ వేగంలో వెళ్తుండగా రెండు రైళ్లు ఢీకొట్టుకోవడంతో ఎవరికీ తీవ్ర గాయాలు కాలేదని రైలు ఆపరేటర్ చెప్పారు. దేశ డిప్యూటీ పీఎం, రవాణా మంత్రి కూడా అయిన మాట్టే సాల్వినీ ఈ ప్రమాదంపై స్పందించారు. రైళ్లు ఢీకొన్న ఘటనలో ప్రయాణికులకు చిన్న గాయాలే అయ్యాయని తెలిపారు. ఢీ కొట్టుకున్న రైళ్లలో హై స్పీడ్ రైలు ముందుభాగం నుజ్జునుజ్జవగా ఎక్స్ప్రెస్ రైలు మాత్రం చెక్కుచెదరకుండా అలాగే ఉంది. ఘటనపై దర్యాప్తు జరుగుతోందని రైల్వే అధికారులు తెలిపారు. -
Garisenda Tower: వాలుతున్న వెయ్యేళ్ల టవర్
ఇటలీ అనగానే అందరికీ టక్కున గుర్తొచ్చేది పీసా నగరంలోని ప్రపంచ ప్రఖ్యాత లీనింగ్ టవరే. నాలుగు డిగ్రీల కోణంలో ఒకవైపు వాలిపోయి అందరికీ ఆకట్టుకుంటూ కని్పస్తుందా కట్టడం. అయితే ఇటలీలోనే మరో లీనింగ్ టవర్ కూడా ఉంది. అది కూడా కాస్త అటూ ఇటుగా పీసా టవర్ అంత ఎత్తు ఉంటుంది. అలాంటి టవర్ కాస్తా ఇప్పుడు ఏ క్షణమైనా కుప్పకూలేలా కని్పస్తూ గుబులు రేపుతోంది....! ఇటలీలోని బొలోగ్నా నగరంలో గారిసెండా టవర్ ఇప్పుడు ప్రపంచం దృష్టిని ఆకర్షిస్తోంది. పీసా టవర్ మాదిరిగానే ఇది కూడా నానాటికీ ఓ పక్కకు వాలిపోతుండటమే ఇందుకు కారణం. అలా ఈ టవర్ ఇప్పటిదాకా 4 డిగ్రీల కోణంలో పక్కకు ఒరిగింది. దీనికి తోడు దాని పునాదులు కొంతకాలంగా బాగా బలహీనపడుతూ వస్తున్నట్టు అధికారులు తేల్చారు. దాంతో నగర కౌన్సిల్ హుటాహుటిన సమావేశమై దీని గురించి కూలంకషంగా చర్చించింది. టవర్ ఏ క్షణమైనా కుప్పకూలే ప్రమాదముందని ధ్రువీకరించింది. అదే జరిగితే శిథిలాల ధాటికి పరిసర చుట్టుపక్కల అతి సమీపంలో ఉన్న పలు నివాస, వాణిజ్య సముదాయాలు తీవ్రంగా దెబ్బ తినే ప్రమాదముంది. దీన్ని నివారించేందుకు ముందు జాగ్రత్త చర్యగా టవర్ చుట్టూ యుద్ధ ప్రాతిపదికన 5 మీటర్ల ఎత్తున బారియర్ నిర్మిస్తున్నారు. 2024 ఏప్రిల్ లోపు దాన్ని పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. దాంతోపాటు టవర్ చుట్టూ మెటల్ రాక్ ఫాల్ వలలను ఏర్పాటు చేస్తున్నారు. తద్వారా అది కూలినా పరిసర నిర్మాణాలకు ఎలాంటి నష్టమూ లేకుండా చూసేందుకు అన్ని జాగ్రత్తలూ తీసుకుంటున్నారు. ఈ నేపథ్యంలో అక్టోబర్ నుంచి టవర్, దాని గ్రౌండ్ ఫ్లోర్లోని ప్లాజాలోకి సందర్శకులకు అనుమతి నిరాకరించారు. సందర్శనపై నిషేధం మరికొన్నేళ్ల దాకా (టవర్ కూలని పక్షంలో) కొనసాగుతుందని ఇప్పటికే ప్రకటించారు. బారియర్ నిర్మాణ వ్యయం 37 లక్షల పౌండ్లు(దాదాపు రూ.39.10 కోట్లు)గా అంచనా వేశారు. దీనికోసం ప్రజల నుంచి విరాళాలు సేకరిస్తుండటం విశేషం! ‘‘నగరవాసులతో పాటు బొలోగ్నా నగరాన్ని, దాని ప్రఖ్యాత పర్యాటక చిహా్నలను కాపాడాలని తపిస్తున్న ప్రపంచవ్యాప్తంగా ఉన్న పర్యాటక ప్రియులందరూ ఈ బృహత్తర యజ్ఞంలో భాగస్వాములు కావాలి’’ అంటూ నగర కౌన్సిల్ పిలుపునిచి్చంది. నిలబెట్టేందుకు తీవ్ర యత్నాలు గారిసెండా టవర్ కూలిపోకుండా కాపాడేందుకు ఇటలీ శాయశక్తులా ప్రయతి్నస్తోంది. పీసా టవర్ కూడా క్రమంగా మరింత పక్కకు వాలి త్వరలో కూలిపోవడం ఖాయమని కొన్నేళ్ల క్రితం వార్తలొచ్చాయి. కానీ ప్రభుత్వం ఏళ్ల తరబడి నానా ప్రయత్నాలూ చేసి దాని ఒంపును కొంతమేర సరిచేసింది. ప్రస్తుతానికి అది కుప్పకూలే ముప్పు లేదని తేలి్చంది. అలా పీసా టవర్ను కాస్త సురక్షితంగా మార్చిన అనుభవాన్నంతా గారిసెండా విషయంలో రంగరిస్తున్నారు. ఇందుకోసం సివిల్ ప్రొటెక్షన్ ప్లాన్ సిద్ధం చేశారు. తొలి దశలో దీన్ని వీలైనంత సురక్షితంగా తీర్చిదిద్దే పనిలో పడ్డారు. సంబంధిత పనులు యుద్ధ ప్రాతిపదికన జరుగుతున్నాయి. రెట్టింపు ఎత్తైన జంట టవర్ గారిసెండా నిజానికి బొలోగ్నా నగరానికి ప్రధాన ఆకర్షణగా నిలిచిన జంట టవర్లలో ఒకటి మాత్రమే! పైగా చిన్నది. ఎందుకంటే, దీని పక్కనే ఉన్న అసినెల్లీ టవర్ దీనికంటే దాదాపు రెట్టింపు పొడవైంది! అంటే దాదాపు 90 మీటర్లన్నమాట. ప్రఖ్యాత పీసా టవర్ ఎత్తు 56 మీటర్లే. అంటే, ఇది పీసాను తలదన్నేంత ఎత్తుందన్నమాట! అసినెల్లీ టవర్ నిర్మాణం గారిసెండా తర్వాత పదేళ్లకే, అంటే 1,119లో జరిగింది. ఇది కూడా కాస్త పక్కకు ఒరిగే ఉండటం విశేషం. అయితే ఆ ఒంపు మరీ పీసా, గారిసెండా అంతగా లేదు గనుక ప్రస్తుతానికి దీనికి వచి్చన ముప్పేమీ లేనట్టే! దాదాపు వెయ్యేళ్ల నాటిది! ► గారిసెండా టవర్ ఇప్పటిది కాదు. మధ్య యుగానికి చెందినది. ►దీన్ని దాదాపు వెయ్యేళ్ల క్రితం, అంటే క్రీస్తుశకం 1,109 సంవత్సరంలో నిర్మించారు. ►టవర్ ప్రస్తుత ఎత్తు 47 మీటర్లు (154 అడుగులు). ►నిర్మించినప్పుడు ఇది చాలా ఎత్తుండేది. ►200 ఏళ్లకే టవర్ ఒక పక్కకు ఒరగడం మొదలైంది. ►దాంతో 14వ శతాబ్దంలో దాని ఎత్తును బాగా తగ్గించారు. ►డాంటే 1321 సంవత్సరంలో ముగించిన అజరామర పద్య కావ్యం ‘ది డివైన్ కామెడీ’లో కూడా గారిసెండా టవర్ ప్రస్తావన ఉంది. – సాక్షి, నేషనల్ డెస్క్ -
Davis Cup final 2023: డేవిస్ కప్ విజేత ఇటలీ
మలాగా (స్పెయిన్): డేవిస్ కప్లో ఇటలీ జట్టు అత్యుత్తమ ప్రదర్శనతో అదరగొట్టింది. టోర్నీ చరిత్రలో రెండో సారి ఆ జట్టు విజేతగా నిలిచింది. 47 ఏళ్ల తర్వాత జట్టు ఖాతాలో ఈ టైటిల్ చేరడం విశేషం. టెన్నిస్లో వరల్డ్ కప్లాంటి డేవిస్ కప్లో చివరిసారిగా 1998లో ఫైనల్ చేరి ఓటమిపాలైన ఇటలీ... పాతికేళ్ల తర్వాత వచి్చన అవకాశాన్ని వదులుకోలేదు. ఫైనల్లో ఇటలీ 2–0 తేడాతో 28 సార్లు చాంపియన్ ఆస్ట్రేలియాను చిత్తు చేసింది. 2003లో ఆఖరి టైటిల్ సాధించిన ఆ్రస్టేలియా గత రెండు దశాబ్దాలుగా ప్రయతి్నస్తున్నా మరో ట్రోఫీని సొంతం చేసుకోలేకపోయింది. ఈ సారి కూడా ఆ జట్టు చివరి మెట్టుపై చతికిలపడింది. తొలి మ్యాచ్లో ఇటలీ ఆటగాడు మటియో ఆర్నాల్డి 7–5, 2–6, 6–4 స్కోరుతో అలెక్సీ పాపిరిన్పై విజయం సాధించాడు. 2 గంటల 27 నిమిషాల పాటు సాగిన ఈ హోరాహోరీ మ్యాచ్లో చివరకు 22 ఏళ్ల ఆర్నాల్డిదే పైచేయి అయింది. రెండో పోరులో వరల్డ్ నంబర్ 4 జనిక్ సిన్నర్ స్థాయికితగ్గ ఆటతీరుతో చెలరేగాడు. సిన్నర్ 6–3, 6–0తో అలెక్స్ను చిత్తు చేశాడు. 81 నిమిషాల్లోనే ముగిసిన ఆటలో సిన్నర్ 5 ఏస్లు కొట్టాడు. సెమీస్లో దిగ్గజ ఆటగాడు జొకోవిచ్ను ఓడించిన జోరులో ఉన్న సిన్నర్ తుది పోరులోనూ అదే ఫామ్ను కొనసాగించాడు. -
'నా జీవితంలో అద్భుతమైన క్షణం'.. మెగాస్టార్ పోస్ట్ వైరల్!
మెగా ఇంట ఇటీవలే పెళ్లి సందడి ముగిసింది. నాగబాబు తనయుడు , మెగా హీరో వరుణ్ తేజ్- లావణ్య త్రిపాఠి పెళ్లిబంధంతో ఒక్కటయ్యారు. ఇటలీలో జరిగిన వీరి పెళ్లికి మెగాస్టార్ దంపతులు, రామ్ చరణ్, అల్లు అర్జున్, నితిన్ కుటుంబ సభ్యులు, సన్నిహితులు కూడా హాజరయ్యారు. ఇటలీలోని టుస్కానీలో వీరి వివాహాం చాలా గ్రాండ్గా జరిగింది. ఆ తర్వాత టాలీవుడ్ ప్రముఖుల కోసం మాదాపూర్లో గ్రాండ్ రిసెప్షన్ కూడా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి రాజకీయ ప్రముఖులు కూడా హాజరయ్యారు. అయితే తాజాగా మెగాస్టార్ చిరంజీవి తన ఇన్స్టాలో ఓ ఫోటోను పంచుకున్నారు. వరుణ్ తేజ్- లావణ్య త్రిపాఠి పెళ్లిలో మెగాస్టార్ దంపతులు సందడి చేశారు. తాజాగా దీనికి సంబంధించి హల్దీ వేడుకలో దిగిన ఫోటోను చిరంజీవి షేర్ చేశారు. ప్రస్తుతం ఈ ఫోటో సోషల్ మీడియాలో వైరల్గా మారింది. చిరు తన ఇన్స్టాలో రాస్తూ.. ఇటలీలో ఒక అందమైన సాయంత్రం. ఇది చాలా కాలం క్రితం జరిగింది కాదు. ప్రేమతో ఒకటైన రెండు హృదయాలు ఎన్నో మధురమైన క్షణాలు, జ్ఞాపకాలను తీసుకొచ్చాయి. అలాంటి ఒక అందమైన క్షణాన్ని మీతో పంచుకుంటున్నాను.' అంటూ పోస్ట్ చేశారు. ఇది చూసిన ఫ్యాన్స్ సైతం క్రేజీ కామెంట్స్ చేస్తున్నారు. View this post on Instagram A post shared by Chiranjeevi Konidela (@chiranjeevikonidela) -
ఎంత పని చేశావ్ వరుణ్ తేజ్.. పెళ్లిపై మెగా హీరో పోస్ట్ వైరల్!
ఇటీవలే టాలీవుడ్ జంట వరుణ్ తేజ్- లావణ్య త్రిపాఠి పెళ్లిబంధంతో ఒక్కటయ్యారు. ఇటలీలో జరిగిన వీరి పెళ్లికి మెగా కుటుంబసభ్యులు, అత్యంత సన్నిహితులు మాత్రమే హాజరయ్యారు. ఈ పెళ్లిలో రామ్ చరణ్, సాయి ధరమ్ తేజ్, అల్లు అర్జున్తో సహా నితిన్ కూడా పాల్గొన్నారు. అయితే మెగా హీరో సాయి ధరమ్ తేజ్ తాజాగా ఇన్స్టాలో ఓ పోస్ట్ షేర్ చేశాడు. వరుణ్ తేజ్ పెళ్లిని ఉద్దేశించి చేయడంతో అది కాస్తా సోషల్ మీడియాలో వైరల్గా మారింది. ఈ పోస్ట్ చూస్తే వరుణ్ తేజ్- లావణ్య త్రిపాఠి పెళ్లిలో సాయి ధరమ్ తేజ్ ఓ రేంజ్లో హంగామా చేసినట్లు కనిపిస్తోంది. పెళ్లిలో వరుణ్ తేజ్ను ఊరేగించే కారుపై కాలు పెట్టిన ఫోటో చూస్తే చాలా ఫన్నీగా కనిపిస్తోంది. అతన్ని చూసిన వరుణ్ తేజ్ చిరునవ్వుతో కనిపించాడు. ఆ ఫోటోలను తన ఇన్స్టాలో షేర్ చేస్తూ ఓ నోట్ రాసుకొచ్చాడు. సాయి తన ఇన్స్టాలో రాస్తూ..' ఎందుకు, క్యూన్, యేన్, వై.. ఎంత పని చేశావ్ వరుణ్ బాబు.. ఉష్..నీకు పెళ్లి సంబరాలు.. కానీ నాకేమో స్వతంత్ర పోరాటం' అంటూ ఫన్నీగా పోస్ట్ చేశారు. ఇది చూసిన అభిమానులు సైతం క్రేజీ కామెంట్స్ చేస్తున్నారు. నువ్వు మాత్రం అలాంటి కమిట్మెంట్స్ పెట్టుకోకు అన్నా అంటూ సలహాలు ఇస్తున్నారు నెటిజన్స్. కాగా.. సాయి ధరణ్ తేజ్ ఈ ఏడాది విరూపాక్ష, బ్రో సినిమాలతో ప్రేక్షకులను అలరించాడు. View this post on Instagram A post shared by Sai Dharam Tej (@jetpanja) -
ఇటలీ నుంచి ఇంటికి...
దాదాపు రెండు నెలల ఇటలీ ట్రిప్ను ముగించుకుని బుధవారం తిరిగి హైదరాబాద్ చేరుకున్నారు ప్రభాస్. ఇక ముందుగా విడుదలకు సిద్ధంగా ఉన్న ‘సలార్’ చిత్రం తొలి భాగం ‘సలార్: సీజ్ఫైర్’ సినిమా షూటింగ్ను పూర్తి చేస్తారట ప్రభాస్. ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో ప్రభాస్ హీరోగా నటిస్తున్న ‘సలార్: సీజ్ఫైర్’ చిత్రం డిసెంబరు 22న విడుదలకు సిద్ధమవుతున్న సంగతి తెలిసిందే. ఆ తర్వాత నాగ్ అశ్విన్ తెరకెక్కిస్తున్న ‘కల్కి 2898 ఏడీ’, మారుతి దర్శకత్వంలోని ‘రాజాడీలక్స్’ (ప్రచారంలో ఉన్న టైటిల్) సినిమాల షూటింగ్స్లో సమాంతరంగా ΄ాల్గొనేలా ప్రభాస్ ΄్లాన్ చేస్తున్నారని సమాచారం. -
మా ఊళ్లలో ఉండండి.. రూ.26 లక్షలు అందుకోండి: ఓ ప్రాంతం బంపరాఫర్!
విదేశాల్లో, ఏదైనా కొత్త ప్రాంతంలో నివాసం ఉండాలనుకుంటున్నారా? అయితే మీకు ఇటలీలోని ఓ ప్రాంతం బంపరాఫర్ ఇస్తోంది. ఇక్కడ నివాసముంటే చాలు సుమారు రూ.26 లక్షలు మీ సొంతమవుతాయి. అలా అని అదేదో సౌకర్యాలు లేని మారుమూల ప్రాంతం కాదు. సముద్ర తీరాన, సుందరమైన పర్వతాల అంచున ఉండే అందమైన ప్రాంతమది. ఇటలీలోని దక్షిణ కాలాబ్రియా (Calabria) ప్రాంతం డబ్బు సంపాదించాలనుకునే, కొత్త ప్రాంతాన్ని అన్వేషించాలనుకునే వ్యక్తులకు అద్భుతమైన అవకాశాన్ని అందిస్తోంది. అక్కడ నివసిస్తూ బిజినెస్ చేసి డబ్బు సంపాదించాలనుకునేవారికి ఆర్థిక సహాయాన్ని అందిస్తోంది. అర్హతలు ఇవే.. కాలాబ్రియా అందిస్తున్న ఈ అవకాశాన్ని పొందాలంటే కొన్ని అర్హతలు తప్పనిసరిగా ఉండాలి. వాటిలో ముఖ్యమైనది వయసు 40 ఏళ్లలోపు ఉండాలి. ఇక అప్లికేషన్ ఆమోదం పొందిన 90 రోజులలోపు నివాసం ఉండటానికి సిద్ధంగా ఉండాలి. కాలాబ్రియా గురించి.. కాలాబ్రియా ప్రాంతాన్ని ఇటలీ "బొటనవేలు" గా పేర్కొంటారు. అందమైన సముద్ర తీరం, గంభీరమైన పర్వతాలకు ఈ ప్రాంతం ప్రసిద్ధి చెందింది. ఎందుకో ఇటీవల కొన్ని సంవత్సరాలుగా ఈ ప్రాంతంలో జనాభా బాగా తగ్గిపోయింది. దీంతో స్థానిక కమ్యూనిటీలలో ఆందోళన నెలకొంది. ఈ సమస్యను పరిష్కరించడానికి కాలాబ్రియా ఈ అసాధారణ ప్రణాళికను ప్రారంభించింది. రూ. 26.48 లక్షల వరకూ ప్రోత్సాహకం ప్రణాళికలో భాగంగా కాలాబ్రియా ప్రాంతంలో నివాసం ఉంటూ స్థానిక ఆర్థిక వ్యవస్థకు దోహదపడే ఆసక్తి ఉన్న 40 ఏళ్లలోపు యువతకు మూడు సంవత్సరాల పాటు రూ. 26.48 లక్షల ఆర్థిక ప్రోత్సాహకాలను అందిస్తారు. ఇక్కడ రెస్టారెంట్లు, దుకాణాలు, హోటళ్లు వంటి బిజినెస్లను ప్రారంభించేందుకు స్థానిక అధికారులు ప్రోత్సహిస్తున్నారు. స్థానిక ఆర్థిక వ్యవస్థను పెంచడం, కమ్యూనిటీల్లో కొత్త జీవితాన్ని నింపడం ఈ కార్యక్రమం ప్రాథమిక లక్ష్యమని దీన్ని రూపొందించినవారిలో ఒకరైన జియాన్లూకా గాల్లో పేర్కొన్నారు. బడ్జెట్ కేటాయింపు ఈ ప్రాజెక్ట్ కోసం సుమారు 6.31 కోట్ల బడ్జెట్ కేటాయించారు. ఈ కార్యక్రమం రాబోయే వారాల్లో ప్రారంభమవుతుందని భావిస్తున్నారు. కాలాబ్రియా ప్రాంతంలోని 75 శాతానికి పైగా మునిసిపాలిటీలలో 5,000 కంటే జనాభా ఉన్నారు. ఈ విశిష్ట కార్యక్రమం యువ పారిశ్రామికవేత్తలకు కాలాబ్రియా ప్రాంత విశిష్టతను, సంస్కృతిని పరిచయం చేస్తూ ఆర్థిక సహాయాన్ని అందించడం లక్ష్యంగా పెట్టుకుంది. -
హైదరాబాద్కు చేరుకున్న మెగా కోడలు.. ఎయిర్పోర్ట్లో ఘనస్వాగతం!
మెగా హీరో వరుణ్ తేజ్- లావణ్య త్రిపాఠి పెళ్లి బంధంతో ఒక్కటయ్యారు. ఈ ఏడాది జూన్లో ఎంగేజ్మెంట్ వీరిద్దరూ ఇటలీ వేదికగా జరిగిన గ్రాండ్ వెడ్డింగ్తో వివాహాబంధంలో అడుగుపెట్టారు. వీరి పెళ్లి వేడుకలో మెగా ఫ్యామిలీతో పాటు అల్లు అర్జున్, నితిన్ దంపతులు పాల్గొన్నారు. దాదాపు మూడు రోజుల పాటు టుస్కానీలో ఈ వేడుకలు జరిగాయి. ఈ గ్రాండ్ డెస్టినేషన్ వెడ్డింగ్కు సంబంధించిన ఫోటోలను నెట్టింట తెగ వైరలయ్యాయి. (ఇది చదవండి: రాహుల్ సిప్లిగంజే ఆ పర్సనల్ ఫోటోలు లీక్ చేశాడు: రతిక సోదరి) అయితే తాజాగా ఈ జంట హైదరాబాద్కు చేరుకున్నారు. పెళ్లి వేడుకల అనంతరం తొలిసారిగా మెగా కోడలి హోదాలో లావణ్య త్రిపాఠి నగరంలో అడుగుపెట్టారు. ఎయిర్పోర్ట్కు వచ్చిన నూతన దంపతులకు ఘనస్వాగతం లభించింది. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో తెగ వైరలవుతోంది. వీరితో పాటే మెగాస్టార్ ఫ్యామిలీ, రామ్ చరణ్- ఉపాసన కూడా హైదరాబాద్ వచ్చేశారు. కాగా.. సినీ ప్రముఖుల కోసం ఈనెల 5న గ్రాండ్ రిసెప్షన్ వేడుక జరగనుంది. మాదాపూర్లో ఎన్ కన్వెన్షన్ సెంటర్లో ఈ కార్యక్రమం ఏర్పాటు చేశారు. ఈ వేడుకలో సినీ, రాజకీయ ప్రముఖులు పాల్గొననున్నారు. View this post on Instagram A post shared by Telugu FilmNagar (@telugufilmnagar) #TFNExclusive: Love birds @IAmVarunTej & @Itslavanya get papped at HYD airport as they jet off to Italy for their wedding ceremony, along with #NiharikaKonidela & #PanjaVaisshnavTej!!😍❤️#VarunTej #LavanyaTripathi #VarunLav #TeluguFilmNagar pic.twitter.com/2Cmy18sCtB — Telugu FilmNagar (@telugufilmnagar) October 27, 2023 #TFNExclusive: Visuals of the lovely couple @IAmVarunTej & @Itslavanya arriving at Hyderabad airport!!😍#VarunTej #LavanyaTripathi #VarunLav #TeluguFilmNagar pic.twitter.com/BJtp0E1JDQ — Telugu FilmNagar (@telugufilmnagar) November 4, 2023 -
VarunLav Wedding: మెగా పెళ్లి సందడి.. కొత్త జంటకు దిష్టి తీయాల్సిందే (ఫోటోలు)
-
మనుషులే లేని ఊరు.. అసలు ఎక్కడ ఉంది..?
-
వరుణ్ తేజ్- లావణ్య త్రిపాఠి పెళ్లి.. డ్యాన్స్తో అదరగొట్టిన నిహారిక!
మెగా ఫ్యాన్స్ ఎంతగానో వేచిచూసిన వేడుక ముగిసింది. అభిమాన హీరో వరుణ్ తేజ్- లావణ్య త్రిపాఠి మూడుముళ్ల బంధంతో ఒక్కటయ్యారు. కుటుంబ సభ్యులు, సన్నిహితుల సమక్షంలో వేదమంత్రాల సాక్షిగా వైవాహిక బంధంలో అడుగుపెట్టారు. నవంబర్ 1వ తేదీన ఇటలీలోని టుస్కానీలో వీరి వివాహం అత్యంత ఘనంగా జరిగిన సంగతి తెలిసిందే. ఈ వేడుకల్లో మెగాస్టార్ చిరు దంపతులు కూడా పాల్గొన్నారు. (ఇది చదవండి: వరుణ్ తేజ్ పెళ్లి.. మెగా ఫోటో షేర్ చేసిన చిరు.. ఎవరెవరు ఉన్నారంటే) అయితే ఈ వేడుకల్లో వరుణ్ తేజ్ సోదరి నిహారిక స్పెషల్ అట్రాక్షన్గా నిలిచింది. అన్న పెళ్లి వేడుకల్లో సందడి చేసింది. అన్న పెళ్లిలో తీన్ మార్ స్టెప్పులతో అదరగొట్టింది. తండ్రి నాగబాబుతో కలిసి తీన్ మార్ డ్యాన్స్ చేసింది. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో తెగ వైరవుతోంది. కాగా..అక్టోబర్ 30న మొదలైన పెళ్లి వేడుకలు నవంబర్ 1 వరకు కొనసాగాయి. కాగా.. ఇటలీ నుంచి వచ్చిన అనంతరం ఇండస్ట్రీ ప్రముఖల కోసం హైదరాబాద్లో గ్రాండ్ రిసెప్షన్ ఏర్పాటు చేశారు. ఈనెల 5న మాదాపూర్లోని ఎన్ కన్వెన్షన్ సెంటర్లో వరుణ్ తేజ్- లావణ్య త్రిపాఠి రిసెప్షన్ వేడుక జరగనుంది. (ఇది చదవండి: ఓటీటీ ప్రియులకు పండగే.. ఒక్కరోజే 28 సినిమాలు రిలీజ్) Congratulations to the beautiful couple @IAmVarunTej & @Itslavanya. Wishing a lifetime of happiness! 💖 #VarunLav pic.twitter.com/2OmR5SUIt9 — Vamsi Kaka (@vamsikaka) November 1, 2023 -
ఓ మహిళ 'మానవ పిల్లి'లా..అందుకోసం ఏకంగా..
వెర్రీ వెయ్యి రకాలు..పైత్యం పలు రకాలు అనే సామెతను మన పెద్దలు ఎందుకన్నారో గానీ కొందరూ మనుషులను చూస్తే అది నిజమే అనిపిస్తుంది. బహుశా పిచ్చి ఆలోచనలు కలిగిన వ్యక్తుల చూసే అన్నారు కాబోలు. మొన్నటికి మొన్న ఓ మనిషి మానవ కుక్కలా కనపడాలని ఆరాటపడటం వార్తలో హాట్టాపిక్గా మారింది. లక్షలు ఖర్చు పెట్టి మరీ నిజం చేసుకున్నాడు. అది మరువక మునుపే ఇప్పుడో మహిళ మానవ పిల్లిలా కనిపించాలనుకుంటోంది. దేవుడిచ్చిన రూపం కంటే జంతువుల్లా ఉండటానికి ఇష్టపడటం విడ్డూరం అనుకుంటే అందుకోసం వీళ్లు చేసే ప్రయత్నాలు చాలా జుగప్సకరంగా ఉంటాయి. కుక్కలా మారాలనుకున్న వ్యక్తి జస్ట్ కుక్కలా కనిపించే కాస్ట్యూమ్స్ ధరించాడంతే. కానీ ఈమె అచ్చం ఆడ పిల్లిలా కనిపించేందుకు ఎంతకు తెగించిందో వింటే కంగుతినండ ఖాయం! ఇటాలియన్కు చెందిన 22 ఏళ్ల చియారా డెల్ అబేట్ సోషల మీడియాలో మంచి క్రేజ్ ఉన్న టిక్టాకర్. మరెందుకు అనిపించిందో గానీ ఆడ పిల్లిలా కనిపించాలనేది ఆమె ప్రగాఢ కోరిక. అందుకోసం తల దగ్గర నుంచి కాలి వరకు 20కి పైగా మార్పులు చేసింది. ప్రతి అంగాన్ని పిల్లిలా ఉండేలా మార్చింది. వామ్మో!.. ఇదేలా సాధ్యం అని అనుకోకండి!. ఎందుకంటే అసమంజసమైన కోరికను నిజం చేసి పాపులర్ అవ్వాలన్నదే ఆమె బలమైన కాంక్ష. ఈ కోరిక చిన్నినాటి నుంచి ఉందట. శరీరాన్ని పిల్లిలా మార్చుకునేందుకు శరీరంపై ఎన్ని కుట్లు పడ్డాయో చెబితే షాక్ అవుతారు. 11 ఏళ్ల వయసు నుంచి శరీర ట్రాన్స్ఫార్మేషన్ ప్రకియను మొదలు పెట్టింది. ఈ క్రమంలో ఇలా ఇప్పటి వరకు శరీరంపై 72 కుట్లు పడ్డాయి. ముక్కు రంధ్రాల నుంచి, పైపెదవి వరకు చాల కుట్లు పడ్డాయి. కనురెప్పలపై అదనంగా ఉన్న చర్మం తొలగించుకునేలా కాస్మెటిక్ సర్జరీ, ప్రతి చేతికి 10 సబ్డెర్మల్ ఇంప్లాంట్లు, ఆఖరికి బ్రెస్ట్, అంతర్గత జననేంద్రియాలను కూడా వదలలేదు. వాటిని కూడా ఆడ పిల్లికి ఉన్నట్లుగా మార్పులు చేయించుకుంది. తాను ఏదో కామెడీగా కార్టూన్లో కనిపించే పిల్లిలా కనిపించాలనుకోవడం లేదని అచ్చం "మానవ పిల్లిలా" కనిపించడమే తన ధ్యేయం అని తెగేసి చెబుతోంది చియారా. అందుకే ఆమె అక్కడితో ఆగకుండా పూర్తిగా ఆడ పిల్లిలా కనిపించేలా..బాదం ఆకారంలో ఉండే పిల్లి కళ్లు, దంతాలు, పైపెదవి, తోక తదితర మార్పులు కోసం కాంటోప్లాస్టీ అనే కాస్మెటిక్ సర్జరీ చేయించుకునేందుకు సిద్ధమవుతోంది. పైగా తన శరీరం ఆయా మార్పులకు అనుగుణంగా ఫిట్గా ఉంటుందని ధీమాగా చెబుతోంది చియారా. ఇలాంటి ఆలోచన రావడమే విచిత్రం అనుకుంటే అంతలా సర్జరీలు చేయించుకోవడానికి కూడా మంచి గట్స్ ఉండాలేమో!. చిన్న సర్జరీకే బెంబేలెత్తిపోతాం. ఏకంగా 20 సార్లు శరీర మార్పులు చేయించుకోవడమేగాక ఇంకా కొన్ని సర్జరీలు చేయించుకునేందుకు రెడీ అయిపోతోంది చియారా. పిచ్చి పీక్స్లో ఉంటే ఎంతకైన తెగిస్తారంటే ఇదేనేమో!. (చదవండి: అద్భుతమైన డెవిల్స్ బ్రిడ్జ్! ఆ నిర్మాణం ఓ అంతుచిక్కని మిస్టరీ!) -
మొదలైన మెగా సందడి.. హల్దీ వేడుకలో వరుణ్ - లావణ్య!
ఇటలీలో మెగా ఇంట పెళ్లిసందడి మొదలైంది. మరికొన్ని గంటల్లో ఒక్కటి కాబోతున్న టాలీవుడ్ జంట పెళ్లి వేడుకల్లో భాగంగా హల్దీ వేడుక జరుపుకున్నారు. ఇటలీలోని టుస్కానీలో జరుగుతున్న వీరి డెస్టినేషన్ వెడ్డింగ్కు మెగా కుటుంబసభ్యులు, అత్యంత సన్నిహితులు మాత్రమే హాజరయ్యారు. తాజాగా జరిగిన హల్దీ వేడుక ఫోటోలు నెట్టింట వైరలవుతున్నాయి. ఈ జంట నవంబర్ 1వ తేదీన పెళ్లి బంధంతో ఒక్కటి కానుంది. (ఇది చదవండి: కనీసం రూ.100 అయినా ఇవ్వండి.. రేణు దేశాయ్ పోస్ట్ వైరల్) అయితే వీరి పెళ్లి వేడుక కోసం ఇటలీ చేరుకున్న కుటుంబ సభ్యులు అక్టోబర్ 30న కాక్ టెయిల్ పార్టీని సెలబ్రేట్ చేసుకున్నారు. ఈ పార్టీలో రామ్ చరణ్-ఉపాసన, అల్లు అర్జున్-స్నేహాలు కూడా కలర్ఫుల్గా కనిపించారు. ఇప్పటికే పెళ్లి వేడుక కోసం మెగా, అల్లు కుటుంబాలు ఇటలీ చేరుకున్నాయి. ప్రముఖ డిజైనర్ మనీశ్ మల్హోత్రా డిజైన్ చేసిన దుస్తులను ధరించి వరుణ్ తేజ్- లావణ్య ఈ వేడుకలో పాల్గొన్నారు. కాగా.. ఈ ఏడాది జూన్ 9న నిశ్చితార్థం చేసుకున్న సంగతి తెలిసిందే. వరుణ్తేజ్, లావణ్య త్రిపాఠి కలిసి మిస్టర్, అంతరిక్షం చిత్రాల్లో నటించారు. ఈ సినిమా షూటింగ్ సమయంలోనే వీరిద్దరి మధ్య ప్రేమ చిగురించింది. ఇటలీలో పెళ్లి అనంతరం హైదరాబాద్లో నవంబర్ ఐదో తేదీన గ్రాండ్ రిసెప్షన్ ప్లాన్ చేశారు. ఈ వేడుకకు టాలీవుడ్, రాజకీయ ప్రముఖులు హాజరు కానున్నారు. (ఇది చదవండి: బిగ్ బాస్ ఓ చెత్త షో.. అల్లు అర్జున్ హీరోయిన్ ఫైర్!) View this post on Instagram A post shared by Pinkvilla South (@pinkvillasouth) -
ఇటలీలో వాలిపోయిన మెగా ఫ్యామిలీ.. క్లీంకార విషయంలో పెద్ద పొరపాటు!
మెగా హీరో వరుణ్ తేజ్- నటి లావణ్య త్రిపాఠిల పెళ్లికి అంతా సిద్ధమైంది. మరో రెండు రోజుల్లో ఈ జంట మూడు ముళ్ల బంధంలో ఒక్కటి కానున్నారు. ఈ ఏడాది జూన్లో నిశ్చితార్థం చేసుకున్న ఈ జంట నవంబర్ 1న ఈ జంట ఏడు అడుగులు వేయబోతున్నారు. తమ్ముడి పెళ్లి కోసం అందరికంటే ముందుగా రామ్ చరణ్-ఉపాసన ఇటలీ చేరుకుని పెళ్లి ఏర్పాట్లను దగ్గరుండి చూసుకుంటున్నారు. ఇటీవలే వరుణ్ తేజ్- లావణ్య త్రిపాఠి సైతం ఇటలీ చేరుకున్నారు. (ఇది చదవండి: కొత్తింటికి చేరిన భగవంత్ కేసరి భామ.. భర్తతో కలిసి పూజలు!) తాజాగా మెగాస్టార్ దంపతులు తమ కుటుంబ సభ్యులతో కలిసి ఇటలీ వెళ్లారు. దీనికి సంబంధించిన ఫోటోలను రామ్ చరణ్-ఉపాసన తమ ఇన్స్టాలో పంచుకున్నారు. ఈ ఫోటోల్లో మెగా ఫ్యామీలితో పాటు ఉపాసన కుటుంబ సభ్యులు కూడా ఉన్నారు. ఇరు కుటుంబాల సభ్యులు కలిసి ఒకే ఫోటోలో కనిపించారు. కొణిదెల- కామినేని ఫ్యామిలీ ఇన్ వన్ ఫ్రేమ్ అంటూ క్యాప్షన్ కూడా ఇచ్చారు. ప్రస్తుతం ఈ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్గా మారాయి. క్లీంకార ఫేస్ రివీల్! అయితే ఈ ఫోటోలో నెటిజన్స్ మెగా మనవరాలు క్లీంకార వైపే ఆసక్తి చూపారు. ఆ ఫోటోకు ఓ స్విమ్మింగ్ ఫూల్ ముందు పోజులివ్వడంతో నీటిలో రివర్స్లో కనిపిస్తున్న క్లీంకార ఫేస్ను ఉపాసన కవర్ చేయలేదు. దీంతో ఇది చూసిన నెటిజన్స్ ఉపాసన మేడం.. మీరు క్లీంకార ఫేస్ను నీటిలో కవర్ చేయడం మరిచిపోయారు అంటూ కామెంట్స్ చేస్తున్నారు. దీంతో మెగా ఫ్యాన్స్ క్లీంకారను చూసినంత ఆనందంలో మునిగిపోయారు. (ఇది చదవండి: వరుణ్ తేజ్- లావణ్య త్రిపాఠి రిసెప్షన్.. టాలీవుడ్ స్టార్ హీరోనే యజమాని!) View this post on Instagram A post shared by Upasana Kamineni Konidela (@upasanakaminenikonidela) -
ఇటలీ ఫ్లైటెక్కిన లావణ్య-వరుణ్..!
మెగా ఇంట్లో పెళ్లిసందడి అంతా సిద్ధమైంది. ఇప్పటికే రామ్ చరణ్-ఉపాసన ఇటలీలో మకాం వేశారు. నాగబాబు తనయుడు, మెగాహీరో వరుణ్ తేజ్- లావణ్య త్రిపాఠిల పెళ్లి వేడుక ఇటలీలోని టుస్సానీలో జరగనుంది. ఇప్పటికే ప్రీ వెడ్డింగ్ వేడుకలు హైదరాబాద్లో ఘనంగా నిర్వహించారు. నవంబర్ ఒకటో తేదీన ఈ జంట మూడుముళ్ల బంధంతో ఒక్కటి కానున్నారు. (ఇది చదవండి: వరుణ్తేజ్- లావణ్యల శుభలేఖ ఫోటో చూశారా? ఆరోజే రిసెప్షన్!) తాజాగా పెళ్లి షాపింగ్ పూర్తి చేసుకుని ఇటలీ ఫ్లైట్ ఎక్కారు వరుణ్-లావణ్య. శుక్రవారం ఉదయం డెస్టినేషన్ వెడ్డింగ్ జరగనున్న టుస్సానీకి బయలుదేరారు. ఇప్పటికే నిహారికతో పాటు మెగా కుటుంబ సభ్యులు అక్కడికి చేరుకుని ఏర్పాట్లు చేస్తున్నారు. అయితే పెళ్లి తర్వాత రిసెప్షన్ మాత్రం హైదరాబాద్లోనే ఏర్పాటు చేశారు. రిసెప్షన్కు సంబంధించిన శుభలేఖ సోషల్ మీడియాలో తెగ వైరలవుతోంది. మాదాపూర్లోని ఎన్ కన్వెన్షన్ హాలులో రాత్రి ఏడు గంటలకు రిసెప్షన్ ప్రారంభం అవుతుందని శుభలేఖలో అచ్చు వేయించారు. ఈ ఆహ్వాన పత్రికలో చిరంజీవి, పవన్ కళ్యాణ్, రామ్ చరణ్ పేర్లను ముద్రించారు. కాగా.. వరుణ్ తేజ్ నటించిన ఆపరేషన్ వాలెంటైన్ డిసెంబర్లో రిలీజ్ కానుంది. Finally 😍 Megacouple #Varunlav heading to Italy for their dream wedding off from Hyderabad papped together at airport @IAmVarunTej@Itslavanya#Varuntej #lavanyatripathi #bigfatwedding #megacelebration#southpaparazzi #tollywoodcelebs pic.twitter.com/OexWdOjFVC — ARTISTRYBUZZ (@ArtistryBuzz) October 26, 2023 #TFNExclusive: Love birds @IAmVarunTej & @Itslavanya get papped at HYD airport as they jet off to Italy for their wedding ceremony, along with #NiharikaKonidela & #PanjaVaisshnavTej!!😍❤️#VarunTej #LavanyaTripathi #VarunLav #TeluguFilmNagar pic.twitter.com/2Cmy18sCtB — Telugu FilmNagar (@telugufilmnagar) October 27, 2023 -
తవ్వకాల్లో అరుదైన సమాధి..లోపల దృశ్యం చూసి కంగుతిన్న శాస్త్రవేత్తలు!
ఇటలీలో ఇటీవల పురాతత్త్వ శాస్త్రవేత్తలు జరిపిన తవ్వకాల్లో అరుదైన సమాధి ఉంది. మూసివేసి ఉన్న దీని ప్రవేశమార్గాన్ని తెరిచి, లోపలకు ప్రవేశించిన శాస్త్రవేత్తలకు ఇందులో అరుదైన కుడ్యచిత్రాలు కనిపించాయి. గ్రీకు పురాణాల్లో వర్ణించిన అధోలోకానికి సంబంధించిన దృశ్యాలు ఈ కుడ్యచిత్రాల్లో ఉండటం విశేషం. ఇది కనీసం రెండువేల ఏళ్ల కిందటిదని శాస్త్రవేత్తల అంచనా. సమాధి లోపలి గోడలపై చిత్రించిన ‘సెర్బరెస్’ అనే మూడుతలల జాగిలం గ్రీకుపురాణాల్లో వర్ణించిన మాదిరిగానే ఉండటంతో, అధోలోకంపై విశ్వాసం కలిగిన పూర్వీకులు ఈ సమాధిని అధోలోక ప్రవేశమార్గంలా నిర్మించి ఉంటారని శాస్త్రవేత్తలు భావిస్తున్నారు. గ్రీకు పురాణాల ప్రకారం ‘సెర్బరెస్’ అనే మూడుతలల జాగిలం అధోలోకానికి కాపలాగా ఉంటుంది. ఇటలీలోని నేపుల్స్నగర శివార్లలోని గిగ్లియానో పట్టణం వద్ద ఈ పురాతన సమాధి బయటపడింది. ఈ పరిసరాల్లోనే పురాతత్త్వ శాస్త్రవేత్తలు జరిపిన తవ్వకాల్లో ఇదివరకు కూడా రోమన్ సామ్రాజ్య కాలానికి చెందిన పలు సమాధులు బయటపడ్డాయి. అవన్నీ క్రీస్తుపూర్వం 510 నుంచి క్రీస్తుశకం 476 మధ్య కాలానికి చెందినవని శాస్త్రవేత్తలు అంచనా వేశారు. వాటిలో ఇంత స్పష్టమైన కుడ్యచిత్రాలు లేవని, తాజాగా బయటపడ్డ ఈ సమాధి వాటికి భిన్నంగా ఉందని చెబుతున్నారు. ఈ సమాధికి వారు ‘టోంబ్ ఆఫ్ సెర్బరెస్’ అని పేరు పెట్టారు. (చదవండి: ప్రపంచంలోనే అతిపెద్ద కోట!) -
ప్రియుడికి గుడ్ బై: ఇకపై నాకు సంబంధంలేదు: ఇటలీ ప్రధాని
PM Georgia Meloni Announces Separation ఇటలీ ప్రధాని జార్జియా మెలోని సంచలన విషయాన్ని ప్రకటించారు. తన చిరకాల ప్రియుడు టెలివిజన్ జర్నలిస్ట్ ఆండ్రియా గియాంబ్రూనో నుండి విడిపోతున్నట్లు ఎక్స్ (ట్విటర్(ద్వారా) శుక్రవారం ప్రకటించారు. ఇటీవల ఆండ్రియా చేసిన అభ్యంతర వ్యాఖ్యలే ఈ పరిణామానికి దారితీసినట్టు తెలుస్తోంది. ‘ఆండ్రియా జియాంబ్రూనోతో దాదాపు 10 సంవత్సరాల పాటు కొనసాగిన బంధం ముగిసింది’’ అని ప్రధాని మెలోని వెల్లడించారు. గత కొంతకాలంగా తమదారులు వేరుగా ఉన్నాయి. ఇక ఇపుడు వాటిని చెప్పాల్సిన సమయం వచ్చిందంటూ ఆమె ట్వీట్ చేశారు. అతనితో కలిసి గడిపిన అద్భుతమైన కాలానికి, ఎదుర్కొన్న ఇబ్బందులకు ఇక స్వస్తి. తన జీవితంలో గినేవ్రా పాపను అందించినందుకు అతనికి కృతజ్ఞతలు అంటూ ఆమె పోస్ట్ చేశారు. అంతేకాదు ఆ ఎపిసోడ్ తర్వాత మెలోని తన భాగస్వామి చేసిన వ్యాఖ్యలకు తనను బాధ్యురాల్ని చేయవద్దని, భవిష్యత్తులో జియాంబ్రూనో ప్రవర్తనకు సంబంధించిన ప్రశ్నలకు సమాధానం తాను ఇవ్వబోనని ప్రధాని మెలోని తేల్చి చెప్పారు. గత పదేళ్ళుగా సహజీవనం చేస్తున్న మెలోనీ, ఆండ్రియా ఈ దంపతులకు ఏడేళ్ల కుమార్తె ఉంది. కుమార్తె బాధ్యతలను మెలోనీ తీసుకున్నట్టు తెలుస్తోంది. కాగా ప్రముఖ టీవీ ఛానెల్ లో వ్యాఖ్యాతగా పని చేస్తున్న ఆండ్రియా మహిళా సహోద్యోగిపై అనుచిత వ్యాఖ్యలు చేయడం విమర్శలకు తావిచ్చింది. 2015లో మెలెనీ కనిపించిన ఒక టీవీ షో రచయితగా ఆండ్రియాను కలిసారు. -
తొలి విహార యాత్ర!
రామ్చరణ్, ఉపాసన ఇటలీ వెళ్లారు. తమ కుమార్తె క్లీం కారని తీసుకుని ఈ విహార యాత్రకు వెళ్లారు. కుమార్తెతో చరణ్, ఉపాసన వెళ్లిన ఫస్ట్ వెకేషన్ ఇది. ప్రస్తుతం శంకర్ దర్శకత్వంలో ‘గేమ్ ఛేంజర్’ సినిమాలో నటిస్తున్నారు రామ్ చరణ్. ఈ సినిమా తాజా షెడ్యూల్ మంగళవారంతో పూర్తయింది. తర్వాతి షెడ్యూల్కి కాస్త గ్యాప్ రావడంతో కుటుంబంతో కలిసి బుధవారం ఇటలీ వెకేషన్కు బయలుదేరారు రామ్చరణ్. దాదాపు వారంరోజుల పాటు ఈ ట్రిప్ని ΄్లాన్ చేసుకున్నారని సమాచారం. -
బిడ్డతో తొలిసారి ఫారిన్ టూర్కు చెర్రీ దంపతులు.. పెళ్లి కోసమేనా?
ఈ ఏడాది జూన్లో మెగా ఇంట్లో వారసురాలు అడుగుపెట్టారు. రామ్ చరణ్-ఉపాసన దంపతులకు పండంటి ఆడబిడ్డ జన్మించింది. దాదాపు 12 ఏళ్ల తర్వాత చెర్రీ- ఉప్సీ జంట బిడ్డకు స్వాగతం పలకడంతో మెగా ఫ్యామిలీలో పాటు ఫ్యాన్స్ పండుగ చేసుకున్నారు. తన ముద్దుల మనవరాలి పేరును క్లీంకారగా మెగాస్టార్ చిరంజీవి పరిచయం చేశారు. (ఇది చదవండి: అక్కినేని ఇంట తీవ్ర విషాదం..) అయితే క్లీంకార పుట్టిన తర్వాత రామ్ చరణ్-ఉపాసన సంతోషంలో మునిగిపోయారు. బిడ్డ పుట్టాక మొదటిసారి ఫారిన్ ట్రిప్కు బయలుదేరారు. తమ గారాల కూతురు క్లీంకారతో కలిసి విమానాశ్రయంలో కెమెరాల కంటికి చిక్కారు. తమ అభిమాన జంటను ఎయిర్పోర్ట్లో చూసిన ఫ్యాన్స్ మొబైల్స్ ద్వారా క్లిక్మనిపించారు. ప్రస్తుతం రామ్ చరణ్- ఉపాసన ఫోటోలు సోషల్ మీడియాలో తెగ వైరలవుతున్నాయి. ఆ ఫోటోల్లో రామ్ చరణ్ తన పెట్ రైమ్ను ఎత్తుకుని కనిపించగా.. క్లీంకారను ఉపాసన తన చేతుల్లో పట్టుకుని కనిపించింది. అయితే ఈ జంట ఇటలీ వేకేషన్కు వెళ్లినట్లు తెలుస్తోంది. సినిమాలకు కాస్తా విరామం లభించడంతో ట్రిప్ ప్లాన్ చేసినట్లు సమాచారం. అయితే ఇటీవలే మెగా ఇంట్లో వరుణ్ తేజ్ -లావణ్య త్రిపాఠిల ప్రీ వెడ్డింగ్ వేడుకలు జరిగాయి. ఈ వేడుకల్లో మెగా ఫ్యామిలీ అంతా పాల్గొన్నారు. వీరిద్దరి పెళ్లి వేడుక కూడా ఇటలీలోనే జరగనున్నట్లు గతంలో ఉపాసన చేసిన పోస్ట్లో వెల్లడించింది. అయితే వరుణ్- లావణ్య పెళ్లి కోసమే ఇటలీ వెళ్తున్నారా? లేదా వ్యక్తిగత ట్రిప్ కోసమా? అనేది తెలియాల్సి ఉంది. ఇక సినిమాల విషయానికొస్తే.. ప్రస్తుతం శంకర్ దర్శకత్వంలో గేమ్ ఛేంజర్ చిత్రంలో నటిస్తున్నారు. ఈ చిత్రంలో బాలీవుడ్ భామ కియారా అద్వానీ అతని జంటగా కనిపించనుంది. (ఇది చదవండి: ఓటీటీలో దూసుకెళ్తోన్న చిన్న సినిమా.. ఏకంగా టాప్-5లో!) Klinkara's Mom dad 😍 Megapowerstar #Ramcharan @upasanakonidela papped at airport off too family trip @AlwaysRamCharan pic.twitter.com/cHmwISRQ1H — ARTISTRYBUZZ (@ArtistryBuzz) October 18, 2023 Klinkara's Mom dad 😍 Megapowerstar #Ramcharan @upasanakonidela papped at airport off too family trip@AlwaysRamCharan pic.twitter.com/tO4QZwndIq — ARTISTRYBUZZ (@ArtistryBuzz) October 18, 2023 -
సీన్యో కాల్వీనో
ఇటాలో కాల్వీనో అనే పేరు వినగానే ఆయనో ఇటాలియన్ రచయిత అనిపించడం సహజమే. ఊహకు అందేట్టుగా ఇటాలియనే అయినా కాల్వీనో పుట్టింది క్యూబా రాజధాని హవానాలో. తమ దేశ మూలాలు మర్చిపోకూడదనే ఉద్దేశంతో తల్లి పెట్టిన ఈ పేరు ఆయనకు పెద్దయ్యాక మరీ జాతీయవాదపు పేరులా తోచింది. అయితే వాళ్ల కుటుంబం ఇటలీకి తిరిగి వచ్చాక, తన 20 ఏళ్ల వయసులో కాల్వీనో జాతీయవాద ఫాసిస్టు పార్టీ మీద పోరాడటం దానికి ఒక చిత్రమైన కొనసాగింపు. ఆ పోరాటంలో భాగంగా ఇటాలియన్ కమ్యూనిస్టు పార్టీ సభ్యుడయ్యాడు. కమ్యూనిస్టుగా బతికాడు. అనంతర కాలంలో ఆ పార్టీకి దూరమయ్యాడు. అప్పటికే ఆయన వాస్తవిక చిత్రణ మీద పార్టీ విమర్శించడం మొదలుపెట్టింది. ఇక హంగెరీ మీద సోవియట్ రష్యా దాడి(1956) తర్వాత పార్టీ మీది భ్రమలు పూర్తిగా చెదిరిపోయి రాజీనామా చేశాడు. మళ్లీ ఏ పార్టీలోనూ సభ్యుడు కాలేదు. జర్నలిస్టుగా ఉద్యోగం చేసుకుంటూ; కథలు, నవలలు రాసుకుంటూ; తనకు నచ్చిన రాతలను ప్రమోట్ చేసుకుంటూ, కథల మీద మాట్లాడుకుంటూ బతికాడు. ఆధునిక ఇటాలియన్ సాహిత్యంలో అత్యధికంగా అనువాదం అయిన రచయితగా ప్రసిద్ధి గడించిన ఇటాలో కాల్వీనో శతజయంతి (జననం: 1923 అక్టోబర్ 15) సంవత్సరం ఇది. ఇటాలో కాల్వీనో ప్రపంచంలో నిచ్చెన వేసుకుని చందమామ మీదికి ఒక్క గెంతులో ఎక్కేయొచ్చు. దాని పాలను లోడుకోవచ్చు. చేయాల్సిందల్లా పొక్కులుగట్టిన చందమామ ఉపరితలం మీదుండే పొలుసులను కొద్దిగా జరిపి అక్కడ గరిట పెట్టడమే. కాకపోతే ఆ మీగడ చిక్కదనపు పాలల్లో ‘ఎక్కువభాగం పండ్లు, కప్పల గుడ్లు, శిలాజిత్, అలచందలు, తేనె, పటికలుగా మారిన పిండి, సొరచేపల గుడ్లు, నాచు, పుప్పొడి, చిన్నచిన్న పురుగులు, చెట్ల జిగురు, మిరియాలు, ఖనిజ లవణాలు, బూడిద’ ఉంటాయి కాబట్టి వాటిని శుద్ధి చేసుకోవాల్సి ఉంటుంది (ద డిస్టన్ ్స ఆఫ్ ద మూన్ ). ఇంకా, కాల్వీనో లోకంలో చిన్న పిల్లను పోనివ్వడానికి జోర్డాన్ నది తన నీటిని కొద్దిగా వంచి దారి ఇస్తుంది. ఎందుకంటే ఆ నదికి ఇష్టమైన ఉంగరపు ఆకృతి కేకుల్ని ఆ పాప పెడతానంది కదా (ఫాల్స్ గ్రాండ్మదర్)! ఆయన సృజించిన నగరానికి ఎప్పటికీ దేనికీ కిందికి దిగే పనిలేదు. అది పొడవాటి ఫ్లెమింగో కాళ్ల మీద నిలబడి ఉంటుంది. అదొక్కటే నగరానికీ, భూమికీ సంబంధం (ది ఇన్విజిబుల్ సిటీ). వెంట వెంటనే కలుసుకుంటున్నట్టుగా వచ్చి, లేచి, విరిగిపడే అలల్లో ఒకదాన్నుంచి ఇంకోదాన్ని ఎలా విడదీయాలో తెలీక అదేపనిగా చూస్తుంటాడు ‘మిస్టర్ పాలొమార్’. విలువలు తలకిందులైన ప్రపంచంలో ఒక మనిషి నిజాయితీ కూడా ప్రపంచాన్ని అస్తవ్యస్తం చేయగలదు. అందరూ బుద్ధిగా దొంగతనం చేస్తున్నప్పుడు, ఆయన మాత్రం చేయనంటే ఎలా కుదురుతుంది? (ద బ్లాక్ షీప్). కాల్వీనో తల్లి ఇటలీలోని సార్డినీయా ద్వీపానికి చెందినవారు. ప్రపంచంలో శతాధిక వృద్ధులు ఎక్కువగా ఉండే ప్రాంతాల్లో ఇదీ ఒకటి. దీనికి భిన్నంగా కాల్వీనో అరవై ఏళ్లే బతికాడు(మరణం: 1985 సెప్టెంబర్ 19). ఆయన రచనల విషయంలో మాత్రం ఈ మాట అనలేము. ‘అవర్ యాన్సెస్టర్స్’ ట్రయాలజీ, ‘కాస్మికామిక్స్’ లాంటి పుస్తకాలను వెలువరించిన కాల్వీనో ప్రపంచంలో అన్నీ అసాధ్యాలే. కొన్నిసార్లు రాస్తున్నప్పుడు నాకు వెర్రెత్తుతుంది అంటాడాయన. ఒక నవలను మళ్లీ మళ్లీ చదవడానికి ఉపక్రమించే పాఠకుడి జీవితం కూడా ఆయనకు నవల అవుతుంది. దీన్ని అత్యంత పోస్ట్ మాడర్నిస్ట్ నవల అంటారు (ఇఫ్ ఆన్ ఎ వింటర్స్ నైట్ ఎ ట్రావెలర్). కానీ ఆయన రచనలు ఎంత ఆధునికమో అంత ప్రాచీనం. ఎంత ప్రాచీనమో అంత ఆధునికం. కొత్త పుంతలు తొక్కడం అనే మాట ఆయనకు బాగా వర్తిస్తుంది. ఇటాలియన్ జానపద గాథలను కూడా ఆయన ప్రచురించాడు. కాల్వీనో రచనా వ్యాసంగంలో ఇదొక ముఖ్యాంశం. ‘రాజకీయాల తర్వాత, సాహిత్యానికి రెండో స్థానం ఇవ్వడం అనే ఆలోచన పెద్ద తప్పు. ఎందుకంటే, రాజకీయాలు దాదాపుగా ఎన్నడూ తన ఆదర్శాలను సాధించలేవు. మరోపక్కన, సాహిత్యం దాని రంగంలో అది కొంతైనా సాధించగలదు, దీర్ఘకాలంలో కొంత ఆచరణాత్మక ప్రభావాన్ని కూడా కలిగించగలదు... ముఖ్యమైన విషయాలు నెమ్మదైన ప్రక్రియల ద్వారా మాత్రమే సాధించగలం’ అనే కాల్వీనో విదేశీ సంస్కృతులను గురించిన అవగాహన ఏ సంస్కృతికైనా కీలకం అనేవాడు. సొంత సృజన శక్తిని సజీవంగా ఉంచుకోవాలంటే విదేశీ ప్రభావాలకు సిద్ధంగా ఉండాలన్నాడు. ఇద్దరం కలుస్తున్నామంటే, భిన్న ప్రపంచాల్ని వెంట బెట్టుకుని వస్తాం; ఆ కలిసిన బిందువు నుంచి కొత్త కథ మొదలవుతుందంటాడు. ఒకరోజు– మనకు కవితలు, నవలలు రాసేలా కవికీ, రచయితకూ ప్రత్యామ్నాయం కాగలిగే సాంకేతిక పరిజ్ఞానం వస్తుందని 1967లోనే కాల్వీనో ఊహించిన విషయాన్ని ఛాట్ జీపీటీ నేపథ్యంలో పాత్రికేయుడు రాబెర్టో డి కారో గుర్తుచేసుకుంటారు. విదేశీ మాటలు, ప్రత్యేకించి ఆంగ్లపదం ‘ఫీడ్బ్యాక్’ మీద కాల్వీనో మోజు పడి, దాన్ని ఎలాగైనా ‘మిస్టర్ పొలొమార్’ ఆంగ్లానువాదంలో చేర్చాలని ఉబలాటపడ్డాడట. ‘సీన్యో(మిస్టర్ లాంటి ఒక గౌరవ వాచకం) కాల్వీనో! ఒక ఇటాలియన్ చెవికి ఆ పదం ఎంత అందంగా వినబడినా, ఆంగ్ల సాహిత్యంలో అదేమంత ఉచితంగా ఉండ’దని కాల్వీనో రచనలకు స్థిర అనువాదకుడిగా పనిచేసిన విలియమ్ వీవర్ తిరస్కరించాడట. అయితే, ఎంతటి కృత్రిమ మేధ వచ్చినా, చంద్రుడి పాలు మీగడలా చిక్కగా ఉంటాయని ఊహించిన కాల్వీనో మెదడును ఏ కంప్యూటరూ అందుకోలేదని మనం ఫీడ్బ్యాక్ ఇచ్చి ఆయన్ని ఆనందపరచొచ్చు! -
దెయ్యాల దీవి..అక్కడ నేల కింద ఏకంగా లక్షలకు పైగా
ఇదేదో హారర్ సినిమా పేరు కాదు. ఇటలీలో ఉన్న ఈ దీవి నిజంగానే దయ్యాల దీవిగా పేరు మోసింది. దాదాపు అర్ధశతాబ్దంగా ఇక్కడ నరమానవులెవరూ నివాసం ఉండటం లేదు. ఈ దీవిలోని నేల కింద 1.60 లక్షలకు పైగా శవాలు సమాధి అయి ఉన్నాయి. ఇటలీ ఉత్తర ప్రాంతంలో వెనిస్–లిడో నగరాల మధ్య ఉన్న ఈ దీవి పేరు పోవెగ్లియా. ప్రత్యేక అనుమతి ఉంటేనే తప్ప ఈ దీవిలో సందర్శకులెవరూ అడుగు పెట్టలేరు. ఒకప్పుడు ఈ దీవి మానసిక రోగుల చికిత్స స్థావరంగా ఉండేది. ఇక్కడి మానసిక చికిత్స కేంద్రంలో పనిచేసే ఒక డాక్టర్ రోగులపై క్రూరాతి క్రూరమైన ప్రయోగాలు చేసేవాడు. అప్పట్లో ఇక్కడ మరణించిన రోగులను ఇక్కడే పాతిపెట్టేశారు. ఇక్కడి మానసిక చికిత్స కేంద్రం 1968లో మూతబడిన తర్వాత ఈ దీవి పూర్తిగా ఖాళీ అయిపోయింది. మూతబడిన కొత్తలో కొందరు సాహసికులు ఈ దీవిలోకి వచ్చి, అంతా కలియదిరిగి వెళ్లిపోయేవారు. కొంతకాలానికి ఈ దీవిలోకి జనాల ప్రవేశాన్ని నిషేధించారు. ఇప్పటికీ ఈ నిషేధం అమలులో ఉంది. పరిశోధనల వంటి కారణాల కోసమైతే ప్రభుత్వం నుంచి ప్రత్యేక అనుమతి పొంది మాత్రమే ఇక్కడకు చేరుకోవాల్సి ఉంటుంది. ఇటీవల బ్రిటిష్ పరిశోధకులు మ్యాట్ నాడిన్, ఆండీ థామ్సన్ ఇటలీ ప్రభుత్వం నుంచి ప్రత్యేక అనుమతి పొంది, ఈ దీవిలోకి అడుగుపెట్టారు. శిథిలావస్థకు చేరుకున్న మానసిక రోగుల ఆస్పత్రి, చుట్టుపక్కల ఉన్న ఇతర శిథిల నిర్మాణాలు, చుట్టూ కీకారణ్యంలా పెరిగిన చెట్లు, మొక్కలు, కట్టడాల మధ్యలో మొలిచిన ఊడల మర్రిచెట్లు వంటివాటిని వీడియో తీసి తమ యూట్యూబ్ చానల్లో పెట్టడంతో ఈ దీవి కథ వైరల్గా మారింది. ఈ దీవిలో 1922లో మానసిక చికిత్స కేంద్రాన్ని ఏర్పాటు చేశారు. అంతకు ముందు 1793లో ఒకసారి, 1814లో మరోసారి ప్లేగు మహమ్మారి విజృంభించినప్పుడు ఈ దీవిని క్వారంటైన్ కేంద్రంగా నిర్వహించేవారు. ప్లేగుతో చనిపోయినవారిని, ఆ తర్వాత మానసిక చికిత్స కేంద్రంలో డాక్టర్ ప్రయోగాలకు ప్రాణాలు కోల్పోయినవారిని ఇక్కడి నేలలోనే పూడ్చిపెట్టేశారు. వారి ఆత్మలు ఇక్కడ సంచరిస్తుంటాయని ప్రచారం జరగడంతో ఇక్కడి మానసిక చికిత్స కేంద్రం మూతబడిన తర్వాత ఈ దీవి పూర్తిగా నిరుపయోగంగానే మిగిలిపోయింది. (చదవండి: బ్లాక్ యాపిల్ గురించి విన్నారా? ఒక్కొక్కటి ఏకంగా..) -
వరుణ్- లావణ్య పెళ్లి వేడుక.. వేదిక ఎక్కడో తెలుసా?
మెగా ఇంట్లో త్వరలోనే పెళ్లి భాజాలు మోగనున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే ఎంగేజ్మెంట్ చేసుకున్న వరుణ్ తేజ్- లావణ్య త్రిపాఠి ఈ ఏడాదిలోనే వివాహాబంధంతో ఒక్కటి కానున్నారు. ఇప్పటికే ప్రీ వెడ్డింగ్ సెలబ్రేషన్స్ మొదలవ్వుగా.. ఈ నెలలోనే పెళ్లి వేడుక జరగనున్నట్లు తెలుస్తోంది. శుక్రవారం మెగా ఇంట్లో జరిగిన ప్రీ వెడ్డింగ్ వేడుకకు సంబంధించిన ఫోటోలను మెగాస్టార్, ఉపాసన సోషల్ మీడియాలో పంచుకున్నారు. (ఇది చదవండి; మెగా ఇంట మొదలైన పెళ్లి సందడి.. చిరంజీవి ట్వీట్ వైరల్!) కాగా.. ఇప్పటికే నాగబాబు ఫ్యామిలీ పెళ్లి పనుల్లో బిజీగా ఉన్నట్లు తెలుస్తోంది. వీరిద్దరి పెళ్లి వేడుక కోసం అతిథులు, సన్నిహితుల ఆహ్వానాలు పంపేందుకు సన్నాహాలు చేస్తున్నట్లు సమాచారం. అయితే వరుణ్- లావణ్య పెళ్లి వేడుక ఇటలీలోని టుస్కానీ నగరంలో జరగనున్నట్లు తెలుస్తోంది. దీనికి సంబంధించిన ఉపాసన తన ఇన్స్టాలో ప్రస్తావించింది. ప్రీ వెడ్డింగ్ ఫోటోలు షేర్ చేస్తూ ఈ విషయాన్ని వెల్లడించింది. అయితే వీరి పెళ్లి తేదీపై ఇంకా ఎలాంటి ప్రకటన రాలేదు. ఈనెలలో జరుగుతుందా లేదా వచ్చేనెలలోనా అనే విషయంపై మరికొద్ది రోజుల్లో క్లారిటీ రానుంది. (ఇది చదవండి: కష్టాల్లో ఉన్నప్పుడు నా కన్నీళ్లు తుడిచాడు: ఇలియానా) View this post on Instagram A post shared by Upasana Kamineni Konidela (@upasanakaminenikonidela) -
అదే నిజమైతే బిలియనీర్కి ఏడేళ్ళు జైలు శిక్ష! వీడియోలో ఏముందంటే?
ఇటలీలో జరిగిన ఒక రోడ్డు ప్రమాదంలో ప్రముఖ బాలీవుడ్ నటి గాయత్రి జోషి, ఆమె భర్త వికాస్ ఒబెరాయ్ లంబోర్ఘిని కారు ప్రమాదంలో చిక్కుకుందని, ఈ సంఘటనలో వారు గాయపడగా, ఒక ఫెరారీ కారు మంటల్లో చిక్కుకుని అందులోని ఇద్దరు వ్యక్తులు ప్రాణాలు కోల్పోయారు. ప్రస్తుతం ఈ సంఘటన మీద విచారణ జరుగుతోంది. నివేదికల ప్రకారం, ఈ ప్రమాదంలో ఒబెరాయ్ దోషిగా తేలితే సుమారు ఏడు సంవత్సరాలు జైలు శిక్ష అనుభవించాల్సి ఉంటుందని చెబుతున్నారు. రియల్ ఎస్టేట్, హాస్పిటాలిటీ రంగంలో కోట్లు సంపాదిస్తున్న బిలియనీర్ వికాస్ ఒబెరాయ్ ప్రయాణిస్తున్న కారుని.. ఫెరారీ కారు క్రాష్ చేయడం వల్ల ఈ ప్రమాదం జరిగినట్లు వీడియోలో కనిపిస్తోంది. వీడియోలో గమనించినట్లయితే.. రోడ్డుపై అనేక సూపర్ కార్లు వెళ్తున్నాయి. ఈ సందర్భంగా ఒబెరాయ్ తన భార్యతో లంబోర్ఘిని కారులో ముందు వెళ్తున్న ఒక ట్రక్కుని ఓవర్టేక్ చేయడానికి వెళ్తాడు, అదే సమయంలో వెనుక వస్తున్న ఫెరారీ కారు లంబోర్ఘినిని ఓవర్టేక్ చేయడానికి వెళ్ళింది. ఈ సందర్భాల్లో ఈ ప్రమాదం జరిగింది. ఇదీ చదవండి: కోటీశ్వరుడైన నిరుపేద.. ఒకప్పుడు తిండికి తిప్పలు.. నేడు ఎంతోమందికి.. ఈ ప్రమాదంలో ఫెరారీ కారులోని ఇద్దరు స్విస్ వ్యక్తులు మరణించారు, కాగా ఒబెరాయ్ అతని భార్య గాయత్రి జోషి గాయాలపాలైనట్లు తెలుస్తోంది. ఈ సంఘటనలో ఒబెరాయ్ వేగవంతమైన ఫెరారీని గమనించకపోవడం వల్లే ఈ ప్రమాదం జరిగింది. ప్రస్తుతం వికాస్ ఒబెరాయ్పై అధికారులు విచారణ జరుపుతున్నారు. అయితే అసలు తప్పు ఎవరిది అనే ప్రశ్న తలెత్తుతోంది. మరిన్ని వివరాలు త్వరలోనే తెలుస్తాయి. Two deaths on a Ferrari in Sardina, Italy pic.twitter.com/skT3CaXg0T — Globe Clips (@globeclip) October 3, 2023 -
ఇటలీలో బ్రిడ్జిపై నుంచి పడిన బస్సు..
వెనీస్: ఇటలీలోని వెనీస్ నగర సమీపంలో మంగళవారం రాత్రి ఘోర ప్రమాదం సంభవించింది. బ్రిడ్జిపై నుంచి వెళ్తున్న బస్సు అదుపు తప్పి, 50 అడుగుల ఎత్తు నుంచి కిందకు పడిపోయింది. అనంతరం బస్సులో మంటలు చెలరేగడంతో 21 మంది ప్రయాణికులు మరణించారు. మరో 15 మంది గాయపడ్డారు. వీరిలో 9 మంది ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉంది. బాధితుల్లో ఎక్కువ మంది విదేశీ పర్యాటకులే. మృతుల్లో ఇద్దరు చిన్నారులు ఉన్నట్లు అధికారులు చెప్పారు. ప్రమాదం గురించి తెలిసిన వెంటనే అగ్నిమాపక సిబ్బంది రంగంలోకి దిగారు. మంటలు ఆర్పేశారు. సహాయక చర్యలు ప్రారంభించారు. బస్సు ప్రమాదంలో 21 మంది మృతిచెందడం పట్ల వెనీస్ సిటీ మేయర్ బ్రుగ్నారో సంతాపం ప్రకటించారు. -
విషాదం: బిలియనీర్ వికాస్, నటి గాయత్రి లగ్జరీ కార్ క్రాష్, వీడియో వైరల్
బాలీవుడ్ మూవీ 'స్వదేశ్' లో షారుఖ్ ఖాన్తో కలిసి నటించిన యాక్టర్ గాయత్రి జోషి ప్రయాణిస్తున్న లగ్జరీ కారు ప్రమాదానికి గురైంది. గాయత్రితోపాటు, భర్త, వ్యాపారవేత్త వికాస్ ఒబెరాయ్ తృటిలో ఈ ప్రమాదంనుంచి తప్పించుకున్నారు. అయితే మరో ఇద్దరు ప్రాణాలు కోల్పోవడం విషాదాన్ని నింపింది. ఇటలీలో విహార యాత్రలో ఉండగా ఈ ప్రమాదం చోటు చేసుకుంది. సార్డినియా సూపర్కార్ ఎక్స్పీరియన్స్ సమయంలో జరిగిన ఘోర ప్రమాదానికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరలవుతోంది. ఈ ప్రమాదం జరిగినప్పుడు గాయత్రి ప్రయాణిస్తున్న లంబోర్ఘిని కారు మరో లగ్జరీ కారు ఫెరారీని, క్యాంపర్ వ్యాన్ని ఢీకొట్టింది. లంబోర్ఘిని ,ఫెరారీతో సహా ఇతర లగ్జరీ వాహనాలతో పాటు, మినీ ట్రక్కును ఓవర్టేక్ చేయడానికి ప్రయత్నించినప్పుడు ఇది జరిగింది. దీంతో ఫెరారీ కారులో ఉన్న స్విట్జర్లాండ్కు జంట ప్రాణాలు కోల్పోయారు. మీడియా నివేదికల ప్రకారం, ఫెరారీలో మంటలు చెలరేగడంతో మెలిస్సా క్రౌట్లీ(63) మార్కస్ క్రౌట్లీ, 67 అక్కడి క్కడే ప్రాణాలొదిలారు. వికాస్ ఒబెరాయ్ మేనేజర్ ప్రకారం గాయత్రి, వికాస్ జంట ప్రమాదం నుంచి స్వల్ప గాయాలతో తప్పించుకున్నారు. కాగా మహారాష్ట్రలోని నాగ్పూర్లో జన్మించిన గాయత్రీ జోషి వీడియో జాకీగా తన కెరీర్ను ప్రారంభించింది. అడ్వర్టైజింగ్ మోడల్గా కూడా పనిచేసింది. హన్స్ రాజ్ హన్స్ 'ఝంజరియా, జగ్జిత్ సింగ్ 'కాఘజ్ కి కష్టి'తో సహా అనేక మ్యూజిక్ వీడియోలలో కనిపించింది. ఆ తర్వాత ఫెమినా ఇండియా అందాల పోటీల్లో విజేతగా నిలవాలనే లక్ష్యంతో 2000లో ఫెమినా మిస్ ఇండియా ఇంటర్నేషనల్ టైటిల్ గెలుచుకుంది. అలాగే మిస్ ఇంటర్నేషనల్ 2000లో భారతదేశానికి ప్రాతినిధ్యం వహించింది. ఇక సినిమాల విషయానికి వస్తే 2004లో అశుతోష్ గోవారికర్ దర్శకత్వంలో వచ్చిన మూవీ 'స్వేడ్స్'లో నటించింది. 2005లో వ్యాపారవేత్త వికాస్ ఒబెరాయ్ని పెళ్లాడి సినిమాలకు గుడ్బై చెప్పింది. వీరికి ఇద్దరు పిల్లలు. వికాస్ ఒబెరాయ్: టాప్ ముంబై రియల్టర్, ఒబెరాయ్ రియల్టీ ఎండీ వికాస్ ఒబెరాయ్. ఫోర్బ్స్ అతని నికర విలువ 3.8 బిలియన్లు డాలర్లుగా అంచనా వేసింది. Two deaths on a Ferrari in Sardina, Italy pic.twitter.com/skT3CaXg0T — Globe Clips (@globeclip) October 3, 2023 -
ఇటలీలో ఆటాపాటా
గోపీచంద్ ఇటలీకి మకాం మార్చారు. శ్రీనువైట్ల దర్శకత్వంలో గోపీచంద్ హీరోగా ఓ సినిమా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. చిత్రాలయం స్టూడియోస్ పతాకంపై వేణు దోనెపూడి ఈ సినిమాను నిర్మిస్తున్నారు. ఆదివారం (సెప్టెంబరు 24) శ్రీనువైట్ల బర్త్ డే. ఈ సందర్భంగా ఇటలీలో శ్రీనువైట్ల అండ్ టీమ్ లొకేషన్స్ను ఫైనలైజ్ చేస్తున్న వీడియోను చిత్రయూనిట్ విడుదల చేసింది. నేటి నుంచి ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ సౌత్ ఇటలీలోని మాంటెరా లొకేషన్స్లో ప్రారంభం కానుంది. మేజర్ షూటింగ్ను విదేశాల్లోనే కంప్లీట్ చేస్తారట చిత్రయూనిట్. గోపీచంద్పై ముందుగా ఓ యాక్షన్ సీన్ను ప్లాన్ చేశారట శ్రీనువైట్ల. ఆ తర్వాత ఓ పాటని కూడా చిత్రీకరించనున్నారని భోగట్టా. ఈ చిత్రంలో కావ్యాథాపర్ హీరోయిన్గా నటిస్తారనే ప్రచారం సాగుతోంది. వచ్చే ఏడాది ఈ సినిమా విడుదల కానుంది. -
ఈ దారి.. వేల ఏళ్ల రహదారి.. యూరప్ మొట్టమొదటి సూపర్ హైవే
సాక్షి, ఏపీ సెంట్రల్ డెస్క్: ఈ రోడ్డును చూశారా.. స్ట్రెయిట్గా భలే ఉంది కదా! చూస్తుంటే ఇదేదో పాత రోడ్డు అని కూడా అనిపిస్తోంది కదా.. నిజమే ఈ రోడ్డుకు రెండు వేల ఏళ్లకుపైగా చరిత్ర ఉంది. క్రీస్తు పూర్వం 312లో ఈ రోడ్డును అప్పటి రోమన్ సామ్రాజ్య అధినేతలు నిర్మించారు. ఇటలీ ఆగ్నేయ ప్రాంతం బ్రిండిసీ నుంచి 400 మైళ్ల దూరంలోని ప్రధాన నగరం రోమ్ను కలుపుతూ నిర్మించిన రోడ్డు ఇది. అప్పియన్ వేగా పిలిచే ఈ రోడ్డును రాజనీతిజ్ఞుడు అప్పియస్ క్లాడియస్ సీజస్ పేరుపై నిర్మించారు. దక్షిణ ఇటలీని వశం చేసుకోవడం కోసం మిలిటరీని తరలించడానికి, అలాగే గ్రీస్, ఈజిప్టుకు నౌకాయానం కోసం అప్పటి రోమ్ పాలకులు దీనిని నిర్మించారని చరిత్రకారులు చెబుతున్నారు. దీనిని యూరప్ మొట్టమొదటి సూపర్ హైవేగా కూడా చెబుతారు. చదవండి: జపాన్లో టీచర్స్ డే ఎలా జరుపుకుంటారో తెలుసా! -
ఆ నెలలోనే వరుణ్- లావణ్య పెళ్లి.. అతిథుల లిస్ట్లో టాలీవుడ్ జంట!
మెగా ఫ్యాన్స్ ఎంతో ఆసక్తిగా ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న వేడుక మెగా హీరో వరుణ్ తేజ్ పెళ్లి. ఇప్పటికే పెళ్లి తేదీపై చాలా ఇంటర్వ్యూల్లో వరుణ్పై ప్రశ్నల వర్షం కురుస్తోంది. పెళ్లి తేదీ ఇంకెప్పుడు ప్రకటిస్తారంటూ ఫ్యాన్స్లో ఆసక్తి నెలకొంది. ఇప్పటికే మెగా ఫ్యామిలీ పెళ్లి పనుల్లో బిజీగా ఉన్నట్లు తెలుస్తోంది. అయితే పెళ్లి తేదీని అమ్మ నిర్ణయిస్తుందని ఇటీవల ఓ ఇంటరాక్షన్ సందర్భంగా వరుణ్ తేజ్ వెల్లడించారు. ప్రస్తుత పరిస్థితులు చూస్తుంటే ఈ ఏడాది నవంబర్ నెలలో వరుణ్-లావణ్య వివాహాం జరిగేలా కనిపిస్తోంది. (ఇది చదవండి: మెగా ఇంట్లో పెళ్లి సందడి.. వరుణ్ తేజ్ ఆసక్తికర కామెంట్స్!) అయితే ఇప్పుడు వేదికతో పాటు ఈ పెళ్లికి హాజరయ్యే ప్రముఖుల ఎవరనే అంశంపై చర్చ నడుస్తోంది. వరుణ్, లావణ్యకు ఇండస్ట్రీలో ప్రముఖ నటీనటులు, స్నేహితులు చాలామందే ఉన్నారు. అయితే వీరి పెళ్లి ఇటలీలో జరుగుతుందని ఇప్పటికే ఊహగానాలు వినిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో ముఖ్య అతిథుల లిస్ట్లో హీరో నితిన్, ఆయన భార్య షాలిని కూడా ఉన్నట్లు సమాచారం. ఈ పెళ్లిలో అల్లు అర్జున్, సాయి ధరమ్ తేజ్తో పాటు ఇతర నటీనటులు సందడి చేయడం ఖాయంగా కనిపిస్తోంది. ఇప్పటికే ప్రముఖుల గెస్ట్ లిస్ట్ గురించి మరిన్నీ ఊహాగానాలు వస్తున్నాయి. అయితే ఇప్పటికే మెగా ఫ్యామిలీ పెళ్లి వేదికతో పాటు తేదీ కూడా లాక్ చేసినట్లు తెలుస్తోంది. వరుణ్ పెళ్లికి సంబంధించి సన్నాహాలు మొదలు పెట్టినట్లు సమాచారం. కాగా.. వరుణ్ తేజ్, లావణ్య త్రిపాఠి టాలీవుడ్లో మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. జూన్ 9న నాగబాబు తనయుడు వరుణ్ తేజ్ ఎంగేజ్మెంట్ జరిగిన సంగతి తెలిసిందే. గత కొన్నేళ్లుగా లవ్ చేస్తున్న హీరోయిన్ లావణ్య త్రిపాఠితో అత్యంత సన్నిహితుల సమక్షంలో ఉంగరాలు మార్చుకున్నారు. (ఇది చదవండి: లావణ్యకు కాల్ చేయను.. ఎందుకంటే.. వరుణ్ తేజ్ క్రేజీ ఆన్సర్! ) -
పర్యాటకుల రెస్టారెంట్ బిల్లు కట్టిన ఇటలీ ప్రభుత్వం
రోమ్: ఇటలీకి చెందిన ముగ్గురు పర్యాటకులు పొరుగుదేశం ఆల్బేనియాకు వెళ్లారు. అక్కడ రెస్టారెంట్లో తిని బిల్లు కట్టకుండా చెక్కేశారు. ఇటలీ ప్రధాని మెలోనీ ఇటీవల కుటుంబంతో కలిసి ఆల్బేనియాలో పర్యటనకు వెళ్లారు. ఈ సందర్భంగా అల్బేనియా ప్రధాని ఈడి రమా ఈ విషయాన్ని ప్రస్తావించారు. దీనిని మెలోనీ తీవ్ర అవమానంగా భావించారు. దేశం పరువు తీశారంటూ తమ దేశస్తులపై మండిపడ్డారు. ‘వెళ్లి ఆ నలుగురు ఇడియట్స్ బిల్లు కట్టండి’అంటూ అక్కడి తమ దౌత్యాధికారులను ఆదేశించారు. వారు వెళ్లి రూ.7,245 బిల్లును సదరు రెస్టారెంట్ నిర్వాహకులకు చెల్లించి వచ్చారు. నిబంధనలు, సంప్రదాయాలను పాటించాలని, ఇటువంటివి మరోసారి జరక్కుండా జాగ్రత్తపడాలని తమ దేశస్తులకు ఇటలీ ఎంబసీ సూచించింది. కొందరు వ్యక్తులు బిల్లు చెల్లించకుండానే రెస్టారెంట్ నుంచి వెళ్లిపోతున్నట్లుగా సదరు రెస్టారెంట్ విడుదల చేసిన వీడియో ప్రస్తుతం సామాజిక మాధ్యమాల్లో తెగ వైరల్ అవుతోంది. దీనిపై రెస్టారెంట్ యజమాని మాట్లాడుతూ.. ఫుడ్ ఐటమ్స్ ఎంతో బాగున్నాయంటూ సదరు నలుగురు ఇటాలియన్లు తమను మెచ్చుకున్నారని కూడా తెలపడం విశేషం. -
మనుషులు వదిలేసిన దీవి
ఇది ఇటలీలోని పోవెలియా దీవి. పైనుంచి చూస్తే రెండు జంటదీవుల్లా కనిపిస్తుంది గాని, నిజానికి ఇది ఒకటే దీవి. ఒక సన్నని కాలువ ఈ దీవిని రెండు భాగాలుగా విభజిస్తుంది. ఒకప్పుడు ఇక్కడ మనుషులు ఉండేవారు. క్రీస్తుశకం నాలుగో శతాబ్ది నాటికే ఇక్కడ మనుషులు ఉండేవారనేందుకు చారిత్రక ఆధారాలు ఉన్నాయి. పద్నాలుగో శతాబ్దిలో యుద్ధం జరిగినప్పడు ఇక్కడి ప్రజలు దీవిని విడిచిపెట్టి పారిపోయారు. తర్వాత చాలాకాలానికి 1776లో మళ్లీ మనుషులు ఇక్కడ నివాసాలు ఏర్పరచుకుని, దాదాపు శతాబ్దానికి పైగా ఉన్నారు. దుష్టశక్తులు ఉన్నాయనే భయంతో ఈ దీవిని జనాలు ఖాళీ చేసేశారు. అయితే, ఇటలీ ప్రభుత్వం ఈ దీవిని క్వారంటైన్ సెంటర్గా వాడుకుంది. ప్లేగు, కలరా వంటి మహమ్మారి వ్యాధులు సోకిన వారిని ఇక్కడకు తరలించి చికిత్సలు చేయించేది. ఇక్కడొక మానసిక చికిత్స కేంద్రం కూడా ఏర్పాటు చేసింది. మానసిక చికిత్స కేంద్రం 1968లో మూతబడటంతో ఈ దీవి పూర్తిగా ఖాళీ అయిపోయింది. (చదవండి: గడ్డి కోస్తుండగా ఆకాశం నుంచి పాము..దాన్ని అటాక్ చేస్తూ గద్ద..రెండూ..) -
శాండ్విచ్ కట్ చేసి, తినేలోపు ఊహించని షాక్.. ఈ రెస్టారెంట్కి వెళ్లకూడదు బాబోయ్!
సాధారణంగా రెస్టారెంట్లో తిన్నాక ఆర్డర్ చేసిన ఆహారం, జీఎస్టీ లాంటివి బిల్లో చూస్తాం. ఏ హాటల్కి వెళ్లినా ఇదే కనిపిస్తుంది. అయితే ఓ రెస్టారెంట్ మాత్రం వీటికి భిన్నంగా కస్టమర్లతో నడుచుకుంటోంది. అందులో మనం తిన్న ఆహారంతో పాటు, సర్వీసింగ్ మాత్రమే కాదు ప్లేట్స్కు కూడా బిల్ వేస్తున్నారు. ఈ వింత అనుభవాన్ని ఓ కస్టమర్ సోషల్ మీడియాలో నెటిజన్లతో పంచుకోగా.. ప్రస్తుతం అది వైరల్గా మారింది. రెండు పీసులకే ఇటలీలో విహార యాత్ర ఎంజాయ్ చేస్తున్న ఓ బ్రిటీష్ టూరిస్ట్ ప్రముఖ పర్యాటక ప్రాంతమైన లేక్ కోమో సమీపంలో ఉన్న ఓ రెస్టారెంట్కు తన స్నేహితుడితో కలిసి వెళ్లాడు. వెయిటర్ రాగానే శాండ్ విచ్ను ఆర్డర్ చేశాడు. అది వచ్చాక రెండు ముక్కలుగా కట్ చేసి వారిద్దరికి ఇవ్వాలని కోరాడు. తినడం పూర్తయ్యాక వెయిటర్ తీసుకువచ్చిన బిల్ చూసి ఆ టూరిస్ట్ ఒక్కసారిగా షాక్కు గురయ్యాడు. శాండ్ విచ్ను రెండు పీసులుగా చేసినందుకు కూడా బిల్లో చార్జీ విధించడంపై అవాక్కయ్యాడు. శాండ్ విచ్ అసలు ఖరీదు 7.50 యూరోలు కాగా కట్ చేసినందుకు 2 యూరోలు (భారత ప్రకారం రూ.180) విధించారు. సదరు కస్టమర్ రెస్టారెంట్ మేనేజర్తో వాదించకుండా బిల్ చెల్లించినప్పటికీ, అతను ట్రిప్ అడ్వైజర్లో నెగిటివ్ రివ్యూస్ ఇవ్వడంతో పాటు ఆ బిల్లు స్క్రీన్షాట్ను పోస్ట్ చేశాడు. విసుగు చెందిన కస్టమర్ రివ్యూల సైట్లో రెస్టారెంట్కు ఒక స్టార్ మాత్రమే ఇచ్చాడు. అనంతరం ఈ విషయాన్ని నెట్టింట షేర్ చేశాడు. దీని చూసిన నెటిజన్లు.. ఇలాంటి రెస్టారెంట్లకు వెళ్లకూడదని, యాజమాన్యంపై మండిపడుతూ కామెంట్లు పెడుతున్నారు. ఇదిలా ఉండగా.. రెస్టారెంట్ యజామాన్యం మాత్రం తమ చర్యను సమర్థించుకుంది. దీనిపై స్పందిస్తూ.. ‘రెండు పీసులుగా చేయడం వల్ల వాటికి రెండు ప్లేట్లు వాడాలి. ఈ క్రమంలో రెండు ప్లేట్లు కడుక్కోవాలి. ఇందుకు పట్టే సమయం, శ్రమకు ఆ మాత్రం చార్జీ అవుతుంది’’ అని తెలిపింది. -
ఆ దేశం పీతలను అంతం చేసేందుకు ఏకంగా రూ. 26 కోట్లు..!
ప్రతి దేశం తన బడ్జెట్ ప్రకారం ఆయా రంగాల అభివృద్ధికి కొంత కేటాయించడం కామన్. అన్ని దేశాల్లోనూ జరిగేదే. కానీ కేవలం ఒక సీ ఫుడ్ కోసం కోట్లు కేటాయించడం విన్నారా!. అది కూడా పీతలను తొలగించేందుకు దాదాపు 26 కోట్లు కేటాయించాలని ఇటలీ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఏంటీ వింత నిర్ణయం అనిపిస్తుంది కదా!. అసలు ఎందుకు ఇటలీ ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. వాటి కోసం ప్రత్యేకంగా అంత డబ్బు ఎందుకంటే.. అసలేం జరిగిందంటే..ఇటలీలో నీలిరంగు పీతలు విపరీతంగా పెరిగిపోతున్నాయి. ఎంతలా అంటే ప్రఖ్యాతి గాంచిన నత్తల జాతిని అంతం చేసేలా పెరిగిపోతున్నాయి. నిజానికి ఈ నీలరంగు పీతను పశ్చిమ అట్లాంటిక్కు చెందినవి. తొలినాళ్లలో ఒకటో రెండు నీలి పీతలను గుర్తించారు ఇటలీ వాసులు. ఆ తర్వాత క్రమంగా వాటి సంఖ్య పెరిగిపోవడమే గాక వాటి కారణంగా నత్తలు మాయం అవ్వుతున్నాయి. దీంతో పాటు షెల్ఫిష్, ఫిఫ్ రో వంటి ఇతర జలచరాలు చనిపోవడం జరిగింది. ఇటలీ వాసులు మొలస్కా జాతికి చెందిన నత్తలను బాగా తింటారు. అందుకు సంబంధించి ఆక్వా కల్చర్ ఇటలీలో బాగా ప్రఖ్యాతి గాంచింది. అలాంటి ఆక్వాకల్చర్ ఇప్పుడు ఈ నీలిపీతల కారణంగా చాల నష్టాలను చవి చూస్తోంది. ఈ నీలిపీతలు సముద్ర జాతికి చెందని కొన్ని మొక్కలు, ఇతర జలచర జంతువులను తినేస్తున్నట్లు అధికారులు గుర్తించారు. ఉత్తర ఇటలీలో ఉన్న పో రివర్ వ్యాలీ డెల్టాలో ఉన్న ఆక్వాఫార్మ్లు దారుణంగా దెబ్బతిన్నాయి. సముద్ర జీవశాస్త్రవేత్తలు ఈ నీలి పీతలు ఈ ప్రాంతంలో ఉండే నత్తలను దాదాపు 90% వరకు తినేసినట్లు పేర్కొన్నారు. దీంతో ఇటలీ ప్రభుత్వం ఆ నీలిపీతల ఉధృతికి అడ్డుకట్ట వేయాలని నిర్ణయించుకుంది. ఈ మేరకు ఇటాలియన్ వ్యవసాయం మంత్రి ఫ్రాన్సిస్కో లోలోబ్రిగిడా పో నది డెల్టాను సందర్శించిన తదనంతరమే ఈ పీతల నిర్మూలన కోసం నిధులు కేటాయిస్తున్నట్లు ప్రకటించారు. పెద్ద ఎత్తున ఆ పీతలను వేటాడి అంతం చేయాలని ఆదేశాలు జారీ చేశారు. మత్స్యకారులు వీలైనంత ఎక్కువ పీతలను పట్టి వాటిని చంపేయాలని సూచించారు. అందుకు కోసం దాదాపు రూ. 26,51,00,000 కోట్లు కేటాయిస్తున్నట్లు వెల్లడించారు. వీలైనంత తర్విత గతిన ఈ నీలిపీతల సంఖ్యను తగ్గించకపోతే పరిస్థితి తీవ్రమై పర్యావరణ ప్రభావాలకు లోనవ్వాల్సి వస్తుందని నిపుణులు హెచ్చరించారు. అంతేగాదు యూఎన్ ఫుడ్ అండ్ అగ్రికల్చర్ ఆర్గనైజేషన్ ప్రకారం, చైనా, దక్షిణ కొరియా తర్వాత ఇటలీనే ఎక్కువగా నత్తలను పెంచే మూడొవ అతిపెద్ద ఉత్పత్తిదారు. (చదవండి: ఇష్టం అంటే మరీ ఇలానా! ఈ 'స్ట్రేంజ్ అడిక్షన్' వింటే షాకవ్వాల్సిందే!) -
పడవ బోల్తా.. 41 మంది మృతి..
మధ్యదరా సముద్రంలో జరిగిన పడవ ప్రమాదంలో దాదాపు 41 మంది వలసదారులు మరణించారు. అన్సా న్యూస్ ఏజెన్సీ బుధవారం ప్రకటించింది. ఇటలీకి చెందిన లాంపెడుసా ద్వీపానికి ముగ్గురు పిల్లలతో సహా నలుగురు వ్యక్తులు తీరానికి ప్రాణాలతో చేరారు. అనంతరం పడవ ప్రమాదం వెలుగులోకి వచ్చింది. 45 మందితో ప్రయాణించిన పడవ.. మధ్యదరా సముద్రంలో ప్రమాదానికి గురైంది. ఈ ఘటనలో అందరూ మరణించారు. కేవలం నలుగురు మాత్రమే ప్రాణాలతో ఒడ్డుకు చేరారని న్యూస్ ఏజెన్సీ వెల్లడించింది. సంక్షోభంతో నిండిపోయిన ట్యూనీషియా నుంచి 45 మందితో పడవ ప్రయాణించినట్లు తెలుస్తోంది. పడవ మొదలైన కొన్ని గంటల్లోనే ప్రమాదానికి గురైనట్లు సమాచారం. ప్రాణాలతో బయటపడిన వ్యక్తులు ఆ భయానక దృశ్యాల గురించి తెలిపారు. ఇదీ చదవండి: 'ఇంత భయంకరమైన జైలులో ఉండలేను..' -
స్మార్ట్ఫోనే కొంపముంచిందా? పాపులర్ పబ్లిషింగ్ హౌస్ సీఈవో దుర్మరణం
Bloomsbury US CEO Adrienne Vaughan: హ్యారీ పోటర్ బ్లూమ్స్బరీ అమెరికా పబ్లిషింగ్ హౌస్ సీఈవో అడ్రియన్ వాఘన్ (45) దుర్మరణం విషాదాన్ని నింపింది. ఇటలీలోని అమాల్ఫీ తీరంలో జరిగిన ఘోర బోటింగ్ ప్రమాదంలో ఆమె ప్రాణాలు కోల్పోయారు. ఈ ప్రమాదంపై బ్లూమ్స్బరీ అమెరికా తీవ్ర విచారాన్ని ప్రకటించింది. అడ్రియన్ అకాల మరణం తమకు తీరని లోటని వ్యాఖానించింది. ఆమె నేతృత్వంలోనే అమెరికా తమకు అతిపెద్ద మార్కెట్గా ఎదిగిందని తెలిపింది. సీఎన్ఎన్ ప్రకారం తన భర్త,ఇద్దరు పిల్లలతో విహార యాత్రంలోఉండగా ఈ విషాదం చోటు చేసుకుంది. అద్దెకు తీసుకున్న స్పీడ్బోట్లో ప్రయాణిస్తుండగా, 80 మంది పర్యాటకులతో ప్రయాణిస్తున్న పెద్ద సెయిలింగ్ బోట్ను ఢీకొట్టింది. దీంతో వాఘన్ నీటిలో పడిపోవడంతో, తీవ్ర గాయాల పాలయ్యారు. అత్యవసర సిబ్బంది వచ్చి ఆమెను రక్షించే ప్రయత్నం చేసినప్పటికీ, అప్పటికే మరణించినట్లు ప్రకటించారు.వాఘన్ భర్త మైక్ వైట్కు స్వల్పగాయాలయ్యాయి.వారి ఇద్దరు పిల్లలు లియన్నా (14) మేసన్(11) కు ఎలాంటి గాయాలు కానప్పటికీ, తల్లి మరణంవారిని తీవ్రంగా కలిచి వేసింది. మరోవైపు బోట్ స్కిప్పర్ ఎలియో పెర్సికోపై వాఘన్ భర్త తీవ్ర ఆరోపణలు గుప్పించారు. మద్యం సేవించడంతోపాటు, స్మార్ట్ఫోన్ వాడుతూనే ఉన్నాడంటూ ఆవేదన వ్యక్తం చేశారు. దీంతో సలెర్నోలోని ఇటాలియన్ ప్రాసిక్యూటర్లు దర్యాప్తు ప్రారంభించారు. అటు అనుమానితుడుమద్యం సేవించి, కొకైన్ వాడినట్లు టాక్సికాలజీ పరీక్షలు నిర్ధారించాయి. కాగా 2021లో బ్లూమ్స్బరీ అమెరికాకు హెడ్గా నిమిమితులైన వాఘన్ 2020లో అమెరికాలో హ్యారీ పాటర్ పుస్తకాలను ప్రచురించే సంస్థలో ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్, సీవోవోగా చేరారు. ఫైనాన్స్లో ఎంబీఏతోపాటు NYU స్టెర్న్ స్కూల్ ఆఫ్ బిజినెస్లో గ్రాడ్యుయేట్ అయిన వాఘన్ గతంలో డిస్నీ పబ్లిషింగ్ గ్రూప్, ఆక్స్ఫర్డ్ ఫ్రీ ప్రెస్కి ఎగ్జిక్యూటివ్గా పనిచేశారు. వాఘన్ నెట్వర్త్ దాదాపు 1 మిలియన్ డాలర్లు ఉంటుందని అంచనా. -
ఇటలీ తీరంలో పడవ బోల్తా.. ఇద్దరి మృతి
మిలాన్: ఇటలీ సముద్ర తీరానికి సమీపంలో రెండు పడవలు నీటమునిగాయి. రెండు పడవల్లో ఒకదాంట్లో 48 మంది మరో దాంట్లో 42 మంది వలసదారులు ప్రయాణిస్తున్నారని వారిలో 57 మందిని కాపాడిన ఇటలీ తీరప్రాంత రక్షణ దళాలు ఓ తల్లీ బిడ్డలను మాత్రం కాపాడలేకపోయామని గల్లంతైన మరో 30 మంది ఆచూకీ కోసం గాలిస్తున్నామని ఇటలీ కోస్ట్ గార్డులు తెలిపారు. వయా ట్యునీషియా.. స్ఫాక్స్ బీచ్ తీరంలో గత వారం 10 మృతదేహాలను కనుగొన్నామని ట్యునీషియా పోర్టు గుండా ఇటలీకి చేరుకోవడం సులభం కాబట్టి అక్రమ వలసదారులు ఈ మార్గాన్ని ఎంచుకున్నట్లు చెబుతున్నారు స్ఫాక్స్ అధికారులు. తాజాగా ఈ రెండు పడవలు కూడా ట్యునీషియా పోర్టు నుండే ఇటలీ వైపుగా వచ్చాయని అవి లంపెడుసా ద్వీపం దాటగానే ఉరుములు మెరుపులతో సముద్రంలో అలజడి రేగడంతో అలల తాకిడికి అందులో ప్రయాణిస్తున్న 90 మంది వలసదారులతో సహా పడవలు బోల్తా పడ్డాయన్నారు. కోస్ట్ గార్డుల సాహసం.. ప్రమాదం గురించి సమాచారం అందిన వెంటనే ఇటలీ తీర రక్షణ దళాలు హుటాహుటిన స్పందించి 57 మందిని రక్షించగలిగామని తెలిపారు స్ఫాక్స్ అధికారులు. కానీ ప్రమాదంలో ఓ తల్లీ బిడ్డలను మాత్రం కాపాడలేకపోయామని. వారి మృతదేహాలు మాత్రం లభ్యమయ్యాయని తెలిపారు. పడవలోని మిగిలిన 30 మంది గల్లంతు కాగా వారి కోసం గాలింపు చర్యలు కొనసాగుతున్నాయని అన్నారు. ఇలా అయితే ఎలా? ఈ రెండు పడవల్లోని వలసదారులు సహారా-ఆఫ్రికా దేశాలకు చెందిన వారే అయి ఉంటారని, ఎంతగా ప్రయత్నించినా ఆఫ్రికా దేశాల నుండి ఈ అక్రమ వలసలకు అడ్డుకట్ట వేయలేకున్నామని తెలిపారు ఇటలీ వలసల విచారణాధికారి ఇమ్మానుయేల్ రిసిఫారీ. వారాంతా మెరుగైన జీవితం కోసమే ఇటు వస్తున్నారు. అదేదో చట్టబద్దంగా వస్తే బాగుంటుంది కానీ దొడ్డిదారిన రావడం వల్లనే ఇలా ప్రమాదాల బారిన పడుతున్నారని అన్నారు. డిమాండ్ ఎక్కువ.. ఎందరో వలసదారులు చనిపోతున్నారని సముద్రంలో ప్రమాదాలను నివారించడానికి నౌకలను ఏర్పాటు చేయడం కూడా అక్రమ వలసలను ప్రోత్సహిస్తున్నట్లే ఉంది. పొరుగు దేశానికి వలసలంటే భయపడేవారు కూడా ధైర్యంగా అడుగేసి ఇటు వైపుగా కదులుతున్నారు. గతేడాదితో పోలిస్తే ఈ ఏడాది ఈ అక్రమ వలసలు రెట్టింపయ్యాయి. 2022లో 42,600 మంది వలస వచ్చినట్లు రికార్డుల్లో నమోదు కాగా ఈ ఏడాది మాత్రం 92,000 మందికిపైగా వలస వచ్చినట్లు రికార్డులు చెబుతున్నాయి. Migrants rescued from rough seas off Italy. Reports say dozens could still be missing at sea, while more stranded migrants were airlifted from rocks on the island of Lampedusa. Read more: https://t.co/cJMUPoyyWL pic.twitter.com/lbXo28Rbrd — Sky News (@SkyNews) August 7, 2023 ఇది కూడా చదవండి: మొరాకోలో ఘోర రోడ్డు ప్రమాదం.. 24 మంది మృతి.. -
చీర అందమే అందం! ఇటలీ వాసులనే ఫిదా చేసింది!
విదేశాల్లో ఉంటే కచ్చితంగా ఏ దేశస్తులైనా అక్కడి ఆహార్యానికి తగ్గట్టుగా ఉంటాం. మన సంప్రదాయాలకు సంబంధించిన దుస్తులు పర్సనల్గానే వాడతాం గానీ. అంత తేలిగ్గా అవి వేసుకుని బయటకు రాం. లేదా అక్కడ మన కమ్యూనిటీ వాళ్లు ఉంటే..అంతా ఒకచోట కలిస్తే గనుక మన దేశ సంప్రదాయాన్ని ఫాలో అవుతాం. అలా కాకుండా ఎలాంటి సందర్భం లేకుండా ఫారినర్స్ రద్దీగా ఉండేచోట మనం గనుక మన వేషధారణలో కనిపిస్తే ఎలా ఉంటుందో ఊహించండి. అలాంటి వీడియోని పల్లవి రాజ్ అనే కంటెంట్ క్రియేటర్ ఇన్స్టాగ్రాంలో షేర్ చేయడంతో నెట్టింట తెగ హల్చల్ చేస్తుంది. ఆ వీడియోలో ఓ మహిళ ఇటలీలోని రోమ్ వీధుల గుండా ఓ మహిళ చీర కట్టుకుని ఓ దేవతా మాదిరి వెళ్లింది. అక్కడ సరిగ్గా వందలాదిమంది విదేశీయులు బారులుతీరి ఉన్నారు. వారంతా ఒక్కసారిగా ఆమె వంకే చూస్తూ ఉండిపోయారు. మరికొందరూ ఫోటోలు తీశారు. మరికొందరూ వావ్ అంటూ నోరెళ్లబెట్టారు కూడా. ఎక్కడైన మన సంప్రదాయానికి అందరూ ఫిదా కావల్సిందే కదా. ఎప్పటకీ మన చీరే ట్రెండీ ఫ్యాషన్ దానికి మించిది మరోకటి లేదు అని మరోసారి రుజువైంది. View this post on Instagram A post shared by Pallavi Raj (@myshadowbeats) (చదవండి: 46 వేల ఏళ్లనాగి పురుగుకి జీవం పోస్తే..పిల్లల్ని కనడం ప్రారంభించింది!) -
అక్రమ వలసలకు చెక్.. ఐరోపా దేశాలు-ట్యునీషియా మధ్య ఒప్పందం
మిలన్: ఆఫ్రికా దేశాల నుడి ఐరోపా దేశాలకు అక్రమంగా వలస వచ్చే వారి సంఖ్య పెరుగుతూ వస్తోంది. ఆర్ధికంగా వెనుకబడిన ఆఫ్రికా దేశాల నుండి వలసదారులు పొట్టకూటి కోసం పడవల మీద ప్రయాణించి ఇటలీ పరిసర ఐరోపా దేశాలకు వలస రావడం పరిపాటిగా మారింది. ఇదే క్రమంలోనే ఇటీవల కొన్ని పడవలు సముద్ర మధ్యలో బోల్తాపడి ఎందరో వలసదారులు మరణించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఐరోపా - ట్యునీషియా ఈ ఒప్పందానికి తెరతీశారు ఇటలీ ప్రధాని జార్జియా మెలోని. ఆదివారం రోమ్ వేదికగా జరిగిన ఈ సమావేశానికి ఆమె అధ్యక్షత వహించగా ఐరోపా దేశాల ప్రతినిధులందరూ పాల్గొన్నారు. ఈ సమావేశంలో ప్రధానంగా వలసదారులు అక్రమంగా చొరబడకుండా వారికి చట్టబద్ధమైన ప్రవేశం కల్పించడంపైనా, ఆయా దేశాల్లో ఉపాధి కల్పించే విషయంపైనా చర్చలు సాగాయి. ఐరోపా దేశాలు-ట్యునీషియా ఒప్పంద సమావేశంలో మొత్తం 27 దేశాల ప్రతినిధులు పాల్గొన్నారు. సరిహద్దు భద్రత పటిష్టం చేసి వలసలను తగ్గించడమే అజెండాగా సమావేశంలో లిబియా, సిప్రస్, యూఏఈ, ట్యునీషియా దేశాల ప్రతినిధులు కూడా పాల్గొన్నారు. అత్యధిక వలసదారులు ఈ దేశాల నుండే వస్తున్నారని, ఇకపై ఈ దేశాల నుండి అక్రమ వలసలు లేకుండా చర్యలు చేపట్టాలని నిర్ణయం తీసుకున్నాయి. ఈ మేరకు యూఏఈ అక్రమ వలసల నియంత్రణ కోసం పాటుపడే సంస్థలకు 100 మిలియన్ డాలర్లు సాయమందించనున్నట్లు ప్రకటించింది. ఇదే వేదికగా ఆఫ్రికా ఉత్తర దేశాలకు ఆర్ధిక ఊతాన్నిచ్చేనందుకు 27 దేశాల వారు కలిపి 1.1 బిలియన్ డాలర్లు కూడగట్టడానికి సంకల్పించారు. ఈ సందర్బంగా ఇటలీ ప్రధాని మెలోని మాట్లాడుతూ.. ఐరోపా దేశాలకు అక్రమంగా వచ్చే వలసదారుల వలన క్రిమినల్ సామ్రాజ్యం విస్తరించడం తప్ప మరో ప్రయోజనం లేదన్నారు. వారు వలసదారులను ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఉసిగొల్పి డబ్బులు సంపాదించుకుంటున్నారని అన్నారు. మనం కఠినంగా ఉంటే క్రిమినల్స్ కు చెక్ పెట్టి వలసారులను ఆర్ధిక ప్రగతికి దోహద పడవచ్చని తెలిపారు. ఇది కూడా చదవండి: అమెరికా నౌకాదళానికి తొట్టతొలి మహిళా చీఫ్ -
భారత సైనికులకు ఇటలీ ఘన నివాళి
మిలన్: రెండవ ప్రపంచ యుద్ధం సమయంలో ఇటలీకి విశేష సేవలందించి ప్రాణత్యాగం చేసిన భారతీయ సైనికులకు ఆ దేశసైన్యం ఘన నివాళులర్పించింది. ఇందులో భాగంగా ఆనాటి యుద్ధంలో వీరమరణం పొందిన సైనికులకు స్మారక స్థూపాలను నిర్మించి ఆవిష్కరించింది ఇటలీ మాంటోన్. ఈ కార్యక్రమానికి ఇటలీ భారత అంబాసిడర్ డా. నీనా మల్హోత్రా తోపాటు రక్షణశాఖ ప్రతినిధులు, ఇటలీ దళాల ప్రతినిధులు అక్కడి ప్రజలు పాల్గొన్నారు. రెండో ప్రపంచ యుద్ధంలో ఇటలీకి వెన్నుదన్నుగా నిలిచిన భారత సైనికులు ఆనాడు ప్రాణత్యాగానికి కూడా వెనుకాడకుండా తమ విధులను నిర్వర్తించారు. సుమారు 50 వేల మంది ప్రాతినిధ్యం వహించిన 4,8,10వ డివిజన్ బెటాలియన్లతో కలిసి వీరంతా వీరోచితంగా పోరాడారు. ఆనాటి యుద్ధకాండలో 23,722 మంది భారత సైనికులు అసువులుబాశారు. వీరందరినీ ఇటలీ వ్యాప్తంగా కామన్ వెల్త్ యుద్ధ స్మశానవాటికల్లో సమాధి చేశారు. ఈ సందర్బంగా భారత సైన్యానికి చెందిన వి.సి. నాయక్ యశ్వంత్ గాడ్గేకు సన్ డయల్ స్మారక స్థూపాన్ని నిర్మించి ఇటలీ అత్యున్నత సైనిక పురస్కారం విక్టోరియా క్రాస్ బహూకరించారు. యశ్వంత్ గాడ్గే యుద్ధంలో ఎగువ టైబర్ లోయలో పోరాటం చేస్తూ వీరమరణం చెందారు. కార్యక్రమంలో మొత్తం 20 మందికి విక్టోరియా క్రాస్ పురస్కారాన్ని బహుకరించగా అందులో ఆరుగురు భారతీయ సైనికులే కావడం విశేషం. ఇది కూడా చదవండి: కిడ్నాపైన బాలిక సమయస్ఫూర్తి.. తెలివిగా సమాచారం అందించి.. -
దోపిడి దొంగల బీభత్సం.. గోల్కీపర్, అతని భార్యను బంధించి
ఇటలీ గోల్కీపర్ గియాన్లుయిగి డోనరుమ్మాకు చేదు అనుభవం ఎదురైంది. పారిస్లోని తన ఇంట్లోకి చొరబడిన దుండగులు 500,000 యూరోల(భారత కరెన్సీలో సుమారు రూ. 4కోట్లకు పైగా) విలువైన వస్తువులను ఎత్తుకెళ్లిపోయారు. అయితే అడ్డుపడేందుకు ప్రయత్నించి డోనరుమ్మా, అతని భార్యపై దాడి చేసిన దుండగులు వారిని బంధించి అక్కడి నుంచి పారిపోయారు. కాగా ఇదంతా తెల్లవారుజామున 3గంటల ప్రాంతంలో జరిగినట్లు తెలుస్తోంది. కాగా దుండగులు డోనరుమ్మా ఇంటి నుంచి పారిపోతున్న సమయంలో పక్కన ఉన్న హోటల్ సీసీటీవీ ఫుటేజీలో రికార్డయింది. కాగా డోనరుమ్మా ఇంట్లో పనిచేసే సిబ్బంది పోలీసులకు సమాచారమిచ్చారు. అనంతరం డోనరుమ్మా, అతని భార్యను ఆసుపత్రికి తరలించారు. ఇద్దరికి చికిత్స నిర్వహించామని.. అయితే తమ కళ్ల ముందే దొంగతనం జరగడంతో కాస్త షాక్లో ఉన్నట్లు వైద్యులు తెలిపారు. ఇక ప్రస్తుతం డోనరుమ్మా పారిస్ సెయింట్ జెర్మన్(పీఎస్జీ క్లబ్)కు ప్రాతినిధ్యం వహిస్తున్నాడు. అంతకముందు ఏసీ మిలన్ క్లబ్కు ఆడిన డోనరుమ్మా 2020లో ఇటలీ యూరో టైటిల్ కొట్టడంలో కీలకపాత్ర పోషించాడు. ఇక 2021లో పీఎస్జీ క్లబ్తో అగ్రిమెంట్ కుదుర్చుకున్నాడు. ఇక పీఎస్జీ తరపున ఇప్పటివరకు 72 మ్యాచ్లాడాడు. పీఎస్జీ రెండుసార్లు లీగ్-1 ట్రోఫీలు గెలవడంలో కీలకపాత్ర వహించాడు. ఇక ఇటలీ తరపున ఇప్పటివరకు 54 మ్యాచ్ల్లో గోల్కీపర్గా వ్యవహరించాడు. Understand Gianluigi Donnarumma will travel to Japan with PSG tomorrow, as planned. Donnarumma and his wife were the victims of a violent burglary, during which they were both tied up. They managed to take refuge in a hotel located not far from their home around 3:20am. pic.twitter.com/IBwBo8tjUC — Fabrizio Romano (@FabrizioRomano) July 21, 2023 చదవండి: 'చిన్నా.. నేను క్రీజులో ఉన్నానంటే బంతిపై కన్నేసి ఉంచాలి' -
సీక్రెట్గా ఎంగేజ్మెంట్ చేసుకున్న స్టార్ డైరెక్టర్ మేనకోడలు..!
బాలీవుడ్ చిత్రనిర్మాత, దర్శకుడు సంజయ్ లీలా భన్సాలీ మేనకోడలు ఎంగేజ్మెంట్ చేసుకున్నట్లు బీ టౌన్లో చర్చ నడుస్తోంది. నటి అయిన షర్మిన్ సెగల్ ఓ వజ్రాల వ్యాపారిని పెళ్లి చేసుకోవడానికి సిద్ధమైనట్లు సమాచారం. ఈ ఏడాది ప్రారంభంలో షర్మిన్ రహస్యంగా నిశ్చితార్థం చేసుకున్నట్లు తెలుస్తోంది. అంతే కాకుండా ఈ ఏడాది చివర్లో పెళ్లి కూడా చేసుకోనుంది. (ఇది చదవండి: బోల్డ్ సీన్స్తో ఇండస్ట్రీని తన మైకంలో పడేసిన హీరోయిన్, ఇప్పుడు పేదరికంలో! ) ఓ మీడియాలో వచ్చిన కథనం ప్రకారం షర్మిన్ 2023 ప్రారంభంలోనే అహ్మదాబాద్కు చెందిన వజ్రాల వ్యాపారితో నిశ్చితార్థం చేసుకుంది. ఈ ఏడాది చివర్లో ఇటలీలో పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకుంది. అయితే ఆమెకు కాబోయే భర్త గురించి ఎలాంటి వివరాలు బయటకు చెప్పలేదని తెలుస్తోంది. కాగా.. షర్మిన్ సినిమాల్లో ఎంట్రీకి ముందే భన్సాలీతో కలిసి పనిచేసింది. ఆమె 'గోలియోన్ కి రాస్లీలా రామ్-లీలా', 'బాజీరావ్ మస్తానీ', 'గంగూబాయి కతియావాడి' వంటి చిత్రాలకు సహాయ దర్శకురాలిగా పనిచేసింది. కాగా.. షర్మిన్ 2019లో 'మలాల్' చిత్రం ద్వారా బాలీవుడ్లోకి అడుగుపెట్టింది. 2022లో ఆమె 'అతిథి భూతో భవ'లో నటించింది. తాజాగా ఆమె భన్సాలీ తెరకెక్కిస్తోన్న 'హీరామండి'లో కనిపించనుంది. ప్రస్తుతం ఆమె సంజయ్ లీలా భన్సాలీ ప్రతిష్టాత్మక వెబ్ సిరీస్ 'హీరమండి' షూటింగ్లో బిజీగా ఉన్నారు. ఈ ప్రాజెక్ట్ ద్వారా ఓటీటీలోనూ అరంగేట్రం చేస్తోంది షర్మిన్. 'హీరమండి'లో సోనాక్షి సిన్హా, మనీషా కొయిరాలా, అదితి రావ్ హైదరీ, రిచా చద్దా, సంజీదా షేక్ కూడా ఉన్నారు. (ఇది చదవండి: 'ప్రాజెక్ట్ K' నుంచి ప్రభాస్ ఫస్ట్ లుక్ రిలీజ్) View this post on Instagram A post shared by Sharmin Segal (@sharminsegal) -
ఈ పిజ్జా చాలా ఫేమస్.. దీని చరిత్ర తెలుసుకుంటే షాక్ అవ్వాల్సిందే!
ఇటలీకి చెందిన పిజ్జా ఇటీవలి కాలంలో ప్రపంచవ్యాప్తంగా విస్తరించింది. ఖండఖండాంతరాల్లో చాలామంది అభిమానించే పిజ్జా వంటకం పద్దెనిమిదో శతాబ్దిలో ఇటలీలోని నేపుల్స్ ప్రాంతంలో పుట్టిందని చెబుతారు. పిజ్జా గురించి ఇప్పటి వరకు తెలిసిన చరిత్ర ఇదే! అయితే, పిజ్జా అంతకంటే పురాతనమైనదేననేందుకు తాజా ఆధారం లభించింది. నేపుల్స్కు చేరువలోని పోంపే నగరంలో రోమన్ కాలానికి చెందిన పురాతన శిథిల భవనంలో గోడలపై ఉన్న కుడ్యచిత్రాల్లో పిజ్జా చిత్రం కూడా ఉంది. ఇటీవల పురాతత్త్వ శాస్త్రవేత్తలు దీనిని గుర్తించారు. సహజమైన రంగులతో చిత్రించిన ఈ కుడ్యచిత్రంలో వెండిపళ్లెంలో పిజ్జాను తలపించే రొట్టె, పండ్లు, మధుపాత్ర ఉన్నాయి. ఈ చిత్రంలోని రొట్టె పిజ్జాకు తొలిరూపం కావచ్చని శాస్త్రవేత్తలు భావిస్తున్నారు. రోమన్ నాగరికత కాలానికి చెందిన ఈ భవంతి క్రీస్తుపూర్వం మూడో శతాబ్దికి చెందినదని వారు చెబుతున్నారు. ఇక్కడకు చేరువలోని మౌంట్ వెసూవియస్ అనే అగ్నిపర్వతం క్రీస్తుశకం 79లో బద్దలైనప్పుడు పాంపే, ఆప్లాంటిస్ నగరాలు లావాలోను, బూడిదలోను కూరుకుపోయాయి. ఇటీవల అక్కడ జరిపిన తవ్వకాల్లో ఈ పురాతన భవంతి, అందులోని పిజ్జా కుడ్యచిత్రం బయటపడటం విశేషం. చదవండి America PPP Fraud: ప్రపంచంలోనే అత్యంత ఘరానా మోసం.. అమెరికా సర్కార్కే షాక్! -
బోటుల్లో ఐరోపాకు చేరిన ఆఫ్రికా అక్రమ చొరబాటుదారులు
ఇటలీ: గడిచిన 24 గంటల్లో ఆసియా, ఆఫ్రికా, మధ్య ఆసియా దేశాల నుండి వేల సంఖ్యలో వలసదారులు బోటుల్లో ఐరోపాలోని ఆయా దేశాలకు చేరుకున్నట్లు తెలిపాయి ఇటలీ ఇమిగ్రేషన్ వర్గాలు. ఇటలీ ఇమిగ్రేషన్ అధికారులు తెలిపిన వివరాల ప్రకారం ఆఫ్రికా, ఆసియా దేశాలకు చెందిన శరణార్థులు పడవల్లో తమ దేశానికి చేరుకున్నారని తెలిపారు. కిక్కిరిసిన బోటులో ప్రయాణం చేసిన కారణంగా కొంతమంది బోటులోనే చనిపోగా మిగిలినవారు కాలాబ్రియా కోస్తాకు, లంపెడుసా తీరానికి చేరుకున్నారని అన్నారు. Meanwhile, another overloaded boatload of illegal immigrants from North Africa is making its way across the Mediterranean to Europe and the UK. pic.twitter.com/pDOagytGr6 — UK Justice Forum 🇬🇧 Latest Video News Updates! (@Justice_forum) June 29, 2023 ఇటీవలే భారీగా వలసదారులను ఎక్కుంచుకుని ఐరోపా వైపుగా వచ్చిన ఇలాంటి ఒక పడవ బోల్తాపడి నీటమునిగిన విషయం తెలిసిందే. తరచుగా ఈ ప్రమాదాలు జరుగుతున్నా కూడా అక్కడి అధికారులు వలసలను ఆపి ప్రమాదాలను నివారించే ప్రయత్నమైనా చేయడం లేదు. Boats full of African invaders landing straight onto the beach in Italy today. pic.twitter.com/ZaylKNpps6 — Faith (@Sarah77929529) June 28, 2023 ఇది కూడా చదవండి: నాహేల్ మృతి.. కంటిమీద కునుకులేని ఫ్రాన్స్..! వీడియో బయటకు -
ఇటలీలో లగ్జరీ విల్లా: రూ.40 లక్షల అద్దె సంపాదన, ఎవరీ సూపర్స్టార్?
ఆదిపురుష్ సినిమాతో ఫ్యాన్స్ను ఉర్రూతలూగిస్తున్న యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ గురించి క్రేజీ అప్డేట్ ఒకటి హల్ చల్ చేస్తోంది. సూపర్స్టార్కి ఇటలీలో లగ్జరీ విల్లా ఉందట. ఈ విల్లాలోని కొంత భాగాన్ని అద్దెకిచ్చాడట. తద్వారా నెలకు రూ.40 లక్షల అద్దెను ఆర్జిస్తున్నాడు అనే టాక్ జోరుగా నడుస్తోంది. అయితే ఎప్పుడు కొన్నాడు అనేది మాత్రం స్పష్టత లేదు కానీ, ఈ ఊహాగానాలు మాత్రం చక్కర్లు కొడుతున్నాయి. (రికార్డు రెమ్యూనరేషన్: ఈ రికార్డ్ సాధించిన తొలి హీరో ఎవరో తెలుసా?) దీంతో పాటు ఆర్థికంగా బలపడేందుకు ఇతర పెట్టుబడులు పెట్టాడని మీడియా కథనాల ద్వారా తెలుస్తోంది. మూవీలు లేకుండా లీజర్గా ఉన్న సమయంలో ఇక్కడే హ్యాపీగా కాలం గడిపేస్తాడట. ఇంకా హైదరాబాద్లో విలాసవంతమైన ఇల్లు కూడా ప్రభాస్ సొంతం. అత్యాధునిక సౌకర్యాలతో ఉన్న ఈ ఇల్లు దాదాపు 90 కోట్ల రూపాయలు. డ్రెస్సింగ్ విషయంలో కూడా ఎక్కడా తగ్గని డార్లింగ్ ప్రభాస్కు రోల్స్ రాయిస్, బీఎండబ్ల్యూ జాగ్వార్ తదితర లగ్జరీ కార్లు కూడా ఉన్నాయి. (రూ. 13 కోట్ల ఆస్తులను కొనుగోలు చేసిన సుహానా ఖాన్) ఆదిపురుష్ మూవీతో ఆకట్టుకుంటున్న ప్రభాస్, టాలీవుడ్ జక్కన్ తెరకెక్కించిన బాహుబలి ది బిగినింగ్, బాహుబలి 2: ది కన్క్లూజన్ సినిమాలతో సెన్సేషన్ క్రియేట్ చేశాడు. ప్యాన్ ఇండియా హీరోగా పాపులర్ అయిపోయాడు. దీంతో ప్రభాస్ రెమ్యూనరేషన్ కూడా అదే రేంజ్లో పెరిగింది. ఈ నేపథ్యంలోనే లేటెస్ట్ మూవీ ఆదిపురుష్ కోసమే ప్రభాస్ ఏకంగా రూ.150 కోట్లు అందుకున్నాడని టాక్. (అపుడు కరోడ్పతి షో సెన్సేషన్: మరి ఇపుడు) కాగా నెక్ట్స్ పాన్ ఇండియా మూవీ సలార్ బిజినెస్పై కూడా అంచనాలు భారీగానే ఉన్నాయి. కేజీఎఫ్ డైరెక్టర్, ప్రభాస్ కాంబినేషన్లో వస్తున్న ఈ మూవీ ఈ ఏడాది సెప్టెంబర్ 28న రిలీజ్కు రడీ అవుతోంది. దీంతోపాటు ప్రభాస్ ప్రాజెక్ట్ కే, స్పిరిట్, రాజా డీలక్స్ తదితర భారీ బడ్జెట్ సినిమాలు రిలీజ్ కానున్న సంగతి తెలిసిందే. -
విషాదం: మాజీ ప్రధాని, వ్యాపారవేత్త బెర్లూస్కోనీ కన్నుమూత
రోమ్: ఇటలీలో విషాదకర ఘటన చోటుచేసుకుంది. ఆ దేశ మాజీ ప్రధాని, కోటీశ్వరుడైన వ్యాపారవేత్త సిల్వియో బెర్లుస్కోనీ (86) తుదిశ్వాస విడిచారు. కొన్నేళ్లుగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన మృతిచెందారు. మరోవైపు.. బెర్లూస్కోనీ మరణంతో ఇటలీలో రాజకీయ అస్థిరత కొనసాగే అవకాశం ఉందని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. వివరాల ప్రకారం.. బెర్లూస్కోనీకి కొన్నేళ్ల క్రితం ల్యుకేమియా వ్యాధి సోకింది. కరోనా వ్యాప్తి సమయంలో వైరస్ బారినపడ్డారు. అనంతరం, కరోనా నుంచి కోలుకున్నారు. ఇక, కొన్ని రోజుల కిత్రమే ఆయనకు ఊపిరితిత్తులకు కూడా ఇన్ఫెక్షన్ సోకింది. ఈ క్రమంలో వ్యాధుల కారణంగా నొప్పి, బాధను ఆయన తట్టుకోలేకపోయారు. దీంతో, వ్యాధులతో పోరాడుతూనే ఆసుపత్రిలో చికిత్స పొందుతూ నేడు తుదిశ్వాస విడిచారు. SILVIO BERLUSCONI- Media tycoon with assets in television and print- Net worth of $7 billion in April, 2023.- Served as PM of Italy in four governments from 1994 to 1995, 2001 to 2006 and 2008 to 2011.- Owned A.C. Milan from 1986 to 2017- Has died at age of 86 pic.twitter.com/nOkJxrMt8m— The Spectator Index (@spectatorindex) June 12, 2023 ఇదిలా ఉండగా, బెర్లుస్కోనీ 1994లో రాజకీయాల్లోకి ప్రవేశించారు. రాజకీయాల్లోకి రాకముందు వ్యాపారవేత్తగా ఉన్నారు. ఇటలీ చరిత్రలోనే అతిపెద్దదైన మీడియా సంస్థను స్థాపించాడు. ఆ తర్వాత ఫోర్జా ఇటాలియా అనే పార్టీని స్థాపించి దేశ ప్రధాని అయ్యారు. ఇప్పుడు కూడా ఆయన పార్టీ ప్రస్తుత ప్రధాని జార్జియా మెలోని వామపక్ష సంకీర్ణ సర్కారులో భాగస్వామిగా ఉన్నది. అయితే ప్రభుత్వంలోనే బెర్లుస్కోనీ ఎలాంటి పదవిలో లేరు. ఇక, పన్ను ఎగవేత మోసాలకు పాల్పడినందుకు గాను ఆయనపై ఆరేళ్ల పాటు రాజకీయాల నుంచి నిషేధం విధించబడింది. SILVIO BERLUSCONI- Media tycoon with assets in television and print- Net worth of $7 billion in April, 2023.- Served as PM of Italy in four governments from 1994 to 1995, 2001 to 2006 and 2008 to 2011.- Owned A.C. Milan from 1986 to 2017- Has died at age of 86 pic.twitter.com/nOkJxrMt8m— The Spectator Index (@spectatorindex) June 12, 2023 ఇది కూడా చదవండి: ‘ఆకలేస్తోంది.. అమ్మ చనిపోయింది!’.. వాళ్లను నవ్వించేందుకు రెస్క్యూ టీం ఏం చేసిందంటే..! -
వరుణ్, లావణ్య పెళ్లి జరిగేది అక్కడేనా? ఆ సెంటిమెంట్
మెగా హీరో వరుణ్ తేజ్, లావణ్య త్రిపాఠి ప్రేమలో ఉన్నారని, పెళ్లి కూడా చేసుకుంటారని వార్తలు వినిపిస్తే.. ఇదంతా పుకార్లే అని కొట్టిపడేశారు. కానీ నిన్న జరిగిన నిశ్చితార్థంతో అందరికి ఓ క్లారిటీ వచ్చింది. తాము ప్రేమలో ఉన్నామని ఎప్పుడూ చెప్పకుండా.. సడెన్గా ఎంగేజ్మెంట్ చేసుకొని అందరికి షాకిచ్చింది ఈ జంట. అయితే ఇప్పుడు వీరి పెళ్లి ఎప్పుడనేది ఇండస్ట్రీలో ఆసక్తికరంగా మారింది. ఈ మధ్యకాలంలో సినీ సెలబ్రిటీలు ఎక్కువగా డెస్టినేషన్ మ్యారేజ్లే చేసుకుంటున్నారు. తాజాగా యంగ్ హీరో శర్వానంద్ కూడా ఈ తరహా వివాహాన్నే చేసుకున్నారు. జైపూర్లోని ఫ్యాలెస్లో రెండు రోజుల పాటు అంగరంగ వైభవంగా శర్వానంద్ పెళ్లి జరిగింది. వరుణ్, లావణ్యలు కూడా ఓ మంచి డెస్టినేషన్ స్పాట్లోనే పెళ్లి చేసుకుంటారని వార్తలు వినిపిస్తున్నాయి. ఇటలీలోని ఓ ప్రముఖ ఫ్యాలెస్లో వీరి వివాహం జరుగబోతుందని సమాచారం. ఓ చిన్న సెంటిమెంట్ కారణంగా ఈ జంట ఇటలీలో పెళ్లి చేసుకోవాలని డిసైడ్ అయిందట. వరుణ్, లావణ్యల ప్రేమకు పునాది పడింది ఇటలీలోనే. మిస్టర్ సినిమా షూటింగ్ కోసం ఇటలీ వెళ్లిన వరుణ్, లావణ్యలు..అక్కడే స్నేహితులుగా మారారట. కొన్నాళ్ల తర్వాత అది కాస్త ప్రేమగా మారింది. ప్రేమ పుట్టిన చోటో పెళ్లి చేసుకుందామని ఇద్దరు నిర్ణయించుకున్నారని తెలిసింది. మెగా ఫ్యామిలీ కూడా ఇందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చిందట. ఈ ఏడాది నవంబర్ లేదా డిసెంబర్లో వీరి పెళ్లి ఉంటుందని టాక్ నడుస్తోంది. (చదవండి: అప్పటినుంచే ప్రేమలో ఉన్నామన్న లావణ్య.. పోస్ట్ వైరల్) 👉: (ఫొటో గ్యాలరీ కోసం ఇక్కడ క్లిక్ చేయండి) -
Venice: రాత్రికి రాత్రే రంగు మారింది!
వైరల్ న్యూస్: ఇటలీ నీటి నగరం వెనిస్లో ఆసక్తికర ఘటన ఒకటి జరిగింది. తేట నీరుతో టూరిస్టులను ఆకట్టుకునే అక్కడి గ్రాండ్ కెనాల్ నీటి రంగు.. రాత్రికి రాత్రే మొత్తం ఆకుపచ్చగా మారింది. ఆదివారం ఉదయం కాలువ రంగు మారిపోవడంతో అక్కడి ప్రజలంతా ఆశ్చర్యానికి గురయ్యారు. వెనెటో రీజియన్ రాజధాని వెనిస్లో Grand Canal నీరు అసాధారణ రీతిలో ఆకుపచ్చ రంగులోకి మారిపోయింది. తెల్లవారు జామున రియాల్టో బ్రిడ్జి వద్ద తొలుత అది గమనించిన కొందరు స్థానికులు విషయాన్ని అధికారుల దృష్టికి తీసుకెళ్లారు. దీంతో.. ఈ ఘటనపై దర్యాప్తు చేపట్టాలని పోలీసులకు వెనెటో రీజియన్ ప్రెసిడెంట్ లూకా జాయియా ఆదేశించారు. మరోవైపు సోషల్ మీడియాలో ఇందుకు సంబంధించిన ఫొటోలు, వీడియోలు వైరల్ అయ్యాయి. ఇక నీరు రంగు మారిన పరిణామం రకరకాల ఊహాగానాలు తెర మీదకు వచ్చాయి. ఇది ఆల్గే(నాచు) వల్ల సంతరించుకుంది కాదని పరిశోధకులు ప్రకటించారు. దీంతో.. బహుశా ఎవరైనా నిరసకారులు లేదంటే ఆకతాయిలు ఈ పని చేసి ఉంటారని భావిస్తున్నారు. సీసీటీవీ ఫుటేజీ ద్వారా వాళ్లను కనిపెట్టే పనిలో పోలీసులు ఉన్నారు. The water in the Grand Canal in Venice has turned bright green. Has grown significantly. pic.twitter.com/N7js56Vmiy — Animal World (@dragon_of_time_) May 28, 2023 ఇదిలా ఉంటే.. వెనిస్ గ్రాండ్ కెనాల్ ఇలా రంగు మారడం ఇదే తొలిసారి కాదు. గతంలో.. 1968లో అర్జెంటీనా ఆర్టిస్ట్ నికోలస్ గార్సియా ఉద్దేశపూర్వకంగానే గ్రాండ్ కెనాల్లో ఫ్లూరెసెయిన్ అనే డైని కలిపారు. ఆ టైంలో వెనిస్ ఇంటర్నేషనల్ థియేటర్ ఫెస్టివల్ జరగాల్సి ఉండగా.. పర్యావరణ సమస్యలను ప్రపంచం దృష్టికి తీసుకెళ్లే ఉద్దేశంతో ఆ టైంలో ఆయన ఆ పని చేశారు. -
రూ.270కి మూడు ఇళ్లు
రోమ్: ఇటలీలో నాలుగైదేళ్ల కిందటి వరకు కొన్ని గ్రామాలకు వెళితే కారు చౌకగా ఇళ్లు లభించేవి. ఒక డాలర్ ఇస్తే చాలు ఇక ఇల్లు వారి పేరు మీద రిజిస్టర్ అయిపోయేది. సిసిలీలో ఒక మారుమూల విసిరేసినట్టున్న ఇల్లు కొనడానికి ఒక డాలర్ ఖర్చు పెడితే చాలు. దీనికి కారణం ఆ ప్రాంతం నుంచి ప్రజల వలసలే. కాలిఫోర్నియాకు చెందిన రుబియా డేనియల్స్ అనే మహిళ 2019లో కేవలం 3.30 డాలర్లకి (రూ.270) మూడు ఇళ్లను కొనుగోలు చేసింది. ఈ నాలుగేళ్లలో పరిస్థితిలో మార్పు వచ్చింది. ప్రజలు మళ్లీ గ్రామాల బాటపడుతున్నారు. దీంతో ఆమె కొనుగోలు చేసిన ఇళ్లకు డిమాండ్ పెరిగింది. ప్రస్తుతం ఆమె ఆ ఇళ్లను పునరుద్ధరించే పనిలో ఉన్నారు. ఒక ఇంట్లో తానుంటానని, మరొకటి ఆర్ట్ గ్యాలరీగా మార్చి, ఇంకొకటి అద్దెకిస్తానని చెబుతున్నారు. -
Volleyball: హైదరాబాద్ బ్లాక్ హాక్స్ కొత్త పార్ట్నర్ పల్లవోలో పడోవా
భారతదేశపు ప్రీమియర్ వాలీబాల్ జట్లలో ఒకటైన హైదరాబాద్ బ్లాక్ హాక్స్, ఇటలీకి చెందిన సూపర్లిగాకు చెందిన ప్రముఖ క్లబ్ పల్లవోలో పడోవాతో వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని ప్రకటించింది. దీని వల్ల బ్లాక్ హాక్స్ ఆటగాళ్లకు ప్రపంచ స్థాయి కోచింగ్ మరియు విస్తృత మౌలిక సదుపాయాలను అందుబాటులోకి రానున్నాయి. అత్యుత్తమ వ్యూహాలు మరియు సాహసోపేత నిర్ణయాలకు పెట్టింది పేరైన హైదరాబాద్ బ్లాక్ హాక్స్, భారత వాలీబాల్లో సరికొత్త ప్రమాణాలను నెలకొల్పింది. ప్రైమ్ వాలీబాల్ లీగ్లో మొదటి ప్రపంచ స్థాయి కోచ్ను నియమించడం, సంచలనాత్మక షోబిజ్ అనుభవాన్ని సృష్టించడం మరియు అభిమానుల తో అనుబంధం విస్తరించడానికి ప్రముఖులను చేర్చుకుంది బ్లాక్ హాక్స్. 🔥 𝗔 𝗚𝗔𝗠𝗘-𝗖𝗛𝗔𝗡𝗚𝗘𝗥! We are going to usher in a new era in global volleyball, as our partnership with @pallavolopadova will see players and coaches get a chance to learn from some of the best in the world! 🏐#HawkAttack #HyderabadBlackHawks #PallavoloPadova pic.twitter.com/2RHS80kb85 — Hyderabad Black Hawks (@blackhawkshyd) May 19, 2023 ఇటాలియన్ సూపర్లిగాలో ప్రధాన కేంద్రంగా పల్లవోలో పడోవా ఉంది. అత్యుత్తమ గేమ్ సెన్స్ ద్వారా తన ఆటగాళ్లను శక్తివంతం చేయడంలో ఈ క్లబ్ పేరు గాంచింది. వీరిద్దరి భాగస్వామ్యం వల్ల రాబోయే రోజుల్లో బ్లాక్ హాక్స్ అనేక మంది ఆటగాళ్లను ఇటలీలోని పడోవాకు శిక్షణ కోసం పంపుతుంది. అలాగే ప్రపంచ స్థాయి కోచింగ్ సర్టిఫికేషన్ ప్రోగ్రామ్ మరియు యూత్ ట్రైనింగ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ను రూపొందించడంలో బ్లాక్ హాక్స్కు పడోవా తమ కోచ్లను భారత్కు పంపుతుంది. బ్లాక్ హాక్స్ ముఖ్య యజమాని, అభిషేక్ రెడ్డి కంకణాల మాట్లాడుతూ " ప్రపంచంలోనే అతిపెద్ద టాలెంట్ పూల్ భారతదేశం దగ్గర ఉంది. మన ప్రతిభావంతులైన యువతను ప్రపంచ స్థాయి అథ్లెట్లుగా తీర్చిదిద్దడానికి, మాకు అత్యున్నత మౌలిక సదుపాయాలు మరియు అగ్రశ్రేణి కోచింగ్ రెండూ అవసరం. ఖేలో ఇండియా ప్రోగ్రామ్ మరియు పడోవాతో మా కొత్త భాగస్వామ్యం తో మేము దానిని సాకారం చేస్తున్నాము" అని అన్నారు. 💪🏻𝐀 𝐇𝐈𝐒𝐓𝐎𝐑𝐈𝐂 𝐏𝐀𝐑𝐓𝐍𝐄𝐑𝐒𝐇𝐈𝐏! We are delighted to join hands with @pallavolopadova to bring a new era in global volleyball! 🏐#HawkAttack #HyderabadBlackHawks #RuPayPrimeVolley #AsliVolleyball #PallavoloPadova pic.twitter.com/Io3vgCNDCN — Hyderabad Black Hawks (@blackhawkshyd) May 19, 2023 పడోవా ప్రెసిడెంట్, జియాన్కార్లో బెట్టియో, మాట్లాడుతూ.. "కోచింగ్లో 50 సంవత్సరాల అనుభవం ఉంది, మేము మా నైపుణ్యాన్ని ఇక్కడి ఆటగాళ్లకు పంచడానికి ఆసక్తిగా ఉన్నాము, మేము మా క్లబ్లు వాలీబాల్ భవిష్యత్తును పునర్నిర్మించగలవనే నమ్మకం తో ఉన్నాము " అని అన్నారు. హైదరాబాద్ బ్లాక్ హాక్స్ యొక్క సూత్రప్రాయ స్పాన్సర్ A23 ఈ పార్ట్నర్షిప్పై సంతోషం వ్యక్తం చేసింది. "వాలీబాల్ వంటి నైపుణ్యం కలిగిన ఈవెంట్లను విస్తృత ప్రేక్షకులకు అందించడానికి మేము అంకితభావంతో ఉన్నాము. ఈ భాగస్వామ్యం ప్రపంచవ్యాప్తంగా మా బ్రాండ్ విజిబిలిటీని మాత్రమే కాకుండా భారతీయ వాలీబాల్ క్రీడాకారులు కు ప్రపంచ వేదికను అందిస్తుంది. మేము ఈ అవకాశం గురించి మరింత ఆసక్తి గా ఉన్నాము " అని అన్నారు. -
ఇటలీ మిలన్లో భారీ పేలుడు..అగ్నికి కార్లు ఆహుతి
ఉత్తర ఇటలీలోని మిలన్లో గురువారం ఓ వీధిలో భారీ పేలుడు సంభవించింది. దీంతో అనేక వాహానాలు మంటల్లో చిక్కుకున్నాయి. ఈ ఘటనలో ఓ వ్యక్తి గాయపడినట్లు అధికారులు తెలిపారు. ఆక్సిజన్ గ్యాస్ సిలిండర్లను రవాణా చేస్తున్న వ్యాన్లో ఈ పేలుడు సంభవించినట్లు అధికారులు అనుమానిస్తున్నారు. ప్రస్తుతం ఈ ప్రమాదంలో భారీగా మంటలు ఎగిసిపడుతుండటంతో చుట్లు పక్కల ఉన్న కార్లకు సైతం మంటలు వ్యాపించాయి. దీంతో అక్కడ ప్రాంతమంతా దట్టమైన పొగ కమ్మేసింది. ఐతే సంఘటనా స్థలంలోనే పాఠశాల, నర్సింగ్ హోం ఉండటంతో..అందులో ఉన్న వారిని ఖాళీ చేయించారు అధికారులు. ఐతే ఈ ఘటనకు సంబంధించి పూర్తి సమాచారం ఇంకా తెలియాల్సి ఉంది. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది ఘటన స్థలానికి త్వరితగతిన మంటలను అదుపులోకి తీసుకువచ్చేందుకు యత్నిస్తున్నట్లు తెలిపారు అధికారులు. అందుకు సంబంధించిన దృశ్యాలు నెట్టింట తెగ వైరల్ అవ్వుతున్నాయి. వీడియో కోసం ఇక్కడ క్లిక్ చేయండి: (చదవండి: పాక్ చరిత్రలో ఆ రోజు చీకటి అధ్యాయం: పాక్ ఆర్మీ) -
సముద్ర జలాల్లో రూ.3,700 కోట్ల కొకైన్ పట్టివేత
రోమ్: ఇటలీలోని సిసిలీకి సమీపంలోని సముద్ర జలాల్లో తేలియాడుతున్న కొకైన్ ప్యాకెట్లివి. సుమారు రెండు టన్నుల బరువున్న 70 బండిళ్లలో 1,600 ప్యాకెట్లలోని ఈ కొకైన్ విలువ ఏకంగా రూ.3,700 కోట్లు! స్మగ్లర్లు వీటిని బహుశా నౌకలో తెచ్చి ఇక్కడ వదిలేసి ఉంటారని పోలీసులు అనుమానిస్తున్నారు. నీటిపై తేలియాడుతున్న వీటి జాడ తెలుసుకునేందుకు వీలుగా ప్యాకెట్లకు ట్రాకింగ్ డివైజ్ను కూడా అమర్చారని చెప్పారు. హెలికాప్టర్ ద్వారా పెట్రోలింగ్ చేస్తుండగా ఇవి కనిపించాయి. -
ఆకాశంలో ఎరుపు రంగు వలయాకృతి.. గ్రహాంతరవాసుల వాహనమా?
రోమ్: ఎరుపు రంగులో వలయాకృతిలో కన్పిస్తున్న ఈ దృశ్యం ఇటలీలో ఇటీవల కలకలం రేపింది. విస్తుగొలిపే ఈ వింత వలయం సెంట్రల్ ఇటలీలో ఆల్ఫ్స్ పర్వతాల నుంచి అడ్రియాటిక్ సముద్రం దాకా ఆకాశంలో ఏకంగా 360 కిలోమీటర్ల పొడవున విస్తరించి కనువిందు చేసింది. అచ్చం హాలీవుడ్ సైన్స్ ఫిక్షన్ సినిమా దృశ్యాన్ని తలపించిన ఈ వలయం గ్రహాంతరవాసుల అంతరిక్ష వాహనం అయ్యుండొచ్చని కొందరు భావించారు. సైంటిస్టులు మాత్రం అదేమీ కాదని స్పష్టం చేశారు. కాంతి ఉద్గార క్రమంలో అతి తక్కువ ఫ్రీక్సెన్సీతో కూడిన అడ్డంకులు ఇందుకు కారణమని వారు వివరించారు. ఎల్్వగా పిలిచే ఈ దృగ్విషయం ఒక్కోసారి ఇలాంటి విచిత్రాకారపు వెలుతురు వలయాలకు దారి తీస్తుందని చెప్పుకొచ్చారు. ఈ ఎల్్వలు తుపాను మేఘాలకు పై భాగాల్లో విడుదలయ్యే అత్యంత హెచ్చు విద్యుదయస్కాంత శక్తి వల్ల పుట్టుకొస్తుంటాయట. ఫొటోలోని ఎరుపు వలయం పుట్టుకకు సెంట్రల్ ఇటలీకి దాదాపు 285 కిలోమీటర్లు దక్షిణాన చెలరేగిన తుపాను సందర్భంగా చోటుచేసుకున్న శక్తిమంతమైన మెరుపు కారణమని వారు చెప్పారు. ప్రఖ్యాత ఫొటోగ్రాఫర్ వాల్తెయిర్ బినొటో దీన్ని కెమెరాలో బంధించారు. ఆకాశంలో ఇలాంటి ఆకృతులను ఆయన తొలిసారిగా 2017లో ఫొటో తీశారట. అప్పటి నుంచీ ఇదే పనిలో ఉన్నట్టు చెబుతున్నారాయన. -
Miami Opens 2023: మయామీ ఓపెన్ విజేత మెద్వెదెవ్
మయామీ: రష్యా స్టార్ డానిల్ మెద్వెదెవ్ ఈ ఏడాది తన అద్భుత ఫామ్ను కొనసాగిస్తూ నాలుగో ఏటీపీ టైటిల్ను సొంతం చేసుకున్నాడు. ప్రతిష్టాత్మక ఏటీపీ మాస్టర్స్ 1000 టోర్నీలో మెద్వెదెవ్ విజేతగా నిలిచాడు. ఫైనల్లో అతను 7–5, 6–3 స్కోరుతో జనిక్ సిన్నర్ (ఇటలీ)ని ఓడించాడు. 1 గంటా 34 నిమిషాల పాటు సాగిన ఈ పోరులో మెద్వెదెవ్ 9 ఏస్లు కొట్టగా, సిన్నర్ 6 ఏస్లు బాదాడు. రష్యా ఆటగాడు 6 డబుల్ ఫాల్ట్లు చేసినా ఆ ప్రభావం ఫలితంపై పడకుండా సత్తా చాటడం విశేషం. 2023లో 24 మ్యాచ్లలో గెలిచి ఒకే ఒక మ్యాచ్లో ఓడిన మెద్వెదెవ్ ఖాతాలో ఇది నాలుగో టైటిల్ కాగా ఓవరాల్గా ఐదో ఏటీపీ మాస్టర్స్ టైటిల్. -
ఆ దేశంలో ఆంగ్లంలో మాట్లాడితే రూ. 82 లక్షలు జరిమానా!
ఆంగ్ల భాష అంతర్జాతీయ భాషగా రాజ్యమేలుతున్న సంగతి తెలుసిందే. ఈ తరుణంలో ఒక దేశం మాత్రం ఆ భాషను ఉపయోగించడానికి వీలు లేదంటూ హుకూం జారీ చేసింది. అందుకోసం ఓ ముసాయిదా బిల్లును కూడా తీసుకొచ్చింది. పొరపాటున కూడా కమ్యూనికేట్ చేసేటప్పుడూ ఇంగ్లీష్ పదాలు దొర్లినా పెద్ద మొత్తంలో జరిమానా విధిస్తానని కూడా పేర్కొంది. ఆంగ్ల భాషను పూర్తిగా బ్యాన్ చేసిన తొలిదేశం కూడా అదే కాబోలు!. వివరాల్లో కెళ్తే.. ఇటాలీ ప్రధాన మంత్రి, బ్రదర్స్ ఆఫ్ ఇటలీ పార్టీ నేత జార్జియా మెలోని ఈ కొత్త ప్రతిపాదిత చట్టాన్ని తీసుకొచ్చారు. ఆ చట్టం ప్రకారం ఏఇటాలియన్ అయినా కమ్యూనికేట్ చేసేటప్పుడూ .. విదేశీ పదాలను ఉపయోగిస్తే దాదాపు రూ. 82 లక్షల వరకు జరిమానా విధించడం జరుగుతుంది. ఈ బిల్లును ఛాంబర్ ఆఫ్ డిప్యూటీ సభ్యుడు ఫాభియో రాంపెల్లి ప్రవేశ పెట్టారు. దీనికి ఇటాలియన్ ప్రధానమంత్రి జార్జియా మద్దతు ఇచ్చారు. ఆంగ్ల పదాలు లేదా ఆంగోమానియాను లక్ష్యంగా చేసకుని మరీ ఈ చట్టాన్ని తీసుకొచ్చారు. ఈ ముసాయిదా బిల్లు ప్రకారం.. ఈ ఆంగ్ల భాష ఇటాలియన్ భాషను కించపరుస్తున్నట్లు పేర్కొంది. బ్రిటన్ నిష్రమణతో బ్రెగ్జిట్గా పేరుగాంచిన యూరోపియన్ యూనిన్ కారణంగా ఆ పరిస్థితి దారుణంగా దిగజారిందని పేర్కొంది. అంతేగాదు ఆ బిల్లు..పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్లో పదవిని కలిగి ఉన్నవారెవరైనా వ్రాతపూర్వకంనూ, కమ్యూనికేషన్ పరంగానూ ఇటాలియన్ భాషపై నైపుణ్యం కలిగి ఉండాలని స్పష్టం చేసింది. ఉద్యోగా స్థానాల్లో, వ్యాపార సంబంధ డాక్యుమెంట్లలోనూ, అధికారిక పత్రాలలోనూ కూడా ఆంగ్లంలో పేర్లను వినియోగించడాన్ని పూర్తిగా నిషేధించింది. ఆఖరికి ఇటాలియన్ భాష రాని విదేశీయులతో కమ్యూనికేట్ చేసే కార్యాలయ్యాలకు కూడా ఈ నిబంధన వర్తిస్తుందని చెప్పింది. ఆర్టికల్ 2 ప్రకారం.. జాతీయ భూభాగంలో ప్రజా వస్తువుల, సేవలు వినియోగం కోసం ఇటాలియన్ని ప్రాథమిక భాషగా ఉపయోగించాలిని ఆ ముసాయిదా బిల్లులో స్పష్టం చేసింది. అంతేగాదు దీన్ని అతిక్రమిస్తే రూ. 4 లక్షల నుంచి దాదాపు రూ. 82 లక్షల వరకు జరిమానా విధిస్తాని బిల్లులో పేర్కొంది. అయితే ఈ బిల్లుపై పార్లమెంట్లో చర్చలు జరిపిన తదనంతరం పూర్తి స్తాయిలో అమలు చేయనుంది ఇటలీ. (చదవండి: లొంగిపోనున్న ట్రంప్..ఫుల్ బంధోబస్తుకు ప్లాన్) -
డేటా లీకేజీ ఉదంతం... చాట్జీపీటీపై ఇటలీ నిషేధం
పారిస్: ఆర్టిఫిషియల్ ఇంటలిజెన్స్ చాట్బాట్ చాట్జీపీటీపై తాత్కాలిక నిషేధం విధిస్తూ ఇటలీ సంచలన నిర్ణయం తీసుకుంది. కఠినమైన యూరోపియన్ యూనియన్ డేటా పరిరక్షణ నియమాలను ఉల్లంఘించినందుకు ఈ చర్య తీసుకున్నట్టు సమాచారం. చాట్జీపీటీపై ఇలాంటి చర్య తీసుకున్న తొలి దేశం ఇటలీయే. ఎందుకు? యూజర్ల సంభాషణలు, చందాదారుల చెల్లింపులకు సంబంధించిన డేటా చాట్జీపీటీ ద్వారా లీకైందని ఇటలీ డేటా ప్రొటెక్షన్ అథారిటీ పేర్కొంది. అందుకే దాన్ని బ్లాక్ చేస్తూ నిర్ణయం తీసుకున్నట్టు పేర్కొంది. డేటా గోప్యతను చాట్జీపీటీ పూర్తిస్థాయిలో గౌరవించేదాకా నిషేధం కొనసాగుతుందని తెలిపింది. దాని మాతృసంస్థ ఓపెన్ఏఐ ఎలాంటి చట్టపరమైన ఆధారమూ లేకుండానే భారీ పరిమాణంలో వ్యక్తిగత డేటాను సేకరించి ప్రాసెస్ చేస్తోందంటూ విస్మయం వ్యక్తం చేసింది. ‘‘పైగా డేటా సేకరిస్తున్న యూజర్లకు ఈ విషయాన్ని నోటిఫై చేయడం లేదు. పైగా చాట్జీపీటీ కొన్నిసార్లు వ్యక్తులను గురించిన తప్పుడు సమాచారాన్ని పుట్టించి స్టోర్ చేస్తోంది. అంతేకాదు, యూజర్ల వయసును నిర్ధారించుకునే వ్యవస్థేదీ చాట్జీపీటీలో లేదు. కనుక అభ్యంతరకర కంటెంట్ పిల్లల కంటపడే రిస్కుంది. పైగా 13 ఏళ్ల కంటే తక్కువ వయసు చిన్నారుల కోసం ఫిల్టర్లేవీ లేకపోవడం తీవ్ర అభ్యంతరకరం’’ అంటూ ఆక్షేపించింది. చాట్జీపీటీలో సాంకేతిక సమస్యలు కొత్తేమీ కాదు ఇతర యూజర్ల సబ్జెక్ట్ లైన్లు, చాట్ హిస్టరీ తదితరాలను కొందరు యూజర్లు చూసేందుకు వీలు కలుగుతుండటంతో సమస్యను సరిచేసేందుకు చాట్జీపీటీని కొంతకాలం ఆఫ్లైన్ చేస్తున్నట్టు మార్చి 20న ఓపెన్ఏఐ ప్రకటించడం తెలిసిందే. 1.2 శాతం మంది యూజర్లకు ఈ యాక్సెస్ లభించినట్టు విచారణలో తేలిందని సంస్థ పేర్కొంది. 20 రోజుల్లో నివేదించాలి నిషేధం నేపథ్యంలో యూజర్ల డేటా గోప్యత పరిరక్షణకు ఏం చర్యలు తీసుకున్నదీ ఓపెన్ఏఐ నివేదించాల్సి ఉంటుంది. లేదంటే 2.2 కోట్ల డాలర్లు/మొత్తం వార్షికాదాయంలో 4 శాతం జరిమానాగా చెల్లించాల్సి ఉంటుంది. విద్యార్థుల్లో అలసత్వానికి కారణమవుతుందంటూ ప్రపంచవ్యాప్తంగా పలు ప్రభుత్వ పాఠశాలలు, యూనివర్సిటీలు ఇప్పటికే చాట్జీపీటీని నిషేధించాయి. -
చాట్జీపీటీకీ భారీ షాక్.. బ్యాన్ దిశగా ప్రపంచ దేశాల అడుగులు?
కృత్రిమ మేధ (ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్) ఆధారిత చాట్ బాట్ చాట్జీపీటీకి భారీ షాక్ తగిలింది. 40 ఏళ్ల టెక్నాలజీ చరిత్ర (బిల్గేట్స్ అభిప్రాయం మేరకు)లో సరికొత్త సంచలనాలకు కేంద్ర బిందువుగా మారిన చాట్జీపీటీ వినియోగాన్ని తాత్కాలికంగా నిలిపి వేస్తూ ఓ దేశం అధికారికంగా ప్రకటించింది. టెక్నాలజీని అందిపుచ్చుకుంటే అద్భుతమే. కానీ ఏఐ లాంటి టెక్నాలజీ వినియోగంతో మనుషులకు ఉపాధి లేకుండా పోతుందని, యంత్రాలే ఉద్యోగాలు చేస్తాయేమోనన్న భయాలు ప్రపంచ వ్యాప్తంగా నెలకొన్నాయి. ఆ భయాల్ని నిజం చేసేలా ‘టెక్నాలజీ కంటే మానవుడు ఎల్లప్పుడూ ముందంజ’లో ఉంటాడని నమ్మే చాట్జీపీటీ సృష్టికర్త ఆల్ట్మాన్ సైతం ఈ లేటెస్ట్ టెక్నాలజీ గురించి ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. చదవండి👉 చాట్జీపీటీ సృష్టికర్త శామ్ ఆల్ట్మన్ సంచలన వ్యాఖ్యలు ఈ తరుణంలో చాట్జీపీటీ వినియోగాన్ని తాత్కాలికంగా బ్యాన్ చేస్తున్నట్లు ఇటలీ ప్రభుత్వం అధికారికంగా ప్రకటించింది. న్యూయార్క్టైమ్స్ ప్రకారం.. ఇటలీ డేటా ప్రొటెక్షన్ అథారిటీ ఓపెన్ ఏఐకి చెందిన చాట్జీపీటీ యూజర్ల సమాచారాన్ని దొంగిలించినట్లు ఆరోపిస్తుంది. అంతేకాదు మైనర్లు ఎలాంటి అసాంఘీక కార్యకలాపాలకు పాల్పడకుండా నిరోధించే వ్యవస్థ చాట్ జీపీటీలో లేదని ఇటాలియన్ అథారిటీ తెలిపింది. We of course defer to the Italian government and have ceased offering ChatGPT in Italy (though we think we are following all privacy laws). Italy is one of my favorite countries and I look forward to visiting again soon! — Sam Altman (@sama) March 31, 2023 భద్రత దృష్ట్యా ప్రపంచ దేశాల్లో చాట్జీపీటీని ఇటలీ తొలిసారిగా బ్యాన్ చేసింది. ఇక చైనా, రష్యా, నార్త్ కొరియా, ఇరాన్ దేశాలు సైతం చాట్జీపీటీ వినియోగించకుండా కఠిన చట్టాలు అమలు చేసే యోచనలో ఉన్నట్లు సమాచారం. నిషేధంపై చాట్జీపీటీ సృష్టికర్త సామ్ ఆల్ట్మాన్ స్పందించారు. ఇటలీ తనకు ఇష్టమైన దేశాలలో ఒకటి’ అని అంటూనే ఇటలీలో చాట్జీపీటీ సేవల్ని నిలిపివేస్తున్నట్లు తెలిపారు. కానీ చాట్జీపీటీ విషయంలో అన్ని గోప్యతా చట్టాలను అనుసరిస్తున్నామని భావిస్తున్నట్లు ట్వీట్ చేశారు. చదవండి👉 మరోసారి బాంబు పేల్చిన చాట్జీపీటీ సృష్టికర్త ఆల్ట్మాన్ -
అస్వస్థతకు గురైన పోప్.. ఆస్పత్రిలో చేరిక
వాటికన్ సిటీ: పోప్ ఫ్రాన్సిస్ అస్వస్థతో బుధవారం ఆస్పత్రిలో చేరారు. 86 ఏళ్ల పోప్ శ్వాస సంబంధిత ఇన్ఫెక్షన్తో బాధపడుతున్నట్లు, ఆయన్ని రోమ్లోని(ఇటలీ) జెమెల్లీ ఆస్పత్రిలో చేరినట్లు వాటికన్ సిటీ వర్గాలు ఒక ప్రకటనలో వెల్లడించాయి. మరికొన్ని రోజులు ఆయన ఆస్పత్రిలోనే ఉంటారని తెలుస్తోంది. అయితే శ్వాస కోశ సంబంధిత సమస్యలే అయినప్పటికీ.. ఆయన కోవిడ్ సోకలేదని స్పష్టం చేసింది ఆ ప్రకటన. ఆయన అనారోగ్యంపై వార్తలు బయటకు రాగానే.. త్వరగా కోలుకోవాలంటూ సందేశాలు పంపుతున్నారు పలువురు. గత కొంతకాలంగా ఆయన పలు అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నారు. ఈ క్రమంలోనే ఏడాదికాలంగా పలు ముఖ్యకార్యక్రమాలకు ఆయన గైర్హాజరు అవుతున్నారు. ఇదీ చదవండి: ప్రజల ఇష్టానుసారమే నిర్ణయం తీసుకుంటాం! -
Nature Astronomy: కృత్రిమ ఉపగ్రహ కాంతితో భూమికి ముప్పు!
ఆధునిక సాంకేతిక యుగంలో మనషుల మనుగడ కృత్రిమ ఉపగ్రహాల (శాటిలైట్లు)పై ఆధారపడి ఉందంటే అతిశయోక్తి కాదు. అన్ని రంగాల్లోనూ వీటి అవసరం పెరిగిపోతోంది. అయితే ఈ ఉపగ్రహాల కాంతి, విద్యుత్ బల్బుల వెలుగుతో పుడమికి పెద్ద ముప్పు వాటిల్లుతున్నట్లు ఇటలీ, చిలీ, గేలిసియా శాస్త్రవేత్తల తాజా అధ్యయనంలో తేలింది. అధ్యయనం వివరాలను ‘నేచర్ అస్ట్రానమీ’ పత్రికలో ప్రచురించారు. రానున్న రోజుల్లో విపరిణామాలే: భూగోళం చుట్టూ ప్రస్తుతం 8,000కు పైగా శాటిలైట్లు చక్కర్లు కొడుతున్నాయి. ఇవి భూమిపై ప్రతి అంగుళాన్ని కవర్ చేస్తున్నాయి. స్పేక్ఎక్స్ సంస్థ 3,000కు పైగా చిన్నపాటి ఇంటర్నెట్ శాటిలైట్లను ప్రయోగించింది. వన్వెబ్ కూడా వందలాది కృత్రిమ ఉపగ్రహాలను నింగిలోకి పంపింది. దేశాల మధ్య పోటీ నేపథ్యంలో భవిష్యత్తులోనూ వీటి సంఖ్య పెరగడమే తప్ప తగ్గే అవకాశాలు కనిపించడం లేదు. మరోవైపు విద్యుత్ లైట్ల అవసరం పెరుగుతూనే ఉంది. శాటిలైట్ల నుంచి వెలువడే కాంతి, కరెంటు దీపాల నుంచి కాంతి వల్ల భూమిపై ప్రకృతికి విఘాతం వాటిల్లుతున్నట్లు సైంటిస్టులు గుర్తించారు. వీటివల్ల రాత్రిపూట ఆకాశం స్పష్టంగా కనిపించడం లేదని తేల్చారు. ‘‘అంతేగాక ఖగోళ శాస్త్రవేత్తల విధులకూ ఆటంకం కలుగుతోంది. అస్ట్రానామికల్ అబ్జర్వేటరీల పనితీరు మందగిస్తున్నట్లు తేలింది. ఈ కాంతి కాలుష్యం కారణంగా రాత్రివేళలో అనంతమైన విశ్వాన్ని కళ్లతో, పరికరాలతో స్పష్టంగా చూడగలిగే అవకాశం తగ్గుతోంది. అంతేగాక భూమిపై జీవుల అలవాట్లలో, ఆరోగ్యంలో ప్రతికూల మార్పులు వస్తున్నాయి’’ అని వెల్లడించారు. దీనికి అడ్డుకట్ట వేసి సహజ ప్రకృతిని పరిరక్షించుకొనే దిశగా దృష్టి పెట్టాలని సూచించారు. పరిష్కారం ఏమిటి? కాంతి కాలుష్యానికి ఇప్పటికిప్పుడు పూర్తిస్థాయి పరిష్కార మార్గం లేదని నిపుణులు అంటున్నారు. దాన్ని తగ్గించేలా చర్యలు చేపట్టడం మేలు. ‘‘శాటిలైట్లలో బ్రైట్నెస్ తగ్గించాలి. టెలిస్కోప్ పరికరాల్లోని షట్టర్లను కాసేపు మూసేయడం ద్వారా కాంతి తీవ్రతను తగ్గించవచ్చు’’ అని సూచిస్తున్నారు. కృత్రిమ ఉపగ్రహాలతో కాంతి కాలుష్యమే గాక మరెన్నో సమస్యలున్నాయి. కాలం తీరిన శాటిలైట్లు అంతరిక్షంలోనే వ్యర్థాలుగా పోగుపడుతున్నాయి. అంతరిక్ష కాలుష్యాన్ని వెదజల్లుతున్నాయి. పైగా వీటినుంచి ప్రమాదకర విష వాయవులు వెలువడుతుంటాయి. ఆర్బిటాల్ ట్రాఫిక్ మరో పెను సమస్య. – సాక్షి, నేషనల్ డెస్క్ -
హామీలు నెరవేర్చకపోతే.. అక్కడ నాయకుల పని ఫినిష్! బంధించి..
ప్రజలు చేత ప్రత్యక్ష్యంగా ఎన్నుకోబడిన రాజకీయ నాయకులు ప్రజలకు జవాబుదారిగా ఉంటారు. ఇది అందరికీ తెలిసిందే. ఐతే ప్రతి నాయకుడు తనని గెలిపిస్తే ఇవి చేస్తాం, అవి చేస్తాం అంటూ ఎన్నెన్నో హామీలు ఇచ్చేస్తుంటారు. ఆ తర్వాత గెలిచాక అసలు వాటిని గుర్తుంచుకునే తీరికే లేనట్లు ప్రవర్తిస్తారు. మళ్లీ ఎన్నికలు వచ్చేంత వరకు ప్రజలు గానీ, వారికిచ్చిన హామీలు గానీ వారికి గుర్తేరావు, ఔనా! ఐతే ఇక్కడ ఆ ఊరిలో మాత్రం అలా కుదరదట. నాయకులు హామీలు నెరవేర్చకపోతే ఇక అంతే సంగతులు. ప్రజలే అక్కడ వారిని బహిరంగంగా శిక్షిస్తారు. మళ్లీ ఇలాంటి పని చేయకుండా వారిలో మార్పు వచ్చేలా చేస్తారట. వివరాల్లోకెళ్తే..ఇటలీలో ఓ చిన్న పట్టణంలో ఈ వింత ఆచారం కొనసాగుతోంది. అక్కడ తాము ఎన్నుకున్న నాయకుడు తప్పుడుగా వ్యవహరించినా, తప్పుడు పనులు చేసినా ఇక అంతే సంగతులు. అలాగే ప్రజలకు ఇచ్చిన వాగ్దానాలు నిలబెట్టుకోలేకపోయినా.. వారిని బోనులో బంధించి నీటిలో ముంచేస్తారు. అలా అని వారిని చనిపోయేంత వరకు నీటిలో ముంచేయరు. తాము చేసిన తప్పు వారికి అవగతమయ్యేలా జస్ట్ ఒక్క సెకను మాత్రమే అలా బోనులో బంధించి నీటిలో ముంచుతారు. ఇది వారికి ఒక అవమానంలా అనిపించి ఎలాంటి తప్పులు దొర్లకుండా తమ విధులను సక్రమంగా నిర్వర్తించేలా చేయడమే తప్ప మరో ఉద్దేశ్యం ఏమి లేదని చెబుతున్నారు అక్కడి స్థానికులు. ఇది ఇటలీలోని టోంకాలో సాంప్రదాయకంగా జరుగుతుంది. ప్రతి ఏడాది జూన్ చివరిలో జరిగే విజిలియన్ వేడుకలో ఇది ఒక భాగం. అంతేగాదు ఈ శిక్షలను జూన్ 26కు ముందు, చివరి ఆదివారం విధిస్తారు. గతేడాది 2022 జూన్ 19న దీనిని నిర్వహించారు. 2023, జూన్ 25 ఈ కార్యక్రమం ఉంటుంది. (చదవండి: మంటల్లో చిక్కుకున్న బస్సు..అదే టైంలో కండక్టర్ నిద్రిస్తుండటంతో..) -
Italy Crisis: దుర్భిక్షం దిశగా ఇటలీ.. చుక్క నీరు లేక విలవిల..
రోమ్: ఐరోపా దేశం ఇటలీ నీటి సంక్షోభంతో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటోంది. నదులు, జలాశయాలు, కొలనులలో చుక్క నీరు లేక విలవిల్లాడుతోంది. 70 ఏళ్ల చరిత్రలో ఎన్నడూ లేనంతగా భూగర్భ జలాలు అడుగంటాయి. గతేడాదితో పోల్చితే వర్షపాతం 40 శాతం పడిపోయింది. వేసవికాలం ముగిసి చాలా రోజులవుతున్నా వర్షాలు పడకపోడవంతో ప్రజలు పరిస్థితి వర్ణణాతీతంగా మారింది. తాగడానికి మంచి నీరు కూడా లేని పరిస్థితి వచ్చింది. దీంతో ఇటలీ ప్రభుత్వం దేశంలో అత్యవసర పరిస్థితిని ప్రకటించింది. నీటి కొరతను అధిగమించేందు 35 మిలియన్ యూరోలను కేటాయిస్తున్నట్లు తెలిపింది. ప్రజలు నీటిని పరిమితంగా ఉపయోగించేలా ఆంక్షలు విధించింది. ఎవరైనా నీటిని పరిమితి కంటే ఎక్కువగా ఉపయోగించినా, వృథా చేసినా 500 యూరోల జరిమానా విధించేందుకు సిద్ధమైంది. ఎమర్జెన్సీ ప్రకటించినందున ప్రభుత్వం ఇలాంటి చర్యలు తీసుకోవచ్చు. నీటి సంక్షోభం కారణంగా ఇటలీలోని పలు ప్రాంతాల్లో వ్యవసాయ రంగంపై తీవ్ర ప్రభావం పడింది. నీటి స్థాయిలు సాధారణం కంటే 85 శాతం క్షీణించడంతో రైతుల పంటలకు సాగనీరు లేని దుస్థితి నెలకొంది. దీంతో దేశ ఆహార ఉత్పత్తి మూడింట ఒక వంతు తగ్గే అవకాశం ఉందని నిపుణులు ఆందోళన వ్యక్తం చేశారు. పెరుగుతున్న ఉష్ణోగ్రతల వల్ల జంతువులు కూడా ఇబ్బంది పడుతున్నట్లు పేర్కొన్నారు. అయితే ఇటలీలో ఈ పరిస్థితికి వాతావరణ మార్పులే ప్రధాన కారణమని పర్యావరణ నిపుణులు చెప్పారు. ఉష్ణోగ్రతలు విపరీతంగా పెరగడం, సకాలంలో వర్షాలు కురవకపోవడం ప్రపంచానికి ఓ అలర్ట్ అని పేర్కొన్నారు. చదవండి: ఒక్కరోజు నిద్రలేకపోతే ఇంత జరుగుతుందా? పరిశోధనలో షాకింగ్ నిజాలు! -
ఇటలీ సముద్ర జలాల్లో పడవ మునక
రోమ్: ఇటలీ సముద్ర జలాల్లో వలసదారులు ప్రయాణిస్తున్న ఒక చెక్క పడవ రెండు ముక్కలై నీళ్లల్లో మునిగిపోయింది. ఆదివారం జరిగిన ఈ ప్రమాదంలో ఎందరో మరణించారు. ఇప్పటివరకు సహాయ సిబ్బంది 58 మృతదేహాలను వెలికి తీశారు. మరో 60 మంది ప్రాణాలు కాపాడారని స్టేట్ టీవీ వెల్లడించింది. ప్రమాదం జరిగినప్పుడు పడవలో 180 మందికి పైగా శరణార్థులున్నట్టుగా తీర ప్రాంత పట్టణమైన క్రోటోన్లో ఓడరేవు అధికారులు చెబుతున్నారు. సామర్థ్యానికి మించి ప్రయాణికుల్ని ఎక్కించడం వల్లే అయోనియాన్ సముద్రంలో ప్రయాణిస్తున్న పడవ ధ్వంసమై ఈ ప్రమాదం జరిగినట్టుగా ప్రాథమికంగా తెలుస్తోంది. -
నాసా విద్యుత్ విమానం వచ్చేస్తోంది
కేంబ్రిడ్జ్: గగనతలంలో భారీ స్థాయిలో కర్భన ఉద్గారాలను వెదజల్లే చిన్న విమానాలకు చరమగీతం పాడేందుకు అమెరికా అంతరిక్ష పరిశోధనా సంస్థ నాసా నడుం బిగించింది. వాయుకాలుష్యం లేని అధునాతన విద్యుత్ విమానాన్ని సిద్ధంచేస్తోంది. ఈ ప్రయోగాత్మక విమానానికి ఎక్స్–57 అని నామకరణం చేసింది. ఈ ఏడాదే ఈ బుల్లి విమానం గగనతల అరంగేట్రం చేయనుంది. దీనిని 14 ప్రొపెల్లర్లను అమర్చారు. ఇటలీ తయారీ టెక్నామ్ పీ2006టీ నాలుగు సీట్ల విమానానికి ఆధునికత జోడించి లిథియం అయాన్ బ్యాటరీలతో పనిచేసేలా కొత్త ఎలక్ట్రిక్ ఏరోప్లేన్ను సిద్ధంచేస్తున్నారు. సాధారణంగా ఉండే రెండు రెక్కలకే అటు నుంచి ఇటు చివరిదాకా సమ దూరంలో ఎక్కువ బ్యాటరీలు, చిన్న మోటార్ల కలయితో ప్రొపెల్లర్లను ప్రయోగాత్మక డిజైన్లో అమర్చడం విశేషం. ప్రయాణసమయంలో ప్రొపెల్లర్తో పనిలేనపుడు వెంటనే దాని బ్లేడ్లు వెనక్కి ముడుచుకుంటాయి. దీంతో వేగం తగ్గే ప్రసక్తే లేదు. కొత్త డిజైన్ ప్రొపెల్లర్లతో శబ్దకాలుష్యం తక్కువ. ఎక్కువ సాంద్రత ఉండే గాలిలోనూ అత్యంత వేగంగా దూసుకెళ్లేలా 11 బ్లేడ్లతో ప్రొపెలర్లను రీడిజైన్ చేశారు. ప్రొపెల్లర్లతో జనించే అత్యంత అధిక శక్తి కారణంగా ఈ విమానాలకు పొడవాటి రన్వేలతో పనిలేదు. అత్యల్ప దూరాలకు వెళ్లగానే గాల్లోకి దూసుకెళ్లగలవు. ప్రస్తుతానికి 200 కిలోమీటర్లలోపు, గంటలోపు ప్రయాణాల కేటగిరీలో దీనిని ప్రవేశపెట్టాలని యోచిస్తున్నారు. -
వరల్డ్ మోస్ట్ బ్యూటిఫుల్ నటి మృతి
ప్రపంచంలోనే అందమైన నటిగా పేరుగాంచిన తార ఇకలేరు. ఇటాలియన్ వెండితెర రాణిగా వెలుగొందిన జినా లొల్లో బ్రిగిడా(95) ఇవాళ కన్నుమూశారు. ప్రస్తుతం ఆమె అనారోగ్య సమస్యలతో బాధపడుతూ మరణించారు. ఈ విషయాన్ని ఇటాలియన్ వార్తా సంస్థ అన్సా ధృవీకరించింది. దీంతో హాలీవుడ్ సినీ ప్రముఖులు ఆమెకు సంతాపం తెలిపారు. ఆమె ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థిస్తున్నారు. హాలీవుడ్లో 'బ్రెడ్, లవ్ అండ్ ఫాంటసీ' సినిమాలో తన పాత్రకు బాగా ప్రసిద్ది చెందింది. 1950వ దశకంలో మోస్ట్ బ్యూటిఫుల్ ఉమెన్ ఇన్ ది వరల్డ్గా పేరు సంపాదించింది. ఫ్రాంక్ సినాట్రా, హంఫ్రీ బోగార్ట్, మార్సెల్లో మాస్ట్రోయాని లాంటి నటులతో 60కి పైగా చిత్రాలలో నటించింది. 1960 తర్వాత రాజకీయాల్లోకి వెళ్లడంతో కెరీర్ నెమ్మదించింది. జినా ఇటలీలోని సుబియాకోలోని సంపన్న కుటుంబంలో 1927లో జన్మించింది. చదువు కోసం 20 సంవత్సరాల వయస్సులో రోమ్కి వెళ్లింది. ఆమె సినిమాల్లో నటనకు అనేక అవార్డులను గెలుచుకుంది. -
యూఎస్ఏ ఖాతాలో యునైటెడ్ కప్
సిడ్నీ: తొలిసారి నిర్వహించిన మిక్స్డ్ టీమ్ టెన్నిస్ టోర్నీ యునైటెడ్ కప్లో యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా (యూఎస్ఏ) జట్టు విజేతగా అవతరించింది. ఆదివారం జరిగిన ‘బెస్ట్ ఆఫ్ ఫైవ్’ మ్యాచ్ల ఫైనల్లో అమెరికా 4–0తో ఇటలీపై గెలిచింది. మహిళల తొలి సింగిల్స్లో జెస్సికా పెగూలా 6–4, 6–2తో మార్టినా ట్రెవిసాన్పై నెగ్గగా... రెండో సింగిల్స్లో టియాఫో 6–2తో తొలి సెట్ గెలిచాక అతని ప్రత్యర్థి లోరెంజో ముసెట్టి గాయంతో వైదొలిగాడు. దాంతో అమెరికా 2–0తో ఆధిక్యంలోకి వెళ్లింది. మూడో సింగిల్స్లో ప్రపంచ తొమ్మిదో ర్యాంకర్ టేలర్ ఫ్రిట్జ్ (అమెరికా) 7–6 (7/4), 7–6 (9/7)తో ప్రపంచ 16వ ర్యాంకర్ బెరెటినిని ఓడించడంతో అమెరికాకు టైటిల్ ఖరారైంది. నామమాత్రపు నాలుగో సింగిల్స్లో మాడిసన్ కీస్ 6–3, 6–2తో లూసియాపై నెగ్గి అమెరికా ఆధిక్యాన్ని 4–0కు పెంచింది. ఫలితం తేలిపోవడంతో డబుల్స్ మ్యాచ్ను నిర్వహించలేదు. ఈ టోర్నీలో మొత్తం 18 దేశాలు పాల్గొన్నాయి. -
చూపులో సైకిల్.. రేటులో బుల్లెట్
సాక్షి, ఫిఠాపురం: చూడటానికి అది సైకిలే కానీ రేటులో మాత్రం బుల్లెట్తో పోటీ పడుతోంది. సామాన్యుడి వాహనం సైకిల్ అసామాన్యంగా మారిపోయింది. కాకినాడకు చెందిన ఓ ఫర్నిచర్ వ్యాపారి తన కుమారుడు చైతన్య కోసం ఏకంగా విదేశాల నుంచి సైకిల్ కొనుగోలు చేశారు. ఇటలీకి చెందిన ఈ సైకిల్ రేటు అక్షరాలా రూ.1.40 లక్షలు. మోటారు సైకిల్ మాదిరిగా రిజిస్ట్రేషన్ నంబరుతో పాటు లైసెన్సు కలిపి అంత ధర అయ్యిందని చెబుతున్నారు. చూడటానికి మామూలు సైకిల్లానే ఉన్నా నిర్మాణంలో కొత్తదనం కనిపిస్తోంది. బుల్లెట్ బండి రేటుతో పోటీ పడుతున్న ఈ సైకిల్ ప్రస్తుతం పిఠాపురం రోడ్డులో ఆకర్షణగా నిలుస్తోంది. (చదవండి: రిపోర్ట్లో అసలు గుట్టు.. మరో మహిళతో వివాహేతర సంబంధం పెట్టుకుని..) -
ఆ ఊరంతా అద్దెకు.. ఒక్క రోజుకు ఎంతంటే?
ఏదైనా ఊరికి బదిలీ అయితే, ఆ ఊళ్లో ఇల్లు అద్దెకు తీసుకోవడం మామూలు. కొద్దిరోజుల పనికోసమే అయితే, హోటల్ గది అద్దెకు తీసుకోవడమూ మామూలే. ఇటలీలోని ఒక చిత్రమైన ఊరుంది. ఎవరైనా నిర్ణీత మొత్తం చెల్లిస్తే, ఏకంగా ఆ ఊరంతటినీ అద్దెకు తీసుకోవచ్చు. ఇటలీ నడిబొడ్డున ఉండే లె మార్షె ప్రాంతంలో ఉన్న ఈ మధ్యయుగాల నాటి ఊరి పేరు పెట్రిటోలి. రోమన్ నాగరికత కాలం నాటి పురాతన కట్టడాలు, వాటిలోని నేలమాళిగలు, బోటిక్ లాడ్జింగులు, వాటితో పాటే ముప్పయ్యేడు పడకగదుల భారీ రాచప్రాసాదం, ఒక రంగస్థల వేదిక ఈ ఊరి ప్రత్యేకతలు. వీటన్నిటితో కూడిన ఈ ఊరును అద్దెకు తీసుకోదలచుకున్న వారు రోజు 1303 పౌండ్లు (రూ.1,28,577) చెల్లించాల్సి ఉంటుంది. యూరోప్లోని సంపన్నుల్లో చాలామంది కుటుంబ సమావేశాలు, పెళ్లిళ్లు, పుట్టినరోజు వేడుకలు వంటి కార్యక్రమాల కోసం దీనిని అద్దెకు తీసుకుంటున్నారు. సముద్రమట్టానికి మూడువందల మీటర్ల ఎత్తున ఉండే ఈ ఊరి వాతావరణం చల్లగా ఆహ్లాదభరితంగా ఉంటుంది. చదవండి: Winter Festivals: శీతకాలంలో ఇక్కడ మనుషులు బతకలేరని రాయడంతో! శీతాకాల సంబరాల విశేషాలు.. -
Winter: వేడినీటి బుగ్గల్లో స్నానాలు.. ముల్లంగి, తామరతూళ్లు తింటే..!
Funday Cover Story- Worldwide Winter Festivals: శీతకాలం చిరుచలితో మొదలై, గజగజ వణికించే స్థాయికి చేరుతుంది. చలిపంజా దెబ్బకు జనాలు రాత్రివేళ ఇంటి నుంచి బయటకు అడుగుపెట్టేందుకే వెనుకాడుతారు. శీతకాలం రాగానే, అప్పటివరకు అలమరాల అట్టడుగున పడివున్న చలిదుస్తులు ఒంటిమీదకు వస్తాయి. వీథుల్లో చలిమంటల సందడి మొదలవుతుంది. చలితీవ్రత పెరిగే కొద్ది, మనుషులకు వణుకూ పెరుగుతుంది. చలిలో ఆరుబయటకు వచ్చేవాళ్లు ఒద్దికగా చేతులు కట్టుకుని చలిని కాచుకుంటారు. చలికాలంలో కొన్నిచోట్ల తెరిపిలేని హిమపాతంతో నేలంతా మంచుతో నిండిపోతుంది. శీతకాలం మొదలయ్యే వేళ దీపావళి, శీతకాలం తారస్థాయిలో ఉండేటప్పుడు మకరసంక్రాంతి వేడుకలను మనం జరుపుకొంటాం. శీతకాలంలో ప్రపంచవ్యాప్తంగా వివిధ దేశాల ప్రజలు వారి వారి సంప్రదాయ వేడుకలను జరుపుకొంటారు. వ్యవసాయ పనులు ముగిసి, కాస్త తీరిక దొరికే కాలం కావడంతో సంబరాలు చేసుకుంటారు. కాలానికి తగినట్లుగా ప్రత్యేకమైన వంటకాలను ఆగరిస్తారు. ఆరుబయటకు చేరి ఆట పాటలతో శీతల వాతావరణాన్ని ఆస్వాదిస్తారు. వివిధ దేశాల్లో జరుపుకొనే శీతకాల సంబరాలను, వాటి విశేషాలను తెలుసుకుందాం... షెట్లాండ్ వైకింగ్ ఫెస్టివల్ స్కాట్లాండ్లోని షెట్లాండ్ ప్రాంతంలో క్రిస్మస్ వేడుకలు ముగిసినప్పటి నుంచి మూడునెలల వరకు సుదీర్ఘంగా కొనసాగే చలిమంటల వేడుక ‘షెట్లాండ్ వైకింగ్ ఫెస్టివల్’. స్థానికంగా ఈ వేడుకలను ‘అప్ హెలీ ఆ’ అంటారు. షెట్లాండ్ రాజధాని లెర్విక్లో ఈ వేడుకల్లో భాగంగా జనవరి మూడో మంగళవారం రోజున జనాల ఆట పాటలతో వాద్యాల హోరుతో భారీ ఊరేగింపు జరుగుతుంది. వైకింగ్ల పొడవాటి పడవలను అనుకరిస్తూ ప్రత్యేకంగా రూపొందించిన దుస్తులు ధరించి, మేళతాళాలతో ఈ ఊరేగింపులో పాల్గొంటారు. తొలినాళ్లలో తారుపీపాలకు నిప్పుపెట్టి స్లెడ్జిబళ్ల మీద మంచునిండిన వీథుల్లోకి లాక్కొచ్చేవారు. ఇటీవలికాలంలో తారుపీపాలకు నిప్పుపెట్టడం వంటి పనులు మానేసి, ఎక్కడికక్కడ చలిమంటలు వేసుకుని, వేడుకలు జరుపుకొంటున్నారు. వెనిస్ కార్నివాల్ ఇటలీలోని వెనిస్ నగరంలో శీతకాలం ముగుస్తూ ఉండే సమయంలో జరిగే ఉత్సవం ఇది. క్రైస్తవుల ఉపవాస దినాలైన ‘లెంట్’ రోజుల్లోని ‘యాష్ వెన్స్డే’ నుంచి మొదలయ్యే వెనిస్ కార్నివాల్ ‘ష్రోవ్ ట్యూస్డే’ వరకు మూడువారాల పాటు జరిగే ఈ వేడుకల్లో భారీ ఎత్తున జనాలు పాల్గొంటారు. దేశ విదేశాల నుంచి సుమారు ముప్పయి లక్షలకు పైగా జనాలు వెనిస్ వీథుల్లో జరిగే ఊరేగింపుల్లో చిత్రవిచిత్ర వేషధారణలతో రకరకాల మాస్కులు ధరించి తిరుగుతూ సందడి చేస్తారు. ఈ వేడుకల్లో భాగంగా వెనిస్ కూడళ్లలో ఏర్పాటు చేసే బహిరంగ వేదికలపై సంగీత, నృత్య, నాటక ప్రదర్శనలు నిర్వహిస్తారు. ముఖాలకు మాస్కులు ధరించడాన్ని రోమన్ చక్రవర్తి 1797లో నిషేధించడంతో చాలాకాలం ఈ వేడుకలు కనుమరుగయ్యాయి. ఇటలీ ప్రభుత్వం సాంస్కృతిక పునరుద్ధరణలో భాగంగా 1979 నుంచి పునఃప్రారంభించడంతో వెనిస్ కార్నివాల్ అంతర్జాతీయ పర్యాటకులను ఆకర్షించే స్థాయికి చేరుకుంది. లా ఫాలాస్ వాలెన్షియా స్పెయిన్లోని వాలెన్షియా నగరంలోను, చుట్టుపక్కల పట్టణాలు, గ్రామాల్లోను ఈ వేడుకలు ఏటా మార్చి 1 నుంచి 19 వరకు జరుగుతాయి. ఈ వేడుకల్లో మార్చి 15 నుంచి 19 వరకు ఐదురోజుల పాటు సెయింట్ జోసెఫ్ స్మారకార్థం ప్రత్యేక ప్రార్థన కార్యక్రమాలను నిర్వహిస్తారు. వీథుల్లో చలిమంటలను వెలిగించి ఆటపాటలతో జనాలు కాలక్షేపం చేస్తారు. మార్చిలో శీతకాల సంబరాలేమిటా అనుకోకండి. అక్కడ మార్చిలోనూ మంచు కురుస్తూనే ఉంటుంది. చలిమంటల ముందు సేదదీరుతూ విందు వినోదాలు, గానా భజానాలతో జనం ఉల్లాసంగా గడుపుతారు. ఈ రోజుల్లో ప్రత్యేకంగా తయారు చేసే బిర్యానీ మాదిరి ‘ప్యేలా’ అనే వంటకాన్ని సామూహిక విందుల్లో వడ్డిస్తారు. దీని తయారీలో బియ్యం, మేక, గొర్రె, కుందేలు, కోడి, చేపలు, ప్రత్యేక సుగంధ ద్రవ్యాలను ఉపయోగిస్తారు. లా ఫాలెస్ వాలెన్షియాను ‘యునెస్కో’ వారసత్వ వేడుకగా గుర్తించింది. నయాగరా వింటర్ ఫెస్టివల్ ఆఫ్ లైట్స్ నయాగరా జలపాతం మామూలుగా చూస్తేనే కళ్లకు మిరుమిట్లు గొలుపుతుంది. ఇక శీతకాలంలో రాత్రివేళ ఈ జలపాతం వద్ద ఆరుబయట చేసే విద్యుద్దీపాలంకరణలు చూస్తే, రంగు రంగుల నక్షత్రాలు కళ్లముందే కదలాడినట్లుంటుంది. నయాగరా జలపాతం వద్ద కెనడాలో ఏటా శీతకాలం పొడవునా ‘వింటర్ ఫెస్టివల్ ఆఫ్ లైట్స్’ వేడుకలను దేదీప్యమానంగా నిర్వహిస్తారు. ఈసారి నవంబర్ 12న మొదలైన ఈ వేడుకలు ఫిబ్రవరి 20 వరకు కొనసాగనున్నాయి. విద్యుద్దీప కాంతుల వెలుగులో ధగధగలాడే నయాగరా అందాన్ని తిలకించేందుకు పెద్దసంఖ్యలో పర్యాటకులు ఇక్కడకు చేరుకుంటారు. ఈ సందర్భంగా పలు వినోద కార్యక్రమాలు, బాణసంచా ప్రదర్శనలు కూడా జరుగుతాయి. హార్బిన్ ఐస్ అండ్ స్నో స్కల్ప్చర్ ఫెస్టివల్ చైనాలో ఏటా శీతకాలంలో జరిగే అంతర్జాతీయ హిమశిల్పకళా వేడుకలు ఇవి. హీలోంగ్జియాంగ్ ప్రావిన్స్లోని హార్బిన్ నగరంలో జరిగే ఈ వేడుకలను తిలకించేందుకు దేశ విదేశాల నుంచి దాదాపు రెండుకోట్ల మంది వరకు వస్తారు. ప్రపంచంలోనే అత్యంత భారీ హిమశిల్పాలు ఈ ఉత్సవాల్లో కొలువుదీరుతాయి. హార్బిన్ నగరంలోని కూడళ్లలోను, నగరం మీదుగా ప్రవహించే సోంఘువా నదీ తీరంలోను భారీ ఎత్తున హిమశిల్పాలను ఏర్పాటు చేస్తారు. సైబీరియా మీదుగా వీచే చలిగాలుల వల్ల సోంఘువా నదిలోని నీళ్లు గడ్డకట్టిపోతాయి. నదిలో నుంచి వెలికితీసిన భారీ మంచుదిమ్మలతోనే స్థానిక కళాకారులు శిల్పాలను చెక్కి, ప్రదర్శనకు ఉంచుతారు. చైనాలో ఈ వేడుకలు 1963 నుంచి జరుగుతూ వస్తున్నాయి. ఏటా డిసెంబర్ చివరి వారం నుంచి ఫిబ్రవరి చివరి వారం వరకు జరిగే ఈ వేడుకల ద్వారా చైనా ప్రభుత్వానికి పర్యాటక ఆదాయం దండిగానే లభిస్తుంది. టోజి మత్సురి జపాన్లో జరుపుకొనే శీతకాల వేడుకలు ‘టోజి మత్సురి’. ఈ వేడుకలనే ‘టోజిసాయి’ అని కూడా అంటారు. మంచు కురిసే ప్రాంతాల్లో ఆరుబయట గుడారాలు వేసుకుని, వాటి ముందు చలిమంటలు వేసుకుని, ఆటపాటలతో గడుపుతారు. ‘ఓన్సెన్’ అనే వేడినీటి బుగ్గల్లో స్నానాలు చేస్తారు. నిజానికి ఈ వేడినీటి బుగ్గల్లో ఏడాది పొడవునా స్నానాలు చేస్తుంటారు గాని, శీతకాలం తప్పనిసరిగా వీటిలో స్నానం చేయడం ఆరోగ్యకరమని జపానీయులు నమ్ముతారు. గతించిన పెద్దలను తలచుకుంటూ చెరువుల్లో దీపాలను విడిచిపెడతారు. శీతకాలంలో గుమ్మడి, క్యారెట్, ముల్లంగి, తామరతూళ్లు తినడం శుభప్రదమనే నమ్ముతారు. ముఖ్యంగా తామరతూళ్లతో తయారుచేసే రెన్కాన్ చిప్స్ను చిన్నాపెద్దా ఇష్టంగా తింటారు. రేక్జావిక్ వింటర్ లైట్స్ ఫెస్టివల్ ఐస్లాండ్లోని రేక్జావిక్ నగరంలో ఏటా శీతకాలంలో వింటర్ లైట్స్ ఫెస్టివల్ వేడుకలు జరుగుతాయి. నగరంలోని చారిత్రిక కట్టడాలు, మ్యూజియమ్లు, పార్కులు, ఈతకొలనులు, మైదానాలు వంటివాటిని రంగురంగుల విద్యుద్దీపాలతో అలంకరిస్తారు. నగరంలోని వేడినీటి బుగ్గలలో జనాలు ఈతలు కొడతారు. వేడుకలు జరిగేంత కాలం రాత్రివేళల్లో మ్యూజియమ్లన్నీ సందర్శకుల కోసం తెరిచే ఉంచుతారు. కూడళ్లలో ఏర్పాటు చేసే తాత్కాలిక వేదికలపైనా, నగరంలోని రంగస్థలాలపైన సంగీత, నృత్య, వినోద కార్యక్రమాలు కోలాహలంగా సాగుతాయి. హ్వాషియోన్ సాన్షియోనియో ఐస్ ఫెస్టివల్ దక్షిణ కొరియాలోని గాంగ్వన్ డో ప్రావిన్స్లో ఏటా శీతకాలంలో ఐస్ ఫెస్టివల్ వేడుకలు జరుగుతాయి. హ్వాషియోన్ నగరంలో గడ్డకట్టిన నదిపై రకరకాల క్రీడలు, వినోద కార్యక్రమాలను నిర్వహిస్తారు. నది ఎగువ ప్రాంతంలోని సాన్షియోనియో వద్ద మంచుదిమ్మల మీద ఏర్పడిన రంధ్రాల గుండా చేపలను పట్టే పోటీలను నిర్వహిస్తారు. భారీస్థాయి మంచుశిల్పాలను తీర్చిదిద్ది ప్రదర్శిస్తారు. పర్యాటకులను ఆకట్టుకునేందుకు కొరియన్ ప్రభుత్వం ఈ సందర్భంగా వివిధ కార్యక్రమాలను నిర్వహిస్తుంది. ఏటా జనవరి 14 నుంచి ఫిబ్రవరి 5 వరకు జరిగే ఈ వేడుకలు తిలకించేందుకు దేశ విదేశాల నుంచి 15 లక్షల మందికి పైగా పర్యాటకులు వస్తుంటారు. డ్రాగన్ కార్నివాల్ స్లోవేనియా రాజధాని ల్యూబ్లీయానలో ఏటా శీతకాలంలో జరిగే సంప్రదాయ వేడుక డ్రాగన్ కార్నివాల్. పురాతన పేగన్ సంస్కృతికి ఆనవాలుగా కొనసాగే ఈ వేడుకల్లో భారీ ఊరేగింపులు నిర్వహిస్తారు. వేలాది మంది చిత్రవిచిత్రమైన మాస్కులు, రంగు రంగుల దుస్తులు ధరించి పాల్గొంటారు. భారీసైజులోని ఆకుపచ్చని డ్రాగన్ బొమ్మను మోసుకుంటూ ఊరేగిస్తారు. సంప్రదాయ వాద్యపరికరాలను మోగిస్తూ, నాట్యం చేస్తూ నగర వీథుల్లో సందడి చేస్తారు. పదమూడో శతాబ్దిలో పేగన్, క్రైస్తవ సంస్కృతులు పరస్పరం కలగలసిపోయిన నాటి నుంచి డ్రాగన్ కార్నివాల్ జరుగుతూ వస్తోందని చెబుతారు. నలభైరోజుల లెంట్ ఉపవాస దినాలకు ముందుగా, జనవరి చివరి వారంలో లేదా ఫిబ్రవరి మొదటి వారంలో ఈ సంబరాన్ని నిర్వహిస్తారు. కలోన్ వింటర్ కార్నివాల్ జర్మనీలోని కలోన్ నగరంలో ఏటా వింటర్ కార్నివాల్ వేడుకలు భారీ స్థాయిలో జరుగుతాయి. పదకొండో నెల పదకొండో తేదీన– అంటే, ఏటా నవంబర్ 11న ఉదయం 11.11 గంటల నుంచి ‘కార్నివాల్’ సీజన్ మొదలవుతుంది. వీథుల్లో చిత్రవిచిత్ర వేషధారణలతో నిర్వహించే ఊరేగింపులతో ఈ వేడుకలు జనవరి 6 వరకు కొనసాగుతాయి. ఈ రోజుల్లో ‘ఫ్యాట్ థర్స్డే’ నుంచి ‘యాష్ వెన్స్డే’ వరకు వారం రోజులను ‘క్రేజీ డేస్’ అంటారు. ఈ వారం రోజుల్లోనూ మరింత భారీ స్థాయిలో వేడుకలు జరుగుతాయి. పిల్లలూ పెద్దలూ వీథుల్లోకి చేరి, ఆటపాటలతో కాలక్షేపం చేస్తారు. వివిధ దేశాల నుంచి వచ్చే బ్యాండ్ బృందాలు, నృత్యబృందాలు ఊరేగింపుల్లో పాల్గొంటాయి. కలోన్ కార్నివాల్లో పాల్గొనేందుకు ముఖ్యంగా యూరోప్ నలుమూలల నుంచి జనాలు పెద్దసంఖ్యలో వస్తారు. సప్పోరో స్నో ఫెస్టివల్ జపాన్లోని సప్పోరో నగరంలో ఏటా ఫిబ్రవరిలో జరిగే వేడుక ఇది. మంచుగడ్డ కట్టే పరిస్థితుల్లో మంచుతో శిల్పాలను తీర్చిదిద్ది ప్రదర్శిస్తారు. ఈసారి 2023 ఫిబ్రవరి 4 నుంచి 11 వరకు ఈ వేడుకలు జరగనున్నాయి. సప్పోరో నగరంలోని ఓడోరి పార్క్, సుసుకినో, సుడోమ్ సహా పలు ప్రదేశాలు ఈ వేడుకల్లో హిమశిల్ప ప్రదర్శనలకు వేదికలుగా నిలుస్తాయి. ఓడోరి పార్క్లో హిమశిల్పాల పోటీలు కూడా జరుగుతాయి. ఈ పోటీల్లో పాల్గొనేందుకు ప్రపంచం నలుమూలలకు చెందిన కళాకారులు వందలాదిగా ఇక్కడకు వస్తుంటారు. సప్పోరో స్నో ఫెస్టివల్ 1950లో తొలిసారిగా ఒకరోజు కార్యక్రమంగా మొదలైంది. అప్పట్లో ఆరుగురు హైస్కూల్ విద్యార్థులు ఓడోరి పార్క్లో చేరి, మంచుతో శిల్పాలు మలచి సందర్శకులను ఆకట్టుకున్నారు. జపాన్ సైనిక దళాలు కూడా 1955 నుంచి ఈ వేడుకల్లో పాల్గొనడం ప్రారంభించడంతో ఇవి వారంరోజుల వేడుకలుగా మారాయి. అనతికాలంలోనే ఈ వేడుకలు అంతర్జాతీయ ప్రాచుర్యం పొందాయి. ఇక్కడి హిమశిల్పాలను తిలకించడానికి దేశవిదేశాల నుంచి ఏటా దాదాపు పాతిక లక్షల మంది వరకు పర్యాటకులు వస్తుంటారు. సెయింట్ పాల్ వింటర్ కార్నివాల్ అమెరికాలోని మిన్నెసోటా రాష్ట్ర రాజధాని సెయింట్ పాల్లో ఏటా శీతకాలంలో భారీ కార్నివాల్ జరుగుతుంది. ఈ కార్నివాల్ వెనుక ఒక కథ ఉంది. న్యూయార్క్కు చెందిన ఒక పాత్రికేయుడు సెయింట్ పాల్ను ‘మరో సైబీరియా’గా పోలుస్తూ కథనం రాశాడు. శీతకాలంలో ఇక్కడ మనుషులు బతకలేరని అతను రాశాడు. ఈ కథనం స్థానికులకు కోపం తెప్పించింది. శీతకాలంలో కూడా సెయింట్ పాల్లో మనుషులు బతుకుతారని, అంతేకాదు, ఉల్లాసంగా ఉత్సాహంగా వేడుకలూ జరుపుకొంటారని రుజువు చేసేందుకు 1885లో మాంట్రియల్ సరిహద్దుల్లో ఒక మంచుసౌధాన్ని నిర్మించి వేడుకలు నిర్వహించారు. ఈ వేడుకలు 1937 వరకు ఒక క్రమం లేకుండా జరుగుతూ వచ్చాయి. తిరిగి 1946 నుంచి ఏటా క్రమపద్ధతిలో నిర్వహించడం ప్రారంభమైంది. ఈ వేడుకల కోసం భారీ హిమసౌధాన్ని సిద్ధం చేస్తారు. వీథుల్లో పరేడ్లు, రాత్రివేళల్లో కాగడాల ఊరేగింపులు, సంగీత నృత్య కార్యక్రమాలు, హిమశిల్పాల తయారీ పోటీలు వంటి కార్యక్రమాలు నిర్వహిస్తారు. క్యూబెక్ వింటర్ కార్నివాల్ కెనడాలోని క్యూబెక్ నగరంలో ఏటా ఫిబ్రవరిలో పదిరోజుల పాటు వింటర్ కార్నివాల్ జరుగుతుంది. ఈసారి ఫిబ్రవరి 3 నుంచి 12 వరకు ఈ వేడుకలు జరగనున్నాయి. క్యూబెక్లో 1893 నుంచి జరుగుతూ వస్తున్న ఈ కార్నివాల్లో పాల్గొనేందుకు కెనడా, అమెరికా, యూరోప్ల నుంచి పెద్దసంఖ్యలో పర్యాటకులు వస్తుంటారు. నగరంలో పగలూ రాత్రీ కూడా కోలాహలంగా ఊరేగింపులు జరుగుతాయి. వాద్యపరికరాలను మోగిస్తూ, విచిత్రవేషధారణలతో వేలాది మంది ఈ ఊరేగింపుల్లో పాల్గొంటారు. ఈ సందర్భంగా మంచుశిల్పాల ప్రదర్శనలు, క్రీడా కార్యక్రమాలు, సాంస్కృతిక కార్యక్రమాలు, విందు వినోద కార్యక్రమాలను నిర్వహిస్తారు. Funday Cover Story: అత్యధిక దూరం వలసపోయే పక్షి ఏదో తెలుసా? -
FIFA WC: నాలుగుసార్లు చాంపియన్ ఇటలీ ఎక్కడ?
ఫుట్బాల్లో ప్రతీ జట్టుకు కొందరు వీరాభిమానులు ఉంటారు. అందునా ఫిఫా వరల్డ్కప్లో విశ్వవిజేతగా అవతరించిన జట్లపై అభిమానం అయితే మరీ ఎక్కువ. మరి అలాంటిది నాలుగుసార్లు విశ్వ విజేత అయిన ఇటలీ ఈసారి ఖతర్ వేదికగా జరుగుతున్న ఫిఫా వరల్డ్కప్కు ఎందుకు దూరమైందని సగటు అభిమాని ప్రశ్నిస్తున్నాడు. ఒకప్పుడు ఫుట్బాల్లో దేదీప్యమానంగా వెలిగిన ఇటలీ ఇప్పుడు కనీసం అర్హత సాధించేందుకే నానా కష్టాలు పడుతోంది. ఫిఫా వరల్డ్కప్లో ఇటలీది ప్రత్యేక ప్రస్థానం. నాలుగుసార్లు జగజ్జేతగా అవతరించిన ఘనత ఇటలీ జట్టుకు ఉంది. 18 సార్లు ఫిఫా వరల్డ్కప్స్ ఆడిన ఇటలీ.. 1934. 1938, 1982, 2006లో చాంపియన్స్గా అవతరించింది. అలాంటి ఇటలీ ఇప్పుడు ఫిఫా వరల్డ్కప్కు క్వాలిఫై కూడా కాలేకపోయింది. ఇక ప్రపంచకప్లో ఇటలీ కనిపించకపోవడం వరుసగా ఇది రెండోసారి. ఈ నేపథ్యంలో ప్రపంచకప్కు అది ఎందుకు అర్హత సాధించలేకపోయిందో ఇప్పుడు చూద్దాం. ►యూఈఎఫ్ఏ ప్రపంచకప్ క్వాలిఫికేషన్ రౌండ్ గ్రూప్-సిలో స్విట్జర్లాండ్, నార్తరన్ ఐర్లాండ్, బల్గేరియా, లిథువేనియాతో కలిసి డ్రా చేసుకుంది. నాలుగేళ్ల క్రితం రష్యాలో జరిగిన ప్రపంచకప్ కప్కు ఇటలీ అర్హత సాధించడంలో విఫలం కావడంతో కోచ్ రాబర్టో మాన్సినీ, జట్టుపై ఒత్తిడి విపరీతంగా ఉంది. ►ఇక గతేడాది జరిగిన యూరోపియన్ చాంపియన్షిప్ నుంచి విరామం తీసుకోవడానికి ముందు నార్తరన్ ఐర్లాండ్, బల్గేరియా, లుథువేనియాతో జరిగిన మ్యాచుల్లో వరుస విజయాలు సాధించింది. టోర్నమెంటులో విజయం సాధించాక వరుసగా బల్గేరియా, స్విట్జర్లాండ్తో మ్యాచ్లను డ్రా చేసుకుంది. అంతకుముందు స్వదేశంలో లుథువేనియాతో జరిగిన మ్యాచ్లో 5-0తో విజయం సాధించింది. 2006 ఫిఫా వరల్డ్కప్ ►దీంతో ఇంకా రెండు మ్యాచ్లు మిగిలి ఉండగానే అర్హత సాధించినట్టుగా కనిపించింది. అయితే, ఆ తర్వాత స్విట్జర్లాండ్తో జరిగిన మ్యాచ్ 1-1తో డ్రా కావడంతో చివరి రౌండ్కు ముందు ఇరు జట్లు సమాన పాయింట్లతో నిలిచాయి. ►యూరో 2020 విజయం తర్వాత నాలుగు నెలలకు నార్తరన్ ఐర్లాండ్-ఇటలీ మధ్య జరిగిన మ్యాచ్ 0-0తో డ్రా అయింది. అదే సమయంలో బల్గేరియాతో జరిగిన మ్యాచ్లో స్విట్జర్లాండ్ విజయం సాధించడంతో ప్రపంచకప్ క్వాలిఫయింగ్ గ్రూప్లో స్విట్జర్లాండ్ అగ్రస్థానానికి చేరుకుంది. 1982 ఫిఫా వరల్డ్కప్ ఇటలీ ప్రపంచకప్ ప్లే ఆఫ్స్ ఆశలు ఎలా అడుగంటాయి? ►నిర్ణయాత్మక ప్లే ఆఫ్ టైలో పోర్చుగల్తో తలపడాల్సిన ఇటలీ.. స్వదేశంలో నార్త్ మాసడోనియాతో జరిగిన మ్యాచ్లో 1-0తో ఓటమి పాలు కావడంతో ఫైనల్స్ అవకాశాలు కోల్పోవడంతో 2022 వరల్డ్కప్కు కూడా దూరమైంది. ►నార్తరన్ మాసడోనియా ఫైనల్కు చేరుకుంది. అక్కడ ఆ జట్టును 2-0తో ఓడించిన పోర్చుగల్ ప్రపంచకప్లో చోటు దక్కించుకుంది మరి 2018 ప్రపంచకప్కు ఎందుకు క్వాలిఫై కాలేదు? 2018 ప్రపంచకప్ కోసం జరిగిన క్వాలిపికేషన్ రౌండ్ గ్రూప్-జిలో ఇటలీ రెండో స్థానంతో సరిపెట్టుకుంది. 2017లో స్వదేశంలో స్వీడన్తో జరిగిన మ్యాచ్ 0-0తో డ్రా కావడంతో 60 సంవత్సరాల తర్వాత తొలిసారి ప్రపంచకప్కు అర్హత సాధించడంలో ఇటలీ విఫలమైంది. 1938 ఫిఫా వరల్డ్కప్ చదవండి: మారడోనా సరసన మెస్సీ.. కళ్లు చెదిరే గోల్ చూడాల్సిందే ఒక ఫుట్బాల్ ఆటగాడి కోసం ఇంతలా వెతికారా? -
ఇటాలియన్ దీవిలో వింత గుడ్లగూబ
ఇటాలియన్ దీవి ‘ప్రిన్సిపి’లో ఒక కొత్తజాతికి చెందిన గుడ్లగూబను శాస్త్రవేత్తలు కనుగొన్నారు. ఆఫ్రికా పశ్చిమ తీరానికి ఆవల గల్ఫ్ ఆఫ్ గినీలో ఉన్న ఈ చిన్న దీవిలో తొలిసారిగా 2016లో ఈ జాతి గుడ్లగూబను గుర్తించారు. మరిన్ని పరిశోధనలు జరిపిన శాస్త్రవేత్తలు, ఈ జాతి గుడ్లగూబలు ‘ప్రిన్సిపి’ దీవిలో మాత్రమే ఉన్నట్లు తేల్చారు. అందువల్ల దీనికి ‘ప్రిన్సిపి స్కోప్స్ ఔల్’ అని పేరు పెట్టారు. ఈ గుడ్లగూబలు ఇతర జాతుల గుడ్లగూబల కంటే పరిమాణంలో కొంత చిన్నవిగా ఉంటాయి. మిగిలిన గుడ్లగూబలతో పోల్చితే వీటి కూత కూడా చాలా విలక్షణంగా ఉన్నట్లు శాస్త్రవేత్తలు చెబుతున్నారు. ప్రిన్సిపి దీవికి చెందిన ఫారెస్ట్ రేంజర్ సెసిలియానో దొ బోమ్ జీసస్ అందించిన సమాచారంతో ఈ విలక్షణమైన గుడ్లగూబను గుర్తించగలిగామని శాస్త్రవేత్తలు వెల్లడించారు. -
ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన భవంతి.. కానీ..
ఈ ఫొటోలో కనిపిస్తున్నది ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన భవంతి. ఇటలీ రాజధాని రోమ్ నగరంలో ఉందిది. రోమ్లోని ఖరీదైన ప్రాంతాల్లో ఒకటైన వియా వెనెటోకు కూతవేటు దూరంలో ఉన్న ఈ భవంతి పదహారో శతాబ్దం నాటిది. దీని సీలింగ్పై ఆనాటి సుప్రసిద్ధ ఇటాలియన్ చిత్రకారుడు కరవాగియో చిత్రించిన మ్యూరల్స్ ఈ భవంతికి ప్రత్యేక ఆకర్షణ. దాదాపు 70 ఎకరాల ప్రాంగణంలో ఉన్న ఈ భవంతి విస్తీర్ణం 30 వేల చదరపు అడుగులు. ఇటలీలోని ప్రముఖ కుటుంబాల్లో ఒకటైన లుదోవిసీ కుటుంబానికి చెందిన ఈ భవంతిలో ప్రస్తుతం ప్రిన్స్ నికోలా లుదోవిసీ బోన్కాంపానీ మూడో భార్య ప్రిన్సెస్ రీటా బోన్కాంపానీ లుదోవిసీ ఉంటున్నారు. ప్రిన్స్ నికోలో మొదటి భార్య సంతానం ఆస్తి కోసం దావా వేయడంతో ఈ భవంతిని ఇప్పుడు వేలం వేసే పరిస్థితి ఏర్పడింది. ప్రస్తుత మార్కెట్ విలువ ప్రకారం ఈ భవంతికి 53,900 కోట్ల డాలర్లు (రూ. 44.31 లక్షల కోట్లు) ఉంటుందని అధికారుల అంచనా. ఈ ఏడాది జనవరిలోను, ఆ తర్వాత ఏప్రిల్లోను దీనికి వేలం ప్రకటించినా, దీనిని కొనుగోలు చేసేందుకు ఎవరూ ముందుకు రాలేదు. అపర కుబేరులెవరైనా ముందుకొస్తే తప్ప ఈ భవంతిని వేలంలో అమ్మడం సాధ్యం కాదని ఇటాలియన్ అధికారులు అంటున్నారు. వేలంలో కొనడానికి ఎవరూ ముందుకు రాకపోవడంతో దీనిని ఇటాలియన్ ప్రభుత్వమే కొనుగోలు చేస్తే బాగుంటుందని ప్రిన్సెస్ రీటా దాదాపు 40 వేల సంతకాలతో ప్రభుత్వానికి ఒక పిటిషన్ను సమర్పించారు. అయితే, ఈ భవంతి విలువ ఇటలీ సాంస్కృతిక శాఖ బడ్జెట్కు మించి ఉండటంతో అధికారులు తలలు పట్టుకుంటున్నారు. చదవండి: ఉద్యోగులకు ఊహించని షాక్!..ట్విటర్,మెటా బాటలో మరో దిగ్గజ సంస్థ! -
ఫిఫా వరల్డ్కప్ ట్రోఫీ ఎలా తయారు చేస్తారో తెలుసా?
ఫుట్బాల్లో సాకర్ సమరానికి ఉండే క్రేజ్ వేరు. ఫిఫా వరల్డ్కప్ కోసం ప్రపంచంలోని నలుమూలల నుంచి దేశాలు పోటీ పడుతుండడంతో ఎనలేని క్రేజ్ వచ్చింది. జరిగేది నాలుగేళ్లకోసారి అయినప్పటికి దానిని సొంతం చేసుకోవాలని ప్రతీ జట్టు ప్రయత్నిస్తుంటుంది. 32 జట్లు పాల్గొనే ఈ మెగా సమరంలో చివరికి ట్రోఫీ మాత్రం దక్కేది ఒక్కరికే. ఇప్పటివరకు ఫిఫా వరల్డ్కప్ ట్రోఫీ ప్రపంచవ్యాప్తంగా 51 దేశాల్లో పర్యటించింది. దీనిని తయారు చేసే విధానం నుంచి దీని విలువ వరకూ అన్నీ ఆశ్చర్యం కలిగించేవే. మరి బంగారు వర్ణంలో దగదగ మెరిసిపోయే ఫిఫా వరల్డ్కప్ ట్రోఫీ వెనుక ఉన్న చరిత్రతో పాటు ఎవరు తయారు చేస్తారు.. ఎలా తయారు చేస్తారనేది తప్పకుండా తెలుసుకోవాల్సిందే. ఇక ఈసారి ఫిఫా వరల్డ్కప్ టోర్నీ ఖతార్ వేదికగా నవంబర్ 20న ప్రారంభమై.. డిసెంబర్ 18న ముగుస్తోంది. ఫిఫా వరల్డ్కప్ తయారు చేసేది ఇలా.. ఫిఫా వరల్డ్కప్ను 18 క్యారెట్ల బంగారంతో తయారు చేస్తారు. ఈ ట్రోఫీ ఎత్తు 37 సెంటీమీటర్లు. బరువు ఆరు కేజీలు. ఇద్దరు వ్యక్తులు భూగోళాన్ని మోస్తున్నట్లుగా ఈ ట్రోఫీని తీర్చిదిద్దారు. ఈ ట్రోఫీని తయారు చేసినప్పుడు దీని విలువ 50 వేల డాలర్లు. కానీ దీని ప్రస్తుత విలువ 2 కోట్ల డాలర్లు. అంటే మన కరెన్సీలో సుమారు రూ.160 కోట్లు కావడం విశేషం. ట్రోఫీ తయారు చేసేది ఆ కుటుంబమే 50 ఏళ్లకుపైగా ఫిఫా వరల్డ్కప్ ట్రోఫీని ఇటలీకి చెందిన ఒకే కుటుంబం తయారు చేస్తోంది. వరుసగా రెండోసారి కూడా ఇటలీ టీమ్ వరల్డ్కప్లో పాల్గొనకపోయినా.. ఈ ట్రోఫీ రూపంలో ఇటలీ ప్రాతినిధ్యం ఉండటం విశేషం. ప్రస్తుత ట్రోఫీని 1971లో ఇటలీలోని సిల్వియో గాజానిగా అనే ఆర్టిస్ట్ రూపొందించాడు. అంతకుముందు ట్రోఫీని బ్రెజిల్కు ఇచ్చేయడంతో ఈ కొత్త ట్రోఫీని రూపొందించాల్సి వచ్చింది. వరుసగా మూడుసార్లు గెలిచే జట్టుకు అసలు ట్రోఫీ ఇక ఇప్పుడు కూడా ఫిఫా వరల్డ్కప్ ట్రోఫీని గాజానిగా కుటుంబమే తయారు చేస్తూ వస్తోంది. నిజానికి ప్రతిసారీ విజేతకు బంగారు ట్రోఫీని బహూకరించి తర్వాత తిరిగి తీసుకుంటారు. వాళ్లకు బంగారుపూత ఉన్న నకలును ఇస్తారు. అయితే ఏదైనా టీమ్ మూడుసార్లు ట్రోఫీని గెలిస్తే వాళ్లకు మాత్రం అసలు ట్రోఫీని ఇచ్చేసి మళ్లీ కొత్తగా మరొక ట్రోఫీని తయారు చేస్తారు. ఈ ట్రోఫీని జూలెస్ రిమెట్ ట్రోఫీగా పిలుస్తారు. ఫిఫా మూడో అధ్యక్షుడిగా ఉన్న రిమెట్ గౌరవార్థం ట్రోఫీకి ఆ పేరు పెట్టారు. ఫిఫా వరల్డ్కప్ ట్రోఫీ తయారు విధానాన్ని సిల్వియోగాజానిగా కుటుంబం అల్జజీరా చానెల్తో పంచుకుంది. దీనికి సంబంధించిన వీడియోనూ యూట్యూబ్లో షేర్ చేయగా వైరల్గా మారింది. చదవండి: FIFA: ప్రపంచానికి తెలియని కొల్హాపూర్ ఫుట్బాల్ చరిత్ర FIFA WC 2022: బెల్జియంపై భారీ అంచనాలు.. టైటిల్ ఫేవరెట్గా బరిలోకి..! -
అరుదైన సంగీత శస్త్ర చికిత్స: బ్యాండు మేళం వాయిస్తుంటే.. సర్జరీ చేసేశారు
ఇటలీలోని ఒక వ్యక్తి అత్యంత అరుదైన శస్త్ర చికిత్స చేశారు వైద్యులు. అతను శాక్సోఫోన్(బ్యాండు మేళ వాయిద్యం) వాయిస్తూ...ఉంటే ఆపరేషన్ చేసేశారు. అది కూడా దాదాపు తొమ్మిది గంటల ఆపరేషన్ని విజయవంతంగా పూర్తి చేశారు వైద్యులు. ఈ మేరకు జీజెడ్ అనే 35 ఏళ్ల వ్యక్తికి రోమ్లోని పైడియా ఇంటర్నేషనల్ ఆస్పత్రి ఈ అరుదైన శస్త్ర చికిత్స చేసింది. డాక్టర్ క్రిస్టియన్ బ్రోగ్నా ఈ శస్త్ర చికిత్స గురించి మాట్లాడుతూ..."ఈ సర్జరీలో రోగి స్ప్రుహలోనే ఉండాలి. అతని మెదడుకు సంబంధించిన న్యూరానల్ ఫంక్షన్ జరుగుతుండాలి. అంటే మాట్లాడటం, కదలడం, లెక్కించడం, గుర్తించడం, ఆడటం వంటివి అన్నమాట. పేషంట్ ఎట్టి పరిస్థితుల్లో నిద్రపోకూడదు. ఈ శస్త్ర చికిత్సను సుమారు 10 మందితో కూడిన వైద్యా బృందం చేస్తోంది. మొదటగా వైద్యులకు ఈ శస్త్ర చికిత్స ఎలా సాధ్యం అనే సందేహం కలిగింది. ఎందుకంటే చేసేది బ్రెయిన్ సర్జరీ. అందుకు రోగి పూర్తిగా సహకరించాలి. ఏ మాత్రం భయపడకుండా మేల్కొని ఉండి చేయించుకోవాలి. అసలు టెన్షన్కి గురికాకూడదు. వైద్యులుకు కూడా ఈ శస్త్ర చికిత్స అతిపెద్ద సవాలుతో కూడుకున్నది. దీంతో వైద్యుల సదరు రోగితో మాట్లాడుతుండగా... అతను సంగీతకారుడని తెలుసుకున్నాం. దీంతో తాము ఈ చికిత్స సమయంలో తనకు ఇష్టమైన సంగీత వాయిద్యాన్ని వాయిస్తుండమని, నిద్రపోకూడదని చెప్పాం. దీంతో జీజెడ్ కూడా వైద్యులకు పూర్తిగా సహకరించి, ఏ మాత్రం భయపడకుండా బ్యాండు మేళ వాయిస్తూ చేయించుకున్నాడు. ఈ శస్త్ర చికిత్స ద్వారా రోగి బ్రెయిన్లో ఒక నిర్థిష్ట ప్రాంతంలో ఉన్న కణితిని తొలగించి వ్యాధిని నయం చేస్తాం. అంతేకాదండోయ్ సదరు పేషంట్ శస్త్ర చికిత్స జరుగుతున్నంత సేపు ఇటాలియన్ జాతీయ గీతాన్ని, 1970ల లవ్స్టోరీ చిత్రంలోని థీమ్ సాంగ్ని వాయించాడని వైద్యులు చెప్పారు. తాము అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించి రోగి మేల్కోని ఉండగానే ఈ శస్త్ర చికిత్స చేయగలిగాం." అని డాక్టర్ క్రిస్టియన్ బ్రోగ్నా సంతోషంగా చెప్పారు. (చదవండి: పాకిస్తాన్పై బైడెన్ సంచలన వ్యాఖ్యలు... ఆ దేశాలతో ముప్పు) -
గాల్లోకి ఎగిరాక ఊడిపోయిన విమానం టైర్
రోమ్: అట్లాస్ ఎయిర్కు చెందిన బోయింగ్ 747 విమానం గాల్లోకి ఎగిరిన కాసేపటికే దాని ల్యాండింగ్ గేర్ టైర్ ఊడిపోయింది. ఈ సంఘటన ఇటలీలోని టరంటో విమానాశ్రయం నుంచి బయలుదేరిన కాసేపటికే జరిగింది. ఈ భారీ విమానాన్ని ప్రధానంగా బోయింగ్ 787 డ్రీమ్లైనర్ పరికరాలను రవాణా చేసేందుకు ఉపయోగిస్తుంటారు. ఇటలీలోని టరంటో ఎయిర్పోర్ట్ నుంచి బయలుదేరి అమెరికాలోని చార్లెస్టన్కు చేరుకోవాల్సి ఉంది. విమానం టైర్ ఊడిపోయిన దృశ్యాలు కెమెరాలో నమోదయ్యాయి. భారీ రవాణా విమానం రన్వేపై వేగంగా వెళ్తూ గాల్లోకి ఎగిరింది. అయితే, ఆ కాసేపటికే ల్యాండింగ్ గేర్ టైర్ ఊడిపోయింది. రన్వేపై పడి కొంత దూరం దొర్లుతూ వెళ్లింది. చక్రం ఊడిపోయిన క్రమంలో నల్లటి పొగ సైతం వచ్చినట్లు వీడియోలో స్పష్టంగా తెలుస్తోంది. అయితే, ఎలాంటి ప్రమాదం జరగలేదు. టైర్ ఊడిపోయినప్పటికీ అలాగే అమెరికా చేరిన విమానం.. చార్లెస్టన్ విమానాశ్రయంలో సురక్షితంగా దిగింది. టైర్ టరంటో ఎయిర్పోర్ట్ రన్వే చివరిలో గుర్తించారు. బోయింగ్ 747 డ్రీమ్లిఫ్టర్ రవాణా విమానం. బోయింగ్ 747-400 ఎయిర్క్రాఫ్ట్ను ఆధునికీకరించి రవాణా విమానంగా తీర్చిదిద్దారు. ప్రస్తుతం విమాన పరకరాలను రవాణా చేసేందుకు ఉపయోగిస్తున్నారు. సెప్టెంబర్, 2006లో తొలిసారి గాల్లోకి ఎగిరింది. అయితే, వస్తు రవాణాకు మాత్రమే అనుమతి ఉంది. కేవలం విమాన సిబ్బంది మినహా మానవ రవాణాకు దీనిని ఉపోయోగించేందుకు అనుమతి లేదు. Un Boeing 747 Dreamlifter operat de Atlas Air (N718BA) care a decolat marți dimineață (11OCT22) din Taranto (IT) spre Charleston (SUA) a pierdut o roată a trenului principal de aterizare în timpul decolării. Avionul operează zborul #5Y4231 și transportă componente de Dreamliner. pic.twitter.com/R95UHkLD7V — BoardingPass (@BoardingPassRO) October 11, 2022 ఇదీ చదవండి: Work From Pub Trend: యూకేలో నయా ట్రెండ్ ‘వర్క్ ఫ్రమ్ పబ్’.. ఆడుతూ పాడుతూ పని! -
అద్భుత దృశ్యం.. సముద్రంపై రెక్కలు విచ్చుకున్న ‘పడవలు’
రోమ్: సముద్రంపై రెక్కలు విప్పుకుని వాలినట్లు కనిపిస్తున్న ఈ దృశ్యాలను చూస్తే అద్భుతంగా అనిపిస్తుంది కదా. అయితే, ఇవి పక్షలు కాదు.. తెరచాప పడవలు. ఆదివారం ఇటలీలోని ట్రీస్టెలో ఏడ్రియాటిక్ సముద్ర తీరం వెంట జరుగుతున్న 54వ బార్కొలానా పడవపందెంలో భాగంగా ఈ అద్భుతం దృశ్యం ఆవిషృతమైంది. 2022, అక్టోబర్ 1వ తేదీ నుంచి 9వ తేదీ వరకు బార్కొలానా వీక్ పేరుతో ఈ పోటీలు నిర్వహించారు. ప్రపంచంలోనే అతిపెద్ద పడవ పోటీగా ఇది 2018లోనే గిన్నిస్ వరల్డ్ రికార్డ్స్లోకి ఎక్కింది ఈ పడవల పందెం. ప్రస్తుతం వారం రోజుల పాటు అట్టహాసంగా సాగిన ఈ తెరచాప పడవల పరుగు పందెం 54వ ఎడిషన్. ఇందులో 2,689 పడవలు పాలుపంచుకున్నట్లు నిర్వాహకులు తెలిపారు. ప్రతి ఏటా ట్రీస్టే గల్ఫ్ ప్రాంతంలో అక్టోబర్ రెండో ఆదివారం నిర్వహిస్తారు. పడవల ఆకృతిని బట్టి విభజించి పోటీలు చేపడతారు. తొలిసారి 1969లో ఈ తెరచాప పడల పోటీలు నిర్వహించగా అందులో 51 బోట్లు పాల్గొన్నాయి. ఆ తర్వాత ఆదరణ పెరిగి ప్రపంచవ్యాప్తంగా ఉన్న సెయిలర్స్ ఇందులో పాల్గొనేందుకు ఉత్సాహం చూపించారు. ఇదీ చదవండి: అత్యంత ఎత్తైన వృక్షం... ఫలించిన మూడేళ్ల నిరీక్షణ -
తల్లిపాలలోనూ ప్లాస్టిక్!
సాక్షి, హైదరాబాద్: సృష్టిలో స్వచ్ఛమైన పదార్థమంటే టక్కున గుర్తొచ్చేది అమ్మ పాలే. కానీ ఇప్పుడా తల్లి పాలు సైతం కలుషితం అవుతున్నాయి. విచ్చలవిడిగా పెరిగిపోయిన ప్లాస్టిక్ రక్కసి చివరికి తల్లి పాలలోనూ చేరుతోంది. ఆ రూపంలో శిశువుల శరీరంలోనికీ వెళుతోంది. పొద్దున లేచినప్పటి నుంచి రాత్రి నిద్రపోయేవరకు ప్రతి పనిలో, ప్రతిచోటా ప్లాస్టిక్తో ముడిపడిపోయిన పరిస్థితే దీనికి కారణమని శాస్త్రవేత్తలు స్పష్టం చేస్తున్నారు. ప్లాస్టిక్ సంచులు, డబ్బాలు, పాత్రల్లో వేసిన ఆహారాన్ని తీసుకుంటున్నప్పుడు, ప్లాస్టిక్ బాటిళ్లతో నీళ్లు, ఇతర పానీయాలు తాగుతున్నప్పుడు అతి సూక్ష్మ ప్లాస్టిక్ ముక్కలు మన శరీరంలోకి ప్రవేశిస్తున్నాయి. పీల్చే గాలి ద్వారా ప్లాస్టిక్ కణాలు ఊపిరితిత్తుల్లోకి చేరుతున్నాయి. మనుషుల రక్తంలో కూడా ప్లాస్టిక్ ముక్కలు ఉన్నట్టు కొద్దిరోజుల కింద శాస్త్రవేత్తలు తేల్చారు. అలాంటిది చివరికి తల్లిపాలలోనూ ప్లాస్టిక్ చేరినట్టు ఇటలీ వైద్య విశ్వవిద్యాలయం శాస్త్రవేత్తలు తాజాగా గుర్తించారు. పరిశీలన సాగిందిలా..: స్త్రీ వైద్యులు, శాస్త్రవేత్తల బృందం యూనివర్సిటీ ఆస్పత్రిలో 34 మంది తల్లుల నుంచి నిర్ణీత మొత్తంలో పాల నమూనాలను సేకరించింది. వాటిని రామన్ మైక్రో స్పెక్ట్రోస్కొపీ సాంకేతికత సాయంతో విశ్లేషించింది. ఈ సందర్భంగా 26 మంది పాలలో సూక్ష్మ ప్లాస్టిక్ అవశేషాలను గుర్తించారు. ఆ మైక్రో ప్లాస్టిక్ కణాలు ఏ రకమైనవి, వాటి పరిణామం, రంగులను నిర్ధారించారు. కొందరి పాలలో అయితే రెండు, మూడు రకాల మైక్రో ప్లాస్టిక్లు కూడా ఉన్నట్టు గుర్తించారు. ఇవన్నీ కూడా ఆహారాన్ని ప్యాకింగ్ చేయడానికి, నిల్వ చేయడానికి, రవాణా చేయడానికి ఉపయోగంచే ప్లాస్టిక్ రకాలేనని తేల్చారు. రకరకాలుగా కలుషితం ఆహారం, కలుషిత గాలి ద్వారా ప్లాస్టిక్ మన శరీరంలోకి చేరుతోందని శాస్త్రవేత్తలు చెప్తున్నారు. ఆహార పదార్థాల ఉత్పత్తి మొదలు.. నిల్వ, రవాణా, వండటం, వడ్డించడం, చివరి ప్లాస్టిక్ చెంచాలతో తినడం వరకు అన్ని స్థాయిల్లో ప్లాస్టిక్ చేరుతోంది. ఆహారం ద్వారా శరీరంలోకి వెళుతోంది. ఇక ప్లాస్టిక్ వస్తువుల వినియోగంతో అతి సూక్ష్మ ప్లాస్టిక్ కణాలు గాలిలో చేరుతున్నాయి. శ్వాస ద్వారా ఊపిరితిత్తుల్లోకి, వాటి నుంచి రక్తంలో ప్రవేశించి శరీర భాగాలన్నింటికీ వెళుతున్నాయి. సముద్రాలు, నదులు, చెరువులు, ఇతర నీటి వనరుల్లో ప్లాస్టిక్ వ్యర్థాలు పేరుకుపోతున్నాయి. ప్రస్తుతం 3.6 మిలియన్ టన్నుల ప్లాస్టిక్ వ్యర్థాలు సముద్రాల్లో చేరినట్టు అంచనా. ప్లాస్టిక్ ఉత్పత్తులు నీటిలో కలవడం, వాటి నుంచి అతిచిన్న ముక్కలు నీటిలోకి, జలచరాల్లోకి చేరడం, వాటిని ఆహారంగా తీసుకుంటున్న మన శరీరంలోకి చేరడం జరుగుతోంది. ఇదంతా అత్యంత సూక్ష్మస్థాయిలో ముంచుకొస్తున్న ప్రమాదమని శాస్త్రవేత్తలు స్పష్టం చేస్తున్నారు. ప్లాస్టిక్ వినియోగాన్ని తగ్గించాల్సిందే.. భారత ఆహార ప్రమాణాల సంస్థ (ఎఫ్ఎస్ఎస్ఏఐ), ఐసీఎంఆర్ సంస్థల వివరాల ప్రకారం మన దేశంలో మానవాళిపై ప్లాస్టిక్ కణాల ప్రభావంపై పరిశోధన జరగలేదు. ప్రపంచ దేశాల్లో ఎక్కడా కూడా ఈ అంశంలో సరైన స్పష్టత లేదని ఐసీఎంఆర్ అంటోంది. తల్లిపాలలోనూ ప్లాస్టిక్ కణాలు చేరుతున్నాయని తేలిన నేపథ్యంలో ఈ అంశంపై పరిశోధనలు మరింతగా జరగాల్సి ఉంది. మన దేశంలో ప్లాస్టిక్ వినియోగం చాలా ఎక్కువగా ఉంది. దీన్ని తగ్గించాల్సిన అవసరముంది. ప్రభుత్వాలు కఠిన నిబంధనలు తీసుకురావాలి. – డాక్టర్ కిరణ్ మాదల, క్రిటికల్ కేర్ విభాగాధిపతి, నిజామాబాద్ ప్రభుత్వ వైద్య కళాశాల గర్భిణులు, బాలింతలు ప్లాస్టిక్కు దూరంగా ఉండాలి తల్లిపాలలో ప్లాస్టిక్తోపాటు లెడ్ వంటి భారలోహల అవశేషాలు ఉన్నాయన్న కోణంలో పరిశోధనలు జరుగుతున్నాయి. తల్లి పాలలో ప్లాస్టిక్, లెడ్ అవశేషాలతో జరిగే నష్టంపై ప్రస్తుతం ఎలాంటి స్పష్టతా లేదు. కానీ పుట్టినబిడ్డకు తల్లి పాలు అత్యంత కీలకం. అందువల్ల గర్భిణులు, బాలింతలు ప్లాస్టిక్ వినియోగానికి వీలైనంత దూరంగా ఉండాలి. ప్లాస్టిక్ ప్యాకేజింగ్తో ఉండే ఆహారం తీసుకోవద్దు. – డాక్టర్ బబిత మాటూరి, సీనియర్ గైనకాలజిస్ట్ ప్రమాదం ఎంత వరకు? తల్లి పాలలోని ప్లాస్టిక్ అవశేషాలతో బిడ్డకు ప్రమాదం కలగవచ్చని ఈ పరిశోధనలో పాల్గొన్న వైద్య నిపుణులు చెప్తున్నారు. చిన్నారుల మెదడు, నాడీ మండలంపై ప్రభావం చూపడంతోపాటు హార్మోన్ల అసమతుల్యతకు దారి తీయవచ్చని.. ఇది ఎదుగుదలపై ప్రభావం చూపుతుందని అంటున్నారు. అయితే తల్లి పాలలోని మైక్రోప్లాస్టిక్ ద్వారా జరిగే దుష్పరిణామాలపై ఎలాంటి రుజువులు లేవని భారత వైద్య పరిశోధన మండలి (ఐసీఎంఆర్) పేర్కొంది. ఇప్పటివరకు ఈ అంశంపై మన దేశంలో ఎలాంటి పరిశోధన జరగలేదని, పాశ్చాత్య దేశాల్లో కూడా లోతైన పరిశోధనలేవీ లేవని తెలిపింది. -
చరిత్రలోనే తొలిసారి.. ఇటలీ ప్రధానిగా ఓ మహిళ.. ఎవరీ జార్జియా మెలోని?
జార్జియా మెలోని(45).. ఇటలీ తొలి మహిళా ప్రధానమంత్రిగా అవతరించారు. రెండో ప్రపంచ యుద్ధం తర్వాత ఇటలీ ప్రధాని పీఠాన్ని అధిష్ఠించిన తొలి ప్రధానిగా ఆమె చరిత్ర పుస్తకాల్లో చోటు సంపాదించుకున్నారు. అంతేగాక ఇటలీ ఏర్పడిన తర్వాత అధికారంలోకి వచ్చిన పూర్తి అతివాద ప్రభుత్వం కూడా ఇదే. బ్రదర్ ఆఫ్ ఇటలీ పార్టీకి చెందిన అతివాద జార్జియా మెలోని ఇటీవల(ఆదివారం) జరిగిన ఎన్నికల్లో మారియో డ్రాఘీపై భారీ మెజార్టీతో గెలుపొందారు. గత ఎన్నికల్లో కేవలం 4 శాతం మాత్రమే ఓట్లు సాధించిన మెలోనీ పార్టీ ఈసారి 25 శాతం ఓట్లతో ఘన విజయం సాధించింది. ఆమె నేతృత్వంలోని కూటమి 43 శాతానికి పైగా ఓట్లను గెలుచుకుంది. ప్రధానిగా గెలిచిన సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. తాము అన్ని వర్గాల ప్రజలకు సేవ చేస్తామని, ఎవరినీ మోసం చేయమని తెలిపారు.ఈ నెలాఖరులోగా ప్రధాని పదవీ బాధ్యతలు చేపట్టే అవకాశం ఉంది Meet Giorgia Meloni, Italy's first female Prime Minister. pic.twitter.com/RHMYYS1rPn — Rishi Bagree (@rishibagree) September 27, 2022 ఎవరీ జర్జియా మెలోని.. జార్జియా గ్రాబ్టెల్లాలోని ఓ కార్మిక కుటుంబంలో జన్మించారు. ఆమె పుట్టిన వెంటనే తండ్రి కుటుంబాన్ని వదిలేసి వెళ్లిపోయాడు. దీంతో మెలోని తన తల్లి వద్దే పెరిగింది. 15 ఏళ్ల వయసులో ఫాసిస్టు నియంత బెనిటో ముస్సోలినీ మద్దతుదారులు స్థాపించిన ‘ఇటాలియన్ సోషల్ మూవ్మెంట్’ యూత్ విభాగంలో చేరారు. 1990లో నేషనల్ అలయెన్స్ (ఏఎన్)లో ఎంఎస్ఐ భాగమైంది. ఆ తర్వాత మాజీ ప్రధాని సిల్వియో బెర్లస్కోనీ స్థాపించిన ప్రధాన కన్జర్వేటివ్ గ్రూపులో విలీనమైంది. చదవండి: క్వీన్ ఎలిజబెత్ హ్యాండ్బ్యాగ్ వెనక ఇంత రహస్యముందా? ‘బ్రదర్ ఆఫ్ ఇటలీ’ స్థాపన 2012లో మెలోని ఏఎన్లోని ఇతర సభ్యులు అందులో నుంచి బయటకు వచ్చి ‘బ్రదర్ ఆఫ్ ఇటలీ’ పార్టీని స్థాపించారు. ఇటలీ జాతీయ గీతంలోని తొలి పంక్తులనే ఈ పార్టీకి పేరుగా పెట్టారు. ఓ ఇంటర్వ్యూలో మెలోని మాట్లాడుతూ.. తన పార్టీని యూఎస్ రిపబ్లికన్ పార్టీ, బ్రిటన్కు చెందిన కన్జర్వేటివ్ పార్టీతో పోల్చారు. తన పార్టీ దేశభక్తికి, కుటుంబ సంప్రదాయ విలువలకు ప్రాధాన్యం ఇస్తుందని వెల్లడించారు. 21 ఏళ్లకే రాజకీయాల్లోకి మెలోని తన 21 ఏళ్ల వయసులోనే అధికారికంగా రాజకీయాల్లోకి అడుగుపెట్టారు. పోటి చేసిన తొలి ఎన్నికల్లోనే విజయం సాధించారు. 2008 బెర్లుస్కోనీ ప్రభుత్వంలో ఆమె యూత్ పోర్ట్ఫోలియో మంత్రిగా పనిచేశారు. అప్పటికి ఆమె వయసు 31 ఏళ్లు. అతిచిన్న వయసులో ఆ ఘనత సాధించిన మహిళగా మెలోని రికార్డులకెక్కారు. 2019లో మెలోని ‘నేను జార్జియా, నేను మహిళను, నేను తల్లిని, నేను ఇటాలియన్ని, నేను క్రిస్టియన్. నా నుంచి వీటిని వేరుచేయలేరు’ అంటూ చేసిన ప్రసంగం ఆమె మద్దతుదారులను ఉత్సాహపరిచింది. ఎల్జీబీటీకి వ్యతిరేకం జూన్లో ఇచ్చిన మరో ప్రసంగంలో ఆమె సంప్రదాయ కుటుంబాలకు మద్దతు ఇస్తానని ప్రకటించారు. లైంగిక గుర్తింపు, ఎల్జీబీటీ లాబీని తీవ్రంగా వ్యతిరేకించారు. లింగపరమైన గుర్తింపునకు ఓకే కానీ, జెండర్ భావజాలానికి తాను వ్యతిరేకమని చెప్పారు. సురక్షితమైన సరిహద్దులకు ఓకే కానీ.. ఇస్లాం హింసకు వ్యతిరేకమని తెలిపారు. మన ప్రజల కోసం పనిచేయాలని కానీ అంతర్జాతీయ ఫైనాన్స్ సంస్థల కోసం కాదని జార్జియా స్పష్టం చేశారు. స్పానిష్ రైటిస్ట్ పార్టీ వోక్స్ మద్దతుదారులను ఉద్దేశించి ఆమె ఈ వ్యాఖ్యలు చేశారు. ఐరోపా పార్లమెంట్లోని మితవాద యూరోపియన్ కన్జర్వేటివ్, రిఫార్మిస్ట్ గ్రూప్కు మెలోని అధ్యక్షురాలిగా ఉన్నారు. ఇందులో ఆమె బ్రదర్స్ ఆఫ్ ఇటలీ, పోలాండ్ నేషనలిస్ట్ లా అండ్ జస్టిస్ పార్టీ, స్పెయిన్ రైట్ వోక్స్ మితవాద స్వీడన్ డెమొక్రాట్లు ఉన్నాయి.. దేశ రాజకీయాల్లో మార్పులు కాగా ఇటలీ ప్రధానిగా మెలోని బాధ్యతలు స్వీకరిస్తే ఆ దేశ రాజకీయాల్లో కీల మార్పులు చోటుచేసుకునే అవకాశం కనిపిస్తోంది. దీనికి కారణం ఆమె ఎల్జీబీటీ హక్కులకు వ్యతిరేకంగా ఆమె తన గళాన్ని వినిపించడం. అలాగే ఇటలీ నౌకాదళం లిబియా సముద్ర మార్గాన్ని మూసివేయాలని డిమాండ్ చేస్తున్నారు. అంతేగాక దేశంలోని ముస్లిం వర్గాలకు వ్యతిరేకంగా తరచూ హెచ్చరికలు జారీ చేశారు. చదవండి: NASA's DART Mission: నాసా ప్రయోగం దిగ్విజయం.. గ్రహశకలాల్ని ఇక దారి మళ్లించగలం! -
మరింత మందిని కనండి.. ఇటాలియన్లకు పోప్ పిలుపు
మటేరా: ఎన్నికల వేళ ఇటాలియన్లు మరింత మంది పిల్లలను కనాలంటూ పోప్ ఫ్రాన్సిస్ ఇచ్చిన పిలుపు అందరినీ ఆశ్చర్యంలో ముంచెత్తింది. ఆదివారం మటేరాలో ఆయన బిషప్ల సమావేశంలో ఈ మేరకు కోరారు. వలసదారులను స్వాగతించాలని పిలుపునిచ్చారు. దేవుడు కుటుంబం, మాతృభూమి’నినాదంతో ప్రచారం చేస్తున్న మెలోనీ నేతృత్వంలోని రైటిస్ట్ పార్టీ కూడా ఎక్కువ మందిని కంటే ప్రోత్సాహకాలిస్తామని వాగ్దానం చేస్తోంది. ప్రపంచంలోనే అత్యంత తక్కువ జననాల రేటున్న దేశాల్లో ఇటలీ ఒకటి. చదవండి: చైనాలో ‘సైనిక కుట్ర’పై... అదే అస్పష్టత -
మన కంటికి కనిపించని అద్భుతాలు.. డ్రోన్ కంటితో చూడొచ్చు..
మన కంటికి కనిపించని అద్భుతాలు.. డ్రోన్ కంటితో చూడొచ్చు.. దానికి నిదర్శనమే ఈ చిత్రాలు.. ఆస్ట్రేలియాలోని న్యూసౌత్వేల్స్ను చుట్టుముట్టేస్తున్నట్లు కనిపిస్తున్న తుపాను మేఘం.. సహారా ఎడారిలో చివరెక్కడుందో తెలియనంత పొడవున్న గూడ్సు రైలు.. మంచుదుప్పట్లో మురిపిస్తున్న తాజ్మహల్ (వెనుక వైపు ఫొటో).. ఈ చిత్రాలు.. 2022 డ్రోన్ ఫొటో పురస్కారాల్లో అర్బన్ కేటగిరీలో జ్యూరీ ప్రశంసలను అందుకున్నాయి. 116 దేశాల నుంచి 2,600 మంది ఫొటోగ్రాఫర్లు తమ ఎంట్రీలను పంపారు. ఆస్ట్రేలియాలోని న్యూసౌత్వేల్స్ను చుట్టుముట్టేస్తున్నట్లు కనిపిస్తున్న తుపాను మేఘం సహారా ఎడారిలో చివరెక్కడుందో తెలియనంత పొడవున్న గూడ్సు రైలు మంచుదుప్పట్లో మురిపిస్తున్న తాజ్మహల్ -
‘మేం ఫ్రీగా డబ్బులిస్తాం...ఇళ్లు కట్టుకోండి’.. బంపరాఫర్ ఇచ్చిన ప్రభుత్వం!
మధ్యదరా సముద్రంలోని రెండో అతిపెద్ద దీవి సార్డినీయా. ఇది ఇటలీ అధీనంలో ఉంది. ఈ అందాల దీవిలో స్థిరపడటానికి ఎవరైనా వెళితే, అక్కడి ప్రభుత్వం 15 వేల యూరోలు (సుమారు రూ.12 లక్షలు) ఇవ్వనున్నట్లు ప్రకటించింది. ఈ దీవికి వెళ్లి స్థిరపడాలనుకునే వారికి డబ్బు పందేరం చేయడం కోసం ప్రవేశపెట్టిన పథకానికి ఇటలీ ప్రభుత్వం 45 మిలియన్ యూరోలు (రూ.356 కోట్లు) కేటాయించింది. ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఈ పథకం కింద డబ్బు తీసుకున్నవారు సార్డినీయా దీవిలోని ఏదైనా పట్టణం లేదా గ్రామంలో ఇల్లు కొనుక్కోవడానికి, మరమ్మతులకు మాత్రమే ఉపయోగించాల్సి ఉంటుంది. అద్భుతమైన వాతావరణం, చక్కని ప్రకృతి వనరులు ఉన్నా, ఆ దీవిలో తగినంత జనాభా లేకపోవ డంతో ప్రభుత్వం ఇటీవల ఈ పథకాన్ని ప్రవేశపెట్టింది. ( ఇంటి పంట: రూఫ్టాప్ పొలం.. 5.7 ఎకరాలు!)