Jemimah Rodrigues For 'The Hundred' Tournament - Sakshi
Sakshi News home page

‘హండ్రెడ్‌’ టోర్నీకి జెమీమా 

Jul 29 2023 2:25 AM | Updated on Jul 29 2023 11:56 AM

Jemima for the Hundred tournament - Sakshi

లండన్‌: భారత మహిళా బ్యాటర్‌ జెమీమా రోడ్రిగ్స్‌ వరుసగా మూడో ఏడాది ఇంగ్లండ్‌లో జరిగే ‘హండ్రెడ్‌’ టోర్నమెంట్‌లో ఆడనుంది. గత రెండేళ్లుగా నార్తర్న్‌ సూపర్‌చార్జర్స్‌ జట్టుకు ఆడుతున్న ఆమెను ముందుగా ఈ సీజన్‌ నుంచి తప్పించాలని ఆ ఫ్రాంచైజీ అనుకుంది.

అయితే నార్తర్న్‌కు ప్రాతినిధ్యం వహిస్తున్న ఆసీస్‌ ప్లేయర్‌ హీథెర్‌ గ్రాహమ్‌ గాయంతో వైదొలగడంతో చివరి నిమిషంలో 22 ఏళ్ల జెమీమాతో ఆ ఫ్రాంచైజీ మళ్లీ కాంట్రాక్టు కుదుర్చుకుంది. ఈ సీజన్‌ ‘హండ్రెడ్‌’ టి20 టోర్నీ వచ్చేనెల 1 నుంచి 27 వరకు జరుగనుంది. ఇందులో నలుగురు భారత క్రికెటర్లు పాల్గొంటున్నారు. లండన్‌ స్పిరిట్‌ జట్టుకు రిచా ఘోష్, ట్రెంట్‌ రాకెట్స్‌కు హర్మన్‌ప్రీత్‌ కౌర్, సదర్న్‌ బ్రేవ్‌కు స్మృతి మంధాన ఆడనున్నారు.    
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement