Jemimah Rodrigues
-
టాప్ ఫోర్... వైల్డ్ ఫైర్
భారత మహిళల జట్టు సొంతగడ్డలో ఐర్లాండ్పై ‘వైల్డ్ ఫైర్’ అయ్యింది. టాప్–4 బ్యాటర్లు గర్జించడంతో మన జట్టు వన్డేల్లో తమ అత్యధిక రికార్డు స్కోరును నమోదు చేసింది. ఓవరాల్గా అంతర్జాతీయ మహిళల వన్డే క్రికెట్లో మూడో అత్యధిక స్కోరు సాధించింది. మిడిలార్డర్ బ్యాటర్ జెమీమా రోడ్రిగ్స్ శతకంతో... ఓపెనర్లు స్మృతి మంధాన, ప్రతీక రావల్, వన్డౌన్లో హర్లీన్ డియోల్ ‘ఫిఫ్టీ’లతో చెలరేగారు. బౌలింగ్లో దీప్తి శర్మ, ప్రియా మిశ్రాలు ఐర్లాండ్ బ్యాటర్ల పని పట్టారు. దీంతో రెండో వన్డేలో స్మృతి మంధాన బృందం భారీ విజయాన్ని నమోదు చేసింది. తొలి రెండు వన్డేల్లో గెలుపుతో ద్వైపాక్షిక సిరీస్ను సొంతం చేసుకున్న భారత జట్టు ఈనెల 15న జరిగే చివరిదైన మూడో వన్డేలో క్లీన్స్వీప్ లక్ష్యంగా బరిలోకి దిగనుంది. రాజ్కోట్: భారత టాపార్డర్ టాప్ లేపే ప్రదర్శనతో ఐర్లాండ్ మహిళల్ని చితగ్గొట్టింది. రెండో వన్డేలో ఓపెనింగ్ జోడీ సహా తర్వాత వచ్చిన మూడు, నాలుగో వరుస బ్యాటర్లూ ఆకాశమే హద్దుగా చెలరేగడంతో రాజ్కోట్ వేదిక పరుగుల ‘పొంగల్’ చేసుకుంది. ఆదివారం జరిగిన రెండో వన్డేలో భారత మహిళల జట్టు 116 పరుగుల భారీ తేడాతో ఐర్లాండ్పై ఘనవిజయం సాధించింది. మిడిలార్డర్ బ్యాటర్, ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’ జెమీమా రోడ్రిగ్స్ (91 బంతుల్లో 102; 12 ఫోర్లు) తన కెరీర్లో తొలి శతకం సాధించగా... హర్లీన్ డియోల్ (84 బంతుల్లో 89; 12 ఫోర్లు), కెప్టెన్ స్మృతి మంధాన (54 బంతుల్లో 73; 10 ఫోర్లు, 2 సిక్స్లు), ప్రతీక రావల్ (61 బంతుల్లో 67; 8 ఫోర్లు, 1 సిక్స్) అర్ధసెంచరీలతో అదరగొట్టారు. దీంతో ముందుగా బ్యాటింగ్ చేపట్టిన భారత్ నిర్ణిత 50 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 370 పరుగుల భారీస్కోరు చేసింది. గతంలో భారత జట్టు ‘బెస్ట్’ స్కోరు 358. 2017లో ఐర్లాండ్పై 358/2 చేసిన అమ్మాయిల జట్టు గత నెల విండీస్పై కూడా 358/5తో ఆ ‘బెస్ట్’ను సమం చేసింది. తర్వాత కొండంత లక్ష్యాన్ని ఛేదించలేక ఐర్లాండ్ 50 ఓవర్లలో 7 వికెట్లు కోల్పోయి 254 పరుగులకు పరిమితమైంది. క్రిస్టీనా కూల్టర్ (113 బంతుల్లో 80; 10 ఫోర్లు) ఒంటరి పోరాటం చేసింది. దీప్తి శర్మ 3, ప్రియా మిశ్రా 2 వికెట్లు తీశారు. తొలి వన్డే గెలిచిన స్మృతి సేన తాజా విజయంతో 2–0తో సిరీస్ వశం చేసుకుంది. 15న చివరి వన్డే జరగనుంది. స్మృతి, ప్రతీక ఫైర్ బ్యాటింగ్కు దిగగానే ఓపెనర్లు స్మృతి, ప్రతీక ఐర్లాండ్ బౌలింగ్ను తుత్తునీయలు చేస్తూ భారీస్కోరుకు గట్టి పునాది వేశారు. దీంతో 7.2 ఓవర్లలో 50 స్కోరు చేసిన భారత్ 100కు (13 ఓవర్లలో) చేరేందుకు ఎంతోసేపు పట్టలేదు. స్మృతి 35 బంతుల్లో, ప్రతీక 53 బంతుల్లో అర్ధసెంచరీలు పూర్తి చేసుకున్నారు. ఇలా ఓపెనర్లిద్దరే తొలి 19 ఓవర్లలో 156 పరుగులు జోడించి శుభారంభం ఇచ్చారు. అదే స్కోరు వద్ద వరుస బంతుల్లో ఇద్దరు నిష్క్రమించారు. ఇక్కడ ముగిసింది సినిమాల్లోలాగా ఫస్టాఫే! అంటే విశ్రాంతి. తర్వాత శుభం కార్డు జెమీమా, హర్లీన్ల జోరు చూపించింది. దీంతో 28 ఓవర్ల పాటు (19.1 నుంచి 47.1 ఓవర్ వరకు) వాళ్లిద్దరు మూడో వికెట్కు జతచేసిన 183 పరుగుల భాగస్వామ్యం స్కోరును కొండంతయ్యేలా చేసింది. హర్లీన్ 58 బంతుల్లో ఫిఫ్టీ కొడితే... జెమీమా 62 బంతుల్లో 50... 90 బంతుల్లో సెంచరీ సాధించింది.స్కోరు వివరాలుభారత్ ఇన్నింగ్స్: స్మృతి (సి) జార్జినా (బి) ప్రెండెర్గాస్ట్ 73; ప్రతీక (ఎల్బీడబ్ల్యూ) (బి) జార్జినా 67; హర్లీన్ (సి) లౌరా (బి) కెల్లీ 89; జెమీమా (బి) కెల్లీ 102; రిచా ఘోష్ (సి) ఫ్రెయా (బి) ప్రెండర్గాస్ట్ 10; తేజల్ (నాటౌట్) 2; సయాలీ (నాటౌట్) 2; ఎక్స్ట్రాలు 25; మొత్తం (50 ఓవర్లలో 5 వికెట్లకు) 370. వికెట్ల పతనం: 1–156, 2–156, 3–339, 4–358, 5–368. బౌలింగ్: వోర్లా ప్రెండర్గాస్ట్ 8–0–75–2, అవా క్యానింగ్ 10–0–51–0, అర్లెన్ కెల్లీ 10–0–82–2, ఫ్రెయా సర్జెంట్ 9–0–77–0, అలానా డాల్జెల్ 5–0–41–0, జార్జినా 8–0–42–1. ఐర్లాండ్ ఇన్నింగ్స్: సారా (బి) దీప్తి 38; గాబీ లూయిస్ (సి) రిచా (బి) సయాలీ 12; క్రిస్టీనా (బి) టిటాస్ సాధు 80; వోర్లా (సి) సయాలీ (బి) ప్రియా 3; లౌరా (ఎల్బీడబ్ల్యూ) (బి) దీప్తి 37; లీ పాల్ (నాటౌట్) 27; కెల్లీ (బి) దీప్తి 19; అవ క్యానింగ్ (బి) ప్రియా 11; జార్జినా (నాటౌట్) 6; ఎక్స్ట్రాలు 21; మొత్తం (50 ఓవర్లలో 7 వికెట్లకు) 254. వికెట్ల పతనం: 1–32, 2–87, 3–101, 4–184, 5–188, 6–218, 7–234. బౌలింగ్: టిటాస్ సాధు 10–0–48–1, సయాలీ 9–1–40–1, సైమా ఠాకూర్ 9–0–50–0, ప్రియా మిశ్రా 10–0–53–2, దీప్తి శర్మ 10–0–37–3, ప్రతీక 2–0–12–0. -
టీమిండియా బ్యాటర్ల వీరవిహారం.. వన్డేల్లో అత్యధిక స్కోర్
భారత మహిళల క్రికెట్ జట్టు వన్డేల్లో తమ అత్యధిక స్కోర్ నమోదు చేసింది. ఐర్లాండ్తో ఇవాళ (జనవరి 12) జరిగిన మ్యాచ్లో భారత్ నిర్ణీత 50 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 370 పరుగులు చేసింది. వన్డేల్లో టీమిండియాకు ఇదే అత్యధిక స్కోర్. గతంలో భారత అత్యధిక స్కోర్ 358/2గా ఉండింది. 2017లో ఇదే ఐర్లాండ్పై భారత్ 2 వికెట్ల నష్టానికి 358 పరుగులు చేసింది. గతేడాది డిసెంబర్లో భారత్ విండీస్పై కూడా ఇదే స్కోర్ (358/5) నమోదు చేసింది.మ్యాచ్ విషయానికొస్తే.. మూడు మ్యాచ్ల సిరీస్లో భాగంగా ఐర్లాండ్తో ఇవాళ జరిగిన రెండో వన్డేలో భారత్ అతి భారీ స్కోర్ చేసింది. ఈ మ్యాచ్లో భారత టాపార్డర్ బ్యాటర్లు వీరవిహారం చేశారు. మిడిలార్డర్ బ్యాటర్ జెమీమా రోడ్రిగెజ్ (91 బంతుల్లో 102; 12 ఫోర్లు) సూపర్ సెంచరీతో కదంతొక్కగా.. తొలి ముగ్గురు బ్యాటర్లు స్మృతి మంధన (54 బంతుల్లో 73; 10 ఫోర్లు, 2 సిక్సర్లు), ప్రతిక రావల్ (61 బంతుల్లో 67; 8 ఫోర్లు, సిక్సర్), హర్లీన్ డియోల్ (84 బంతుల్లో 89; 12 ఫోర్లు) మెరుపు అర్ద సెంచరీలతో రాణించారు. ఐర్లాండ్ బౌలర్లలో ఓర్లా ప్రెండర్గాస్ట్, అర్లీన్ కెల్లీ తలో రెండు వికెట్లు పడగొట్టగా.. జార్జీనా డెంప్సే ఓ వికెట్ దక్కించకుంది.వన్డేల్లో భారత్ సాధించిన అత్యధిక స్కోర్లు..370/5 ఐర్లాండ్పై (2025)358/2 ఐర్లాండ్పై (2017)358/5 వెస్టిండీస్పై (2024)333/5 ఇంగ్లండ్పై (2022)325/3 సౌతాఫ్రికాపై (2024)317/8 వెస్టిండీస్పై (2022)314/9 వెస్టిండీస్పై (2024)302/3 సౌతాఫ్రికాపై (2018)కాగా, ఐర్లాండ్తో ప్రస్తుతం జరుగుతున్న సిరీస్లో భారత్ తొలి మ్యాచ్లో 6 వికెట్ల తేడాతో విజయం సాధించింది. ఈ మ్యాచ్లో తొలుత బ్యాటింగ్ చేసిన ఐర్లాండ్ నిర్ణీత 50 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 238 పరుగులు చేసింది. కెప్టెన్ గాబీ లెవిన్ (92) ఆ జట్టు తరఫున అత్యధిక స్కోర్ చేసింది. లియా పాల్ (59) అర్ద సెంచరీతో రాణించింది.భారత బౌలర్లలో ప్రియా మిశ్రా 2, టిటాస్ సాధు, సయాలీ సత్గరే, దీప్తి శర్మ తలో వికెట్ పడగొట్టారు. ఛేదనలో భారత్ 34.3 ఓవర్లలో విజయతీరాలకు చేరింది. ప్రతిక రావల్ (89), తేజల్ హసబ్నిస్ (53 నాటౌట్) అర్ద సెంచరీతో సత్తా చాటారు. స్మృతి మంధన (41) ఓ మోస్తరు స్కోర్ చేసింది. ఐర్లాండ్ బౌలర్ ఏమీ మగూర్ 3 వికెట్లు పడగొట్టింది. -
వాళ్లంతా గ్రేట్.. కోచ్ చెప్పినట్లే చేశాం.. కానీ: భారత కెప్టెన్
భారత మహిళల క్రికెట్ జట్టు అద్భుత విజయం సాధించింది. వెస్టిండీస్(India Women vs West Indies Women)తో మూడో వన్డేలోనూ గెలుపొంది.. సిరీస్ను 3-0తో క్లీన్స్వీప్ చేసింది. ఈ నేపథ్యంలో భారత జట్టు కెప్టెన్ హర్మన్ప్రీత్ కౌర్ స్పందిస్తూ.. సహచర ఆటగాళ్లపై ప్రశంసలు కురిపించింది. సమిష్టి ప్రదర్శనతోనే విజయం సాధ్యమైందని పేర్కొంది.రెండు సిరీస్లు భారత్వేకాగా మూడు టీ20, మూడు వన్డేల సిరీస్లు ఆడేందుకు వెస్టిండీస్ మహిళా జట్టు భారత్ వచ్చింది. తొలుత నవీ ముంబై వేదికగా జరిగిన పొట్టి సిరీస్లో హర్మన్ సేన.. హేలీ మాథ్యూస్ బృందంపై 2-1తో నెగ్గింది. అనంతరం వడోదర వేదికగా జరిగిన వన్డే సిరీస్లో.. మరో మ్యాచ్ మిగిలి ఉండగానే సిరీస్ను కైవసం చేసుకుంది.చెలరేగిన రేణుక.. దీప్తి విశ్వరూపంఈ క్రమంలో ఇరుజట్ల మధ్య శుక్రవారం నామమాత్రపు మూడో వన్డే జరిగింది. టాస్ గెలిచిన వెస్టిండీస్ తొలుత బ్యాటింగ్ ఎంచుకుంది. అయితే, భారత బౌలర్ల ధాటికి విండీస్ బ్యాటింగ్ ఆర్డర్ కుప్పకూలింది. పేసర్ రేణుకా ఠాకూర్ సింగ్(Renuka Thakur Singh) నాలుగు వికెట్లతో చెలరేగగా.. స్పిన్నర్ దీప్తి శర్మ(Deepti Sharma) ఆరు వికెట్లతో దుమ్ములేపింది.వెస్టిండీస్ బ్యాటర్లలో వికెట్ కీపర్ షెమానే కాంప్బెల్(46), చినెల్లె హెన్రీ(61), అలియా అలెనె(21) మాత్రమే రాణించారు. మిగతా వాళ్లంతా చేతులెత్తేయడంతో వెస్టిండీస్ 38.5 ఓవర్లలో కేవలం 162 పరుగులకే ఆలౌట్ అయింది.ఆరంభంలో తడబడ్డా.. ఆ తర్వాత మెరుపు బ్యాటింగ్తో ఇక స్వల్ప లక్ష్యంతోనే బరిలోకి దిగినప్పటికీ టీమిండియాకు శుభారంభం లభించలేదు. ఫామ్లో ఉన్న ఓపెనర్ స్మృతి మంధాన 4 పరుగులకే నిష్క్రమించగా.. మరో ఓపెనర్ ప్రతికా రావల్(18) నిరాశపరిచింది. వన్డౌన్లో వచ్చిన హర్లీన్ డియోల్(1) కూడా విఫలమైంది.ఇలా టాపార్డర్ కుదేలైన వేళ.. నాలుగో స్థానంలో వచ్చిన కెప్టెన్ హర్మన్ప్రీత్ కౌర్ ధనాధన్ దంచికొట్టింది. మొత్తంగా 22 బంతులు ఎదుర్కొని 7 ఫోర్ల సాయంతో 32 పరుగులు చేసింది. అదే విధంగా.. జెమీమా రోడ్రిగ్స్(29), దీప్తి శర్మ(39 నాటౌట్) రాణించారు. ఇక ఆఖర్లో రిచా ఘోష్ మెరుపులు మెరిపించింది. కేవలం 11 బంతుల్లోనే 23 పరుగులు చేసి.. జట్టును విజయతీరాలకు చేర్చింది.𝐑𝐢𝐜𝐡𝐚 𝐆𝐡𝐨𝐬𝐡 𝐟𝐢𝐧𝐢𝐬𝐡𝐞𝐬 𝐢𝐭 𝐨𝐟𝐟 𝐢𝐧 𝐬𝐭𝐲𝐥𝐞 🔥#TeamIndia win the 3rd ODI by 5 wickets & cleansweep the series 3-0 🙌🙌Scorecard ▶️ https://t.co/3gyGzj5fNU#INDvWI | @IDFCFIRSTBank | @13richaghosh pic.twitter.com/XIAUChwJJ2— BCCI Women (@BCCIWomen) December 27, 2024 ఆ ముగ్గురూ గ్రేట్ఈ క్రమంలో 28.2 ఓవర్లలోనే టార్గెట్ ఛేదించిన భారత్.. ఐదు వికెట్ల తేడాతో జయభేరి మోగించింది. దీప్తి శర్మకు ‘ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్’, రేణుకా సింగ్కు ‘ప్లేయర్ ఆఫ్ ది సిరీస్’ అవార్డులు దక్కాయి. ఈ నేపథ్యంలో కెప్టెన్ హర్మన్ప్రీత్ కౌర్ మాట్లాడుతూ.. ‘‘రేణుక అద్బుతంగా బౌలింగ్ చేసింది. మానసికంగా మనం ఎంత బలంగా ఉన్నామో ఇలాంటి ప్రదర్శన ద్వారా తెలుస్తుంది.ఇక దీప్తి శర్మ, జెమీమా బాగా బ్యాటింగ్ చేశారు. ఆఖర్లో రిచా అద్భుతమైన ఫినిషింగ్ టచ్ ఇచ్చింది. అంతా కలిసి కట్టుగా ఉంటే.. ఇలాంటి సానుకూల ఫలితాలు వస్తాయి. జట్టులోని ప్రతి ఒక్కరికీ విజయంలో భాగం ఉంది.అయితే, ఒక్క తప్పు లేకుండా వంద శాతం ఫలితాలు కావాలని మా ఫీల్డింగ్ కోచ్ పదే పదే చెప్తారు. కానీ.. ఈరోజు ఒకటీ రెండుసార్లు మేము విఫలమయ్యాం. వచ్చే ఏడాది ఈ తప్పులను పునరావృతం కానివ్వము’’ అని పేర్కొంది.చదవండి: విశ్రాంతి కాదు.. నిర్దాక్షిణ్యంగా అతడిపై వేటు వేయండి.. అప్పుడైనా..: టీమిండియా దిగ్గజం 𝙏𝙝𝙖𝙩 𝙬𝙞𝙣𝙣𝙞𝙣𝙜 𝙛𝙚𝙚𝙡𝙞𝙣𝙜! 🤩 Captain @ImHarmanpreet receives the @IDFCFIRSTBank Trophy 🏆#TeamIndia win the ODI series 3-0 💪 pic.twitter.com/glblLcPBc7— BCCI Women (@BCCIWomen) December 27, 2024 -
మెరిసిన జెమీమా, స్మృతి
నవీ ముంబై: భారత మహిళల జట్టు చాన్నాళ్ల తర్వాత ఆల్రౌండ్ ప్రదర్శనతో చెప్పుకోదగ్గ విజయం సాధించింది. వెస్టిండీస్తో ఆదివారం జరిగిన తొలి టి20 మ్యాచ్లో టీమిండియా 49 పరుగుల తేడాతో వెస్టిండీస్పై నెగ్గింది. టాపార్డర్ బ్యాటర్లు స్మృతి మంధాన (33 బంతుల్లో 54; 7 ఫోర్లు, 2 సిక్స్లు), జెమీమా రోడ్రిగ్స్ (35 బంతుల్లో 73; 9 ఫోర్లు, 2 సిక్స్లు) దంచేయగా, బౌలింగ్లో టిటాస్ సాధు (3/37), దీప్తి శర్మ (2/21), రాధా యాదవ్ (2/28) కరీబియన్ జట్టును దెబ్బతీశారు. ముందుగా బ్యాటింగ్కు దిగిన భారత్ నిర్ణీత 20 ఓవర్లలో 4 వికెట్లకు 195 పరుగుల భారీ స్కోరు చేసింది. ఓపెనర్ ఉమా ఛెత్రి (26 బంతుల్లో 24; 4 ఫోర్లు), రిచా ఘోష్ (14 బంతుల్లో 20; 2 ఫోర్లు, 1 సిక్స్) ఫర్వాలేదనిపించారు. కరిష్మా రమ్హార్యాక్ 2, డియాండ్ర డాటిన్ 1 వికెట్ తీశారు. అనంతరం వెస్టిండీస్ నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 146 పరుగులే చేసి ఓడింది. ఓపెనర్ కియానా జోసెఫ్ (33 బంతుల్లో 49; 5 ఫోర్లు, 3 సిక్స్లు), డియాండ్ర డాటిన్ (28 బంతుల్లో 52; 4 ఫోరు, 3 సిక్స్లు) రాణించారు. జెమీమాకు ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’ అవార్డు లభించింది. మంగళవారం ఇదే వేదికపై రెండో టి20 మ్యాచ్ జరుగుతుంది. స్కోరు వివరాలు భారత మహిళల ఇన్నింగ్స్: స్మృతి (సి) కియానా (బి) కరిష్మా 54; ఉమా ఛెత్రి (బి) కరిష్మా 24; జెమీమా రోడ్రిగ్స్ (రనౌట్) 73; రిచా ఘోష్ (సి) మంగ్రూ (బి) డియాండ్ర 20; హర్మన్ప్రీత్ (నాటౌట్) 13; సజన (నాటౌట్) 1; ఎక్స్ట్రాలు 10; మొత్తం (20 ఓవర్లలో 4 వికెట్లకు) 195. వికెట్ల పతనం: 1–50, 2–131, 3–155, 4–190. బౌలింగ్: చినెలీ హెన్రీ 2–0–17–0, జైదా జేమ్స్ 1–0–13–0, హేలీ 3–0–38–0, కరిష్మా 4–0–18–2, అఫీ ఫ్లెచర్ 3–0–39–0, డియాండ్ర 4–0–37–1, షమిలియా 1–0–11–0, కియానా జోసెఫ్ 2–0–22–0. వెస్టిండీస్ మహిళల ఇన్నింగ్స్: హేలీ మాథ్యూస్ (సి) సబ్–మిన్నుమణి (బి) టిటాస్ 1; కియానా (సి) సైమా (బి) టిటాస్ 49; షెమైన్ (బి) దీప్తి శర్మ 13; డియాండ్ర (సి) రాధ (బి) టిటాస్ 52; చినెలీ హెన్రీ (సి) సబ్–మిన్నుమణి (బి) రాధ 7; షబిక (నాటౌట్) 15; అఫీ ఫ్లెచర్ (బి) దీప్తి శర్మ 0; జైదా (సి) ఉమా ఛెత్రి (బి) రాధ 5; మంగ్రూ (నాటౌట్) 2; ఎక్స్ట్రాలు 2; మొత్తం (20 ఓవర్లలో 7 వికెట్లకు) 146. వికెట్ల పతనం: 1–2, 2–36, 3–80, 4–108, 5–126, 6–127, 7–140. బౌలింగ్: రేణుక 4–0– 25–0, టిటాస్ సాధు 4–0–37–3, దీప్తిశర్మ 4–0– 21–2, సైమా 4–0–35–0, రాధ 4–0–28–2.3622 అంతర్జాతీయ మహిళల టి20ల్లో అత్యధిక పరుగులు సాధించిన భారత క్రికెటర్గా స్మృతి మంధాన గుర్తింపు పొందింది. ఇన్నాళ్లు హర్మన్ప్రీత్ (3589 పరుగులు) పేరిట ఉన్న రికార్డును స్మృతి సవరించింది. 117 అంతర్జాతీయ మహిళల టి20ల్లో అత్యధిక సిక్స్లు కొట్టిన బ్యాటర్ డియాండ్రా డాటిన్ (117) ఘనత సాధించింది. న్యూజిలాండ్ ప్లేయర్ సోఫీ డివైన్ (114) పేరిట ఉన్న రికార్డును డియాండ్రా బద్దలు కొట్టింది. -
IND VS WI 1st T20: చెలరేగిపోయిన జెమీమా.. రాణించిన మంధన
నవీ ముంబై వేదికగా వెస్టిండీస్ మహిళా జట్టుతో జరుగుతున్న తొలి టీ20 మ్యాచ్లో భారత మహిళల క్రికెట్ జట్టు భారీ స్కోర్ చేసింది. ఈ మ్యాచ్లో టాస్ ఓడి విండీస్ ఆహ్వానం మేరకు తొలుత బ్యాటింగ్కు దిగిన భారత్.. స్మృతి మంధన (33 బంతుల్లో 54; 7 ఫోర్లు, 2 సిక్సర్లు), జెమీమా రోడ్రిగెజ్ (35 బంతుల్లో 73; 9 ఫోర్లు, 2 సిక్సర్లు) రెచ్చిపోవడంతో నిర్ణీత 20 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 195 పరుగుల భారీ స్కోర్ చేసింది. భారత ఇన్నింగ్స్లో ఉమా ఛెత్రి 24, రిచా ఘోష్ 20 పరుగులు చేసి ఔట్ కాగా.. కెప్టెన్ హర్మన్ ప్రీత్ కౌర్ (13), సంజీవన్ సజనా (1) అజేయంగా నిలిచారు. విండీస్ బౌలర్లలో కరిష్మ రామ్హరాక్ రెండు వికెట్లు పడగొట్టగా.. డియాండ్రా డొట్టిన్ ఓ వికెట్ దక్కించుకుంది.కాగా, మూడు మ్యాచ్ల టీ20, మూడు మ్యాచ్ల వన్డే సిరీస్ల కోసం వెస్టిండీస్ జట్టు భారత్లో పర్యటిస్తుంది. ఈ సిరీస్లో టీ20 మ్యాచ్లు డిసెంబర్ 15, 17, 19 తేదీల్లో జరుగనుండగా.. వన్డేలు 22, 24, 27 తేదీల్లో జరుగనున్నాయి. టీ20 మ్యాచ్లన్నీ నవీ ముంబైలో జరుగనుండగా.. మూడు వన్డే మ్యాచ్లకు వడోదర వేదిక కానుంది.ఇదిలా ఉంటే, భారత మహిళల క్రికెట్ జట్టు ఇటీవల ఆస్ట్రేలియాతో జరిగిన వన్డే సిరీస్ను 0-3 తేడాతో కోల్పోయిన విషయం తెలిసిందే. ఈ సిరీస్లో భారత్ మూడు మ్యాచ్ల్లో దారుణ పరాజయాలు ఎదుర్కొంది. తొలి వన్డేలో 5 వికెట్ల తేడాతో ఓటమిపాలైన భారత్.. రెండో వన్డేలో 122 పరుగుల తేడాతో, మూడో వన్డేలో 83 పరుగుల తేడాతో పరాజయంపాలైంది. -
స్మృతి సెంచరీ.. కివీస్ను చిత్తు చేసిన భారత్.. సిరీస్ సొంతం
న్యూజిలాండ్తో నిర్ణయాత్మక మూడో వన్డేలో భారత మహిళా క్రికెట్ జట్టు ఘన విజయం సాధించింది. వైట్ ఫెర్న్స్ను ఆరు వికెట్ల తేడాతో ఓడించింది. తద్వారా సిరీస్ను 2-1తో కైవసం చేసుకుంది. ఇక ఆఖరి వన్డేలో భారత ఓపెనర్ స్మృతి మంధాన అద్భుత శతకంతో రాణించి గెలుపులో కీలక పాత్ర పోషించింది.మూడు వన్డేల సిరీస్ ఆడేందుకు న్యూజిలాండ్ వుమెన్ టీమ్ భారత్కు వచ్చింది. తొలి వన్డేలో బౌలింగ్ ప్రదర్శనతో పర్యాటక జట్టును 59 పరుగుల తేడాతో ఓడించిన హర్మన్ప్రీత్ సేన.. రెండో వన్డేలో మాత్రం దారుణంగా విఫలమైంది. బ్యాటర్లంతా పెవిలియన్కు క్యూ కట్టడంతో 76 పరుగుల తేడాతో చిత్తుగా ఓడిపోయింది. దీంతో సిరీస్ 1-1తో సమమైంది. రాణించిన బ్రూక్ హాలీడేఈ క్రమంలో మంగళవారం అహ్మదాబాద్ వేదికగా ఇరుజట్లు మూడో వన్డేలో పోటీపడ్డాయి. నరేంద్ర మోదీ స్టేడియంలో టాస్ గెలిచిన న్యూజిలాండ్ తొలుత బ్యాటింగ్ చేసింది. టాపార్డర్లో ఓపెనర్ సుజీ బేట్స్(4), వన్డౌన్ బ్యాటర్ లారెన్ డౌన్(1) విఫలం కాగా.. మరో ఓపెనర్ జార్జియా ప్లెమ్మర్ 39 రన్స్ చేసింది.దీప్తి శర్మకు మూడు వికెట్లుకెప్టెన్ సోఫీ డివైన్(9) నిరాశపరచగా.. ఐదో నంబర్ బ్యాటర్ బ్రూక్ హాలీడే 96 బంతుల్లో 86 రన్స్తో అదరగొట్టింది. మిగతా వాళ్లలో ఇసబెల్లా గేజ్(25), లీ తుహుము(24 నాటౌట్) చెప్పుకోదగ్గ స్కోర్లు చేశారు. ఈ క్రమంలో 49.5 ఓవర్లలో న్యూజిలాండ్ 232 పరుగులకు ఆలౌట్ అయింది. భారత బౌలర్లలో దీప్తి శర్మ మూడు వికెట్లు కూల్చగా.. రేణుకా సింగ్, సైమా ఠాకూర్ ఒక్కో వికెట్ తీశారు. మిగతా నాలుగు వికెట్లు రనౌట్ల ద్వారా వచ్చినవే.సెంచరీతో చెలరేగిన స్మృతిఇక వైట్ ఫెర్న్స్ విధించిన లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో ఆరంభంలోనే భారత్కు షాక్ తగిలింది. ఓపెనర్ షఫాలీ వర్మ (12)ను కివీస్ పేసర్ హన్నా రోవ్ అవుట్ చేసింది. అయితే, వన్డౌన్ బ్యాటర్ యస్తికా భాటియా(35)తో కలిసి మరో ఓపెనర్ స్మృతి మంధాన స్కోరు బోర్డును ముందుకు నడిపించింది. గత రెండు మ్యాచ్లలో పూర్తిగా విఫలమైన(5, 0) ఆమె ఈసారి మాత్రం బ్యాట్ ఝులిపించింది. మొత్తంగా 122 బంతులు ఎదుర్కొన్న ఈ ఎడమచేతి వాటం బ్యాటర్ సరిగ్గా వంద పరుగులు చేసింది. స్మృతి ఇన్నింగ్స్లో 10 ఫోర్లు ఉన్నాయి. హర్మన్ అర్ధ శతకంఇక కెప్టెన్ హర్మన్ సైతం అర్ధ శతకంతో చెలరేగింది. స్మృతి మంధానతో కలిసి 117 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పింది. ఆఖరి వరకు అజేయంగా నిలిచి ఫోర్తో భారత్ను విజయతీరాలకు చేర్చింది. ఈ మ్యాచ్లో హర్మన్ 61 బంతులు ఎదుర్కొని 55 పరుగులు చేసింది.ఇక జెమీమా రోడ్రిగ్స్ సైతం ఆఖర్లో మెరుపు ఇన్నింగ్స్ ఆడింది. 18 బంతుల్లో నాలుగు ఫోర్ల సాయంతో 22 పరుగులు చేసింది. ఈ క్రమంలో 44.2 ఓవర్లలో కేవలం నాలుగు వికెట్లు కోల్పోయి భారత్ లక్ష్యాన్ని ఛేదించింది. స్మృతి మంధానకు ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు దక్కింది.భారత్ వర్సెస్ న్యూజిలాండ్ మూడో వన్డే స్కోర్లు👉న్యూజిలాండ్- 232 (49.5)👉భారత్- 236/4 (44.2)👉ఫలితం- న్యూజిలాండ్పై ఆరు వికెట్ల తేడాతో భారత్ విజయంచదవండి: Ind vs NZ: అతడిపై వేటు.. హర్షిత్ రాణా అరంగేట్రం ఫిక్స్!?That HUNDRED Feeling 💯🤗Live - https://t.co/pSVaIW4Deg#INDvNZ | @IDFCFIRSTBank | @mandhana_smriti pic.twitter.com/61zSBcOQ2H— BCCI Women (@BCCIWomen) October 29, 20243rd ODI ✅Series ✅#TeamIndia win the third and final #INDvNZ ODI by 6 wickets and complete a 2-1 series win over New Zealand 👏 Scoreboard ▶️ https://t.co/B6n070iLqu@IDFCFIRSTBank pic.twitter.com/grwAuDS6Qe— BCCI Women (@BCCIWomen) October 29, 2024 -
W T20 WC: ‘హర్మన్పై వేటు! స్మృతి కాదు.. కొత్త కెప్టెన్గా ఆమెకే ఛాన్స్’
Mithali Raj on Women's T20 World Cup debacle: భారత మహిళల క్రికెట్ జట్టు మాజీ కెప్టెన్ మిథాలీ రాజ్ ప్రస్తుత టీ20 ప్రపంచకప్లో జట్టు వైఫల్యంపై కీలక వ్యాఖ్యలు చేసింది. లీగ్ దశలోనే నిష్క్రమణకు ప్రధాన కారణం గత మూడేళ్లుగా జట్టులో పురోగతే లేదని నర్మగర్భంగా వ్యాఖ్యానించింది. దుబాయ్లో ఉన్న ఆమె ఓ మీడియా సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో మాట్లాడుతూ బ్యాటింగ్, ఫీల్డింగ్ వైఫల్యాలపై, క్రికెటర్లలో కొరవడిన పట్టుదలపై తన అభిప్రాయాలను పంచుకుంది.‘ప్రపంచకప్కు సన్నాహంగా ఆడిన ఆసియా కప్లో చిన్న జట్లతో ఆడేటప్పుడు రిజర్వ్ బెంచ్ను పటిష్టం చేసేందుకు వారికి అవకాశాలివ్వాలి. పురుషుల జట్టు చేస్తోంది అదే. మెగా ఈవెంట్లు, పెద్ద టోర్నీలకు ముందు ఈ కసరత్తు చాలా అవసరం. కానీ మన మహిళల జట్టు విషయంలో అలాంటిదేదీ ఉండదు. రిజర్వ్ ఆటగాళ్లకు అవకాశాలివ్వరు. ఇది జట్టు నిర్మాణానికి ఇబ్బందికరంగా పరిణమిస్తుంది’ అని వివరించింది.పలు ప్రశ్నలకు మిథాలీ ఇచ్చిన సమాధానాలు... టోర్నీలో టీమిండియా ప్రదర్శనపై మీ విశ్లేషణ? దీనిపై మాట్లాడాలంటే ముందుగా చెప్పుకోవాల్సింది ఆస్ట్రేలియాతో మ్యాచే గురించే! తప్పక గెలవాల్సిన పోరు అది. ఓ దశలో పటిష్ట స్థితిలో కనిపించినా... మళ్లీ కంగారే. మరో పాత కథే! గత రెండు, మూడేళ్లుగా జట్టు సాధించిన పురోగతి నాకైతే కనపించట్లేదు. గట్టి జట్లను ‘ఢీ’కొట్టేముందు చేసే కసరత్తు, ఆటలో ఎత్తుగడలేవీ మెప్పించడం లేదు. అంతర్జాతీయస్థాయిలో కొన్ని జట్లు క్రమంగా పుంజుకున్నాయి. దక్షిణాఫ్రికానే దానికి సరైన ఉదాహరణ.ఆస్ట్రేలియా కంటే కూడా న్యూజిలాండ్తో ఎదురైనా పరాజయమే భారత్ నిష్క్రమణకు కారణమని భావిస్తున్నారా? ఆశ్చర్యకర విషయం ఏమిటంటే మనం పరిస్థితులకు తగ్గట్లుగా వెంటనే మారకపోవడమే ఆ మ్యాచ్ ఓటమికి కారణం. మందకొడి వికెట్పై వన్డే ప్రపంచకప్లో అయితే ముందు నింపాదిగా ఆడి తర్వాత పుంజుకొని ఆడే సౌలభ్యం వుంటుంది. కానీ టీ20 ఫార్మాట్లో అలాంటి అవకాశం ఉండదు. త్వరితగతిన సందర్భాన్ని బట్టి ఆటతీరు మార్చుకోవాలి. సోఫీ డివైన్ చేసింది అదే. కానీ మనం మాత్రం అలా ఆడలేకపోయాం.తరుచూ బ్యాటింగ్ ఆర్డర్ను మార్చడం వల్ల ఆయా స్థానాల్లో స్పష్టత కొరవడిందా? జెమీమా, హర్మన్ప్రీత్లు తరచూ 3, 4 స్థానాలు మార్చుకోవడం కారణమని నేననుకోను. బ్యాటింగ్లో ఓపెనర్ల శుభారంభమే అత్యంత కీలకం. షఫాలీ వర్మ దూకుడుగా ఆడుతుందని అందరికీ తెలుసు కానీ అలా జరగలేదు. ఓపెనర్లిద్దరు బాగా ఆడిఉంటే మిడిల్ ఓవర్లలో యథేచ్ఛగా ఆడే అవకాశముంటుంది. మొదట పవర్ ప్లే, ఆఖర్లో డెత్ ఓవర్లు మంచి స్కోరుకు బాట వేస్తాయి. అయితే దురదృష్టవశాత్తూ ఈ టోర్నీలోని కీలక మ్యాచ్ల్లో అలాంటి శుభారంభాలు, చివర్లో దూకుడు కరువయ్యాయి. ఆసియా కప్లో కనిపించిన లోపాలపై దృష్టి పెట్టాల్సింది. కానీ అలా ఏమీ జరగలేదు. ప్రపంచకప్ ముంగిట ఫీల్డింగ్ విభాగంపై దృష్టి సారించకపోవడం పెద్ద తప్పిదమని మీరు అంగీకరిస్తారా? ఈ విషయంలో ఆస్ట్రేలితో జరిగిన మ్యాచ్ నన్ను తీవ్రంగా నిరుత్సాహపరిచింది. రాధా యాదవ్, జెమీమా రోడ్రిగ్స్ తప్ప 11 మందిలో మిగతా వారంతా మైదానంలో చురుగ్గా కనిపించలేదు. కీలకమైన మ్యాచ్లో ఇద్దరితో కట్టడి ఎలా సాధ్యమవుతుంది. ఫిట్నెస్ అతిముఖ్యం. దీనిపై మనం ఒక బెంచ్మార్క్ను పెట్టుకోవాల్సిందే. నిజాయితీగా అడుగుతున్నా ఏడాదంతా ఎంత మంది మన క్రికెటర్లు ఫిట్నెస్పై శ్రద్ధ పెడుతున్నారో చెప్పగలరా! ఆ శ్రద్ధలేకే మైదానంలో ఫీల్డింగ్ విభాగంపై ప్రతికూల ప్రభావాన్ని చూపిస్తుంది. హర్మన్ప్రీత్ 2018 నుంచి కెప్టెన్ ఉన్నా... ఫలితాలు మాత్రం రావడం లేదు. ఈ నేపథ్యంలో సారథ్య మార్పు అవసరమా? ఒకవేళ సెలక్టర్లు కెప్టెన్ను మార్చాలనుకుంటే మాత్రం నేను యువ క్రికెటర్కు పగ్గాలివ్వాలని కోరుకుంటాను. సారథ్య మార్పునకు ఇదే సరైన సమయం. ఇంకా ఆలస్యం చేస్తే... మనం ఇంకో ప్రపంచకప్కూ దూరమవుతాం. చేస్తే ఇప్పుడే కొత్త సారథిని ఎంపిక చేయాలి. మరీ ప్రపంచకప్ సమీపంలో చేస్తే ఒరిగే ప్రయోజనం కూడా ఉండదు.స్మృతి కాదు.. కొత్త కెప్టెన్గా ఆమెకు ఛాన్స్ ఇస్తేనే..వైస్ కెప్టెన్ స్మృతి మంధాన అందుబాటులో ఉన్నప్పటికీ 24 ఏళ్ల జెమీమాకు పగ్గాలిస్తే మంచిదనిపిస్తుంది. ఆమెకు ఎక్కువకాలం సారథిగా కొనసాగే వీలుంటుంది. పైగా మైదానంలో చురుకుదనం, ఫీల్డింగ్లో అందరిలో ఉత్తేజం నింపే శక్తి ఆమెకుంది. ఈ టోర్నీ ఆసాంతం ఆమె కనబరిచిన చురుకుదనం నన్ను బాగా ఆకట్టుకుంది. అలాంటి జెమీమాకు పగ్గాలిస్తే జట్టులో కొత్త ఉత్తేజాన్ని నింపినట్లవుతుంది. చదవండి: W T20 WC: ఇంగ్లండ్ ఇంటికి...సెమీఫైనల్లో వెస్టిండీస్ -
మంచి తరుణం
ఎన్నో ఏళ్లుగా ఊరిస్తోన్న అంతర్జాతీయ క్రికెట్ మండలి (ఐసీసీ) ట్రోఫీ చేజిక్కించుకోవాలని తహతహలాడుతున్న భారత మహిళల క్రికెట్ జట్టు టి20 ప్రపంచకప్లో మెరుగైన ప్రదర్శన చేయడమే లక్ష్యంగా పెట్టుకుందని భారత టాపార్డర్ ప్లేయర్ జెమీమా రోడ్రిగ్స్ పేర్కొంది. ఈసారి అందుకు తగ్గ అనుకూలతలు ఉన్నాయని...కప్ గెలిచేందుకు ఇదే మంచి తరుణమని ఆమె వెల్లడించింది. ప్లేయర్లందరికీ జట్టు ప్రయోజనాలే ముఖ్యమన్న జెమీమా... మెగా టోర్నీ కోసం ఆతృతగా ఎదురుచూస్తున్నట్లు తెలిపింది. అనుభవజు్ఞలు, యంగ్ ప్లేయర్లతో టీమిండియా సమతూకంగా ఉందని... ఆ్రస్టేలియా వంటి ప్రత్యర్థులపై కూడా విజయాలు సాధించగలమనే నమ్మకముందని పేర్కొంది. రేపటి నుంచి యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (యూఏఈ)లో మహిళల టి20 ప్రపంచకప్ ప్రారంభం కానున్న నేపథ్యంలో జెమీమా రోడ్రిగ్స్ పంచుకున్న వివరాలు ఆమె మాటల్లోనే...తొలిసారి మహిళల టి20 ప్రపంచకప్ చేజిక్కించుకోవడానికి భారత జట్టుకు అన్ని అనుకూలతలు ఉన్నాయి. జాతీయ జట్టుకు ప్రాతినిధ్యం వహించడం కంటే పెద్ద ఘనత ఏదీ లేదు. వరల్డ్కప్ బరిలోకి దిగుతున్న భారత మహిళల జట్టులో ప్రస్తుతం అందరి పరిస్థితి ఇదే. జట్టుకు అవసరమైన సమయంలో రాణించేందుకు ప్రతి ఒక్కరూ సిద్ధంగా ఉన్నారు. నా వరకైతే టీమిండియాకు ఆడే సమయంలో సర్వశక్తుల ఒడ్డేందుకు ప్రయత్నిస్తా. జట్టు గెలవడమనే నాకు ఎక్కువ సంతృప్తినిస్తుంది. రేపటి నుంచి ప్రారంభం కానున్న టి20 వరల్డ్కప్ కోసం మెరుగ్గా సిద్ధమయ్యా. ప్రత్యేకంగా ఒక బౌలర్ను లక్ష్యంగా చేసుకోలేదు. పరిస్థితులపై పైచేయి సాధించాలనుకుంటున్నా. ఎవరిని బౌలింగ్లో భారీ షాట్లు ఆడాలి... ఎలాంటి బంతులను గౌరవించాలి అనే దానిపై సాధన చేశా. నా ప్రదర్శన జట్టు విజయానికి తోడ్పడాలని కోరుకుంటా. సమతూకంగా జట్టు... అటు అనుభవజు్ఞలు ఇటు యంగ్ ప్లేయర్లతో జట్టు సమతూకంగా ఉంది. రిచా ఘోష్, షఫాలీ వర్మతో పాటు నాకూ గతంలో ఐసీసీ ప్రపంచకప్లు ఆడిన అనుభవం ఉంది. మేము యువ క్రీడాకారిణులమే అయినా... అవసరమైనంత అనుభవం ఉంది. ఇక జట్టులో హర్మన్ప్రీత్ కౌర్, స్మృతి మంధాన రూపంలో ఇద్దరు సీనియర్ ప్లేయర్లు ఉన్నారు. వారికి ప్రపంచకప్లలో ఆడిన అపార అనుభవం ఉంది.ఆటగాళ్లంతా ట్రోఫీ చేజిక్కించుకోవాలనే ఉత్సాహంతో ఉన్నాం. జట్టు సమావేశాల్లో ఎక్కువ శాతం చర్చ దీని గురించే జరుగుతుంది. 2020 ప్రపంచకప్ ఫైనల్లో పరాజయం పాలయ్యాం. ఇప్పుడు తొమ్మిదో ఎడిషన్లో మెరుగైన ప్రదర్శన చేస్తామనే నమ్మకముంది. వార్మప్ మ్యాచ్లో రాణించడం ఆనందంగా ఉంది. ప్రధాన పోటీలకు ముందు చక్కటి ఇన్నింగ్స్ ఆడటం నా ఆత్మవిశ్వాసాన్ని పెంచింది. న్యూజిలాండ్ స్టార్ ప్లేయర్ సోఫీ డివైన్ ఆటకు నేను అభిమానిని. మొదటిసారి అండర్–19 క్యాంప్లో ఉన్న సమయంలో చిన్నస్వామి స్టేడియంలో సోఫీ డివైన్ వరుసగా ఐదు బంతుల్లో సిక్సర్లు బాదింది. ఆ సందర్భాన్ని మరవలేను. ఆమె కోసం మా బౌలర్ల వద్ద ప్రత్యేక ప్రణాళికలు ఉన్నాయి. ఆస్ట్రేలియాతో పోటీని ఆస్వాదిస్తా... ఈ నెల 13న ఆ్రస్టేలియాతో మ్యాచ్ ఆడనున్నాం. ఆసీస్తో ఆడటాన్ని ఎంతో ఆస్వాదిస్తా. మెరుగైన ప్రత్యరి్థతో తలపడ్డప్పుడు అత్యుత్తమ ఆట బయటకు వస్తుంది. చాన్నాళ్లుగా కంగారూ జట్టుతో మ్యాచ్లు ఆడుతున్నాం. ఈసారి మైదానంలో మా ప్రణాళికలను పక్కాగా అమలు చేస్తాం. జట్టు వైస్ కెపె్టన్ స్మృతి మంధాన ఆటను బాగా అర్థం చేసుకుంటుంది. పరిస్థితులకు తగ్గట్టు ఆటతీరును మార్చుకుంటుంది. అందుకే గొప్ప ప్లేయర్గా ఎదిగింది. అవసరమైనప్పుడు చక్కటి సలహాలు ఇస్తుంది. ఇక కెపె్టన్ హర్మన్ప్రీత్ కౌర్ పెద్ద మ్యాచ్ల్లో మెరుగ్గా రాణిస్తుంది. కీలక మ్యాచ్ల్లో ఒత్తిడిని తట్టుకొని ఎలా నిలబడాలో ఆమె ఆట ద్వారా నేర్చుకున్నా. ఇప్పటి వరకు జరిగిన ఎనిమిది టి20 ప్రపంచకప్లలోనూ హర్మన్ప్రీత్ పాల్గొంది. ఈ టోర్నీ ఆమెకు ఎంత ముఖ్యమో జట్టులో ప్రతి ఒక్కరికీ తెలుసు. దేశంతో పాటు ఆమె కోసం కప్పు గెలవాలని అనుకుంటున్నాం. ఆమె ట్రోఫీ చేజిక్కించుకోవడం చూడాలని ఆశిస్తున్నా. -
టీ20 వరల్డ్కప్.. టీమిండియాకు గాయల బెడద?
యూఏఈ వేదికగా జరగనున్న టీ20 వరల్డ్కప్-2024కు ముందు భారత మహిళల జట్టును గాయాల బెడద వెంటాడుతోంది. భారత మహిళల జట్టు ప్రస్తుతం బెంగళూరులోని ఏన్సీఏలో ఏర్పాటు చేసిన ప్రాక్టీస్ క్యాంప్లో చెమడ్చోతుంది. అయితే జట్టులోని కీలక ఆటగాళ్లు గాయాల బారిన పడ్డారు. స్టార్ ప్లేయర్లు గాయాలతో బాధపడుతుండడంతో భారత జట్ట మెనెజ్మెంట్ ఆందోళన చెందుతోంది.గాయాల బారిన పడిన ప్లేయర్స్ వీరేఅరుంధతి రెడ్డిభారత జట్టు స్టార్ పేసర్ అరుంధతి రెడ్డి ప్రస్తుతం భుజం గాయంతో బాధపడుతోంది. ఆమె ప్రస్తుతం బౌలింగ్ ప్రాక్టీస్ దూరంగా ఉంది. అయితే ప్రపంచకప్ ప్రారంభమయ్యే ఆమె పూర్తి ఫిట్నెస్ సాధించే అవకాశమున్నట్లు తెలుస్తోంది. ఒకవేళ ఈ మెగా టోర్నీ అయితే భారత్కు గట్టి ఎదురు దెబ్బే అనే చెప్పుకోవాలి. అరుంధతి ప్రస్తుతం అద్బుతమైన ఫామ్లో ఉంది.పూజా వస్త్రాకర్టీమిండియా మరో స్టార్ ఆల్రౌండర్ పూజా వస్త్రాకర్ కూడా భుజం గాయంతో పోరాడుతోంది. అయితే గాయంతో పూజా గాయంతో బాధపడుతున్నప్పటకి పెయిన్కిల్లర్ ఇంజెక్షన్ల సహాయంతో తన ప్రాక్టీస్ను కొనసాగిస్తోంది. ఆమె కూడా వరల్డ్కప్ సమయానికి పూర్తి ఫిట్నెస్ సాధించే ఛాన్స్ ఉంది.శ్రేయాంక పాటిల్ వేలి ఫ్రాక్చర్ కారణంగా ఆసియా కప్కు దూరమైన యువ స్పిన్నర్ శ్రేయాంక పాటిల్ ఇంకా కోలుకోలేదు. టీ20 వరల్డ్కప్కు ఎంపికైనప్పటకి టోర్నీ అందుబాటులో ఉంటుందా లేదన్నది ఇంకా క్లారిటీ లేదు. కానీ ఆమె మెగా ఈవెంట్ సమయానికి ఈ కర్ణాటక స్పిన్నర్ కోలుకునే అవకాశమున్నట్లు పలు రిపోర్ట్లు పేర్కొంటున్నాయి.జెమిమా రోడ్రిగ్స్ స్టార్ బ్యాటర్ జెమిమా రోడ్రిగ్స్ కూడా చేతివేలి గాయంతో బాధపడుతోంది. ఆసియాకప్లో ఫీల్డింగ్ చేస్తున్నప్పుడు రోడ్రిగ్స్ చేతి వేలికి గాయమైంది. అయితే ఆమె తన వేలికి టేప్ చుట్టి బ్యాటింగ్ ప్రాక్టీస్ చేస్తోంది. ఆమె ప్రపంచకప్ సమయానికి దాదాపుగా కోలుకునే సూచనలు కన్పిస్తున్నాయి. కాగా ఈ మెగా టోర్నీ ఆక్టోబర్ 3 నుంచి ప్రారంభం కానుంది. భారత తమ తొలి మ్యాచ్లో ఆక్టోబర్ 4న న్యూజిలాండ్తో తలపడనుంది. -
BBL: ధరలో స్మృతిని మించిపోయిన జెమీమా, దీప్తి, శిఖా (ఫొటోలు)
-
WBBL: స్మృతి కంటే జెమీమా, దీప్తి, శిఖాలకే ఎక్కువ ధర!
Womens Big Bash League Draft- మెల్బోర్న్: భారత మహిళల జట్టు వైస్ కెప్టెన్ స్మృతి మంధాన సహా ఆరుగురు భారత క్రికెటర్లు మహిళల బిగ్బాష్ టి20 లీగ్ (డబ్ల్యూబీబీఎల్)లో మెరిపించనున్నారు. ఓపెనర్ స్మృతి, ఆల్రౌండర్ శిఖా పాండే, టాపార్డర్ బ్యాటర్ జెమీమా రోడ్రిగ్స్లు ఇది వరకే ఈ లీగ్లో ఆడారు. అయితే కొత్తగా ఆల్రౌండర్ దయాళన్ హేమలత, వికెట్ కీపర్ బ్యాటర్ యస్తిక భాటియాలకు తొలిసారిగా బిగ్బాష్ చాన్స్ లభించింది. కానీ భారత కెప్టెన్ హర్మన్ప్రీత్ కౌర్ను మాత్రం లీగ్ ఫ్రాంచైజీలు పక్కన బెట్టాయి.‘ప్లాటినమ్’ కేటగిరీలో జెమీమా, దీప్తిగతంలో మెల్బోర్న్ రెనిగేడ్స్, సిడ్నీ థండర్లకు ఆడిన అనుభవమున్న సీనియర్ బ్యాటర్పై ఎనిమిది ఫ్రాంచైజీల్లో ఏ ఒక్క జట్టు కూడా ఆసక్తి చూపకపోవడం గమనార్హం. హిట్టింగ్తో ఆదరగొట్టే బ్యాటర్ జెమీమాకు బ్రిస్బేన్ హీట్ ‘ప్లాటినమ్’ ఎంపిక ద్వారా పెద్దపీట వేసింది. ఐపీఎల్లో టాప్ 1, 2, 3 రిటెన్షన్ పాలసీలా డబ్ల్యూబీబీఎల్లో ప్లాటినమ్, గోల్డ్, సిల్వర్, బ్రాంజ్ కేటగిరీలుంటాయి.మరో భారత ఆల్రౌండర్ దీప్తి శర్మకు మెల్బోర్న్ స్టార్స్ ‘ప్లాటినమ్’ కేటగిరీలో ఎంపిక చేసుకుంది. ఈ కేటగిరీలోకి ఎంపికైన క్రికెటర్లకు రూ. 62.41 లక్షలు (లక్షా 10 వేల ఆసీస్ డాలర్లు) కాంట్రాక్టు మొత్తంగా లభిస్తుంది. శిఖా పాండేకు రూ. 51 లక్షలు‘గోల్డ్’ కేటగిరీలో బ్రిస్బేన్ హీట్కు ఎంపికైన శిఖా పాండేకు రూ. 51 లక్షలు (90 వేల ఆసీస్ డాలర్లు), అడిలైడ్ స్ట్రయికర్స్కు స్మృతి మంధాన, పెర్త్ స్కార్చర్స్కు హేమలత, మెల్బోర్న్ స్టార్స్కు యస్తిక భాటియా సిల్వర్ కేటగిరీలో ఎంపికయ్యారు. ఈ ముగ్గురికి రూ. 36.88 లక్షలు (65 వేల ఆసీస్ డాలర్లు) కాంట్రాక్టు ఫీజుగా లభిస్తుంది. ఈ సీజన్ మహిళల బిగ్బాష్ లీగ్ వచ్చే నెల 27న అడిలైడ్లో మొదలవుతుంది. తొలి మ్యాచ్లో డిఫెండింగ్ చాంపియన్ అడిలైడ్ స్ట్రయికర్స్తో బ్రిస్బేన్ హీట్ జట్టు తలపడుతుంది. -
బిగ్బాష్ లీగ్లో టీమిండియా స్టార్లు..!
సిడ్నీ: ఈ ఏడాది మహిళల బిగ్బాష్ లీగ్ (డబ్ల్యూబీబీఎల్) టి20 టోర్నీలో భారత కెప్టెన్ హర్మన్ప్రీత్ కౌర్, జెమీమా రోడ్రిగ్స్, దీప్తి శర్మ ఆడటం దాదాపు ఖరారైంది. డబ్ల్యూబీబీఎల్ డ్రాఫ్టింగ్ జాబితాలో ఈ ముగ్గురి పేర్లు ఉండటమే దీనికి కారణం. మెల్బోర్న్ రెనిగేడ్స్ జట్టుకు ప్రాతినిధ్యం వహిస్తున్న హర్మన్ప్రీత్ను ఫ్రాంచైజీ రిటైన్ చేసుకోనుంది. ఈ మేరకు ఫ్రాంచైజీలు సోమవారం అట్టిపెట్టుకోవాలనుకుంటున్న ప్లేయర్ల జాబితా విడుదల చేశాయి.అడిలైడ్ స్ట్రయికర్స్ ఫ్రాంచైజీకి ప్రాతినిధ్యం వహిస్తున్న జెమీమా రోడ్రిగ్స్, దీప్తి శర్మను ఆ జట్టు రిటైన్ చేసుకోనుంది. సూజీ బేట్స్ (సిడ్నీ సిక్సర్స్), అలీస్ కాప్సీ (మెల్బోర్న్ స్టార్స్), సోఫియా ఎకెల్స్టోన్ (సిడ్నీ సిక్సర్స్), షబ్నిమ్ ఇస్మాయిల్ (హోబర్ట్ హరికేన్స్), హీతర్ నైట్ (సిడ్నీ థండర్), డానీ వ్యాట్ (పెర్త్ స్కార్చెర్స్) రిటెన్షన్ జాబితాలో ఉన్నారు. ఈ ఏడాది అక్టోబర్ 27 నుంచి డిసెంబర్ 1 వరకు డబ్ల్యూబీబీఎల్ సీజన్ జరగనుంది. -
WPL 2024: ప్లేఆఫ్స్కు ఢిల్లీ
న్యూఢిల్లీ: మహిళల ప్రీమియర్ లీగ్ (డబ్ల్యూపీఎల్)లో గత ఏడాది రన్నరప్ ఢిల్లీ క్యాపిటల్స్ ఈ ఏడాదీ ప్లేఆఫ్స్ దశకు అర్హత సాధించింది. ఆదివారం ఆఖరి బంతిదాకా సాగిన పోరులో ఢిల్లీ క్యాపిటల్స్ పరుగు తేడాతో రాయల్ చాలెంజర్స్ బెంగళూరు (ఆర్సీబీ) జట్టుపై గెలుపొందింది. ఈ సీజన్లో ఢిల్లీకిది ఐదో విజయం. మొదట ఢిల్లీ నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 181 పరుగులు చేసింది. పవర్ప్లేలో ఓపెనర్లు మెగ్ లానింగ్ (26 బంతుల్లో 29; 5 ఫోర్లు), షఫాలీ వర్మ (18 బంతుల్లో 23; 3 ఫోర్లు, 1 సిక్స్) 54 పరుగులతో శుభారంభమిచ్చారు. తర్వాత ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’ జెమీమా రోడ్రిగ్స్ (36 బంతుల్లో 58; 8 ఫోర్లు, 1 సిక్స్), అలైస్ క్యాప్సీ (32 బంతుల్లో 48; 8 ఫోర్లు) క్రీజులో ఉన్నంతసేపు స్కోరు బోర్డును ఉరుకులు పెట్టించారు. మూడో వికెట్కు ఇద్దరు కలిసి 61 బంతుల్లోనే 97 పరుగులు జోడించారు. జెమీమా 26 బంతుల్లో అర్ధసెంచరీ సాధించింది. స్పిన్నర్ శ్రేయాంక 4 వికెట్లు తీసింది. అనంతరం బెంగళూరు 20 ఓవర్లలో 7 వికెట్లు కోల్పోయి 180 పరుగులు చేసి ఓడింది. ఓపెనర్, కెపె్టన్ స్మృతి మంధాన (5) విఫలమైనా... టాపార్డర్లో సోఫీ మోలినెక్స్ (30 బంతుల్లో 33; 5 ఫోర్లు), ఎలీస్ పెరీ (32 బంతుల్లో 49; 7 ఫోర్లు, 1 సిక్స్) బెంగళూరును నడిపించారు. ఓవర్ వ్యవధిలో ఇద్దరు పెవిలియన్ చేరారు. ఈ దశలో రిచా ఘోష్ (29 బంతుల్లో 51; 4 ఫోర్లు, 3 సిక్సర్లు), సోఫీ డివైన్ (16 బంతుల్లో 26; 1 ఫోర్, 2 సిక్స్లు) మ్యాచ్పై ఆశలు రేపారు. చివరి ఓవర్లో బెంగళూరు విజయానికి 17 పరుగులు కావాల్సి ఉండగా, రిచా రెండు భారీ సిక్స్లు బాదింది. ఒక బంతి 2 పరుగుల విజయ సమీకరణం వద్ద రిచా రనౌట్ కావడంతో పరుగు తేడాతో ఢిల్లీ గట్టెక్కింది. నేడు గుజరాత్ జెయింట్స్తో యూపీ వారియర్స్ తలపడుతుంది. 10 పాయింట్లతో ముంబై ఇండియన్స్, ఢిల్లీ ఇప్పటికే ‘ప్లే ఆఫ్స్’ చేరగా... ఆరు పాయింట్లతో నాలుగో స్థానంలో ఉన్న యూపీ ప్లే ఆఫ్స్ దశకు అర్హత పొందే అవకాశాలు సజీవంగా ఉండాలంటే తమ చివరి లీగ్ మ్యాచ్లో గుజరాత్పై తప్పనిసరిగా గెలవాలి. -
మెరుపు ఇన్నింగ్స్లతో విరుచుకుపడిన ఢిల్లీ క్యాపిటల్స్ బ్యాటర్లు
మహిళల ఐపీఎల్ 2024 ఎడిషన్లో భాగంగా ఇవాళ (మార్చి 10) ఢిల్లీ క్యాపిటల్స్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్లు తలపడుతున్నాయి. ఈ మ్యాచ్లో టాస్ గెలిచిన ఢిల్లీ తొలుత బ్యాటింగ్ చేసి 181 పరుగుల భారీ స్కోర్ (5 వికెట్ల నష్టానికి) చేసింది. జెమీమా రోడ్రిగెజ్ (36 బంతుల్లో 58; 8 ఫోర్లు, సిక్స్), అలైస్ క్యాప్సీ (32 బంతుల్లో 48; 8 ఫోర్లు) మెరుపు ఇన్నింగ్స్లతో విరుచుకుపడ్డారు. ఓపెనర్లు మెగ్ లాన్నింగ్ (29), షఫాలీ వర్మ (23) సైతం ఓ మోస్తరు స్కోర్లు చేశారు. మారిజన్ కప్ 12, జొనాస్సెన్ 1, రాధా యాదవ్ ఒక పరుగు చేశారు. ఆర్సీబీ బౌలర్లలో శ్రేయాంక పాటిల్ 4 వికెట్లతో విజృంభించగా.. అషా శోభన ఓ వికెట్ దక్కించుకుంది. అనంతరం భారీ లక్ష్య ఛేదనకు దిగిన ఆర్సీబీ 7 ఓవర్లు పూర్తయ్యేసరికి వికెట్ నష్టానికి 49 పరుగులు చేసింది. స్మృతి మంధన (5) ఔట్ కాగా.. సోఫీ ఎక్లెస్స్టోన్ (8), ఎల్లిస్ పెర్రీ (36) క్రీజ్లో ఉన్నారు. మంధన వికెట్ క్యాప్సీకి దక్కింది. కాగా, ఢిల్లీ క్యాపిటల్స్ ఈ సీజన్లో ఆడిన 6 మ్యాచ్ల్లో 4 విజయాలతో పాయింట్ల పట్టికలో రెండో స్థానంలో కొనసాగుతుండగా.. ఆర్సీబీ 6 మ్యాచ్ల్లో 3 విజయాలతో మూడో ప్లేస్లో నిలిచింది. 7 మ్యాచ్ల్లో 5 విజయాలు సాధించిన ముంబై ఇండియన్స్ వరుసగా రెండో ఏడాది కూడా ప్లే ఆఫ్స్కు అర్హత సాధించగా.. యూపీ వారియర్జ్ (6 పాయింట్లు) నాలుగో స్థానంలో, గుజరాత్ జెయింట్స్ (2 పాయింట్లు) చివరి స్థానంలో ఉన్నాయి. -
ఢిల్లీ ధమాకా...
న్యూఢిల్లీ: మహిళల ప్రీమియర్ లీగ్ (డబ్ల్యూపీఎల్) టి20 క్రికెట్ టోర్నీ రెండో సీజన్లో ఢిల్లీ క్యాపిటల్స్ జట్టు హవా కొనసాగుతోంది. సొంతగడ్డపై మొదలైన రెండో అంచె పోటీలో ఢిల్లీ గర్జించింది. మంగళవారం జరిగిన ఈ మ్యాచ్లో 29 పరుగుల తేడాతో డిఫెండింగ్ చాంపియన్స్ ముంబై ఇండియన్స్ను ఢిల్లీ ఓడించింది. ఈ గెలుపుతో ఢిల్లీ 8 పాయింట్లతో ఒంటరిగా అగ్రస్థానంలోకి దూసుకొచ్చింది. టాస్ ఓడి ముందుగా బ్యాటింగ్కు దిగిన క్యాపిటల్స్ నిర్ణీత 20 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 192 పరుగుల భారీస్కోరు చేసింది. మిడిలార్డర్ బ్యాటర్ జెమీమా రోడ్రిగ్స్ (33 బంతుల్లో 69 నాటౌట్; 8 ఫోర్లు, 3 సిక్స్లు) ధనాధన్ ఇన్నింగ్స్ ఆడింది. కేవలం 27 బంతుల్లోనే ఆమె అర్ధ శతకాన్ని పూర్తిచేసింది. ఓపెనర్, కెపె్టన్ మెగ్ లానింగ్ (38 బంతుల్లో 53; 6 ఫోర్లు, 2 సిక్స్లు) కూడా ధాటిగా ఆడింది. లానింగ్తో కలిసి ఇన్నింగ్స్ ఆరంభించిన షఫాలీ వర్మ (12 బంతుల్లో 28; 3 ఫోర్లు, 2 సిక్స్లు) క్రీజులో కాసేపే ఉన్నా మెరిపించింది. దీంతో ఢిల్లీ పవర్ప్లేలో 56/1 స్కోరు చేసింది. డెత్ ఓవర్లలో జెమీమా చెలరేగడంతో భారీస్కోరు సాధ్యమైంది. ముంబై బౌలర్లు షబ్నిమ్, సైకా ఇషాక్ చెరో వికెట్ తీశారు. అనంతరం కష్టసాధ్యమైన లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన ముంబై ఇండియన్స్ 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 163 పరుగులు చేసి ఓడిపోయింది. ఢిల్లీ బౌలర్లు జెస్ జొనాసెన్ (3/21), మరిజాన్ కాప్ (2/37), శిఖా పాండే (1/27), టిటాస్ సాధు (1/23) ముంబైను కట్టడి చేశారు. ఒకదశలో ముంబై 68/5 స్కోరు వద్ద సగం వికెట్లను కోల్పోయింది. టాపార్డర్లో హేలీ మాథ్యూస్ (17 బంతుల్లో 29; 6 ఫోర్లు) మినహా ఆ తర్వాత వరుసగా యస్తిక భాటియా (6), నట్ సీవర్ (5), కెప్టెన్ హర్మన్ప్రీత్ (6) నిరాశపరిచారు. లోయర్ ఆర్డర్లో అమన్జోత్ (27 బంతుల్లో 42; 7 ఫోర్లు) టాప్ స్కోరర్గా నిలిచింది. నేడు జరిగే మ్యాచ్లో గుజరాత్ జెయింట్స్తో రాయల్ చాలెంజర్స్ బెంగళూరు తలపడుతుంది. -
రెచ్చిపోయిన రోడ్రిగెజ్.. విరుచుకుపడిన లాన్నింగ్
మహిళల ఐపీఎల్ 2024 ఎడిషన్లో భాగంగా ముంబై ఇండియన్స్తో ఇవాళ (మార్చి 5) జరుగుతున్న మ్యాచ్లో ఢిల్లీ క్యాపిటల్స్ బ్యాటర్లు చెలరేగిపోయారు. ఈ మ్యాచ్లో టాస్ ఓడి ముంబై ఆహ్వానం మేరకు తొలుత బ్యాటింగ్ చేసిన ఢిల్లీ.. నిర్ణీత ఓవర్లు పూర్తయ్యే సరికి 4 వికెట్ల నష్టానికి 192 పరుగులు చేసింది. తొలుత ఓపెనర్లు షఫాలీ వర్మ (12 బంతుల్లో 28; 3 ఫోర్లు, 2 సిక్సర్లు), మెగ్ లాన్నింగ్ (38 బంతుల్లో 53; 6 ఫోర్లు, 2 సిక్సర్లు) మెరుపు షాట్లతో విరుచుకుపడగా.. ఆతర్వాత బరిలోకి దిగిన జెమీమా రోడ్రిగెజ్ (33 బంతుల్లో 69 నాటౌట్; 8 ఫోర్లు, 3 సిక్సర్లు) ఆకాశమే హద్దుగా చెలరేగి వచ్చిన బంతిని వచ్చినట్లు బౌండరీ ఆవలికి తరలించింది. ఢిల్లీ ఇన్నింగ్స్లో అలైస్ క్యాప్సీ (20 బంతుల్లో 19; 3 ఫోర్లు), మారిజన్ కప్ (12 బంతుల్లో 11; ఫోర్) తక్కువ స్కోర్లకే ఔట్ కాగా.. జెస్ జొనాస్సెన్ 5 బంతుల్లో 4 పరుగులతో అజేయంగా నిలిచింది. ముంబై బౌలర్లలో షబ్నిమ్ ఇస్మాయిల్, సైకా ఇషాఖీ, పూజా వస్త్రాకర్, హేలీ మాథ్యూస్ తలో వికెట్ పడగొట్టారు. -
‘టీమిండియాకు మరో నయా ఫినిషర్’.. దుమ్ములేపిన ఆల్రౌండర్.. కానీ
Update: ఆస్ట్రేలియాతో తొలి వన్డేలో భారత మహిళా జట్టు ఆరు వికెట్ల తేడాతో పరాజయం పాలైంది. వాంఖడేలో 46.3 ఓవర్లలోనే టీమిండియా విధించిన లక్ష్యాన్ని ఛేదించింది ఆసీస్ వుమెన్ టీమ్. తద్వారా మూడు మ్యాచ్ల సిరీస్లో 1-0తో ఆధిక్యంలోకి వెళ్లింది. దుమ్ములేపిన భారత ఆల్రౌండర్ ఆస్ట్రేలియాతో ఏకైక టెస్టులో అదరగొట్టిన భారత మహిళా క్రికెటర్ పూజా వస్త్రాకర్ తొలి వన్డేలోనూ సత్తా చాటింది. జట్టుకు అవసరమైన సమయంలో అద్భుత ఇన్నింగ్స్తో ఆకట్టుకుంది. తొమ్మిదో స్థానంలో బ్యాటింగ్కు దిగిన ఈ బౌలింగ్ ఆల్రౌండర్ కేవలం 46 బంతుల్లోనే 62 పరుగులతో దుమ్ములేపింది. దీంతో టీమిండియా తరఫున మరో నయా ఫినిషర్ వచ్చేసిందంటూ అభిమానులు పూజా వస్త్రాకర్పై ప్రశంసలు కురిపిస్తున్నారు. సొంతగడ్డపై ఆసీస్తో ఏకైక టెస్టులో గెలుపొంది చరిత్ర సృష్టించిన భారత మహిళా జట్టు గురువారం నుంచి వన్డే సిరీస్ మొదలుపెట్టింది. ఇందులో భాగంగా ముంబైలోని వాంఖడేలో టాస్ గెలిచిన ఆతిథ్య టీమిండియా.. తొలుత బ్యాటింగ్ ఎంచుకుంది. టాపార్డర్లో ఓపెనర్ యస్తికా భాటియా 49 పరుగులతో రాణించగా.. మరో ఓపెనర్ షఫాలీ వర్మ కేవలం ఒక్క పరుగు మాత్రమే చేసి అవుటైంది. ఇక వన్డౌన్లో వచ్చిన రిచా ఘోష్ 21 పరుగులు చేయగా.. ఆ తర్వాతి స్థానంలో వచ్చిన కెప్టెన్ హర్మన్ప్రీత్ కౌర్ పూర్తిగా నిరాశపరిచింది. మొత్తంగా 17 బంతులు ఎదుర్కొన్న హర్మన్ కేవలం తొమ్మిది పరుగులు మాత్రమే చేయగలిగింది. ఇలా ఓవైపు వికెట్లు పడుతున్నా జెమీమా రోడ్రిగ్స్ పట్టుదలగా నిలబడి సంచలన ఇన్నింగ్స్తో మెరిసింది. 77 బంతుల్లో 82 పరుగులు సాధించింది. జెమీమా తర్వాతి స్థానాల్లో బ్యాటింగ్ చేసిన దీప్తి శర్మ 21, అమన్జోత్ కౌర్ 20, స్నేహ్ రాణా 1 పరుగులు చేశారు. దీంతో స్వల్ప స్కోరుకే భారత్ను కట్టడి చేయగలమన్న ఆస్ట్రేలియా ఆశలపై పూజా వస్త్రాకర్ నీళ్లు చల్లింది. ధనాధన్ ఇన్నింగ్స్తో.. రేణుకా ఠాకూర్ సింగ్(5- నాటౌట్)తో కలిసి ఆఖరి వరకు అజేయంగా నిలిచి సత్తా చాటింది. యస్తికా, జెమీమా, పూజా అద్భుత బ్యాటింగ్ కారణంగా భారత జట్టు నిర్ణీత 50 ఓవర్లలో 282 పరుగులు చేసింది. ఆస్ట్రేలియా బౌలర్లలో డారిస్ బ్రౌన్, మేగన్ షట్, అన్నాబెల్ సదర్లాండ్, అలనా కింగ్ ఒక్కో వికెట్ తీయగా.. ఆష్లే గార్డ్నర్, వెరెహాం తలా రెండేసి వికెట్లు దక్కించుకున్నారు. Pooja Vastrakar a fighter and new finisher for team India She scored 62 of 46 balls.Brilliant 👏#AUSvPAK #INDvSA #Dhoni #SENA #BBL13 #INDvAUS #BabarAzam #Shami #Abdullah #Prasidh #CricketTwitterpic.twitter.com/OaXDuyiXpx — Sujeet Suman (@sujeetsuman1991) December 28, 2023 -
ఏకైక టెస్టులో ఆసీస్ను చిత్తు చేసిన భారత్.. సరికొత్త చరిత్ర
India Women vs Australia Women, Only Test: భారత మహిళా క్రికెట్ జట్టు చరిత్ర సృష్టించింది. ఆస్ట్రేలియాను మట్టికరిపించి సొంతగడ్డపై చరిత్రాత్మక విజయం అందుకుంది. సమిష్టి ప్రదర్శనతో రాణించి కంగారూ జట్టుపై మొట్టమొదటి టెస్టు గెలుపు నమోదు చేసింది. మరోరోజు ఆట మిగిలి ఉండగానే జయకేతనం ఎగురవేసి సత్తా చాటింది. కాగా భారత్ ఏకైక టెస్టు ఆడేందుకు ఆస్ట్రేలియా మహిళా జట్టు ముంబైకి వచ్చింది. ఇరు జట్ల మధ్య వాంఖడే వేదికగా డిసెంబరు 21న మ్యాచ్ ఆరంభమైంది. టాస్ గెలిచిన ఆస్ట్రేలియా తొలుత బ్యాటింగ్ ఎంచుకుంది. అయితే, భారత బౌలర్ల దెబ్బకు 219 పరుగులకే తొలి ఇన్నింగ్స్ ముగించింది. అదరగొట్టిన బౌలర్లు, బ్యాటర్లు పూజా వస్త్రాకర్ నాలుగు, స్నేహ్ రాణా మూడు, దీప్తి శర్మ రెండు వికెట్లు పడగొట్టి ఆసీస్ బ్యాటింగ్ ఆర్డర్ను కకావికలం చేశారు. ఈ క్రమంలో బ్యాటింగ్ ఆరంభించిన భారత్కు ఓపెనర్లు షఫాలీ వర్మ 40, స్మృతి మంధాన 74 పరుగులతో అదిరిపోయే ఆరంభం అందించారు. మిడిలార్డర్లో రిచా ఘోష్ 52, జెమీమా రోడ్రిగ్స్ 73 పరుగులతో దుమ్ములేపారు. ఇక లోయర్ ఆర్డర్లో దీప్తి శర్మ 78, పూజా వస్త్రాకర్ 47 పరుగులతో అద్వితీయ బ్యాటింగ్తో ఆకట్టుకున్నారు. ఇలా బ్యాటర్లంతా సమిష్టిగా రాణించడంతో భారత్ మొదటి ఇన్నింగ్స్లో 406 పరుగులకు ఆలౌట్ అయి ఆధిక్యంలో నిలిచింది. చెలరేగిన భారత బౌలర్లు.. ఆసీస్ పోరాడినా ఈ క్రమంలో రెండో ఇన్నింగ్స్ మొదలుపెట్టిన ఆస్ట్రేలియా మూడో రోజు ఆట ముగిసే సమయానికి 90 ఓవర్లలో 5 వికెట్లు నష్టపోయి 233 పరుగులు సాధించింది. ఎలాగైనా తిరిగి పుంజుకోవాలని పట్టుదలగా పోరాడింది. అయితే, భారత బౌలర్ల ముందు ఆసీస్ పప్పులు ఉడకలేదు. టాపార్డర్, మిడిలార్డర్ పర్వాలేదనిపించినా.. నాలుగో రోజు ఆటలో లోయర్ ఆర్డర్ కుప్పకూలిపోయింది. స్నేహ్ రాణా నాలుగు వికెట్లుతో చెలరేగగా.. పూజా ఒకటి, రాజేశ్వరి గైక్వాడ్, కెప్టెన్ హర్మన్ప్రీత్ కౌర్ రెండేసి వికెట్లు పడగొట్టి ఆసీస్ను కట్టడి చేశారు. దీంతో 261 పరుగులకు ఆస్ట్రేలియా మహిళా జట్టు ఆలౌట్ అయింది. మొట్టమొదటి టెస్టు గెలుపు ఈ క్రమంలో స్వల్ప లక్ష్యంతో బరిలోకి దిగిన భారత జట్టు ఆదివారం నాటి నాలుగో రోజు ఆటలోనే మ్యాచ్ను ముగించేసింది. స్మృతి మంధాన 38, జెమీమా రోడ్రిగ్స్ 12 పరుగులతో ఆఖరి అజేయంగా నిలవగా.. 18.4 ఓవర్లలోనే టార్గెట్ను పూర్తి చేసింది. మంధాన ఫోర్ బాది విజయాన్ని ఖరారు చేయగా.. ఎనిమిది వికెట్ల తేడాతో జయభేరి మోగించింది. కాగా టెస్టుల్లో ఆస్ట్రేలియాపై భారత మహిళా క్రికెట్ జట్టుకు ఇదే తొలి విజయం. అంతేకాదు 1984 తర్వాత సొంతగడ్డపై ఆసీస్తో టెస్టు ఆడటం కూడా ఇదే మొదటిసారి అది కూడా వాంఖడేలో!! ఇక గతంలో భారత్- ఆసీస్ మహిళా జట్లు పదిసార్లు ముఖాముఖి పోటీపడగా.. ఆసీస్ నాలుగుసార్లు గెలిచింది. ఆరుసార్లు మ్యాచ్ డ్రా అయింది. చదవండి: WFI: క్రీడా శాఖ సంచలన నిర్ణయం.. కొత్తగా ఎన్నికైన డబ్ల్యూఎఫ్ఐపై వేటు 𝙃𝙄𝙎𝙏𝙊𝙍𝙔 𝙄𝙉 𝙈𝙐𝙈𝘽𝘼𝙄! 🙌#TeamIndia women register their first win against Australia in Test Cricket 👏👏 Scorecard ▶️ https://t.co/7o69J2XRwi#INDvAUS | @IDFCFIRSTBank pic.twitter.com/R1GKeuRa69 — BCCI Women (@BCCIWomen) December 24, 2023 -
‘హండ్రెడ్’ టోర్నీకి జెమీమా
లండన్: భారత మహిళా బ్యాటర్ జెమీమా రోడ్రిగ్స్ వరుసగా మూడో ఏడాది ఇంగ్లండ్లో జరిగే ‘హండ్రెడ్’ టోర్నమెంట్లో ఆడనుంది. గత రెండేళ్లుగా నార్తర్న్ సూపర్చార్జర్స్ జట్టుకు ఆడుతున్న ఆమెను ముందుగా ఈ సీజన్ నుంచి తప్పించాలని ఆ ఫ్రాంచైజీ అనుకుంది. అయితే నార్తర్న్కు ప్రాతినిధ్యం వహిస్తున్న ఆసీస్ ప్లేయర్ హీథెర్ గ్రాహమ్ గాయంతో వైదొలగడంతో చివరి నిమిషంలో 22 ఏళ్ల జెమీమాతో ఆ ఫ్రాంచైజీ మళ్లీ కాంట్రాక్టు కుదుర్చుకుంది. ఈ సీజన్ ‘హండ్రెడ్’ టి20 టోర్నీ వచ్చేనెల 1 నుంచి 27 వరకు జరుగనుంది. ఇందులో నలుగురు భారత క్రికెటర్లు పాల్గొంటున్నారు. లండన్ స్పిరిట్ జట్టుకు రిచా ఘోష్, ట్రెంట్ రాకెట్స్కు హర్మన్ప్రీత్ కౌర్, సదర్న్ బ్రేవ్కు స్మృతి మంధాన ఆడనున్నారు. -
జెమీమా రోడ్రిగ్స్ ఆల్రౌండ్ ప్రదర్శన..108 పరుగులతో భారీ విజయం
మిర్పూర్: సిరీస్లో నిలవాలంటే కచ్చితంగా గెలవాల్సిన మ్యాచ్లో భారత మహిళల జట్టు మెరిసింది. బంగ్లాదేశ్తో బుధవారం జరిగిన రెండో వన్డేలో హర్మన్ప్రీత్ కౌర్ బృందం 108 పరుగులతో ఘనవిజయం సాధించింది. జెమీమా రోడ్రిగ్స్ ఆల్రౌండ్ ప్రదర్శనతో భారత జట్టు విజయంలో కీలకపాత్ర పోషించింది. ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’ అవార్డు గెల్చుకున్న జెమీమా 86 పరుగులు చేయడంతో పాటు బంతితో రాణించి 3 పరుగులిచ్చి 4 వికెట్లు తీసింది. తాజా ఫలితంతో మూడు మ్యాచ్ల సిరీస్లో ప్రస్తుతం రెండు జట్లు 1–1తో సమంగా ఉన్నాయి. నిర్ణయాత్మక మూడో వన్డే శనివారం జరుగుతుంది. ముందుగా బ్యాటింగ్ చేసిన భారత్ నిర్ణీత 50 ఓవర్లలో 8 వికెట్లకు 228 పరుగులు సాధించింది. జెమీమా రోడ్రిగ్స్ (78 బంతుల్లో 86; 9 ఫోర్లు), కెప్టెన్ హర్మన్ప్రీత్ కౌర్ (88 బంతుల్లో 52; 3 ఫోర్లు) అర్ధ సెంచరీలతో భారత్ను ఆదుకున్నారు. వీరిద్దరు నాలుగో వికెట్కు 131 పరుగుల భాగస్వామ్యం జోడించారు. వన్డేల్లో తన అత్యధిక వ్యక్తిగత స్కోరు నమోదు చేసిన 22 ఏళ్ల జెమీమా 2019 తర్వాత మళ్లీ వన్డేల్లో అర్ధ సెంచరీ చేసింది. వైస్ కెప్టెన్ స్మృతి మంధాన (58 బంతుల్లో 36; 4 ఫోర్లు), హర్లీన్ (36 బంతుల్లో 25) కూడా రాణించారు. బంగ్లాదేశ్ బౌలర్లలో సుల్తానా ఖాతూన్, నహీదా అక్తర్ రెండు వికెట్ల చొప్పున తీశారు. 229 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన బంగ్లాదేశ్ 35.1 ఓవర్లలో 120 పరుగులకు ఆలౌటైంది. ఫర్జానా హఖ్ (47; 5 ఫోర్లు), రీతూ మోని (27; 3 ఫోర్లు), ముర్షిదా ఖాతూన్ (12; 3 ఫోర్లు) మాత్రమే రెండంకెల స్కోరు చేశారు. జెమీమా తన ఆఫ్ స్పిన్ మాయాజాలంతో 3.1 ఓవర్లు వేసి కేవలం 3 పరుగులిచ్చి 4 వికెట్లు పడగొట్టింది. లెగ్ స్పిన్నర్ దేవిక వైద్య 30 పరుగులిచ్చి 3 వికెట్లు తీసింది. మేఘన సింగ్, స్నేహ్ రాణా, దీప్తి శర్మలకు ఒక్కో వికెట్ లభించింది. 8⃣6⃣ runs with the bat 👏 4️⃣ wickets with the ball 😎@JemiRodrigues' all-round performance makes her the Player of the Match 👌🏻#TeamIndia win by 108 runs in the second ODI 👏 Scorecard - https://t.co/6vaHiS9Qad #BANvIND pic.twitter.com/CuUNtJpFOo — BCCI Women (@BCCIWomen) July 19, 2023 చదవండి: Stuart Broad: 600 వికెట్ల క్లబ్లో.. టెస్టు క్రికెట్ చరిత్రలో నాలుగో బౌలర్గా -
బ్యాట్తో ఇరగదీసి, డ్యాన్స్తో అదరగొట్టిన జెమీమా రోడ్రిగెస్
మహిళల ఐపీఎల్ (WPL) అరంగేట్రం సీజన్ (2023)లో భాగంగా నిన్న (మార్చి 5) రాయల్ ఛాలెంజర్స్తో జరిగిన మ్యాచ్లో ఢిల్లీ క్యాపిటల్స్ 60 పరుగుల తేడాతో ఘన విజయం సాధించిన విషయం తెలిసిందే. ఈ మ్యాచ్లో షఫాలీ వర్మ (45 బంతుల్లో 84; 10 ఫోర్లు, 4 సిక్సర్లు), మెగ్ లాన్నింగ్ (43 బంతుల్లో 72; 14 ఫోర్లు), మారిజాన్ కాప్ (17 బంతుల్లో 39 నాటౌట్; 3 ఫోర్లు, 3 సిక్సర్లు), జెమీమా రోడ్రిగెస్ (15 బంతుల్లో 22 నాటౌట్; 3 ఫోర్లు) శివాలెత్తడంతో ఢిల్లీ క్యాపిటల్స్ నిర్ణీత ఓవర్లలో 2 వికెట్ల నష్టానికి 223 పరుగుల భారీ స్కోర్ చేసింది. ఛేదనలో తారా నోరిస్ (5/29) నిప్పులు చెరగడంతో ఆర్సీబీ నిర్ణీత ఓవర్లలో 8 వికెట్లు కోల్పోయి 163 పరుగులు మాత్రమే చేసి ఓటమిపాలైంది. SCCCENESSSS https://t.co/MwCnUfPzrH — Jemimah Rodrigues (@JemiRodrigues) March 5, 2023 కాగా, డీసీ ఇన్నింగ్స్ చివర్లో బరిలోకి దిగి బ్యాట్తో ఇరగదీసిన జెమీమా రోడ్రిగెస్.. ఆతర్వాత ఫీల్డింగ్ చేసే సమయంలో డ్యాన్స్తో అదరగొట్టి అభిమానుల మనసులను కొల్లగొట్టింది. డీసీ వైస్ కెప్టెన్ అయిన 22 ఏళ్ల రోడ్రిగెస్.. బౌండరీ లైన్ వద్ద ఫీల్డింగ్ చేస్తుండగా, స్టేడియంలో ఒక్కసారిగా మ్యూజిక్ ప్లే కావడం మొదలైంది. హఠాత్తుగా ఫాస్ట్ బీట్ సంగీతం ప్లే కావడంతో తనలోని డ్యాన్సర్ను ఆపుకోలేకపోయిన రోడ్రిగెస్.. బాంగ్రా, వెస్ట్రన్ కలగలిపిన నృత్యం చేస్తూ ఊగిపోయింది. రోడ్రిగెస్.. అచ్చం ప్రొఫెషనల్ డ్యాన్సర్లా డ్యాన్స్ చేసి ఫ్యాన్స్ను ఉత్తేజపరిచింది. రోడ్రిగెస్ డ్యాన్సింగ్ స్కిల్స్కు ఫిదా అయిన అభిమానులు సోషల్మీడియా వేదికగా ఆమెపై ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. కొందకేమో రోడ్రిగెస్ను విరాట్ కోహ్లితో పోలుస్తూ 100 పర్సంట్ ఎంటర్టైనర్ అంటూ కొనియాడుతున్నారు. మ్యాచ్ అనంతరం ఫ్యాన్స్ పోస్ట్ చేసిన తన డ్యాన్సింగ్ మూమెంట్స్కు సంబంధించిన వీడియోలకు రోడ్రిగెస్ రెస్పాండ్ అయ్యింది. కొందరికి ఆమె రీట్వీట్లు కూడా చేసింది. రొడ్రిగెస్ డ్యాన్సింగ్ వీడియో ప్రస్తుతం నెట్టింట హల్చల్ చేస్తుంది. -
ఢిల్లీ సారథిగా ఐదుసార్లు ఐసీసీ ట్రోఫీ గెలిచిన కెప్టెన్
WPL 2023- Delhi Capitals Squad- Captain: ఢిల్లీ క్యాపిటల్స్ తమ మహిళా జట్టు కెప్టెన్ పేరును ప్రకటించింది. ఆస్ట్రేలియాకు ఐదుసార్లు ప్రపంచకప్ అందించిన మెగ్ లానింగ్ను సారథిగా నియమించినట్లు తెలిపింది. ఆమెకు డిప్యూటీగా టీమిండియా క్రికెటర్ జెమీమా రోడ్రిగ్స్ను ఎంపిక చేసినట్లు గురువారం వెల్లడించింది. కాగా మార్చి 4 నుంచి మహిళల ప్రీమియర్ లీగ్(డబ్ల్యూపీఎల్)-2023 ఆరంభం కానున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో ఇప్పటికే ఆర్సీబీ స్మృతి మంధాన, ముంబై ఇండియన్స్ హర్మన్ప్రీత్కౌర్, గుజరాత్ జెయింట్స్ బెత్ మూనీ, యూపీ వారియర్జ్ అలిసా హేలీలను సారథులుగా నియమించినట్లు ప్రకటించాయి. ఆరోజే తొలి మ్యాచ్ ఎట్టకేలకు ఢిల్లీ సైతం తమ కెప్టెన్ పేరును తాజాగా రివీల్ చేసింది. కాగా ఆస్ట్రేలియాకు చెందిన 30 ఏళ్ల మెల్ లానింగ్ రైట్హ్యాండ్ బ్యాటర్. ఆసీస్కు ఐదుసార్లు ఐసీసీ ట్రోఫీ అందించిన ఘనత ఆమెది. 2014, 2018, 2020, 2023 టీ20 ప్రపంచకప్, 2022 వన్డే వరల్డ్కప్ గెలిచింది. కాగా ఢిల్లీ క్యాపిటల్స్ మార్చి 5న రాయల్ చాలెంజర్స్ బెంగళూరుతో మ్యాచ్తో డబ్ల్యూపీఎల్ ప్రయాణం ఆరంభించనుంది. ముంబైలోని బ్రబౌర్న్ స్టేడియంలో ఈ మ్యాచ్ జరుగనుంది. ఇక ఢిల్లీ కెప్టెన్, వైస్ కెప్టెన్లుగా నియమితులు కావడం పట్ల మెగ్ లానింగ్, జెమీమా రోడ్రిగ్స్ హర్షం వ్యక్తం చేశారు. కాగా ఫిబ్రవరి 13న జరిగిన వేలంలో ఆస్ట్రేలియా కెప్టెన్ మెగ్ లానింగ్ను రూ.1.1కోట్లకు ఢిల్లీ క్యాపిటల్స్ కొనుగోలు చేసిన విషయం తెలిసిందే. అయితే, రోడ్రిగ్స్కు మాత్రం భారీ మొత్తంలో 2.2 కోట్ల రూపాయలు ఖర్చు చేసి సొంతం చేసుకుంది. ఢిల్లీ క్యాపిటల్స్ జట్టు: మెగ్ లానింగ్, జెమీమా రోడ్రిగ్స్, షఫాలీ వర్మ, రాధా యాదవ్, శిఖా పాండే, మరిజానే క్యాప్, టైటాస్ సాధు, అలిస్ కాప్సీ, తారా నోరిస్, లారా హ్యారిస్, జేసియా అక్తర్, మిన్ను మణి, తాన్యా భాటియా, పూనమ్ యాదవ్, జెస్ జొనాస్సెన్, స్నేహదీప్తి, అరుంధతి రెడ్డి, అపర్ణ మొండాల్. చదవండి: IND Vs AUS: స్టన్నింగ్ క్యాచ్.. అడ్డంగా దొరికిపోయిన శ్రేయాస్ BGT 2023: పుజారా భయపడుతున్నాడు.. అయ్యర్ పిరికిపందలా ఉన్నాడు! ముందుందిలే.. -
వేలంలో అత్యధిక ధర పలికిన టాప్-5 క్రికెటర్లు వీరే..
మహిళల ప్రీమియర్ లీగ్-2023 సంబంధించిన వేలం సోమవారం ముంబైలోని జియో వరల్డ్ కన్వెన్షన్ సెంటర్లో ఘనంగా జరిగింది. ఈ వేలంలో మొత్తం 87 మంది క్రికెటర్లను ఆయా ఫ్రాంచైజీలు దక్కించుకున్నాయి. క్రికెటర్లను కొనుగోలు చేయడానికి ఐదు ఫ్రాంచైజీలు రూ. 59.5 కోట్ల మొత్తాన్ని వెచ్చించాయి. అయితే ఈ వేలంలో అత్యధిక ధరకు అమ్ముడుపోయిన క్రికెటర్లపై ఓ లూక్కేద్దం. స్మృతి మంధాన ఈ వేలంలో భారత స్టార్ ఓపెనర్ స్మృతి మంధానకు జాక్పాట్ తగిలింది. మంధానను రూ.3.4 కోట్ల భారీ ధరకు రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు కొనుగోలు చేసింది. ఈ క్రమంలో వేలంలో అత్యధిక ధర దక్కించుకున్న ప్లేయర్గా మంధాన నిలిచింది. ఆష్లీ గార్డనర్ ఈ వేలంలో ఆస్ట్రేలియా స్టార్ ఆల్రౌండర్ ఆష్లీ గార్డనర్కు ఊహించని ధర దక్కింది. ఆమెను రూ. 3.20 కోట్లకు గుజరాత్ జెయింట్స్ సొంతం చేసుకుంది. దీంతో ఈ వేలంలో అత్యధిక ధర దక్కించుకున్న రెండో ప్లేయర్గా గార్డనర్ నిలిచింది. అదే విధంగా వేలంలో అత్యధిక ధర పలికిన విదేశీ క్రికెటర్గా గార్డనర్ నిలిచింది. నాట్ స్కివర్ ఇంగ్లండ్కు చెందిన స్టార్ ఆల్ రౌండర్ నాట్ స్కివర్పై కూడా కాసుల వర్షం కురిసింది. ఈ వేలంలో స్కివర్ను రూ. 3.20 కోట్లకు ముంబై ఇండియన్స్ దక్కించుకుంది. దీంతో ఈ వేలంలో అత్యధిక ధర దక్కించుకున్న రెండో ప్లేయర్గా గార్డనర్తో కలిసి సంయుక్తంగా నిలిచింది. దీప్తి శర్మ భారత స్టార్ ఆల్రౌండర్ దీప్తి శర్మను ఉత్తరప్రదేశ్ వారియర్జ్ రూ. 2.60 కోట్లకు సొంతం చేసుకుంది. దీప్తి శర్మను ఉత్తరప్రదేశ్ వారియర్జ్ తమ కెప్టెన్గా నియమించే అవకాశం ఉంది. జెమీమా రోడ్రిగ్స్ టీమిండియా మిడిలార్డర్ బ్యాటర్ జెమీమా రోడ్రిగ్స్ను దిల్లీ క్యాపిటల్స్ రూ. 2.20 కోట్లకు దక్కించుకుంది. ఇప్పటి వరకు 97 అంతర్జాతీయ మ్యాచ్లు ఆడిన రోడ్రిగ్స్ 13 అర్ధసెంచరీలు చేసింది. చదవండి: WPL Auction: లేడీ సెహ్వాగ్కు భారీ ధర.. ఎన్ని కోట్లంటే? -
మహిళల టి20 ప్రపంచకప్ : పాక్పై టీమ్ఇండియా ఘనవిజయం (ఫోటోలు)
-
T20 WC 2023: పాక్పై ఇదే అత్యధిక ఛేదన.. విరాట్ కోహ్లి ప్రశంసల జల్లు
ICC Womens T20 World Cup 2023: ఐసీసీ మహిళా టీ20 ప్రపంచకప్-2023 టోర్నీలో శుభారంభం చేసిన భారత మహిళా క్రికెట్ జట్టుపై టీమిండియా స్టార్ విరాట్ కోహ్లి ప్రశంసలు కురిపించాడు. ఆఖరి వరకు ఉత్కంఠ రేపిన మ్యాచ్లో పాకిస్తాన్ను ఓడించిన హర్మన్ప్రీత్ సేనకు శుభాభినందనలు తెలిపాడు. అద్భుత ఆట తీరుతో ముందుకు సాగుతూ మహిళా లోకానికి స్ఫూర్తిగా నిలుస్తున్నారని కొనియాడాడు. మరిన్ని విజయాలు అందుకోవాలని ఆకాంక్షించాడు. భారత్ వర్సెస్ పాక్ దక్షిణాఫ్రికా వేదికగా శుక్రవారం(ఫిబ్రవరి 10)న ఐసీసీ మహిళల టీ20 వరల్డ్కప్ ఈవెంట్ ఆరంభమైంది. ఈ క్రమంలో కేప్టౌన్లో జరిగిన మూడో మ్యాచ్లో ఆదివారం(ఫిబ్రవరి 12) చిరకాల ప్రత్యర్థులు భారత్- పాకిస్తాన్ తలపడ్డాయి. టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న పాకిస్తాన్ మహిళా జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 149 పరుగులు చేసింది. ఇక భారత్ లక్ష్య ఛేదనకు దిగిన క్రమంలో.. ఓపెనర్ యస్తికా భాటియా(17) తక్కువ స్కోరుకే వెనుదిరిగింది. అదరగొట్టిన జెమీమా- రిచా మరో ఓపెనర్ షఫాలీ వర్మ 25 బంతుల్లో 4 ఫోర్ల సాయంతో 33 పరుగులు సాధించింది. ఈ క్రమంలో వన్డౌన్లో వచ్చిన జెమీమా రోడ్రిగెస్ ఆకట్టుకునే ప్రదర్శన చేసింది. కెప్టెన్ హర్మన్ప్రీత్ కౌర్ 16 పరుగులకే పెవిలియన్ చేరిన వేళ.. ఐదో స్థానంలో బ్యాటింగ్కు వికెట్ కీపర్ రిచా ఘోష్తో కలిసి స్కోరు బోర్డును ముందుకు నడిపింది. ఇదే అత్యధిక ఛేదన జెమీమా(53)- రిచా(31) జోడీ అద్భుతంగా రాణించి ఆఖరి వరకు అజేయంగా నిలవడంతో 19 ఓవర్లలోనే భారత్ లక్ష్యాన్ని ఛేదించగలిగింది. 3 వికెట్ల నష్టానికి 151 పరుగులు సాధించి ప్రపంచకప్ ప్రయాణాన్ని గెలుపుతో ఆరంభించింది. కాగా.. వరల్డ్కప్ మ్యాచ్లో భారత మహిళా జట్టుకిదే అత్యధిక ఛేదన కావడం విశేషం. అంతేకాదు.. టి20 ప్రపంచకప్లో పాకిస్తాన్పై భారత్కిది ఐదో విజయం. వాట్ ఏ విన్ ఈ నేపథ్యంలో ఛేజ్ మాస్టర్ విరాట్ కోహ్లి ఇన్స్టా వేదికగా భారత మహిళా జట్టు ఫొటో షేర్ చేస్తూ వారిని అభినందించాడు. ‘‘తీవ్ర ఒత్తిడిలోనూ.. పాకిస్తాన్ విధించిన లక్ష్యాన్ని ఛేదించారు. వాట్ ఏ విన్’’ అని కొనియాడాడు. ప్రతి టోర్నమెంట్లోనూ సత్తా చాటుతూ ఆటను ఉన్నత శిఖరాలకు చేరుస్తూ మహిళలకు ఆదర్శంగా నిలుస్తున్నారని కితాబులిచ్చాడు. చదవండి: SA20 2023: తొట్టతొలి మినీ ఐపీఎల్ టైటిల్ను హస్తగతం చేసుకున్న సన్రైజర్స్ ధర్మశాల టెస్టు వైజాగ్లో? View this post on Instagram A post shared by Virat Kohli (@virat.kohli) -
భారత అమ్మాయిల ‘హ్యాట్రిక్’
సిల్హెట్ (బంగ్లాదేశ్): మహిళల ఆసియా కప్ టి20 టోర్నమెంట్లో భారత జట్టు హ్యాట్రిక్ విజయం సాధించింది. మంగళవారం యూఏఈతో జరిగిన మ్యాచ్లో ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’ జెమీమా రోడ్రిగ్స్ (45 బంతుల్లో 75 నాటౌట్; 11 ఫోర్లు), దీప్తి శర్మ (49 బంతుల్లో 64; 5 ఫోర్లు, 2 సిక్స్లు) చెలరేగారు. దీంతో భారత అమ్మాయిల జట్టు 104 పరుగుల తేడాతో జయభేరి మోగించింది. ఈ టోర్నీలో మహిళల జట్టుకిది వరుసగా మూడో విజయం. ముందుగా బ్యాటింగ్ చేపట్టిన భారత అమ్మాయిల జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 178 పరుగులు చేసింది. ఓపెనర్లు సబ్బినేని మేఘన (10), రిచా ఘోష్ (0), దయాళన్ హేమలత (2) నిరాశపరచడంతో భారత్ 20 పరుగులకే 3 కీలక వికెట్లను కోల్పోయింది. ఈ దశలో వన్డౌన్లో బ్యాటింగ్కు దిగిన దీప్తి, ఐదో వరుస బ్యాటర్ జెమీమా ధాటిగా ఆడారు. ఇద్దరు నాలుగో వికెట్కు 128 పరుగులు జోడించారు. తర్వాత బ్యాటింగ్కు దిగిన యూఏఈ జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 4 వికెట్లు కోల్పోయి 74 పరుగులు చేసింది. తదుపరి మ్యాచ్లో భారత అమ్మాయిల జట్టు 7న పాకిస్తాన్తో తలపడుతుంది. -
ICC Women's T20I Rankings: అదరగొట్టిన జెమిమా రోడ్రిగ్స్.. టాప్10లోకి
ఐసీసీ టీ20 ర్యాంకింగ్స్లో భారత జట్టు మహిళా స్టార్ బ్యాటర్ జెమిమా రోడ్రిగ్స్ దుమ్మురేపింది. బ్యాటర్ల ర్యాంకిగ్స్లో రోడ్రిగ్స్ తొలి సారి టాప్ 10లో చోటు దక్కించుకుంది. అద్భుతమైన ఫామ్లో ఉన్న రోడ్రిగ్స్.. నాలుగు స్ధానాలు ఎగబాకి ఎనిమిదో స్థానానికి చేరుకుంది. ప్రస్తుతం జరగుతోన్న ఆసియాకప్-2022లో రోడ్రిగ్స్ అదరగొడుతోంది. అక్టోబర్ 1న శ్రీలంకతో జరిగిన తొలి మ్యాచ్లో రోడ్రిగ్స్ 76 పరుగులతో అద్భుతమైన ఇన్నింగ్స్ ఆడింది. అదే విధంగా మంగళవారం యూఏఈతో జరిగిన మ్యాచ్లో కూడా 75 పరుగులతో కీలక ఇన్నింగ్స్ ఆడింది. మరోవైపు భారత కెప్టెన్ హర్మన్ప్రీత్ కౌర్ కూడా రెండు స్థానాలు మెరుగుపరుచుకుని 13వ స్థానానికి చేరుకుంది. ఇక ఆస్ట్రేలియా ఓపెనర్ బెత్ మూనీ బ్యాటర్ల ర్యాంకింగ్స్లో అగ్రస్థానంలో కొనసాగుతుంది. ఆసీస్ కెప్టెన్ మెగ్ లానింగ్ రెండో ర్యాంకులో ఉంది. చదవండి: Womens Asia Cup 2022: ఆసియాకప్లో భారత్ జైత్ర యాత్ర.. వరుసగా మూడో విజయం -
ఆసియాకప్లో భారత్ జైత్ర యాత్ర.. వరుసగా మూడో విజయం
మహిళల ఆసియాకప్-2022లో టీమిండియా జైత్రయాత్ర కొనసాగిస్తోంది. షెల్లాట్ వేదికగా యూఏఈ మహిళలతో జరిగిన మ్యాచ్లో భారత్ 104 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. తద్వారా ఈ ఆసియాకప్లో వరుసగా మూడో విజయాన్ని భారత్ తమ ఖాతాలో వేసుకుంది. తొలుత టాస్ గెలిచి బ్యాటింగ్కు దిగిన భారత్ నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్లు కోల్పోయి 178 పరుగులు చేసింది. భారత బ్యాటర్లలో దీప్తీ శర్మ(49 బంతుల్లో 64), రోడ్రిగ్స్( 45 బంతుల్లో 75) అర్ధ సెంచరీలతో చెలరేగారు. యూఏఈ బౌలర్లలో గౌర్, మొఘల్, కోట్టి, ఇషా రోహిత్ తలా వికెట్ సాధించారు. ఇక 179 పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన యూఏఈ నిర్ణీత 20 ఓవర్లలో 4 వికెట్లు కోల్పోయి 74 పరుగులకే పరిమితమైంది. యూఏఈ బ్యాటర్లో కవిషా ఎగోడాగే(30 నటౌట్), కుషీ శర్మ(29) పరుగులతో టాప్ స్కోరర్గా నిలిచారు. కాగా భారత బౌలర్లలో రాజేశ్వరి గయక్వాడ్ రెండు వికెట్లు, దయాలన్ హేమలత ఒక్క వికెట్ సాధించింది. ఇక భారత్ తమ తదుపరి మ్యాచ్లో చిరకాల ప్రత్యర్ధి పాకిస్తాన్తో ఆక్టోబర్7న తలపడనుంది. చదవండి: LLC 2022: మహిళా అంపైర్తో దురుసు ప్రవర్తన.. అందుకే గొడవ -
Womens Asia Cup T20: చెలరేగిన జెమీమా
సిల్హెట్: ఈ సీజన్లో నిలకడగా రాణిస్తున్న జెమీమా రోడ్రిగ్స్ (53 బంతుల్లో 76; 11 ఫోర్లు, 1 సిక్స్) మరోసారి చెలరేగడంతో ఆసియా కప్ మహిళల టి20 టోర్నమెంట్లో భారత్ శుభారంభం చేసింది. శనివారం జరిగిన తమ తొలి లీగ్ పోరులో భారత్ 41 పరుగులతో శ్రీలంకపై జయభేరి మోగించింది. ముందుగా బ్యాటింగ్కు దిగిన భారత్ నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 150 పరుగులు చేసింది. ఓపెనర్లు స్మృతి మంధాన (6), షఫాలీ వర్మ (10) జట్టు స్కోరు 23 పరుగులకే పెవిలియన్ చేరారు. ఈ దశలో కెప్టెన్ హర్మన్ప్రీత్ కౌర్ (30 బంతుల్లో 33; 2 ఫోర్లు, 1 సిక్స్)తో జతకట్టిన జెమీమా భారత్ స్కోరును మెరుపు వేగంతో నడిపించింది. ఇద్దరు కలిసి దాదాపు 13 ఓవర్లపాటు క్రీజులో నిలవడంతో లంక బౌలర్లకు కష్టాలు తప్పలేదు. మూడో వికెట్కు 92 పరుగులు జోడించారు. ఈ క్రమంలో జెమీమా 38 బంతుల్లోనే (7 ఫోర్లు, 1 సిక్స్) అర్ధసెంచరీ పూర్తి చేసుకుంది. నిజానికి భారత్ స్కోరు మరింత పెరగాలి. అయితే డెత్ ఓవర్లలో జెమీమాతో పాటు రిచా ఘోష్ (9), పూజ (1) విఫలమవడంతో ఆశించినన్ని పరుగులు రాలే దు. అనంతరం శ్రీలంక జట్టు 18.2 ఓవర్లలో 109 పరుగులకే ఆలౌటైంది. భారత బౌలర్లు హేమలత (3/15), పూజ (2/12), దీప్తి శర్మ (2/15) లంకను దెబ్బ తీశారు. హర్షిత (26; 5 ఫోర్లు), హాసిని పెరీరా (30; 3 ఫోర్లు) మినహా ఇంకెవరూ చెప్పుకోదగ్గ స్కోర్లే చేయలేకపోయారు. మరో మ్యాచ్లో బంగ్లాదేశ్ 9 వికెట్లతో థాయ్లాండ్పై గెలిచింది. -
జెమీమా రోడ్రిగ్స్ విధ్వంసం.. ఆసియాకప్లో టీమిండియా శుభారంభం
ఆసియాకప్ మహిళల టి20 టోర్నీలో టీమిండియా శుభారంభం చేసింది. శనివారం శ్రీలంకతో జరిగిన మ్యాచ్లో భారత మహిళల జట్టు 41 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. 151 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన లంక జట్టు 18.2 ఓవర్లలో 109 పరుగులకే కుప్పకూలింది. లంక బ్యాటర్స్లో హాసిని పెరీరా 30 పరుగులతో టాప్ స్కోరర్గా నిలవగా.. హర్షితా మాధవి 26 పరుగులు చేసింది. భారత మహిళా బౌలర్లలో హేమలత మూడు వికెట్లు తీయగా.. దీప్తి శర్మ, పూజా వస్త్రాకర్ చెరో రెండు వికెట్లు తీయగా.. రాధా యాదవ్ ఒక వికెట్ తీసింది. అంతకముందు తొలుత బ్యాటింగ్ చేసిన టీమిండియా ఉమెన్స్ నిర్ణీత 20 ఓవర్లలో ఆరు వికెట్ల నష్టానికి 150 పరుగులు చేసింది. జేమీమా రోడ్రిగ్స్ 53 బంతుల్లో 11 ఫోర్లు, ఒక సిక్సర్ సాయంతో 76 పరుగులతో రాణించగా.. కెప్టెన్ హర్మన్ప్రీత్ కౌర్ 33 పరుగులు చేసింది. లంక బౌలర్లలో రణసింగే మూడు వికెట్లు తీయగా.. సుగంధిక కుమారి, ఆటపట్టు చెరొక వికెట్ తీశారు. ఇక 76 పరుగులతో రాణించిన రొడ్రిగ్స్ను ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ వరించింది. ఇక భారత మహిళల జట్టు తమ తర్వాతి మ్యాచ్ను(అక్టోబర్ 3న) మలేషియా ఉమెన్స్తో ఆడనుంది. చదవండి: క్రికెటర్ ఉన్ముక్త్ చంద్ కంటికి తీవ్ర గాయం.. -
సిరీస్ క్లీన్స్వీప్.. పీపీఈ కిట్లతో క్రికెటర్ల క్యాట్వాక్
టీమిండియా మహిళల జట్టు ఇంగ్లండ్ను వారి సొంతగడ్డపైనే ఓడించి 3-0తో వన్డే సిరీస్ను కైవసం చేసుకున్న సంగతి తెలిసిందే. ఇంగ్లండ్ పర్యటనలో తన చివరి మ్యాచ్ ఆడిన జులన్ గోస్వామికి హర్మన్ప్రీత్ సేన సిరీస్ విజయాన్ని కానుకగా అందించింది. ఇక వచ్చే వన్డే వరల్డ్కప్ 2023 వరకు టీమిండియా ఉమెన్స్కు మరో వన్డే సిరీస్ లేదు. ఈ నేపథ్యంలో స్వదేశానికి తిరుగుపయనమైన టీమిండియా మహిళా క్రికెటర్లు ఎయిర్పోర్టులో పీపీఈ కిట్లతో క్యాట్వాక్ చేయడం సోషల్ మీడియాలో వైరల్గా మారింది. ఈ విషయాన్ని భారత మహిళా క్రికెటర్ జేమిమా రోడ్రిగ్స్ తన ఇన్స్టాగ్రామ్లో షేర్ చేసుకుంది. ఈ వీడియోలో జెమీమా రోడ్రిగ్స్తో పాటు జులన్ గోస్వామి, హర్లిన్ డియోల్ సహా ఇతర క్రికెటర్లు.. ఫ్యాషన్ మోడల్స్ను అనుకరిస్తూ ఎయిర్పోర్ట్లో క్యాట్వాక్ చేశారు. దీనికి సంబంధించిన వీడియోపై ఒక లుక్కేయండి. ఇక స్వదేశానికి చేరుకున్న టీమిండియా మహిళా క్రికెటర్లకు అభిమానుల నుంచి ఘన స్వాగతం లభించింది. ముఖ్యంగా జులన్ గోస్వామి, ఆల్రౌండర్ దీప్తి శర్మలకు కోల్కతా ఎయిర్పోర్ట్లో గ్రాండ్ వెల్కమ్ చెప్పారు. కాగా ఇంగ్లండ్తో మూడో వన్డేలో ఆఖర్లో దీప్తిశర్మ.. ఇంగ్లండ్ బ్యాటర్ చార్లీ డీన్ను మన్కడింగ్ చేయడంపై భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్న వేళ దీప్తి శర్త తాను చేసింది కరెక్టేనని చెప్పింది. ‘రనౌట్ విషయంలో మేం వ్యూహంతో సిద్ధమయ్యాం. మేం ఎన్నిసార్లు హెచ్చరించినా ఆమె మళ్లీ మళ్లీ క్రీజ్ దాటి ముందుకు వెళ్లింది.ఆ విషయాన్ని అంపైర్లకు కూడా చెప్పాం. అయినా ఆమె తీరు మార్చుకోలేదు. దాంతో నిబంధనల ప్రకారమే అవుట్ చేశాం. మేం ఇంకేం చేయగలం’ అని వివరణ ఇచ్చింది. i've never loved a team more😭 from @JemiRodrigues Instagram post pic.twitter.com/qE5ZsgXFeB — s (@_sectumsempra18) September 26, 2022 చదవండి: ఒక శకం ముగిసింది.. బాల్గర్ల్ నుంచి స్టార్ క్రికెటర్ దాకా ఇన్నింగ్స్ చివర్లో హైడ్రామా.. 'మరో అశ్విన్'లా కనబడింది -
మెల్బోర్న్ స్టార్స్ తరఫున ఆడనున్న టీమిండియా స్టార్ బ్యాటర్
ఆస్ట్రేలియాలో అక్టోబర్ 13 నుంచి జరిగే మహిళల బిగ్బాష్ లీగ్ టి20 క్రికెట్ టోర్నీలో భారత స్టార్ బ్యాటర్ జెమీమా రోడ్రిగ్స్ బరిలోకి దిగనుంది. 22 ఏళ్ల జెమీమా మెల్బోర్న్ స్టార్స్ జట్టు తరఫున ఆడనుంది. గత సీజన్లో మెల్బోర్న్ రెనెగేడ్స్ జట్టుకు ప్రాతినిధ్యం వహించిన జెమీమా 333 పరుగులు సాధించింది. ఈ ఏడాది బిగ్బాష్ లీగ్లో జెమీమాతోపాటు హర్మన్ప్రీత్ కౌర్ (మెల్బోర్న్ రెనెగేడ్స్), పూజా వస్త్రకర్ (బ్రిస్బేన్ హీట్) కూడా ఆడనున్నారు. -
మెల్బోర్న్ స్టార్స్ తరపున ఆడనున్న భారత స్టార్ బ్యాటర్
భారత మహిళా జట్టు స్టార్ బ్యాటర్ జెమిమా రోడ్రిగ్స్ బిగ్ బాష్ లీగ్-2022లో మెల్బోర్న్ స్టార్స్కు ప్రాతినిధ్యం వహించనుంది. దీంతో మెల్బోర్న్ స్టార్స్తో ఒప్పందం కుదర్చుకున్న మొదటి భారత క్రికెటర్గా రోడ్రిగ్స్ నిలిచింది. కాగా గత బీబీఎల్ సీజన్లో మెల్బోర్న్ రెనెగేడ్స్ తరుపున ఆడిన రోడ్రిగ్స్ అద్భుతంగా రాణించింది. ఆమె గతేడాది టోర్నీలో 116 కంటే ఎక్కువ స్ట్రైక్ రేట్తో 333 పరుగులు చేసింది. ఇక 2018లో భారత్ తరపున అంతర్జాతీయ అరంగేట్రం చేసిన రోడ్రిగ్స్.. ఇప్పటి వరకు 58 టీ20లు, 21 వన్డేల్లో ఆడింది. ఇక ఇప్పటికే పలు భారత మహిళా క్రికెటర్లు బిగ్బాష్ లీగ్లో పలు ఫ్రాంచైజీలతో ఒప్పందం కుదుర్చుకున్నారు. బిగ్ బాష్ లీగ్లో భారత స్టార్ క్రికెటర్లు ఇక ఇప్పటికే భారత మహిళా క్రికెటర్లు బిగ్బాష్ లీగ్లో పలు ఫ్రాంచైజీలతో ఒప్పందం కుదుర్చుకున్నారు. వారిలో స్మృతి మంధాన, దీప్తి శర్మ (సిడ్నీ థండర్), షఫాలీ వర్మ, రాధా యాదవ్ (సిడ్నీ సిక్సర్స్) తరపున ఆడగా.. రిచా ఘోష్ (హోబర్ట్ హరికేన్స్) హర్మన్ప్రీత్ కౌర్ ( మెల్ బోర్న్ రెనెగేడ్స్ ),రాధా యాదవ్ ( సిడ్నీ సిక్సర్స్) తరపున ప్రాతనిధ్యం వహిస్తున్నారు. చదవండి: Suresh Raina Retirement: సురేష్ రైనా సంచలన నిర్ణయం.. క్రికెట్కు గుడ్బై -
CWG 2022: బార్బడోస్పై ఘన విజయం.. సెమీస్కు దూసుకెళ్లిన టీమిండియా
కామన్వెల్త్ గేమ్స్ 2022లో టీమిండియా మహిళల జట్టు సెమీస్కు దూసుకెళ్లింది. గేమ్స్లో నిలవాలంటే తప్పక గెలవాల్సిన మ్యాచ్లో టీమిండియా వుమెన్స్ జూలు విదిల్చారు. బుధవారం బార్బడోస్తో జరిగిన మ్యాచ్లో టీమిండియా మహిళలు 100 పరుగుల భారీ తేడాతో ఘన విజయం సాధించారు. తొలుత బ్యాటింగ్ చేసిన టీమిండియా మహిళలు 20 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 162 పరుగులు చేసింది. జెమీమా రోడ్రిగ్స్(46 బంతుల్లో 56 నాటౌట్, 6 ఫోర్లు, ఒక సిక్స్) టాప్ స్కోరర్ కాగా.. షఫాలీ వర్మ(26 బంతుల్లో 43, 7 ఫోర్లు, 1 సిక్సర్), చివర్లో దీప్తి శర్మ(28 బంతుల్లో 34, 2 ఫోర్లు, 1 సిక్సర్) దుమ్మురేపడంతో భారత్ మహిళల జట్టు గౌరవప్రదమైన స్కోరు సాధించింది. అనంతరం బ్యాటింగ్ చేసిన బార్బడోస్ మహిళల జట్టు భారత్ బౌలర్ల ఒత్తిడిని తట్టుకోలేక 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 62 పరుగుల వద్ద ఇన్నింగ్స్ ముగించింది. కోషోనా నైట్ 16 పరుగులతో టాప్ స్కోరర్ కాగా.. మిగతావారు సింగిల్ డిజిట్కే పరిమితమయ్యారు. టీమిండియా వుమెన్స్ బౌలర్లలో రేణుకా సింగ్ 4 వికెట్లు తీయగా.. మేఘనా సింగ్, స్నేహ్ రాణా, రాదా యాదవ్, హర్మన్ప్రీత్ కౌర్లు తలా ఒక వికెట్ తీశారు. ఇక న్యూజిలాండ్, ఇంగ్లండ్ మధ్య విజేతతో టీమిండియా మహిళల జట్టు సెమీస్లో తలపడనుంది. సెమీస్లో గెలిస్తే మాత్రం టీమిండియా మహిళల జట్టుకు పతకం ఖాయమైనట్లే. A fantastic victory for #TeamIndia. They win by 100 runs and advance into the semi-finals at the #CWG2022 👏👏 Scorecard - https://t.co/upMpWogmIP #INDvBAR #B2022 pic.twitter.com/uH6u7psVmG — BCCI Women (@BCCIWomen) August 3, 2022 -
జట్టు నుంచి తప్పించారు.. అప్పుడు రోహిత్, పంత్తో మాట్లాడినందుకే ఇలా!
INDW vs SLW 1st T20- Jemimah Rodrigues: టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ, స్టార్ బ్యాటర్ రిషభ్ పంత్ ఇచ్చిన సలహాలు, సూచనలు తనకెంతగానో ఉపయోగపడ్డాయని భారత మహిళా క్రికెటర్ జెమీమా రోడ్రిగ్స్ పేర్కొంది. తాను పూర్తిగా నిరాశలో కూరుకుపోయిన సమయంలో వాళ్లిద్దరి మాటలు స్ఫూర్తి నింపాయని ఉద్వేగానికి లోనైంది. రోహిత్, పంత్ తనలో సానుకూల దృక్పథాన్ని పెంపొందించారని వారితో మాట్లాడే అవకాశం రావడం అదృష్టంగా భావిస్తున్నట్లు తెలిపింది. కాగా 21 ఏళ్ల ఈ కుడిచేతి వాటం బ్యాటర్ చివరిసారిగా గతేడాది అక్టోబరులో భారత్ తరఫున అంతర్జాతీయ మ్యాచ్ ఆడింది. ఆ తర్వాత ఇంగ్లండ్ లీగ్ ది హండ్రెడ్లో నార్తర్న్ సూపర్చేంజెర్స్కు ప్రాతినిథ్యం వహించి లీగ్ టాప్ స్కోరర్లలో ఒకరిగా నిలిచింది. అంతేగాక ఆస్ట్రేలియా బిగ్ బాష్ లీగ్లో మెల్బోర్న్ రెనెగ్రేడ్స్కు ఆడి సత్తా చాటింది. అయితే, అద్భుత ప్రదర్శనతో ఆకట్టుకున్న ఈ ముంబై బ్యాటర్కు ఐసీసీ మహిళా వన్డే వరల్డ్కప్ భారత జట్టులో చోటు దక్కుతుందని భావించినా నిరాశే ఎదురైంది. ఈ క్రమంలో ఎట్టకేలకు శ్రీలంకతో టీ20 సిరీస్కు జెమీమా ఎంపికైంది. మొదటి మ్యాచ్లో తుది జట్టులో స్థానం దక్కించుకున్న ఆమె.. వచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంది. డంబుల్లా వేదికగా గురువారం జరిగిన మ్యాచ్లో 27 బంతుల్లో 36 పరుగులతో అజేయంగా నిలిచి భారత్ 138 పరుగుల స్కోరు చేయడంలో కీలక పాత్ర పోషించింది. ఈ క్రమంలో భారత జట్టు ఆతిథ్య శ్రీలంకపై 34 పరుగుల తేడాతో గెలవడంలో కీలకంగా వ్యవహరించిన జెమీమాను ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు వరించింది. ఈ నేపథ్యంలో జెమీమా మాట్లాడుతూ.. శ్రీలంకతో సిరీస్కు ముందు తనకు ఎదురైన చేదు అనుభవాల గురించి గుర్తు చేసుకుంది. ‘‘ఇక్కడికి వచ్చే ముందు వరకు నా ప్రయాణం మరీ అంత సాఫీగా ఏమీ సాగలేదు. నా కెరీర్లో ఎన్నో ఎత్తుపళ్లాలు చూశాను. నిరాశలో ఉన్న సమయంలో రోహిత్ శర్మ, రిషభ్ పంత్తో మాట్లాడాను. ప్రపంచకప్ జట్టులో చోటు దక్కనంత మాత్రాన ప్రతికూల ఆలోచనలతో మనసు పాడుచేసుకోవద్దని, ఇలాంటి సవాళ్లను దాటుకుని ముందుకు వెళ్లడంలోనే అసలైన మజా ఉంటుందని చెప్పారు. ఇలాంటి వాటిని చాలెంజ్గా తీసుకోవాలే తప్ప డీలా పడొద్దని సూచించారు. వారితో మాటలు నా ఆలోచనా విధానంపై ప్రభావం చూపాయి. వారిద్దరితో మాట్లాడి మంచి పని చేశాను. ఇప్పుడు నా గేమ్ను నేను పూర్తిగా అర్థం చేసుకున్నాను. నాలుగైదు నెలలలుగా నెట్స్లో శ్రమించాను. ఎట్టకేలకు జట్టులోకి వచ్చాను’’ అని భావోద్వేగానికి లోనైంది. కాగా జూన్ 25న శ్రీలంకతో భారత్ తమ రెండో టీ20 మ్యాచ్ ఆడనుంది. చదవండి: India Vs Ireland T20I Series Details: ఐర్లాండ్తో భారత్ టీ 20 సిరీస్.. ఇరు జట్లు, షెడ్యూల్.. పూర్తి వివరాలు! IND vs LEI: రోహిత్ శర్మకు ఏమైంది..? అక్కడ కూడా తీరు మారలేదు..! A vital knock 👍 Last-over blitz 💥 Sensational catch 🙌 Post-match conversations with @JemiRodrigues and @Deepti_Sharma06 as they discuss it all after #TeamIndia's win in the first #SLvIND T20I. 👏 🎥 pic.twitter.com/7SW9t6JJOs — BCCI Women (@BCCIWomen) June 24, 2022 -
IND-W Vs SL-W: భారత మహిళల శుభారంభం
దంబుల్లా: ఫామ్ కోల్పోయి వన్డే ప్రపంచ కప్ జట్టుకు దూరమైన జెమీమా రోడ్రిగ్స్ ఇప్పుడు టి20ల్లో పునరాగమనంతో సత్తా చాటింది. ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’ జెమీమా (27 బంతుల్లో 36 నాటౌట్; 3 ఫోర్లు, 1 సిక్స్) ప్రదర్శనతో గురువారం జరిగిన తొలి టి20లో భారత మహిళల జట్టు 34 పరుగుల తేడాతో శ్రీలంకపై విజయం సాధించింది. మరో ఓపెనర్ షఫాలీ వర్మ (31 బంతుల్లో 31; 4 ఫోర్లు) కూడా రాణించింది. మొదట బ్యాటింగ్కు దిగిన భారత్ 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 138 పరుగులు చేసింది. స్టార్ ఓపెనర్ స్మృతి మంధాన (1), ఆంధ్రప్రదేశ్ బ్యాటర్ సబ్బినేని మేఘన (0) విఫలం కాగా, కెప్టెన్ హర్మన్ప్రీత్ కౌర్ (20 బంతుల్లో 22; 3 ఫోర్లు) ఫర్వాలేదనిపించింది. చివర్లో దీప్తి శర్మ (8 బంతుల్లో 17 నాటౌట్; 3 ఫోర్లు) ధాటిగా ఆడింది. లంక బౌలర్లలో ఇనొక రణవీర 3, ఒషాది రణసింఘే 2 వికెట్లు తీశారు. అనంతరం లక్ష్య ఛేదనకు దిగిన శ్రీలంక నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 104 పరుగులకే పరిమితమైంది. భారత బౌలర్లంతా సమష్టిగా కట్టడి చేయడంతో చేతిలో వికెట్లున్నా ఛేదనలో శ్రీలంక వెనుకబడిపోయింది. రాధా యాదవ్కు 2 వికెట్లు దక్కాయి. ఇదే వేదికపై ఇరు జట్ల మధ్య రేపు రెండో టి20 మ్యాచ్ జరుగుతుంది. చదవండి: IRE Vs IND T20 Series: ఆ ఐదుగురు ఆటగాళ్లతో జర జాగ్రత్త.. లేదంటే టీమిండియాకు కష్టమే..! -
'ఆ సమయంలో పూర్తి నిరాశలో కూరుకుపోయా'
టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ ప్రస్తుతం ఐపీఎల్లో బిజీగా ఉన్నాడు. ఈ సీజన్లో ముంబై ఇండియన్స్ ఇంకా బోణీ కొట్టలేదు. తాను ఆడిన రెండు మ్యాచ్ల్లోనూ ఓటమి పాలైంది. ఇప్పటికే ఐదుసార్లు విజేతగా నిలిపిన రోహిత్ శర్మ ఈసారి ముంబై ఇండియన్స్ను మరోసారి విజేతగా నిలుపుతాడా లేదా అనేది ఆసక్తికరంగా మారింది. ఈ విషయం పక్కనబెడితే.. రోహిత్ శర్మను టీమిండియా మహిళా క్రికెటర్ జెమిమా రోడ్రిగ్స్ ఇంటర్య్వూ చేసింది. కాగా ఇటీవలే ముగిసిన మహిళల వన్డే ప్రపంచకప్ 2022కు జెమిమా రోడ్రిగ్స్ టీమిండియా జట్టుకు ఎంపిక కాలేదు. తాను కచ్చితంగా జట్టులో ఉంటానని భావించిన రోడ్రిగ్స్కు భంగపాటే ఎదురైంది. ''నేను మహిళల వన్డే వరల్డ్కప్కు ఎంపిక కాలేదు. అది నన్ను బాధించింది. కానీ ఆ బాధ నాకంటే ముందు మీరు అనుభవించారు. అప్పుడు మీ పరిస్థితి ఏంటి?'' అని రోడ్రిగ్స్ ప్రశ్నించింది. దీనిపై రోహిత్ స్పందిస్తూ.. ''సరిగ్గా 11 ఏళ్ల క్రితం నాకు ఇలాగే జరిగింది. 2011 వన్డే ప్రపంచకప్కు ఎంపిక కాలేదు. ఆ సమయంలో నేను దక్షిణాఫ్రికా పర్యటనలో ఉన్నా. విషయం తెలియగానే నిరాశలో కూరుకుపోయాను. డ్రెస్సింగ్రూమ్లో ఒంటరిగా ఉన్న నేను ఎవరితో ఈ విషయాన్ని షేర్ చేసుకోలేకపోయాను. కానీ అప్పుడు నా వయసు 23.. 24 ఏళ్లే అనుకుంటా. మంచి భవిష్యత్తు ముందున్న తరుణంలో ఇలా బాధపడితే ప్రయోజనం లేదని అనుకున్నా. వెంటనే 2015 వన్డే వరల్డ్కప్ సన్నాహకాలకు సిద్దమయ్యా.'' అంటూ పేర్కొన్నాడు. View this post on Instagram A post shared by Jemimah Jessica Rodrigues (@jemimahrodrigues) -
జెమీమా, శిఖాలపై వేటు.. కెప్టెన్గా మిథాలీ రాజ్
ముంబై: భారత మహిళల క్రికెట్ దిగ్గజం, హైదరాబాదీ మిథాలీ రాజ్ వరుసగా మూడో వన్డే వరల్డ్ కప్లో జట్టుకు సారథ్యం వహించనుంది. మిథాలీ నాయకత్వంలో వచ్చే ప్రపంచకప్ బరిలోకి దిగే 15 మంది సభ్యుల భారత జట్టును సెలక్టర్లు గురువారం ప్రకటించారు. హర్మన్ప్రీత్ కౌర్ టీమ్కు వైస్ కెప్టెన్గా వ్యవహరిస్తుంది. 2017లో మిథాలీ కెప్టెన్సీలోనే ఆడిన టీమ్ హోరాహోరీగా సాగిన ఫైనల్లో ఇంగ్లండ్ చేతిలో 9 పరుగులతో ఓడి రన్నరప్గా నిలిచింది. మార్చి 4నుంచి ఏప్రిల్ 3 వరకు న్యూజిలాండ్ వేదికగా వరల్డ్ కప్ జరుగుతుంది. మార్చి 6న తౌరంగాలో జరిగే తమ తొలి మ్యాచ్లో పాకిస్తాన్తో భారత్ తలపడుతుంది. అంతకు ముందు టోర్నీకి సన్నాహకంగా భారత జట్టు న్యూజిలాండ్తో ఐదు వన్డేల సిరీస్ ఆడనుంది. పేలవ ఫామ్ కారణంగానే... గత కొంత కాలంగా భారత జట్టులో రెగ్యులర్ సభ్యులుగా ఉన్న బ్యాటర్ జెమీమా రోడ్రిగ్స్, పేసర్ శిఖా పాండేలకు జట్టులో చోటు దక్కలేదు. గత ఏడాది ఆడిన అంతర్జాతీయ మ్యాచ్లలో జెమీమా ఒక్కసారి కూడా రెండంకెల స్కోరు చేయకపోగా, శిఖా కూడా పెద్దగా ప్రభావం చూపలేకపోయింది. టి20ల్లో ఆకట్టుకున్న మేఘనా సింగ్, రేణుకా సింగ్లను తొలిసారి వన్డే టీమ్లోకి ఎంపిక చేశారు. గత ప్రపంచకప్లో ఆడిన పూనమ్ రౌత్కు కూడా ఈ సారి స్థానం లభించలేదు. 2021 చాలెంజర్ ట్రోఫీలో అత్యధిక పరుగులు చేసిన ఆంధ్ర ప్లేయర్ సబ్బినేని మేఘనను స్టాండ్బైగా ఎంపిక చేశారు. ఇప్పటి వరకు వన్డేలు ఆడని మేఘన 6 టి20ల్లో భారత్కు ప్రాతినిధ్యం వహించింది. జట్టు వివరాలు: మిథాలీ రాజ్ (కెప్టెన్), హర్మన్ప్రీత్ కౌర్ (వైస్ కెప్టెన్), స్మృతి మంధాన, షఫాలీ వర్మ, యస్తిక భాటియా, దీప్తి శర్మ, రిచా ఘోష్ (వికెట్ కీపర్), తానియా భాటియా (వికెట్ కీపర్), స్నేహ్ రాణా, పూజ వస్త్రకర్, జులన్ గోస్వామి, మేఘనా సింగ్, రేణుకా సింగ్, పూనమ్ యాదవ్, రాజేశ్వరి గైక్వాడ్. స్టాండ్బై: సబ్బినేని మేఘన, ఏక్తా బిస్త్, సిమ్రన్ బహదూర్. చదవండి: SA vs IND: కోహ్లి గాయంపై కీలక ప్రకటన చేసిన ద్రవిడ్.. -
WBBL: ఇటు జెమీమా.. అటు స్మృతి మంధాన.. అదరగొట్టేశారు..
Jemimah Rodrigues Smriti Mandhana Hit Fifties: మహిళల బిగ్బాష్ లీగ్ టి20 క్రికెట్ టోర్నమెంట్లో భారత బ్యాటర్లు జెమీమా రోడ్రిగ్స్, స్మృతి మంధాన అదరగొట్టారు. మెల్బోర్న్ రెనెగేడ్స్ తరఫున జెమీమా... సిడ్నీ థండర్ జట్టు తరఫున స్మృతి మంధాన బరిలోకి దిగారు. ఈ రెండు జట్ల మధ్య బుధవారం జరిగిన మ్యాచ్లో మెల్బోర్న్ రెనెగేడ్స్ జట్టు తొమ్మిది పరుగుల ఆధిక్యంతో గెలిచింది. తొలుత మెల్బోర్న్ జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్లకు 142 పరుగులు సాధించింది. ఓపెనర్ జెమీమా 56 బంతుల్లో 9 ఫోర్లతో 75 పరుగులు చేసి అజేయంగా నిలిచింది. మెల్బోర్న్ జట్టుకే ఆడుతున్న భారత వన్డే జట్టు కెప్టెన్ హర్మన్ప్రీత్ కౌర్ మూడు పరుగులు చేసి అవుటైంది. అనంతరం 143 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన సిడ్నీ థండర్ జట్టు 20 ఓవర్లలో 8 వికెట్లకు 133 పరుగులు చేసి ఓడిపోయింది. ఓపెనర్ స్మృతి మంధాన 44 బంతుల్లో 4 ఫోర్లు, ఒక సిక్స్తో 64 పరుగులు చేసి హర్మన్ప్రీత్ బౌలింగ్లో బౌల్డయి పెవిలియన్ చేరింది. చదవండి: NAM VS SCO: టి20 ప్రపంచకప్ చరిత్రలో క్రేజీ ఓవర్ అంటున్న ఫ్యాన్స్! -
Big Bash League: రెనెగేడ్స్ తరఫున టీ20 కెప్టెన్, ఓపెనర్
Harmanpreet Kaur And Jemimah Rodrigues: మహిళల బిగ్బాష్ టి20 క్రికెట్ లీగ్లో తాజాగా భారత టి20 జట్టు కెప్టెన్ హర్మన్ప్రీత్ కౌర్, ఓపెనర్ జెమీమా రోడ్రిగ్స్ ‘మెల్బోర్న్ రెనెగేడ్స్’ జట్టుకు ప్రాతినిధ్యం వహించడం ఖాయమైంది. ఇప్పటికే బిగ్బాష్ లీగ్లో స్మృతి మంధాన, దీప్తి శర్మ (సిడ్నీ థండర్), షఫాలీ వర్మ, రాధా యాదవ్ (సిడ్నీ సిక్సర్స్) ఆడబోతున్నారు. ఈ లీగ్లో జెమీమా తొలిసారి బరిలోకి దిగనుండగా, గతంలో సిడ్నీ థండర్కు ఆడిన హర్మన్ ఇప్పుడు రెనెగేడ్స్కు మారింది. చదవండి: Ind W Vs Aus W Pink Ball Test: భారత అమ్మాయిల ‘పింక్’ ఆట RCB Vs RR : మ్యాక్స్వెల్ మెరుపులు.. ఆర్సీబీ ఘన విజయం -
43 బంతుల్లో 92 పరుగులతో విధ్వంసం; థ్రిల్లింగ్ విక్టరీ
లండన్: భారత బ్యాట్స్వుమెన్ జెమిమా రోడ్రిగ్స్ ఇంగ్లండ్ వేదికగా జరుగుతున్న హండ్రెడ్స్ వుమెన్స్ కాంపిటీషన్ టోర్నీలో విధ్వంసం సృష్టించింది. టోర్నీలో రోడ్రిగ్స్ నార్తన్ సూపర్చార్జర్స్ వుమెన్స్కు ప్రాతినిధ్యం వహిస్తుంది. 43 బంతుల్లోనే 92 పరుగులు చేసిన ఆమె ఇన్నింగ్స్లో 17 ఫోర్లు, 1 సిక్సర్ ఉన్నాయి. ఆమె ధాటికి మరో 15 బంతులు ఉండగానే థ్రిల్లింగ్ విక్టరీని నమోదు చేసింది. తొలుత బ్యాటింగ్ చేసిన వెల్ష్ ఫైర్ మహిళల జట్లు 100 బంతుల్లో 8 వికెట్ల నష్టానికి 130 పరుగులు చేసింది. హెలీ మాథ్యూస్ 30 పరుగులతో టాప్ స్కోరర్గా నిలిచింది. నార్తన్ సూపర్చార్జర్స్ బౌలింగ్లో స్మిత్ 3, కేతి లెవిక్, అలిస్ రిచర్డ్స్ చెరో 2 వికెట్లు తీశారు. అనంతరం బ్యాటింగ్ చేసిన నార్తన్ సూపర్చార్జర్స్కు ఆరంభంలోనే షాక్ తగిలింది. కెప్టెన్ లారెన్ విన్ఫిల్డ్ డకౌట్గా వెనుదిరిగింది. ఆ తర్వాత 19 పరుగుల వ్యవధిలో వరుస విరామాల్లో నాలుగు వికెట్లు కోల్పోయింది. ఇక నార్తన్ మ్యాచ్ ఓడిపోతుదనుకుంటున్న తరుణంలో రోడ్రిగ్స్ బౌండరీల వర్షం కురిపిస్తూ విధ్వంసం సృష్టించింది. చూస్తుండగానే హాఫ్ సెంచరీ మార్క్ చేరుకున్న రోడ్రిగ్స్ 92 పరుగులతో నాటౌట్గా నిలిచి జట్టును గెలిపింయింది. ఇక బెస్ హెత్ 12, అలిస్ రిచర్డ్స్ 23 పరుగులతో ఆమెకు సహకరించారు. ప్రస్తుతం జేమీ రోడ్రిగ్స్ ఇన్నింగ్స్ సోషల్ మీడియాలో వైరల్గా మారింది. -
యూఏఈ చేరుకున్న మహిళా క్రికెటర్లు
దుబాయ్: మహిళల టి20 చాలెంజ్ సిరీస్ కోసం భారత టాప్–30 మహిళా క్రికెటర్లు గురువారం యూఏఈ చేరుకున్నారు. షార్జా వేదికగా నవంబర్ 4 నుంచి 9 వరకు జరుగనున్న ఈ టోర్నీలో భారత వన్డే కెప్టెన్ మిథాలీ రాజ్, టి20 కెప్టెన్ హర్మన్ప్రీత్ కౌర్, స్మృతి మంధాన, జెమీమా రోడ్రిగ్స్ తదితరులు పాల్గొననున్నారు. తొమ్మిదిరోజుల పాటు ముంబైలో క్వారంటైన్లో ఉన్న మహిళా క్రికెటర్లు... బయో బబుల్లోకి ప్రవేశించే ముందు మరో వారం రోజుల పాటు ఐసోలేషన్లో ఉండనున్నారు. ఆరు రోజుల పాటు జరుగనున్న ఈ టోర్నీలో సూపర్నోవాస్, ట్రయల్ బ్లేజర్స్, వెలాసిటీ జట్లు తలపడనున్నాయి. ఈ జట్లకు మిథాలీరాజ్, స్మృతి మంధాన, హర్మన్ప్రీత్ సారథ్యం వహిస్తారు. మినీ ఐపీఎల్గా పరిగణించే ఈ టోర్నీతోనే భారత మíహిళా క్రికెటర్లు కరోనా విరామం తర్వాత తొలి సారి మళ్లీ బ్యాట్ పడుతున్నారు. -
‘డ్యాన్స్ బాగుంది.. ట్రోఫీ తెస్తే ఇంకా బాగుంటుంది’
హైదరాబాద్: వయసు 20 ఏళ్లు కూడా లేవు.. జట్టులోకి వచ్చి రెండేళ్లు కూడా కాలేదు.. కానీ ఆమె క్రీజులో ఉందంటే అటు అభిమానులకు.. ఇటు సారథికి కొండంత విశ్వాసం. క్లిష్ట సమయాలలో నిలకడగా, ఎంతో బాధ్యతాయుతంగా ఆడుతూ అందరి మన్ననలను పొందుతోంది టీమిండియా బ్యాట్స్వుమెన్ జెమీమా రోడ్రిగ్స్. అయితే మైదానంలో ప్రొఫెషనల్ ఆటతీరును ప్రదర్శించే రోడ్రిగ్స్.. మైదానం వెలుపల చేసే సందడి మామూలుగా ఉండదు. సహచర క్రికెటర్లు, ఫ్యాన్స్తో చేసే సందడి, అల్లరిని అందరూ ఎంజాయ్ చేస్తుంటారు. తాజాగా రోడ్రిగ్స్కు ఐసీసీ కూడా ఫిదా అయింది. ఐసీసీ మహిళల టీ20 ప్రపంచకప్లో భాగంగా ఈ రోజు న్యూజిలాండ్తో టీమిండియా తలపడనుంది. ఈ క్రమంలో ప్రాక్టీస్ ముగించుకుని డ్రెస్సింగ్ రూమ్కు బయల్దేరిన రోడ్రిగ్స్ సెక్యూరిటీ గార్డుతో కలిసి సరదాగా డ్యాన్స్ చేసింది. చాలా ఫన్గా ఉన్న ఆ వీడియోను ఐసీసీ తన అధికారిక ట్విటర్లో పోస్ట్ చేసింది. ప్రస్తుతం రోడ్రిగ్స్ డ్యాన్స్కు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. సెక్యూరిటీతో కాలు కదిపిన రోడ్రిగ్స్కు నెటిజన్లు సైతం ఫిదా అవుతున్నారు. వరుస మ్యాచ్లు, ప్రాక్టీస్ సెషన్లు, వ్యూహప్రతివ్యూహాలతో ఆటగాళ్లపై ఒత్తిడి ఉంటుందని ఇలాంటి వాటితో కాస్త ఉపశమనం పొందుతారని నెటిజన్లు పేర్కొంటున్నారు. ఇక ‘డ్యాన్స్ బాగుంది.. ప్రపంచకప్ ట్రోఫీ తెస్తే ఇంకా బాగుంటుందని’మరో నెటిజన్ కామెంట్ చేశాడు. Yes, @JemiRodrigues! 💃💃 Busting moves with an off-duty security guard at the #T20WorldCup pic.twitter.com/ehUdGQc3QV — ICC (@ICC) February 27, 2020 More like JeMEMEah Rodrigues 😏pic.twitter.com/D3u7J0ET3T — ICC (@ICC) February 22, 2020 చదవండి: హ్యాట్రిక్పై భారత్ గురి అతడు బౌలర్ కెప్టెన్: ఓజా -
విండీస్ను ఊడ్చేశారు..
ప్రావిడెన్స్ (గయానా): వెస్టిండీస్తో జరిగిన ఐదు టీ20ల సిరీస్ను భారత మహిళలు జట్టు క్లీన్స్వీప్ చేసింది. ఇప్పటికే నాలుగు టీ20ల్లో జయభేరి మోగించిన టీమిండియా.. గురువారం జరిగిన నామమాత్రమైన చివరి మ్యాచ్లో 61 పరుగుల తేడాతో భారీ విజయం సాధించింది. దీంతో ఐదు టీ20ల సిరీస్ను 5-0తో గెలుచుకుంది. సిరీస్ ఆరంభం నుంచి ఎదురేలేని టీమిండియా టీ20 చాంపియన్ను గజగజా వణికించింది. తొలుత టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న టీమిండియా నిర్ణీత 20 ఓవర్లలో 3 వికెట్ల నష్టానికి 134 పరుగులు చేసింది. ఓపెనర్లు విఫలమైనప్పటికీ రోడ్రిగ్స్(50; 56 బంతుల్లో 3ఫోర్లు), వేద కృష్ణమూర్తి(57 నాటౌట్; 48 బంతుల్లో 4ఫోర్లు) రాణించారు. అనంతరం బ్యాటింగ్కు దిగిన విండీస్ నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 73 పరుగులే చేసి ఓటమిపాలైంది. కిషోనా నైట్(22) ఓ మోస్తారుగా రాణించగా మిగతా బ్యాటర్స్ దారుణంగా విఫలమయ్యారు. భారత బౌలర్లలో అనూజా పాటిల్ రెండు, రాధా యాదవ్, పూనమ్ యాదవ్, పూజా, హర్లీన్లు తలో వికెట్ పడగొట్టారు. రాణించిన రోడ్రిగ్స్, వేద టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న టీమిండియాకు ఆరంభంలోనే భారీ షాక్ తగిలింది. షెఫాలీ వర్మ(9), స్మృతి మంధాన(7) తీవ్రంగా నిరాశపరిచారు. దీంతో 17 పరుగులకే రెండు వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది. ఈ క్రమంలో రోడ్రిగ్స్, వేద కృష్ణమూర్తి జట్టు భారాన్ని తమ భుజాలపై మోశారు. తొలుత ఆచితూచి ఆడుతూ.. వీలుచిక్కినప్పుడల్లా బౌండరీలు బాదారు. దీంతో స్కోర్ ముందుకు కదిలింది. ఈ క్రమంలో వీరిద్దరూ హాఫ్ సెంచరీలు పూర్తి చేశారు. మూడో వికెట్కు 117 పరుగులు జోడించిన అనంతరం ఇన్నింగ్స్ చివరి రెండో బంతికి రోడ్రిగ్స్ వెనుదిరిగింది. అనంతరం 135 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన విండీస్ ఏ దశలోనూ పోరాటపటిమను ప్రదర్శిచంలేదు. క్రీజులోకి వచ్చిన వారు వచ్చినట్లు పెవిలియన్ బాటపట్టారు. దీంతో విండీస్కు ఘోర ఓటమి తప్పలేదు. -
దక్షిణాఫ్రికాను చిత్తుచిత్తుగా..
వడోదర: దక్షిణాఫ్రికాతో టీ20 సిరీస్ను 3–1తో దక్కించుకున్న భారత మహిళల జట్టు మూడు వన్డే సిరీస్లోనూ ఘనంగా బోణీ కొట్టింది. బుధవారం జరిగిన తొలి వన్డేలో 8 వికెట్ల తేడాతో గెలుపొందింది. తొలుత సఫారీ మహిళల జట్టు భారత బౌలర్ల సమష్టి ప్రదర్శనతో 164 పరుగులకే ఆలౌట్ కాగా, అనంతరం జెమీమా రోడ్రిగ్స్(55: 65 బంతుల్లో 7 ఫోర్లు), ప్రియ పునియా(75 నాటౌట్: 124 బంతుల్లో 8 ఫోర్లు) అర్ధసెంచరీలతో మెరవడంతో భారత్ రెండు వికెట్లు మాత్రమే కోల్పోయి గెలుపు అందుకుంది. టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ ఎంచుకున్న దక్షిణాఫ్రికా జట్టుకు శుభారంభం లభించలేదు. పేసర్ జులన్ గోస్వామి ఇన్నింగ్స్ తొలి బంతికే ఓపెనర్ లిజెల్లీ లీ(0)ని వికెట్ల ముందు దొరక బుచ్చుకుంది. అనంతరం లారా వొల్వార్ట్(39), త్రిష చెట్టి(14) కాసేపు వికెట్ల పతనాన్ని అడ్డుకున్నారు. అయితే, వొల్వార్టన్ దీప్తిశర్మ, త్రిష చెట్టి, మిగ్యున్ డు ప్రీజ్(16)ను ఏక్తా బిష్త్ వెనక్కి పంపారు. కాసేపటికే శిఖా పాండే బౌలింగ్లో సునె లూస్ (22), నదిన్ డి క్లెర్క్(0) ఔట్ కాగా, షబ్నిమ్ ఇస్మాయిల్(3)ను పూనమ్ యాదవ్ పెవిలియన్కు చేర్చింది. దీంతో 115 పరుగులకే 7 వికెట్లు కోల్పోయిన ఆ జట్టును నొందుమిసొ షన్గాసె (4), సెఖుఖునె(6), అయబొంగ ఖాఖ(1నాటౌట్)తో కలసి మరిజానె కప్(54: 64 బంతుల్లో 6 ఫోర్లు) ఆఖరి వికెట్గా వెనుదిరిగింది. భారత బౌలర్లలో గోస్వామి 3 వికెట్లు తీయగా, శిఖా పాండే, ఏక్తా బిష్త్, పూనమ్ యాదవ్ తలో 2 వికెట్లు పడగొట్టారు. దీప్తి శర్మకు 1 వికెట్ దక్కింది. అనంతరం స్వల్ప లక్ష్యాన్ని భారత్ ఆడుతూ పాడుతూ ఛేదించింది. గాయం కారణంగా వన్డే సిరీస్కు మంధాన దూరం కావడంతో అరంగేట్రం చేసిన ప్రియ పునియా(75 నాటౌట్: 124 బంతుల్లో 8 ఫోర్లు) అవకాశాన్ని అందిపుచ్చుంది. జెమీమా రోడ్రిగ్స్(55: 65 బంతుల్లో 7 ఫోర్లు)తో కలసి తొలి వికెట్కు 89 పరుగులు జోడించి శుభారంభం అందించింది. అనంతరం పూనమ్ రౌత్(16: 38 బంతుల్లో 3 ఫోర్లు)తో కలసి రెండో వికెట్కు 45 పరుగులు, కెప్టెన్ మిథాలీ రాజ్(11 నాటౌట్)తో కలసి మూడో వికెట్కు అజేయంగా 37 పరుగులు జోడించి జట్టును విజయతీరాలకు చేర్చింది. ప్రియ పునియాకు ‘ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్’ దక్కింది. దక్షిణాఫ్రికా బౌలర్లలో నొందుమిసొ షన్గాసె, నదిన్ డి క్లెర్క్ చెరో వికెట్ పడగొట్టారు. -
జెమీమా ‘సూపర్’
జైపూర్: మహిళల టి20 లీగ్లో సూపర్నోవాస్ ‘ఆఖరి’ విజయంతో ముందడుగు వేసింది. గురువారం జరిగిన మ్యాచ్లో నోవాస్ 12 పరుగుల తేడాతో వెలాసిటీపై నెగ్గింది. మెరుగైన రన్రేట్తో సూపర్నోవాస్, వెలాసిటీ జట్లు ఫైనల్స్కు అర్హత సంపాదించాయి. ట్రయల్బ్లేజర్స్ కథ లీగ్ దశలోనే ముగిసింది. ముందుగా బ్యాటింగ్కు దిగిన సూపర్ నోవాస్ 20 ఓవర్లలో 3 వికెట్ల నష్టానికి 142 పరుగులు చేసింది. ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’ జెమీమా రోడ్రిగ్స్ (48 బం తుల్లో 77 నాటౌట్; 10 ఫోర్లు, 1 సిక్స్) అజేయ అర్ధసెంచరీ సాధించింది. అమెలియా కెర్కు 2 వికెట్లు దక్కాయి. తర్వాత లక్ష్యఛేదనకు దిగిన వెలాసిటీ 20 ఓవర్లలో 3 వికెట్లకు 130 పరుగులు చేసి ఓడింది. డానియెల్లి వ్యాట్ (33 బంతుల్లో 43; 4 ఫోర్లు, 2 సిక్స్లు), మిథాలీ రాజ్ (42 బంతుల్లో 40 నాటౌట్; 3 ఫోర్లు) రాణించారు. సూపర్నోవాస్, వెలాసిటీల మధ్య రేపు ఫైనల్ మ్యాచ్ జరుగుతుంది. జెమీమా ధాటిగా... టాస్ నెగ్గిన వెలాసిటీ ఫీల్డింగ్కు మొగ్గుచూపింది. ప్రియా పూనియాతో కలిసి సూపర్నోవాస్ ఇన్నింగ్స్కు శ్రీకారం చుట్టిన జయంగని ఆరంభంలో బౌండరీలతో ఆకట్టుకుంది. ఫోర్లతో టచ్లోకి వచ్చిన పూనియా (16; 2 ఫోర్లు)ను శిఖాపాండే పెవిలియన్ చేర్చింది. 29 పరుగుల వద్ద తొలి వికెట్ కోల్పోవడంతో బరిలోకి దిగిన జెమీమా రోడ్రిగ్స్ సూపర్ నోవాస్కు వెన్నెముకగా నిలిచింది. జయంగనితో కలిసి రెండో వికెట్కు 55 పరుగులు జోడించింది. తర్వాత జయంగని (38 బంతుల్లో 31; 5 ఫోర్లు) ఔటయ్యాక... సోఫీ డివైన్తో కలిసి జట్టు స్కోరును 100 పరుగులు దాటించింది. ఫోర్లతో వేగం పెంచిన జెమిమా ఈ క్రమంలో 31 బంతుల్లోనే అర్ధసెంచరీ పూర్తి చేసుకుంది. మరోవైపు డివైన్ మాత్రం ధాటిగా ఆడలేకపోయింది. కెప్టెన్ హర్మన్ప్రీత్ కౌర్ (1 నాటౌట్) క్రీజులోకి వచ్చినప్పటికీ ఆఖరి ఓవర్లో చెప్పుకోదగ్గ స్కోరు చేయలేకపోయింది. ఆరంభంలోనే తడబాటు అనంతరం 143 పరుగుల లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన వెలాసిటీ తడబడింది. జట్టు స్కోరు 7 పరుగుల వద్ద ఓపెనర్, టీనేజీ బ్యాట్స్మన్ షఫాలీ వర్మ (2), 22 వద్ద హేలీ మాథ్యూస్ (11) పెవిలియన్ చేరడంతో వెలాసిటీ కష్టాల్లో పడింది. ఈ దశలో డానియెల్లీ వ్యాట్, కెప్టెన్ మిథాలీ రాజ్ ఇన్నింగ్స్ను నడిపించే బాధ్యత తీసుకున్నారు. వెటరన్ బ్యాట్స్మన్ మిథాలీ నింపాదిగా ఆడుతుంటే... వ్యాట్ రెండు భారీ సిక్సర్లతో మెరిపించింది. ఇద్దరు మరో వికెట్ పడకుండా జాగ్రత్తగా ఆడారు. ఏడో ఓవర్లో జట్టు స్కోరు 50 పరుగులకు చేరింది. పది ఓవర్లు ముగిసేసరికి వెలాసిటీ స్కోరు 68/2. మూడో వికెట్కు 56 పరుగులు జోడించాక భారీ షాట్కు ప్రయత్నించిన వ్యాట్... పూనమ్ ఓవర్లో క్లీన్బౌల్డయింది. తర్వాత మిథాలీకి వేద కృష్ణమూర్తి (29 బంతుల్లో 30 నాటౌట్; 3 ఫోర్లు) తోడైంది. కానీ పరుగుల రాక మందగించడంతో చేయాల్సిన లక్ష్యం పెరుగుతూ పోయింది. వెలాసిటీ విజయానికి 30 బంతుల్లో 51 పరుగులు చేయాలి. అయితే సూపర్ నోవాస్ బౌలర్లు కట్టుదిట్టగా బౌలింగ్ చేయడంతో భారీషాట్లకు అవకాశం లేకపోయింది. ఆఖరి 6 బంతులకు 23 పరుగులు చేయాల్సివుండగా... 10 పరుగులే చేసి ఓడింది. -
రెండో ర్యాంక్కు జెమీమా రోడ్రిగ్స్
దుబాయ్: ఐసీసీ మహిళల టి20 తాజా ర్యాంకింగ్స్ (బ్యాటింగ్)లో భారత ప్లేయర్ జెమీమా రోడ్రిగ్స్ రెండో స్థానంలో నిలిచింది. ఇటీవల న్యూజిలాండ్లో ముగిసిన 3 మ్యాచ్ల సిరీస్లో జెమీమా 132 పరుగులు చేసింది. మరో బ్యాటర్ స్మృతి మంధాన ఆరో ర్యాంక్కు ఎగబాగింది. ఇదే సిరీస్లో 180 పరుగులు చేసిన స్మృతి నాలుగు స్థానాలు మెరుగుపర్చుకుంది. ఈ జాబితాలో సుజీ బేట్స్ (న్యూజిలాండ్) అగ్రస్థానంలో కొనసాగుతోంది. టాప్–10లో భారత కెప్టెన్ హర్మన్ప్రీత్ (7) కూడా ఉంది. బౌలర్ల ర్యాంకింగ్స్లో పూనమ్ యాదవ్ రెండో స్థానంలో ఉండగా, రాధ యాదవ్ 18 స్థానాలు మెరుగుపర్చుకొని 10వ ర్యాంక్కు చేరుకోవడం విశేషం. టి20 ఆల్రౌండర్ల జాబితాలో భారత్ నుంచి టాప్–10లో ఎవరికీ చోటు దక్కలేదు. టీమ్ ర్యాంకింగ్స్లో భారత్ మూడో స్థానంలో కొనసాగుతోంది. -
జెమీమా 2.. మంధాన 6
దుబాయి: భారత మహిళా స్టార్ క్రికెటర్లు జెమీమా రోడ్రిగ్స్, స్మృతీ మంధానలు తమ టీ20 ర్యాంకింగ్స్ను మరింత మెరుగుపరుచుకున్నారు. తాజాగా విడుదల చేసిన మహిళల టీ20 ర్యాంకింగ్స్లో భాగంగా బ్యాటింగ్ విభాగంలో రోడ్రిగ్స్ రెండో స్థానాన్ని ఆక్రమించగా, మంధాన ఆరు స్థానానికి చేరుకున్నారు. వీరిద్దరూ నాలుగేసి స్థానాలు ఎగబాకి తమ స్థానాలను మెరుగుపరుచుకున్నారు. న్యూజిలాండ్తో జరిగిన టీ20 సిరీస్లో రోడ్రిగ్స్ 132 పరుగులు చేయగా, మంధాన 180 పరుగులు చేశారు. మంధాన చేసిన పరుగుల్లో రెండు హాఫ్ సెంచరీలు ఉన్నాయి. చివరి మ్యాచ్లో మంధాన 86 పరుగులతో ఆకట్టుకున్నారు. గతవారం విడుదల చేసిన మహిళల వన్డే ర్యాంకింగ్స్లో మంధాన టాప్ను ఆక్రమించిన సంగతి తెలిసిందే. ఇక బౌలర్ల ర్యాంకింగ్స్లో స్సిన్నర్లు రాధా యాదవ్ 10 స్థానంలో నిలవగా, దీప్తి శర్మ 14వ స్థానంలో నిలిచారు. పూనమ్ యాదవ్ రెండో స్థానంలో కొనసాగుతున్నారు. ఇక జట్టు ర్యాంకింగ్స్లో న్యూజిలాండ్ రెండో స్థానానికి ఎగబాకింది. తొలి స్థానంలో ఆస్ట్రేలియా ఉండగా, మూడో స్థానంలో ఇంగ్లండ్, నాల్గో స్థానంలో భారత్ ఉన్నాయి. -
పోరాడి ఓడిన భారత మహిళలు.. సిరీస్ కివీస్ కైవసం
ఆక్లాండ్: న్యూజిలాండ్తో జరిగిన రెండో టీ20లో భారత మహిళలు పరాజయం పాలయ్యారు. భారత్ నిర్దేశించిన 136 పరుగుల లక్ష్యాన్ని కివీస్ మహిళలు ఆఖరి బంతికి ఛేదించి నాలుగు వికెట్ల తేడాతో విజయం సాధించారు. దాంతో ఇంకా మ్యాచ్ మిగిలి ఉండగానే సిరీస్ను న్యూజిలాండ్ మహిళలు 2-0తో కైవసం చేసుకున్నారు. న్యూజిలాండ్ క్రీడాకారిణుల్లో సుజీ బేట్స్(62) రాణించి విజయంలో కీలక పాత్ర పోషించారు. ఆమెకు జతగా అమీ సాటర్వైట్(23) ఫర్వాలేదనిపించడంతో న్యూజిలాండ్ విజయాన్ని అందుకుకుంది. అంతకుముందు టాస్ ఓడిన భారత మహిళలు తొలుత బ్యాటింగ్ చేసి ఆరు వికెట్ల నష్టానికి 135 పరుగులు చేశారు. భారత బ్యాటర్స్లో జెమీమా రోడ్రిగ్స్(72) హాఫ్ సెంచరీ సాధించగా, స్మృతీ మంధాన(36) మోస్తరుగా రాణించారు. వీరిద్దరూ మినహా మిగతా వారు విఫలం కావడంతో భారత్ సాధారణ లక్ష్యాన్ని మాత్రమే కివీస్ ముందుంచింది. ఆపై లక్ష్య ఛేదనలో కివీస్ 33 పరుగుల స్కోరు వద్ద తొలి వికెట్ను నష్టపోయింది. ఓపెనర్ సోఫీ డివైన్(19) మొదటి వికెట్గా పెవిలియన్కు చేరగా, ఆపై స్వల్ప వ్యవధిలో కాట్లిన్ గుర్రే(4) వికెట్ను చేజార్చుకుంది. ఆ తరుణంలో సుజీ బేట్స్-సాట్ర్వైట్ జోడి 61 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పి జట్టును విజయం పథంలో నడిపించింది. ఇక చివర్లో కివీస్ వరుసగా రెండు వికెట్లు చేజార్చుకోవడంతో మ్యాచ్ ఉత్కంఠగా మారింది. ఆఖరి ఓవర్కు కివీస్ విజయానికి తొమ్మిది పరుగులు అవసరం కాగా, తొలి బంతిని కేటీ మార్టిన్ ఫోర్ కొట్టారు. ఆపై మిగతా పనిని కాస్పరెక్(4 నాటౌట్), హనాహ్ రోవ్(4 నాటౌట్)లు పూర్తి చేసి జట్టుకు విజయం చేకూర్చారు. నామమాత్రమైన మూడో టీ20 ఆదివారం జరుగనుంది. -
అమ్మాయిలూ అదరగొట్టారు
తీవ్ర దుమారం రేపిన టి20 ప్రపంచ కప్ సెమీఫైనల్ వివాదం తర్వాత... ఆడిన తొలి అంతర్జాతీయ మ్యాచ్లో భారత మహిళల క్రికెట్ జట్టు దుమ్మురేపింది. ఒక రోజు ముందు పురుషుల జట్టు ఏ విధంగానైతే సంపూర్ణ ఆధిపత్యం చెలాయించిందో... అదేచోట, అదే తరహాలో చెలరేగి ఆడి ఆతిథ్య న్యూజిలాండ్పై తొలి వన్డేలో ఘన విజయం సాధించింది. తొలుత స్పిన్త్రయం విజృంభించి ప్రత్యర్థిని కుప్పకూల్చగా... తర్వాత ఓపెనింగ్ ద్వయం విరుచుకుపడి సునాయాసంగా జట్టును లక్ష్యానికి చేర్చింది. నేపియర్ : భారత మహిళల క్రికెట్ జట్టు కివీస్ పర్యటనను ఘన విజయంతో ప్రారంభించింది. బౌలింగ్లో స్పిన్నర్లు ఏక్తా బి‹ష్త్ (2/32), పూనమ్ యాదవ్ (3/42), దీప్తి శర్మ (2/27) మాయాజాలం... బ్యాటింగ్లో ఓపెనర్లు స్మృతి మంధాన (104 బంతుల్లో 105; 9 ఫోర్లు, 3 సిక్స్లు) అద్భుత శతకానికి తోడు జెమీమా రోడ్రిగ్స్ (94 బంతుల్లో 81; 9 ఫోర్లు) దుమ్మురేపడంతో గురువారం ఇక్కడ జరిగిన తొలి వన్డేలో న్యూజిలాండ్ను 9 వికెట్ల తేడాతో మట్టికరిపించింది. టాస్ ఓడి బ్యాటింగ్కు దిగిన ఆతిథ్య జట్టు టీమిండియా స్పిన్నర్ల ధాటికి 48.4 ఓవర్లలో 192 పరుగులకే ఆలౌటైంది. ఓపెనర్ సుజీ బేట్స్ (54 బంతుల్లో 36; 2 ఫోర్లు) టాప్ స్కోరర్. స్మృతి, జెమీమా జోరుతో 33 ఓవర్లలో ఒక్క వికెట్ మాత్రమే కోల్పోయి 193 పరుగులు చేసి భారత్ లక్ష్యాన్ని అందుకుంది. రెండో వన్డే ఈ నెల 29న మౌంట్ మాంగనీలో జరుగుతుంది. మంత్రం వేసిన స్పిన్ త్రయం ఓపెనర్లు బేట్స్, సోఫీ డివైన్ (38 బంతుల్లో 28; 1 ఫోర్, 1 సిక్స్) నిలకడతో కివీస్ ఇన్నింగ్స్ సాఫీగానే ప్రారంభమైంది. తొలి వికెట్కు వీరిద్దరు 61 పరుగులు జోడించారు. అయితే, డివైన్ను రనౌట్ చేసి దీప్తి శర్మ ఈ భాగస్వామ్యాన్ని విడగొట్టింది. లారెన్ డౌన్ (0) పూనమ్ బౌలింగ్లో స్టంపౌట్ అయింది. బేట్స్... దీప్తి బౌలింగ్లో వెనుదిరిగింది. ఈ దశలో కెప్టెన్ సాటర్వైట్ (45 బంతుల్లో 31; 3 ఫోర్లు), అమెలియా కెర్ (60 బంతుల్లో 28) కాసేపు పోరాడారు. వీరిద్దరిని పెవిలియన్ పంపి పూనమ్ మ్యాచ్ను మలుపు తిప్పింది. తర్వాత బి‹ష్త్ ప్రతాపం చూపడంతో మరెవరూ క్రీజులో నిలవలేకపోయారు. హనా రౌయీ (25) పోరాటంతో ఆ మాత్రం స్కోరైనా చేయగలిగింది. వారిద్దరే కొట్టేశారు ఛేదనలో స్మృతి, జెమీమా ప్రత్యర్థి బౌలర్లకు ఏమాత్రం అవకాశం ఇవ్వకుండా ఆడారు. తొలి రెండు ఓవర్లు ఆచితూచి ఆడిన వీరు తర్వాత ఓవర్కు కనీసం ఒక ఫోర్ చొప్పున కొడుతూ స్కోరును ముందుకు తీసుకెళ్లారు. స్మృతి... హడెల్స్టన్ బౌలింగ్లో రెండు ఫోర్లు, సిక్స్ బాదింది. 43 బంతుల్లోనే ఆమె అర్ధ సెంచరీ పూర్తయింది. మరో ఎండ్లో పూర్తి సహకారం అందించిన జెమీమా 61 బంతుల్లో అర్ధ సెంచరీ అందుకుంది. వీరి దూకుడుతో టీమిండియా స్కోరు 18వ ఓవర్లోనే వంద దాటింది. అనంతరం ఈ ఇద్దరు తడబాటు లేకుండా బ్యాటింగ్ కొనసాగించారు. 101 బంతుల్లో సెంచరీ పూర్తి చేసుకున్న స్మృతి... లక్ష్యానికి మూడు పరుగుల ముందు కెర్ బౌలింగ్లో ఔటైంది. జెమీమా విజయ లాంఛనాన్ని పూర్తి చేసింది. -
హర్మన్ హరికేన్ చూశారా?
ప్రొవిడెన్స్ (గయానా): ఏమి ఆ బ్యాటింగ్... ఏమి ఆ సిక్సర్ల జోరు... ఆ దూకుడు, ధాటిని చూసి ఆడుతోంది అమ్మాయేనా అనే సందేహం తప్పక వస్తోంది. పవర్ గేమ్కు కొత్త పాఠాలు చూపిస్తూ ధనా ధన్ షాట్లతో టీమిండియా కెప్టెన్ హర్మన్ ప్రీత్ కౌర్ విధ్వంసం సృష్టించింది. న్యూజిలాండ్ బౌలర్లపై సునామీలా విరుచుకుపడుతూ ఏకంగా ఎనిమిది భారీ సిక్సర్లతో మహిళల టీ20 క్రికెట్లోనే సెంచరీ సాధించిన తొలి భారత మహిళా క్రికెటర్గా చరిత్ర సృష్టించింది. దీంతో శుక్రవారం న్యూజిలాండ్తో జరిగిన ఆరంభ మ్యాచ్లో భారత్ 34 పరుగులతో గెలిచి బోణి కొట్టిన విషయం తెలిసిందే. ఈ మ్యాచ్లో హర్మన్ 51 బంతుల్లోనే 103 పరుగులు చేసింది. ఆమెకు తోడుగా జెమీమా రోడ్రిగ్స్ (45 బంతుల్లో 59; 7 ఫోర్లు) సత్తా చాటడంతో భారత విజయం సులువైంది. హర్మన్ ఇన్నింగ్స్ను కొనియాడుతూ ఐసీసీ తన సిక్స్ర్లకు సంబంధిచి వీడియోను ట్వీట్ చేసింది. ప్రస్తుతం ఈ వీడియో వైరల్ అయింది. భారత్ తదుపరి మ్యాచ్ను ఆదివారం పాకిస్తాన్తో తలపడనుంది. Harmanpreet Kaur got the @WorldT20 off to a RAPID start with a sensational display of hitting in Guyana. Here are her biggest and best shots, delivered by @Oppo #FlashCharge. pic.twitter.com/KOSrNbDGOJ — ICC (@ICC) November 10, 2018 -
టి20 ప్రపంచకప్లో భారత్కు ఘనమైన ఆరంభం
-
జస్ట్.. ఇది ఆరంభమే : హర్మన్ ప్రీత్
ప్రొవిడెన్స్ (గయానా): మహిళల టీ20 ప్రపంచకప్లో హరికేన్ తుఫాన్లా విరుచుకుపడిన టీమిండియా కెప్టెన్ హర్మన్ ప్రీత్ కౌర్ జస్ట్ ఇది ఆరంభం మాత్రమే అంటోంది. శుక్రవారం న్యూజిలాండ్తో జరిగిన టోర్నీ ఆరంభ మ్యాచ్లో హర్మన్ ప్రీత్ కౌర్ (51 బంతుల్లో 103; 7 ఫోర్లు, 8 సిక్సర్లు) మెరుపు సెంచరీ సాధించగా... జెమీమా రోడ్రిగ్స్ (45 బంతుల్లో 59; 7 ఫోర్లు) సత్తా చాటడంతో భారత్ 34 పరుగుల తేడాతో విజయం సాధించిన విషయం తెలిసిందే. (చదవండి: హర్మన్ హరికేన్) ఈ మ్యాచ్ అనంతరం హర్మన్ ప్రీత్ మాట్లాడుతూ.. ‘చాలా ఆనందంగా ఉంది. ఇది ఆరంభం మాత్రమే. మేం ఇంకా చాలా మ్యాచ్లు ఆడాలి. జట్టుగా కూడా మేం ఇంకా చాలా మెరుగవ్వాల్సిన అవసరం ఉంది. నేను క్రీజులో సెట్టైతే.. షాట్స్ ఆడగలను. జెమీమా అద్భుతంగా ఆడింది. ఎవరైనా హిట్టింగ్ చేస్తే.. ఒకరు స్ట్రైక్ రొటేట్ చేయాలి. ఆ బాధ్యతను జెమీమా తీసుకుంది. ఈ క్రెడిట్ అంతా ఆమెదే. జెమీమా చాలా మెచ్యూర్. ఇక బౌలింగ్ విభాగంలో మేం కొంత మెరుగవ్వాలి. ముఖ్యంగా తొలి ఆరు ఓవర్లలో మా బౌలింగ్ చాలా పుంజుకోవాలి.’అని అభిప్రాయపడింది. (చదవండి: కౌర్ పవర్! ) హెడ్కోచ్ రమేశ్ పవార్ పూర్తిగా తమ ఆలోచనా విధానాన్ని మార్చేసాడని, ఇది తమకెంతో ఉపయోగపడిందని, ఆయన తమ జట్టులో భాగం కావడం సంతోషంగా ఉందని చెప్పుకొచ్చింది. భారత సీనియర్ క్రికెటర్ మిథాలీ రాజ్ తమ జట్టుకు కీలకమని, తొలి ఆరు ఓవర్లలో ఆమె అంతగా పరుగులు చేయలేదని, ఆ తరువాత బ్యాటింగ్ చేస్తే ఆమె రాణించగలదని హర్మన్ అభిప్రాయపడింది. హర్మన్-జెమీమా నాలుగో వికెట్కు అత్యధికంగా 134 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పారు. కెప్టెన్ హర్మన్ బౌండరీలతో బిజీగా ఉండగా.. జెమీమా స్ట్రైక్ రోటెట్ చేసింది. ఇదే హర్మన్ ఆకట్టుకుంది. దీంతో జెమీమాను ఆకాశానికెత్తింది. (చదవండి: హర్మన్ సేన ఏం చేస్తుందో?) -
హర్మన్ హరికేన్
ఏమి ఆ బ్యాటింగ్... ఏమి ఆ సిక్సర్ల జోరు... ఆ దూకుడు, ధాటిని చూసి ఆడుతోంది అమ్మాయేనా అనే సందేహం వస్తే అభిమానుల తప్పేం లేదు! పవర్ గేమ్కు కొత్త పాఠాలు చూపిస్తూ ధనా ధన్ షాట్లతో హర్మన్ ప్రీత్ కౌర్ విధ్వంసం సృష్టించిన వేళ... టి20 క్రికెట్లో భారత్ రికార్డులతో చెలరేగి ప్రపంచకప్లో మెరుపు బోణీ చేసింది. న్యూజిలాండ్ బౌలర్లపై సునామీలా విరుచుకుపడుతూ ఏకంగా ఎనిమిది భారీ సిక్సర్లతో హర్మన్ చూపించిన సూపర్ షోను వర్ణించేందుకు మాటలు చాలవు. మహిళల టి20 క్రికెట్లో సెంచరీ సాధించిన తొలి భారత క్రికెటర్గా చరిత్ర సృష్టించిన కౌర్... కెప్టెన్గా కూడా ‘ప్రీత్’పాత్రమైన విజయాన్ని అందుకుంది. ప్రొవిడెన్స్ (గయానా): టి20 ప్రపంచ కప్లో భారత జట్టుకు అదిరే ఆరంభం లభించింది. టోర్నీ తొలి మ్యాచ్లో పటిష్టమైన న్యూజిలాండ్పై అద్భుత విజయంతో భారత్ ప్రత్యర్థులకు సవాల్ విసిరింది. శుక్రవారం ఇక్కడ జరిగిన గ్రూప్ ‘బి’ పోరులో భారత్ 34 పరుగుల తేడాతో కివీస్ను చిత్తు చేసింది. టాస్ గెలిచి ముందుగా బ్యాటింగ్కు దిగిన భారత్ 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 194 పరుగుల స్కోరు సాధించింది. కెప్టెన్ హర్మన్ ప్రీత్ కౌర్ (51 బంతుల్లో 103; 7 ఫోర్లు, 8 సిక్సర్లు) మెరుపు సెంచరీ సాధించగా... జెమీమా రోడ్రిగ్స్ (45 బంతుల్లో 59; 7 ఫోర్లు) సత్తా చాటింది. వీరిద్దరు రికార్డు స్థాయిలో నాలుగో వికెట్కు 76 బంతుల్లోనే 134 పరుగులు జోడించడం విశేషం. అనంతరం న్యూజిలాండ్ 20 ఓవర్లలో 9 వికెట్లకు 160 పరుగులు చేసింది. సుజీ బేట్స్ (50 బంతుల్లో 67; 8 ఫోర్లు) అర్ధసెంచరీ సాధించగా, కేటీ మార్టిన్ (25 బంతుల్లో 39; 8 ఫోర్లు) రాణించింది. భారత బౌలర్లలో హేమలత (3/26), పూనమ్ యాదవ్ (3/33) ప్రత్యర్థిని దెబ్బ తీశారు. హైదరాబాద్ అమ్మాయి అరుంధతి రెడ్డికి ఒక వికెట్ దక్కింది. టోర్నీ తదుపరి మ్యాచ్లో రేపు పాకిస్తాన్తో భారత జట్టు తలపడుతుంది. భారీ భాగస్వామ్యం... తొలి బంతికే తాన్యా భాటియా (9) కొట్టిన ఫోర్తో భారత ఇన్నింగ్స్ జోరుగా ప్రారంభమైంది. అదే ఓవర్లో మరో ఫోర్ బాదిన తర్వాత మరుసటి ఓవర్ తొలి బంతికే ఆమె వెనుదిరిగింది. మిడ్ వికెట్ బౌండరీ వద్ద జెన్సన్ అద్భుత క్యాచ్ అందుకోవడంతో స్మృతి మం«ధాన (2) ఆట కూడా ముగిసింది. కెరీర్లో తొలి మ్యాచ్ ఆడుతున్న హేమలత (7 బంతుల్లో 15; 2 ఫోర్లు) కూడా ధాటిగా ఆడే ప్రయత్నంలో వికెట్ సమర్పించుకుంది. ఈ దశలో జెమీమా, హర్మన్ జత కలిశారు. కొన్ని చూడచక్కటి బౌండరీలతో జెమీమా తన క్లాస్ను ప్రదర్శించింది. అయితే ఆ తర్వాత హర్మన్ తుఫానులా విరుచుకు పడగా... జెమీమా అండగా నిలిచింది. వీరిద్దరు కివీస్ బౌలర్లకు ఎలాంటి అవకాశం ఇవ్వకుండా చకచకా పరుగులు సాధించారు. ఈ క్రమంలో 39 బంతుల్లోనే జెమీమా తన అర్ధ సెంచరీని పూర్తి చేసుకుంది. అయితే మరో భారీ షాట్కు ప్రయత్నించి ఆమె స్టంపౌట్ కావడంతో భారీ భాగస్వామ్యానికి తెర పడింది. స్పిన్ మాయాజాలం... భారీ లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో భారత స్పిన్నర్ల దెబ్బకు కివీస్ కుదేలైంది. స్టార్ బ్యాటర్ సుజీ బేట్స్ మినహా మిగతావారంతా విఫలం కావడంతో ఆ జట్టుకు ఓటమి తప్పలేదు. తొలి వికెట్కు బేట్స్, అనా పీటర్సన్ (14) కలిసి 52 పరుగులతో శుభారంభం అందించినా... ఆ తర్వాత కివీస్ దానిని కొనసాగించలేకపోయింది. 20 పరుగుల వ్యవధిలో మూడు ప్రధాన వికెట్లు కోల్పోయిన తర్వాత జట్టు కోలుకోలేకపోయింది. దూకుడుగా ఆడి 38 బంతుల్లో హాఫ్ సెంచరీ సాధించిన బేట్స్ను తెలుగమ్మాయి అరుంధతి రెడ్డి చక్కటి బంతితో ఔట్ చేయడంతో కివీస్ గెలుపు ఆశలు వదులుకుంది. లోయర్ ఆర్డర్లో కేటీ మార్టిన్ పోరాడినా లాభం లేకపోయింది. ►మహిళల టి20 ప్రపంచకప్లో అత్యధిక స్కోరు చేసిన జట్టుగా భారత్ గుర్తింపు పొందింది. 2014లో ఐర్లాండ్పై ఆస్ట్రేలియా (191/4) స్కోరు తెరమరుగైంది. ► టి20ల్లో సెంచరీ చేసిన తొలి భారతీయ మహిళా క్రికెటర్గా హర్మన్ ప్రీత్ కౌర్ రికార్డు నెలకొల్పింది. ఇప్పటిదాకా భారత్ తరఫున మిథాలీ (97 నాటౌట్) పేరిట ఉన్న అత్యధిక వ్యక్తిగత స్కోరును హర్మన్ దాటింది. ►హర్మన్ ప్రీత్ కౌర్, జెమీమా రోడ్రిగ్స్ టి20ల్లో భారత్ తరఫున ఏ వికెట్కైనా అత్యుత్తమ భాగస్వామ్యం నెలకొల్పారు. ►టి20 ఇన్నింగ్స్లో అత్యధికంగా 8 సిక్స్లు కొట్టిన భారతీయ మహిళా క్రికెటర్గా హర్మన్ నిలిచింది. విండీస్ క్రికెటర్ డిండ్రా డాటిన్ 2010లో దక్షిణాఫ్రికాపై 9 సిక్స్లు కొట్టింది. ►అంతర్జాతీయ టి20ల్లో సెంచరీ చేసిన ఎనిమిదో మహిళా క్రికెటర్ హర్మన్ప్రీత్. గతంలో డానియెలా వ్యాట్ (ఇంగ్లండ్), డాటిన్ (వెస్టిండీస్), లానింగ్ (ఆస్ట్రేలియా), సుజీ బేట్స్ (న్యూజిలాండ్), బెథానీ మూనీ (ఆస్ట్రేలియా), షాండ్రీ ఫ్రిట్జ్ (దక్షిణాఫ్రికా), టామ్సిన్ బ్యూమోంట్ (ఇంగ్లండ్) ఈ ఘనత సాధించారు. హర్మన్ ప్రీత్ కౌర్ మెరుపు సెంచరీ పరుగులు 103 బంతులు 51 ఫోర్లు 7 సిక్స్లు 8 స్ట్రయిక్ రేట్ 201.96 -
మరో కళ్లు చెదిరే క్యాచ్
కేప్టౌన్:దక్షిణాఫ్రికా మహిళలతో జరిగిన చివరిదైన ఐదో టీ20లో భారత క్రికెటర్ జెమీమా రోడ్రిగ్స్ తన ఫీల్డింగ్తో అబ్బురపరిచింది. బౌండరీ లైన్ వద్ద కళ్లు చెదిరే క్యాచ్ను అందుకుని శభాష్ అనిపించింది. క్యాచ్ పట్టుకున్న క్రమంలో రోడ్రిగ్స్ తనను తాను నియంత్రించుకోవడం భారత అభిమానుల్లో జోష్ను నింపింది. దక్షిణాఫ్రికా లక్ష్య ఛేదనలో భాగంగా 17 ఓవర్ను రుమేలి ధార్ వేసింది. ఐదో బంతిని స్టైకింగ్లో ఉన్న మారిజాన్నే కాప్ డీప్ మిడ్ వికెట్ మీదుగా భారీ షాట్ ఆడింది. అదే సమయంలో అక్కడ ఫీల్డింగ్ చేస్తున్న రోడ్రిగ్స్ బౌండరీ లైన్కు అంగుళం దూరంలో కళ్లు చెదిరే క్యాచ్ను అందుకుంది. క్యాచ్ను అందుకునే తర్వాత ఆమె బ్యాలెన్స్ తప్పి బౌండరీ లైన్పై పడుతుందేమో అనిపించింది. అయితే నియంత్రించుకోవడంతో కాప్ భారంగా పెవిలియన్ చేరింది. దక్షిణాఫ్రికా ఇన్నింగ్స్లో కాప్(27)దే అత్యధిక స్కోరు. ఆఖరి టీ20లో భారత మహిళలు 54 పరుగుల తేడాతో గెలిచి సిరీస్ను 3-1తో కైవసం చేసుకున్నారు. తొలి టీ20లో స్మృతీ మంధన సైతం ఇదే తరహాలో క్యాచ్ పట్టిన సంగతి తెలిసిందే.