సంజూ శాంసన్‌ ఉదారత | LOVELY GESTURE BY SANJU SAMSON, HIS FOUNDATION DONATE SCHOOL BAGS AND SHOES TO 100 STUDENTS BEFORE NEW ACADEMIC YEAR STARTING | Sakshi
Sakshi News home page

సంజూ శాంసన్‌ ఉదారత

Jun 5 2025 12:37 PM | Updated on Jun 5 2025 3:36 PM

LOVELY GESTURE BY SANJU SAMSON, HIS FOUNDATION DONATE SCHOOL BAGS AND SHOES TO 100 STUDENTS BEFORE NEW ACADEMIC YEAR STARTING

టీమిండియా ఆటగాడు సంజూ శాంసన్‌ ఉదారత చాటుకున్నాడు. తన ఫౌండేషన్ (SSF) తరఫున రానున్న విద్యా సంవత్సరం కోసం 100 మంది విద్యార్థులకు స్కూల్‌ బ్యాగ్‌లు, బూట్లు డొనేట్‌ చేశాడు. తన తల్లి లిజి శాంసన్‌ ఆథ్వర్యంలో ఓ ప్రత్యేక కార్యక్రమం ఏర్పాటు చేసి విద్యార్థులకు స్కూల్‌ సామాగ్రిని ప్రదానం చేయించాడు. పేద విద్యార్థుల అవసరాలను దృష్టిలో పెట్టుకొని సంజూ చేపట్టిన ఈ కార్యక్రమాన్ని క్రికెట్‌ అభిమానులు అభినందిస్తున్నారు. సంజూ గతంలో కూడా తన ఫౌండేషన్‌ తరఫున చాలా సేవా కార్యక్రమాలు చేపట్టాడు.  

ఇదిలా ఉంటే, సంజూ శాంసన్‌ తాజాగా ముగిసిన ఐపీఎల్‌ సీజన్‌లో రాజస్థాన్‌ రాయల్స్‌కు కెప్టెన్‌గా వ్యవహరించాడు. ఈ సీజన్‌లో రాయల్స్‌ పెద్దగా పెర్ఫార్మ్‌ చేయలేకపోయింది. ఆ జట్టు 14 మ్యాచ్‌ల్లో కేవలం నాలుగే విజయాలు సాధించి, పాయింట్ల పట్టికలో చివరి నుంచి రెండో స్థానంలో నిలిచింది. ఈ సీజన్‌లో సంజూ వ్యక్తిగతంగానూ ఆకట్టుకోలేకపోయాడు. గాయం కారణంగా చాలా మ్యాచ్‌లకు దూరంగా ఉన్న అతను.. ఆడిన మ్యాచ్‌ల్లోనూ స్థాయికి తగ్గ ప్రదర్శనలు ఇవ్వలేకపోయాడు.

ఇంగ్లండ్‌ పర్యటన కోసం ఎంపిక చేసిన భారత టెస్ట్‌ జట్టులో సంజూ చోటు దక్కించుకోలేకపోయాడు. యువ వికెట్‌కీపర్లు రిషబ్‌ పంత్‌, ధృవ్‌ జురెల్‌, కేఎల్‌ రాహుల్‌ ఈ టూర్‌ కోసం ఎంపిక​ చేసిన జట్టులో స్థానం సంపాదించారు. పంత్‌, రాహుల్‌  జట్టులో పాతుకుపోయిన నేపథ్యంలో సంజూ టెస్ట్‌ కెరీర్‌ దాదాపుగా ముగిసిందనే చెప్పుకోవాలి. ఈ కేరళ వికెట్‌కీపర్‌ బ్యాటర్‌ కేవలం పరిమిత ఓవర్ల ఫార్మాట్లకు మాత్రమే పరిమితమయ్యాడు.

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement