-
Obstructing field: జడ్డూ కావాలనే చేశాడా?.. సీఎస్కే కోచ్ స్పందన ఇదే!
రాజస్తాన్ రాయల్స్తో మ్యాచ్ సందర్భంగా చెన్నై సూపర్ కింగ్స్ ఆల్రౌండర్ రవీంద్ర జడేజా అపఖ్యాతి మూటగట్టుకున్నాడు. ఐపీఎల్ చరిత్రలో ‘అబ్స్ట్రక్టింగ్ ద ఫీల్డ్’గా అవుటైన మూడో బ్యాటర్గా చెత్త రికార్డు ఖాతాలో వేసుకున్నాడు.ఐపీఎల్-2024 నేపథ్యంలో చెపాక్ వేదికగా చెన్నై- రాజస్తాన్ ఆదివారం తలపడ్డాయి. టాస్ గెలిచిన రాజస్తాన్ తొలుత బ్యాటింగ్ చేసింది. నిర్ణీత 20 ఓవర్లలో ఐదు వికెట్లు నష్టపోయి కేవలం 141 పరుగులు చేసింది.ఈ క్రమంలో లక్ష్య ఛేదనకు దిగిన చెన్నై ఐదు వికెట్లు నష్టపోయి 18.2 ఓవర్లలోనే పని పూర్తి చేసింది. ఐదు వికెట్ల తేడాతో రాజస్తాన్ను ఓడించి ప్లే ఆఫ్స్ రేసులో నిలిచింది.‘అబ్స్ట్రక్టింగ్ ద ఫీల్డ్’ ఇదిలా ఉంటే.. సీఎస్కే ఇన్నింగ్స్లో ఆరోస్థానంలో బ్యాటింగ్కు దిగిన జడ్డూ పరుగుల తీసే క్రమంలో.. ఉద్దేశపూర్వకంగానే బంతిని అడ్డుకున్నట్లుగా తేలడంతో ‘అబ్స్ట్రక్టింగ్ ద ఫీల్డ్’ నిబంధన కింద అవుటయ్యాడు.అవేశ్ ఖాన్ వేసిన 16వ ఓవర్లో జడేజా లేని రెండో పరుగుకు పరుగెత్తాడు. మరో ఎండ్లో ఉన్న రుతురాజ్ గైక్వాడ్తో సమన్వయలోపం కారణంగా పరుగుకు ఆస్కారం లేకపోయినా క్రీజును వీడాడు. అయితే, వెంటనే ప్రమాదం పసిగట్టి వెనక్కి వచ్చేందుకు ప్రయత్నించగా.. రాజస్తాన్ వికెట్ కీపర్, కెప్టెన్ సంజూ శాంసన్ వికెట్లకు మీదకు వేసిన త్రోకు అడ్డుగా పరుగెత్తగా బంతి జడేజాకు తగిలింది.మైక్ హస్సీ స్పందనఈ నేపథ్యంలో రాయల్స్ ఆటగాళ్లు అప్పీల్ చేయగా ఫీల్డ్ అంపైర్లు టీవీ అంపైర్కు నివేదించారు. రిప్లేను పరిశీలించిన థర్డ్ అంపైర్ జడ్డూను ‘అబ్స్ట్రక్టింగ్ ద ఫీల్డ్’ రూల్ కింద అవుట్గా ప్రకటించాడు. ఈ విషయంపై చెన్నై సూపర్ కింగ్స్ బ్యాటింగ్ కోచ్ మైక్ హస్సీ స్పందించాడు.‘‘నేను మరీ అంత దగ్గరగా గమనించలేకపోయాను. అయితే, అతడు స్ట్రెయిట్గా పరిగెత్తేక్రమంలో యాంగిల్ను మార్చుకోకుండానే ముందుకు సాగాడు.ఇరువైపులా వాదనలు ఉంటాయి. అయితే, అంపైర్దే తుదినిర్ణయం. నా అభిప్రాయం ప్రకారం.. నిబంధనలకు అనుగుణంగా ఇది సరైన నిర్ణయమే’’ అని మైక్ హస్సీ స్పష్టం చేశాడు.చదవండి: ఆర్సీబీ విజయం: అనుష్క శర్మ సెలబ్రేషన్స్.. కోహ్లి రియాక్షన్ వైరల్ Jaldi wahan se hatna tha 🫨#TATAIPL #CSKvRR #IPLonJioCinema pic.twitter.com/Op4HOISTdV— JioCinema (@JioCinema) May 12, 2024 -
రాజస్తాన్ను చిత్తు చేసిన చెన్నై.. ప్లే ఆఫ్స్ రేసులో మున్ముందుకు
ఐపీఎల్ - 2024 ప్లే ఆఫ్స్ రేసులో చెన్నై సూపర్ కింగ్స్ మరో ముందడుగు వేసింది. రాజస్తాన్ రాయల్స్ ను ఐదు వికెట్ల తేడాతో ఓడించింది. తద్వారా పాయింట్ల పట్టికలో మూడో స్థానానికి దూసుకువచ్చింది.చెపాక్ వేదికగా రాజస్తాన్తో ఆదివారం తలపడిన చెన్నై టాస్ ఓడి తొలుత బౌలింగ్ చేసింది. పేసర్ సిమర్జీత్ సింగ్ ఆరంభంలోనే ఓపెనర్లు యశస్వి జైస్వాల్(24), జోస్ బట్లర్ (21) వికెట్లు పడగొట్టి శుభారంభం అందించాడు.వన్డౌన్ బ్యాటర్, కెప్టెన్ సంజూ శాంసన్(15)ను కూడా వెనక్కి పంపి రాజస్తాన్ టాపార్డర్ను దెబ్బకొట్టాడు. ఈ క్రమంలో నాలుగో నంబర్ బ్యాటర్ రియాన్ పరాగ్(35 బంతుల్లో 47 నాటౌట్) పోరాడగా.. ధ్రువ్ జురెల్(18 బంతుల్లో 28) అతడికి సహకారం అందించాడు. మిగతా వాళ్లు చేతులెత్తేయగా నిర్ణీత 20 ఓవర్లలో రాజస్తాన్ 5 వికెట్ల నష్టానికి 141 పరుగులు చేసింది.లక్ష్య ఛేదనకు దిగిన చెన్నైకి ఓపెనర్ రచిన్ రవీంద్ర(18 బంతుల్లో 27) మెరుపు ఇన్నింగ్స్తో శుభారంభం అందించగా.. మరో ఓపెనర్ రుతురాజ్ గైక్వాడ్ ఆచితూచి ఆడాడు. 41 బంతులు ఎదుర్కొని 42 పరుగులు మాత్రమే చేసి ఆఖరి వరకు అజేయంగా నిలిచాడు. మిగతా వాళ్లలో డారిల్ మిచెల్(22) ఫర్వాలేదనిపించగా.. మొయిన్ అలీ(10), శివం దూబే(18), రవీంద్ర జడేజా(5) విఫలమయ్యారు. ఏడో స్థానంలో వచ్చిన సమీర్ రజ్వీ ధనాధన్ ఇన్నింగ్స్(8 బంతుల్లో 15)తో చెన్నై సూపర్ కింగ్స్ను విజయతీరాలకు చేర్చాడు.సొంతమైదానంలో ఐదు వికెట్ల తేడాతో గెలుపొందిన చెన్నై ప్లే ఆఫ్స్ రేసులో మరింత ముందుకు వెళ్లింది. జట్టు గెలుపులో కీలక పాత్ర పోషించిన సిమర్జీత్ సింగ్ ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్గా నిలిచాడు. ఇదిలా ఉంటే కోల్కతా నైట్ రైడర్స్ ఈ సీజన్లో ప్లే ఆఫ్స్ చేరిన తొలి జట్టుగా నిలిచిన విషయం తెలిసిందే. -
రాజస్తాన్ రాయల్స్ కెప్టెన్ సామ్సన్పై జరిమానా
ఐపీఎల్ నియమావళిని ఉల్లంఘించినందుకు రాజస్తాన్ రాయల్స్ జట్టు కెప్టెన్ సంజూ సామ్సన్పై మ్యాచ్ ఫీజులో 30 శాతం జరిమానాగా విధించారు. ఢిల్లీ క్యాపిటల్స్తో బుధవారం జరిగిన మ్యాచ్లో సామ్సన్ తాను అవుటయ్యాక అంపైర్తో వాగ్వాదం చేశాడు. సామ్సన్ కొట్టిన షాట్ను బౌండరీ లైన్ వద్ద ఢిల్లీ ఫీల్డర్ షై హోప్ క్యాచ్ తీసుకున్నాడు. క్యాచ్ పట్టిన క్రమంలో షై హోప్ పాదం బౌండరీ లైన్ను తాకినట్లు భావించిన సామ్సన్ కొద్దిసేపు మైదానంలో ఉండి అంపైర్తో వాదించి వెళ్లిపోయాడు. -
ఢిల్లీ క్యాపిటల్స్ సహ యజమాని అతి ప్రవర్తన.. ఇందులో నిజమెంత..?
ఐపీఎల్ 2024 సీజన్లో భాగంగా రాజస్థాన్ రాయల్స్తో నిన్నటి (మే 7) మ్యాచ్ సందర్భంగా ఢిల్లీ క్యాపిటల్స్ సహ యజమాని పార్థ్ జిందాల్ ప్రవర్తించిన తీరు వివాదాస్పదంగా మారింది. ఈ మ్యాచ్లో రాయల్స్ కెప్టెన్ సంజూ శాంసన్ అనుమానాస్పద క్యాచ్ ఔట్ నిర్ణయం పెండింగ్లో ఉన్నప్పుడు పార్థ్ అతిగా ప్రవర్తించాడు. థర్డ్ అంపైర్ రీప్లే చూస్తున్నప్పుడు గ్యాలరీలో నుంచి ఔట్ ఔట్ అంటూ అరుస్తూ కేకలు పెట్టాడు. ఫ్రాంచైజీకి సహ యాజమాని అయిన వ్యక్తి నుంచి ఇలాంటి ప్రవర్తనను నెటిజన్లు అస్సలు తీసుకోలేకపోయారు. ఈ విషయంపై పార్థ్ ట్రోలింగ్ను ఎదుర్కొంటుండగానే ఇతని మరో వీడియో ఒకటి బాగా వైరలైంది. No #DC fan scroll without liking this।No of likes=No of slap to this mf Parth Jindal#DCvsRR pic.twitter.com/irD7dFSZoz— विक्की पाल ✍️ (@vicky_pal0515) May 7, 2024ఆ వీడియోలో పార్థ్ తన స్థాయిని మరిచి అతిగా విజయోత్సవ సంబురాలు చేసుకుంటూ కనిపించాడు. రాయల్స్పై విజయం అనంతరం పార్థ్ సంతోషం పట్టలేక ఇలా ఓవరాక్షన్ చేశాడని ప్రచారం జరిగింది. అయితే ఇందులో ఎంతమాత్రం నిజం లేదని తెలిసింది. ఈ వీడియోలో ఉన్నది పార్థే అయినప్పటికీ.. అతను చేసుకున్న సంబురాలు మాత్రం ఇప్పటివి కాదని తేలింది. 2023 మహిళల ఐపీఎల్ సందర్భంగా ఆర్సీబీతో జరిగిన ఉత్కంఠ సమరంలో గెలుపు అనంతరం పార్థ్ ఈ తరహా సెలబ్రేషన్స్ చేసుకున్నాడు. నాటి సంబురాలకు సంబంధించిన వీడియో నిన్నటి నుంచి వైరలవుతుంది. Reaction of Delhi Capitals co- owner Parth Jindal when DC defeated Rajasthan royals last night 🔥He is living the moment 💥#DCvRR #SRHvLSG #delhicapital pic.twitter.com/4NXL8ftFNB— AVANISH (@avanish_du187) May 8, 2024ఈ వీడియోను చూసి పార్థ్ను నెటిజన్లు ఆటాడుకుంటున్నారు. వేల కోట్లకు అధిపతి, ఓ ఫ్రాంచైజీకి సహ యజమాని అయిన వ్యక్తి ఇలాగేనా ప్రవర్తించేదంటూ చురకలంటిస్తున్నారు. పార్థ్కు పారిశ్రామికవేత్తగా రాని పబ్లిసిటీ ఈ ఒక్క ఘటనతో వచ్చింది. Our Chairman and Co-owner, Parth Jindal, caught up with Rajasthan Royals' captain Sanju Samson & owner Manoj Badale, at the Arun Jaitley Stadium last night, after what was an exceptional contest of cricket. Parth also extended his congratulations to the RR skipper on being… pic.twitter.com/k47zwB7nzR— Delhi Capitals (@DelhiCapitals) May 8, 2024మ్యాచ్ అనంతరం పార్థ్.. సంజూ శాంసన్, రాజస్థాన్ రాయల్స్ యజమానితో జరిపిన సంభాషణకు సంబంధించిన వీడియో కూడా నెట్టింట చక్కర్లు కొడుతుంది. ఢిల్లీ క్యాపిటల్స్ ప్రాంచైజీకి సహ యజమాని అయిన పార్థ్.. జేఎస్డబ్ల్యూ స్పోర్ట్స్కు డైరెక్టర్గా వ్యవహరిస్తున్నాడు. జిందాల్ కుటుంబం భారత దేశంలో అత్యంత ప్రముఖమైన వ్యాపార కుటుంబం.సంజూ వివాదాస్పద క్యాచ్ విషయానికొస్తే.. మ్యాచ్ రసవత్తరంగా సాగుతున్న సమయంలో సంజూ భారీ షాట్కు ప్రయత్నించి బౌండరీ రోప్కు అతి సమీపాన షాయ్ హోప్ చేతికి చిక్కాడు. ఈ క్యాచ్పై ఫీల్డ్ అంపైర్కు క్లారిటీ లేకపోవడంతో థర్డ్ అంపైర్కు రిఫర్ చేశారు. రీ ప్లేలో హోప్ చేతిలో బంతి ఉన్నప్పుడు అతను బౌండరీ రోప్ను తాకినట్లు కనిపించింది. అయితే థర్డ్ అంపైర్ నిర్ణయాన్ని ఢిల్లీకి అనుకూలంగా ఇచ్చి శాంసన్ను ఔట్గా ప్రకటించాడు. దీనిపై శాంసన్ ఫీల్డ్ అంపైర్తో గొడవపడి అనంతరం మూల్యం చెల్లించుకున్నాడు. ఈ మ్యాచ్లో సంజూ ఔటైన కావడంతో రాయల్స్ గెలవాల్సిన మ్యాచ్లో ఓడిపోయింది. -
రెండుసార్లు బౌండరీని తాకినా ఎందుకిలా? ఇది అన్యాయం..
రాజస్తాన్ రాయల్స్ కెప్టెన్ సంజూ శాంసన్ విషయంలో అంపైర్ల నిర్ణయాన్ని మాజీ క్రికెటర్ నవజ్యోత్ సింగ్ సిద్ధు తప్పుబట్టాడు. కంటికి స్పష్టంగా కనిపిస్తున్నా సాంకేతికత పేరిట సంజూకు అన్యాయం జరిగిందని పేర్కొన్నాడు. అతడు గనుక క్రీజులో ఉండి ఉంటే ఫలితం వేరేలా ఉండేదని అభిప్రాయపడ్డాడు.ఐపీఎల్-2024లో భాగంగా రాజస్తాన్ మంగళవారం ఢిల్లీ క్యాపిటల్స్తో తలపడింది. ఇక సొంత మైదానం అరుణ్ జైట్లీ స్టేడియంలో టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన ఢిల్లీ.. నిర్ణీత 20 ఓవర్లలో ఎనిమిది వికెట్ల నష్టానికి 221 పరుగులు చేసింది.బాధ్యత తీసుకున్న సంజూ శాంసన్ భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన రాజస్తాన్ ఆరంభంలోనే ఓపెనర్లు యశస్వి జైస్వాల్(4), జోస్ బట్లర్(19) వికెట్లు కోల్పోయింది. ఈ క్రమంలో ఇన్నింగ్స్ చక్కదిద్దే బాధ్యత తీసుకున్న వన్డౌన్ బ్యాటర్ సంజూ శాంసన్.. ఢిల్లీ బౌలర్లపై ఎదురుదాడికి దిగాడు.46 బంతుల్లో 8ఫోర్లు, 6 సిక్స్ల సాయంతో 86 పరుగుల వద్ద ఉన్న సమయంలో అనూహ్య రీతిలో అవుటయ్యాడు. పదహారో ఓవర్లో ముకేశ్ కుమార్ బౌలింగ్లో షాయీ హోప్నకు క్యాచ్ ఇచ్చాడు.అయితే, క్యాచ్ అందుకునే సమయంలో షాయీ హోప్ బౌండరీ లైన్ను తాకినట్లుగా అనిపించినా ఫీల్డ్ అంపైర్, థర్డ్ అంపైర్ అవుటివ్వడంతో సంజూ కెప్టెన్ ఇన్నింగ్స్కు తెరపడింది. ఈ విషయంపై స్పందించిన కామెంటేటర్ నవజ్యోత్ సింగ్ సిద్ధు.. సంజూకు మద్దతుగా నిలిచాడు.సైడ్ యాంగిల్లో చూసినపుడు ‘‘అంపైర్లు తీసుకున్న ఆ నిర్ణయం మ్యాచ్ స్వరూపాన్నే మార్చి వేసింది. సంజూ శాంసన్ అవుట్ విషయంలో భిన్నాభిప్రాయాలు ఉండవచ్చుగాక.. కానీ సైడ్ యాంగిల్లో చూసినపుడు ఫీల్డర్ బౌండరీ లైన్ను రెండుసార్లు తాకినట్లు స్పష్టంగా కనిపించింది.సాంకేతికత వాడినా, వాడకపోయినా కళ్లకు కట్టినట్లు కనిపించింది. ఈసారి టెక్నాలజీ వల్ల కచ్చితంగా తప్పిదం జరిగిందనే చెప్తాను. రెండుసార్లు అతడు బౌండరీ లైన్ తాకినా అవుట్ ఇవ్వడం సరికాదు.అన్యాయం.. సంజూ బలైపోయాడునేను తటస్థంగా ఉండే వ్యక్తిని. సంజూ నాటౌట్ అని కచ్చితంగా చెప్పగలను. అలా అని అంపైర్లు ఉద్దేశపూర్వకంగా ఇలా చేశారని నేను అనుకోవడం లేదు.ఇక్కడ ఎవరి తప్పు లేకపోయినా సంజూ బలైపోయాడు. ఆటలో ఇవన్నీ సహజమే అయినా.. ఈ నిర్ణయం మ్యాచ్ ఫలితంపై ప్రభావం చూపింది’’ అని నవజ్యోత్ సింగ్ సిద్ధు స్టార్ స్పోర్ట్స్ షోలో తన అభిప్రాయాలు పంచుకున్నాడు. కాగా ఢిల్లీతో మ్యాచ్లో రాజస్తాన్ 20 పరుగుల తేడాతో ఓడిపోయింది.చదవండి: Playoff Race: సన్రైజర్స్ గుండెల్లో వర్షం గుబులు.. మ్యాచ్ రద్దైతే గనుక! Game of margins! 😮A splendid catch that raises the 𝙃𝙊𝙋𝙀 for the Delhi Capitals 🙌Sanju Samson departs after an excellent 86(46) 👏Watch the match LIVE on @StarSportsIndia and @JioCinema 💻📱#TATAIPL | #DCvRR pic.twitter.com/rhLhfBmyEZ— IndianPremierLeague (@IPL) May 7, 2024 -
అవుటా? నాటౌటా?.. సంజూకు షాకిచ్చిన బీసీసీఐ
రాజస్తాన్ రాయల్స్ కెప్టెన్ సంజూ శాంసన్కు ఊహించని షాక్ తగిలింది. ఢిల్లీ క్యాపిటల్స్తో మ్యాచ్ సందర్భంగా సంజూ వ్యవహార శైలిపై ఆగ్రహం వ్యక్తం చేసిన భారత క్రికెట్ నియంత్రణ మండలి.. అతడికి జరిమానా విధించింది. అసలేం జరిగిందంటే.. అరుణ్ జైట్లీ స్టేడియంలో రాజస్తాన్ రాయల్స్ ఢిల్లీతో మంగళవారం తలపడింది. టాస్ గెలిచిన రాయల్స్ కెప్టెన్ సంజూ శాంసన్.. పంత్ సేనను బ్యాటింగ్కు ఆహ్వానించాడు. దంచికొట్టిన ఢిల్లీ ఓపెనర్లుఓపెనర్లు జేక్ ఫ్రేజర్-మెగర్క్(20 బంతుల్లో 50), అభిషేక్ పోరెల్(36 బంతుల్లో 65), ఆరో నంబర్ బ్యాటర్ ట్రిస్టన్ స్టబ్స్ (20 బంతుల్లో 41) అద్భుత ఇన్నింగ్స్ ఆడారు.ఫలితంగా ఢిల్లీ జట్టు..నిర్ణీత 20 ఓవర్లలో ఎనిమిది వికెట్ల నష్టానికి 221 పరుగులు సాధించింది. ఇక భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన రాజస్తాన్ ఆదిలోనే ఓపెనర్ల వికెట్లు కోల్పోవడంతో వన్డౌన్ బ్యాటర్ సంజూ శాంసన్ బాధ్యతాయుత ఇన్నింగ్స్ ఆడాడు.అవుటా? నాటౌటా?మొత్తంగా 46 బంతుల్లో 8 ఫోర్లు, 6 సిక్సర్ల సాయంతో 86 పరుగులు చేసి జట్టును గట్టెక్కించే ప్రయత్నం చేశాడు. ఈ క్రమంలో సంజూ అవుటైన తీరు వివాదానికి దారితీసింది.రాజస్తాన్ ఇన్నింగ్స్లో పదహారో ఓవర్లో ఢిల్లీ పేసర్ ముకేశ్ కమార్ బౌలింగ్కు వచ్చాడు. అతడి బౌలింగ్లో షాట్ ఆడేందుకు ప్రయత్నించిన సంజూ.. బంతిని గాల్లోకి లేపగా బౌండరీ లైన్ వద్ద షాయీ హోప్ క్యాచ్ పట్టగా ఫీల్డ్ అంపైర్ అవుటిచ్చాడు.చిర్రెత్తిపోయిన సంజూ.. అంపైర్తో వాగ్వాదంఅయితే, ఆ సమయంలో షాయీ హోప్ బౌండరీ లైన్ తాకినట్టుగా కనిపించింది. రివ్యూ వెళ్లగా.. థర్డ్ అంపైర్ కూడా సంజూ అవుటైనట్లు ప్రకటించాడు. అదే సమయంలో ఢిల్లీ డగౌట్ నుంచి ఆ జట్టు యజమాని పార్థ్ జిందాల్ సైతం అవుట్ అంటూ అరుస్తూ సెలబ్రేట్ చేసుకున్నాడు. ఈ క్రమంలో చిర్రెత్తిపోయిన సంజూ శాంసన్ అంపైర్లతో వాదనకు దిగాడు. ఈ నేపథ్యంలో క్రమశిక్షణా చర్యల కింద బీసీసీఐ అతడి మ్యాచ్ ఫీజులో 30 శాతం మేర కోత విధించింది. ఇక ఈ మ్యాచ్లో ఢిల్లీ క్యాపిటల్స్ రాజస్తాన్ రాయల్స్ మీద 20 పరుగుల తేడాతో గెలిచింది. ప్లే ఆఫ్స్ రేసులో తామూ ఉన్నామంటూ దూసుకువచ్చింది.చదవండి: యువీ, ధావన్ కాదు!.. నాకిష్టమైన ప్లేయర్లు వాళ్లే: ప్రీతి జింటాGame of margins! 😮A splendid catch that raises the 𝙃𝙊𝙋𝙀 for the Delhi Capitals 🙌Sanju Samson departs after an excellent 86(46) 👏Watch the match LIVE on @StarSportsIndia and @JioCinema 💻📱#TATAIPL | #DCvRR pic.twitter.com/rhLhfBmyEZ— IndianPremierLeague (@IPL) May 7, 2024 -
ధోని ఆల్టైమ్ రికార్డు బద్దలు కొట్టిన సంజూ.. భారత తొలి క్రికెటర్గా..
రాజస్తాన్ రాయల్స్ కెప్టెన్ సంజూ శాంసన్ అరుదైన ఫీట్ను నమోదు చేశాడు. ఇండియన్ ప్రీమియర్ లీగ్లో అత్యంత వేగంగా 200 సిక్సర్ల మార్క్ను చేరుకున్న తొలి భారత క్రికెటర్గా శాంసన్ నిలిచాడు. ఐపీఎల్-2024లో భాగంగా అరుణ్ జైట్లీ స్టేడియం వేదికగా ఢిల్లీ క్యాపిటల్స్తో మ్యాచ్లో 6 సిక్స్లు బాదిన సంజూ.. ఈ అరుదైన ఘనతను తన ఖాతాలో వేసకున్నాడు. శాంసన్ కేవలం 159 ఇన్నింగ్స్లోనే ఈ రికార్డును సాధించాడు. ఇప్పటివవరకు ఈ రికార్డు చెన్నై సూపర్ కింగ్స్ మాజీ కెప్టెన్ ఎంఎస్ ధోని పేరిట ఉండేది. ఎంఎస్ ధోని 165 ఇన్నింగ్స్లో ఈ ఫీట్ను నమోదు చేశాడు. తాజా మ్యాచ్తో ధోని రికార్డును శాంసన్ బ్రేక్ చేశాడు. He's got power. He's got placement. And he's dealing in sixes in Delhi 💥Sanju Samson on the move & @rajasthanroyals are 67/2 at the end of powerplay 💗Watch the match LIVE on @StarSportsIndia and @JioCinema 💻📱#TATAIPL | #DCvRR pic.twitter.com/PkUUEHj9Zr— IndianPremierLeague (@IPL) May 7, 2024ఓవరాల్గా పదో ప్లేయర్ఇక ఐపీఎల్లో ఓవరాల్గా 200 సిక్స్లు మైలు రాయిని అందుకున్న 10వ ప్లేయర్గా శాంసన్ నిలిచాడు. ఈ జాబితాలో క్రిస్ గేల్, రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ, ఏబీ డివిలియర్స్, ఎంఎస్ ధోని, డేవిడ్ వార్నర్, కీరన్ పొలార్డ్, ఆండ్రీ రస్సెల్, సురేష్ రైనా ఉన్నారు.కాగా ఢిల్లీ క్యాపిటల్స్తో మంగళవారం నాటి మ్యాచ్లో రాజస్తాన్ రాయల్స్ ఓటమి పాలైంది. అరుణ్ జైట్లీ స్టేడియంలో టాస్ గెలిచిన రాజస్తాన్ తొలుత బౌలింగ్ చేసింది. ఢిల్లీ ఓపెనర్లు జేక్ ఫ్రేజర్-మెగర్క్(20 బంతుల్లో 50), అభిషేక్ పోరెల్(36 బంతుల్లో 65) దంచికొట్టారు. He's got power. He's got placement. And he's dealing in sixes in Delhi 💥Sanju Samson on the move & @rajasthanroyals are 67/2 at the end of powerplay 💗Watch the match LIVE on @StarSportsIndia and @JioCinema 💻📱#TATAIPL | #DCvRR pic.twitter.com/PkUUEHj9Zr— IndianPremierLeague (@IPL) May 7, 2024 వీరికి తోడు ఆరో నంబర్ బ్యాటర్ ట్రిస్టన్ స్టబ్స్ (20 బంతుల్లో 41) విధ్వంసకర ఇన్నింగ్స్తో విరుచుకుపడ్డారు. ఈ క్రమంలో పంత్ సేన నిర్ణీత 20 ఓవర్లలో ఎనిమిది వికెట్ల నష్టానికి 221 పరుగులు చేసింది.సంజూ కెప్టెన్ ఇన్నింగ్స్ వృథాఇక లక్ష్య ఛేదనకు దిగిన రాజస్తాన్ 201 పరుగులకే చేతులెత్తేసింది. ఫలితంగా సొంత మైదానంలో ఢిల్లీ క్యాపిటల్స్ రాజస్తాన్పై 20 పరుగుల తేడాతో గెలుపొందింది. కాగా రాజస్తాన్ బ్యాటర్లంతా విఫలం కాగా సంజూ శాంసన్ కెప్టెన్ ఇన్నింగ్స్తో మెరిశాడు. 46 బంతుల్లో 8 ఫోర్లు, 6 సిక్సర్ల సాయంతో 86 పరుగులు చేసి టాప్ స్కోరర్గా నిలిచాడు. The home side emerge victorious in tonight's run-fest here in Delhi 💥And with that win, Delhi Capitals move to number 5⃣ on the Points Table 🔥🔥Scorecard ▶️ https://t.co/nQ6EWQGoYN#TATAIPL | #DCvRR pic.twitter.com/vQvWMSk5lt— IndianPremierLeague (@IPL) May 7, 2024 -
IPl 2024 DC Vs RR: శాంసన్ ఇన్నింగ్స్ వృథా.. రాజస్తాన్పై ఢిల్లీ ఘన విజయం
ఐపీఎల్-2024లో రాజస్తాన్ రాయల్స్ వరుసగా రెండో ఓటమి చవిచూసింది. అరుణ్ జైట్లీ స్టేడియం వేదికగా ఢిల్లీ క్యాపిటల్స్తో జరిగిన హైస్కోరింగ్ మ్యాచ్లో 20 పరుగుల తేడాతో రాజస్తాన్ ఓటమి పాలైంది. 222 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన రాజస్తాన్ నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్లు కోల్పోయి 201 పరుగులకు పరిమితమైంది. రాజస్తాన్ బ్యాటర్లలో కెప్టెన్ సంజూ శాంసన్ 86 పరుగులతో అద్బుత ఇన్నింగ్స్ ఆడినప్పటికి జట్టును గెలిపించలేకపోయాడు. మిగితా బ్యాటర్ల నుంచి పెద్ద ఇన్నింగ్స్లు రాకపోవడంతో రాజస్తాన్ ఓడిపోయింది. ఇక ఢిల్లీ బౌలర్లలో కుల్దీప్ యాదవ్, ఖాలీల్ అహ్మద్, ముఖేష్ కుమార్ తలా రెండు వికెట్లు సాధించగా.. అక్షర్ పటేల్, రసిఖ్ దార్ సలామ్ చెరో వికెట్ పడగొట్టారు. అంతకుముందు బ్యాటింగ్ చేసిన ఢిల్లీ క్యాపిటల్స్ఢిల్లీ నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 221 పరుగుల భారీ స్కోర్ సాధించింది.ఢిల్లీ బ్యాటర్లలో ఓపెనర్లు జెక్ ఫ్రెజర్ మెక్ గర్క్(20 బంతుల్లో 50), అభిషేర్ పోరెల్(65) అదరగొట్టారు. వీరిద్దరితో పాటు ఆఖరిలో ట్రిస్టన్ స్టబ్స్ మెరుపులు మెరిపించాడు.20 బంతులు ఎదుర్కొన్న స్టబ్స్.. 3 ఫోర్లు, 3 సిక్స్లతో 41 పరుగులు చేశాడు. రాజస్తాన్ బౌలర్లలో రవిచంద్రన్ అశ్విన్ మూడువికెట్లు పడగొట్టగా.. చాహల్, బౌల్ట్, సందీప్ శర్మ తలా వికెట్ సాధించారు. -
రాజస్తాన్తో ఢిల్లీ కీలక పోరు.. కొత్త ప్లేయర్లు ఎంట్రీ
ఐపీఎల్-2024లో ఢిల్లీ క్యాపిటల్స్ కీలక పోరకు సిద్దమైంది. అరుణ్ జైట్లీ స్టేడియం వేదికగా రాజస్తాన్ రాయల్స్తో ఢిల్లీ క్యాపిటల్స్ తలపడుతోంది. ఈ మ్యాచ్లో టాస్ గెలిచిన రాజస్తాన్ రాయల్స్ తొలుత బౌలింగ్ ఎంచుకుంది. ఈ మ్యాచ్లో ఇరు జట్లు చెరో రెండు మార్పులు చేశాయి. రాజస్తాన్ రాయల్స్ తరపున దక్షిణాఫ్రికా ఆటగాడు డోనోవన్ ఫెరీరా, ఢిల్లీ క్యాపిటల్స్ తరపున నైబ్ ఐపీఎల్ అరంగేట్రం చేయనున్నారు. అదే విధంగా ఈమ్యాచ్కు రాజస్తాన్ స్టార్ క్రికెటర్లు ధ్రువ్ జురెల్, హెట్మైర్ దూరమయ్యారు. హెట్మైర్ స్ధానంలో ఫెరీరా, జురెల్ ప్లేస్లో శుబమ్ దూబే వచ్చాడు. మరోవైపు ఢిల్లీ జట్టులోకి వెటరన్ పేసర్ ఇషాంత్ శర్మ రీ ఎంట్రీ ఇచ్చాడు.తుది జట్లుఢిల్లీ క్యాపిటల్స్: జేక్ ఫ్రేజర్-మెక్గుర్క్, అభిషేక్ పోరెల్, షాయ్ హోప్, రిషబ్ పంత్(కెప్టెన్, వికెట్ కీపర్), ట్రిస్టన్ స్టబ్స్, గుల్బాదిన్ నాయబ్, అక్షర్ పటేల్, కుల్దీప్ యాదవ్, ముఖేష్ కుమార్, ఇషాంత్ శర్మ, ఖలీల్ అహ్మద్రాజస్తాన్ రాయల్స్: యశస్వి జైస్వాల్, సంజు శాంసన్(కెప్టెన్), రియాన్ పరాగ్, డోనోవన్ ఫెరీరా, రోవ్మన్ పావెల్, శుభమ్ దూబే, రవిచంద్రన్ అశ్విన్, ట్రెంట్ బౌల్ట్, అవేష్ ఖాన్, సందీప్ శర్మ, యుజ్వేంద్ర చాహల్ -
ఐపీఎల్లో నేటి (మే 7) మ్యాచ్
ఐపీఎల్లో ఇవాళ (మే 7) మరో ఆసక్తికర సమరం జరుగనుంది. ప్లే ఆఫ్స్ అవకాశాలను కష్టతరం చేసుకున్న ఢిల్లీ.. ప్లే ఆఫ్స్ బెర్తును ఖరారు చేసుకున్న రాజస్థాన్ రాయల్స్ను ఢీకొట్టనుంది. ఈ మ్యాచ్ రాయల్స్కు అంత ముఖ్యం కాకపోయినా, ఢిల్లీకి మాత్రం అత్యంత కీలకంగా మారింది. ఇందులో గెలిస్తేనే ఆ జట్టు ప్లే ఆఫ్స్ రేసులో ఉంటుంది.ఢిల్లీ ఈ మ్యాచ్తో పాటు తదుపరి ఆడబోయే రెండు మ్యాచ్లు గెలిస్తే ప్లే ఆఫ్స్ రేసు రసవత్తరంగా మారుతుంది. ఇప్పటికే చెన్నై, సన్రైజర్స్, లక్నో తలో 12 పాయింట్లతో సమంగా ఉంటూ ప్లే ఆఫ్స్ రేసును రసరంజకంగా మార్చాయి. ఇక ఢిల్లీ కూడా ఈ జట్లతో చేరితే రెండు ప్లే ఆఫ్స్ బెర్తుల కోసం పోటీ తీవ్రతరమవుతుంది. మొదటి రెండు ప్లే ఆఫ్స్ బెర్తులను కేకేఆర్, రాజస్థాన్ దాదాపుగా ఖరారు చేసుకున్నాయి.ప్రస్తుతం పాయింట్ల పట్టిక ఇలా ఉంది..కేకేఆర్ (11 మ్యాచ్ల్లో 8 విజయాలు 16 పాయింట్లు, 1.453 రన్రేట్),రాజస్థాన్ (10 మ్యాచ్ల్లో 8 విజయాలు 16 పాయింట్లు 0.622 రన్రేట్), సీఎస్కే (11 మ్యాచ్ల్లో 6 విజయాలు 12 పాయింట్లు 0.700 రన్రేట్), సన్రైజర్స్ (11 మ్యాచ్ల్లో 6 విజయాలు 12 పాయింట్లు -0.065 రన్రేట్), లక్నో (11 మ్యాచ్ల్లో 6 విజయాలు 12 పాయింట్లు -0.371 రన్రేట్), ఢిల్లీ (11 మ్యాచ్ల్లో 5 విజయాలు 10 పాయింట్లు -0.442 రన్రేట్), ఆర్సీబీ (11 మ్యాచ్ల్లో 4 విజయాలు 8 పాయింట్లు -0.049 రన్రేట్), పంజాబ్ (11 మ్యాచ్ల్లో 4 విజయాలు 8 పాయింట్లు -0.187 రన్రేట్), ముంబై (12 మ్యాచ్ల్లో 4 విజయాలు 8 పాయింట్లు -0.212 రన్రేట్),గుజరాత్ (11 మ్యాచ్ల్లో 4 విజయాలు 8 పాయింట్లు -1.320 రన్రేట్)హెడ్ టు హెడ్ రికార్డ్స్: రాజస్థాన్, ఢిల్లీ జట్లు ఇప్పటివరకు 28 మ్యాచ్ల్లో తలపడగా.. రాజస్థాన్ 15, ఢిల్లీ 13 మ్యాచ్ల్లో విజయాలు సాధించాయి. ఇరు జట్ల మధ్య ఇదే సీజన్లో జరిగిన చివరి మ్యాచ్లో రాయల్స్ 12 పరుగుల తేడాతో గెలుపొందింది. ఆ మ్యాచ్లో తొలుత బ్యాటింగ్ చేసిన రాయల్స్ నిర్ణీత ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 185 పరుగులు చేసింది. రియాన్ పరాగ్ (84 నాటౌట్) మెరుపు ఇన్నింగ్స్తో ఆకట్టుకున్నాడు. అనంతరం ఛేదనలో తడబడిన ఢిల్లీ నిర్ణీత ఓవర్లు పూర్తయ్యే సరికి లక్ష్యానికి 13 పరుగుల దూరంలో (173/5) నిలిచిపోయి ఓటమిపాలైంది. డేవిడ్ వార్నర్ (49), ట్రిస్టన్ స్టబ్స్ (44 నాటౌట్) ఢిల్లీని గెలిపించేందుకు విఫలయత్నం చేశారు.తుది జట్లు (అంచనా)..ఢిల్లీ: డేవిడ్ వార్నర్, జేక్ ఫ్రేజర్-మెక్గర్క్, అభిషేక్ పోరెల్, రిషబ్ పంత్ (కెప్టెన్/వికెట్కీపర్), ట్రిస్టన్ స్టబ్స్, షాయ్ హోప్, అక్షర్ పటేల్, కుల్దీప్ యాదవ్, ఖలీల్ అహ్మద్, ఇషాంత్ శర్మ, ముఖేష్ యాదవ్ [ఇంపాక్ట్ ప్లేయర్: రసిఖ్ సలామ్]రాజస్థాన్ రాయల్స్: యశస్వి జైస్వాల్, జోస్ బట్లర్, సంజు శాంసన్ (కెప్టెన్/వికెట్కీపర్), రియాన్ పరాగ్, ధృవ్ జురెల్, షిమ్రాన్ హెట్మెయర్, రోవ్మన్ పావెల్, అశ్విన్, ట్రెంట్ బౌల్ట్, అవేష్ ఖాన్, సందీప్ శర్మ [ఇంపాక్ట్ ప్లేయర్: యుజ్వేంద్ర చహల్] -
‘నాకు దక్కలేదు.. సంజూ భయ్యాను మాత్రం సెలక్ట్ చేశారు’
‘‘నేను చాలా విషయాల్లో మెరుగుపడాలి. ప్రస్తుతం నేను నా అత్యుత్తమ ఫామ్లో లేను. ఒకవేళ ఫామ్లో ఉండి ఉంటే గనుక కచ్చితంగా మ్యాచ్ను విజయంతో ముగించేవాడిని.నా తప్పుల నుంచి పాఠాలు నేర్చుకుంటాను. అవి మళ్లీ పునరావృతం కాకుండా చూసుకుంటాను. ఇది నా అత్యుత్తమ ఇన్నింగ్సేనా అంటే కానేకాదు. ఒకవేళ సెంచరీ చేసి ఉంటే పరిస్థితి వేరేలా ఉండేది.మ్యాచ్లో ఓడిపోయిన జట్టుగా మిగిలిపోవడం నిరాశకు గురిచేస్తుంది. ఈరోజు మ్యాచ్లో మేము ఆఖరి వరకు పోరాడగలిగాం. ఓటమిని తలచుకుంటూ కూర్చుంటే ముందుకు సాగలేం.రెండు- మూడు ఓవర్లలో చేసిన తప్పుల కారణంగా మ్యాచ్ రూపంలో భారీ మూల్యమే చెల్లించాం. టీ20 అంటేనే ఇలా ఉంటుంది. కాబట్టి తదుపరి మ్యాచ్పై దృష్టి సారించే క్రమంలో ఆత్మవిశ్వాసంతో ముందుకు సాగుతాం’’ అని రాజస్తాన్ రాయల్స్ యువ బ్యాటర్ రియాన్ పరాగ్ అన్నాడు.కాగా ఐపీఎల్-2024లో భాగంగా సన్రైజర్స్ హైదరాబాద్తో రాజస్తాన్ గురువారం తలపడింది. ఉప్పల్ వేదికగా జరిగిన ఈ మ్యాచ్లో టాస్ గెలిచిన సన్రైజర్స్ తొలుత బ్యాటింగ్ చేసింది.నిర్ణీత 20 ఓవర్లలో మూడు వికెట్లు నష్టపోయి 201 పరుగులు చేసింది. ఈ క్రమంలో లక్ష్య ఛేదనకు దిగిన రాజస్తాన్ విజయానికి ఒక్క పరుగు దూరంలో నిలిచిపోయింది. 20 ఓవర్లలో ఏడు వికెట్ల నష్టానికి 200 పరుగులు మాత్రమే చేయగలిగింది.రియాన్ పరాగ్ ఇన్నింగ్స్ వృథాఆఖరి బంతికి రెండు పరుగులు అవసరమైన వేళ రైజర్స్ సీనియర్ భువనేశ్వర్ కుమార్ రోవ్మన్ పావెల్ను ఎల్బీడబ్ల్యూగా వెనక్కి పంపడంతో రాజస్తాన్ కథ ముగిసిపోయింది.ఫలితంగా ఈ మ్యాచ్లో రాజస్తాన్ కష్టాల్లో కూరకుపోయి ఉన్నవేళ.. 77 పరుగులతో రాణించిన రియాన్ పరాగ్ ఇన్నింగ్స్ వృథాగా పోయింది. ఈ నేపథ్యంలో ఓటమి అనంతరం రియాన్ పరాగ్ మాట్లాడుతూ ఈ మేరకు వ్యాఖ్యలు చేశాడు.కాగా వరల్డ్కప్-2024కు ప్రకటించిన జట్టులో రిజర్వ్ ప్లేయర్గా అయినా పరాగ్కు చోటు దక్కుతుందని అతడి అభిమానులు ఆశపడ్డారు. అయితే, బీసీసీఐ మాత్రం 22 ఏళ్ల ఈ అసోం బ్యాటింగ్ ఆల్రౌండర్కు అప్పుడే పిలుపునిచ్చేందుకు సిద్ధంగా లేనట్లు స్పష్టం చేసింది. సంజూ భయ్యాకు చోటు దక్కడం సంతోషంఈ నేపథ్యంలో రియాన్ పరాగ్ మాట్లాడుతూ.. ‘‘గతేడాది అసలు నేను ఐపీఎల్ పోటీలోనే లేను. కానీ ఈసారి నా గురించి ఏవో వదంతులు కూడా వినిపిస్తున్నాయి. నా గురించి అందరూ చర్చించుకునే స్థాయికి వచ్చాను.నా గురించి గళం వినిపిస్తున్న వారికి ధన్యవాదాలు. అయితే, నేను మాత్రం ఇప్పుడే వాటి(టీమిండియాలో చోటు) గురించి ఆలోచించడం లేదు. మా జట్టు నుంచి వరల్డ్కప్ టీమ్లో చోటు దక్కించుకున్న వారికి అభినందనలు. ముఖ్యంగా సంజూ భయ్యాకు చోటు దక్కడం చాలా చాలా సంతోషంగా ఉంది’’ అని రియాన్ పరాగ్ పరిణతితో కూడిన వ్యాఖ్యలు చేశాడు.ఇక సన్రైజర్స్ హైదరాబాద్తో మ్యాచ్లో 49 బంతుల్లో 77 పరుగులు చేసిన రియాన్ పరాగ్.. ఈ సీజన్లో 409 పరుగులు పూర్తి చేసుకున్నాడు. తద్వారా ఐపీఎల్-2024లో 400 పరుగుల మార్కు అందుకున్న తొలి అన్క్యాప్డ్ ప్లేయర్గా నిలిచాడు.చదవండి: SRH: కావ్యా మారన్ వైల్డ్ సెలబ్రేషన్స్.. వీడియో వైరల్ -
అక్కడ బ్యాటింగ్ చేయడం కష్టం.. అతడు అద్భుతం!
ఐపీఎల్-2024లో వరుస విజయాలతో అదరగొడుతున్న రాజస్తాన్ రాయల్స్ ప్లే ఆఫ్స్ రేసులో మరింత ముందుకు దూసుకెళ్లింది. లక్నో సూపర్ జెయింట్స్తో మ్యాచ్లో ఏడు వికెట్ల తేడాతో ఘన విజయం సాధించి.. అందరి కంటే ముందుగానే టాప్-4లో బెర్తు ఖరారు చేసుకునే పనిలో పడింది.ఈ నేపథ్యంలో రాయల్స్ కెప్టెన్ సంజూ శాంసన్ హర్షం వ్యక్తం చేశాడు. జట్టు ప్రదర్శన పట్ల తాను సంతృప్తిగా ఉన్నట్లు వెల్లడించాడు. అదే విధంగా రాయల్స్ను గెలుపుతీరాలకు చేర్చడంలో తనకు అండగా నిలిచిన ధ్రువ్ జురెల్పై ప్రశంసలు కురిపించాడు.ఫామ్లేమితోగతేడాది ఐపీఎల్లో అదరగొట్టి టీమిండియా తరఫున టెస్టుల్లో ఎంట్రీ ఇచ్చిన వికెట్ కీపర్ బ్యాటర్ ధ్రువ్ జురెల్కు.. ఐపీఎల్-2024 ఆరంభంలో చేదు అనుభవాలు ఎదురయ్యాయి. ఫామ్లేమితో సతమతమైన అతడు లక్నో సూపర్ జెయింట్స్తో మ్యాచ్ కంటే ముందు ఆడిన ఐదు ఇన్నింగ్స్లో కలిపి కేవలం 50 పరుగులే చేశాడు.అయితే, శనివారం నాటి మ్యాచ్లో ఈ కుడిచేతి వాటం బ్యాటర్ ధనాధన్ ఇన్నింగ్స్తో అలరించాడు. వన్డౌన్ బ్యాటర్, కెప్టెన్ సంజూ శాంసన్ సుడిగాలి ఇన్నింగ్స్(33 బంతుల్లో 71 నాటౌట్)తో విరుచుకుపడగా మరో ఎండ్ నుంచి అతడికి సహకారం అందించాడు.మొత్తంగా 34 బంతులు ఎదుర్కొని ఐదు ఫోర్లు, రెండు సిక్సర్ల సాయంతో 52 పరుగులు రాబట్టాడు. తద్వారా సంజూ శాంసన్తో కలిసి నాలుగో వికెట్కు 121 పరుగులు జోడించి ఇంకా ఆరు బంతులు మిగిలి ఉండగానే జట్టును విజయతీరాలకు చేర్చాడు.ఈ నేపథ్యంలో సంజూ శాంసన్ మాట్లాడుతూ.. ‘‘ఫామ్ టెంపరరీ. నిజానికి టీ20 క్రికెట్లో ఐదో స్థానంలో బ్యాటింగ్ చేయడం చాలా కష్టం. అయితే, ధ్రువ్ జురెల్ వంటి యువ ఆటగాళ్లు పిచ్ పరిస్థితులను చక్కగా అర్థం చేసుకుని రాణిస్తుండటం సానుకూలాంశం.టీమిండియా తరఫున టెస్టుల్లో తన ప్రదర్శన మనం చూశాం. ఆరంభంలో తడబడ్డా అతడిపై మా నమ్మకం సడలలేదు. నెట్స్లో రెండు నుంచి మూడు గంటల పాటు తీవ్రంగా శ్రమించాడు. అతడు తప్పక రాణిస్తాడని మాకు తెలుసు. అదే జరిగింది కూడా’’ అని ధ్రువ్ జురెల్ ఆట తీరును కొనియాడాడు.రాజస్తాన్ వర్సెస్ లక్నో స్కోర్లు:వేదిక: లక్నోటాస్: రాజస్తాన్.. బౌలింగ్లక్నో స్కోరు: 196/5 (20)రాజస్తాన్ స్కోరు: 199/3 (19)ఫలితం: లక్నోపై ఏడు వికెట్ల తేడాతో రాజస్తాన్ విజయంప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్: సంజూ శాంసన్.చదవండి: డీకే అవసరమా?: యువీ Winning streak continues 🩷A Sanju Samson special & Dhruv Jurel's attractive innings propel Rajasthan Royals to their 8th win this season🙌Scorecard ▶️ https://t.co/Dkm7eJqwRj#TATAIPL | #LSGvRR | @rajasthanroyals pic.twitter.com/cam0GepXVo— IndianPremierLeague (@IPL) April 27, 2024 -
T20 WC: డీకే అవసరమా?.. వాళ్లిద్దరు బెస్ట్!
టీ20 ప్రపంచకప్-2024 నేపథ్యంలో జట్ల ప్రకటనకు అంతర్జాతీయ క్రికెట్ మండలి మే 1ని డెడ్లైన్గా విధించింది. ఆలోపు మెగా ఈవెంట్లో పాల్గొనే ఆటగాళ్ల ఎంపికను పూర్తి చేయాలని స్పష్టం చేసింది.ఈ నేపథ్యంలో భారత క్రికెట్ నియంత్రణ మండలి ఇప్పటికే జట్టు ఎంపికపై చర్చలు ముమ్మరం చేసినట్లు తెలుస్తోంది. ఈ క్రమంలో టీమిండియా మాజీ ఆల్రౌండర్, ప్రపంచకప్ విజేత యువరాజ్ సింగ్.. మెగా టోర్నీలో ఆడాల్సిన భారత వికెట్ కీపర్ గురించి కీలక వ్యాఖ్యలు చేశాడు.పోటీలో ఆ నలుగురు!కాగా ప్రపంచకప్ జట్టులో బెర్తు కోసం రిషభ్ పంత్, సంజూ శాంసన్, కేఎల్ రాహుల్, దినేశ్ కార్తిక్ మధ్య పోటీ నెలకొంది. ఈ నలుగురిలో డీకే ఐపీఎల్-2024లో ఆర్సీబీకి ఆడుతూ ఫినిషర్గా రాణిస్తున్నాడు.ఇప్పటి వరకు తొమ్మిది మ్యాచ్లలో కలిపి 195.52 స్ట్రైక్రేటుతో 262 పరుగులు చేశాడు. మరోవైపు.. ఢిల్లీ క్యాపిటల్స్ కెప్టెన్ రిషభ్ పంత్ దాదాపు 14 నెలల విరామం తర్వాత కాంపిటేటివ్ క్రికెట్లో అడుగుపెట్టినా.. ఫుల్ ఫామ్లోకి వచ్చేశాడు.ఆడిన తొమ్మిది మ్యాచ్లలో మూడు హాఫ్ సెంచరీల సాయంతో 342 పరుగులు చేశాడు. ఇక సంజూ శాంసన్ రాజస్తాన్ రాయల్స్ కెప్టెన్గా రాణిస్తూ.. వికెట్ కీపర్ బ్యాటర్గానూ రాణిస్తున్నాడు. ఇప్పటి దాకా 385 రన్స్తో అత్యధిక పరుగుల వీరుల జాబితాలో రెండో స్థానంలో కొనసాగుతున్నాడు.డీకే అవసరమా?ఈ లిస్టులో సంజూ తర్వాత కేఎల్ రాహుల్ 378 పరుగులతో మూడో స్థానంలో ఉన్నాడు. ఈ నేపథ్యంలో యువీ ఐసీసీతో మాట్లాడుతూ.. ‘‘డీకే ప్రస్తుతం బాగానే బ్యాటింగ్ చేస్తున్నాడు. కానీ గతసారి(2022) టీ20 వరల్డ్కప్లో అతడు రాణించలేకపోయాడు.కాబట్టి ఈసారి జట్టుకు ఎంపిక చేసినా అతడికి తుదిజట్టులో చోటు దక్కకపోవచ్చు. నిజానికి రిషభ్ పంత్, సంజూ శాంసన్ రూపంలో ఇద్దరు యువ ప్లేయర్లు అందుబాటులో ఉన్నారు. -
రాజస్తాన్ దర్జాగా...
లక్నో: ఈ సీజన్లో తిరుగులేని విజయాలతో దూసుకెళ్తున్న రాజస్తాన్ రాయల్స్ అందరికంటే ముందుగా ప్లేఆఫ్స్ చేరేందుకు మరింత చేరువైంది. శనివారం జరిగిన ఐపీఎల్ మ్యాచ్లో రాజస్తాన్ 7 వికెట్ల తేడాతో లక్నోపై గెలిచింది. తొలుత లక్నో సూపర్జెయింట్స్ 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 196 పరుగులు చేసింది.ఆరంభంలోనే ఓపెనర్ డికాక్ (8), హిట్టర్ స్టొయినిస్ (0) వికెట్లను కోల్పోయి కష్టాల్లో ఉన్న సూపర్జెయింట్స్ను కేఎల్ రాహుల్ (48 బంతుల్లో 76; 8 ఫోర్లు, 2 సిక్స్లు), దీపక్ హుడా (31 బంతుల్లో 51; 7 ఫోర్లు) ఆదుకున్నారు. వీరిద్దరు మూడో వికెట్కు 115 పరుగులు జోడించారు.మిగతావారిలో పూరన్ (11), బదోని (18 నాటౌట్), కృనాల్ పాండ్యా (15 నాటౌట్) పెద్ద స్కోర్లేమీ చేయలేదు. అనంతరం లక్ష్యఛేదనకు దిగిన రాజస్తాన్ రాయల్స్ 19 ఓవర్లలో 3 వికెట్లు కోల్పోయి 199 పరుగులు చేసింది.కెప్టెన్ సంజు సామ్సన్ (33 బంతుల్లో 71 నాటౌట్; 7 ఫోర్లు, 4 సిక్స్లు), ధ్రువ్ జురేల్ (34 బంతుల్లో 52 నాటౌట్; 5 ఫోర్లు, 2 సిక్స్లు) అబేధ్యమైన నాలుగో వికెట్కు 121 పరుగులు జోడించి మరో ఆరు బంతులు మిగిలి ఉండగానే గెలిపించారు. స్కోరు వివరాలు లక్నో సూపర్జెయింట్స్ ఇన్నింగ్స్: డికాక్ (బి) బౌల్ట్ 8; రాహుల్ (సి) బౌల్ట్ (బి) అవేశ్ ఖాన్ 76; స్టొయినిస్ (బి) సందీప్ 0; దీపక్ హుడా (సి) పావెల్ (బి) అశి్వన్ 50; పూరన్ (సి) బౌల్ట్ (బి) సందీప్ 11; బదోని నాటౌట్ 18; కృనాల్ నాటౌట్ 15; ఎక్స్ట్రాలు 18; మొత్తం (20 ఓవర్లలో 5 వికెట్లకు) 196. వికెట్ల పతనం: 1–8, 2–11, 3–126, 4–150, 5–173. బౌలింగ్: బౌల్ట్ 4–0–41–1, సందీప్ 4–0–31–2, అవేశ్ ఖాన్ 4–0–42–1, అశ్విన్ 4–0–39–1, చహల్ 4–0–41–0. రాజస్తాన్ రాయల్స్ ఇన్నింగ్స్: యశస్వి (సి) బిష్ణోయ్ (బి) స్టొయినిస్ 24; బట్లర్ (బి) యశ్ ఠాకూర్ 34; సామ్సన్ నాటౌట్ 71; పరాగ్ (సి) బదోని (బి) అమిత్ 14; జురేల్ నాటౌట్ 52; ఎక్స్ట్రాలు 4; మొత్తం (19 ఓవర్లలో 3 వికెట్లకు) 199. వికెట్ల పతనం: 1–60, 2–60, 3–78. బౌలింగ్: హెన్రీ 3–0–32–0, మొహసిన్ 4–0–52–0, యశ్ ఠాకూర్ 4–0–50–1, స్టొయినిస్ 1–0–3–1, కృనాల్ 4–0–24–0, అమిత్ మిశ్రా 2–0–20–1, రవి బిష్ణోయ్ 1–0–16–0. -
వరల్డ్కప్ బెర్త్ పక్కా చేసుకున్న పంత్.. సంజూకు మరోసారి మొండిచెయ్యేనా..?
సోషల్ మీడియాలో జరుగుతున్న ప్రచారం మేరకు ఢిల్లీ క్యాపిటల్స్ సారధి రిషబ్ పంత్ టీ20 వరల్డ్కప్ బెర్త్ పక్కా చేసుకున్నట్లు తెలుస్తుంది. ప్రముఖ వార్తా సంస్థ ఓ కథనంలో ఈ విషయాన్ని ప్రస్తావించింది. పంత్ టీ20 వరల్డ్కప్లో టీమిండియా ఫస్ట్ చాయిస్ వికెట్కీపర్ బ్యాటర్గా ఉంటాడని సమాచారం. ఐపీఎల్ ప్రదర్శనల ఆధారంగా పంత్ వరల్డ్కప్ బెర్త్ను ఖరారు చేశారని తెలుస్తుంది. కారు ప్రమాదం తాలూకా గాయాల నుంచి ఇటీవలే బయటపడ్డ పంత్.. ఈ ఐపీఎల్ సీజన్లో ఇరగదీస్తున్నాడు. ఢిల్లీ తరఫున అత్యధిక పరుగులు చేసిన బ్యాటర్గా కొనసాగుతున్నాడు.అలాగే అత్యధిక పరుగులు చేసిన వికెట్కీపర్ బ్యాటర్గా..మూడో అత్యధిక రన్ స్కోరర్గా..అత్యధిక సిక్సర్లు సాధించిన కెప్టెన్గా..అత్యధిక స్ట్రయిక్రేట్ కలిగిన కెప్టెన్గా..రెండు ప్లేయర్ ఆఫ్ మ్యాచ్ అవార్డులు గెలుచుకున్న ఏకైక కెప్టెన్గా..రెండు ప్లేయర్ ఆఫ్ మ్యాచ్ అవార్డులు గెలుచుకున్న ఏకైక వికెట్కీపర్ బ్యాటర్గా..అత్యధిక ప్లేయర్ ఆఫ్ మ్యాచ్ అవార్డులు గెలుచుకున్న ఆటగాడిగా పలు ఘనతలు సొంతం చేసుకున్నాడు. నిన్న గుజరాత్తో జరిగిన మ్యాచ్లో పంత్ పాత రోజులు గుర్తు చేశాడు. ఎడాపెడా బౌండరీలు, సిక్సర్లు బాది గుజరాత్ బౌలర్లకు చుక్కలు చూపించాడు. ఈ మ్యాచ్లో 43 బంతులు ఎదుర్కొన్న పంత్.. 5 ఫోర్లు, 8 సిక్సర్ల సాయంతో 88 పరుగులు చేసి అజేయంగా నిలిచాడు. ఈ మ్యాచ్లో పంత్ అద్భుతమైన కెప్టెన్సీ నైపుణ్యాన్ని ప్రదర్శించడంతో పాటు 2 క్యాచ్లు కూడా పట్టాడు. వరల్డ్కప్కు ఎంపిక కావాలంటే ఇంతకంటే ఏం కావాలని పంత్ అభిమానులు అంటున్నారు. పంత్ వరల్డ్కప్ బెర్త్ ఖరారైందనుకుంటే సెకెండ్ ఛాయిస్ వికెట్కీపర్ ఎవరనే ప్రశ్న ఉత్పన్నమవుతుంది. ఈ స్థానంలో కోసం కేఎల్ రాహుల్, సంజూ శాంసన్ తీవ్రంగా పోటీపడుతున్నారు. ప్రస్తుతమున్న సమాచారం మేరకు ఈ రేసులో రాహుల్ ముందున్నట్లు తెలుస్తుంది. రాహుల్ మిడిలార్డర్లో బాధ్యతాయుతమైన ఇన్నింగ్స్లు ఆడగలడని సెలెక్టర్లు భావిస్తున్నట్లు సమాచారం. ఇదే నిజమైతే సంజూ శాంసన్కు మరోసారి మొండిచెయ్యి ఖాయం.శాంసన్ను తృణీకరించేందుకు సెలెక్టర్ల వద్ద పెద్ద కారణాలు లేకపోయినా సమీకరణల పేరుతో అతన్ని పక్కన పెట్టడం పరిపాటిగా మారింది. సంజూ సంబంధించిన ఈ విషయాన్ని ఇటీవలే మాజీ కేంద్ర మంత్రి శశిథరూర్ కూడా ప్రస్తావించారు. జస్టిస్ ఫర్ సంజూ అని ఓ ట్వీట్ చేశారు. సంజూ విషయంలో సెలెక్టర్లు ఏ నిర్ణయం తీసుకుంటారో మరికొద్ది రోజుల్లో తేలిపోతుంది. ఈ నెలఖరులోగా టీ20 వరల్డ్కప్ 2024 కోసం భారత జట్టును ఎంపిక చేయాల్సి ఉంది. -
T20: రోహిత్ తర్వాత టీమిండియా కెప్టెన్గా సంజూ శాంసన్!
‘రోహిత్ శర్మ తర్వాత పరిమిత ఓవర్ల క్రికెట్లో టీమిండియా కెప్టెన్ హార్దిక్ పాండ్యానే.. అంతెందుకు టీ20 వరల్డ్కప్-2024లోనూ జట్టును అతడే ముందుకు నడిపిస్తాడు’’.. చాన్నాళ్లుగా విశ్లేషకుల మాట. అయితే, వన్డే వరల్డ్కప్-2023 తర్వాత సీన్ కాస్తా మారింది. గాయం కారణంగా మెగా టోర్నీకి దూరమైన ఈ పేస్ ఆల్రౌండర్.. ఐపీఎల్-2024లో గుజరాత్ టైటాన్స్ నుంచి ముంబై ఇండియన్స్కు వచ్చి కెప్టెన్గా బాధ్యతలు చేపట్టాడు. రోహిత్ శర్మ స్థానాన్ని భర్తీ చేస్తూ ముంబై పగ్గాలు అందుకున్నాడు. ఈ నేపథ్యంలో.. బీసీసీఐ మాత్రం ఈసారి పొట్టి ప్రపంచకప్లో రోహిత్ శర్మనే టీమిండియాకు సారథ్యం వహిస్తాడని ప్రకటించింది. ఇక ఐపీఎల్ పదిహేడో ఎడిషన్ మొదలైన తర్వాత సీన్ పూర్తిగా మారింది. హార్దిక్ పాండ్యా కెప్టెన్సీ వైఫల్యాల కారణంగా ముంబై ఇండియన్స్ పేలవ ప్రదర్శన కనబరుస్తోంది. ఇప్పటి వరకు ఆడిన ఎనిమిదింట కేవలం మూడు మాత్రమే గెలిచింది. రాజస్తాన్ రాయల్స్ చేతిలో సోమవారం నాటి మ్యాచ్తో ఐదో పరాజయం నమోదు చేసింది. ఇదిలా ఉంటే.. రాజస్తాన్ రాయల్స్ కెప్టెన్ సంజూ శాంసన్ మాత్రం తన జట్టును విజయపథంలో ముందుకు నడిపిస్తున్నాడు. సంజూ శాంసన్ (PC: IPL) ఇప్పటి దాకా రాయల్స్ ఎనిమిది మ్యాచ్లు ఆడి ఏడు విజయాలతో ప్రస్తుతం పట్టికలో అగ్రస్థానంలో ఉంది. మరోవైపు.. వికెట్ కీపర్ బ్యాటర్గానూ సంజూ అదరగొడుతున్నాడు. ఎనిమిది మ్యాచ్లలో కలిపి అతడు 314 పరుగులు సాధించాడు. ముంబైతో మ్యాచ్లో సెంచరీ వీరుడు యశస్వి జైస్వాల్(60 బంతుల్లో 104)తో కలిసి సంజూ(28 బంతుల్లో 38) ఆఖరి వరకు అజేయంగా నిలిచి జట్టును విజయతీరాలకు చేర్చాడు. ఈ నేపథ్యంలో టీమిండియా స్పిన్ దిగ్గజం హర్భజన్ సింగ్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. ‘‘ఫామ్ తాత్కాలికం.. క్లాష్ శాశ్వతం అని యశస్వి జైస్వాల్ ఇన్నింగ్స్ మరోసారి నిరూపించింది. ఇక వికెట్ కీపర్ బ్యాటర్ గురించి ప్రత్యేకంగా చర్చ అవసరం లేదు. టీ20 ప్రపంచకప్ నేపథ్యంలో భారత జట్టులో నేరుగా అడుగుపెట్టే అర్హత అతడికి ఉంది. అంతేకాదు రోహిత్ శర్మ తర్వాత టీమిండియా తదుపరి కెప్టెన్గా సంజూ శాంసన్ ఎదుగుతాడనడంలో మీకేమైనా అనుమానాలున్నాయా?’’ అంటూ కేరళ బ్యాటర్ సంజూ శాంసన్ పొట్టి ఫార్మాట్లో టీమిండియా కెప్టెన్ కావాలని ఆకాంక్షించాడు. అసలు జట్టులో చోటు దక్కుతుంతా అన్న సందేహాల నడుమ ఊహించని విధంగా కెప్టెన్ కావాంటూ అంటూ కామెంట్ చేశడు. కాగా వరల్డ్కప్-2024 నేపథ్యంలో రిషభ్ పంత్, కేఎల్ రాహుల్, సంజూ శాంసన్ మధ్య పోటీ నెలకొన్న తరుణంలో భజ్జీ ఇలా సంజూకు ఓటు వేశాడు. మరి మీ ఓటు ఎవరికి?! Yashasvi Jaiswal’s knock is a proof of class is permanent . Form is temporary @ybj_19 and there shouldn’t be any debate about Keepar batsman . @IamSanjuSamson should walks in to the Indian team for T20 worldcup and also groomed as a next T20 captain for india after rohit . koi… — Harbhajan Turbanator (@harbhajan_singh) April 22, 2024 THAT 💯 moment! ☺️ Jaipur is treated with a Jaiswal special! 💗 Scorecard ▶️ https://t.co/Mb1gd0UfgA#TATAIPL | #RRvMI | @ybj_19 pic.twitter.com/i0OvhZKtGI — IndianPremierLeague (@IPL) April 22, 2024 -
T20 WC: సంజూ బాగా ఆడుతున్నాడు.. అయినా పంత్కే చోటివ్వాలి!
టీ20 ప్రపంచకప్-2024 భారత జట్టులో రిషభ్ పంత్కు చోటు ఇవ్వాలని ఆస్ట్రేలియా దిగ్గజం, ఢిల్లీ క్యాపిటల్స్ హెడ్ కోచ్ రిక్కీ పాంటింగ్ అన్నాడు. మెగా టోర్నీ ఆడే అర్హత పంత్కు ఉందని.. తన దృష్టిలో అతడే టీమిండియాకు మొదటి వికెట్ కీపర్ ఆప్షన్ అని పేర్కొన్నాడు. ఐపీఎల్-2024లో సత్తా చాటి కచ్చితంగా వరల్డ్కప్ ఆడే జట్టులో పంత్ చోటు దక్కించుకుంటాడని రిక్కీ పాంటింగ్ ధీమా వ్యక్తం చేశాడు. కాగా 2022, డిసెంబరులో కారు ప్రమాదానికి గురై.. అదృష్టవశాత్తూ ప్రాణాలతో బయటపడ్డ పంత్ కోలుకోవడానికి దాదాపు ఏడాదిన్నర కాలం పట్టింది. బెంగళూరులోని జాతీయ క్రికెట్ అకాడమీలో సుదీర్ఘకాలం పాటు పునరావాసం పొందిన పంత్.. క్రమక్రమంగా కోలుకుని మ్యాచ్ ఫిట్నెస్ సాధించాడు. ఈ క్రమంలో ఐపీఎల్ పదిహేడో ఎడిషన్లో ఢిల్లీ క్యాపిటల్స్ కెప్టెన్గా తిరిగి పగ్గాలు చేపట్టిన పంత్.. వికెట్ కీపర్ బ్యాటర్గానూ సేవలు అందిస్తున్నాడు. ఇప్పటి వరకు ఆరు ఇన్నింగ్స్ ఆడి 194 పరుగులు చేసిన పంత్ ఖాతాలో రెండు హాఫ్ సెంచరీలు ఉన్నాయి. అయితే.. కెప్టెన్గా మాత్రం పంత్ విఫలమవుతూనే ఉన్నాడు. అతడి సారథ్యంలో ఢిల్లీ ఇప్పటిదాకా ఆరు మ్యాచ్లు ఆడి కేవలం రెండే గెలిచింది. ఇదిలా ఉంటే.. మే 27న ఐపీఎల్-2024 ముగియనుండగా.. జూన్ 1 నుంచి వెస్టిండీస్- అమెరికా వేదికగా పొట్టి ప్రపంచకప్ సమరం మొదలుకానుంది. ఈ నేపథ్యంలో భారత జట్టు వికెట్ కీపర్ ఎంపిక గురించి రిక్కీ పాంటింగ్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. సంజూ బాగా ఆడుతున్నాడు.. అయినా పంత్కే చోటివ్వాలి! ‘‘వరల్డ్కప్ జట్టులో రిషభ్ పంత్కు చోటు ఇవ్వాలా? అంటే కచ్చితంగా ఇవ్వాలనే చెబుతా. ఐపీఎల్ ముగిసేలోపు అతడు అందుకు అర్హత సాధిస్తాడు. గత ఆరు సీజన్లలో పంత్ మెరుగ్గా ఆడాడు. టీమిండియా తరఫున కూడా మంచి ప్రదర్శన ఇచ్చాడు. భారత జట్టులో ప్రతిభావంతులైన ఆటగాళ్లకు కొదవలేదని తెలుసు. ముఖ్యంగా వికెట్ కీపర్ బ్యాటర్లలో ఇషాన్ కిషన్, సంజూ శాంసన్, కేఎల్ రాహుల్ బాగా ఆడుతున్నారు. చాలా ఆప్షన్లు కనిపిస్తున్నాయి. అయితే.. నేను గనుక జట్టును ఎంపిక చేయాల్సి వస్తే రిషభ్ పంత్కే మొదటి ప్రాధాన్యం ఇస్తాను. నన్నెపుడు ఈ ప్రశ్న అడిగినా ఇదే సమాధానం ఇస్తాను’’ అని రిక్కీ పాంటింగ్ చెప్పుకొచ్చాడు. కాగా వరల్డ్కప్-2024 టీమిండియా వికెట్ కీపర్ల రేసులో ప్రస్తుతం సంజూ శాంసన్ ముందుకు దూసుకుపోతున్నాడు. రాజస్తాన్ రాయల్స్ కెప్టెన్గా వ్యవహరిస్తున్న అతడు ఇప్పటి వరకు ఆరు ఇన్నింగ్స్లో కలిపి 264 పరుగులు సాధించాడు. చదవండి: #Pat Cummins: శెభాష్.. ఇది సరైన నిర్ణయం! కమిన్స్ అన్నతో అట్లుంటది మరి.. var request = 'https://www.sakshi.com/knowwidget/kwstr_7552012696.json'; $.ajaxPrefilter( function (request) { if (request.crossDomain && jQuery.support.cors) { var http = (window.location.protocol === 'http:' ? 'http:' : 'https:'); request.url = http + '//cors-anywhere.herokuapp.com/' + request.url; } }); $.get( request,function (response){ if(response == ''){ $('#frameId').hide(); }else{ $('#frameId').show(); } }); -
T20 WC: ఓపెనర్గా అతడు.. రింకూ, సంజూకు నో ఛాన్స్!
ఐపీఎల్-2024 తర్వాత పొట్టి ప్రపంచకప్ సమరం మొదలుకానుంది. మే 26 ఫైనల్తో క్యాష్ రిచ్ లీగ్ పదిహేడో ఎడిషన్కు తెరపడనుండగా.. జూన్ 1న టీ20 వరల్డ్కప్-2024కు తెరలేవనుంది. ఇక ఈ మెగా ఈవెంట్లో భారత జట్టు జూన్ 5న ఐర్లాండ్తో మ్యాచ్తో తమ ప్రయాణం మొదలుపెట్టనుంది. ఈ నేపథ్యంలో టీమిండియా మాజీ బ్యాటర్ మహ్మద్ కైఫ్ ఈ ఐసీసీ టోర్నీలో భారత తుదిజట్టు కూర్పుపై తన అభిప్రాయాలు పంచుకున్నాడు. రోహిత్తో పాటు ఓపెనర్ అతడే ‘‘రోహిత్ శర్మతో కలిసి యశస్వి జైస్వాల్ ఓపెనింగ్ చేస్తాడు. విరాట్ కోహ్లి నంబర్ 3, సూర్యకుమార్ యాదవ నంబర్ 4, హార్దిక్ పాండ్యా ఐదో నంబర్లో.. రిషబ్ పంత్ ఆరో స్థానంలో బ్యాటింగ్ చేయాలి. బ్యాటింగ్ డెప్త్ దృష్ట్యా నా జట్టులో ఆల్రౌండర్లకు కూడా అధిక ప్రాధాన్యం ఉంటుంది. కాబట్టి అక్షర్ పటేల్ ఏడు, రవీంద్ర జడేజా ఎనిమిదో స్థానంలో ఆడాలనుకుంటున్నా. ఆ తర్వాతి స్థానంలో నైపుణ్యాలున్న బౌలర్ కుల్దీప్ యాదవ్ బరిలోకి దిగాలి. పేసర్ల కోటాలో ఆ ఇద్దరు తర్వాత ఇద్దరు ఫాస్ట్ బౌలర్లు జస్ప్రీత్ బుమ్రా, అర్ష్దీప్ సింగ్లు రావాల్సి ఉంటుంది. ఇలా అయితే తుదిజట్టు కూర్పు సరిగ్గా ఉంటుందని భావిస్తున్నా’’ అని మహ్మద్ కైఫ్ స్టార్ స్పోర్ట్స్ షోలో పేర్కొన్నాడు. అయితే, అనూహ్యంగా తన ప్లేయింగ్ ఎలెవన్లో నయా ఫినిషర్ రింకూ సింగ్, ఐపీఎల్-2024లో సత్తా చాటుతున్న వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్కు కైఫ్ చోటివ్వకపోవడం గమనార్హం. బ్యాట్ ఝులిపించలేకపోతున్న జైస్వాల్ మహ్మద్ కైఫ్ ఎంచుకున్న తుదిజట్టులోని ఆటగాళ్లలో ఐపీఎల్-2024లో ఇప్పటి వరకు కోహ్లి 319 పరుగులతో టాప్ స్కోరర్గా ఉండగా.. జస్ప్రీత్ బుమ్రా 10 వికెట్లతో లీడింగ్ వికెట్ టేకర్గా కొనసాగుతున్నాడు. అయితే, యశస్వి జైస్వాల్ మాత్రం ఇంత వరకు ప్రభావం చూపలేదు. ఈ రాజస్తాన్ రాయల్స్ బ్యాటర్ ఇప్పటి వరకు ఐదు మ్యాచ్లలో కలిపి కేవలం 63 పరుగులు మాత్రమే చేశాడు. మరో ఓపెనింగ్ బ్యాటర్, గుజరాత్ టైటాన్స్ కెప్టెన్ శుబ్మన్ గిల్ మాత్రం 255 పరుగులతో దుమ్ములేపుతున్నాడు. ఇక వికెట్ కీపర్ కోటాలో సంజూ శాంసన్ 246 పరుగులతో పంత్ కంటే చాలా ముందున్నాడు. రింకూ సైతం కేకేఆర్పై ఫినిషర్గా తన వంతు పాత్ర పోషిస్తున్నాడు. కాగా ప్రపంచకప్ జట్టులో టీమిండియాను రోహిత్ శర్మనే ముందుకు నడిపిస్తాడని బీసీసీఐ ఇప్పటికే స్పష్టం చేసిన విషయం తెలిసిందే. చదవండి: గైక్వాడ్ ఈ ఒక్క ఏడాదే.. వచ్చే సీజన్లో CSK కెప్టెన్ అతడే! -
చరిత్ర సృష్టించిన శాంసన్.. రోహిత్ శర్మ 8 ఏళ్ల రికార్డు బద్దలు
ఐపీఎల్-2024లో రాజస్తాన్ రాయల్స్ కెప్టెన్ సంజూ శాంసన్ తన సూపర్ ఫామ్ను కొనసాగిస్తున్నాడు. ఈ మెగా ఈవెంట్లో భాగంగా జైపూర్ వేదికగా గుజరాత్ టైటాన్స్తో మ్యాచ్లో రాజస్తాన్ ఓటమి పాలైనప్పటకి.. సంజూ మాత్రం తన అద్బుత ఇన్నింగ్స్తో ఆకట్టుకున్నాడు. ఓవరాల్గా 38 బంతులు ఎదుర్కొన్న శాంసన్ 7 ఫోర్లు, 2 సిక్స్లతో 68 పరుగులు చేసి ఆజేయంగా నిలిచాడు. కాగా ఇది సంజూకు రాజస్తాన్ కెప్టెన్గా 50వ ఐపీఎల్ మ్యాచ్ కావడం గమనార్హం. తద్వారా శాంసన్ ఓ అరుదైన రికార్డును తన పేరిట లిఖించుకున్నాడు. ఐపీఎల్లో కెప్టెన్గా 50వ మ్యాచ్లో అత్యధిక వ్యక్తిగత స్కోర్ సాధించిన ఆటగాడిగా సంజూ నిలిచాడు. ఇప్పటివరకు ఈ రికార్డు ముంబై ఇండియన్స్ మాజీ కెప్టెన్ రోహిత్ శర్మ పేరిట ఉండేది. 2016లో అరుణ్ జైట్లీ స్టేడియంలో ఢిల్లీ క్యాపిటల్స్పై ముంబై ఇండియన్స్ సారథిగా రోహిత్ 48 బంతుల్లో 65 పరుగులు చేశాడు. అయితే తాజా మ్యాచ్తో 8 ఏళ్ల రోహిత్ రికార్డును శాంసన్ బ్రేక్ చేశాడు. శాంసన్, రోహిత్లతో పాటు గౌతమ్ గంభీర్ కూడా కెప్టెన్గా తన 50వ ఐపీఎల్ మ్యాచ్లో ఫిఫ్టీ సాధించాడు. అతను 2013లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుపై కేకేఆర్ కెప్టెన్గా 59 పరుగులు చేశాడు. కెప్టెన్గా 50వ ఐపీఎల్ మ్యాచ్లో అత్యధిక స్కోర్లు చేసింది వీరే.. 68* (38) - సంజు శాంసన్ (రాజస్తాన్) వర్సెస్ గుజరాత్, 2024 65 (48) - రోహిత్ శర్మ (ముంబై ఇండియన్స్)వర్సెస్ ఢిల్లీ, 2016 59 (46) - గౌతమ్ గంభీర్ (కేకేఆర్) వర్సెస్ ఆర్సీబీ, 2013 45 (33) - డేవిడ్ వార్నర్ (ఎస్ఆర్హెచ్) వర్సెస్ ఢిల్లీ క్యాపిటల్స్, 2021 var request = 'https://www.sakshi.com/knowwidget/kwstr_7522010156.json'; $.ajaxPrefilter( function (request) { if (request.crossDomain && jQuery.support.cors) { var http = (window.location.protocol === 'http:' ? 'http:' : 'https:'); request.url = http + '//cors-anywhere.herokuapp.com/' + request.url; } }); $.get( request,function (response){ if(response == ''){ $('#frameId').hide(); }else{ $('#frameId').show(); } }); -
సంజూ శాంసన్కు భారీ షాక్
IPL 2024 GT vs RR: ఓటమి బాధలో ఉన్న రాజస్తాన్ రాయల్స్ కెప్టెన్ సంజూ శాంసన్కు మరో భారీ షాక్ తగిలింది. ఐపీఎల్ నిర్వాహకులు అతడికి రూ. 12 లక్షల మేర జరిమానా విధించారు. కాగా సొంత మైదానం జైపూర్లో రాజస్తాన్ బుధవారం గుజరాత్ టైటాన్స్తో తలపడిన విషయం తెలిసిందే. టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన రాజస్తాన్ నిర్ణీత 20 ఓవర్లలో మూడు వికెట్లు నష్టపోయి 196 పరుగులు చేసింది. లక్ష్య ఛేదనలో ఆఖరి బంతికి గుజరాత్ టైటాన్స్ స్టార్ రషీద్ ఖాన్ ఫోర్ బాది తమ జట్టును గెలిపించాడు. ఫలితంగా ఐపీఎల్-2024 ఆరంభం నుంచి వరుసగా నాలుగు విజయాలు నమోదు చేసిన రాజస్తాన్ రాయల్స్ విజయపరంపరకు బ్రేక్ పడింది. అయితే, ఆఖరి వరకు ఉత్కంఠ రేపిన ఈ మ్యాచ్లో రాజస్తాన్ చేజేతులా మ్యాచ్ను చేజార్చుకుంది. The elegance of the Prince 🤌#RRvGT #IPLonJioCinema #TATAIPL pic.twitter.com/EzGEcv6Pk9 — JioCinema (@JioCinema) April 10, 2024 ఓవర్ రేటు విషయంలో నిర్దిష్ట సమయానికి ఐదు నిమిషాలు వెనుకబడి ఉండటంతో చివరి ఓవర్లో సర్కిల్ బయట ఓ ఫీల్డర్ను తక్కువగా ఉంచాల్సి వచ్చింది. ఫలితంగా స్వేచ్ఛగా బ్యాట్ ఝులిపించగలిగిన గుజరాత్ బ్యాటర్లు విజయానికి బాటలు వేసి.. పని పూర్తి చేశారు. 𝘾𝙧𝙞𝙨𝙞𝙨 𝙈𝙖𝙣 delivered yet again 😎 🎥 Relive the thrilling end to a thrilling @gujarat_titans win! Recap the match on @starsportsindia & @Jiocinema 💻 📱#TATAIPL | #RRvGT pic.twitter.com/eXDDvpToZ0 — IndianPremierLeague (@IPL) April 10, 2024 ఇక స్లో ఓవర్ రేటు కారణంగా రాజస్తాన్ రాయల్స్ కెప్టెన్ సంజూ శాంసన్కు పనిష్మెంట్ ఇచ్చారు ఐపీఎల్ నిర్వాహకులు. ‘‘ఐపీఎల్-2024లో జైపూర్లోని సవాయి మాన్ సింగ్ స్టేడియం వేదికగా గుజరాత్ టైటాన్స్తో మ్యాచ్లో.. స్లో ఓవర్ రేటు మెయింటెన్ చేసిన కారణంగా రాజస్తాన్ రాయల్స్ కెప్టెన్ సంజూ శాంసన్కు జరినామా విధిస్తున్నాం’’ అంటూ రూ. 12 లక్షలు ఫైన్ వేసింది. ఇది మొదటి తప్పిదం కావున ఈ మొత్తంతో సరిపెడుతున్నట్లు వెల్లడించింది. కాగా ఈ సీజన్లో గుజరాత్ టైటాన్స్ కెప్టెన్ శుబ్మన్ గిల్ ఒకసారి(రూ. 12 లక్షలు), ఢిల్లీ కెప్టెన్ రిషభ్ పంత్ రెండుసార్లు(24 లక్షలు, తుదిజట్టులోని ఆటగాళ్ల ఫీజులో 25 శాతం/ఆరు లక్షలు) జరిమానా బారిన పడ్డారు. చదవండి: #ShubmanGill: కొరకరాని కొయ్యలా సంజూ.. అంపైర్తో గొడవపడ్డ గిల్ var request = 'https://www.sakshi.com/knowwidget/kwstr_7522010156.json'; $.ajaxPrefilter( function (request) { if (request.crossDomain && jQuery.support.cors) { var http = (window.location.protocol === 'http:' ? 'http:' : 'https:'); request.url = http + '//cors-anywhere.herokuapp.com/' + request.url; } }); $.get( request,function (response){ if(response == ''){ $('#frameId').hide(); }else{ $('#frameId').show(); } }); -
అప్పటికప్పుడు ఫలితం తారుమారు.. అంపైర్తో గొడవపడ్డ గిల్
రాజస్తాన్ రాయల్స్తో మ్యాచ్ సందర్భంగా గుజరాత్ టైటాన్స్ కెప్టెన్ శుబ్మన్ గిల్ తీవ్ర అసహనానికి లోనయ్యాడు. థర్డ్ అంపైర్ వ్యవహరించిన తీరుపై విస్మయం వ్యక్తం చేశాడు. తమ విషయంలో ఎందుకిలా జరిగిందంటూ ఫీల్డ్ అంపైర్తో వాగ్వాదానికి దిగాడు. ఐపీఎల్-2024లో భాగంగా జైపూర్ వేదికగా రాజస్తాన్- గుజరాత్ జట్లు బుధవారం తలపడ్డాయి. టాస్ గెలిచిన గుజరాత్ తొలుత బౌలింగ్ ఎంచుకుని.. రాజస్తాన్ ఓపెనర్లు యశస్వి జైస్వాల్(24), జోస్ బట్లర్(8)లను తక్కువ స్కోరుకే కట్టడి చేసింది. అయితే, వన్డౌన్లో వచ్చిన కెప్టెన్ సంజూ శాంసన్(68- నాటౌట్), రియాన్ పరాగ్(76)తో కలిసి రాజస్తాన్ ఇన్నింగ్స్ చక్కదిద్దాడు. గుజరాత్ బౌలర్లకు కొరకరాని కొయ్యలా మారి ఆఖరి వరకు అజేయంగా నిలిచాడు. Fifty comes up for SANJU SAM5️⃣0️⃣N 💥#RRvGT #TATAIPL #IPLonJioCinema #IPLinMalayalam pic.twitter.com/Fxlr57hK6L — JioCinema (@JioCinema) April 10, 2024 నిర్ణయం మార్చుకున్న థర్డ్ అంపైర్ ఇదిలా ఉంటే.. రాజస్తాన్ ఇన్నింగ్స్లో గుజరాత్ బౌలర్ మోహిత్ శర్మ పదిహేడో ఓవర్ వేశాడు. ఐదో బంతిని అవుట్ సైడ్ ఆఫ్ దిశగా సంధించగా సంజూ షాట్ ఆడబోయి విఫలమయ్యాడు. ఈ క్రమంలో అంపైర్ ఆ బంతిని వైడ్గా ప్రకటించాడు. దీంతో కోపోద్రిక్తుడైన గుజరాత్ సారథి శుబ్మన్ గిల్ రివ్యూకు వెళ్లాడు. అయితే, తొలుత అది ఫెయిర్ డెలివరీ అని చెప్పిన థర్డ్ అంపైర్.. తర్వాత వైడ్గా ప్రకటించాడు. ఫలితంగా రాజస్తాన్ ఖాతాలో అదనపు పరుగు చేరింది. అప్పటికే బౌలర్లు ధారాళంగా పరుగులు ఇచ్చుకోవడంతో ఆగ్రహంగా ఉన్న గిల్.. ఈ వైడ్ విషయాన్ని తేలిగ్గా తీసుకోలేకపోయాడు. థర్డ్ అంపైర్ నిర్ణయంపై అసహనం వ్యక్తం చేస్తూ ఫీల్డ్ అంపైర్ వినోద్ శేషన్తో గొడవకు దిగాడు. వైడ్ గురించి చాలా సేపు అతడితో వాదించాడు. ఇందుకు సంబంధించిన దృశ్యాలు నెటిజన్లను ఆకర్షిస్తున్నాయి. Shubman Gill has grown well as leader ⭐ Loving this version 🩷pic.twitter.com/kaDnJTGX8N — Cricspace (@cricspace69) April 10, 2024 గుజరాత్దే పైచేయి.. రాజస్తాన్ జైత్రయాత్రకు బ్రేక్ ఇదిలా ఉంటే.. రాజస్తాన్ రాయల్స్ నిర్ణీత 20 ఓవర్లలో మూడు వికెట్ల నష్టానికి 196 పరుగులు చేసింది. గిల్ కెప్టెన్ ఇన్నింగ్స్(72), ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ రషీద్ ఖాన్ ధనాధన్ ఇన్నింగ్స్(11 బంతుల్లో 24 నాటౌట్) కారణంగా గుజరాత్.. రాజస్తాన్ విధించిన లక్ష్యాన్ని ఛేదించింది. ఆఖరి బంతికి రషీద్ ఖాన్ ఫోర్ బాదడంతో.. మూడు వికెట్ల తేడాతో గుజరాత్ టైటాన్స్ గెలుపు నమోదు చేసింది. var request = 'https://www.sakshi.com/knowwidget/kwstr_7552012696.json'; $.ajaxPrefilter( function (request) { if (request.crossDomain && jQuery.support.cors) { var http = (window.location.protocol === 'http:' ? 'http:' : 'https:'); request.url = http + '//cors-anywhere.herokuapp.com/' + request.url; } }); $.get( request,function (response){ if(response == ''){ $('#frameId').hide(); }else{ $('#frameId').show(); } }); చదవండి: #Sanju: మాట్లాడలేకపోతున్నా.. అతడి వల్లే ఓటమి.. ఆ ఒక్క బంతి..! RASHID KHAN PUTS A HALT ON RR'S WINNING STREAK 🔥🔥#RRvGT #IPLonJioCinema #TATAIPL pic.twitter.com/EdbdG9dG8o — JioCinema (@JioCinema) April 10, 2024 -
#Sanju: మాట్లాడలేకపోతున్నా.. అతడి వల్లే ఓటమి.. ఆ ఒక్క బంతి..!
ఐపీఎల్-2024లో రాజస్తాన్ రాయల్స్కు తొలిసారి ఓటమి ఎదురైంది. వరుసగా నాలుగు మ్యాచ్లలో గెలుపొంది జోరు మీదున్న సంజూ సేనకు గుజరాత్ టైటాన్స్ అడ్డుకట్ట వేసింది. రాయల్స్ను వారి తమ సొంత మైదానంలోనే ఓడించి మూడు వికెట్ల తేడాతో విజయం సాధించింది. ఇక తమ జైత్రయాత్రకు బ్రేక్ పడటంపై రాజస్తాన్ రాయల్స్ కెప్టెన్ సంజూ శాంసన్ విచారం వ్యక్తం చేశాడు. ఆఖరి బంతికి ఫలితం తారుమారైందంటూ ఉద్వేగానికి లోనయ్యాడు. ఏదేమైనా గుజరాత్ టైటాన్స్ అద్భుతంగా ఆడి మ్యాచ్ను తమ నుంచి లాగేసుకుందని పేర్కొన్నాడు. మాట్లాడలేకపోతున్నా.. అక్కడే ఓడిపోయాం ఈ మేరకు ఓటమి అనంతరం సంజూ శాంసన్ మాట్లాడుతూ.. ‘‘మ్యాచ్ చివరి బంతికి మ్యాచ్ మా చేజారింది. మ్యాచ్ ఓడిన కెప్టెన్గా ఇలాంటి సమయంలో మాట్లాడటం కష్టంగా ఉంది. భావోద్వేగాలు అదుపులోకి వస్తే గానీ నేను చెప్పాలనుకున్నది స్పష్టంగా చెప్పలేను. ఏదేమైనా గుజరాత్ టైటాన్స్కు క్రెడిట్ ఇవ్వాల్సిందే. ఆఖరి నిమిషం వరకు ఇరు జట్ల మధ్య విజయం ఊగిసలాడటమనేది ఈ టోర్నీకి ఉన్న ప్రత్యేకత. ఇది మా బౌలర్ల తప్పే మేము తప్పుల నుంచి పాఠాలు నేర్చుకుని ముందుకు సాగాల్సిన సమయం. నిజానికి నేను బ్యాటింగ్ చేస్తున్న సమయంలో.. 180 మంచి స్కోరే అనుకున్నా. అయితే, మేము లక్కీగా 196 పరుగులు చేశాం. కచ్చితంగా అది విన్నింగ్ స్కోరే. పిచ్పై తేమ లేదు కాబట్టి మా బౌలింగ్ విభాగం పనిపూర్తి చేయాల్సింది. జైపూర్లో 197.. తేమ లేని వికెట్పై డిఫెండ్ చేయడం అంత కష్టమేమీ కాదు’’ అంటూ బౌలర్ల వైఫల్యాన్ని ఎత్తిచూపాడు. రాణించిన సంజూ, రియాన్ పరాగ్ కాగా జైపూర్లో బుధవారం జరిగిన మ్యాచ్లో టాస్ ఓడిన రాజస్తాన్ రాయల్స్ తొలుత బ్యాటింగ్ చేసింది. ఓపెనర్లు యశస్వి జైస్వాల్(24), జోస్ బట్లర్(8) నామమాత్రపు స్కోర్లకు పరిమితం కాగా.. వన్డౌన్ బ్యాటర్ సంజూ శాంసన్ కెప్టెన్ ఇన్నింగ్స్ ఆడాడు. Fifty comes up for SANJU SAM5️⃣0️⃣N 💥#RRvGT #TATAIPL #IPLonJioCinema #IPLinMalayalam pic.twitter.com/Fxlr57hK6L — JioCinema (@JioCinema) April 10, 2024 మొత్తంగా 38 బంతులు ఎదుర్కొని 7 ఫోర్లు, 2 సిక్స్ల సాయంతో 68 పరుగులతో ఆఖరి వరకు అజేయంగా నిలిచాడు. ఇక నాలుగో నంబర్ బ్యాటర్ రియాన్ పరాగ్ మరోసారి సుడిగాలి ఇన్నింగ్స్(48 బంతుల్లో 76)తో అదరగొట్టాడు. Caution ⚠ It's Riyan Parag demolition on display 🔥💥#RRvGT #IPLonJioCinema #TATAIPL pic.twitter.com/dzKuPfTS0Q — JioCinema (@JioCinema) April 10, 2024 అంతా రషీద్ ఖాన్ వల్లే ఆఖర్లో హెట్మెయిర్ మెరుపులు(5 బంతుల్లో 13- నాటౌట్) మెరిపించగా.. రాజస్తాన్ నిర్ణీత 20 ఓవర్లలో మూడు వికెట్ల నష్టానికి 196 పరుగులు చేసింది. ఇక లక్ష్య ఛేదనలో ఆరంభం నుంచే తడబడ్డప్పటికీ గుజరాత్ ఆఖరి బంతి వరకు పోరాడి విజయాన్ని అందుకుంది. శుబ్మన్ గిల్(72) కెప్టెన్ ఇన్నింగ్స్ ఆడగా.. ‘ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్’ రషీద్ ఖాన్(11 బంతుల్లో 24- నాటౌట్) రాజస్తాన్ను గెలుపునకు దూరం చేశాడు. ఆవేశ్ ఖాన్ బౌలింగ్లో ఆఖరి బంతికి రెండు పరుగులు అవసరం కాగా.. ఏకంగా ఫోర్ బాది గుజరాత్ను విజయతీరాలకు చేర్చాడు. The elegance of the Prince 🤌#RRvGT #IPLonJioCinema #TATAIPL pic.twitter.com/EzGEcv6Pk9 — JioCinema (@JioCinema) April 10, 2024 రాజస్తాన్ వర్సెస్ గుజరాత్ స్కోర్లు ►రాజస్తాన్: 196/3 (20) ►గుజరాత్: 199/7 (20) ►ఫలితం: మూడు వికెట్ల తేడాతో రాజస్తాన్పై గుజరాత్ టైటాన్స్ విజయం. 𝘾𝙧𝙞𝙨𝙞𝙨 𝙈𝙖𝙣 delivered yet again 😎 🎥 Relive the thrilling end to a thrilling @gujarat_titans win! Recap the match on @starsportsindia & @Jiocinema 💻 📱#TATAIPL | #RRvGT pic.twitter.com/eXDDvpToZ0 — IndianPremierLeague (@IPL) April 10, 2024 var request = 'https://www.sakshi.com/knowwidget/kwstr_7522010156.json'; $.ajaxPrefilter( function (request) { if (request.crossDomain && jQuery.support.cors) { var http = (window.location.protocol === 'http:' ? 'http:' : 'https:'); request.url = http + '//cors-anywhere.herokuapp.com/' + request.url; } }); $.get( request,function (response){ if(response == ''){ $('#frameId').hide(); }else{ $('#frameId').show(); } }); చదవండి: IPL 2024: కొంపముంచిన స్లో ఓవర్ రేట్.. గుజరాత్ సంచలన విజయం -
IPL 2024 RR VS GT: శివాలెత్తిన సంజూ శాంసన్
ఐపీఎల్ 2024లో భాగంగా గుజరాత్ టైటాన్స్తో ఇవాళ (ఏప్రిల్ 10) జరుగుతున్న మ్యాచ్లో రాజస్థాన్ రాయల్స్ కెప్టెన్ సంజూ శాంసన్ అద్భుతమైన ఇన్నింగ్స్ ఆడాడు. ఈ మ్యాచ్లో శాంసన్ శివాలెత్తిపోయి మెరుపు హాఫ్ సెంచరీ బాదాడు. 31 బంతుల్లో 6 ఫోర్లు, సిక్సర్ సాయంతో హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్న సంజూ.. ప్రస్తుత సీజన్లో మూడో అర్దశతకాన్ని నమోదు చేశాడు. తొలుత లక్నోతో జరిగిన మ్యాచ్లో 52 బంతుల్లో అజేయమైన 82 పరుగులు చేసిన సంజూ.. ఆతర్వాత ఆర్సీబీపై 42 బంతుల్లో 69.. తాజాగా గుజరాత్పై 38 బంతుల్లో 68 పరుగులు చేసి అజేయంగా నిలిచాడు. ఈ సీజన్లో భీకరఫామ్లో ఉన్న సంజూ.. 5 మ్యాచ్ల్లో 157.69 స్టయిక్రేట్తో 82 సగటున 246 పరుగులు చేసి, విరాట్ (316), రియాన్ల (261) తర్వాత సీజన్ మూడో లీడింగ్ రన్స్కోరర్గా నిలిచాడు. గుజరాత్తో మ్యాచ్లో సంజూతో పాటు రియాన్ పరాగ్ (48 బంతుల్లో 76; 3 ఫోర్లు, 5 సిక్సర్లు) కూడా చెలరేగడంతో టాస్ ఓడి తొలుత బ్యాటింగ్కు దిగిన రాజస్థాన్ నిర్ణీత ఓవర్లలో 3 వికెట్ల నష్టానికి 196 పరుగులు చేసింది. రాజస్థాన్ ఇన్నింగ్స్లో యశస్వి 24, బట్లర్ 8, హెట్మైర్ 13 (నాటౌట్) పరుగులు చేశారు. ఉమేశ్ యాదవ్, రషీద్ ఖాన్, మోహిత్ శర్మ తలో వికెట్ తీశారు. టార్గెట్ 197.. ఆచితూచి ఆడుతున్న గుజరాత్ రాజస్థాన్ నిర్దేశించిన 197 పరుగుల భారీ లక్ష్య ఛేదనలో గుజరాత్ ఆచితూచి ఆడుతుంది. 5 ఓవర్ల తర్వాత ఆ జట్టు స్కోర్ 30/0గా ఉంది. సాయి సుదర్శన్ (19), శుభ్మన్ గిల్ (11) క్రీజ్లో ఉన్నారు. -
రాజస్థాన్పై గుజరాత్ సంచలన విజయం
రాజస్థాన్పై గుజరాత్ సంచలన విజయం రాజస్థాన్పై గుజరాత్ సంచలన విజయం సాధించింది. స్లో ఓవర్ రేట్ కారణంగా ఈ మ్యాచ్లో రాజస్థాన్ ఓటమిపాలైంది. రాయల్స్ నిర్దిష్ట సమయానికి (వర్ రేట్లో) ఐదు నిమిషాలు వెనుకబడి ఉండటంతో సర్కిల్ బయట ఓ ఫీల్డర్ను తక్కువగా ఉంచాల్సి వచ్చింది. ఇదే రాజస్థాన్ ఓటమికి కారణమైంది. చివరి ఓవర్లో గుజరాత్ గెలుపుకు 6 బంతుల్లో 15 పరుగులు అవసరం కాగా.. సర్కిల్ బయట ఓ ఫీల్డర్ తక్కువగా ఉండటంతో గుజరాత్ బ్యాటర్లు ఫ్రీగా షాట్లు ఆడి గెలుపుకు కావాల్సిన పరుగులు రాబట్టారు. ఈ ఓవర్లో గుజరాత్ బ్యాటర్లు సర్కిల్ పై నుంచి సులువుగా షాట్లు ఆడి మూడు బౌండరీలు సాధించారు. ఇన్నింగ్స్ చివరి బంతికి రషీద్ ఖాన్ ఫోర్ కొట్టి గుజరాత్ను గెలిపించాడు. ఈ మ్యాచ్లో టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన రాజస్థాన్.. రియాన్ పరాగ్ (48 బంతుల్లో 76; 3 ఫోర్లు, 5 సిక్సర్లు), సంజూ శాంసన్ (38 బంతుల్లో 68 నాటౌట్; 7 ఫోర్లు, 2 సిక్సర్లు) మెరుపులు మెరిపించడంతో నిర్ణీత ఓవర్లలో 3 వికెట్ల నష్టానికి 196 పరుగుల భారీ స్కోర్ చేసింది. రాజస్థాన్ ఇన్నింగ్స్లో యశస్వి 24, బట్లర్ 8, హెట్మైర్ 13 (నాటౌట్) పరుగులు చేశారు. ఉమేశ్ యాదవ్, రషీద్ ఖాన్, మోహిత్ శర్మ తలో వికెట్ తీశారు. అనంతరం భారీ లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన గుజరాత్ను రాహుల్ తెవాతియా (22), రషీద్ ఖాన్ (24 నాటౌట్) సంచలన ఇన్నింగ్స్లు ఆడి గెలిపించారు. ఈ ఇద్దరు ఆఖరి రెండు ఓవర్లలో 37 పరుగులు రాబట్టి రాజస్థాన్కు గెలుపును దూరం చేశారు. గుజరాత్ ఇన్నింగ్స్కు తొలుత సాయి సుదర్శన్ (35), శుభ్మన్ గిల్ (72) గట్టి పునాది వేశారు. కుల్దీప్ సేన్ (4-0-41-3), చహల్ (4-0-43-2) రాణించినప్పటికీ రాజస్థాన్కు ఓటమి తప్పలేదు. చహల్ ఉచ్చులో ఇరుక్కున్న గిల్ చహల్ తెలివిగా వైడ్ వేసిన బంతిని ముందుకు వచ్చి ఆడే క్రమంలో శుభ్మన్ గిల్ (720 స్టంప్ ఔటయ్యాడు. చహల్ తెలివిగా ప్లాన్ వేసి గిల్ను పెవిలియన్కు పంపాడు. 15.2 ఓవర్ల తర్వాత గుజరాత్ స్కోర్ 133/5గా ఉంది. తెవాతియా, షారుక్ ఖాన్ క్రీజ్లో ఉన్నారు. నాలుగో వికెట్ కోల్పోయిన గుజరాత్ 111 పరుగుల వద్ద గుజరాత్ నాలుగో వికెట్ కోల్పోయింది. చహల్ బౌలింగ్లో విజయ్ శంకర్ (16) క్లీన్ బౌల్డ్ అయ్యాడు. 14 ఓవర్ల తర్వాత గుజరాత్ స్కోర్ 111/4గా ఉంది. గిల్ (52), తెవాతియా క్రీజ్లో ఉన్నారు. నిప్పులు చెరుగుతున్న కుల్దీప్ సేన్ ఈ మ్యాచ్లో కుల్దీప్ సేన్ నిప్పులు చెరుగుతున్నాడు. 9వ ఓవర్లో తొలి వికెట్ తీసన సేన్.. 11వ ఓవర్లో మరో రెండు వికెట్లు పడగొట్టాడు. 11వ ఓవర్లో తొలుత వేడ్ను బౌల్డ్ చేసిన సేన్.. నాలుగో బంతికి అభినవ్ మనోహర్కు కూడా క్లీన్ బౌల్డ్ చేశాడు. రెండో వికెట్ కోల్పోయిన గుజరాత్ 10.1 ఓవర్: వర్షం ఆగిపోయాక తొలి బంతికే మాథ్యూ వేడ్ (4) ఔటయ్యాడు. కుల్దీప్ సేన్ బౌలింగ్లో వేడ్ క్లీన్ బౌల్డ్ అయ్యాడు. వర్షం అంతరాయం 10 ఓవర్ల అనంతరం వర్షం అంతరాయం కలిగించడంతో మ్యాచ్ను పాక్షికంగా నిలిపివేశారు. ఈ సమయంలో జట్టు స్కోర్ 77/1గా ఉంది. మాథ్యూ వేడ్ (4), గిల్ (36) క్రీజ్లో ఉన్నారు. ఈ మ్యాచ్లో గుజరాత్ గెలవాలంటే 60 బంతుల్లో 120 పరుగులు చేయాల్సి ఉంది. తొలి వికెట్ కోల్పోయిన గుజరాత్ 8.2 ఓవర్: 64 పరుగుల వద్ద గుజరాత్ తొలి వికెట్ కోల్పోయింది. కుల్దీప్ సేన్ బౌలింగ్లో సాయి సుదర్శన్ (35) ఎల్బీడబ్ల్యూ అయ్యాడు. మాథ్యూ వేడ్ గిల్తో (28) జత కట్టాడు. గేర్ మార్చిన గిల్ 5 ఓవర్ల వరకు ఆచితూచి ఆడిన గిల్.. ఆతర్వాత గేర్ మార్చి ఆడుతున్నాడు. 8 ఓవర్ల అనంతరం గుజరాత్ స్కోర్ 63/0గా ఉంది. గిల్ 35, సాయి సుదర్శన్ 27 పరుగులతో క్రీజ్లో ఉన్నారు. టార్గెట్ 197.. ఆచితూచి ఆడుతున్న గుజరాత్ 197 పరుగుల భారీ లక్ష్య ఛేదనలో గుజరాత్ ఆచితూచి ఆడుతుంది. 5 ఓవర్ల తర్వాత ఆ జట్టు స్కోర్ 30/0గా ఉంది. సాయి సుదర్శన్ (19), శుభ్మన్ గిల్ (11) క్రీజ్లో ఉన్నారు. రియాన్, సంజూ మెరుపులు.. రాజస్థాన్ భారీ స్కోర్ రియాన్ పరాగ్ (48 బంతుల్లో 76; 3 ఫోర్లు, 5 సిక్సర్లు), సంజూ శాంసన్ (38 బంతుల్లో 68 నాటౌట్; 7 ఫోర్లు, 2 సిక్సర్లు) మెరుపులు మెరిపించడంతో రాజస్థాన్ జట్టు నిర్ణీత ఓవర్లలో 3 వికెట్ల నష్టానికి 196 పరుగులు చేసింది. రాజస్థాన్ ఇన్నింగ్స్లో యశస్వి 24, బట్లర్ 8, హెట్మైర్ 13 (నాటౌట్) పరుగులు చేశారు. ఉమేశ్ యాదవ్, రషీద్ ఖాన్, మోహిత్ శర్మ తలో వికెట్ తీశారు. రియాన్ పరాగ్ ఔట్ 18.4 ఓవర్: 172 పరుగుల వద్ద రాజస్థాన్ మూడో వికెట్ కోల్పోయింది. మోహిత్ శర్మ బౌలింగ్లో విజయ్ శంకర్కు క్యాచ్ ఇచ్చి రియాన పరాగ్ (76) ఔటయ్యాడు. హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్న శాంసన్ సంజూ శాంసన్ 31 బంతుల్లో 6 ఫోర్లు, సిక్సర్ సాయంతో హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. 18 ఓవర్ల తర్వాత రాజస్థాన్ స్కోర్ 162/2గా ఉంది. రియాన్ (68), శాంసన్ (58) క్రీజ్లో ఉన్నారు. రియాన్ పరాగ్ విధ్వంసం.. మరో మెరుపు హాఫ్ సెంచరీ ప్రస్తుత ఐపీఎల్ సీజన్లో రియాన్ పరాగ్ భీకర ఫామ్ను కొనసాగిస్తున్నాడు. గుజరాత్తో మ్యాచ్లో రియాన్ మరో మెరుపు అర్దశతకం బాదాడు. 34 బంతుల్లో 2 ఫోర్లు, 4 సిక్సర్ల సాయంతో అర్దశతకాన్ని పూర్తి చేశాడు. రియాన హాఫ్ సెంచరీ మార్కును సిక్సర్తో అందుకున్నాడు. 15 ఓవర్ల తర్వాత రాజస్థాన్ స్కోర్ 134/2. రియాన్ పరాగ్ (36 బంతుల్లో 56; 2 ఫోర్లు, 4 సిక్సర్లు), సంజూ శాంసన్ (25 బంతుల్లో 44; 5 ఫోర్లు, సిక్స్) క్రీజ్లో ఉన్నారు. రెండో వికెట్ డౌన్.. బట్లర్ను బోల్తా కొట్టించిన రషీద్ ఖాన్ 5.5 ఓవర్: 42 పరుగుల వద్ద రాజస్థాన్ రెండో వికెట్ కోల్పోయింది. రషీద్ ఖాన్ బౌలింగ్లో తెవాతియాకు క్యాచ్ ఇచ్చి జోస్ బట్లర్ (8) ఔటయ్యాడు. తొలి వికెట్ కోల్పోయిన రాజస్థాన్..యశస్వి ఔట్ 4.2 ఓవర్: 32 పరుగుల వద్ద రాజస్థాన్ రాయల్స్ తొలి వికెట్ కోల్పోయింది. ఉమేశ్ యాదవ్ బౌలింగ్లో మాథ్యూ వేడ్కు క్యాచ్ ఇచ్చి యశస్వి జైస్వాల్ (24) ఔటయ్యాడు. టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకున్న గుజరాత్ దాదాపు అర్ద గంట తర్వాత టాస్ పడింది. గుజరాత్ కెప్టెన్ శుభ్మన్ గిల్ టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకున్నాడు. ఈ మ్యాచ్ కోసం గుజరాత్ రెండు మార్పులు, రాజస్థాన్ ఓ మార్పు చేసింది. కేన్ విలియమ్సన్, బీఆర్ శరత్ స్థానాల్లో మథ్యూ వేడ్, అభినవ్ మనోహర్ గుజరాత్ తుది జట్టులోకి వచ్చారు. రాజస్థాన్ జట్టులో నండ్రే బర్గర్ స్థానంలో నవ్దీప్ సైనీ తుది జట్టులోకి వచ్చాడు. తుది జట్లు.. రాజస్థాన్ రాయల్స్: యశస్వి జైస్వాల్, జోస్ బట్లర్, సంజు శాంసన్ (కెప్టెన్/వికెట్కీపర్), రియాన్ పరాగ్, షిమ్రాన్ హెట్మెయర్, ధ్రువ్ జురెల్, రవిచంద్రన్ అశ్విన్, ట్రెంట్ బౌల్ట్, అవేష్ ఖాన్, యుజ్వేంద్ర చాహల్, నవ్దీప్ సైనీ గుజరాత్ టైటాన్స్: శుభ్మన్ గిల్ (కెప్టెన్), సాయి సుదర్శన్, మాథ్యూ వేడ్ (వికెట్కీపర్), అభినవ్ మనోహర్, విజయ్ శంకర్, రాహుల్ తెవాటియా, రషీద్ ఖాన్, స్పెన్సర్ జాన్సన్, దర్శన్ నల్కండే, నూర్ అహ్మద్, మోహిత్ శర్మ ► టాస్ 7:25.. మ్యాచ్ 7:40కి ప్రారంభమయ్యే అవకాశం Toss at 7.25 pm IST and start of the play at 7.40 pm IST. pic.twitter.com/e7Syu4jUKS — Johns. (@CricCrazyJohns) April 10, 2024 ► వర్షం కారణంగా టాస్ ఆలస్యం Toss has been delayed due to rain at Jaipur. pic.twitter.com/AWssSQxxHX — Johns. (@CricCrazyJohns) April 10, 2024 ఐపీఎల్ 2024 సీజన్లో ఇవాళ (ఏప్రిల్ 10) మరో ఆసక్తికర సమరం జరుగనుంది. ఈ సీజన్లో ఇప్పటిదాకా అపజయం ఎరుగని రాజస్థాన్ రాయల్స్ను అరకొర విజయాలు సాధించిన గుజరాత్ టైటాన్స్ ఢీకొట్టనుంది. రాయల్స్ సొంత మైదానమైన సువాయ్ మాన్సింగ్ స్టేడయంలో (జైపూర్) రాత్రి 7:30 గంటలకు ఈ మ్యాచ్ ప్రారంభంకానుంది. ప్రస్తుత సీజన్లో రాయల్స్ నాలుగు మ్యాచ్ల్లో నాలుగు విజయాలు సాధించి, పాయింట్ల పట్టికలో అగ్రస్థానంలో ఉండగా.. గుజరాత్ 5 మ్యాచ్ల్లో రెండు విజయాలు సాధించి ఏడో స్థానంలో కొనసాగుతుంది. -
ముంబైపై విజయానికి కారణం అదే: సంజూ ఆసక్తికర వ్యాఖ్యలు
ఐపీఎల్-2024లో హ్యాట్రిక్ విజయాలతో జోష్లో ఉన్నాడు రాజస్తాన్ రాయల్స్ కెప్టెన్ సంజూ శాంసన్. ఇప్పటి వరకు ఆడిన మూడు మ్యాచ్లలో రాయల్స్ను గెలిపించి పట్టికలో అగ్రస్థానంలో నిలిపాడు.కాగా ఈ ఎడిషన్లో తొలుత లక్నో సూపర్ జెయింట్స్.. అనంతరం ఢిల్లీ క్యాపిటల్స్పై.. తాజాగా ముంబై ఇండియన్స్పై గెలుపొందింది రాజస్తాన్ రాయల్స్. వీటిలో ముంబైపై విజయం రాయల్స్కు ప్రత్యేకం. ఎందుకంటే ముంబైతో గత ఐదు మ్యాచ్లలో ఒక్కసారి మాత్రమే గెలిచిన రాజస్తాన్.. ఆరో మ్యాచ్లో గెలిచి ఎట్టకేలకు అంతరాన్ని తగ్గించుకోగలిగింది.ముంబైని సొంత మైదానంలోనే ఓడించి సత్తా చాటింది. ఈ నేపథ్యంలో విజయానంతరం సంజూ శాంసన్ మాట్లాడుతూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. టాస్ గెలవడం తమ విజయానికి దోహదం చేసిందని పేర్కొన్నాడు.The @rajasthanroyals made it three out of three in #TATAIPL 2024 with an impressive 6-wicket win at the Wankhede Stadium 🏟️👏Recap the #MIvRR clash 🎥🔽 pic.twitter.com/Xzq9qpVITY— IndianPremierLeague (@IPL) April 2, 2024‘‘ఈ మ్యాచ్లో టాస్ గేమ్ చేంజర్. ఈ వికెట్పై తొలుత బ్యాటింగ్ చేయడం కష్టమే. తమ అనుభవంతో బౌల్ట్, బర్గర్ మా పని సులువు చేశారు. 10- 15 ఏళ్లుగా ఆడుతున్న బౌల్ట్ కొత్త బంతితో ఏం చేయగలడో మరోసారి నిరూపించాడు. ఆరంభంలోనే 4-5 వికెట్లు పడాలని కోరుకోవడం అతిశయోక్తి లాంటిదే. అయితే.. మా బౌలర్లు మా అంచనాలను నిజం చేశారు. మా జట్టులో ప్రతి ఒక్కరికి తమ పాత్ర ఏమిటో తెలుసు. అశ్, చహల్ కీలక సమయంలో వికెట్లు తీస్తారు. గత మూడేళ్లుగా అద్భుతంగా రాణిస్తున్న చహల్.. ఈసారి మరింత గొప్పగా ఆడేందుకు శాయశక్తులా కృషి చేస్తున్నాడు’’ అని రాజస్తాన్ బౌలర్లపై ప్రశంసలు కురిపించాడు..@rajasthanroyals’ Lethal Start 🔥They run through #MI’s top order courtesy Trent Boult & Nandre Burger 👏After 7 overs, it is 58/4Watch the match LIVE on @JioCinema and @StarSportsIndia 💻📱#TATAIPL | #MIvRR pic.twitter.com/mEUocuD0EV— IndianPremierLeague (@IPL) April 1, 2024కాగా ఈ మ్యాచ్లో టాస్ గెలిచి తొలుత బౌలింగ్ చేసిన రాజస్తాన్.. ముంబై ఇండియన్స్ను 125 పరుగులకు కట్టడి చేసింది. ట్రెంట్ బౌల్ట్(3/22) అద్భుత స్పెల్తో ఆకట్టుకోగా.. చహల్ పొదుపుగా బౌలింగ్ చేసి సత్తా చాటాడు. నాలుగు ఓవర్ల కోటాలో కేవలం 11 పరుగులే ఇచ్చి మూడు వికెట్లు తీశాడు. నండ్రీ బర్గర్ రెండు వికెట్లు తన ఖాతాలో వేసుకోగా.. ఆవేశ్ ఖాన్ ఒక వికెట్ పడగొట్టాడు.ఇక సంజూ శాంసన్ బ్యాటర్గా ఈ మ్యాచ్లో విఫలమయ్యాడు. 10 బంతులు ఎదుర్కొని కేవలం 12 పరుగులే చేశాడు. రియాన్ పరాగ్ అద్భుత అజేయ అర్ధ శతకం(39 బంతుల్లో 54)తో రాజస్తాన్ను గెలిపించాడు. ఆరు వికెట్ల తేడాతో ముంబైని ఓడించిన రాజస్తాన్ రాయల్స్ తదుపరి.. శనివారం నాటి మ్యాచ్లో ఆర్సీబీతో తలపడనుంది.
Pagination
ఓటర్ మిత్రమా.. జాగ్రత్త! ఆ సౌండ్ వస్తేనే మీరు ఓటేసినట్టు!
ఇది కదా క్రేజ్ అంటే.. సీఎం జగన్ ఇంటర్వ్యూకి మిలియన్ల వ్యూస్
Sakshi.com ఇప్పుడు సరికొత్తగా మీ ముందుకు
కాపులు, ముస్లింలకు రిజర్వేషన్లు అక్కర్లేదు: పవన్కళ్యాణ్
రైతు కుమార్తె విజయం.. రిషబ్ శెట్టి అభినందనలు
పులివెందుల ప్రజలకు ఇద్దరిపైనా ప్రేమే: వైఎస్ భారతి
RCB Vs PBKS: కోహ్లి అరుదైన రికార్డు.. ఐపీఎల్ చరిత్రలోనే తొలి క్రికెటర్గా
Phone Tapping Case: ఫోన్ ట్యాపింగ్ కేసులో బిగ్ ట్విస్ట్..
బిజీగా ఉండటం ఇంత డేంజరా! హెచ్చరిస్తున్న సైకాలజిస్ట్లు
కారులో వాసన బాగుందని తెగ పీల్చుకుంటున్నారా.?
తప్పక చదవండి
- తొమ్మిది సీట్లు పక్కా.. ఒకటి ఎక్స్ట్రా!
- మాచర్లలో ఉద్రిక్తత.. పిన్నెల్లిపై టీడీపీ శ్రేణుల మూక దాడి
- బీజేపీ అభ్యర్థి మాధవీ లతపై కేసు నమోదు
- ఐబీవీ, ఆర్పీ ఠాకూర్లపై ఈసీకి వైఎస్సార్సీపీ ఫిర్యాదు!
- పోలింగ్ ఏజెంట్లను బూత్లలోకి రానివ్వడం లేదు: దిలీప్ ఘోష్
- ఎయిర్ ఫోర్స్ మాజీ చీఫ్ సతీమణి ఓటు గల్లంతు
- AP Assembly Election 2024: ఎన్టీఆర్ షర్ట్పై నెట్టింట రచ్చ!
- జగనన్నకు కృతజ్ఞతతో.. దివ్యాంగురాలి మాటలు వింటే..
- అందుకే శిల్పా రవికి మద్దతు ఇచ్చాను: అల్లు అర్జున్
- Watch: కుటుంబ సభ్యులతో కలిసి ఓటేసిన సీఎం జగన్
Advertisement