breaking news
Sanju Samson
-
'ధోని, రుతురాజ్ కాదు.. అతడే సీఎస్కే బ్యాక్ బోన్'
టీ20 వరల్డ్కప్-2026లో సంచలన ప్రదర్శన కనబరిచిన టీమిండియా వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్.. ఇప్పుడు ఐపీఎల్లో సత్తాచాటేందుకు సిద్దమవుతున్నాడు. తన అరంగేట్రం నుంచి గత సీజన్ వరకు రాజస్తాన్ రాయల్స్కు ప్రాతినిథ్యం వహించిన సంజూ, ఈసారి చెన్నై సూపర్ కింగ్స్ తరపున ఆడనున్నాడు. ఐపీఎల్-2026 సీజన్కు ముందు సీఎస్కే ఫ్రాంచైజీ సంజూను రాజస్తాన్ నుంచి ట్రేడ్ చేసుకుంది. అందుకోసం చెన్నై ఏకంగా స్టార్ ప్లేయర్లు రవీంద్ర జడేజా, సామ్ కుర్రాన్లను వదులుకుంది. ఈ నేపథ్యంలో శాంసన్పై భారత మాజీ క్రికెటర్ సుబ్రహ్మణ్యం బద్రీనాథ్ కీలక వ్యాఖ్యలు చేశాడు. శాంసన్ రాకతో సీఎస్కేలో మరో కొత్త శకం మొదలవుతుందని అతడు అభిప్రాయపడ్డాడు."సీఎస్కే ఒక పెద్ద ఫ్రాంచైజీ. ఇప్పటికే ఐదు సార్లు ఛాంపియన్గా నిలిచింది. ఇప్పుడు రాజస్తాన్ నుంచి ట్రేడ్ చేసుకున్న సంజూ శాంసన్పై భారీ అంచనాలు నెలకొన్నాయి. సీఎస్కేలో ఇక శాంసన్ శకం మొదలు కానుంది. అతడు ఆ జట్టుకు వెన్నెముకలా మారబోతున్నాడు. దీర్ఘకాలిక ప్రణాళికలలో భాగంగా సంజూను సీఎస్కే జట్టులోకి తీసుకుంది.అతడు భవిష్యత్తులో కెప్టెన్ అయ్యే అవకాశముంది. అయితే అందుకు ఇంకా చాలా సమయం ఉందని" బద్రీనాథ్ తన యూట్యూబ్ ఛానల్లో పేర్కొన్నాడు. కాగా ఈ ఏడాది ఐపీఎల్ సీజన్ మార్చి 28 నుంచి ప్రారంభం కానుంది. సీఎస్కే తమ తొలి మ్యాచ్లో మార్చి 29న గౌహతి వేదికగా రాజస్తాన్ రాయల్స్తో తలపడనుంది. చెన్నై కెప్టెన్గా రుతురాజ్ గైక్వాడ్ వ్యవహరించనున్నాడు.చదవండి: సన్రైజర్స్లోకి పాక్ ఆటగాడు.. బీసీసీఐ స్పందన ఇదే -
సంజూ శాంసన్ రేంజే వేరు భయ్యో.. ఆస్తులు చూస్తే పరేషానే..!
-
‘తుదిజట్టులో చోటు ఇవ్వనపుడు.. అతడికి చెప్పిందిదే’
జట్టులో చోటే లేని దుస్థితి నుంచి టీ20 ప్రపంచకప్-2026 హీరోగా నీరాజనాలు అందుకునే స్థాయికి ఎదిగాడు సంజూ శాంసన్. ఈ ఐసీసీ టోర్నీకి ముందు ఓపెనర్గా తుదిజట్టులో సంజూ స్థానం గల్లంతైంది. వరుస వైఫల్యాలే ఇందుకు కారణం. అదే సమయంలో టీమిండియాలోకి రీఎంట్రీ ఇచ్చిన ఇషాన్ కిషన్ (Ishan Kishan).. ఓపెనర్, వికెట్ కీపర్గా సంజూను రీప్లేస్ చేశాడు. వరుస మ్యాచ్లలో అదరగొడుతూ తుదిజట్టులో స్థానం పదిలం చేసుకున్నాడు.అలా వచ్చిఇక సంజూ ఈసారి కూడా వరల్డ్కప్ ఆడే పరిస్థితి ఉండకపోవచ్చు అని అభిమానులు నిరాశచెందిన వేళ.. అభిషేక్ శర్మ (Abhishek Sharma) కడుపునొప్పితో లీగ్ దశలో నమీబియాతో మ్యాచ్కు దూరం అయ్యాడు. ఆ మ్యాచ్లో ఇషాన్తో పాటు సంజూ ఓపెనర్గా బరిలో దిగాడు. నాకౌట్ మ్యాచ్లలో ఆకాశమే హద్దుగాఅనంతరం సూపర్-8లో భాగంగా జింబాబ్వేతో మ్యాచ్లోనూ ఈ కేరళ వికెట్ కీపర్ బ్యాటర్కు చోటు దక్కింది. ఈ రెండు మ్యాచ్లలో వేగంగా ఆడే క్రమంలో సంజూ అవుటైనా.. నాకౌట్ మ్యాచ్లలో మాత్రం ఆకాశమే హద్దుగా చెలరేగాడు.సూపర్-8లో వెస్టిండీస్తో మ్యాచ్లో 97 పరుగులతో అజేయంగా నిలిచిన సంజూ శాంసన్.. జట్టును సెమీస్ చేర్చడంలో కీలక పాత్ర పోషించాడు. ఇంగ్లండ్తో సెమీ ఫైనల్లో 89 పరుగులు చేసిన ఈ కుడిచేతివాటం బ్యాటర్.. న్యూజిలాండ్తో ఫైనల్లోనూ 89 పరుగులతో దుమ్ములేపాడు. తద్వారా ప్లేయర్ ఆఫ్ ది టోర్నీ అవార్డు గెలుచుకున్నాడు. మొత్తంగా ఈ టోర్నీలో కేవలం ఐదు మ్యాచ్లే ఆడి ఏకంగా 321 పరుగులతో సంజూ సత్తా చాటాడు.అతడు తలచుకుంటే మూడూ సెంచరీలు అయ్యేవిఈ నేపథ్యంలో సంజూ శాంసన్పై టీమిండియా కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ తాజాగా ప్రశంసలు కురిపించాడు. ‘‘తుది జట్టులో శాంసన్కు చోటు ఇవ్వలేనప్పుడు సర్ది చెప్పాల్సి వచ్చింది. ఇది కఠిన సమయం కావచ్చు కానీ దేవుడు దయతలిస్తే నీకూ అవకాశం వస్తుంది. అప్పుడు నువ్వేంటో చూపించాలి అన్నాను.దాని కోసం మాత్రం అతడు ఎప్పుడూ సిద్ధమవుతూనే వచ్చాడు. చివరి వరుస మూడు మ్యాచ్లలో శాంసన్ ప్రతాపం ఏమిటో చూశాం. అతడు అనుకుంటే ఈ మూడు ఇన్నింగ్స్లు కూడా సెంచరీలుగా మారేవి. కానీ అతను మాత్రం జట్టు కోసమే ఆడాడు’’ అని ‘చెట్టా (మలయాళంలో పెద్దన్న అనే అర్థం)’ సంజూను సూర్య కొనియాడాడు. వ్యక్తిగత ప్రయోజనాల కోసం కాకుండా జట్టు గెలుపే లక్ష్యంగా నిస్వార్థంగా ఆడాడని ప్రశంసించాడు.చదవండి: రోహిత్-కోహ్లి అభిమానులకు శుభవార్త -
శాంసన్ కాదు.. అతడే అందుకు అర్హుడు: డివిలియర్స్
సొంతగడ్డపై జరిగిన టీ20 ప్రపంచకప్ను భారత జట్టు సొంతం చేసుకున్న విషయం తెలిసిందే. అహ్మదాబాద్ వేదికగా జరిగిన ఫైనల్లో న్యూజిలాండ్ను ఓడించి టీమిండియా వరుసగా రెండోసారి పొట్టి ప్రపంచకప్ టైటిల్ను ముద్దాడింది. ఈ చారిత్రత్మక విజయంలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ది కీలక పాత్ర.వెస్టిండీస్తో జరిగిన సూపర్-8 మ్యాచ్తో పాటు సెమీస్, ఫైనల్లోనూ సంజూ అద్భుతమైన ఇన్నింగ్స్లు ఆడాడు. టోర్నీ ఆరంభంలో తుది జట్టులోనే లేకపోయిన శాంసన్.. ఆ తర్వాత వరుస మ్యాచ్లలో సంచలన ప్రదర్శనలతో జట్టును ఛాంపియన్గా నిలిపాడు. ఈ కేరళ వికెట్ కీపర్ కేవలం ఐదు మ్యాచ్లలోనే 321 పరుగులు చేశాడు.ఈ అసాధారణ ప్రదర్శనకు గాను ఐసీసీ శాంసన్ను 'ప్లేయర్ ఆఫ్ ది టోర్నమెంట్'గా ఎంపిక చేసింది. ఈ నేపథ్యంలో సౌతాఫ్రికా మాజీ కెప్టెన్ ఏబీ డివిలియర్స్ కీలక వ్యాఖ్యలు చేశాడు. ప్లేయర్ ఆఫ్ది టోర్నీ అవార్డుకు సంజూ కంటే జస్ప్రీత్ బుమ్రా మరింత అర్హుడని డివిలియర్స్ అభిప్రాయపడ్డాడు.ఈ మెగా ఈవెంట్లో బుమ్రా కూడా సంచలన ప్రదర్శన కనబరిచాడు. ఇంగ్లండ్తో జరిగిన సెమీఫైనల్లో బుమ్రా తన అద్భుత బౌలింగ్తో మ్యాచ్ స్వరూపాన్నే మార్చేశాడు. కివీస్తో జరిగిన ఫైనల్లోనూ బుమ్రా బంతితో మ్యాజిక్ చేశాడు. నాలుగు వికెట్లు పడగొట్టి భారత్ విజయంలో తన వంతు పాత్ర పోషించాడు. ఈ టోర్నీలో 8 ఇన్నింగ్స్ల్లో 14 వికెట్లు పడగొట్టి వరుణ్ చక్రవర్తితో కలిసి సంయుక్తంగా టాప్ వికెట్ టేకర్గా బుమ్రా నిలిచాడు. ఈ నేపథ్యంలోనే బుమ్రా ప్లేయర్ ఆఫ్ది టోర్నీగా ఎంపిక చేసి ఉంటే బాగుండేదని ఏబీడీ అన్నాడు."సంజూ శాంసన్, బుమ్రాలో ఎవరు ప్లేయర్ ఆఫ్ది టోర్నీ అన్నది నిర్ణయించడం చాలా కష్టం. ఈ టోర్నీలో బుమ్రా అత్యధిక వికెట్లు తీశాడు. కాబట్టి అతడు కూడా ఈ అవార్డు రేసులో ఉన్నాడు. కానీ నా వరకు అయితే బుమ్రాకే ఆ అవార్డు ఇవ్వాల్సింది. ఎందుకంటే అతడు వేసిన కొన్ని కీలకమైన స్పెల్లు భారత్ను ఛాంపియన్గా నిలిపాయి.సెమీఫైనల్, ఫైనల్లో బుమ్రా బౌలింగ్ నిజంగా అద్భుతం. అతడొక్కడే వేరే గ్రహంలో ఉన్నట్లు బౌలింగ్ చేశాడు. అతడు భారత క్రికెట్కు అతడొక విలువైన ఆస్తి" అని డివిలియర్స్ యూట్యూబ్ ఛానల్లో పేర్కొన్నాడు.చదవండి: సచిన్ రిటైర్మెంట్ వెనుక అసలు కథ.. -
T20 WC 2026: కెప్టెన్గా సాంట్నర్.. అక్షర్కు దక్కని చోటు!
జగజ్జేత టీమిండియాపై ప్రశంసల వర్షం కొనసాగుతోంది. టీ20 ప్రపంచకప్-2026 ఫైనల్లో న్యూజిలాండ్ను చిత్తు చేసిన సూర్య సేన విజయాన్ని అభిమానులు ఇంకా సెలబ్రేట్ చేసుకుంటూనే ఉన్నారు. సోషల్ మీడియా వేదికగా తమ అభిమాన ఆటగాళ్ల ఫొటోలు, వీడియోలు షేర్ చేస్తూ సందడి చేస్తున్నారు.ముఖ్యంగా వరల్డ్కప్ హీరోలుగా పేరొందిన సంజూ శాంసన్ (Sanju Samson), జస్ప్రీత్ బుమ్రా (Jasprit Bumrah)లతో పాటు.. అక్షర్ పటేల్ (Axar Patel), శివం దూబే వంటి సైలెంట్ హీరోలను కూడా ఫ్యాన్స్ హైలైట్ చేస్తున్నారు. ఇదిలా ఉంటే.. టీమిండియా మాజీ కెప్టెన్, మాజీ చీఫ్ సెలక్టర్ క్రిష్ణమాచారి శ్రీకాంత్ టీమ్ ఆఫ్ ది టోర్నమెంట్ను ఎంపిక చేశాడు. ఇందులో అనూహ్యంగా అక్షర్కు మాత్రం చోటు ఇవ్వలేదు.ఓపెనింగ్ జోడీ ఇదేఓపెనర్లుగా టీమిండియా స్టార్ సంజూ శాంసన్, న్యూజిలాండ్ పవర్ హిట్టర్ టిమ్ సీఫర్ట్ను ఎంచుకున్న చిక్కా.. వన్డౌన్లో భారత యువ ఆటగాడు ఇషాన్ కిషన్కు చోటు ఇచ్చాడు. ఇక ఆ తర్వాతి స్థానాల్లో విండీస్ వీరుడు షిమ్రన్ హెట్మైర్, భారత ఆల్రౌండర్ శివం దూబేను ఎంపిక చేసుకున్న శ్రీకాంత్.. టీమిండియా స్టార్ హార్దిక్ పాండ్యా, ఇంగ్లండ్ డేంజరస్ ప్లేయర్ విల్ జాక్స్కు స్థానం ఇచ్చాడు.పన్నెండో ఆటగాడిగాఇక ఈ జట్టుకు కెప్టెన్గా సూర్యకుమార్ యాదవ్ను కాదని.. న్యూజిలాండ్ సారథి మిచెల్ సాంట్నర్ను ఎంచుకున్నాడు చిక్కా. బౌలింగ్ విభాగంలో ఆదిల్ రషీద్, లుంగి ఎంగిడి, జస్ప్రీత్ బుమ్రాలకు చోటు ఇచ్చాడు. పన్నెండో ఆటగాడిగా విండీస్ వీరుడు జేసన్ హోల్డర్ను చిక్కా ఎంపిక చేసుకున్నాడు.కాగా టీ20 ప్రపంచకప్-2026 టోర్నీలో మొత్తంగా పద్నాలుగు వికెట్లు తీసిన బుమ్రా.. వరుణ్ చక్రవర్తితో కలిసి లీడింగ్ వికెట్ టేకర్గా నిలిచాడు. మరోవైపు.. ఆరు మ్యాచ్లలో కలిపి 383 పరుగులతో పాకిస్తాన్ ఓపెనర్ సాహిబ్జాదా ఫర్హాన్ లీడింగ్ రన్ స్కోరర్గా నిలవగా.. కేవలం ఐదు మ్యాచ్లలోనే సంజూ 321 పరుగులతో మూడో స్థానం ఆక్రమించాడు. రెండోస్థానంలో ఎనిమిది మ్యాచ్లు ఆడిన టిమ్ సీఫర్ట్ (326 పరుగులు) ఉన్నాడు.టీ20 ప్రపంచకప్-2026 చిక్కా టీమ్ ఆఫ్ ది టోర్నమెంట్సంజూ శాంసన్, టిమ్ సీఫర్ట్, ఇషాన్ కిషన్, షిమ్రన్ హెట్మైర్, శివం దూబే, హార్దిక్ పాండ్యా, విల్ జాక్స్, మిచెల్ సాంట్నర్, ఆదిల్ రషీద్, లుంగి ఎంగిడి, జస్ప్రీత్ బుమ్రా.చదవండి: T20 WC 2026: ఆరోపణలపై స్పందించిన ఐసీసీ.. ప్రకటన విడుదల -
ఇషాన్ కెరీర్ బెస్ట్.. శాంసన్ అదరహో
భారత ఆటగాళ్ల సమిష్టి కృషితో టీ20 ప్రపంచకప్ నెగ్గిన టీమిండియా తాజాగా ఐసీసీ ర్యాంకింగ్స్లోనూ అదరగొట్టింది. బుధవారం అంతర్జాతీయ క్రికెట్ మండలి (ఐసీసీ) విడుదల చేసిన ర్యాంకింగ్స్లో భారత బ్యాటర్లు సత్తా చాటారు. భారత విధ్వంసక ఆల్రౌండర్ అభిషేక్ శర్మ (875 పాయింట్లు) తొలి స్థానాన్ని కాపాడుకున్నాడు. ఇక టీ20 ప్రపంచకప్లో 9 మ్యాచ్ల్లో 317 పరుగులతో భారత్ తరఫున రెండో టాప్ స్కోరర్గా నిలిచిన ఇషాన్ కిషన్ రెండు స్థానాలు మెరుగుపరుచుకొని 871 పాయింట్లతో రెండో ర్యాంకులో నిలిచి కెరీర్ బెస్ట్ సాధించాడు. మిగతా బ్యాటర్లలో తిలక్ వర్మ ఒక స్థానం దిగజారి 742 పాయింట్లతో ఏడో స్థానంలో నిలవగా.. కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ రెండు స్థానాలు దిగజారి 722 పాయింట్లతో 9వ స్థానంలో ఉన్నాడు. ఇక టీ20 ప్రపంచకప్ హీరో సంజూ శాంసన్ ఏకంగా 18 స్థానాలు ఎగబాకి 637 పాయింట్లతో 22వ స్థానంలో నిలిచి తన కెరీర్లో బెస్ట్ ర్యాంకును అందుకున్నాడు. ఓవరాల్గా టాప్-10లో నలుగురు భారత బ్యాటర్లు చోటు దక్కించుకోవడం విశేషం. బౌలింగ్ విభాగంలో అఫ్గానిస్థాన్ బౌలర్ రషీద్ ఖాన్ ఒక స్థానం ఎగబాకి 753 పాయింట్లతో అగ్రస్థానంలో నిలిచాడు. ఇక టీమిండియా మిస్టరీ స్పిన్నర్ వరుణ్ చక్రవర్తి ఒక స్థానం దిగజారి 740 పాయింట్లతో రెండో స్థానంలో నిలవగా, పేసర్ జస్ప్రీత్ బుమ్రా ఒక స్థానం ఎగబాకి 702 పాయింట్లతో ఆరో స్థానం దక్కించుకున్నాడు. మిగతా టీమిండియా బౌలర్లలో అర్షదీప్ సింగ్ మూడు స్థానాలు దిగజారి 16వ స్థానంలో, అక్షర్ పటేల్ ఏకంగా ఆరు స్థానాలు ఎగబాకి 17వ స్థానానికి చేరుకున్నాడు. ఆల్రౌండర్ల విభాగానికి వస్తే జింబాబ్వే ఆల్రౌండర్ సికందర్ రజా, భారత ఆల్రౌండర్ హార్దిక్ పాండ్యా వరుసగా తొలి రెండు స్థానాల్లో నిలవగా, శివమ్ దూబే మాత్రం రెండు స్థానాలు దిగజారి 11వ స్థానానికి పడిపోయాడు.చదవండి: టీమిండియా సిగ్గుపడు!.. మాజీ క్రికెటర్కు ఇచ్చిపడేసిన గంభీర్ -
గంభీర్కు వ్యతిరేకంగా అగార్కర్ నిర్ణయాలు!.. ఫలితం?
టీమిండియా హెడ్కోచ్గా టెస్టు ఫార్మాట్లో విమర్శలు మూటగట్టుకున్న గౌతం గంభీర్.. వైట్ బాల్ క్రికెట్లో మాత్రం తిరుగులేని కోచ్ అనిపించుకుంటున్నాడు. అతడి మార్గదర్శనంలో ఐసీసీ చాంపియన్స్ ట్రోఫీ-2025 టైటిల్ గెలిచిన భారత్.. ఆ తర్వాత పొట్టి ఫార్మాట్ ఆసియాకప్ను కైవసం చేసుకుంది.తాజాగా టీ20 ప్రపంచకప్-2026లోనూ చాంపియన్గా నిలిచిన టీమిండియా.. ఇంత వరకు ఏ జట్టుకు సాధ్యం కాని విధంగా సొంతగడ్డపై కప్ గెలుచుకుంది. ఈ నేపథ్యంలో గంభీర్ విజయవంతమైన కోచ్ అంటూ ప్రశంసల వర్షం కురుస్తోంది.క్రెడిట్ గంభీర్ ఒక్కడిదే కాదు!అయితే, భారత జట్టు వరుస విజయాల్లో.. ముఖ్యంగా టీ20 వరల్డ్కప్ గెలవడంలో క్రెడిట్ గంభీర్ ఒక్కడికే కాకుండా.. చీఫ్ సెలక్టర్ అజిత్ అగార్కర్కూ దక్కాలనేది విశ్లేషకుల మాట. 2023లో టీమిండియా సెలక్షన్ కమిటీ చైర్మన్గా బాధ్యతలు చేపట్టాడు ఈ మాజీ క్రికెటర్.అప్పటి నుంచి తనదైన మార్కు చూపించడంలో అగార్కర్ ఎప్పుడూ విఫలం కాలేదు. ముఖ్యంగా టీ20 ప్రపంచకప్-2024లో భారత్ చాంపియన్గా నిలిచిన తర్వాత.. రోహిత్ శర్మ అంతర్జాతీయ పొట్టి ఫార్మాట్కు రిటైర్మెంట్ ప్రకటించిన విషయం తెలిసిందే. అతడి వారసుడిగా హార్దిక్ పాండ్యా ఎంపిక లాంఛనమేనని అంతా భావించారు.హార్దిక్ స్థానంలో సూర్యను ఎంపిక చేసిఅయితే, అనూహ్య రీతిలో అగార్కర్ నేతృత్వంలోని సెలక్షన్ కమిటీ సూర్యకుమార్ యాదవ్కు టీ20 జట్టు కెప్టెన్సీ పగ్గాలు అప్పగించింది. ఈ సందర్భంగా విమర్శలు వెల్లువెత్తగా.. అరుదైన పేస్ ఆల్రౌండర్ అయిన హార్దిక్ పాండ్యాను కాపాడుకోవాల్సిన బాధ్యత తమకు ఉందని అగార్కర్ తమ నిర్ణయాన్ని సమర్థించుకున్నాడు. అదనపు బాధ్యతను పాండ్యా నెత్తిన వేయలేమని పేర్కొన్నాడు.అందుకు తగ్గట్లే విజయవంతమైన కెప్టెన్గా సూర్య రాణించగా.. టీ20 ప్రపంచకప్-2026 గెలవడంలో ఆల్రౌండర్గా హార్దిక్ పాండ్యా కీలక పాత్ర పోషించాడు. ఇదిలా ఉంటే.. 2024 తర్వాత టీమిండియా టీ20 ఓపెనింగ్ జోడీగా సంజూ శాంసన్- అభిషేక్ శర్మ అద్భుతంగా రాణించారు.సంజూ అయితే ఏకంగా సౌతాఫ్రికా గడ్డ మీద సెంచరీలు బాది సత్తా చాటాడు. అయితే, ఆసియా కప్-2025 సందర్భంగా అప్పటికే టెస్టు, వన్డే జట్ల కెప్టెన్గా ఉన్న శుబ్మన్ గిల్ తిరిగి రావడంతో.. ఓపెనర్గా సంజూ స్థానం గల్లంతైది. కానీ సెలక్టర్ల నమ్మకాన్ని గిల్ వమ్ము చేశాడు. వరుస వైఫల్యాలతో అతడు సతమతం కాగా.. మేనేజ్మెంట్ తీరుపై విమర్శల వర్షం కురిసింది.గిల్పై వేటు వేస్తూ సంచలన నిర్ణయంగిల్ కోసం సంజూ లాంటి ప్రతిభావంతుడైన ఆటగాడిని బలిచేస్తున్నారనే ఆరోపణలు వెల్లువెత్తాయి. ఈ నేపథ్యంలో మెగా టోర్నీ ఆరంభానికి ముందు సెలక్షన్ కమిటీ సంచలన నిర్ణయం తీసుకుంది. ఊహించని రీతిలో గిల్పై వేటు వేసింది. ప్రపంచకప్ జట్టుకు అతడిని ఎంపిక చేయకుండా పక్కన పెట్టింది.ఈ విషయంలో గంభీర్- అగార్కర్ (Gautam Gambhir- Ajit Agarkar) మధ్య విభేదాలు తలెత్తినట్లు సమాచారం. ఇండియన్ ఎక్స్ప్రెస్ కథనం ప్రకారం.. గంభీర్ గిల్ను ఎంపిక చేయాలని పట్టుబట్టగా.. ‘‘మీ అభిప్రాయంతో నేను ఏకీభవించకపోవచ్చు. అతడు నాణ్యమైన ఆటగాడు.కానీ జట్టులో ఇప్పుడు ఎవరో ఒకరికే స్థానం. ఒకరిని తప్పించక తప్పదు. ఆ ఒక్కడు గిల్. దీనర్థం అతడు ఇందుకు అనర్హుడని కాదు. అదృష్టవశాత్తూ భారత క్రికెట్లో ఎన్నో ఆప్షన్లు ఉండటమే ఇందుకు కారణం’’ అని అగార్కర్ వాదించినట్లు తెలుస్తోంది.ఇషాన్ విషయంలోనూ..అదే విధంగా... దేశీ క్రికెట్లో సత్తా చాటిన ఇషాన్ కిషన్.. దాదాపు మూడేళ్ల తర్వాత ఏకంగా ప్రపంచకప్ జట్టులో స్థానం దక్కించుకున్న విషయం తెలిసిందే. ఈ విషయంలోనూ అగార్కర్దే తుది నిర్ణయం అని సమాచారం. ‘‘వైట్ బాల్ క్రికెట్లో అతడు టాపార్డర్లో ఆడతాడు.మంచి ఫామ్లో ఉన్నాడు. ఇంతకు ముందు కూడా టీమిండియాకు ఆడాడు. రిషభ్ పంత్. ధ్రువ్ జురెల్ కారణంగా ఈ వికెట్ కీపర్ బ్యాటర్ చాన్నాళ్లుగా జట్టుకు దూరంగా ఉన్నాడు. అంతేగానీ ప్రతిభ లేక కాదు’’ అని అగార్కర్ కన్విన్స్ చేసినట్లు తెలుస్తోంది. రింకూ సింగ్ను ఎంపిక చేయడంలోనూ చీఫ్ సెలక్టర్ నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం.ఇటు ఇషాన్.. అటు సంజూఇక సెలక్టర్ల నమ్మకానికి తగ్గట్లు ఇషాన్ కిషన్ వరల్డ్కప్ టోర్నీలో దుమ్ములేపాడు. అయితే, గంభీర్ నిర్ణయానికి అనుగుణంగా నాకౌట్ దశలో తుదిజట్టులోకి వచ్చిన సంజూ ఆకాశమే హద్దుగా చెలరేగి.. వరుసగా మూడు హాఫ్ సెంచరీలు బాది టీమిండియా విజయంలో కీలక పాత్ర పోషించాడు. ప్లేయర్ ఆఫ్ ది టోర్నీగా నిలిచి సత్తా చాటాడు.ఇదిలా ఉంటే.. భారత్ వరల్డ్కప్ గెలిచిన తర్వాత గంభీర్ మాట్లాడుతూ.. అగార్కర్కు క్రెడిట్ ఇవ్వడం విశేషం. ‘‘ఈ ట్రోఫీని నేను అగార్కర్కు అంకితం చేయాలి. అతడు చాలా విమర్శలు ఎదుర్కొన్నాడు. అయినా సరే వెనక్కి తగ్గలేదు. నిజాయితీ గల ఇలాంటి వ్యక్తితో పనిచేయడం పట్ల ఎల్లప్పుడూ కృతజ్ఞుడినై ఉంటాను’’ అని గంభీర్ పేర్కొన్నాడు.చదవండి: T20 WC 2026: 'భారత్ ఒక ఛాంపియన్ జట్టు.. తప్పులు వెతకడం ఆపండి'⭐ 2007 ⭐ 2024 ⭐ 2026History repeated. History defeated. 🇮🇳💙#T20WorldCup pic.twitter.com/dRrraSdOoi— Star Sports (@StarSportsIndia) March 8, 2026 -
'గంభీర్ చాలా పెద్ద తప్పు చేశాడు'
టీ20 ప్రపంచకప్-2026లో టీమిండియా వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ అద్భుతమైన ప్రదర్శన కనబరిచాడు. తొలుత తుది జట్టులోనే లేని శాంసన్ ఏకంగా ప్లేయర్ ఆఫ్ది టోర్నీగా నిలిచి అందరి ప్రశంసలు అందుకుంటున్నాడు. కీలకమైన చివరి మూడు మ్యాచ్లో సంజూ (97, 89, 89) సంచలన ఇన్నింగ్స్లు ఆడాడు.ఓవరాల్గా ఈ టోర్నమెంట్లో కేవలం 5 మ్యాచ్లు మాత్రమే ఆడిన శాంసన్.. స్ట్రైక్ రేట్ 199.37 321 పరుగులు చేశాడు. ఈ నేపథ్యంలో భారత మాజీ క్రికెటర్ సంజయ్ మంజ్రేకర్ సంచలన వ్యాఖ్యలు చేశాడు. పొట్టి ప్రపంచకప్ను భారత్ సొంతం చేసుకున్నప్పటికి.. సంజూను సరిగ్గా ఉపయోగించుకోవడంలో గంభీర్ ఆధ్వర్యంలోని టీమ్ మేనేజ్మెంట్ "తీవ్రమైన తప్పిదాలు" చేసిందని మంజ్రేకర్ విమర్శించాడు. టోర్నీ గ్రూపు స్టేజి మ్యాచ్లలో శాంసన్ను తుది జట్టు నుంచి తప్పించడాన్ని అతడు తప్పుబట్టాడు."సంజూ శాంసన్ విషయంలో టీమ్ మేనేజ్మెంట్ తీవ్రమైన తప్పిదాలు చేసింది. దక్షిణాఫ్రికా వంటి పటిష్టమైన జట్టుపై ఓపెనర్గా వచ్చి సంజూ వరుస సెంచరీలతో సత్తాచాటాడు. ఆ తర్వాత శుభ్మన్ గిల్ కేవలం టెస్టుల్లో బాగా ఆడాడని అతడిని మళ్ళీ టీ20ల్లోకి తీసుకొచ్చి సంజూను లోయార్డర్కు డిమోట్ చేశారు.దీంతో శాంసన్ తన రిథమ్ను కోల్పోయాడు. ఈ కారణంతో అతడిని తుది జట్టు నుంచి సైతం తప్పించారు. అయితే ఒక మ్యాచ్కు రింకూ సింగ్ దూరం కావడంతో సంజూ మళ్లీ అవకాశం దక్కింది. మూడో స్ధానంలో ఇబ్బంది పడుతున్న తిలక్ వర్మను బ్యాటింగ్ ఆర్డర్లో వెనక్కి నెట్టి ఆ స్ధానంలో కిషన్ను బ్యాటింగ్కు పంపారు. కిషన్ స్దానంలో సంజూ మళ్లీ ఓపెనర్గా వచ్చాడు. ఈసారి అతడు దుమ్ములేపాడు. ఏకంగా తన అద్భుత ప్రదర్శనలతో జట్టును ఛాంపియన్గా నిలిపాడు. అనుకోకుండా జట్టులోకి వచ్చిన సంజూ చరిత్రను తిరగరాశాడు. అతడికి ఓపెనింగ్ స్ధానమే సరైనది" అని మంజ్రేకర్ తన యూట్యూబ్ ఛానల్లలో పేర్కొన్నాడు.చదవండి: T20 WC 2026: 'భారత్ ఒక ఛాంపియన్ జట్టు.. తప్పులు వెతకడం ఆపండి' -
Samson: నిరాశలోకి వెళ్లిపోయా..ఫైనల్ మ్యాచ్ కి ముందు సచిన్ నాకు కాల్ చేసి ..
-
అందరూ మ్యాచ్ విన్నర్లే!
ప్రతిష్ఠాత్మక టీ20 ప్రపంచకప్ ముగిసింది. టీమిండియా ముచ్చటగా మూడోసారి పొట్టి ప్రపంచకప్ను కైవసం చేసుకొని ఆ ఘనత సాధించిన తొలి జట్టుగా రికార్డులకెక్కింది. ఈ నేపథ్యంలో మాజీ క్రికెటర్లు భారత క్రికెట్ జట్టుపై ప్రశంసలు కురిపిస్తూనే ఉన్నారు. తాజాగా పాకిస్థాన్ మాజీ క్రికెటర్ షాహిద్ అఫ్రిది కూడా టీమిండియాను పొగడ్తలతో ముంచెత్తాడు. జట్టులో అందరూ మ్యాచ్ విన్నర్లు కావడమే భారత్ టైటిల్ గెలిచేందుకు కారణమైందని అఫ్రిది తెలిపాడు. ఇదే విషయమై ఎక్స్ వేదికగా స్పందిస్తూ.. ‘ప్రపంచకప్ ముగిసింది. టైటిల్ గెలవడంలో టీమిండియాకు అర్హత ఉంది. జట్టు కాంబినేషన్ అద్భుతం. అంతేకాదు తుది జట్టులోని 11 మంది ఆటగాళ్లే కాదు బెంచ్ మీద ఉన్న ఆటగాళ్లు కూడా మ్యాచ్ విన్నర్లే. ఒకవేళ ఫైనల్కు ముందు తుది జట్టులో మార్పులు చేసి బెంచ్ నుంచి ఆడించినా భారత్ కప్ కొట్టేందుకు సిద్ధంగా ఉండేది. నిజానికి టోర్నీమొత్తం చాంపియన్ ఆటతీరును ప్రదర్శించారు.సంజూ శాంసన్ ఒక అద్భుతం. తనదైన హిట్టింగ్తో ఇన్నింగ్స్లను నిర్మించడంలో కీలకపాత్ర పోషించేవాడు. అభిషేక్ శర్మ గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. టోర్నీ ఆసాంతం విఫలమైనా కెప్టెన్ సూర్యకుమార్కు అభిషేక్పై ఉన్న నమ్మకం అతన్ని ఫైనల్ వరకు ఆడించింది. కీలకమైన ఫైనల్లో అభిషేక్ తనలోని అసలైన ఆటతీరును పరిచయం చేశాడు. ఇషాన్ కిషన్ కూడా తనదైన శైలిలో చెలరేగడం, ఆఖర్లో హార్దిక్ పాండ్యా, శివమ్ దూబే హిట్టింగ్ జట్టుకు అదనపు ఆకర్షణ. ఇక బౌలింగ్ లో బుమ్రా అద్భుత ప్రదర్శనతో టోర్నీ ఆసాంతం బౌలింగ్ టీమ్ను తన భుజస్కందాలపై నడిపించాడు. కొత్త బంతి, పాత బంతి అనే తేడా లేకుండా, పదునైన యార్కర్లు సంధించి అతని బౌలింగ్ విలువను చాటిచెప్పాడు’ అని తెలిపాడు. ఇక ప్రపంచకప్లో పాకిస్థాన్ జట్టు చచ్చీచెడీ సూపర్-8కు చేరినప్పటికీ మూడు మ్యాచ్ల్లో కేవలం ఒక్క విజయం మాత్రమే నమోదు చేసి టోర్నీ నుంచి నిష్క్రమించింది.చదవండి: పాక్ క్రికెటర్ సంచలన నిర్ణయం.. 24 ఏళ్లకే రిటైర్మెంట్ -
ఓ తండ్రి త్యాగం.. ఎన్నో అవమానాలు.. కట్ చేస్తే..
-
టీ20 ప్రపంచకప్ బెస్ట్ టీమ్ ఇదే.. పాక్ నుంచి ఒక్కరు కూడా!
టీ20 ప్రపంచ కప్ 2026 టైటిల్ను భారత్ కైవసం చేసుకుంది. కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ నాయకత్వంలోని టీమిండియా.. ఫైనల్లో న్యూజిలాండ్ను 96 పరుగుల తేడాతో టైటిల్ను ముద్దాడింది. ఇది భారత్కు మూడో టీ20 వరల్డ్కప్ విజయం కావడం గమనార్హం. మూడు టీ20 వరల్డ్కప్ ట్రోఫీలను సొంతం చేసుకున్న ఏకైక జట్టుగా మెన్ బ్లూ చరిత్ర సృష్టించింది. అయితే తాజాగా ఈ టోర్నీలో అత్యుత్తమ ప్రదర్శన కనబరిచిన ఆటగాళ్లతో కూడిన బెస్ట్ ప్లేయింగ్ ఎలెవన్ను భారత మాజీ క్రికెటర్ ఆకాశ్ చోప్రా ప్రకటించాడు. ఆకాశ్ చోప్రా తన జట్టులో ఓపెనర్లుగా సంజూ శాంసన్, ఫిన్ అలెన్లను ఎంపిక చేశాడు. ప్లేయర్ ఆఫ్ది టోర్నీగా నిలిచిన సంజూ శాంసన్పై చోప్రా ప్రశంసల వర్షం కురిపించాడు."శాంసన్ నాలుగు మ్యాచ్లు ఆడకపోయినా భారత్ తరపున లీడింగ్ రన్స్కోరర్గా నిలిచాడు. క్వార్టర్ ఫైనల్, సెమీ ఫైనల్, ఫైనల్లో వరుసగా హాఫ్ సెంచరీలు బాదడం నిజంగా అద్భుతం. అందుకే అతడికి ఓపెనర్గా అవకాశమిచ్చా" అని చోప్రా పేర్కొన్నాడు.అదేవిధంగా సాహిబ్జాదా ఫర్హాన్, టిమ్ సీఫెర్ట్, పాతుమ్ నిస్సంక బ్రియన్ బెన్నెట్, ఐడెన్ మార్క్రమ్లు ఓపెనర్లగా రాణించినప్పటికి ఫిన్ అలెన్ వైపే తను మొగ్గు చూపుతున్నట్లు చోప్రా తెలిపాడు. సౌతాఫ్రికాతో జరిగిన సెమీస్లో అలెన్ కేవలం 33 బంతుల్లోనే సెంచరీ బాది అందరిని ఆశ్చర్యపరిచాడు. ఇక వరుసగా రెండు మూడు స్ధానంలో ఇషాన్ కిషన్, జాకబ్ బెథెల్కు చోప్ర అవకాశమిచ్చాడు. ఆల్రౌండర్ కోటాలో హార్దిక్ పాండ్యా, శివమ్ దూబే, విల్ జాక్స్, అక్షర్ పటేల్కు చోటు దక్కింది. ఫాస్ట్ బౌలర్లగా అమెరికా పేసర్ షాడ్లీ షాల్క్విక్, జస్ప్రీత్ బుమ్రా, లుంగి ఎంగిడీలకు ఛాన్స్ లభించింది. భారత్ నుంచి ఆరుగురు ఈ జట్టులో చోటు దక్కింది. కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ను మాత్రం చోప్రా పరిగణలోకి తీసుకోలేదు.ఆకాశ్ చోప్రా ఎంచుకున్న టీ20 ప్రపంచకప్ బెస్ట్ ఎలెవన్ ఇదేసంజు శాంసన్, ఫిన్ అలెన్, ఇషాన్ కిషన్, జాకబ్ బెథెల్, హార్దిక్ పాండ్యా, శివమ్ దూబే, విల్ జాక్స్, అక్షర్ పటేల్, షాడ్లీ షాల్క్విక్, జస్ప్రీత్ బుమ్రా, లుంగి ఎంగిడీచదవండి: ఇండియా క్రికెట్ను నాశనం చేసింది: షోయబ్ అక్తర్ -
ఐసీసీ ప్రపంచకప్ టీమ్లో సామ్సన్, బుమ్రా, పాండ్యా, ఇషాన్... కెప్టెన్గా మార్క్రమ్
న్యూఢిల్లీ: అంతర్జాతీయ క్రికెట్ మండలి (ఐసీసీ) ప్రకటించిన టి20 ప్రపంచకప్ జట్టులో టైటిల్ నిలబెట్టుకున్న టీమిండియా నుంచి నలుగురు ఆటగాళ్లకు చోటు దక్కింది. ఈ జట్టుకు మార్క్రమ్ (దక్షిణాఫ్రికా) కెపె్టన్ కాగా, ఓపెనింగ్లో సంజూ సామ్సన్, టాపార్డర్లో ఇషాన్ కిషన్, మిడిలార్డర్లో హార్దిక్ పాండ్యా, బౌలింగ్లో పేసర్ జస్ప్రీత్ బుమ్రాకు చోటు లభించింది. పాకిస్తాన్ నుంచి టాప్ స్కోరర్గా నిలిచిన సాహిబ్జాదా ఫర్హాన్ ఈ ఐసీసీ టీమ్లో ఓపెనర్గా ఉన్నాడు.చిత్రంగా రన్నరప్ న్యూజిలాండ్ జట్టులో నుంచి కనీసం 12వ ఆటగాడిగా కూడా ఎవరికీ చాన్స్ దక్కలేదు. ఐసీసీ టి20 ప్రపంచకప్ జట్టు: మార్క్రమ్ (కెపె్టన్), ఫర్హాన్ (పాకిస్తాన్), సామ్సన్, ఇషాన్ కిషన్, హార్దిక్ పాండ్యా, బుమ్రా (భారత్), విల్ జాక్స్, ఆదిల్ రషీద్ (ఇంగ్లండ్), జేసన్ హోల్డర్ (వెస్టిండీస్), ఎన్గిడి (దక్షిణాఫ్రికా), ముజరబాని (జింబాబ్వే), షాడ్లీ వాన్ షాలి్వక్ (అమెరికా; 12వ ప్లేయర్). -
సంజూ శాంసన్ సక్సెస్ వెనుక భారత క్రికెట్ దిగ్గజం
భారత క్రికెట్ చరిత్రలో సంజూ శాంసన్ తనకంటూ ఒక సువర్ణ అధ్యాయాన్ని లిఖించుకున్నాడు. తన అద్భుత ప్రదర్శనలతో భారత జట్టుకు మూడో టీ20 ప్రపంచకప్ టైటిల్ను అందించాడు. ఆదివారం అహ్మదాబాద్ వేదికగా న్యూజిలాండ్తో జరిగిన టీ20 వరల్డ్కప్-2026లో 96 పరుగుల తేడాతో విజయం సాధించిన టీమిండియా.. తిరిగి టైటిల్ను రిటైన్ చేసుకుంది.అయితే ఈ మెగా టోర్నీలో ఎవరూ ఊహించని విధంగా శాంసన్ మోస్ట్ వాల్యూబుల్ ప్లేయర్' గా నిలిచి అందరినీ ఆశ్చర్యపరిచాడు. టోర్నీ ఆరంభంలో తుది జట్టులో చోటు దక్కకపోయిన అతడు ఎక్కడ నిరాశ చెందలేదు. తిరిగి జట్టులోకి వచ్చి సింహంలా గర్జించాడు. వెస్టిండీస్తో జరిగిన వర్చువల్ క్వార్టర్ ఫైనల్ నుంచి తుది పోరు వరకు సంజూ దుమ్ములేపాడు. వరుసగా మూడు మ్యాచ్లలో 80కి పైగా పరుగులు చేసి సత్తాచాటాడు. వెస్టిండీస్పై 97 పరుగులు చేసి తృటిలో సెంచరీ చేసే అవకాశాన్ని కోల్పోయిన సంజూ.. ఆ తర్వాత వరుసగా సెమీస్, ఫైనల్లో 89 పరుగులు చేశాడు. సెమీఫైనల్లో ఇంగ్లండ్పై 89 పరుగులు చేసిన.. ఫైనల్లో కివీస్పై కూడా అదే తరహా బ్యాటింగ్ చేశాడు. 46 బంతుల్లో 5 ఫోర్లు, 8 సిక్స్లతో 89 పరుగులు చేశాడు. సంజూ మొత్తంగా ఐదు మ్యాచ్ల్లో 321 పరుగులు చేసి ప్లేయర్ ఆఫ్ది టోర్నీగా నిలిచాడు. అయితే సంజూ శాంసన్ సక్సెస్ వెనక భారత క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్ ఉన్నాడు. సచిన్ ఇచ్చిన సలహాలు తనకు ఎంతో ఉపయోగపడ్డాయని సంజూ వెల్లడించాడు."అంతా కలలా ఉంది. ఆనందాన్ని వర్ణించేందుకు మాటలు రావడం లేదు. కివీస్తో సిరీస్లో వైఫల్యం తర్వాత నా కలలు చెదిరిపోయాయి. నేనేం చేయలేనా అని చాలా బాధపడ్డాను. కానీ దేవుడు అండగా నిలిచాడు. చాలా మంది మాజీ క్రికెటర్లు కూడా సహకరించారు.గత రెండు నెలలుగా సచిన్ సర్తో టచ్లో ఉన్నాను. ఆస్ట్రేలియాలో జట్టులో చోటు దక్కక బయట కూర్చున్నప్పుడు ఆయనతో మాట్లాడాను. సచిన్ చాలా సలహాలు ఇచ్చారు. ఆయనతో మాట్లాడటంతో మార్గనిర్దేశనం లభించింది. ఇది చాలా పెద్ద ఘనత. నాకు సహకరించిన అందరికీ కృతజ్ఞతలు" సంజూ పేర్కొన్నాడు. -
భయమేసింది పూర్తిగా నిరాశలోకి వెళ్లిపోయా..ఫైనల్ మ్యాచ్ కి ముందు సచిన్ నాకు కాల్ చేసి ..
-
వారు లేకుండా భారత్ ప్రపంచకప్ ఎప్పుడూ గెలవలేదు..!
2023 వన్డే వరల్డ్ కప్ ఫైనల్లో ఎదురైన నిరాశను భారత జట్టు 2026 పొట్టి ప్రపంచకప్లో తుడిచిపెట్టేసింది. సూర్యకుమార్ యాదవ్ నాయకత్వంలో భారత జట్టు మెన్స్ టీ20 వరల్డ్ కప్ను కైవసం చేసుకుంది. ఇది భారత్కు మూడో టీ20 టైటిల్. మొత్తంగా ఐదో ప్రపంచకప్ (రెండు వన్డే, మూడు టీ20). అహ్మదాబాద్లోని నరేంద్ర మోదీ స్టేడియంలో నిన్న (మార్చి 8) జరిగిన ఫైనల్లో టీమిండియా న్యూజిలాండ్పై 96 పరుగుల తేడాతో జయభేరి మోగించి వరుసగా రెండో ఎడిషన్లో జగజ్జేతగా అవతరించింది.కాగా, టీమిండియా వరల్డ్ కప్ విజయాల వెనుక ఓ ఆసక్తికరమైన విషయం దాగి ఉంది. 1983 వన్డే వరల్డ్కప్ విజయం నుంచి తాజాగా సాధించిన 2026 టీ20 ప్రపంచకప్ వరకు భారత్ గెలిచిన ప్రతి వరల్డ్ కప్లో ఒక సర్దార్ (పంజాబీ), ఒక కేరళ ఆటగాడు జట్టులో భాగమయ్యారు. 1983లో బల్విందర్ సంధూ (సర్దార్), సునీల్ వాల్సన్ (కేరళ)తో ఈ సంప్రదాయం మొదలైంది. 2007 (టీ20), 2011 (వన్డే) ప్రపంచకప్లలో శ్రీశాంత్ (కేరళ), హర్భజన్ సింగ్ (సర్దార్) కీలక పాత్ర పోషించారు. 2024, 2026 టీ20 వరల్డ్ కప్లలో సంజూ శాంసన్ (కేరళ), అర్ష్దీప్ సింగ్ (సర్దార్) ఈ ప్యాటర్న్ను కొనసాగించారు. రాకింగ్ సంజూ 2026 టీ20 వరల్డ్ కప్లో సంజూ శాంసన్ అద్భుత ప్రదర్శనతో ప్లేయర్ ఆఫ్ ద టోర్నీ అవార్డు గెలుచుకున్నాడు. సెమీస్కు చేరాలంటే తప్పక గెలవాల్సిన సూపర్-8 మ్యాచ్లో వెస్టిండీస్పై అజేయమైన 97 పరుగులు (50 బంతుల్లో) చేసిన సంజూ.. సెమీస్లో ఇంగ్లండ్పై, ఫైనల్లో న్యూజిలాండ్పై తలో 89 పరుగులు చేసి జట్టును విజయపథంలో నడిపించాడు. ఈ టోర్నీలో సంజూ మొత్తం 5 ఇన్నింగ్స్ల్లో 321 పరుగులు సాధించాడు. 2024 ఎడిషన్లో సంజూ పూర్తిగా బెంచ్పైనే గడిపాడు. ఇది 1983లో వాల్సన్ పరిస్థితిని గుర్తు చేసింది. షేకింగ్ సర్దార్2024 ప్రపంచకప్లో టాప్ వికెట్ టేకర్గా (17 వికెట్లు) నిలిచి భారత్ టైటిల్ సాధించడంలో కీలకపాత్ర పోషించిన అర్షదీప్ సింగ్.. తాజా ఎడిషన్లోనూ (2026) ఇంచుమించు అదే తరహా ప్రదర్శనలతో (9 వికెట్లు) షేకింగ్ సర్దార్ అనిపించుకున్నాడు. అర్షదీప్ తన నిలకడ ప్రదర్శనలతో భారత్కు వరుసగా రెండు టీ20 టైటిళ్లు అందించడంలో ప్రధాన పాత్ర పోషించాడు. -
‘తుదిజట్టులో అతడు లేకుంటే టీమిండియాకు ఓటమే’
టీ20 ప్రపంచకప్-2026 ఫైనల్లో టీమిండియా సత్తా చాటింది. సమిష్టి ప్రదర్శనతో రాణించి న్యూజిలాండ్ను మట్టికరిపించింది. అహ్మదాబాద్లో కివీస్ను 96 పరుగుల తేడాతో చిత్తు చేసి.. ముచ్చటగా మూడోసారి పొట్టి క్రికెట్ వరల్డ్కప్ ట్రోఫీని ముద్దాడింది.ఈ నేపథ్యంలో టీమిండియా మాజీ ఆల్రౌండర్ ఇర్పాన్ పఠాన్ (Irfan Pathan) కీలక వ్యాఖ్యలు చేశాడు. భారత తుదిజట్టులో సంజూ శాంసన్ లేకపోయి ఉంటే.. సూర్య సేన ప్రయాణం ఇక్కడిదాకా సాగేది కాదన్నాడు. తన యూట్యూబ్ చానెల్ వేదికగా మాట్లాడుతూ..తుదిజట్టులో లేకపోయి ఉంటే..‘‘ఈ ప్రపంచకప్ టోర్నీలో.. ఒకవేళ సంజూ శాంసన్ గనుక భారత తుదిజట్టులో లేకపోయి ఉంటే.. టీమిండియా ట్రోఫీ గెలిచేది కాదు. వెస్టిండీస్తో సూపర్-8లో తప్పక గెలవాల్సిన మ్యాచ్లో అతడు అద్భుతమైన ఇన్నింగ్స్ ఆడాడు.ఇక ఇంగ్లండ్తో సెమీ ఫైనల్లోనూ అత్యద్భుత రీతిలో బ్యాటింగ్ చేశాడు. ఫైనల్లోనూ ఇదే పునరావృతం చేసి ముచ్చటగా, వరుసగా మూడో భారీ హాఫ్ సెంచరీ సాధించాడు. నిజానికి తన కెరీర్లో ఎన్నో ఎత్తుపళ్లాలు ఉన్నాయి.అయినా సరే అతడు కఠినంగా శ్రమిస్తూ ధైర్యంగా ముందుకు సాగాడు. అందుకే ఆ దేవుడు అతడి కష్టానికి తగిన గుర్తింపు వచ్చేలా చేశాడు. సంజూ హార్డ్వర్క్కు లభించిన స్వీటెస్ట్ రివార్డు ఇది’’ అని ఇర్ఫాన్ పఠాన్ ఈ కేరళ వికెట్ కీపర్ బ్యాటర్పై ప్రశంసలు కురిపించాడు.నాకౌట్ మ్యాచ్లలో సంజూ విశ్వరూపంకాగా టీ20 ప్రపంచకప్ ఆరంభానికి ముందే తుదిజట్టులో సంజూ చోటు కోల్పోయాడు. అయితే, నమీబియాతో మ్యాచ్కు అభిషేక్ శర్మ కడుపు నొప్పి వల్ల దూరం కాగా మళ్లీ తుదిజట్టులోకి వచ్చాడు. అనంతరం జింబాబ్వేతో మ్యాచ్లోనూ ఆడాడు.అయితే, నాకౌట్ మ్యాచ్లలో సంజూ విశ్వరూపం చూపించాడు. వెస్టిండీస్తో మ్యాచ్లో 97 పరుగులతో అజేయంగా నిలిచిన ఈ కుడిచేతి వాటం బ్యాటర్.. ఇంగ్లండ్తో సెమీస్లో 89, న్యూజిలాండ్తో ఫైనల్లో 89 పరుగులతో దుమ్ములేపాడు. తద్వారా ప్లేయర్ ఆఫ్ ది సిరీస్ అవార్డు అందుకున్నాడు. చదవండి: సంజూ, ఇషాన్ ఎవరు?.. ఉగాండా, కెన్యాలను ఓడిస్తాం: పాక్ మాజీ క్రికెటర్All yours, Sanju! You’ve earned every bit of it! ❤️#T20WorldCup #INDvNZ pic.twitter.com/Ya4aJeeyyL— Star Sports (@StarSportsIndia) March 8, 2026 -
సంజూ ఎవరు?.. ఉగాండా, కెన్యాలను ఓడిస్తాం: పాక్ క్రికెటర్
టీమిండియా వరుసగా రెండోసారి టీ20 ప్రపంచకప్ గెలవడంపై పాకిస్తాన్ వెటరన్ క్రికెటర్ అహ్మద్ షెహజాద్ స్పందించాడు. భారత్లో ప్రతిభ గల క్రికెటర్లకు కొదవలేదని.. అక్కడి గొప్ప వ్యవస్థ కూడా ఈ అరుదైన ఘనతకు కారణం అన్నాడు. మరోవైపు.. పాకిస్తాన్లో కూడా ప్రతిభావంతులైన క్రికెటర్లు ఉన్నారని.. అయితే, పాక్ బోర్డు తీరు మాత్రం సరిగ్గా లేదని విమర్శించాడు.టీ20 ప్రపంచకప్-2026 ఫైనల్లో భారత్ న్యూజిలాండ్పై 96 పరుగుల తేడాతో ఏకపక్ష విజయం సాధించిన విషయం తెలిసిందే. తద్వారా సొంతగడ్డపై పొట్టి క్రికెట్ వరల్డ్కప్ గెలిచిన జట్టుగా.. ఓవరాల్గా మూడుసార్లు టీ20 ప్రపంచకప్ అందుకున్న టీమ్గా చరిత్ర సృష్టించింది.ప్రశంసల వర్షం ఈ నేపథ్యంలో పాక్ మాజీ బ్యాటర్ అహ్మద్ షెహజాద్ టీమిండియాపై ప్రశంసల వర్షం కురిపించాడు. భారత క్రికెట్ నియంత్రణ మండలి (BCCI) తీరును కొనియాడుతూ.. పాక్ క్రికెట్ బోర్డు (PCB)కు గట్టిగానే చురకలు అంటించాడు.‘‘పాకిస్తాన్లో క్రికెట్ టాలెంట్కు కొదవలేదు. ఇక్కడ చాలా మంది ప్రతిభావంతులైన క్రికెటర్లు ఉన్నారు. అయితే, లోపమంతా ఇక్కడి వ్యవస్థలోనే ఉంది. మరి ఇండియాలో.. అక్కడ ప్రతిభ, సరైన వ్యవస్థ.. రెండూ ఉన్నాయి. వారు సాధిస్తున్న విజయాలే ఇందుకు నిదర్శనం.అసలు ఈ సంజూ శాంసన్ ఎవరు?అసలు ఈ సంజూ శాంసన్ ఎవరు? అతడికి అసలు గతంలో అవకాశాలు వచ్చేవా?.. మరి ఇప్పుడో.. అతడు ప్లేయర్ ఆఫ్ ది సిరీస్ అవార్డు అందుకున్నాడు. ఇక ఈ ఇషాన్ కిషన్.. అతడు ఎప్పుడో ఒకసారి మాత్రమే జట్టుకు ఆడతాడు.క్రమశిక్షణరాహిత్యానికి పాల్పడ్డాడని బోర్డు అతడిని శిక్షించింది. ఆ కసితో దేశవాళీ క్రికెట్లో అతడు రాణిస్తే.. తిరిగి నేరుగా ప్రపంచకప్ జట్టుకు ఎంపిక చేసింది. అదే విధంగా అభిషేక్ శర్మ.. టోర్నీ ఆరంభం నుంచి ఒత్తిడిలో కూరుకుపోయి విఫలమయ్యాడు.అయినా యాజమాన్యం అతడిపై నమ్మకం ఉంచింది. అందుకు ప్రతిగా ఫైనల్లో 21 బంతుల్లోనే 52 పరుగులతో సత్తా చాటాడు. టీమిండియా పెద్ద పెద్ద మ్యాచ్లలో పెద్ద జట్లను ఓడిస్తుంది. ఉగాండా, కెన్యాలను ఓడిస్తాంకానీ మన పాకిస్తాన్ జింబాబ్వే, ఉగాండా, కెన్యా వంటి పసికూన జట్లపై విజయాలను పండుగ చేసుకుంటుంది. వాళ్లను ఇక్కడికి పిలిపించి వారిపై గెలుపును ఆస్వాదిస్తుంది. ఇదే తేడా’’ అని అహ్మద్ షెహజాద్ పాక్ క్రికెట్ను ఘాటుగా విమర్శిస్తూ.. టీమిండియాను ప్రశంసించాడు. చదవండి: T20 WC 2026: సలాం సంజూ శాంసన్Pressure? WHAT PRESSURE!? 💪Third consecutive fifty for Sanju Samson, all on the biggest stage! 😍🚨 Only Indians with fifties in semi-final & final of an ICC Men's T20 WC:👉 Virat Kohli | 2014👉 Sanju Samson | 2026ICC Men’s #T20WorldCup | FINAL | #INDvNZ | LIVE NOW 👉… pic.twitter.com/dHtwpFQet2— Star Sports (@StarSportsIndia) March 8, 2026 -
వాళ్లు అద్భుతం.. తదుపరి లక్ష్యం గోల్డ్ మెడల్: సూర్యకుమార్
టీమిండియా అద్భుతం చేసింది. వరుసగా రెండోసారి టీ20 ప్రపంచకప్ సాధించింది. తమ ఖాతాలో మూడో పొట్టి వరల్డ్కప్ ట్రోఫీని జమచేసుకుంది. అహ్మదాబాద్ వేదికగా ఆదివారం న్యూజిలాండ్తో జరిగిన ఫైనల్లో భారత్ ఏకంగా 96 పరుగుల తేడాతో జయభేరి మోగించి.. ఈ ఘనత సాధించింది.చరిత్ర పుటల్లోకి ఈ అద్వితీయ గెలుపుతో టీమిండియా కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ (Suryakumar Yadav) దిగ్గజాల సరసన నిలిచాడు. భారత్కు టీ20 ప్రపంచకప్ అందించిన కెప్టెన్లు మహేంద్ర సింగ్ ధోని (MS Dhoni), రోహిత్ శర్మ (Rohit Sharma)లతో పాటు సూర్య పేరు కూడా చరిత్ర పుటల్లోకి ఎక్కింది. ఇదిలా ఉంటే.. టీ20 ప్రపంచకప్-2026 తర్వాత సూర్య రిటైర్ అవుతాడనే ఊహాగానాలు వచ్చాయి.ఈ నేపథ్యంలో విజయానంతరం సూర్య ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. తమ తదుపరి లక్ష్యం ఒలింపిక్స్లో స్వర్ణ పతకం గెలవడమేనని పేర్కొన్నాడు. తద్వారా ఇప్పుడే తాను రిటైర్ కాబోనని 35 ఏళ్ల సూర్య సంకేతాలు ఇచ్చాడు.గోల్డ్ మెడల్ లక్ష్యంకాగా 2028లో లాస్ ఏంజెలెస్ వేదికగా విశ్వ క్రీడలు జరుగనున్న సంగతి తెలిసిందే. అదే ఏడాది టీ20 ప్రపంచకప్ తదుపరి ఎడిషన్ కూడా జరుగుతుంది. ఈ నేపథ్యంలో సూర్య మాట్లాడుతూ.. ‘‘తదుపరి ఒకే ఏడాదిలో టీ20 వరల్డ్కప్తో పాటు ఒలింపిక్స్లో గోల్డ్ మెడల్ సాధించడమే లక్ష్యం’’ అని పేర్కొన్నాడు. ఇక ప్రపంచకప్ గెలిచిన ఆనందంలో.. ‘‘ఈ సంతోషం నుంచి తేరుకునేందుకు ఇంకాస్త సమయం పడుతుంది.వాళ్లు అద్భుతంసంజూ శాంసన్, అభిషేక్ శర్మ ప్రత్యేక ఆటగాళ్లు. వారు ఏదైనా అద్భుతం చేయగలరని అనుకున్నాం. ఫైనల్లో ఆ పని చేసి చూపించారు. ఇక మా ప్రధాన పేసర్ జస్ప్రీత్ బుమ్రా గురించి ప్రత్యేకంగా చెప్పాల్సింది ఏమీ లేదు. తరానికొక్క అరుదైన బౌలర్. అతడిని జాతీయ సొత్తు అని పిలవవచ్చు. జట్టును గెలిపించేందుకు ఏం చేయాలో అతడికి బాగా తెలుసు. అక్షర్ పటేల్, హార్దిక్ పాండ్యా.. జట్టులోని ఇలా ప్రతి ఒక్కరు తమ వంతు పాత్రను చక్కగా నెరవేర్చారు’’ అని సూర్య ప్రశంసలు కురిపించాడు.చదవండి: లక్కీ కెప్టెన్!From World Cup glory to the next challenge, #SuryakumarYadav opens up about what lies ahead for #TeamIndia.🇮🇳❤️#T20WorldCup #INDVNZ pic.twitter.com/5NPw2aNK5X— Star Sports (@StarSportsIndia) March 8, 2026 -
సామ్సన్ తుఫాన్ ఇన్నింగ్స్.. ఫైనల్లో పవర్ హిట్టింగ్
-
'త్రి'వర్ణ విజయం
సామ్సన్ కొట్టిన సిక్స్లను కరిగే క్షణాలు కూడా కాసేపాగి వీక్షించినట్లు.. అభిషేక్ బాదిన బౌండరీల్ని పదిలంగా దాచుకోవాలని మైదానం తలచినట్లు.. ఇషాన్ ధనాధన్ అర్ధశతకానికి బంతి పెద్ద ఫ్యాన్ అయినట్లు... అహ్మదాబాద్లో పరుచుకున్న ‘పరుగుల’ వెన్నెల యావత్ భారతాన్ని మురిపించింది. ఎందుకంటే ఈ ప్రపంచకప్ విజయం...దీని తాలూకు వచ్చే ఆనందం... ఓ పూటకే సరిపోదు.ఒక్క చోటికే పరిమితం కాదు. మొత్తం దేశాన్నే తమ క్రికెట్ అభిమాన ప్రవాహంలో ఉప్పొంగేలా చేసింది.ముచ్చటగా మూడోసారి ప్రపంచకప్ను ముద్దాడింది.2019 వన్డే ప్రపంచకప్లో మనల్ని ఫైనల్ చేరకుండా సెమీస్లోనే వెళ్లగొట్టిన న్యూజిలాండ్ జట్టుకు... 2023 వన్డే ప్రపంచకప్ ఫైనల్లో మనగడ్డపై మనల్ని ముంచిన అహ్మదాబాద్ వేదికకు.. టీమిండియా రిటర్న్ గిఫ్ట్ ఇచ్చింది. 2026 టి20 ప్రపంచకప్లో భారత్ విజేతగానిలిచింది. డిఫెండింగ్ చాంపియన్గాకరీబియన్లో పట్టుకొచ్చిన టి20 ప్రపంచకప్ను సొంతగడ్డపైనా నిలబెట్టుకుంది. సెమీస్లోఇంగ్లండ్పై, ఇప్పుడు ఫైనల్లో న్యూజిలాండ్పై భారత బ్యాటింగ్ దళం గర్జించింది.వందేమాతరం... వందేమాతరం... లక్ష మంది అభిమానులతో అహ్మదాబాద్ స్టేడియం హోరెత్తిపోయింది... ఇందులో రెండున్నరేళ్ల క్రితం ఇదే మైదానంలో గుండెకోతను అనుభవించిన వారు ఎంతో మంది ఉన్నారు. కానీ ఇప్పుడు అది గతం.. నాటి గాయానికి మందు రాసేలా సొంతగడ్డపై, ఫ్యాన్స్ సమక్షంలో భారత జట్టు టి20 ప్రపంచ కప్ను సగర్వంగా అందుకుంది. వరల్డ్ కప్ చరిత్రలో ఎవరికీ సాధ్యం కాని రీతిలో మూడో టైటిల్ను సొంతం చేసుకోవడంతో పాటు వరుసగా రెండోసారి ట్రోఫీని గెలుచుకున్న తొలి జట్టుగా ఘనత సాధించింది. రెండేళ్ల క్రితం విశ్వ విజేతగా నిలిచిన నాటి నుంచి ఏ రోజూ స్థాయి తగ్గకుండా అదే దూకుడు, జోరుతో ఆడిన టీమిండియా అదే తీవ్రతను కొనసాగిస్తూ టైటిల్ నిలబెట్టుకోవడం విశేషం.ఫైనల్లో న్యూజిలాండ్తో సమరం అంటే ముందుగా మనదే కొంత పైచేయిగా కనిపించింది... దానికి తగినట్లుగా ఆరంభం నుంచే టాప్–3 బ్యాటర్లు విరుచుకుపడ్డారు. సామ్సన్ తన ధాటిని కొనసాగించగా అభిషేక్ అసలు పోరులో తన సత్తాను ప్రదర్శించాడు. తోడుగా ఇషాన్ కిషన్ కూడా చెలరేగడంతో బౌండరీల విధ్వంసం సాగింది. ప్రతీ బంతీ బౌండరీ దాటుతుండగా భారత్ ఆట చూస్తే 300 స్కోరు ఖాయమనిపించింది. అక్కడి వరకు చేరకపోయినా 255 పరుగులతో మ్యాచ్ను శాసించే స్థితిలో టీమిండియా నిలిచింది. వరల్డ్ కప్ ఫైనల్లో ప్రత్యర్థి జట్టు వేదికపై ఛేదన ఎంత కష్టమో కివీస్కు తెలిసే సరికి మ్యాచ్ ముగిసిపోయింది... బుమ్రా, అక్షర్ బౌలింగ్తో ఆ జట్టు కునారిల్లింది. సంపూర్ణ ఆధిపత్యంతో టీమిండియా విశ్వ విజేతగా నిలిచింది.అభిషేక్ బౌలింగ్లో డఫీ కొట్టిన షాట్ను బౌండరీ వద్ద హైదరాబాదీ తిలక్ వర్మ అందుకోవడంతో అన్ని వైపుల నుంచి వేడుకలు మొదలయ్యాయి. గత టోర్నీ గెలుపు అనుభవాన్ని కొందరు మళ్లీ రుచి చూస్తే... తొలిసారి వరల్డ్ కప్ నెగ్గిన కుర్రాళ్ల ఆనందానికి అవధుల్లేవు... వరల్డ్ కప్ గెలిపించిన కెప్టెన్గా సూర్యకుమార్ చరిత్రకెక్కగా... గత వరల్డ్ కప్ విజేతలు కపిల్, ధోని, రోహిత్ శర్మ గ్యాలరీ నుంచి అభినందిస్తుండగా టీమిండియా ఆటగాళ్లంతా మైదానంలో మువ్వన్నెల జెండాతో సంబరాలు చేసుకున్నారు. అహ్మదాబాద్: సూర్యకుమార్ యాదవ్ సారథ్యంలోని భారత జట్టు టి20 వరల్డ్ కప్లో విజేతగా నిలిచింది. గతంలో 2007, 2024లో టైటిల్ సాధించిన టీమిండియా ఇప్పుడు మూడోసారి ట్రోఫీని అందుకోవడం విశేషం. ఆదివారం నరేంద్ర మోదీ స్టేడియంలో ఏకపక్షంగా జరిగిన ఫైనల్లో భారత్ 96 పరుగుల తేడాతో న్యూజిలాండ్ను చిత్తు చేసింది. టాస్ గెలిచిన కివీస్ ఫీల్డింగ్ ఎంచుకోగా... ముందుగా బ్యాటింగ్కు దిగిన భారత్ 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 255 పరుగులు చేసింది. సంజు సామ్సన్ (46 బంతుల్లో 89; 5 ఫోర్లు, 8 సిక్స్లు), ఇషాన్ కిషన్ (25 బంతుల్లో 54; 4 ఫోర్లు, 4 సిక్స్లు), అభిషేక్ శర్మ (21 బంతుల్లో 52; 6 ఫోర్లు, 3 సిక్స్లు) అర్ధ సెంచరీలతో రాణించారు. అనంతరం న్యూజిలాండ్ 19 ఓవర్లలో 159 పరుగులకే కుప్పకూలింది. టిమ్ సీఫెర్ట్ (26 బంతుల్లో 52; 2 ఫోర్లు, 5 సిక్స్లు), సాంట్నర్ (35 బంతుల్లో 43; 3 ఫోర్లు, 2 సిక్స్లు) మినహా అంతా విఫలమయ్యారు. ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’ జస్ప్రీత్ బుమ్రా (4/15), అక్షర్ పటేల్ (3/27) న్యూజిలాండ్ను దెబ్బ తీశారు. విజేతగా నిలిచిన భారత జట్టుకు రూ. 27 కోట్ల 48 లక్షల ప్రైజ్మనీ దక్కింది. ధనాధన్ దూకుడు... తొలి ఓవర్లో 7 పరుగులు, రెండో ఓవర్లో 5 పరుగులు... ఇంత వరకు భారత్ కాస్త జాగ్రత్త పడింది. డఫీ వేసిన మూడో ఓవర్తో మొదలైన బ్యాటింగ్ విధ్వంసం చివరి ఓవర్ వరకు సాగింది. టాప్–3 బ్యాటర్లంతా ఒకరితో మరొకరు పోటీ పడి కివీస్ పనిపట్టారు. ఫెర్గూసన్ ఓవర్లో అభిషేక్, సామ్సన్ కలిసి 2 ఫోర్లు, 2 సిక్స్లు కొట్టడంతో 24 పరుగులు వచ్చాయి. హెన్రీ ఓవర్లో ఇద్దరూ చెరో సిక్సర్ బాదగా, డఫీ ఓవర్లో అభిషేక్ 3 ఫోర్లు, సిక్స్ కొట్టడంతో పవర్ప్లే ముగిసేసరికి స్కోరు 92 పరుగులకు చేరింది. 18 బంతుల్లో అర్ధ సెంచరీ పూర్తి చేసుకున్న వెంటనే అభిషేక్ వెనుదిరిగినా, కిషన్ వచ్చి అదే జోరును కొనసాగించాడు. 33 బంతుల్లో సామ్సన్ హాఫ్ సెంచరీని అందుకున్నాడు. ఆ తర్వాత ఫెర్గూసన్ ఓవర్లో సామ్సన్ వరుసగా 2 సిక్స్లు బాదగా, కిషన్ మరో సిక్స్ కొట్టాడు. రచిన్ వేసిన 14వ ఓవర్లోనైతే సామ్సన్ వరుసగా 6, 6, 6తో చెలరేగిపోగా, కిషన్ కూడా 23 బంతుల్లోనే అర్ధ సెంచరీని చేరుకున్నాడు. అయితే ఎట్టకేలకు తర్వాతి 16–19 వరకు నాలుగు ఓవర్ల పాటు భారత్ను కట్టడి చేయడంలో కివీస్ సఫలమైంది. నీషమ్ వేసిన ఒకే ఓవర్లో సామ్సన్, కిషన్, సూర్యకుమార్ (0) అవుట్ కాగా... పాండ్యా (18)ను హెన్రీ అవుట్ చేశాడు. ఈ నాలుగు ఓవర్లలో కలిపి 28 పరుగులే వచ్చాయి. అయితే నీషమ్ వేసిన చివరి ఓవర్లో దూబే (8 బంతుల్లో 26 నాటౌట్; 3 ఫోర్లు, 2 సిక్స్లు) చెలరేగిపోయాడు. దాంతో స్కోరు 250 దాటింది. సీఫెర్ట్ మినహా... తమ జట్టుకు శుభారంభం అందించడంలో కివీస్ ఓపెనర్లు విఫలమయ్యారు. పాండ్యా ఓవర్లో 2 సిక్స్లు, 2 ఫోర్లు బాది సీఫెర్ట్ జోరు ప్రదర్శించినా... మరోవైపు జట్టు వరుసగా వికెట్లు కోల్పోయింది. 4 బంతుల వ్యవధిలో అలెన్ (9), రచిన్(1) అవుట్ కాగా, ఫిలిప్స్ను (5) అక్షర్ బౌల్డ్ చేశాడు. పవర్ప్లేలో జట్టు 52 పరుగులు చేయగలిగింది. వరుణ్ ఓవర్లో 2 సిక్స్లతో 23 బంతుల్లో సీఫెర్ట్ హాఫ్ సెంచరీ పూర్తయింది. అయితే నాలుగు బంతుల వ్యవధిలో చాప్మన్ (3), సీఫెర్ట్లు వెనుదిరగడంతో సగం టీమ్ పెవిలియన్ చేరింది. మిచెల్ (17), సాంట్నర్ కొద్దిసేపు పోరాడగలిగారు.అయితే బుమ్రా అద్భుత బంతితో సాంట్నర్ను అవుట్ చేయడంతో కివీస్ ఓటమి లాంఛనమే అయింది.స్కోరు వివరాలు భారత్ ఇన్నింగ్స్: సామ్సన్ (సి) (సబ్) మెక్కోన్కీ (బి) నీషమ్ 89; అభిషేక్ (సి) సీఫెర్ట్ (బి) రచిన్ 52; ఇషాన్ కిషన్ (సి) చాప్మన్ (బి) నీషమ్ 54; పాండ్యా (సి) సాంట్నర్ (బి) హెన్రీ 18; సూర్యకుమార్ (సి) రచిన్ (బి) నీషమ్ 0; తిలక్ (నాటౌట్) 8; దూబే (నాటౌట్) 26; ఎక్స్ట్రాలు 8; మొత్తం (20 ఓవర్లలో 5 వికెట్లకు) 255. వికెట్ల పతనం: 1–98, 2–203, 3–204, 4–204, 5–226. బౌలింగ్: హెన్రీ 4–0–49–1, ఫిలిప్స్ 1–0–5–0, డఫీ 3–0–42–0, ఫెర్గూసన్ 2–0–48–0, సాంట్నర్ 4–0–33–0, రచిన్ రవీంద్ర 2–0–32–1, నీషమ్ 4–0–46–3. న్యూజిలాండ్ ఇన్నింగ్స్: సీఫెర్ట్ (సి) ఇషాన్ కిషన్ (బి) వరుణ్ 52; అలెన్ (సి) తిలక్ (బి) అక్షర్ 9; రచిన్ (సి) ఇషాన్ కిషన్ (బి) బుమ్రా 1; ఫిలిప్స్ (బి) అక్షర్ 5; చాప్మన్ (బి) పాండ్యా 3; మిచెల్ (సి) ఇషాన్ కిషన్ (బి) అక్షర్ 17; సాంట్నర్ (బి)బుమ్రా 43; నీషమ్ (బి) బుమ్రా 8; హెన్రీ (బి) బుమ్రా 0; ఫెర్గూసన్ (నాటౌట్) 6; డఫీ (సి) తిలక్ (బి) అభిషేక్ 3; ఎక్స్ట్రాలు 12; మొత్తం (19 ఓవర్లలో ఆలౌట్) 159. వికెట్ల పతనం: 1–31, 2–32, 3–47, 4–70, 5–72, 6–124, 7–141, 8–141, 9–152, 10–159. బౌలింగ్: అర్‡్షదీప్ 4–0–32–0, పాండ్యా 4–0–36–1, అక్షర్ 3–0–27–3, బుమ్రా 4–0–15–4, వరుణ్ 3–0–39–1, అభిషేక్ 1–0–5–1. -
లక్కీ కెప్టెన్!
‘సంజు సామ్సన్కు మరో అవకాశం ఇస్తారా’... దక్షిణాఫ్రికాతో మ్యాచ్కు ముందు మీడియా ప్రతినిధి ఒకరు సూర్యకుమార్ యాదవ్కు ప్రశ్న వేశాడు. సాధారణంగా మరో కెప్టెన్ అయితే జట్టులోని 15 మందీ సమర్థులే. పరిస్థితులను బట్టి మార్పులు చేర్పులు ఉంటాయి. మ్యాచ్ సమయంలో ఏదైనా నిర్ణయం తీసుకుంటాం అని సమాధానం ఇస్తారు. కానీ సూర్యకుమార్ వ్యంగ్యంగా ఒకింత అహంకారంగా నవ్వుతూ... ‘అభిషేక్ను తీసి ఆడించమంటారా...తిలక్ను తీసి ఆడించమంటారా’ అంటూ ఎదురు ప్రశ్న వేశాడు.చివరకు తప్పనిసరి పరిస్థితుల్లో తర్వాతి మ్యాచ్ జింబాబ్వేపై సామ్సన్ను ఆడించాల్సి వచ్చింది. ఆపై వరుసగా సామ్సన్ అద్భుత ప్రదర్శనలే జట్టును చాంపియన్గా నిలిపాయి. ఫైనల్కు ముందు కూడా ఆఫ్ స్పిన్ బౌలింగ్లో బ్యాటర్ల వైఫల్యం గురించి మాట్లాడుతూ... ‘120 స్ట్రయిక్రేట్తో ఆడుతూ కూడా ఫైనల్కు వచ్చామంటే అలాగే ఆడతాం’ అంటూ అర్థం లేని సమాధానం ఒకటి ఇచ్చాడు. ఒక నాయకుడిగా అతని అపరిపక్వతకు ఇవి ఒక సూచన. కానీ ఇవన్నీ ఇప్పుడు పక్కకు వెళ్లిపోతాయి.వరల్డ్ కప్ అందించిన నాయకుడిగానే అతను గుర్తుండిపోతాడు. కెప్టెన్గా 52 మ్యాచ్లలో 40 విజయాలు చూస్తే రికార్డుపరంగా ఇది చాలా మంచి సారథ్య ప్రదర్శనే. వరల్డ్ కప్కు కొద్ది రోజుల ముందు పరిస్థితి చూస్తే వరుసగా 23 టి20 మ్యాచ్లలో ఒక్క అర్ధ సెంచరీ కూడా లేదు... సిరీస్పై సిరీస్ గెలుస్తూ వస్తున్నా కెప్టెన్గా తనకంటూ ప్రత్యేక ముద్ర లేదు. కోచ్ గంభీర్ పర్యవేక్షణలో కేవలం అతని సూచనలను మైదానంలో అమలు చేసేవాడిగానే కనిపిస్తున్నాడు. సొంత నిర్ణయాలు తీసుకునే స్వేచ్ఛ కూడా అతనికి లేదు... సూర్యకుమార్ యాదవ్ సారథ్యంపై గత రెండేళ్లుగా వినిపించిన విమర్శలు.తాజాగా వరల్డ్ కప్లోనూ ‘ఇదీ కెప్టెన్ క్షణం’ అనిపించే వ్యూహాలు ఏమీ అతడి నుంచి రాలేదు. అంతా సానుకూలంగా సాగిపోయింది, జట్టులో అందరూ తమ బాధ్యతలు నెరవేరుస్తూ వెళుతున్నారు కాబట్టి మంచి ఫలితాలు వస్తూనే వచ్చాయి. అయితేనేమి భారత్కు ప్రపంచ కప్ అందించిన దిగ్గజాలు కపిల్ దేవ్, ధోని, రోహిత్ శర్మ సరసన ఇప్పుడు సూర్యకుమార్ కూడా నిలిచాడు. నిజానికి రోహిత్ రిటైర్మెంట్ తర్వాత టి20ల్లో సూర్య ఆటోమెటిక్ ప్రత్యామ్నాయం ఏమీ కాదు.బ్యాటర్గా మంచి గుర్తింపు ఉన్నా నాయకుడిగా అతనికి ఎలాంటి రికార్డు లేదు. 2024 వరల్డ్ కప్ విజయం తర్వాత అప్పటి ఫామ్, సారథిగా అనుభవాన్ని బట్టి చూస్తే హార్దిక్ పాండ్యాకే జట్టు పగ్గాలు దక్కుతాయని అనిపించింది. అయితే క్రికెటేతర కారణాలు కావచ్చు పాండ్యాను కెప్టెన్సీ నుంచి దూరంగా పెట్టారు. అయితే బాధ్యతలు చేపట్టాక వరుస విజయాలు సూర్య కెప్టెన్సీ స్థానాన్ని పటిష్టం చేశాయి.శ్రీలంక, బంగ్లాదేశ్, దక్షిణాఫ్రికా, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్... ఇలా ప్రతీ జట్టుపై సిరీస్ సాధించడంతో పాటు ఆసియా కప్ కూడా మన ఖాతాలో చేరింది. పేలవ ఫామ్ కారణంగా కెప్టెన్సీ నుంచి తప్పించాలని చర్చ వచ్చినా వరల్డ్ కప్కు మరీ తక్కువ సమయం ఉండటంతో బీసీసీఐ అలాంటి సాహసం చేయలేదు. వరల్డ్ కప్లోనూ టీమిండియా ప్రదర్శన ముందు అన్ని జట్లూ తేలిపోవడంతో ట్రోఫీని అందుకోవడంలో సూర్య సఫలమయ్యాడు. –సాక్షి క్రీడా విభాగం -
సలాం సామ్సన్...
‘ఏమాత్రం బాధపడవద్దు మిత్రమా. సుదీర్ఘ టోర్నీ ఇది. ఏదో ఒక సమయంలో అవకాశం కచ్చితంగా లభిస్తుంది’... వరల్డ్ కప్ తొలి రోజు అమెరికాతో మ్యాచ్కు ముందు సంజు సామ్సన్కు తుది జట్టులో స్థానం లభించని సమయంలో మాజీ కెప్టెన్ రోహిత్ శర్మ అతడికి సాంత్వన కలిగిస్తూ చెప్పిన మాట ఇది. తర్వాతి మ్యాచ్లో నమీబియాతో అభిషేక్ అనారోగ్య కారణంగా సామ్సన్కు అవకాశం దక్కింది. కానీ చేసింది 22 పరుగులే. ఆ తర్వాత వరుసగా మూడు మ్యాచ్లలో టీమ్లో మళ్లీ చోటు లేదు. జింబాబ్వేపై చాన్స్ లభించినా 24 పరుగులకే పరిమితం! దాంతో సామ్సన్ టీమ్కు భారం, అతని భవిష్యత్తుపై కూడా చర్చ మొదలైంది. కానీ సామ్సన్ ఓడిపోలేదు. ఇక తనకు చివరి అవకాశంగా వెస్టిండీస్తో మ్యాచ్ లభించింది. అంతే... అక్కడి నుంచి అసాధారణంగా చెలరేగిపోయాడు. వెస్టిండీస్తో కీలకపోరులో 50 బంతుల్లో 97 నాటౌట్... సెమీఫైనల్లో ఇంగ్లండ్పై 42 బంతుల్లో 89... ఫైనల్లో న్యూజిలాండ్పై 46 బంతుల్లో 89... వరుసగా మూడు ముఖ్యమైన మ్యాచ్లలో మూడు అర్ధసెంచరీలతో తిరుగులేని ప్రదర్శన. మూడుసార్లూ త్రుటిలో సెంచరీ చేజారింది.చివర్లో కాస్త ప్రయత్ని స్తే శతకాలు అతని ఖాతాలో చేరేవేమో. కానీ అతను వాటిని పట్టించుకోలేదు. ప్రతీ బంతిని జట్టు స్కోరు పెంచడానికే తప్ప ఒక్క బంతి కూడా తన వ్యక్తిగత ఘనతల కోసం ఆడేందుకు ప్రయత్ని ంచలేదు. కానీ ఈ మూడు మ్యాచ్లలో సామ్సన్ చూపించిన విధ్వంస ప్రదర్శన భారత జట్టులో అతని స్థాయిని అమాంతం పెంచేసింది. సామ్సన్కు అనవసరంగా మద్దతు ఇస్తున్నారని, అతనికి చోటు దండగ అంటూ వ్యాఖ్యానించిన వారే ఇప్పుడు అతని వల్లే వరల్డ్ కప్ గెలిచిందని ప్రశంసిస్తున్నారు. తన ఆటతోనే అందరికీ అతను ఇచ్చిన సమాధానం ఇది. సామ్సన్ 2024లో వరల్డ్ కప్ గెలిచిన జట్టులో కూడా సభ్యుడిగా ఉన్నాడు. కానీ నాడు ఒక్క మ్యాచ్ కూడా ఆడే చాన్స్ రాకుండా ‘నామ్కే వాస్తే’గానే జట్టులో భాగంగా ఉన్నాడు. కానీ ఈసారి అతను విజయాన్ని శాసించాడు. కేవలం 5 ఇన్నింగ్స్లలో 321 పరుగులు సాధించి ‘ప్లేయర్ ఆఫ్ ద టోర్నీ’ అవార్డు కూడా గెల్చుకొని జట్టులో ఎవరికీ అందనంత ఎత్తులో అతను నిలిచాడు. –సాక్షి క్రీడా విభాగం వెల్డన్... టీమిండియా న్యూఢిల్లీ: మూడోసారి టి20 ప్రపంచకప్ టైటిల్ గెలిచిన భారత పురుషుల క్రికెట్ జట్టుకు దేశ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అభినందించారు. అసాధారణ నైపుణ్యం, పట్టుదల, సమష్టి కృషికి భారత జట్టు విజయం నిదర్శనమని ‘ఎక్స్’ వేదికగా మోదీ ప్రశంసించారు. ‘టోర్నీ ఆద్యంతం అత్యద్భుత ఆటతీరుతో అలరించారు. దేశం మొత్తం గర్వపడేలా చేశారు. వెల్డన్... టీమిండియా’ అంటూ మోదీ కొనియాడారు. 140 కోట్ల మంది భారతీయుల ఆకాంక్షలను నిలబెడుతూ సూర్యకుమార్ బృందం సాధించిన టి20 ప్రపంచకప్ విజయం చరిత్రలో నిలిచిపోతుందని కేంద్ర బొగ్గు గనుల శాఖ మంత్రి జి.కిషన్ రెడ్డి టీమిండియాను అభినందించారు. భవిష్యత్లో భారత్ మరిన్ని విజయాలు సాధించాలని కిషన్ రెడ్డి ఆకాంక్షించారు. -
ఫైనల్లో ఊచకోత.. సంజూ శాంసన్ వరల్డ్ రికార్డు
టీ20 వరల్డ్కప్-2026ను టీమిండియా స్టార్ ఓపెనర్గా సంజూ శాంసన్ ఘనంగా ముగించాడు. ఈ మెగా టోర్నీలో భాగంగా అహ్మదాబాద్ వేదికగా న్యూజిలాండ్తో జరుగుతున్న ఫైనల్లో శాంసన్ విధ్వంసం సృష్టించాడు. ఇన్నింగ్స్ తొలి ఓవర్ నుంచే కివీస్ బౌలర్లను ఉతికారేశాడు.మాట్ హెన్రీ, లాకీ ఫెర్గూసన్ వంటి వరల్డ్క్లాస్ బౌలర్లను సైతం సంజూ విడిచిపెట్టలేదు. అతడి మెరుపు బ్యాటింగ్కు బౌండరీలు చిన్నబోయాయి. శాంసన్ కేవలం 46 బంతుల్లోనే 5 ఫోర్లు, 8 సిక్స్లతో 89 పరుగులు చేశాడు. మొత్తంగా ఈ టోర్నీలో 5 మ్యాచ్లు ఆడిన శాంసన్.. 80.25 సగటుతో 321 పరుగులు చేశాడు. ఈ మ్యాచ్లో మెరుపు ఇన్నింగ్స్లు ఆడిన సంజూ శాంసన్ పలు అరుదైన రికార్డులను తన ఖాతాలో వేసుకున్నాడు.సంజూ సాధించిన రికార్డులు ఇవే👉టీ20 ప్రపంచకప్ చరిత్రలో ఇన్నింగ్స్ మొదటి ఓవర్లోనే అత్యధిక సిక్సర్లు కొట్టిన బ్యాటర్గా సంజూ రికార్డులెక్కాడు. సంజూ తొలి ఓవర్లో ఇప్పటివరకు 4 సిక్స్లు బాదాడు. ఇంతకుముందు ఈ రికార్డు మహ్మద్ రిజ్వాన్, క్వింటన్ డికాక్, గుర్బాన్, సాల్ట్ పేరిట ఉండేది. వీరిందరూ తొలి ఓవర్లో మూడు సిక్స్లు బాదారు.👉ఒక టీ20 ప్రపంచకప్ ఎడిషన్లో అత్యధిక సిక్సర్లు బాదిన ఆటగాడిగా సంజు శాంసన్ చరిత్ర సృష్టించాడు. ఈ ఏడాది ప్రపంచకప్లో సంజూ 21 సిక్సర్లు కొట్టాడు. ఈ క్రమంలో ఫిన్ అలెన్(21)ను సంజూ అధిగమించాడు.👉ఒకే టీ20 ప్రపంచకప్ ఎడిషన్లో సెమీఫైనల్, ఫైనల్ రెండింటిలోనూ హాఫ్ సెంచరీలు సాధించిన మూడో ప్లేయర్గా శాంసన్ నిలిచాడు. శాంసన్ కంటే ముందు షాహిద్ అఫ్రిది, విరాట్ కోహ్లి ఈ ఫీట్ సాధించారు.Pressure? WHAT PRESSURE!? 💪Third consecutive fifty for Sanju Samson, all on the biggest stage! 😍🚨 Only Indians with fifties in semi-final & final of an ICC Men's T20 WC:👉 Virat Kohli | 2014👉 Sanju Samson | 2026ICC Men’s #T20WorldCup | FINAL | #INDvNZ | LIVE NOW 👉… pic.twitter.com/dHtwpFQet2— Star Sports (@StarSportsIndia) March 8, 2026 -
Final: ఊచకోత.. టీమిండియా ఓపెనర్ల ప్రపంచ రికార్డు
భారత టీ20 ఓపెనింగ్ జోడీ సంజూ శాంసన్- అభిషేక్ శర్మ సరికొత్త చరిత్ర సృష్టించారు. టీ20 ప్రపంచకప్ టోర్నీ ఫైనల్లో యాభైకి పైగా స్కోరు సాధించిన ఓపెనింగ్ జంటగా ప్రపంచ రికార్డు సాధించారు. వీరిద్దరి విధ్వంసం కారణంగా.. టీ20 ప్రపంచకప్ సెమీస్ లేదంటే ఫైనల్లో ఫాస్టెస్ట్ ఫిఫ్టీ సాధించిన తొలి జట్టుగా టీమిండియా నిలిచింది.టీ20 ప్రపంచకప్-2026 టోర్నీలో న్యూజిలాండ్తో ఫైనల్లో టాస్ ఓడిన టీమిండియా తొలుత బ్యాటింగ్కు దిగింది. అహ్మదాబాద్ వేదికగా నరేంద్ర మోదీ స్టేడియంలో భారత ఓపెనర్లు సంజూ- అభిషేక్ ఆకాశమే హద్దుగా చెలరేగారు. నాలుగో ఓవర్ ముగిసేసరికి సంజూ 14 బంతుల్లోనే 24, అభిషేక్ శర్మ 10 బంతుల్లోనే 23 పరుగులు సాధించారు.CHETTA POWER! 💪Outrageous six from Sanju Samson as 21 runs came off Matt Henry's over! 🥶ICC Men’s #T20WorldCup | FINAL | #INDvNZ | LIVE NOW 👉 https://t.co/Tz1DBSb4nT pic.twitter.com/LGg4snOIuP— Star Sports (@StarSportsIndia) March 8, 2026దీంతో టీ20 ప్రపంచకప్ చరిత్రలో 50కి పైగా స్కోరు సాధించిన ఓపెనింగ్ జోడీగా భారత స్టార్లు నిలిచారు. ఇక ఆ తర్వాత కూడా సంజూ- అభిషేక్ జోరు కొనసాగించారు. అభిషేక్ కేవలం 18 బంతుల్లోనే అర్ధ శతకం పూర్తి చేసుకున్నాడు.Cometh the hour, cometh the man! 😍Abhishek Sharma brings up his fifty in just 18 balls, fastest of the tournament! 💪ICC Men’s #T20WorldCup | FINAL | #INDvNZ | LIVE NOW 👉 https://t.co/Tz1DBSb4nT pic.twitter.com/mcmGhlxJxe— Star Sports (@StarSportsIndia) March 8, 2026మొత్తంగా 21 బంతుల్లో 6 ఫోర్లు, 3 సిక్స్ల సాయంతో 52 పరుగులతో దుమ్ములేపిన అభిషేక్.. రచిన్ రవీంద్ర బౌలింగ్లో టిమ్ సీఫర్ట్కు క్యాచ్ ఇచ్చి అవుటయ్యాడు. సంజూతో కలిసి అభిషేక్ తొలి వికెట్కు 43 బంతుల్లో 98 పరుగులు జోడించాడు.కాగా టీ20 ప్రపంచకప్ చరిత్రలో ఫైనల్లో అత్యధిక స్కోరు సాధించిన ఓపెనింగ్ జోడీగా పాకిస్తాన్ స్టార్లు కమ్రాన్ అక్మల్- షాజైబ్ హసన్ రికార్డు సాధించాడు. వీరు 2009లో లార్డ్స్ వేదికగా శ్రీలంక మీద 48 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పారు. తాజాగా వీరి రికార్డును బద్దలు కొడుతూ సంజూ- అభిషేక్ శర్మ కలిసి కేవలం నాలుగు ఓవర్లలోనే 51 పరుగులు సాధించారు. ఇదిలా ఉంటే.. సంజూ శాంసన్ 33 బంతుల్లో 50 పరుగులు పూర్తి చేసుకున్నాడు. -
సంజూ మాట!.. కోహ్లి మాదిరే విశ్వరూపం చూపిస్తాడా!
టీ20 ప్రపంచకప్-2026 సెమీ ఫైనల్లో భారీ స్కోర్ చేసినా దాన్ని కాపాడుకోలేక కిందామీదా పడింది టీమ్ ఇండియా. ముంబై వేదికగా గురువారం జరిగిన రెండో సెమీస్ మ్యాచ్లో ఇంగ్లండ్ను 7 పరుగుల తేడాతో ఓడించి భారత్ విజయం సాధించింది. దీంతో టీమిండియా ఓవరాల్గా నాలుగోసారి, వరుసగా రెండోసారి ఫైనల్ టికెట్ దక్కించుకుంది. అయితే, జట్టు విజయపథంలో ఉన్నప్పటికీ అభిషేక్ శర్మ పేలవ ఫామ్ ఇప్పుడు టీమ్ మేనేజ్మెంట్కు పెద్ద తలనొప్పిగా మారింది.వాస్తవానికి అభిషేక్ శర్మకు ఈ టీ20 వరల్డ్ కప్ ఓ పీడకలలా మారింది. ఇప్పటివరకు ఆడిన ఏడు ఇన్నింగ్స్ల్లో అతడు కేవలం 89 పరుగులు మాత్రమే చేశాడు. గ్రూప్ స్టేజ్లో ఆడిన మూడు మ్యాచ్లలోనూ అభిషేక్.. కనీసం ఖాతా తెరవకుండానే డకౌటయ్యి వెనుదిరగడం గమనార్హం. జింబాబ్వేపై 55 పరుగులు చేసి ఫామ్లోకి వచ్చినట్లు కనిపించినా.. ఆ తర్వాత వెస్టిండీస్, సెమీస్లో ఇంగ్లండ్పై మళ్ళీ విఫలమయ్యాడు. దీంతో ఫైనల్లో అభిషేక్ ప్లేస్లో ఫినిషర్ రింకూ సింగ్నైనా టీమ్లోకి తీసుకుంటే బ్యాటింగ్ లైనప్ మరింత బలోపేతమవుతుందన్న వాదన వినిపిస్తోంది.అయితే.. అభిషేక్ ఫామ్ లేమిపై సంజూ శాంసన్ మాట్లాడుతూ.. ఫైనల్లో అభిషేక్ దుమ్మురేపుతాడేమోనని అన్నాడు. కాగా.. గత టీ20 వరల్డ్కప్లోనూ ఇలాంటి సంఘటనే జరిగింది. రన్ మెషిన్ విరాట్ కోహ్లీ గత వరల్డ్కప్లో ఇలానే వరుస ఫెయిల్యూర్లతో ఆందోళన రేకెత్తించాడు. చివరికి సెమీస్లోనూ రాణించలేకపోయాడు.ఆ సమయంలో అప్పటి కెప్టెన్గా ఉన్న రోహిత్ సరిగ్గా ఇలాంటి కామెంట్లే చేశాడు. కోహ్లీ ఫైనల్లో ఖచ్చితంగా రాణిస్తాడని ఆశాభావం వ్యక్తం చేశాడు. రోహిత్ అన్నట్టే కోహ్లీ ఫైనల్లో సౌతాఫ్రికాపై విజృంభించాడు. ఆసక్తికరంగా ఫైనల్లో అంతా విఫలమవగా కోహ్లీ ఒక్కడే ఆదుకున్నాడు. కాగా టీ20 ప్రపంచకప్-2024 ఫైనల్లో ఓపెనింగ్ బ్యాటర్ కోహ్లి 59 బంతుల్లో 76 పరుగులు సాధించాడు.దీంతో ఇప్పుడు సంజూ అన్నట్టు.. ఈసారి అభిషేక్ కూడా ఫైనల్లో విశ్వరూపం చూపిస్తాడని ఫ్యాన్స్ ఆశిస్తున్నారు. అదే జరిగితే అంతకంటే సంతోషం ఉండదు. చూడాలి మరి అభిషేక్ శర్మ అభిమానులతో పాటు యాజమాన్యం నమ్మకం నిలబెట్టుకుంటాడో లేదో!! -
IND vs NZ: అభిషేక్ శర్మ వద్దు.. అతడిని ఆడించండి!
న్యూజిలాండ్తో ఫైనల్లో భారత తుదిజట్టు కూర్పు గురించి చర్చ నడుస్తోంది. వరుస వైఫల్యాల తర్వాత కూడా అభిషేక్ శర్మను కొనసాగించే అవకాశాలే ఎక్కువగా ఉన్నట్లు కనిపిస్తోంది. కీలక మ్యాచ్కు ముందు తుదిజట్టులో మార్పులు చేసి రిస్క్ తీసుకోవద్దని యాజమాన్యం భావిస్తున్నట్లు సమాచారం.అయితే, టీమిండియా మాజీ క్రికెటర్ మహ్మద్ కైఫ్ (Mohammad Kaif) మాత్రం ఇందుకు భిన్నంగా స్పందించాడు. వైఫల్యాలు అభిషేక్ శర్మ మానసిక స్థితిపై కూడా ప్రభావం చూపే అవకాశం ఉందని.. కాబట్టి అతడికి విశ్రాంతినివ్వడమే ఉత్తమమని పేర్కొన్నాడు. ఇందుకు వెస్టిండీస్ ఆటగాళ్లను ఉదాహరిస్తూ పోలిక తెచ్చాడు.విశ్రాంతినివ్వాలి‘‘అభిషేక్ శర్మకు మేనేజ్మెంట్ విశ్రాంతినివ్వాలి. ఇప్పటికే అతడు చాలా మ్యాచ్లు ఆడేశాడు. అన్నింటిలోనూ విఫలం అయ్యాడు. ఫైనల్లో తుదిజట్టులో మార్పులు చేయడం ఏమంత హానికరం కాదు. పొట్టి ఫార్మాట్లో ఎప్పటికప్పుడు ఇలాంటి మార్పులు సహజమే.టీమిండియాతో సూపర్-8 మ్యాచ్లో వెస్టిండీస్.. ఫామ్లో లేని బ్రాండన్ కింగ్కు బదులు.. రోస్టన్ ఛేజ్ను ఓపెనర్గా ఆడించింది. బ్రాండన్రు ఐదు- ఆరు మ్యాచ్లు ఆడించినా ఫలితం లేకుండా పోయింది. అందుకే కీలక మ్యాచ్ అయినా సరే అతడికి బ్రేక్ ఇచ్చారు.టీమిండియా కూడా ఆదిలో సంజూను పక్కన పెట్టింది. కీలక మ్యాచ్లలో ఆడించి అనుకున్న ఫలితం రాబట్టింది. అతడు గొప్ప ఇన్నింగ్స్తో ఆకట్టుకున్నాడు. జట్టుకు ప్రయోజనం చేకూర్చాడు. భారత జట్టులో ఇప్పటికే ఎంతో మంది ఆటగాళ్లు తమ ప్రతిభను నిరూపించుకున్నారు.రింకూను ఆడించండిటెస్టులు, రంజీ ట్రోఫీ, ఐపీఎల్.. ఇలా టోర్నీ ఏదైనా రింకూ సింగ్ పరుగులు రాబట్టగలడు. కుల్దీప్ యాదవ్, మహ్మద్ సిరాజ్ కీలక సమయాల్లో వికెట్లు కూల్చి జట్టును గెలిపించిన సందర్భాలు ఉన్నాయి. అలాంటి ప్లేయర్లు డగౌట్లో కూర్చుని ఉండటం చూస్తే.. అభిషేక్ శర్మకు బదులు వీరిలో ఒకరిని ఆడించవచ్చు కదా అనిపిస్తుంది.అవును.. ఫామ్లేమితో ఇబ్బంది పడుతున్న అభిషేక్ శర్మకు బదులు డగౌట్లో కూర్చోబెడుతున్న రింకూ సింగ్ను తుదిజట్టులోకి తీసుకోండి. బాగా ఆడని ఆటగాడికి చోటు ఇస్తూ.. అద్భుతంగా ఆడే ప్లేయర్ను బెంచ్కే పరిమితం చేయడం సరికాదు. అభిషేక్ శర్మ గొప్ప నైపుణ్యాలు ఉన్న ఆటగాడే. కానీ ఐసీసీ టోర్నీలు అతడికి కొత్త. ఏదేమైనా సంజూతో అతడిని పోల్చవద్దు. సంజూతో పోలిక వద్దుఇప్పటికే సంజూ అంతర్జాతీయ స్థాయిలో, ఐపీఎల్లో తానేంటో నిరూపించుకున్నాడు. టాప్-10 బ్యాటర్లలో అతడూ ఉంటాడు’’ అని మహ్మద్ కైఫ్ తన యూట్యూబ్ చానెల్ వేదికగా అభిప్రాయాలు పంచుకున్నాడు. ఫైనల్లో అభిషేక్ శర్మను తప్పించి రింకూను ఫైనల్లో ఆడించాలని కైఫ్ సూచించాడు. కాగా టీ20 ప్రపంచకప్-2026 ఫైనల్లో భారత్- న్యూజిలాండ్ ఆదివారం తలపడనున్నాయి. ఇందుకు అహ్మదాబాద్లోని నరేంద్ర మోదీ స్టేడియం వేదిక.చదవండి: T20 WC Final: విజేత ఆ జట్టే: సౌతాఫ్రికా దిగ్గజాలు -
నీకంత దూకుడు ఎందుకు?: అభిషేక్ శర్మపై అశ్విన్ ఆగ్రహం
అభిషేక్ శర్మ.. తొలిసారి ప్రపంచకప్ టోర్నీ ఆడుతున్న ఈ ఓపెనింగ్ బ్యాటర్ దారుణంగా విఫలమవుతున్నాడు. ఇప్పటి వరకు ఆడిన మ్యాచ్లలో అతడు చేసిన స్కోర్లు వరుసగా.. 0 (1), 0 (4), 0 (3), 15 (12), 55 (30), 10 (11), 9 (7).విఫలమైనా..లీగ్ దశలో మూడు మ్యాచ్లు ఆడి డకౌట్ అయినా యాజమాన్యం అభిషేక్ శర్మ (Abhishek Sharma)ను ఓపెనర్గా కొనసాగించిది. అయితే, అతడి ఆట తీరు మాత్రం మారలేదు. ముఖ్యంగా ఇంగ్లండ్తో కీలక సెమీ ఫైనల్లోనూ ఈ ఎడమచేతి వాటం బ్యాటర్ తేలిపోయాడు. తొందరపడి వికెట్ పారేసుకుని తొమ్మిది పరుగులకే నిష్క్రమించాడు.సంజూ మెరుపు ఇన్నింగ్స్మరో ఓపెనర్ సంజూ శాంసన్ (Sanju Samson) మెరుపు ఇన్నింగ్స్ (42 బంతుల్లో 89) తో రాణించి జట్టు విజయంలో కీలక పాత్ర పోషించాడు. ఈ నేపథ్యంలో అభిషేక్ ఆట తీరుపై విమర్శల వర్షం కురుస్తోంది. టీమిండియా దిగ్గజ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ సైతం ఈ ఓపెనింగ్ బ్యాటర్ వైఖరిని తప్పుబట్టాడు.తలతిక్క బ్యాటింగ్‘‘ఇంగ్లండ్తో సెమీ ఫైనల్లో అతడు తలతిక్కగా బ్యాటింగ్ చేశాడు. నిజానికి అభిషేక్ గేమ్ప్లాన్కు నేను వీరాభిమానిని. విల్ జాక్స్ బౌలింగ్లో అతడు ఎనిమిది పరుగులు రాబట్టాడు. కానీ ఈ తర్వాత అతడి ఓవర్లోనే 30 పరుగులు తీయాలి అన్నట్లు తొందరపడ్డాడు.నీకంత దూకుడు ఎందుకు?కొన్నిసార్లు బాల్ను వదిలేయాల్సి ఉంటుంది. ఓవైపు సంజూ శాంసన్ కుదురుగా ఆడుతున్నాడు కదా!.. నీకు కష్టంగా అనిపిస్తే ఒక సింగిల్ తీసి మరో ఎండ్కు వెళ్లిపోవాల్సింది. ఆ తర్వాత మళ్లీ అవకాశం వస్తుంది కదా!.. ఏదేమైనా అంత దూకుడు పనికిరాదు’’ అని అశ్విన్ అభిషేక్పై మండిపడ్డాడు.అదే విధంగా.. న్యూజిలాండ్తో ఫైనల్ నేపథ్యంలో.. ‘‘అభిషేక్ మంచి బ్యాటర్. న్యూజిలాండ్తో ఇటీవలి సిరీస్లో సూపర్ ఫామ్ కనబరిచాడు. మిచెల్ సాంట్నర్, మ్యాట్ హెన్రీ బౌలింగ్లో గతంలో అదరగొట్టాడు.ఒత్తిడిలో ఉన్నాడుఅయితే, ఇప్పుడు అతడు ఒత్తిడిలో ఉన్నాడు. కెప్టెన్, హెడ్కోచ్ అతడితో మాట్లాడాలి. తనకు వ్యతిరేకంగా ప్రత్యర్థి జట్టు వద్ద ఉన్న ప్రణాళికలను వివరించాలి. అతడిలో గొప్ప ప్రతిభ ఉంది. కానీ ఎందుకో తడబడుతున్నాడు.ఇలాంటి తరుణంలో అతడిపై మరింత ఒత్తిడి చేసే విధంగా మేనేజ్మెంట్ ఉండకూడదు. మానసికంగా దృఢంగా తయారయ్యేలా తీర్చిదిద్దాలి’’ అని టీమిండియా యాజమాన్యానికి అశూ సూచనలు ఇచ్చాడు. కాగా ఇంగ్లండ్తో మ్యాచ్లో ఆ జట్టు కెప్టెన్ హ్యారీ బ్రూక్.. అభిషేక్ కోసం లెగ్సైడ్లో ఒకే ఒక్క ఫీల్డర్ను ఉంచాడు. అతడికి క్యాచ్ ఇచ్చి అభిషేక్ పెవిలియన్ చేరాడు. ఇదిలా ఉంటే.. మార్చి 8న భారత్- న్యూజిలాండ్ మధ్య టీ20 ప్రంచకప్-2026 ఫైనల్కు షెడ్యూల్ ఖరారైంది.చదవండి: T20 WC: అతడి వల్లే ఇదంతా.. మా కొంప మునిగింది అక్కడే: మెకల్లమ్ -
సంజూ కాదు!.. అతడే అందుకు అర్హుడు: మాజీ క్రికెటర్
టీమిండియా ప్రధాన పేసర్ జస్ప్రీత్ బుమ్రాపై భారత మాజీ ఆల్రౌండర్ ఇర్ఫాన్ పఠాన్ ప్రశంసలు కురిపించాడు. బుమ్రా లాంటి బౌలర్ దొరకడం భారత జట్టు చేసుకున్న అదృష్టం అని కొనియాడాడు. టీమిండియాలో ఇంత వరకు ఇలాంటి బౌలర్ను ఎన్నడూ చూడలేదంటూ ఆకాశానికెత్తాడు.టైటిల్ పోరుకు అర్హతటీ20 ప్రపంచకప్-2026లో భారత్ ఫైనల్కు దూసుకువెళ్లిన విషయం తెలిసిందే. ముంబై వేదికగా వాంఖడేలో జరిగిన సెమీ ఫైనల్లో ఇంగ్లండ్పై ఏడు పరుగుల తేడాతో గెలిచిన సూర్య సేన.. టైటిల్ పోరుకు అర్హత సాధించింది.ఈ మ్యాచ్లో ఓపెనర్ సంజూ శాంసన్ (42 బంతుల్లో 89) బ్యాట్తో రాణిస్తే.. బుమ్రా తన అద్భుత స్పెల్తో ఆకట్టుకున్నాడు. ముఖ్యంగా ఇంగ్లండ్ చిచ్చర పిడుగు జేకబ్ బెతెల్ (48 బంతుల్లో 105) విధ్వంసకర ఇన్నింగ్స్తో మ్యాచ్ను లాగేసుకునే ప్రయత్నం చేస్తున్న వేళ.. బుమ్రా తన మ్యాజిక్ చూపించాడు.కీలక సమయంలో రాణించిపద్దెనిమిదవ ఓవర్లో 0,1,1,2,1,1 మాత్రమే ఇచ్చిన బుమ్రా.. టీమిండియా వైపు మ్యాచ్ తిప్పేశాడు. ఈ నేపథ్యంలో ఇర్ఫాన్ పఠాన్ బుమ్రాను ప్రశంసలతో ముంచెత్తాడు. ‘‘బుమ్రా గురించి ఇప్పటికే చాలాసార్లు మాట్లాడుకున్నాం. అతడు తరానికొక్క బౌలర్. టీమిండియాలో ఇలాంటి బౌలర్ను చూడటం అరుదు.సంజూ కాదు!.. అతడే అందుకు అర్హుడుయార్కర్లు, స్లో బాల్స్ వేస్తాడు.. అవుట్ స్వింగ్, ఇన్స్వింగ్ రాబడతాడు. బౌన్సర్లు సంధిస్తాడు. ముఖ్యంగా ఒత్తిడిలోనూ ఎలా బౌలింగ్ చేయాలో అతడికి బాగా తెలుసు. నా దృష్టిలో ఈ మ్యాచ్కు సంబంధించి బుమ్రాకే ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు ఇవ్వాల్సింది.ఈ పిచ్పై బౌలర్లందరి ఎకానమీ దాదాపుగా 10 దాటి పోయింది. రెండు జట్లు కలిపి 500కు పైగా పరుగులు చేశాయి. ఇలాంటి పరిస్థితుల్లో అలా బౌలింగ్ చేయడం అందరికీ సాధ్యం కాదు. ఇంతటి కఠినమైన ఓవర్ను బుమ్రా మాత్రమే వేయగలడు’’ అని ఇర్ఫాన్ పఠాన్ తన యూట్యూబ్ చానెల్ వేదికగా పేర్కొన్నాడు.అక్షర్ పటేల్ సైతంకాగా ఈ మ్యాచ్లో సంజూకు ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు దక్కింది. సంజూ సైతం బుమ్రానే ఈ అవార్డుకు అర్హుడు అని పేర్కొనడం గమనార్హం. ఇదిలా ఉంటే.. బుమ్రా ఓవరాల్గా నాలుగు ఓవర్లలో 33 పరుగులు ఇచ్చి ఒక వికెట్ తీశాడు. మరోవైపు.. అక్షర్ పటేల్ అద్భుతమైన క్యాచ్లతో టీమిండియా విజయంలో తన వంతు పాత్ర పోషించాడు. Next stop: FINAL! 😍A high-scoring thriller, but #TeamIndia hold their nerve and book a spot in the final! 🔥ICC Men’s #T20WorldCup | FINAL | #INDvNZ | SUN, 8th MAR, 5:30 PM pic.twitter.com/PQfdlxUEv7— Star Sports (@StarSportsIndia) March 5, 2026చదవండి: T20 WC: అతడి వల్లే ఇదంతా.. మా కొంప మునిగింది అక్కడే: మెకల్లమ్ -
T20 WC 2026: ప్లేయర్ ఆఫ్ ద టోర్నీ నామినీల పేర్లు ప్రకటన
2026 టీ20 ప్రపంచకప్ ప్లేయర్ ఆఫ్ ద టోర్నీ నామినీల పేర్లను ఐసీసీ ఇవాళ (మార్చి 6) ప్రకటించింది. ఈ జాబితాలో మొత్తం ఎనిమిది మంది ఆటగాళ్లు ఉన్నారు. వీరిలో ఒక టీమిండియా ప్లేయర్, ఓ పాకిస్తానీ ప్లేయర్ ఉన్నారు.భారత్ తరఫున ఈ అవార్డుకు నామినేట్ అయిన ఆ ఒకే ఒక్కడు సంజూ శాంసన్. సంజూ ఈ టోర్నీలో ఇప్పటివరకు ఆడిన 4 మ్యాచ్ల్లో 232 పరుగులు చేశాడు. అతని సగటు 77.33, స్ట్రైక్ రేట్ 201.73గా ఉంది. ఈ టోర్నీలో భారత్ ఫైనల్కు చేరడంలో సంజూది కీలకపాత్ర. సెమీస్కు చేరాలంటే తప్పక గెలవాల్సిన మ్యాచ్లో వెస్టిండీస్పై ఉగ్రరూపం (50 బంతుల్లో 97 నాటౌట్) దాల్చాడు. ఆపై సెమీస్లో ఇంగ్లండ్పై మ్యాచ్ విన్నింగ్ ఇన్నింగ్స్ 89 (42 బంతులు) ఆడి భారత్ను ఫైనల్కు చేర్చాడు.పాకిస్తాన్ తరఫున ఈ అవార్డుకు నామినేట్ అయిన ప్లేయర్ సాహిబ్జాదా ఫర్హాన్. ఫర్హాన్ తన జట్టు సూపర్-8 దశ దాటలేకపోయినా, అద్బుత ప్రదర్శనలతో అలరించాడు. శ్రీలంక, నమీబియాపై శతకాలు సాధించి, ఒకే వరల్డ్ కప్లో రెండు సెంచరీలు చేసిన తొలి ఆటగాడిగా రికార్డు నెలకొల్పాడు. ఈ టోర్నీలో 7 మ్యాచ్లు ఆడిన ఫర్హాన్.. 76.63 సగటున, 160.25 స్ట్రైక్ రేట్తో 383 పరుగులు చేశాడు.ఇతర నామినీలువిల్ జాక్స్ (ఇంగ్లండ్) – 226 పరుగులు, 9 వికెట్లు.రచిన్ రవీంద్ర (న్యూజిలాండ్) – 128 పరుగులు, 11 వికెట్లు.ఏయిడెన్ మార్క్రమ్ (దక్షిణాఫ్రికా కెప్టెన్) – 286 పరుగులు, కీలక వికెట్లు.టిమ్ సీఫర్ట్ (న్యూజిలాండ్) – 274 పరుగులు, సెమీఫైనల్లో 58.లుంగి ఎంగిడి (దక్షిణాఫ్రికా) – 12 వికెట్లు, ఎకానమీ 7.19.షాడ్లీ వాన్ స్కాల్క్విక్ (అమెరికా) – 13 వికెట్లు, టోర్నమెంట్లో అత్యధిక వికెట్లు.కాగా, టీ20 ప్రపంచకప్ 2026 తుది అంకానికి చేరింది. భారత్, న్యూజిలాండ్ ఫైనల్స్కు చేరాయి. న్యూజిలాండ్ సౌతాఫ్రికాను.. భారత్ ఇంగ్లండ్ను మట్టికరిపించి తుది పోరులో అమీతుమీకి సిద్దమయ్యాయి. అంతిమ సమరం మార్చి 8న అహ్మదాబాద్లోని నరేంద్ర మోదీ స్టేడియం వేదికగా జరుగనుంది. -
ఫైనల్లోకి ఏంట్రీ ఇంగ్లాండ్ కు భారత్ ఊచకోత..
-
టీమిండియా గెలుపుకు 3 కారణాలు ఇవే
-
వాంఖడేను సైలెంట్ చేస్తామన్నారు... కానీ మనవాళ్లు మోత మోగించారు!
-
T20 WC 2026: అదే మా కొంపముంచింది.. బ్రూక్ ఆవేదన
క్యాచెస్ విన్ మ్యాచెస్ అన్న నమ్మకాన్ని నిన్నటి భారత్-ఇంగ్లండ్ టీ20 వరల్డ్కప్ సెమీఫైనల్ మ్యాచ్ మరోసారి రుజువు చేసింది. ఈ మ్యాచ్ కీలక దశలో శివమ్ దూబే (అక్షర్ పటేల్ సాయంతో), తిలక్ వర్మ పట్టిన రెండు అద్భుతమైన క్యాచ్లు మ్యాచ్ గతినే మార్చేశాయి. అప్పటివరకు ఇంగ్లండ్కు అనుకూలంగా ఉన్న సమీకరణలు.. ఆ రెండు క్యాచ్ల తర్వాత భారత్పైపు మళ్లాయి.254 పరుగుల ఛేదనలో ఇంగ్లండ్ లక్ష్యం వైపు దూసుకెళ్తున్న వేల, అక్షర్ పటేల్-శివమ్, తిలక్ వర్మ చాకచక్యంగా వ్యవహరించి ప్రమాదకరంగా ఉన్న విల్ జాక్స్, సామ్ కర్రన్ను అద్భుతమైన క్యాచ్లతో పెవిలియన్కు పంపారు. ఈ మ్యాచ్లో భారత్ గెలుపుకు ఈ రెండు క్యాచ్లు ఓ కారణంగా చెప్పుకోవచ్చు.లక్ష్య ఛేదనలో జేకబ్ బేతెల్ (48 బంతుల్లో 105; 8 ఫోర్లు, 7 సిక్సర్లు) వీరోచిత శతకంతో పోరాడినప్పటికీ ఇంగ్లండ్ గెలుపు వాకిటి వరకు వచ్చి ఓటమిపాలైంది. అయితే ఈ మ్యాచ్లో ఇంగ్లండ్ ఓటమికి మరో క్యాచ్ కూడా కారణమైంది. అదేంటంటే.. భారత ఇన్నింగ్స్ మూడో ఓవర్ (జోఫ్రా ఆర్చర్) రెండో బంతికి సంజూ శాంసన్ ఇచ్చిన సునాయాసమైన క్యాచ్ను ఇంగ్లండ్ కెప్టెన్ హ్యారీ బ్రూక్ నేలపాలు చేశాడు. ఇక్కడే ఇంగ్లండ్ ఓటమికి మొదటి బీజం పడింది. లైఫ్ లభించడంతో చెలరేగిపోయిన సంజూ బౌండరీలు, సిక్సర్లతో విరుచుకుపడి భారత్ భారీ స్కోర్ చేయడంలో కీలకపాత్ర పోషించాడు. సంజూకు లైఫ్ లభించే సమయానికి అతని స్కోర్ కేవలం 15 పరుగులే. లైఫ్ లభించాక పేట్రేగిపోయిన సంజూ మొత్తంగా 42 బంతుల్లో 8 ఫోర్లు, 7 భారీ సిక్సర్ల సాయంతో 89 పరుగులు చేసి ఔటయ్యాడు.ఒకవేళ సంజూ క్యాచ్ను బ్రూక్ ఆదిలోనే పట్టి ఉంటే, టీమిండియా ఈ స్థాయి స్కోర్ చేసుండకపోయేదేమో. ఏదిఏమైనా సంజూ క్యాచ్ వదలి బ్రూక్ సహా యావత్ ఇంగ్లండ్ టీమ్ మూల్యం చెల్లించుకుంది.ఈ మ్యాచ్లో మరో టర్నింగ్ పాయింట్ ఇంగ్లండ్ ఇన్నింగ్స్ 18, 19వ ఓవర్లు. అప్పటివరకు గెలుపుపై ఆశలు పెట్టుకున్న ఇంగ్లండ్ను భారత పేసర్లు బుమ్రా, హార్దిక్ పాండ్యా దారుణంగా దెబ్బకొట్టారు. 18 బంతుల్లో 45 పరుగులు చేయాల్సిన తరుణంలో 18వ ఓవర్ వేసిన బుమ్రా కేవలం 6 పరుగులు మాత్రమే ఇచ్చి ఇంగ్లండ్ లక్ష్యాన్ని మరింత దూరం చేశాడు. 19వ ఓవర్ బంతిని అందుకున్న హార్దిక్ ప్రమాదకరంగా కనినిస్తున్న సామ్ కర్రన్ను ఔట్ చేయడంతో పాటు ఆ ఓవర్లో 9 పరుగులు మాత్రమే ఇవ్వడంతో భారత్కు గెలుపుపై ధీమా వచ్చింది.చివరి ఓవర్ వేసిన దూబే తొలి బంతికే బేతెల్ను ఔట్ చేయడంతో భారత శిబిరం ఊపిరి పీల్చుకుంది. ఆతర్వాత రెండు బంతులకు సింగిల్స్ మాత్రమే ఇచ్చిన దూబే... చివరి మూడు బంతులకు సిక్సర్లు ఇచ్చినప్పటికీ (ఆర్చర్) అప్పటికే ఇంగ్లండ్ ఓటమి ఖరారైపోయింది.మొత్తంగా సంజూ శాంసన్ డ్రాప్ క్యాచ్, శివమ్ దూబే (అక్షర్ పటేల్ సాయంతో), తిలక్ వర్మ క్యాచ్లు, బుమ్రా, హార్దిక్ పొదుపైన ఓవర్లు, చివరి ఓవర్ తొలి బంతికి రనౌట్ కావడం వంటి అంశాలు భారత్ గెలుపుకు కీలక కారణాలుగా నిలిచాయి.అయితే వీటిలో సంజూ డ్రాప్ క్యాచే ఇంగ్లండ్ కొంపముంచిందని హ్యారీ బ్రూక్ అభిప్రాయపడ్డాడు. సంజూ క్యాచ్ వదలి చాలా పెద్ద తప్పు చేశానని మ్యాచ్ అనంతరం ఆవేదన వ్యక్తం చేశాడు. -
టి20 ప్రపంచకప్లో తుది పోరుకు భారత్ (ఫొటోలు)
-
IND Vs ENG: పరుగుల వరదతో ఫైనల్లోకి
భారత జట్టు స్కోరు 253 పరుగులు... ఇందులో 18 ఫోర్లు, 19 సిక్స్లు.. వరల్డ్ కప్ చరిత్రలో ఏ జట్టూ కూడా ఇంత లక్ష్యాన్ని ఛేదించలేదు. ఇక గెలుపు లాంఛనమే, ఫైనల్ చేరడం ఖాయమనే అనిపించింది. కానీ ఇంగ్లండ్ కూడా ఏమాత్రం తగ్గలేదు. భారీ స్కోరును చూసి బెదిరిపోకుండా ఆ జట్టు కూడా 21 ఫోర్లు, 15 సిక్స్లతో ఆఖరి వరకూ పోరాడింది... కానీ అదృష్టవశాత్తూ టీమిండియా అభిమానులు ఊపిరి పీల్చుకున్నారు. పరుగుల వరద పారిన ఈ మ్యాచ్లో చివరకు 7 పరుగులతో సూర్యకుమార్ బృందం గట్టెక్కింది. గత మ్యాచ్ తరహాలోనే సంజు సామ్సన్ మరో అద్భుత ఇన్నింగ్స్తో జట్టును నడిపించగా... ఇంగ్లండ్ తరఫున జాకబ్ బెతెల్ శతకం జట్టును గెలిపించేందుకు సరిపోలేదు. చివర్లో కట్టుదిట్టమైన మన బౌలింగ్ భారత్ను ఫైనల్కు చేర్చింది. టి20 వరల్డ్ కప్ను నిలబెట్టుకున్న తొలి జట్టుగా నిలిచేందుకు ఇక ఒకే ఒక్క విజయం భారత్కు కావాలి. ఆదివారం ఆఖరి సమరంలో న్యూజిలాండ్తో అమీతుమీ తేల్చుకోవడమే టీమిండియాకు మిగిలింది. ముంబై: టి20 వరల్డ్ కప్ను నిలబెట్టుకునే ప్రయత్నంలో భారత జట్టు ఒకే ఒక్క అడుగు దూరంలో నిలిచింది. వరుసగా రెండోసారి మన టీమ్ తుది పోరుకు అర్హత సాధించింది. గురువారం వాంఖెడే మైదానంలో హోరాహోరీగా సాగిన రెండో సెమీఫైనల్ సమరంలో 7 పరుగుల తేడాతో ఇంగ్లండ్ను ఓడించి భారత్ ఫైనల్లోకి అడుగు పెట్టింది. టాస్ గెలిచిన ఇంగ్లండ్ ఫీల్డింగ్ ఎంచుకోగా, ముందుగా బ్యాటింగ్కు దిగిన భారత్ నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 253 పరుగులు చేసింది.‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’ సంజు సామ్సన్ (42 బంతుల్లో 89; 8 ఫోర్లు, 7 సిక్స్లు) మెరుపు బ్యాటింగ్తో చెలరేగగా... శివమ్ దూబే (25 బంతుల్లో 43; 1 ఫోర్, 4 సిక్స్లు), ఇషాన్ కిషన్ (18 బంతుల్లో 39; 4 ఫోర్లు, 2 సిక్స్లు) కీలక పరుగులు సాధించారు. అనంతరం ఇంగ్లండ్ 20 ఓవర్లలో 7 వికెట్లకు 246 పరుగులు చేసి ఓడిపోయింది. జాకబ్ బెతెల్ (48 బంతుల్లో 105; 8 ఫోర్లు, 7 సిక్స్లు) సెంచరీతో పోరాడినా జట్టుకు ఓటమి తప్పలేదు. ఆదివారం అహ్మదాబాద్లో జరిగే ఫైనల్లో న్యూజిలాండ్తో భారత్ తలపడుతుంది. భారత్, కివీస్ మధ్య టి20 వరల్డ్ కప్ ఫైనల్ జరగడం ఇదే తొలిసారి. పోటీ పడి సిక్సర్లు బాది... ఓపెనర్ అభిషేక్ శర్మ (9) మరోసారి విఫలమైనా... సామ్సన్, ఇషాన్ భాగస్వామ్యంతో భారత్ దూసుకుపోయింది. ఆర్చర్ తొలి ఓవర్లో వరుసగా 4, 6 కొట్టిన సామ్సన్ అతని రెండో ఓవర్లో కూడా 2 ఫోర్లు, సిక్స్ బాదాడు. మరోవైపు ఇషాన్ కూడా మూడు ఫోర్లు కొట్టడంతో పవర్ప్లే ముగిసేసరికి స్కోరు 67 పరుగులకు చేరింది. డాసన్ ఓవర్లో భారీ సిక్స్తో 26 బంతుల్లో సామ్సన్ అర్ధ సెంచరీ పూర్తి చేసుకోగా, స్యామ్ కరన్ ఓవర్లో ఇద్దరూ కలిసి 20 పరుగులు రాబట్టారు. రెండో వికెట్కు 45 బంతుల్లో 97 పరుగులు జోడించిన తర్వాత ఎట్టకేలకు ఇషాన్ను రషీద్ అవుట్ చేశాడు. అయితే స్పిన్ను సమర్థంగా ఎదుర్కొనే వ్యూహంతో బ్యాటింగ్లో ముందుగా దూబేను పంపిన భారత్ ఫలితం రాబట్టింది. రషీద్ ఓవర్లో 2 భారీ సిక్స్లతో అతను చెలరేగాడు. ఆ తర్వాత ఆర్చర్ ఓవర్లో మరో రెండు సిక్స్లు బాదిన సామ్సన్ మరింత దూకుడుగా ఆడే ప్రయత్నంలో వెనుదిరిగాడు. సూర్యకుమార్ (11) ఎక్కువసేపు నిలవలేకపోగా, ఒవర్టన్ ఓవర్లో హార్దిక్ పాండ్యా (12 బంతుల్లో 27; 3 ఫోర్లు, 2 సిక్స్లు) మూడు ఫోర్లు కొట్టాడు. ఆర్చర్ వేసిన 19వ ఓవర్లో తిలక్ వర్మ (7 బంతుల్లో 21; 3 సిక్స్లు) ఏకంగా మూడు భారీ సిక్సర్లతో రెచ్చిపోయాడు. 20వ ఓవర్లో పాండ్యా మరో 2 సిక్స్లు కొట్టడంతో స్కోరు 250 దాటింది. ఆఖరి 5 ఓవర్లలో భారత్ 76 పరుగులు సాధించడం విశేషం. టాపార్డర్ విఫలం... భారీ లక్ష్య ఛేదనలో ఇంగ్లండ్ ఆరంభంలోనే ఫిల్ సాల్ట్ (5) వికెట్ కోల్పోయింది. జోస్ బట్లర్ (17 బంతుల్లో 25; 4 ఫోర్లు, 1 సిక్స్), హ్యారీ బ్రూక్ (7), టామ్ బాంటన్ (17) కూడా ఎక్కువసేపు నిలవలేకపోయారు. అయితే బెతెల్ మాత్రం పోరాటపటిమ కనబర్చాడు. బుమ్రా బౌలింగ్లో సిక్స్ కొట్టిన అతను వరుణ్ చక్రవర్తి ఓవర్లో వరుసగా 6, 6, 6 బాదడం విశేషం. పాండ్యా ఓవర్లోనూ అతను వరుసగా సిక్స్, ఫోర్ కొట్టాడు. మరోవైపు విల్ జాక్స్ (20 బంతుల్లో 35; 4 ఫోర్లు, 2 సిక్స్లు) కూడా బెతెల్కు సహకరించాడు. వీరిద్దరు ఐదో వికెట్కు 39 బంతుల్లో 77 పరుగులు జోడించారు. జాక్స్ అవుటైన తర్వాత స్యామ్ కరన్ (18)తో కలిసి గెలిపించేందుకు బెతెల్ తీవ్రంగా ప్రయత్నించాడు. అయితే ఆఖరి 5 ఓవర్లలో 69 పరుగులు చేయాల్సిన దశలో రెండు ఓవర్లు వేసిన బుమ్రా 14 పరుగులు మాత్రమే ఇవ్వడంతో మ్యాచ్ భారత్ వైపు మళ్లింది. 45 బంతుల్లో సెంచరీ పూర్తి చేసుకున్న బెతెల్... శివమ్ దూబే వేసిన చివరి ఓవర్ తొలి బంతికి రనౌట్ కావడంతో ఇంగ్లండ్ ఆశలు కోల్పోయింది. తర్వాతి ఐదు బంతుల్లో ఆర్చర్ (19 నాటౌట్) మూడు సిక్స్లు బాదినా లాభం లేకపోయింది. 17 ఓవర్ల వరకు ఇంగ్లండ్దే పైచేయి... దాదాపు అసాధ్యమైన లక్ష్యమే అయినా ఇంగ్లండ్ పూర్తిగా తడబడలేదు. వికెట్లు పడుతున్నా పరుగుల వేగం మాత్రం తగ్గించలేదు. ఇరు జట్ల ఇన్నింగ్స్లను పోలిస్తే 17 ఓవర్లు ముగిసేసరికి ఇంగ్లండ్దే పైచేయిగా ఉంది. 10 ఓవర్లలో స్కోర్లు 119, 119తో సమంగా ఉండగా 15 ఓవర్లలో 177, 185తో ఇంగ్లండ్ ముందంజలో ఉంది. 17 ఓవర్లలో 205/4, 209/5తో వారిదే పైచేయి. అయితే చివరి 3 ఓవర్లు తేడా చూపించాయి. ఆర్చర్ వేసిన 19వ ఓవర్లో తిలక్ కొట్టిన 3 సిక్స్లు కీలకంగా మారాయి. దూబే వేసిన ఆఖరి ఓవర్లో 30 పరుగులు కాపాడుకోవాల్సి వచ్చింది కాబట్టి భారత్ బతికిపోయింది. మరికొన్ని పరుగులు తక్కువగా ఉన్నా కష్టమయ్యేది. సామ్సన్ క్యాచ్ వదిలేసి... గత మ్యాచ్ తరహాలో ఈసారి కూడా సామ్సన్ దూకుడైన బ్యాటింగ్తో చెలరేగిపోయాడు. అయితే అతనికి ఈసారి అదృష్టం కూడా కలిసి వచ్చింది. సామ్సన్ 15 పరుగుల వద్ద ఉన్నప్పుడు ఆర్చర్ బౌలింగ్లో మిడాన్ వద్ద కెప్టెన్ బ్రూక్ అతి సునాయాస క్యాచ్ వదిలేశాడు. దానికి ఇంగ్లండ్ ఫలితం అనుభవించింది. క్యాచ్ చేజారడమే కాదు, ఈ క్షణం బౌలింగ్, ఫీల్డింగ్లో ఇంగ్లండ్ లయను బాగా దెబ్బ తీసింది. అప్పటి వరకు పరిస్థితి నియంత్రణలోనే ఉన్నా ఆ తర్వాత భారత్ పరుగుల వరద మొదలైంది. ఈ క్యాచ్ను బ్రూక్ పట్టి ఉంటే పరిస్థితి భిన్నంగా ఉండేదేమో. లైఫ్ లభించిన తర్వాత సామ్సన్ 36 బంతుల్లో 74 పరుగులు బాదాడు. ఆ ఒక్క ఓవర్లోనే... భారత్ ఇన్నింగ్స్లో ఆటగాళ్లంతా ఏ బౌలర్ను వదలకుండా ప్రతీ ఓవర్లో బౌండరీలతో చెలరేగారు. అయితే జాక్స్ వేసిన ఒక్క 14వ ఓవర్ మాత్రమే దీనికి మినహాయింపు. ఈ ఓవర్లో ఒక్క బౌండరీ కూడా ఇవ్వకుండా 7 పరుగులే ఇచ్చిన జాక్స్ తొలి బంతికే సామ్సన్ వికెట్ తీశాడు. అక్షర్ అదరహో... మైదానంలో అక్షర్ పటేల్ ఫీల్డింగ్ భారత్ విజయంలో కీలకపాత్ర పోషించింది. ముందుగా సులువైన క్యాచ్ అందుకొని సాల్ట్ వెనుదిరిగేందుకు కారణమైన అక్షర్ ఆ తర్వాత అసాధారణ క్యాచ్తో బ్రూక్ను వెనక్కి పంపాడు. బుమ్రా వేసిన తొలి బంతికే బ్రూక్ షాట్ ఆడగా బంతి ఫీల్డర్లపై నుంచి వెళ్లిపోయినట్లుగా అనిపించింది. కానీ పాయింట్ నుంచి అక్షర్ వెనుదిరిగి చాలా దూరం పరుగెత్తాడు. బంతి కిందకు పడిపోతున్న దశలో చేతులూ పూర్తిగా చాపి అందుకున్న అతను నేలపై పడినా పట్టు కోల్పోలేదు. అనంతరం కీలక దశలో బౌండరీ వద్ద పరుగెడుతూ వచ్చి జాక్స్ క్యాచ్ను అందుకున్న అతను పట్టు కోల్పోయి బౌండరీ దాటుతున్నట్లు అనిపించిన సమయంలో దూబే వైపు విసిరాడు. ఈ క్యాచ్తో మ్యాచ్ పూర్తిగా భారత్ వైపు మొగ్గింది.5 టి20 ప్రపంచకప్ నాకౌట్ మ్యాచ్ల్లో ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’ అవార్డు గెల్చుకున్న ఐదో భారత క్రికెటర్ సంజు సామ్సన్. గతంలో యువరాజ్ సింగ్ (2007లో ఆ్రస్టేలియాపై సెమీఫైనల్లో), ఇర్ఫాన్ పఠాన్ (2007లో పాకిస్తాన్పై ఫైనల్లో), విరాట్ కోహ్లి (2014లో దక్షిణాఫ్రికాపై సెమీఫైనల్లో; 2024లో దక్షిణాఫ్రికాపై ఫైనల్లో), అక్షర్ పటేల్ (2024లో ఇంగ్లండ్పై సెమీఫైనల్లో) ఈ ఘనత సాధించారు.4 ఐసీసీ టోర్నీల్లో అత్యధికంగా నాలుగోసారి భారత్–న్యూజిలాండ్ జట్లు ఫైనల్లో తలపడనున్నాయి.4 టి20 ప్రపంచకప్లో భారత్ నాలుగోసారి ఫైనల్కు చేరింది. 2007లో, 2024లో విజేతగా నిలిచిన భారత్ 2014లో శ్రీలంక చేతిలో ఓడి రన్నరప్గా నిలిచింది.105 టి20 వరల్డ్కప్ నాకౌట్ మ్యాచ్ల్లో అత్యధిక వ్యక్తిగత స్కోరు చేసిన ప్లేయర్గా బెతెల్ నిలిచాడు. దక్షిణాఫ్రికాతో బుధవారం జరిగిన తొలి సెమీఫైనల్లో ఫిన్ అలెన్ (100 నాటౌట్) స్కోరును బెతెల్ రెండో సెమీఫైనల్లో అధిగమించాడు.స్కోరు వివరాలు భారత్ ఇన్నింగ్స్: సామ్సన్ (సి) సాల్ట్ (బి) జాక్స్ 89; అభిషేక్ (సి) సాల్ట్ (బి) జాక్స్ 9; ఇషాన్ కిషన్ (సి) జాక్స్ (బి) రషీద్ 39; దూబే (రనౌట్) 43; సూర్యకుమార్ (స్టంప్డ్) బట్లర్ (బి) రషీద్ 11; పాండ్యా (రనౌట్) 27; తిలక్ (బి) ఆర్చర్ 21; అక్షర్ (నాటౌట్) 2; వరుణ్ (నాటౌట్) 0; ఎక్స్ట్రాలు 12; మొత్తం (20 ఓవర్లలో 7 వికెట్లకు) 253. వికెట్ల పతనం: 1–20, 2–117, 3–160, 4–190, 5–212, 6–236, 7–251. బౌలింగ్: ఆర్చర్ 4–0–61–1, జాక్స్ 4–0–40–2, ఒవర్టన్ 3–0–36–0, స్యామ్ కరన్ 4–0–53–0, ఆదిల్ రషీద్ 4–0–41–2, లియామ్ డాసన్ 1–0–19–0. ఇంగ్లండ్ ఇన్నింగ్స్: సాల్ట్ (సి) అక్షర్ (బి) పాండ్యా 5; బట్లర్ (బి) వరుణ్ 25; హ్యారీ బ్రూక్ (సి) అక్షర్ పటేల్ (బి) బుమ్రా 7; బెతెల్ (రనౌట్) 105; బాంటన్ (బి) అక్షర్ 17; జాక్స్ (సి) శివమ్ దూబే (బి) అర్ష్ దీప్ 35; స్యామ్ కరన్ (సి) తిలక్ వర్మ (బి) హార్దిక్ పాండ్యా 18; ఒవర్టన్ (నాటౌట్) 2; ఆర్చర్ (నాటౌట్) 19; ఎక్స్ట్రాలు 13; మొత్తం (20 ఓవర్లలో 7 వికెట్లకు) 246. వికెట్ల పతనం: 1–13, 2–38, 3–64, 4–95, 5–172, 6–222, 7–225. బౌలింగ్: అర్ష్ దీప్ సింగ్ 4–0–51–1, హార్దిక్ పాండ్యా 4–0–38–2, జస్ప్రీత్ బుమ్రా 4–0–33–1, వరుణ్ 4–0–64–1, అక్షర్ పటేల్ 3–0–35–1, శివమ్ దూబే 1–0–22–0. -
IND Vs ENG: నరాలు తెగే ఉత్కంఠ: టీమిండియా ధనాధన్ షో.. .. దర్జాగా ఫైనల్కు
టీ20 ప్రపంచకప్-2026 టోర్నమెంట్లో టీమిండియా ఫైనల్కు దూసుకువెళ్లింది. సెమీ ఫైనల్లో ఇంగ్లండ్ను ఓడించి.. టైటిల్ పోరుకు అర్హత సాధించింది. గత ఎడిషన్లో విజేతగా నిలిచిన భారత్.. ఈసారి కూడా ఫైనల్కు చేరి సత్తా చాటింది.253 పరుగులుముంబైలోని వాంఖడేలో టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన భారత్.. నిర్ణీత 20 ఓవర్లలో ఏడు వికెట్ల నష్టానికి 253 పరుగులు సాధించింది. ఓపెనర్ సంజూ శాంసన్ మరోసారి ధనాధన్ దంచికొట్టాడు. 42 బంతుల్లో 89 పరుగులతో ఈ వికెట్ కీపర్బ్యాటర్ అదరగొట్టాడు.వన్డౌన్ బ్యాటర్ ఇషాన్ కిషన్ (18 బంతుల్లో 39) కూడా వేగంగా ఆడగా.. ఆల్రౌండర్లు శివం దూబే (25 బంతుల్లో 43), హార్దిక్ పాండ్యా (12 బంతుల్లో 27) మెరుపులు మెరిపించారు. తిలక్ వర్మ (7 బంతుల్లో 21) సైతం రాణించాడు.ఇంగ్లండ్ బౌలర్లలో విల్ జాక్స్, ఆదిల్ రషీద్ చెరో రెండు వికెట్లు తీయగా.. జోఫ్రా ఆర్చర్కు ఒక వికెట్ దక్కింది. లక్ష్య ఛేదనలో ఇంగ్లండ్ ఆదిలోనే ఓపెనర్ ఫిల్ సాల్ట్ (5), వన్డౌన్ బ్యాటర్, కెప్టెన్ హ్యారీ బ్రూక్ (7) వికెట్లు కోల్పోయింది.పట్టువదలని విక్రమార్కుడిలాఇక టామ్ బాంటన్ (17) కాసేపు నిలబడగా.. జోస్ బట్లర్ 25 పరుగులతో ఫర్వాలేదనిపించాడు. అయితే, ఓవైపు వికెట్లు పడుతున్నా జేకబ్ బెతెల్ మాత్రం పట్టువదలని విక్రమార్కుడిలా క్రీజులో పాతుకుపోయాడు. కేవలం 19 బంతుల్లోనే అర్ధ శతకం బాది.. టీ20 ప్రపంచకప్ నాకౌట్ మ్యాచ్లలో ఫాస్టెస్ట్ హాఫ్ సెంచరీ చేసిన బ్యాటర్గా ఫిన్ అలెన్ (న్యూజిలాండ్) రికార్డు సమం చేశాడు.నరాలు తెగే ఉత్కంఠఅదే జోరు కొనసాగిస్తూ బెతెల్ భారత శిబిరంలో ఆందోళన పెంచాడు. అయితే, పద్దెనిమిదో ఓవర్లో బుమ్రా కట్టుదిట్టంగా బౌలింగ్ చేసి.. కేవలం ఆరు పరుగులే ఇచ్చాడు. ఈ క్రమంలో రెండు ఓవర్లలో ఇంగ్లండ్ విజయ సమీకరణం 39 పరుగులుగా మారింది.అయితే, హార్దిక్ పాండ్యా బౌలింగ్లో పందొమ్మిదో ఓవర్లో సిక్స్ బాది బెతెల్ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. 45 బంతుల్లోనే 102 పరుగులు సాధించాడు. దీంతో ఉత్కంఠ పెరిగింది. అయితే, పాండ్యా మూడో బంతికి సామ్ కర్రాన్ (18)ను అవుట్ చేశాడు. పాండ్యా బౌలింగ్లో కర్రాన్ బంతిని గాల్లోకి లేపగా బౌండరీ లైన్ వద్ద ఫీల్డింగ్ చేస్తున్న తిలక్ అద్భుతంగా క్యాచ్పట్టాడు.ఏడు పరుగుల తేడాతో గెలిచి ఫైనల్లోతన ఓవర్లో పాండ్యా 9 పరుగులే ఇవ్వగా.. ఆఖరి ఓవర్లో ఇంగ్లండ్ గెలుపునకు 30 పరుగులు అవసరమయ్యాయి. చివరి ఓవర్లో కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ బంతిని శివం దూబేకు ఇచ్చాడు. అతడి ఓవర్లో తొలి బంతికే బెతెల్ (105) రనౌట్ అయ్యాడు. దీంతో ఐదు బంతుల్లో 29 పరుగులు అవసరం కాగా.. ఆర్చర్ ఆఖరి మూడు బంతుల్లో సిక్సర్లు కొట్టినా లాభం లేకుండా పోయింది. ఇంగ్లండ్ 22 పరుగులకే పరిమితమైంది. ఫలితంగా టీమిండియా ఏడు పరుగుల తేడాతో గెలిచి ఫైనల్లో అడుగుపెట్టింది. ఇక అహ్మదాబాద్ వేదికగా ఆదివారం న్యూజిలాండ్తో ట్రోఫీ కోసం సూర్యకుమార్ సేన తలపడుతుంది. Next stop: FINAL! 😍A high-scoring thriller, but #TeamIndia hold their nerve and book a spot in the final! 🔥ICC Men’s #T20WorldCup | FINAL | #INDvNZ | SUN, 8th MAR, 5:30 PM pic.twitter.com/PQfdlxUEv7— Star Sports (@StarSportsIndia) March 5, 2026 స్కోర్లు: భారత్ - 253/7(20)ఇంగ్లండ్ - 246/7(20)ఫలితం: ఏడు పరుగుల తేడాతో భారత్ గెలుపు. -
చరిత్ర సృష్టించిన టీమిండియా.. వరల్డ్ రికార్డు
టీమిండియా సరికొత్త చరిత్ర సృష్టించింది. టీ20 క్రికెట్లో ఇంత వరకు ఏ జట్టుకూ సాధ్యం కాని ఘనత సాధించింది. పురుషుల పొట్టి ఫార్మాట్లో అత్యంత అరుదైన రికార్డును సొంతం చేసుకుంది.జింబాబ్వేపై 256 పరుగులుభారత జట్టు సొంతగడ్డపై టీ20 ప్రపంచకప్-2026 టోర్నీతో బిజీగా ఉన్న సంగతి తెలిసిందే. సూపర్-8 దశలో జింబాబ్వేపై 256 పరుగులు సాధించిన భారత జట్టు.. తాజాగా గురువారం నాటి మ్యాచ్లోనూ 250కి పైగా స్కోరు నమోదు చేసింది.పొట్టి క్రికెట్లో తొలి జట్టుగాముంబైలోని ప్రసిద్ధ వాంఖడే మైదానంలో ఇంగ్లండ్తో సెమీ ఫైనల్లో.. నిర్ణీత 20 ఓవర్లలో ఏడు వికెట్ల నష్టానికి 253 పరుగులు సాధించింది. ఓపెనర్ సంజూ శాంసన్ (42 బంతుల్లో 82) అదరగొట్టగా.. ఇషాన్ కిషన్ (18 బంతుల్లో 39), శివం దూబే (25 బంతుల్లో 43), హార్దిక్ పాండ్యా (12 బంతుల్లో 27), తిలక్ వర్మ (7 బంతుల్లో 21) మెరుపులు మెరిపించారు.Another must-win game, another Sanju Samson masterclass! 🔥His maiden T20I fifty against England and what an occasion to bring it up! 👏ICC Men’s #T20WorldCup | Semi-final 2 | #INDvENG | LIVE NOW 👉 https://t.co/L2OuYBUDbL pic.twitter.com/1csgOPterB— Star Sports (@StarSportsIndia) March 5, 2026ఫలితంగా టీమిండియాకు ఈ మేర 253 పరుగుల స్కోరు సాధ్యమైంది. ఈ క్రమంలోనే పొట్టి క్రికెట్లో అత్యధిక సార్లు 250 ప్లస్ స్కోరు సాధించిన జట్టుగా నిలిచింది. తద్వారా ఐపీఎల్ ఫ్రాంఛైజీ సన్రైజర్స్ హైదరాబాద్ పేరిట ఉన్న రికార్డును బద్దలు కొట్టింది.పురుషుల టీ20 క్రికెట్లో అత్యధిక సార్లు 250కి పైగా పరుగులు సాధించిన జట్లు👉టీమిండియా- ఆరు సార్లు👉సన్రైజర్స్ హైదరాబాద్- ఐదు సార్లు👉వెస్టిండీస్- మూడు సార్లు👉జింబాబ్వే- మూడు సార్లు👉సర్రే- మూడు సార్లు.చదవండి: IND vs ENG: సెమీస్లోనూ ఫెయిల్.. జట్టు నుంచి తీసేయండి! -
T20 WC 2026: చరిత్ర సృష్టించిన సంజూ శాంసన్
టీ20 ప్రపంచకప్-2026 సెమీ ఫైనల్లో టీమిండియా ఓపెనర్ సంజూ శాంసన్ అదరగొట్టాడు. ఇంగ్లండ్ బౌలింగ్ను చితక్కొడుతూ ఫోర్లు, సిక్సర్ల వర్షం కురిపించాడు. మూడో ఓవర్లో తనకు లభించిన లైఫ్ను సద్వినియోగం చేసుకున్న ఈ కేరళ వికెట్ కీపర్ బ్యాటర్ మెరుపు ఇన్నింగ్స్తో అలరించాడు.Ohhhhh, Harry Brook! 😳Sanju Samson makes the most of the lifeline and sends it into the stands! 🚀ICC Men’s #T20WorldCup | Semi-final 2 | #INDvENG | LIVE NOW 👉 https://t.co/L2OuYBUDbL pic.twitter.com/zOWfIEAdUv— Star Sports (@StarSportsIndia) March 5, 2026మరోసారి సెంచరీ మిస్అయితే, దురదృష్టవశాత్తూ మరోసారి సెంచరీ మిస్సయ్యాడు. ప్రపంచకప్ టోర్నీ ఆరంభానికి ముందు ఫామ్లేమితో సతమతమైన సంజూ ఓపెనర్గా జట్టులో స్థానం కోల్పోయిన సంగతి తెలిసిందే. టీ20 ఓపెనర్, వికెట్ కీపర్గా ఇషాన్ కిషన్ అతడి స్థానాన్ని భర్తీ చేసి అదరగొట్టాడు.అయితే, మరో ఓపెనర్ అభిషేక్ శర్మ కడుపు నొప్పి కారణంగా నమీబియాతో మ్యాచ్కు దూరం కాగా.. తొలిసారి సంజూకు వరల్డ్కప్ మ్యాచ్ ఆడే అవకాశం వచ్చింది. అయితే, ఈ మ్యాచ్లో వేగంగా ఆడిన సంజూ 8 బంతుల్లో 22 పరుగులు చేసి అవుటయ్యాడు.అనంతరం సూపర్-8 జింబాబ్వేతో మ్యాచ్ సందర్భంగా తిరిగి తుదిజట్టులోకి వచ్చిన సంజూ.. 15 బంతుల్లో 24 రన్స్ చేయగలిగాడు. అయినప్పటికీ మేనేజ్మెంట్ ఈసారి సంజూపై నమ్మకం ఉంచింది. ఈ క్రమంలో వెస్టిండీస్తో తప్పక గెలవాల్సిన మ్యాచ్లో సంజూ 97 పరుగులతో అజేయంగా నిలిచాడు. భారత్ను గెలిపించి సెమీ ఫైనల్కు చేర్చాడు. అయితే, మూడు పరుగులతో అక్కడ సెంచరీ మిస్సయ్యాడు.8 ఫోర్లు, 7 సిక్స్లు కొట్టితాజాగా ఇంగ్లండ్తో సెమీ ఫైనల్లోనూ సంజూ శతకం చేసే అవకాశాన్ని చేజార్చుకున్నాడు. భారత్ ఇన్నింగ్స్లో పద్నాలుగో ఓవర్లో విల్ జాక్స్ బౌలింగ్కు దిగాడు. అతడి బౌలింగ్లో తొందరపడి షాట్కు యత్నించిన సంజూ.. ఫిల్ సాల్ట్కు క్యాచ్ ఇచ్చి అవుటయ్యాడు. ఈ మ్యాచ్లో మొత్తంగా 42 బంతుల్లో 8 ఫోర్లు, 7 సిక్స్లు కొట్టి 89 పరుగులు సాధించి.. సెంచరీకి పదకొండు పరుగుల దూరంలో నిలిచిపోయాడు.Just Hardik Pandya things at the Wankhede Stadium! 🔥🚨 RECORD ALERT: 19 sixes by #TeamIndia - the most in an innings in ICC Men's T20 World Cup history!ICC Men’s #T20WorldCup | Semi-final 2 | #INDvENG | LIVE NOW 👉 https://t.co/L2OuYBUDbL pic.twitter.com/JdGVdpz1B4— Star Sports (@StarSportsIndia) March 5, 2026ఇక ఓపెనర్ అభిషేక్ శర్మ (9)తో కలిసి తొలి వికెట్కు 20 పరుగులు జోడించిన సంజూ.. వన్డౌన్ బ్యాటర్ ఇషాన్ కిషన్ (39)తో కలిసి రెండో వికెట్కు 45 బంతుల్లో 97 పరుగులు, శివం దూబేతో కలిసి మూడో వికెట్కు 43 పరుగులు జోడించాడు. ఈ మ్యాచ్లో టీమిండియా నిర్ణీత 20 ఓవర్లలో ఏడు వికెట్ల నష్టానికి 253 పరుగులు సాధించింది.చరిత్ర సృష్టించిన సంజూ శాంసన్టీ20 ప్రపంచకప్ ఎడిషన్లో టీమిండియా తరఫున అత్యధిక సిక్సర్లు బాదిన భారత బ్యాటర్గా సంజూ శాంసన్ చరిత్ర సృష్టించాడు. ఇంగ్లండ్తో సెమీ ఫైనల్ సందర్భంగా ఈ ఘనత సాధించాడు.టీ20 ప్రపంచకప్ ఎడిషన్లో అత్యధిక సిక్సర్లు బాదిన భారత బ్యాటర్లు👉సంజూ శాంసన్- 16 సిక్స్లు- 2026లో👉రోహిత్ శర్మ- 15 సిక్స్లు- 2024లో👉శివం దూబే- 15 సిక్స్లు- 2026లో👉ఇషాన్ కిషన్- 14 సిక్స్లు- 2026లో👉హార్దిక్ పాండ్యా- 14 సిక్స్లు- 2026లో👉యువరాజ్ సింగ్- 12 సిక్స్లు- 2007లో.చదవండి: IND vs ENG: సెమీస్లోనూ ఫెయిల్.. జట్టు నుంచి తీసేయండి! -
సెమీస్కు ముందే టీమిండియాకు 5 గుడ్ న్యూస్ లు
-
ధోని, కోహ్లీ, రోహిత్ గ్రూప్లో సంజూ
టీ20 ప్రపంచకప్ 2026 సూపర్-8 మ్యాచ్లో వెస్టిండీస్పై చిరస్మరణీయ ఇన్నింగ్స్ తర్వాత టీమిండియా వికెట్కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్పై ప్రశంసల వర్షం కురుస్తుంది. ఆ ఇన్నింగ్స్కు భారత అభిమానులే కాక ప్రపంచవ్యాప్తంగా ఉన్న క్రికెట్ అభిమానులంతా ముగ్దులయ్యారు. ప్రస్తుతం భారత క్రికెట్ సర్కిల్స్లో ఏ నోట విన్నా సంజూ పేరే వినిపిస్తుంది. అప్పటిదాకా తిట్టిపోసిన వారు కూడా విండీస్పై చారిత్రక ఇన్నింగ్స్ తర్వాత సంజూను పొగడ్తలతో ముంచెత్తుతున్నారు.అప్పటికే స్టార్ డమ్ ఉన్న సంజూ, ఆ ఒక్క ఇన్నింగ్స్తో దాన్ని మరింత పెంచుకున్నాడు. ఎంతలా అంటే.. భారత మాజీ వికెట్కీపర్ బ్యాటర్ దినేశ్ కార్తీక్ సంజూను దిగ్గజలు ఎంఎస్ ధోని, విరాట్ కోహ్లి, రోహిత్ శర్మతో పోల్చేంతలా. డీకే సంజూను ధోని, విరాట్ కోహ్లి, రోహిత్ శర్మతో సమానంగా అభిమానుల ఆదరణ పొందుతున్న ఆటగాడిగా అభివర్ణించాడు. అతని మాటల్లో.. సంజూ దేశంలో అత్యంత అభిమానించబడే క్రికెటర్. ఆయనలో ఏదో ప్రత్యేకత ఉంది. ఎత్తుపల్లాలు ఎదురైనా, అభిమానులు ఎప్పుడూ ఆయనపై నమ్మకం ఉంచారని అన్నాడు.డీకే అభిప్రాయం ప్రకారం, సంజూ ప్రపంచకప్ ప్రారంభం నుంచే జట్టులో ఉండాల్సింది. ముఖ్యంగా ఆఫ్ స్పిన్నర్లపై కష్టపడుతున్న ఎడమచేతి వాటం బ్యాటర్లకు ప్రత్యామ్నాయంగా సంజూ సమతుల్యతను తీసుకొచ్చాడు.వాస్తవానికి సంజూ టాలెంట్ ఎప్పుడూ గుర్తింపు పొందినా.. గాయాలు, అస్థిరత, ఎంపికల మార్పులు అతని కెరీర్ను దెబ్బతీశాయి. అయినప్పటికీ, అతను సహజమైన స్ట్రోక్ ప్లే, ఆత్మవిశ్వాసంతో తిరిగి తనను చాటుకున్నాడు.కాగా, విండీస్తో జరిగిన సూపర్-8 మ్యాచ్లో భారత్ 196 పరుగుల భారీ లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో భారత టాపార్డర్ తడబడింది. ఈ దశలో సంజూ (50 బంతుల్లో 97 పరుగులు; 12 ఫోర్లు, 4 సిక్సులు) తానున్నానంటూ ముందుకొచ్చి టీమిండియాను గెలిపించాడు. తద్వారా భారత్ సెమీస్ బెర్త్ ఖరారైంది. రేపు జరుగబోయే సెమీస్లో భారత్ ఇంగ్లండ్తో తలపడాల్సి ఉంది. ఈ మ్యాచ్లోనూ సంజూ కీలకమయ్యే అవకాశం ఉంది. -
T20 WC: సంజూకు పొంచి ఉన్న ప్రమాదం.. వేటు తప్పదా?
ఐసీసీ టీ20 ప్రపంచకప్-2026 టోర్నమెంట్ నాకౌట్ దశకు చేరుకుంది. ఇప్పటికే నాలుగు సెమీస్ బెర్తులు ఖరారయ్యాయి. తొలి సెమీ ఫైనల్లో సౌతాఫ్రికా- న్యూజిలాండ్.. రెండో సెమీస్ మ్యాచ్లో ఇంగ్లండ్- టీమిండియా తలపడేందుకు సిద్ధంగా ఉన్నాయి.సఫారీ- కివీస్ జట్లు బుధవారం కోల్కతా వేదికగా అమీతుమీ తేల్చుకోనుండగా.. భారత్- ఇంగ్లండ్ (IND vs ENG) ముంబై గురువారం సెమీ ఫైనల్లో పోటీపడేందుకు షెడ్యూల్ ఖరారైంది. ఇక సూపర్-8లో హ్యాట్రిక్ విజయాలతో ఇంగ్లండ్ జోరు మీద ఉండగా.. టీమిండియా మాత్రం సెమీస్ చేరేందుకు కష్టపడాల్సి వచ్చింది.వీరోచిత ఇన్నింగ్స్అయితే, వెస్టిండీస్తో తప్పక గెలవాల్సిన మ్యాచ్లో సంజూ శాంసన్ వీరోచిత ఇన్నింగ్స్ (50 బంతుల్లో 97 నాటౌట్)తో రాణించడంతో భారత్ గట్టెక్కి.. సెమీ ఫైనల్లో అడుగుపెట్టింది. అయితే, ఈ మ్యాచ్లో ఫీల్డింగ్ తప్పిదాలు.. ప్రధాన పేసర్ జస్ప్రీత్ బుమ్రా తప్ప వేరే బౌలర్ ఎవరూ పెద్దగా రాణించకపోవడం.. అభిషేక్ శర్మ, ఇషాన్ కిషన్ విఫలం కావడం సెమీస్కు ముందు ఆందోళన కలిగిస్తున్నాయి.సంజూకు పొంచి ఉన్న ప్రమాదంఈ నేపథ్యంలో ఇంగ్లండ్తో సెమీస్లో తుదిజట్టు కూర్పు ఎలా ఉండబోతుందా అన్న చర్చ నడుస్తోంది. గత మ్యాచ్లో అదరగొట్టిన సంజూకు ఈ మ్యాచ్లో మాత్రం జోఫ్రా ఆర్చర్ రూపంలో ప్రమాదం పొంచి ఉంది. గతేడాది అంతర్జాతీయ టీ20లలో ఈ ఇంగ్లండ్ పేసర్ సంజూను బాగా ఇబ్బంది పెట్టాడు.సంజూకు ఆర్చర్ 23 డెలివరీలు సంధించగా.. అతడు కేవలం 25 పరుగులే రాబట్టగలిగాడు. ఇందులో ఒక ఫోర్, రెండు సిక్స్లు మాత్రమే ఉన్నాయి. అంతేకాదు.. మూడుసార్లు ఆర్చర్ బౌలింగ్లో అవుటయ్యాడు.ఆర్చర్తో పాటు అతడూఒకవేళ ఇంగ్లండ్ ఈసారి కూడా ఆర్చర్తోనే బౌలింగ్ ఎటాక్ ఆరంభిస్తే.. ఓపెనర్ సంజూ మరింత జాగ్రత్త పడాల్సి ఉంటుంది. లేదంటే భారీ మూల్యమే చెల్లించాల్సి వస్తుంది. ఇక సామ్ కర్రాన్ కూడా సంజూకు సవాలు విసిరే అవకాశం ఉంది. పొట్టి క్రికెట్లో నాలుగేళ్లలో సామ్ సంజూకు 16 డెలివరీలు సంధించగా.. అతడు 21 పరుగులు చేయగలిగాడు. రెండుసార్లు అవుటయ్యాడు. ఈ ప్రమాదాల్ని అధిగమిస్తేనే సంజూ టీమిండియాకు మంచి ఆరంభం ఇవ్వగలడు. గత గణాంకాలను బట్టి సంజూను తుదిజట్టులో ఆడిస్తారా?.. ఒకవేళ ఆడించినా ఓపెనర్గా పంపుతారా? అనే సందేహాలు తలెత్తుతున్నాయి.వేటు పడుతుందా?అయితే, సంజూపై నమ్మకం ఉంచిన మేనేజ్మెంట్ విండీస్తో ఆడిన జట్టుతోనే ముందుకు వెళ్లనున్నట్లు సమాచారం. తుదిజట్టులో ఎలాంటి మార్పులు లేకుండానే భారత్ ఇంగ్లండ్తో సెమీ ఫైనల్ ఆడనున్నట్లు తెలుస్తోంది.కాగా గత కొంతకాలంగా ఫామ్లేమితో సతమతమైన సంజూ ఓపెనర్గా, వికెట్ కీపర్గా జట్టులో స్థానం కోల్పోయాడు. టీ20 ప్రపంచకప్లో నమీబియాతో ఆడిన అతడు.. ఆ తర్వాత మళ్లీ సూపర్-8లో జింబాబ్వే, వెస్టిండీస్లతో ఆడాడు. మొత్తంగా మూడు మ్యాచ్లలో కలిపి 143 పరుగులు సాధించాడు.వెస్టిండీస్తో ఆడిన భారత తుదిజట్టుసంజూ శాంసన్, అభిషేక్ శర్మ, ఇషాన్ కిషన్, సూర్యకుమార్ యాదవ్, తిలక్ వర్మ, హార్దిక్ పాండ్యా, శివం దూబే, అక్షర్ పటేల్, అర్ష్దీప్ సింగ్, వరుణ్ చక్రవర్తి, జస్ప్రీత్ బుమ్రా.చదవండి: అతడిని సెలక్ట్ చేసింది ఎవరు?.. BCCI గ్రీన్ సిగ్నల్! -
సంజూ తలరాత మార్చేసిన మ్యాచ్ ఇది... ఇంగ్లాండ్కి అంత సీన్ లేదు.. కానీ..!
-
అతడి రెండు ఫోర్లు కీలకం.. లేదంటే సంజూ ఇన్నింగ్స్ వేస్ట్!
టీ20 ప్రపంచకప్-2026 టోర్నీలో కీలక ముందడుగు వేసింది టీమిండియా. సూపర్-8లో తప్పక గెలవాల్సిన మ్యాచ్లో వెస్టిండీస్ను ఓడించి సెమీ ఫైనల్లో అడుగుపెట్టింది. ఈ క్రమంలో ముంబై వేదికగా వాంఖడే మైదానంలో గురువారం ఇంగ్లండ్ను ఢీకొట్టనుంది. ముంబైకి చేరుకున్న టీమిండియాఇందుకోసం ఇప్పటికే భారత జట్టు ముంబైకి చేరుకుంది. కాగా ఈ ఎడిషన్ ఆరంభంలో నేపాల్ వంటి పసికూన జట్టుతో సవాలు ఎదుర్కొన్నప్పటికీ.. ఆ తర్వాత ఇంగ్లండ్ పుంజుకున్న తీరు అమోఘం.Touchdown, Mumbai! 📍#TeamIndia are in and gearing up for the semi-final in just three days! 👏ICC Men’s #T20WorldCup Semi-Final 2 👉 #INDvENG | THU, 5 MAR, 5:30 PM pic.twitter.com/gfOBk4T29X— Star Sports (@StarSportsIndia) March 2, 2026అందరూ మేటి ఆటగాళ్లేముఖ్యంగా సూపర్-8లో శ్రీలంక, పాకిస్తాన్, న్యూజిలాండ్లను ఓడించి.. హ్యాట్రిక్ విజయాలతో సెమీస్ చేరిన తొలి జట్టుగా నిలిచింది. ఈ నేపథ్యంలో హెడ్కోచ్ గౌతం గంభీర్.. ఇంగ్లండ్ గట్టి ప్రత్యర్థి అని.. ఆ జట్టుతో జాగ్రత్తగా ఆడాల్సి ఉంటుందని పేర్కొన్నాడు. ఆ జట్టులో ఫిల్ సాల్ట్, హ్యారీ బ్రూక్, సామ్ కరన్, విల్ జాక్స్ సహా అందరు మేటి ఆటగాళ్లేనని అన్నాడు.వాంఖడే పిచ్ పరిస్థితులు వేరుగా ఉంటాయని... అటువంటి చోట ఇంగ్లండ్ లాంటి జట్టును ఎదుర్కోవడం సవాలుతో కూడుకున్నదే అని గౌతీ పేర్కొన్నాడు. ఇంగ్లండ్ వంటి జట్టును ఓడించేందుకు తాము ఇంకాస్త ఎక్కువగానే శ్రమించాల్సి ఉంటుందని అన్నాడు.సంజూ సత్తా ఏంటో నాకు బాగా తెలుసుఅదే విధంగా.. వెస్టిండీస్తో మ్యాచ్లో భారత్ గెలిచిన తీరుపై కూడా గౌతీ స్పందించాడు. ఈ మ్యాచ్లో 97 పరుగులతో అజేయంగా నిలిచి జట్టును గెలిపించిన సంజూ శాంసన్ను ప్రశంసించాడు. అయితే, క్రికెట్ జట్టు క్రీడ అని అందరూ కలసి కట్టుగా ఆడాల్సిందే... జట్టుగా గెలవాల్సిందేనని పేర్కొన్నాడు.‘‘సంజూ సత్తా ఏంటో నాకు బాగా తెలుసు. మెగా ఈవెంట్కు ముందు న్యూజిలాండ్తో జరిగిన సిరీస్ అతనికి క్లిష్టంగా గడిచింది. అందుకే కాస్త విశ్రాంతి ఇచ్చాము. ఇప్పుడు వెస్టిండీస్తో కీలకమైన ‘సూపర్–8’ మ్యాచ్లో శాంసన్ మ్యాచ్ విన్నింగ్ ఇన్నింగ్స్తో అదరగొట్టాడు’’ అని గంభీర్ కితాబిచ్చాడు.🚨 BIG STATEMENT BY GAUTAM GAMBHIR 🚨 "For so many year, we only glorified individual success. But this Indian Team is different, we play as a team. Shivam Dube's 2 boundaries is as important as Sanju Samson 97*."What's your take 🤔pic.twitter.com/zdecRc7PVJ— Fan Account Richard Kettlebourogh (@RichKettle07) March 3, 2026అదే విధంగా తిలక్ వర్మ, శివమ్ దూబే తదితర సహచరులు కూడా బాగా ఆడారని గౌతీ అన్నాడు. తాను కోచ్గా ఉన్నంతకాలం జట్టు విజయంలో భాగమైన ప్రతి ఆటగాడి సహకారానికి తగిన గుర్తింపు లభిస్తుందన్నాడు. అతడి రెండు ఫోర్లు కీలకం.. లేదంటే సంజూ ఇన్నింగ్స్ వేస్ట్!‘క్రికెట్ ఎప్పటికైనా టీమ్ గేమ్. ఓ జట్టుగా ఆడాలి. జట్టుగానే గెలవాలి. కొన్నేళ్లుగా మనం ఒకరిద్దరి సేవలగురించే ప్రత్యేకంగా మాట్లాడుకునేవాళ్లం. ఇప్పుడు అందరి సహకారం గురించి ప్రస్తావించడం నాకూ ఆనందంగానే ఉంది’ అని గంభీర్ ఫలానా ఆటగాడి పేరుచెప్పకుండా తన శైలిలో సమాధాన మిచ్చాడు.‘జట్టు విజయంలో ఎవరైనా పెద్ద స్కోరు చేస్తే పతాక శీర్షికలకెక్కుతారు. కానీ నా దృష్టిలో మాత్రం ఆ పెద్ద స్కోరుకు విలువపెంచే భాగస్వామ్యంలో తక్కువ పరుగులు చేసినా విజయంలో ఈ రెండూ విలువైనవే! ఒకటి ఎక్కువ ఇంకోటి తక్కువ కాదు. ఎందుకంటే కీలకమైన సమయంలో శివమ్ దూబే కొట్టిన రెండు విలువైన బౌండరీలు లక్ష్యఛేదనకెంతో ఉపయోగపడ్డాయి. అవే లేకపోయినా... ఫలితం ప్రతికూలంగా ఉన్నా... సామ్సన్ (97 నాటౌట్) అద్భుత ఇన్నింగ్స్ మరుగున పడేది’ అని గౌతీ వివరించాడు.చదవండి: స్వార్థపరుడు.. అతడు జట్టులో దండగ: భారత మాజీ కెప్టెన్ ఫైర్ -
ట్రోఫీస్ గెలవాలంటే..సంజు కోసం ధోనీ చెప్పిందే నిజమైంది
-
ధన్యవాదాలు.. సంజు సామ్సన్
చక్కటి ఇన్నింగ్స్తో జట్టును గెలిపించి సెమీస్కు చేర్చిన టీమిండియా బ్యాటర్ సంజు సామ్సన్పై ప్రశంసలు కురుస్తున్నాయి. టి20 ప్రపంచకప్ క్వార్టర్ ఫైనల్లో వెస్టిండీస్తో జరిగిన మ్యాచ్లో ఆఖరివరకు క్రీజ్లో నిలబడి విజయాన్ని అందించిన ఈ కేరళ క్రికెటర్పై అభిమానులతో పాటు ప్రముఖులు పొగుడుతున్నారు. ముఖ్యంగా సొంత రాష్ట్రానికి చెందిన సినిమా స్టార్స్ ప్రశంసలతో ముంచెత్తారు. సంజు సూపర్ ఇన్నింగ్స్ కీర్తిస్తూ మాలీవుడ్ ప్రముఖులు మోహన్లాల్, మమ్ముట్టి, టోవినో థామస్, పృథ్వీరాజ్ సుకుమారన్, దుల్కర్ సల్మాన్, బాసిల్ జోసఫ్, నవిన్ పాలీ తదితరులు ఎక్స్లో పోస్టులు పెట్టారు.Exhilarating to watch @IamSanjuSamson in such sublime form! A truly masterful innings that speaks volumes of his character and talent. Hearty congratulations to the entire Indian team for storming into the #T20WorldCup2026 Semi-Finals. Keep the flag flying high! 🇮🇳 pic.twitter.com/jLMYCQSOWc— Mohanlal (@Mohanlal) March 1, 2026విజయకేతనం ఎగురవేయండిమాస్టర్ క్లాస్ ఇన్నింగ్స్తో సంజు సామ్సన్ సత్తా చాటాడని ప్రముఖ నటుడు మోహన్లాల్ ఎక్స్లో పోస్ట్ పెట్టారు. సంజు ఫామ్లోకి రావడం పట్ల సంతోషం వ్యక్తం చేశారు. సెమీ-ఫైనల్స్కు దూసుకెళ్లిన టీమిండియాకు అభినందనలు తెలిపారు. సెమీస్లోనూ విజయకేతనం ఎగురవేయాలని ఆయన ఆకాంక్షించారు. స్వచ్ఛమైన ఆధిపత్యంసంజు సామ్సన్ అద్భుతంగా ఆడాడని విలక్షణ నటుడు మమ్ముట్టి ప్రశంసించారు. అతిపెద్ద వేదికపై స్వచ్ఛమైన ఆధిపత్యం చెలాయించారని వ్యాఖ్యానించారు. సెమీఫైనల్లోకి అడుగుపెట్టిన భారత క్రికెట్ జట్టుకు అభినందనలు తెలుపుతూ ఎక్స్లో పోస్ట్ పెట్టారు. మమ్ముట్టి తనయుడు దుల్కర్ సల్మాన్.. ఇన్స్టాగ్రామ్లో సంజు ఫొటో పోస్ట్ చేసి హార్ట్, క్లాప్స్ ఎమోజీలను జోడించారు.What a knock, @IamSanjuSamsonPure class. Pure dominance. A fearless statement on the biggest stage.Congratulations to the Indian cricket team for marching into the #T20WorldCup2026 Semi Final. pic.twitter.com/j8Di5hYY7C— Mammootty (@mammukka) March 1, 2026 చిరస్మరణీయ ఇన్నింగ్స్'టి20 గొప్ప ఇన్నింగ్స్లో ఇదీ ఒకటి. కీలక క్వార్టర్ ఫైనల్లో సంజు సామ్సన్ చిరస్మరణీయ ఇన్నింగ్స్ ఆడాడ'ని నటుడు-చిత్రనిర్మాత- దర్శకుడు పృథ్వీరాజ్ సుకుమారన్ ఇన్స్టాగ్రామ్ స్టోరీలో పేర్కొన్నారు. “నిన్ను చూసి గర్వంగా ఉంది మచా. (మిత్రుడు)” అని నటుడు కాళిదాస్ జయరామ్ మెచ్చుకున్నారు. వాట్ యాన్ ఇన్నింగ్స్ అంటూ నటుడు టొవినో థామస్ పొగిడారు. 'థ్యాంక్యూ సంజు సామ్సన్' అంటూ ప్రకాశ్రాజ్ అభినందించారు.THE KERALA STORY: Sanju Samson takes India to the semis.— CS Amudhan (@csamudhan) March 1, 2026 ది రియల్ కేరళ స్టోరీకాగా, కేరళ స్టోరీ 2 సినిమాకు కొంతమంది కౌంటర్ ఇచ్చారు. తమిళ దర్శకుడు సిఎస్ అముధన్ సంజు విజయాన్ని ‘ది కేరళ స్టోరీ: టీమిండియాను సంజు సామ్సన్ సెమీస్ ఫైనల్కు చేర్చాడని ఎక్స్లో పోస్ట్ చేశారు. మ్యాచ్ ముగిసిన తర్వాత సంజు చేసిన ప్రార్థనలు మతసామరస్యానికి చిరునామాగా నిలిచాయని, ఇదే రియల్ కేరళ స్టోరీ అంటూ సోషల్ మీడియాలో నెటిజనులు కామెంట్లు పెడుతున్నారు. ఎవరినీ హర్ట్ చేయకుండా అన్ని మతాలను గౌరవించాడని పేర్కొంటూ ధన్యవాదాలు చెబుతున్నారు. The Real Kerala Story ☪️✝️🕉️ft. Sanju Samson ❤️ pic.twitter.com/slCZHUHvWA— Luckyram9887.base.eth π² (@Luckyram9887) March 2, 2026 -
సంజూ సీక్రెట్.. ఆమెతో లవ్స్టోరీ! చారులత గురించి తెలుసా?
ఆదివారం వెస్టిండీస్తో చావోరేవో తేల్చుకోవాల్సిన మ్యాచ్ని ఒంటి చేత్తో గెలిపించి ఒక్కసారిగా హీరోగా మారిపోయాడు సంజు సామ్సన్. ఈ ఇన్నింగ్స్ అతడి కెరీర్కు కొత్త ఊపు తెచ్చింది. కీలక మ్యాచ్లో ఎలాంటి ఒత్తిడి లేకుండా ప్రశాంతంగా ఆడుతూ చక్కటి షాట్లతో అతను జట్టును గెలుపు వరకు తీసుకెళ్లి చిరకాలం గుర్తించుకునే ప్రదర్శనను నమోదు చేశాడు. సంజూ ధనాధన్ ఆట తీరుతో టీ20 ప్రపంచకప్-2026 టోర్నీ సెమీ ఫైనల్లోకి టీమిండియా అడుగుపెట్టేలా బెర్త్ ఖరారైంది. ఈ నేపథ్యంలో సంజు కుటుంబ జీవితానికి సంబంధించి కొన్ని ఆసక్తికర విషయాలు తెలుసుకుందామా..!.సంజు సామ్సన్ తన చిన్ననాటి ప్రియురాలు చారులత రమేశ్ని ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు. ఈ జంట చాలా ఏళ్లు వెయిట్చేసి మరి..2018లో పెళ్లి చేసుకున్నారు. ఇంతకీ ఈ చారులత రమేశ్ ఎవరంటే..?. ప్రముఖ క్రికెటర్ని పరిణయమాడినప్పటికీ.. వ్యక్తిగత జీవితాన్ని చాలా గొప్యంగానే ఉంచుకుంటారామె. మీడియా కంటపడకుండా జాగ్రత్తపడుతుంటారామె. ఇక చారులత విద్యా నేపథ్యం వచ్చేసి..ఆమె మార్ ఇవానియోస్ కళాశాల నుంచి కెమిస్ట్రీలో బ్యాచిలర్ ఆఫ్ సైన్స్లో పట్టా పొందింది. సంజూ చారులతను తొలిసారి ఈ మార్ ఇవానియోస్ కళాశాలలోనే కలుసుకున్నాడు. ఆ తర్వాత ఫేస్బుక్ ద్వారా స్నేహితులుగా సాగిన సాన్నిహిత్యం కాస్త ప్రేమగా మారింది. అయితే చారులత తన కెరీర్పై దృష్టిసారించగా, సంజు దేశీయ క్రికెట్పై ఫోకస్ పెట్టి కెరీర్లో రాణించడం ప్రారంభించాడు. అయితే ఈ జంట తమ రిలేషన్ని అత్యంత గోప్యంగా ఉంచుకున్నారు. మీడియా కంటపడకుండా సాగించారు. అంతేగాదు వీరి వివాహం సైతం అత్యంత గోప్యంగా కొద్దిమంది కుటుంబసభ్యులు, వ్యక్తిగత సన్నిహితులు, స్నేహితుల సమక్షంలో చేసుకున్నారు. ఈ దంపతులు డిసెంబర్ 22, 2018న వైవాహిక బంధంతో ఒక్కటయ్యారు. (చదవండి: జస్ట్ రెండేళ్లలో 17కిలోలు తగ్గిన టీనేజర్..! నో జిమ్, నో స్ట్రిక్ట్ డైట్..) -
సంజూ కాదు!;.. అతడి రెండు ఫోర్లే కీలకం: బుమ్రా
టీమిండియా అద్భుతం చేసింది. చావోరేవో తేల్చుకోవాల్సిన మ్యాచ్లో వెస్టిండీస్ను ఓడించి టీ20 ప్రపంచకప్-2026 సెమీ ఫైనల్కు చేరుకుంది. ఈ మ్యాచ్లో ఓపెనింగ్ బ్యాటర్ సంజూ శాంసన్ కీలక పాత్ర పోషించాడు.ఆద్యంతం నిలకడగా ఆడిన సంజూ జట్టును విజయతీరాలకు చేర్చాడు. మొత్తంగా 50 బంతుల్లో 12 ఫోర్లు, 4 సిక్స్లు బాది 97 పరుగులతో అజేయంగా నిలిచాడు. ఆఖరి ఓవర్లో సిక్స్, ఫోర్ బాది విజయ లాంఛనాన్ని పూర్తి చేశాడు.వచ్చీ రాగానే వరుసగా రెండు ఫోర్లుఅయితే, టీమిండియా గెలుపునకు 10 బంతుల్లో 17 పరుగులు అవసరమైన వేళ హార్దిక్ పాండ్యా (14 బంతుల్లో 17) ఐదో వికెట్గా వెనుదిరగగా.. శివం దూబే క్రీజులోకి వచ్చాడు. వచ్చీ రాగానే వరుసగా రెండు ఫోర్లు బాదాడు. దీంతో ఆఖరి ఓవర్లో విజయ సమీకరణం ఏడు పరుగులుగా మారగా.. సంజూ తొలుత సిక్స్, ఆ తర్వాత ఫోర్ బాది గెలుపు ఖరారు చేశాడు.Shivam Dube wastes no time as India push to finish this in style to book their semi-final berth. 🔥ICC Men’s #T20WorldCup, SUPER 8, #INDvWI | LIVE NOW ➡️ https://t.co/Y26WH6p8dS pic.twitter.com/Ta4LWZ1VR2— Star Sports (@StarSportsIndia) March 1, 2026ఆ రెండు ఫోర్లు అత్యంత కీలకంనిజానికి దూబే బాదిన రెండు ఫోర్ల వల్ల సంజూపై ఒత్తిడి తగ్గి మరింత స్వేచ్ఛగా బ్యాట్ ఝులిపించగలిగాడు. భారత ప్రధాన పేసర్ జస్ప్రీత్ బుమ్రా కూడా ఇదే మాట అంటున్నాడు. ‘‘దూబే బాదిన ఆ రెండు ఫోర్లు అత్యంత కీలకం.క్రికెట్ రికార్డులలో వాటికి చోటు లేకపోవచ్చు. కానీ క్రికెట్ గురించి పూర్తి అవగాహన ఉన్న వారికి వాటి ప్రాధాన్యం ఏమిటో అర్థమవుతుంది. ఆ రెండు ఫోర్లే ఒత్తిడిని తగ్గించాయి. చివరి ఓవర్లో 8-9 పరుగులు తీయడం కూడా ఒక్కోసారి కష్టం కావచ్చు.సంజూ విషయంలో హ్యాపీఏదేమైనా సంజూ విషయంలోనూ నేను సంతోషంగా ఉన్నాను. అతడు గత కొంతకాలంగా ఎన్నో ఒడిదుడుకులు ఎదుర్కొన్నాడు. వాటన్నింటినీ అధిగమించి గొప్ప ఇన్నింగ్స్ ఆడాడు. అతడు రోజురోజుకీ మరింత గొప్పగా ఆడాలని కోరుకుంటున్నా’’ అని బుమ్రా పేర్కొన్నాడు. కాగా విండీస్తో మ్యాచ్లో బుమ్రా రెండు వికెట్లు తీసిన సంగతి తెలిసిందే.చదవండి: స్వార్థపరుడు.. అతడు జట్టులో దండగ: భారత మాజీ కెప్టెన్ ఫైర్ -
సంజూ భాయ్ ఆట... సెమీస్ బాట... అంతేగా.. అంతేగా (ఫొటోలు)
-
సంజు శాంసన్ విశ్వరూపం.. పడి లేచిన కెరటం
-
అతడొక వరల్డ్క్లాస్ ప్లేయర్.. అందుకే మద్దతు: గంభీర్
టీమిండియా హెడ్కోచ్ గౌతం గంభీర్ సంజూ శాంసన్పై ప్రశంసలు కురిపించాడు. అతడొక వరల్డ్క్లాస్ ప్లేయర్ అంటూ ఆకాశానికెత్తాడు. సరైన సమయంలో రాణించి తన విలువను మరోసారి చాటుకున్నాడని కొనియాడాడు.టీ20 ప్రపంచకప్-2026 ఆరంభానికి ముందు ఫామ్లేమితో సతమతమైన సంజూ (Sanju Samson)తుదిజట్టులో స్థానం కోల్పోయిన సంగతి తెలిసిందే. ఓపెనర్, వికెట్ కీపర్ బ్యాటర్గా అతడి స్థానాన్ని ఇషాన్ కిషన్ (Ishan Kishan) భర్తీ చేశాడు. అయితే, మరో ఓపెనర్ అభిషేక్ శర్మ కడుపు నొప్పి కారణంగా నమీబియాతో మ్యాచ్కు దూరం కాగా సంజూ తొలిసారి వరల్డ్కప్ మ్యాచ్ ఆడాడు.బాధ్యతాయుత ఇన్నింగ్స్అనంతరం సూపర్-8లో జింబాబ్వేతో మ్యాచ్లో ఆడిన సంజూ.. తాజాగా వెస్టిండీస్తో ఆదివారం నాటి కీలక మ్యాచ్లోనూ తుదిజట్టులో చోటు దక్కించుకున్నాడు. యాజమాన్యం తనపై పెట్టుకున్న నమ్మకాన్ని నిలబెట్టుకుంటూ అదిరిపోయే ఆట తీరుతో జట్టును సెమీ ఫైనల్కు చేర్చాడు.Man on a mission! 🚀Sanju Samson looks in sublime touch as he bring up his fifty! 🙌ICC Men’s #T20WorldCup, SUPER 8, #INDvWI | LIVE NOW ➡️ https://t.co/Y26WH6p8dS pic.twitter.com/yrCOStYeaF— Star Sports (@StarSportsIndia) March 1, 2026కోల్కతా వేదికగా సహచర ఆటగాళ్లు స్థాయికి తగ్గట్లు రాణించలేక విఫలమైన వేళ సంజూ.. 50 బంతుల్లో 97 పరుగులతో అజేయంగా నిలిచి జట్టును విజయతీరాలకు చేర్చాడు. ఈ నేపథ్యంలో హెడ్కోచ్ గౌతం గంభీర్ సంజూను ప్రశంసలతో ముంచెత్తాడు.అతడొక వరల్డ్క్లాస్ ప్లేయర్.. అందుకే మద్దతు‘‘సంజూ మంచి ఆటగాడు అని అందరికీ తెలుసు. అయితే, కొన్నిసార్లు విఫలమైనా అతడికి మద్దతుగా నిలవడం అవసరం. మేము అదే పని చేశాము. అందుకు తగ్గట్లుగానే జట్టుకు అతడి అవసరం ఉన్న కీలక సమయంలో రాణించాడు.అతడి పూర్తి స్థాయి నైపుణ్యాలను ఈరోజు ప్రదర్శించి.. జట్టుకు విజయం అందించాడు. అతడు వరల్డ్క్లాస్ ప్లేయర్ అని నేను తరచూ చెబుతూ ఉంటాను. సంజుకు గొప్ప ప్రతిభ ఉంది. ఇప్పటి నుంచి అతడి నుంచి ఇలాంటి ఇంకెన్నో ఇన్నింగ్స్ చూడాలని కోరుకుంటున్నా’’ అని గంభీర్ సంజూను కొనియాడాడు.ఐదు వికెట్ల తేడాతో విజయంకాగా వెస్టిండీస్తో చావోరేవో తేల్చుకోవాల్సిన మ్యాచ్లో టీమిండియా ఐదు వికెట్ల తేడాతో విజయం సాధించింది. కోల్కతాలో టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన విండీస్.. నిర్ణీత 20 ఓవర్లలో నాలుగు వికెట్ల నష్టానికి 195 పరుగులు చేసింది.లక్ష్య ఛేదనకు దిగిన భారత్ 19.2 ఓవర్లలో ఐదు వికెట్లు నష్టపోయి 199 పరుగులు సాధించింది. ఫలితంగా ఐదు వికెట్ల తేడాతో గెలిచి గ్రూప్-1 నుంచి సౌతాఫ్రికాతో పాటు సెమీస్ బెర్తు ఖరారు చేసుకుంది. ముంబై వేదికగా గురువారం సెమీ ఫైనల్లో టీమిండియా ఇంగ్లండ్తో అమీతుమీ తేల్చుకుంటుంది.As soon as Sanju Samson smashed a match winning SIX, just look at the Celebration of Abhishek Sharma, Tilak Varma, Hardik Pandya, Suryakumar Yadav and Jay Shah 💥- Most trolled and most hated Sanju Samson delivered at the biggest stage 👏🏻#INDvsWI pic.twitter.com/tYJmi4fxwC— Fan Account Richard Kettlebourogh (@RichKettle07) March 1, 2026 -
ఇది సరిపోతుందా బాస్!.. విమర్శలకు సంజూ ’స్టైల్’ కౌంటర్
టీ20 ప్రపంచకప్-2026 టోర్నీ ఆరంభానికి ముందు పేలవ ప్రదర్శనతో విమర్శలు మూటగట్టుకున్నాడు టీమిండియా స్టార్ సంజూ శాంసన్. మెగా టోర్నీకి సన్నాహకంగా స్వదేశంలో న్యూజిలాండ్తో జరిగిన టీ20 సిరీస్లో వరుస వైఫల్యాలతో సతమతమయ్యాడు.ఈ సిరీస్లో సంజూ చేసిన పరుగులు 10, 6, 0, 24, 6. దీంతో వరల్డ్కప్ జట్టులో ఓపెనర్గా అతడి స్థానం గల్లంతైంది. ఇషాన్ కిషన్ అభిషేక్ శర్మకు జోడీగా ఐసీసీ ఈవెంట్లో వరుస అవకాశాలు అందిపుచ్చుక్నునాడు.ఉద్దేశపూర్వకంగానే!అయితే, అభిషేక్ శర్మ అనారోగ్యం కారణంగా నమీబియాతో తొలిసారి బరిలో దిగాడు సంజూ. ఆ మ్యాచ్లో 8 బంతుల్లో 22 పరుగులు చేసిన ఈ వికెట్ కీపర్ బ్యాటర్... తదుపరి జింబాబ్వేతో సూపర్-8 మ్యాచ్లో 15 బంతుల్లో 24 రన్స్ రాబట్టగలిగాడు. పొరపాట్లను పునరావృతం చేస్తూ షార్ట్ బంతుల్ని తప్పుగా అంచనా వేసి అవుటైన నేపథ్యంలో మరోసారి సంజూపై విమర్శల వర్షం కురిసింది.మరోవైపు.. అతడి అభిమానులు మాత్రం.. మిగతా వాళ్లకు ఇచ్చినట్లుగా సంజూకు అవకాశాలు ఇవ్వడం లేదని మద్దతుగా నిలిచారు. ఈ కేరళ స్టార్ను ఉద్దేశపూర్వకంగా ప్రతీసారి పక్కన పెడుతున్నారని భారత జట్టు యాజమాన్యాన్ని విమర్శించారు. అయితే, వరుస విమర్శల తర్వాత అప్పుడప్పుడు అవకాశాలు పొందుతున్నా సంజూ చెప్పుకోదగ్గ ఇన్నింగ్స్ ఆడలేక ప్రతీసారి చేతులెత్తేయం ప్రతికూలాంశంగా పరిణమించింది. ఏదో కారణంతో అదృష్టవశాత్తూ చాన్స్ దక్కినా దానిని అతడు వాడుకోలేకపోతున్నాడనే అపవాదు పడింది. ముందుగా చెప్పినట్లు ఈ వరల్డ్ కప్లో కూడా ఆడిన రెండు మ్యాచ్లలో విఫలం కావడం ఇందుకు కారణం.ఒకే ఒక అర్ధ సెంచరీ...నిజానికి 2024 నవంబర్లో సౌతాఫ్రికాపై సెంచరీ తర్వాత శాంసన్ 18 ఇన్నింగ్స్లు ఆడితే ఒకే ఒక అర్ధ సెంచరీ... అదీ బలహీన జట్టు ఒమన్పై వచ్చింది. వరల్డ్ కప్ జట్టులోకి ఎంపికైన తర్వాత కూడా కివీస్తో సిరీస్లో వైఫల్యంతో తన స్థానాన్ని అతను ఇషాన్ కిషన్కు కోల్పోవాల్సి రావడం గమనార్హం.కెరీర్కు కొత్త ఊపుఇలాంటి స్థితిలో ఆదివారం వెస్టిండీస్తో చావోరేవో తేల్చుకోవాల్సిన మ్యాచ్లో సంజూ ఇన్నింగ్స్ అతడి కెరీర్కు కొత్త ఊపు తెచ్చింది. కీలక మ్యాచ్లో ఎలాంటి ఒత్తిడి లేకుండా ప్రశాంతంగా ఆడుతూ చక్కటి షాట్లతో అతను జట్టును గెలుపు వరకు తీసుకెళ్లి ఎప్పటికీ గుర్తుంచుకునే ప్రదర్శన నమోదు చేశాడు.విండీస్తో మ్యాచ్లో అన్ని రకాల షాట్లతో సంజూ చెలరేగాడు. ఈసారి 20.. 30... దాటిన తర్వాత అతడు వికెట్ పారేసుకోలేదు. అకీల్ హొసీన్ ఓవర్లో ఫోర్, 2 సిక్స్లతో జోరు మొదలు పెట్టిన ఈ కుడిచేతి వాటం బ్యాటర్ షెఫర్డ్ ఓవర్లో వరుసగా 6, 4 బాది 26 బంతుల్లోనే హాఫ్ సెంచరీని అందుకున్నాడు. This team! 🥹💙🫂Next Stop: Semi-finals 🚀ICC Men’s #T20WorldCup Semi-Final 2 👉 #INDvENG | THU, 5 MAR, 6 PM pic.twitter.com/CEMSGouFlO— Star Sports (@StarSportsIndia) March 1, 2026టీమిండియాను సెమీస్కు చేర్చిటీ20 వరల్డ్ కప్ మ్యాచ్లో ఛేదనలో అత్యధిక పరుగులు చేసిన బ్యాటర్గా నిలిచిన సంజూ... ఆఖరి ఓవర్లో వరుస బంతుల్లో 6, 4తో మ్యాచ్ను ముగించాడు. టీమిండియాను సెమీ ఫైనల్కు చేర్చి చిరస్థాయిగా నిలిచిపోయే ఇన్నింగ్స్ ఆడాడు. మొత్తంగా 50 బంతుల్లో 12 ఫోర్లు, 4 సిక్స్లు.. 97 పరుగులు నాటౌట్గా నిలిచిప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు అందుకున్నాడు.కాగా 2024లో విజేతగా నిలిచిన జట్టులో సభ్యుడైన సామ్సన్కు నాడు ఒక్క మ్యాచ్ కూడా ఆడే అవకాశమే రాలేదు. ఇప్పుడు అసలు సమరంలో సత్తాను ప్రదర్శించిన అతను ఇదే ఫామ్ను కొనసాగిస్తే సెమీస్, ఆపై ఫైనల్లో కూడా అద్భుతం చూడవచ్చు. చదవండి: మూడు పరుగులతో సెంచరీ మిస్!.. అత్యంత గొప్ప రోజు.. సంజూ ఎమోషనల్ -
సామ్సన్ ఆట... సెమీస్ బాట...
సెమీస్ చేరాలంటే వెస్టిండీస్పై తప్పనిసరిగా గెలవాల్సిన మ్యాచ్లో భారత్ విజయలక్ష్యం 196 పరుగులు... పిచ్ బ్యాటింగ్కు అనుకూలంగా ఉన్నా... ఆరంభం చూస్తే కాస్త సందేహం. హిట్టర్లు అభిషేక్ శర్మ, ఇషాన్ కిషన్ తొందరగా వెనుదిరగ్గా, సూర్యకుమార్ కూడా ప్రభావం చూపించలేదు. కానీ ఒకే ఒక్కడు నిలబడ్డాడు. చాలా కాలంగా చెప్పుకోదగ్గ ఇన్నింగ్స్ ఆడని సంజు సామ్సన్ అసలు సమయంలో సత్తా చాటాడు. ప్రత్యర్థి బౌలర్లను అలవోకగా ఎదుర్కొంటూ ఎక్కడా తడబాటు లేకుండా ఈడెన్ గార్డెన్స్లో జట్టును గెలుపుతీరం చేర్చాడు. అంతకు ముందు విండీస్ మరింత పెద్ద స్కోరు చేయకుండా నిలువరించడంలో మన బౌలర్లు సఫలమయ్యారు. తాజా ఫలితంతో 2024 తరహాలోనే ఈసారి కూడా రెండో సెమీఫైనల్లోనే ఇంగ్లండ్ను ఎదుర్కొనేందుకు టీమిండియా సిద్ధమైంది. మరో రెండు నాకౌట్ పంచ్లతో భారత్ చరిత్ర సృష్టించడమే మిగిలింది. కోల్కతా: డిఫెండింగ్ చాంపియన్ భారత్ టి20 ప్రపంచకప్లో ఆరోసారి సెమీఫైనల్లోకి ప్రవేశించింది. వెస్టిండీస్తో చివరి ‘సూపర్–8’ మ్యాచ్లో కాస్త పోటీ ఎదురైనట్లు కనిపించినా, చివరకు ఎలాంటి ఇబ్బంది లేకుండా ముందంజ వేసింది. ఆదివారం జరిగిన పోరులో భారత్ 5 వికెట్ల తేడాతో విండీస్ను ఓడించింది. టాస్ గెలిచిన భారత్ ఫీల్డింగ్ ఎంచుకోగా... ముందుగా బ్యాటింగ్కు దిగిన వెస్టిండీస్ 20 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 195 పరుగులు చేసింది. రోస్టన్ ఛేజ్ (25 బంతుల్లో 40; 5 ఫోర్లు, 1 సిక్స్), జేసన్ హోల్డర్ (22 బంతుల్లో 37 నాటౌట్; 2 ఫోర్లు, 3 సిక్స్లు), రావ్మన్ పావెల్ (19 బంతుల్లో 34 నాటౌట్; 3 ఫోర్లు, 2 సిక్స్లు), షై హోప్ (33 బంతుల్లో 32; 3 ఫోర్లు, 1 సిక్స్) భారీ స్కోరులో తలా ఓ చేయి వేశారు. బుమ్రాకు 2 వికెట్లు దక్కాయి. అనంతరం భారత్ 19.2 ఓవర్లలో 5 వికెట్లకు 199 పరుగులు చేసి విజయాన్నందుకుంది. ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’ సంజు సామ్సన్ (50 బంతుల్లో 97 నాటౌట్; 12 ఫోర్లు, 4 సిక్స్లు) ఒంటి చేత్తో ఛేదనను సులువుగా మార్చేశాడు. గురువారం వాంఖెడే మైదానంలో జరిగే రెండో సెమీఫైనల్లో ఇంగ్లండ్తో భారత్ తలపడుతుంది. సమష్టి ప్రదర్శన... తొలిసారి అంతర్జాతీయ టి20ల్లో ఓపెనర్గా బరిలోకి దిగిన ఛేజ్ మెరుగ్గానే ఆడినా... మరో ఎండ్లో కెపె్టన్ హోప్ నెమ్మదైన ఇన్నింగ్స్ వెస్టిండీస్కు నష్టాన్ని కలిగించింది. వరుణ్ ఏమరుపాటుగా ఉండడంతో వ్యక్తిగత స్కోరు ‘1‘ వద్ద రనౌట్ కాకుండా తప్పించుకున్న ఛేజ్... 14 పరుగుల వద్ద అభిషేక్ సునాయాస క్యాచ్ వదిలేయడంతో బతికిపోయాడు. పవర్ప్లేలో విండీస్ 45 పరుగులు చేయగలిగింది. వరుణ్ తన తొలి ఓవర్లోనే హోప్ను బౌల్డ్ చేయడంతో తొలి వికెట్ భాగస్వామ్యానికి తెర పడింది. ఆ తర్వాత వచ్చిన బ్యాటర్లంతా క్రీజ్లో ఉన్నంతసేపు దూకుడు కనబర్చడంతో జట్టు మెరుగైన స్కోరు సాధించగలిగింది. వరుణ్ ఓవర్లో సిక్స్ ఫోర్ కొట్టిన హెట్మైర్తో పాటు ఛేజ్ను బుమ్రా ఒకే ఓవర్లో వెనక్కి పంపాడు. ‘1’ వద్ద తిలక్ క్యాచ్ వదిలేయడంతో రూథర్ఫర్డ్ (14) కొన్ని పరుగులు జోడించగలిగాడు. 15 ఓవర్లలో జట్టు స్కోరు 125/4 వద్ద నిలిచింది. ఆఖరి 5 ఓవర్లలో విండీస్ 70 పరుగులు రాబట్టింది. 16వ ఓవర్ వేసిన అర్ష్ దీప్24 పరుగులు ఇచి్చనా... తన తర్వాతి ఓవర్లో అతను 6 పరుగులే ఇచ్చాడు. బుమ్రా 2 ఓవర్లలో విండీస్ 26 పరుగులు స్కోరు చేయగలిగింది. పావెల్, హోల్డర్ ఐదో వికెట్కు 35 బంతుల్లో అభేద్యంగా 76 పరుగులు జోడించారు. రాణించిన తిలక్... ఛేదనలో భారత్కు మరోసారి సరైన ఆరంభం లభించలేదు. తడబడుతూనే ఆడిన అభిషేక్ శర్మ (10)తో పాటు ఇషాన్ కిషన్ (10) కూడా ఎక్కువసేపు నిలవలేదు. అయితే సామ్సన్ పదునైన బ్యాటింగ్తో ఇన్నింగ్స్ను నడిపించడంతో భారత్కు ఇబ్బంది ఎదురు కాలేదు. ముందుగా సూర్యకుమార్ (18) కొద్దిసేపు సామ్సన్కు సహకరించగా, ఆ తర్వాత తిలక్ వర్మ (15 బంతుల్లో 27; 4 ఫోర్లు, 1 సిక్స్) కూడా అండగా నిలిచాడు. జోసెఫ్ ఓవర్లలో వరుసగా మూడు ఫోర్లతో ఆకట్టుకున్న తిలక్ అవుటైన తర్వాత హార్దిక్ పాండ్యా (17) మరికొన్ని పరుగులు జోడించాడు. చివర్లో శివమ్ దూబే (8 నాటౌట్)తో కలిసి సామ్సన్ మ్యాచ్ ముగించాడు.97 టి20 వరల్డ్ కప్ మ్యాచ్లో ఛేదనలో అత్యధిక పరుగులు చేసిన భారత బ్యాటర్గా సామ్సన్ నిలిచాడు. గతంలో కోహ్లి రెండుసార్లు 82 నాటౌట్ (ఆ్రస్టేలియా, పాక్లపై)గా నిలిచాడు.స్కోరు వివరాలు వెస్టిండీస్ ఇన్నింగ్స్: హోప్ (బి) వరుణ్ 32; ఛేజ్ (సి) సూర్యకుమార్ (బి) బుమ్రా 40; హెట్మైర్ (సి) సామ్సన్ (బి) బుమ్రా 27; రూథర్ఫర్డ్ (సి) సామ్సన్ (బి) పాండ్యా 14; పావెల్ (నాటౌట్) 34; హోల్డర్ (నాటౌట్) 37; ఎక్స్ట్రాలు 11; మొత్తం (20 ఓవర్లలో 4 వికెట్లకు) 195. వికెట్ల పతనం: 1–68, 2–102, 3–103, 4–119. బౌలింగ్: అర్ష్ దీప్4–0–43–0, పాండ్యా 4–0–40–1, అక్షర్ 4–0–35–0, బుమ్రా 4–0–36–2, వరుణ్ 4–0–40–1. భారత్ ఇన్నింగ్స్: అభిషేక్ (సి) హెట్మైర్ (బి) హొసీన్ 10; సామ్సన్ (నాటౌట్) 97; ఇషాన్ కిషన్ (సి) హెట్మైర్ (బి) హోల్డర్ 10; సూర్యకుమార్ (సి) రూథర్ఫర్డ్ (బి) జోసెఫ్ 18; తిలక్ (సి) హెట్మైర్ (బి) హోల్డర్ 27; పాండ్యా (సి) హోల్డర్ (బి) జోసెఫ్ 17; దూబే (నాటౌట్) 8; ఎక్స్ట్రాలు 12; మొత్తం (19.2 ఓవర్లలో 5 వికెట్లకు) 199. వికెట్ల పతనం: 1–29, 2–41, 3–99, 4–141, 5–179. బౌలింగ్: హొసీన్ 2–0–22–1, ఫోర్డ్ 3–0–22–0, హోల్డర్ 4–0–38–2, మోతీ 2–0–18–0, షెఫర్డ్ 2.2–0–34–0, జోసెఫ్ 4–0–42–2, ఛేజ్ 2–0–18–0. -
T20 WC 2026: అత్యంత గొప్ప రోజు.. సంజూ ఎమోషనల్
‘‘నా జీవితంలోనే అత్యంత గొప్ప రోజుల్లో ఇదొకటి. ఇదే (ఆట) నా ప్రపంచం. క్రికెట్ ఆడటం మొదలుపెట్టిన నాటి నుంచే.. దేశం కోసం ఆడాలనే కల కన్నాను. ఇలాంటి రోజు కోసమే ఎదురుచూశాను. నా కెరీర్లో ఎన్నో ఎత్తు పళ్లాలు ఉన్నాయి.ఒక్కోసారి నా మీద నాకే సందేహం కలిగేది. నేనసలు ఆడగలనా.. ఒకవేళ ఆడితే ఎలా ఉంటుంది. అనుకున్న విధంగా రాణించగలనా.. ఇలా ఎన్నెన్నో సందేహాలు. అయితే, ఆ దేవుడి మీద నమ్మకం మాత్రం ఎప్పుడూ కోల్పోలేదు. ఈరోజు ఆయన నన్ను దీవించాడు. నేను చాలా చాలా సంతోషంగా ఉన్నాను. టీ20 ఫార్మాట్లో నాకెంతో అనుభవం ఉంది.విరాట్ కోహ్లి, రోహిత్ శర్మ వంటి దిగ్గజాల నుంచి ఎన్నో విషయాలు నేర్చుకున్నాను. గత మ్యాచ్లలో వేగంగా ఆడే క్రమంలో వికెట్లు కోల్పోయాను. అయితే, ఈ రోజు భాగస్వామ్యాలు నిర్మించడంపైనే ఎక్కువ దృష్టి సారించాను. బంతిని చూస్తూ ఆడాను. ఈరోజు నా ప్రణాళికలను పక్కాగా అమలు చేశాను’’ అంటూ టీమిండియా స్టార్ సంజూ శాంసన్ తీవ్ర భావోద్వేగానికి లోనయ్యాడు.టీ20 ప్రపంచకప్-2026లో భారత్ సెమీ ఫైనల్కు దూసుకువెళ్లడంలో సంజూదే కీలక పాత్ర. టీ20 ఫార్మాట్లో ప్రమాదకర జట్టుగా పేరొందిన వెస్టిండీస్తో మ్యాచ్లో ఈ కేరళ వికెట్ కీపర్ బ్యాటర్ టీమిండియాను గెలిపించాడు. సహచర ఆటగాళ్లు పెవిలియన్కు వరుస కడుతున్నా మొక్కవోని ఆత్మవిశ్వాసంతో నిలకడగా బ్యాటింగ్ చేశాడు.This team! 🥹💙🫂Next Stop: Semi-finals 🚀ICC Men’s #T20WorldCup Semi-Final 2 👉 #INDvENG | THU, 5 MAR, 6 PM pic.twitter.com/CEMSGouFlO— Star Sports (@StarSportsIndia) March 1, 2026చావోరేవో తేల్చుకోవాల్సిన మ్యాచ్లో 97 పరుగులతో అజేయంగా నిలిచి భారత జట్టును విజయతీరాలకు చేర్చాడు. సంజూ అద్భుత ఇన్నింగ్స్ కారణంగా టీమిండియా విండీస్ను ఐదు వికెట్ల తేడాతో ఓడించి.. సెమీ ఫైనల్లో అడుగుపెట్టింది. కాగా గత కొన్ని రోజులుగా సంజూ ఫామ్లేమితో సతమతమయ్యాడు. ఫలితంగా ఓపెనర్గా స్థానం కోల్పోయాడు.అయితే, గత మ్యాచ్ (జింబాబ్వే)తో మళ్లీ తుదిజట్టులోకి వచ్చిన సంజూ.. తాజాగా వెస్టిండీస్పై అదరగొట్టి తన విలువ చాటుకున్నాడు. చిరకాలం గుర్తుండిపోయే ఇన్నింగ్స్తో మెరిసి అభిమానులను ఖుషీ చేశాడు.భారత్ వర్సెస్ వెస్టిండీస్ స్కోర్లువేదిక- ఈడెన్ గార్డెన్స్, కోల్కతాటాస్- భారత్.. తొలుత బౌలింగ్వెస్టిండీస్ స్కోరు- 195/4(20)భారత్ స్కోరు- 199/5 (19.2)ఫలితం- ఐదు వికెట్ల తేడాతో గెలిచిన భారత్ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్- సంజూ శాంసన్ (50 బంతుల్లో 12 ఫోర్లు, 4 సిక్స్లు.. 97 పరుగులు నాటౌట్). -
T20 WC 2026: విండీస్ను చిత్తు చేసి సెమీ ఫైనల్లో టీమిండియా
టీ20 ప్రపంచకప్-2026 టోర్నమెంట్లో టీమిండియా సెమీ ఫైనల్కు దూసుకువెళ్లింది. సూపర్-8 దశలో చావోరేవో తేల్చుకోవాల్సిన మ్యాచ్లో వెస్టిండీస్ (IND Beat WI)ను ఓడించి టైటిల్ దిశగా కీలక ముందడుగు వేసింది. కోల్కతా వేదికగా ఈడెన్ గార్డెన్స్లో ఆదివారం టాస్ గెలిచిన భారత్ తొలుత బౌలింగ్ ఎంచుకుంది.195 పరుగులుఈ క్రమంలో బ్యాటింగ్కు దిగిన వెస్టిండీస్ నిర్ణీత 20 ఓవర్లలో నాలుగు వికెట్ల నష్టానికి 195 పరుగులు చేసింది. ఓపెనర్లలో కెప్టెన్ షాయీ హోప్ (33 బంతుల్లో 32) ఫర్వాలేదనిపించగా.. రోస్టన్ ఛేజ్ (25 బంతుల్లో 40) రాణించాడు.మిగిలిన వారిలో షిమ్రన్ హెట్మైర్ (12 బంతుల్లో 27) ధనాధన్ దంచికొట్టగా.. షెర్ఫానే రూథర్ఫర్డ్ (9 బంతుల్లో 14) రాణించాడు. ఆఖర్లో రోవ్మన్ పావెల్ (19 బంతుల్లో 34), జేసన్ హోల్డర్ (22బంతుల్లో 37) మెరుపు ఇన్నింగ్స్తో అజేయంగా నిలిచారు.నిరాశపరిచిన అభిషేక్, ఇషాన్భారత బౌలర్లలో జస్ప్రీత్ బుమమ్రా రెండు వికెట్లు తీయగా.. హార్దిక్ పాండ్యా, వరుణ్ చక్రవర్తి తలా ఒక వికెట్ పడగొట్టారు. ఇక లక్ష్య ఛేదనలో భారత్కు ఆరంభంలోనే ఎదురుదెబ్బ తగిలింది. ఓపెనర్ అభిషేక్ శర్మ (11 బంతుల్లో 10) స్వల్ప స్కోరుకే వెనుదిరగగా.. వన్డౌన్ బ్యాటర్ ఇషాన్ కిషన్ (6 బంతుల్లో 10) సైతం నిరాశపరిచాడు.సంజూ బాధ్యతాయుత ఇన్నింగ్స్కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ (16 బంతుల్లో 18) చేతులెత్తేయగా.. తిలక్ వర్మ (15 బంతులలో 27) వేగంగా ఆడే క్రమంలో అవుటయ్యాడు. ఇలాంటి దశలో ఓపెనర్ సంజూ శాంసన్ బాధ్యతాయుత ఇన్నింగ్స్తో స్కోరు బోర్డును ముందుకు నడిపాడు. Man on a mission! 🚀Sanju Samson looks in sublime touch as he bring up his fifty! 🙌ICC Men’s #T20WorldCup, SUPER 8, #INDvWI | LIVE NOW ➡️ https://t.co/Y26WH6p8dS pic.twitter.com/yrCOStYeaF— Star Sports (@StarSportsIndia) March 1, 2026 అయితే విజయానికి 10 బంతులలో 17 పరుగులు అవసరమైన వేళ హార్దిక్ పాండ్యా (14 బంతులలో 17) రూపంలో భారత్ ఐదో వికెట్ కోల్పోయింది. ఈ క్రమంలో శివం దూబే సంజూకు జతయ్యాడు. దూబే 4 బంతులలో 8 పరుగులు చేయగా.. సంజూ ఆఖరి ఓవర్లో సిక్సర్, ఫోర్ బాది టీమిండియాను విజయతీరాలకు చేర్చాడు. సెంచరీకి మూడు పరుగుల దూరంలోఈ మ్యాచ్లో సంజూ మొత్తంగా 50 బంతులు ఎదుర్కొని 12 ఫోర్లు, 4 సిక్సర్ల సాయంతో 97 పరుగులతో అజేయంగా నిలిచాడు. సెంచరీకి మూడు పరుగుల దూరంలో నిలిచిపోయినా చిరస్మరణీయ ఇన్నింగ్స్తో జట్టుకు విజయం అందించాడు. ఇక మరో నాలుగు బంతులు మిగిలి ఉండగానే లక్ష్యాన్ని ఛేదించిన టీమిండియా ఐదు వికెట్ల తేడాతో విండీస్ను ఓడించింది. -
సంజూది చెత్త టెక్నిక్.. కోచ్ల మాట వినడు: భారత మాజీ క్రికెటర్ ఫైర్
న్యూజిలాండ్తో స్వదేశంలో టీ20 సిరీస్ తర్వాత భారత ఓపెనింగ్ జోడీ మారిపోయింది. వరుస వైఫల్యాల కారణంగా సంజూ శాంసన్ టీ20 ప్రపంచకప్-2026 టోర్నీలో ఓపెనర్గా స్థానం కోల్పోయాడు. కివీస్తో సిరీస్లో వన్డౌన్లో వచ్చి అదరగొట్టిన ఇషాన్ కిషన్ (Ishan Kishan).. అభిషేక్ శర్మకు జోడీగా సంజూ స్థానాన్ని భర్తీ చేశాడు.రెండో అవకాశంఅయితే, నమీబియాతో మ్యాచ్కు అభిషేక్ శర్మ (Abhishek Sharma) అనారోగ్యం కారణంగా దూరం కాగా.. సంజూకు ఇషాన్తో కలిసి ఇన్నింగ్స్ ఆరంభించే అవకాశం దక్కింది. ఈ మ్యాచ్లో అతడు 8 బంతుల్లో 22 పరుగులు చేశాడు. ఆ తర్వాత మళ్లీ బెంచ్కే పరిమితమైన సంజూ (Sanju Samson).. సూపర్-8లో భాగంగా జింబాబ్వేతో మ్యాచ్లో ఓపెనర్గా బరిలోకి దిగాడు.ఘనంగా ఆరంభించిచెన్నైలోని చెపాక్ స్టేడియం వేదికగా జింబాబ్వేతో మ్యాచ్లో సంజూ 15 బంతులు ఎదుర్కొని ఒక ఫోర్, రెండు సిక్స్లు బాది 24 పరుగులు చేశాడు. అయితే, బ్లెసింగ్స్ ముజర్బానీ బౌలింగ్లో షార్ట్ బంతిని తప్పుగా అంచనా వేసి గాల్లోకి లేపగా.. ర్యాన్ బర్ల్ క్యాచ్ అందుకున్నాడు. దీంతో సంజూ ఇన్నింగ్స్ ముగిసిపోయింది.ఈ నేపథ్యంలో మరోసారి సంజూ ఆట తీరుపై విమర్శలు వచ్చాయి. రాకరాక వచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకోలేకపోయాడంటూ అభిమానులు సైతం విమర్శించారు. భారత మాజీ క్రికెటర్ సుబ్రమణ్యం బద్రీనాథ్ కూడా ఇదే మాట అంటున్నాడు. సంజూ టెక్నిక్ తప్పుగా ఉందని.. ఇప్పటికైనా పొరపాటు సరిచేసుకోవాలని సూచించాడు.మరోసారి తన టెక్నిక్ తప్పని నిరూపించాడు‘‘చెపాక్లో సంజూను ఆడించడం వల్ల చెన్నై ప్రేక్షకులు సంతోషించారు. అందుకు తగ్గట్లుగానే అతడు మంచి ఆరంభమే అందుకున్నాడు. కానీ మరోసారి తన టెక్నిక్ తప్పని నిరూపించాడు.లెగ్ సైడ్ దిశగా వచ్చిన బంతిని ఆడేందుకు పక్కకు జరిగి మూల్యం చెల్లించాడు. మూడు స్టంప్స్ను ప్రత్యర్థి బౌలర్కు చూపి ఈజీ టార్గెట్ అయ్యాడు. క్రికెట్లో ఓనమాలు దిద్దినపుడే ప్రతి ఆటగాడు ఈ విషయాన్ని అర్థం చేసుకుంటాడు. మూడు స్టంప్స్ బౌలర్కు కనిపించేలా ఎప్పుడూ ఓ బ్యాటర్ ఎప్పుడూ తప్పు చేయకూడదు.కోచ్ల మాట వింటాడో లేదో!అలా చేయడం ప్రాథమిక తప్పిదం. అసలు అతడు కోచ్ల మాట వింటాడో లేదో నాకు తెలియదు. నిజానికి టీమిండియాలో ప్రతి ఒక్కరికి వ్యక్తిగత కోచ్ ఉన్నాడు. కాబట్టి అతడు ఎవరి మాట విని ఇలా చేస్తున్నాడో అర్థం కావడం లేదు. టెక్నికే తప్పుగా ఉంటే.. ఆటలో ఇంకేం ముందుకు వెళ్లగలవు?.. ఈ టోర్నీలో అతడు టెక్నిక్ సరి చేసుకోవడం కష్టమే అనిపిస్తోంది’’ అంటూ ఘాటుగా సంజూను విమర్శించాడు బద్రీనాథ్.కాగా కేరళ వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ గత ఏడాది కాలంగా భారత టీ20 ఓపెనర్గా రాణించాడు. అయితే, ఇటీవలి కాలంలో అతడు ఫామ్ కోల్పోయాడు. కివీస్తో సిరీస్లో సంజూ చేసిన పరుగులు 10, 6, 0, 24, 6. గత కొంతకాలంగా అతడు షార్ట్ బంతుల్ని తప్పుగా అంచనా వేసి అవుట్ కావడం గమనార్హం. ఈ నేపథ్యంలోనే బద్రీనాథ్ సంజూ టెక్నిక్ సరిగ్గా లేదంటూ చివాట్టు పెట్టాడు.చదవండి: అతడు ఎక్కడ బౌలింగ్ చేశాడో చూశారా?: భారత మాజీ కెప్టెన్ ఫైర్𝐃𝐈𝐒𝐏𝐀𝐓𝐂𝐇𝐄𝐃 🚀Sanju Samson starts the innings on a positive note! 💪ICC Men’s #T20WorldCup 👉 SUPER 8, #INDvZIM | LIVE NOW ➡️ https://t.co/vIdZg7mGmy pic.twitter.com/TtmJRlvcR0— Star Sports (@StarSportsIndia) February 26, 2026 -
Tilak Varma: నాకే చోటు లేదా?.. మెరుపులతో ఇరగదీశాడు!
టీ20 ప్రపంచకప్-2026 టోర్నీలో లీగ్ దశలో ఆడిన నాలుగు మ్యాచ్లలోనూ తిలక్ వర్మ తనదైన మూడో స్థానంలోనే బ్యాటింగ్కు వచ్చాడు. సౌతాఫ్రికాతో సూపర్-8 మ్యాచ్లోనూ వన్డౌన్లో దిగాడు. అయితే, ఐదు మ్యాచ్లలోనూ తిలక్ వర్మ స్థాయికి తగ్గట్లు రాణించలేకపోయాడు.తిలక్ ప్రదర్శన ఇలా..ముఖ్యంగా ఈ హైదరాబాదీ బ్యాటర్ స్ట్రైక్రేటుపై విమర్శలు వచ్చాయి. లీగ్ దశలో అమెరికా, నమీబియా, పాకిస్తాన్, నెదర్లాండ్స్ జట్లపై తిలక్ వర్మ వరుసగా.. 25, 25 , 25, 31 పరుగులు చేశాడు. సౌతాఫ్రికాతో మ్యాచ్లో రెండు బంతులు ఎదుర్కొని ఒకే ఒక్క పరుగు చేసి నిష్క్రమించాడు.టాపార్డర్ నుంచి తీసేశారు!అయితే, తాజాగా జింబాబ్వేతో గురువారం నాటి సూపర్-8 మ్యాచ్లో మాత్రం తిలక్ వర్మ ఇరగదీశాడు. నిజానికి ఈ మ్యాచ్కు ముందు ఈ లెఫ్టాండర్ బ్యాటర్కు తుదిజట్టులో చోటు దక్కదనే అభిప్రాయాలు వ్యక్తమయ్యాయి. టాపార్డర్లో ముగ్గురూ లెఫ్లాండర్లే (ఇషాన్ కిషన్, అభిషేక్ శర్మ, తిలక్ వర్మ) ఉన్న కారణంగా.. ఒకరిపై వేటు తప్పదనే విశ్లేషణలు వినిపించాయి.ఊహించినట్లుగానే టాపార్డర్ మారింది. అభిషేక్ శర్మకు జోడీగా.. ఓపెనర్గా రైట్ హ్యాండర్ సంజూ శాంసన్ తిరిగి రాగా.. ఇషాన్ను వన్డౌన్లో ఆడించారు. అయితే, ఊహించని రీతిలో తిలక్ వర్మను లోయర్ ఆర్డర్కు పంపించారు. ఐపీఎల్లో ఆడిన అనుభవం ఇప్పటికే తిలక్కు ఉంది.16 బంతుల్లోనే ఇక జింబాబ్వేతో మ్యాచ్లో ఆరో స్థానంలో బరిలోకి దిగిన తిలక్ వర్మ మెరుపులు మెరిపించాడు. కేవలం 16 బంతుల్లోనే మూడు ఫోర్లు, నాలుగు సిక్సర్లు బాది 44 పరుగులతో అజేయంగా నిలిచాడు. స్ట్రైక్రేటు 275. ఇలా మేనేజ్మెంట్ చేసిన ప్రయోగం ఫలించి.. తిలక్ వర్మ విమర్శకులకు బ్యాట్తోనే సమాధానం ఇచ్చాడు.డౌన్ ఆర్డర్కు పంపడం మంచిదైందిఈ నేపథ్యంలో భారత మాజీ క్రికెటర్ సంజయ్ మంజ్రేకర్ తిలక్ విషయంలో టీమిండియా మేనేజ్మెంట్ తీసుకున్న నిర్ణయాన్ని సమర్థించాడు. ‘‘తిలక్ వర్మను డౌన్ ఆర్డర్కు పంపి టీమిండియా మంచి పని చేసింది. లోయర్ ఆర్డర్లో అతడు బ్యాటింగ్ చేయడం నేను ఇప్పటికే చూశాను.నిజానికి ఇలా బ్యాటింగ్ ఆర్డర్లో వెనుక రావడం వల్ల.. టాపార్డర్తో పోలిస్తే ఒత్తిడి తక్కువగా ఉంటుంది. హార్దిక్ పాండ్యా ఐదు, తిలక్ ఆరో స్థానంలో రావడం వారితో పాటు జట్టుకు మేలు చేసింది. నిజానికి సౌతాఫ్రికాతో మ్యాచ్లో వాషింగ్టన్ సుందర్ను ఐదు, హార్దిక్ను ఏడో స్థానంలో సూర్య పంపడం చూసి నేను షాకయ్యాను. ఏదేమైనా ఈ మ్యాచ్లో తిలక్, హార్దిక్లను సరైన స్థానాల్లో ఆడించి ఫలితం రాబట్టారు’’ అని సంజయ్ మంజ్రేకర్ టీమిండియా నాయకత్వ బృందాన్ని అభినందించాడు. కాగా జింబాబ్వేతో మ్యాచ్లో టీమిండియా 72 పరుగుల తేడాతో గెలిచి.. సెమీస్ అవకాశాలు మెరుగుపరచుకుంది.చదవండి: అతడు ఎక్కడ బౌలింగ్ చేశాడో చూశారా?: భారత మాజీ కెప్టెన్ ఫైర్ -
కోహ్లి స్టైల్లో సిక్స్ కొట్టిన సంజూ.. గంభీర్ రియాక్షన్ వైరల్
టీ20 ప్రపంచకప్-2026లో టీమిండియా వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ మరోసారి తనకు వచ్చిన అవకాశాన్ని సద్వినియోగపరుచుకోలేకపోయాడు. చెన్నై వేదికగా జింబాబ్వేతో జరుగుతున్న సూపర్-8 మ్యాచ్లో శాంసన్కు తుది జట్టులో దక్కింది.టీమ్ మెనెజ్మెంట్ అతడిని ఓపెనర్గా పంపింది. అయితే సంజూ క్రీజులో ఉన్నంత సేపు దూకుడుగా ఆడాడు. 15 బంతుల్లో 1 ఫోరు, 2 సిక్స్లతో 24 పరుగులు చేసి ఔటయ్యాడు. అయితే భారత స్కోరు బోర్డు ఖాతాను సంజూ భారీ సిక్సర్తో తెరిచాడు. ఇన్నింగ్స్ రెండో బంతికే రిచర్డ్ నగరవ బౌలింగ్లో లాంగ్ ఆన్ మీదుగా శాంసన్ ఒక అద్భుతమైన సిక్సర్ బాదాడు. ఆ షాట్కు మైదానంలో ఉన్న ప్రతీ ఒక్కరూ ఫిదా అయిపోయారు. డ్రెస్సింగ్ రూమ్లో ఉన్న హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్ కూడా ఈ షాట్ను చూసి ఆశ్చర్యపోయాడు. ఈ షాట్ 2022 టీ20 ప్రపంచకప్లో హారిస్ రవూఫ్ బౌలింగ్లో విరాట్ కోహ్లీ కొట్టిన ఐకానిక్ సిక్సర్ను గుర్తుకు తెచ్చిందని ఫ్యాన్స్ సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారు. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరలవుతోంది. కాగా ఈ మ్యాచ్లో భారత్ భారీ స్కోర్ దిశగా దూసుకుపోతుంది. 14 ఓవర్లు ముగిసే సరికి టీమిండియా 3 వికెట్ల నష్టానికి 161 పరుగులు చేసింది.𝐃𝐈𝐒𝐏𝐀𝐓𝐂𝐇𝐄𝐃 🚀Sanju Samson starts the innings on a positive note! 💪ICC Men’s #T20WorldCup 👉 SUPER 8, #INDvZIM | LIVE NOW ➡️ https://t.co/vIdZg7mGmy pic.twitter.com/TtmJRlvcR0— Star Sports (@StarSportsIndia) February 26, 2026 -
వరుస ఫెయిల్యూర్స్ తర్వాత.. ఎట్టకేలకు
టీమిండియా ఓపెనర్ అభిషేక్ శర్మ ఎట్టకేలకు ఫామ్లోకి వచ్చాడు. జింబాబ్వేతో సూపర్-8 మ్యాచ్లో ఈ లెఫ్టాండర్ బ్యాట్ ఝులిపించాడు. ఇరవై ఆరు బంతుల్లోనే అర్ధ శతకం బాది సత్తా చాటాడు.ఆది నుంచి దారుణంగా విఫలంటీ20 ప్రపంచకప్-2026 టోర్నీలో అభిషేక్ శర్మ ఆది నుంచి దారుణంగా విఫలమైన విషయం తెలిసిందే. లీగ్ దశలో అమెరికాతో మ్యాచ్లో గోల్డెన్ డకౌట్గా వెనుదిరిగిన ఈ ఓపెనింగ్ బ్యాటర్.. ఆ తర్వాత కడుపు నొప్పి వల్ల నమీబియాతో మ్యాచ్కు దూరమయ్యాడు.సౌతాఫ్రికాతో జరిగిన మ్యాచ్లోనూఅనంతరం జట్టులోకి తిరిగి వచ్చిన అభిషేక్ శర్మ పాకిస్తాన్, నెదర్లాండ్స్లతో మ్యాచ్లలోనూ డకౌట్ అయ్యాడు. అయినప్పటికీ యాజమాన్యం జట్టులో కొనసాగించగా.. సూపర్-8లో తొలుత సౌతాఫ్రికాతో జరిగిన మ్యాచ్లోనూ అతడు విఫలమయ్యాడు. 12 బంతులు ఎదుర్కొని కేవలం 15 పరుగులు చేసి నిష్క్రమించాడు.దీంతో అభిషేక్ శర్మ ఆట తీరుపై విమర్శలు వెల్లువెత్తాయి. తుదిజట్టు నుంచి తప్పించి.. అతడికి కాస్త బ్రేక్ ఇవ్వాలని మాజీ క్రికెటర్లు సూచించారు. అయితే, మేనేజ్మెంట్ మాత్రం అభిషేక్పై నమ్మకం ఉంచగా.. పసికూన జింబాబ్వేతో మ్యాచ్లో అతడు ఆ నమ్మకాన్ని నిలబెట్టుకున్నాడు.A well-constructed half-century for #AbhishekSharma! 👏His first in the ICC Men’s T20 World Cup and what an occasion to bring it up! 💙ICC Men’s #T20WorldCup 👉 SUPER 8, #INDvZIM | LIVE NOW ➡️ https://t.co/vIdZg7mGmy pic.twitter.com/vIVUWHYhSe— Star Sports (@StarSportsIndia) February 26, 2026అర్ధ శతకంతోజింబాబ్వేతో మ్యాచ్లో అభిషేక్ శర్మ.. ఇరవై ఆరు బంతుల్లో మూడు ఫోర్లు, నాలుగు సిక్సర్లు బాది అర్ధ శతకం పూర్తి చేసుకున్నాడు. కాగా కెరీర్లో తొలి వరల్డ్కప్ ఆడుతున్న ఈ పంజాబీ బ్యాటర్కు.. ఐసీసీ ఈవెంట్లో ఇదే తొలి ఫిఫ్టీ కావడం విశేషం. అయితే, మపోసా బౌలింగ్లో సికందర్ రజాకు క్యాచ్ ఇచ్చి అభిషేక్ శర్మ 55 పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద నిష్క్రమించాడు.ఇదిలా ఉంటే.. 16 ఓవర్ల ఆట ముగిసే సరికి టీమిండియా నాలుగు వికెట్ల నష్టానికి 188 పరుగులు చేసింది. హార్దిక్ పాండ్యా 16, తిలక్ వర్మ 11 పరుగులతో క్రీజులో నిలిచారు. ఓపెనర్ సంజూ శాంసన్ 24, వన్డౌన్ బ్యాటర్ ఇషాన్ కిషన్ 38 పరుగులు చేసి అవుటయ్యారు. సూర్య 13 బంతుల్లో 33 పరుగులు చేసి పెవిలియన్ చేరాడు.చదవండి: వైభవ్ సూర్యవంశీ విధ్వంసం.. దంచికొట్టిన అర్జున్ టెండుల్కర్ -
T20 WC: మారవా?.. సంజూ శాంసన్ విఫలం
ఐసీసీ టీ20 ప్రపంచకప్-2026 టోర్నీ లీగ్ దశలో ఒకే ఒక్క మ్యాచ్ ఆడాడు సంజూ శాంసన్. నమీబియాతో మ్యాచ్కు అభిషేక్ శర్మ దూరం కావడంతో.. ఓపెనర్గా అతడి స్థానంలో వచ్చాడు. పసికూనతో మ్యాచ్లో ఎనిమిది బంతుల్లో 22 పరుగులు చేయగలిగాడు.అయితే, ఆ తర్వాత మళ్లీ సంజూ (Sanju Samson)కు తుదిజట్టులో చోటు దక్కలేదు. ఓపెనింగ్ జోడీలో ఇషాన్ కిషన్ (Ishan Kishan) మెరుగ్గా ఆడగా.. అభిషేక్ శర్మ లీగ్ దశలో ఆడిన మూడు మ్యాచ్లలో డకౌట్ అయ్యాడు. అయినప్పటికీ యాజమాన్యం అతడిని కొనసాగించింది. సంజూను బెంచ్కు పరిమితం చేసింది.మరో అవకాశంఅయితే, తాజాగా జింబాబ్వేతో సూపర్-8 మ్యాచ్ సందర్భంగా మరోసారి సంజూ శాంసన్కు మేనేజ్మెంట్ అవకాశం ఇచ్చింది. లెఫ్ట్-రైట్ కాంబినేషన్ కోసం ఈ నిర్ణయం తీసుకుంది. ఈ నేపథ్యంలో లెఫ్టాండర్ అభిషేక్ శర్మతో కలిసి ఈ వికెట్ కీపర్ బ్యాటర్ గురువారం భారత జట్టు ఇన్నింగ్స్ ఆరంభించాడు. 𝐃𝐈𝐒𝐏𝐀𝐓𝐂𝐇𝐄𝐃 🚀Sanju Samson starts the innings on a positive note! 💪ICC Men’s #T20WorldCup 👉 SUPER 8, #INDvZIM | LIVE NOW ➡️ https://t.co/vIdZg7mGmy pic.twitter.com/TtmJRlvcR0— Star Sports (@StarSportsIndia) February 26, 2026ఘనంగానే ఆరంభించాడు.. కానీఇన్నింగ్స్ రెండో బంతికే సిక్స్ బాది ఘనంగా ఆరంభించాడు సంజూ. రెండో ఓవర్లోనూ ఓ సిక్సర్ బాదిన ఈ కుడిచేతి వాటం బ్యాటర్.. ఆ మరుసటి ఓవర్లో బౌండరీ రాబట్టాడు. ఇలా మంచి ఫామ్లోకి వచ్చిన సంజూ.. నాలుగో ఓవర్లో రెండో బంతికి భారీ షాట్కు యత్నించి అవుటయ్యాడు.బ్లెసింగ్ ముజర్బానీ సంధించిన షార్ట్ బాల్ను సంజూ గాల్లోకి లేపగా.. డీప్ మిడ్ వికెట్ నుంచి పరిగెత్తుకు వచ్చి ర్యాన్ బర్ల్ క్యాచ్ అందుకున్నాడు. ఫలితంగా సంజూ శాంసన్ పెవిలిన్ చేరగా.. భారత్ తొలి వికెట్ కోల్పోయింది. మారవా సంజూ!జింబాబ్వేతో మ్యాచ్లో మొత్తంగా 15 బంతులు ఎదుర్కొన్న సంజూ.. ఒక ఫోర్, రెండు సిక్సర్లు బాది 24 పరుగులు చేయగలిగాడు. దీంతో రాకరాక వచ్చిన అవకాశాన్ని కూడా సద్వినియోగం చేసుకోలేకపోయాడని అభిమానులు ఉసూరుమంటున్నారు.ఇక తుదిజట్టులో సంజూను చూడటం కష్టమేనని వాపోతున్నారు. కాగా టీ20 ప్రపంచకప్ టోర్నీ ఆరంభానికి ముందు న్యూజిలాండ్తో సిరీస్లోనూ సంజూ వరుసగా విఫలమయ్యాడు. దీంతో ఓపెనర్గా సంజూ స్థానాన్ని ఇషాన్ భర్తీ చేశాడు. ఇక జింబాబ్వేతో మ్యాచ్తో సంజూ తిరిగి రాగా.. ఇషాన్ వన్డౌన్లో దిగాడు. పవర్ ప్లేలో టీమిండియా స్కోరు: 80-1(6). ఆరు ఓవర్ల ఆట ముగిసే సరికి ఇషాన్ 15, అభిషేక్ శర్మ 33 పరుగులతో క్రీజులో నిలిచారు. చెన్నై వేదికగా టాస్ గెలిచిన జింబాబ్వే తొలుత బౌలింగ్ ఎంచుకోగా.. భారత్ బ్యాటింగ్కు దిగింది.చదవండి: సౌతాఫ్రికా ఘన విజయం.. టీమిండియాకు గుడ్న్యూస్! -
జింబాబ్వేతో మ్యాచ్.. భారత తుదిజట్టులో రెండు మార్పులు
టీ20 ప్రపంచకప్-2026 సూపర్-8లో భాగంగా చెన్నై వేదికగా భారత్, జింబాబ్వే జట్లు తలపడతున్నాయి. ఈ మ్యాచ్లో టాస్ గెలిచిన జింబాబ్వే తొలుత బౌలింగ్ ఎంచుకుంది. ఈ కీలక మ్యాచ్లో భారత్ రెండు మార్పులతో బరిలోకి దిగింది.వాషింగ్టన్ సుందర్, రింకూ సింగ్ స్ధానంలో అక్షర్ పటేల్, సంజూ శాంసన్ తుది జట్టులోకి వచ్చాడు. అభిషేక్, సంజూ కలిసి భారత ఇన్నింగ్స్ను ప్రారంభించనున్నారు. జింబాబ్వే కూడా ఓ మార్పు చేసింది. క్రీమర్ స్థానంలో టినోటెండా మాపోసాకు చోటు దక్కింది.తుది జట్లుజింబాబ్వే: తడివానాషే మారుమణి(వికెట్ కీపర్), బ్రియాన్ బెన్నెట్, డియోన్ మైయర్స్, ర్యాన్ బర్ల్, సికందర్ రజా(కెప్టెన్), టోనీ మునియోంగా, తషింగా ముసెకివా, బ్రాడ్ ఎవాన్స్, టినోటెండా మపోసా, బ్లెస్సింగ్ ముజారబానీ, రిచర్డ్ నగరవభారత్: సంజు శాంసన్(వికెట్ కీపర్), అభిషేక్ శర్మ, ఇషాన్ కిషన్, సూర్యకుమార్ యాదవ్(కెప్టెన్), తిలక్ వర్మ, హార్దిక్ పాండ్యా, శివమ్ దూబే, అక్షర్ పటేల్, అర్ష్దీప్ సింగ్, వరుణ్ చక్రవర్తి, జస్ప్రీత్ బుమ్రా -
అతడికి బ్రేక్ ఇవ్వండి.. సంజూను జట్టులోకి తీసుకోండి: వీరేంద్ర సెహ్వాగ్
టీ20 ప్రపంచకప్ 2026లో టీమిండియా మరో కీలక పోరుకు సిద్దమైంది. గురువారం చెన్నై వేదికగా జింబాబ్వేతో భారత్ తలపడనుంది. సెమీస్ రేసులో నిలవాలంటే సూర్య సేన కచ్చితంగా ఈ మ్యాచ్లో గెలవాల్సిందే. అయితే ఈ మ్యాచ్కు ముందు భారత జట్టు మెనెజ్మెంట్కు టీమిండియా మాజీ ఓపెనర్ వీరేంద్ర సెహ్వాగ్ కీలక సూచన చేశాడు. ఫామ్ లేమితో తీవ్రంగా ఇబ్బంది పడుతున్న అభిషేక్ శర్మను తప్పించి సంజూ శాంసన్ను జట్టులోకి తీసుకోవాలని సెహ్వాగ్ అభిప్రాయపడ్డాడు. ఈ మెగా టోర్నీలో అభిషేక్ పేలవ ప్రదర్శన కనబరుస్తున్నాడు. ఇప్పటివరకు 4 మ్యాచ్లు ఆడిన అభిషేక్ కేవలం 15 పరుగులు మాత్రమే చేశాడు. అందులో మూడు డకౌట్లు ఉండడం గమనార్హం. దీంతో అతడిని జట్టు నుంచి తప్పించాలని పలువురు మాజీలు సూచిస్తున్నారు."నేను గనుక టీమ్ మెనెజ్మెంట్లో భాగంగా ఉంటే, అభిషేక్కు విశ్రాంతి ఇచ్చే వాడిని. అతడి స్ధానంలో సంజూ శాంసన్ను అవకాశమిస్తాను. ఏదైనా ప్రయత్నం చేయాలంటే ఈ మ్యాచ్లోనే చేయాలి. ఎందుకంటే ఈ మ్యాచ్లో భారత్ ఓడిపోతే, టోర్నీ నుంచి నిష్క్రమిస్తారు. ఇది చాలా కీలకమైన మ్యాచ్. కాబట్టి ఆటగాళ్ల ఫామ్ ఆధారంగా భా తమ అత్యుత్తమ ప్లేయింగ్ ఎలెవన్ను ఎంచుకోవాలి.తుది జట్టు ఎంపికలో మార్పులు కచ్చితంగా ఉంటాయని అనుకుంటున్నాను. భారత్ సరైన వ్యూహాలతో బరిలోకి దిగుతోంది. కానీ వాటిని అమలు చేయడంలో మాత్రం విఫలమవుతోంది. ఈ మ్యాచ్లో భారత్ తమ వ్యూహాలకు మరింత పదును పెట్టే అవకాశముంది. అభిషేక్ శర్మ, తిలక్ వర్మ ఇద్దరూ మంచి ఫామ్లో లేరన్న విషయం మెనెజ్మెంట్ గుర్తుంచుకోవాలి" అని క్రిక్బజ్కు ఇచ్చిన ఇంటర్వ్యూలో సెహ్వాగ్ పేర్కొన్నాడు. -
IND vs ZIM: భారత తుదిజట్టు ఇదే.. ఆ ముగ్గురిపై వేటు!
జింబాబ్వేతో కీలక సూపర్-8 మ్యాచ్కు టీమిండియా సిద్ధమైంది. ఇరుజట్ల మధ్య గురువారం చెన్నై వేదికగా రాత్రి ఏడు గంటలకు మ్యాచ్కు తెరలేవనుంది. టీ20 ప్రపంచకప్-2026 టోర్నీలో ముందడుగు వేయాలంటే భారత్ ఈ మ్యాచ్లో తప్పక భారీ విజయం సాధించాలి.లెఫ్ట్-రైట్ కాంబినేషన్ఈ నేపథ్యంలో తుదిజట్టు కూర్పు విషయంలో యాజమాన్యం ఆచితూచి వ్యవహరిస్తోంది. టాపార్డర్లో ముగ్గురు లెఫ్టాండర్లే ఉండటం వల్ల ప్రత్యర్థి జట్టు బౌలర్లు.. ముఖ్యంగా ఆఫ్ స్పిన్నర్లకు ఈజీ టార్గెట్ అవుతున్నారు. ఈ నేపథ్యంలో లెఫ్ట్-రైట్ కాంబినేషన్ కోసం సంజూ శాంసన్ను తుదిజట్టులో చోటు ఇవ్వనున్నట్లు బ్యాటింగ్ కోచ్ సితాన్షు కొటక్ ఇప్పటికే సంకేతాలు ఇచ్చాడు.ఆ ముగ్గురిపై వేటు!అయితే, ఓపెనింగ్ జోడీగా మాత్రం లెఫ్టాండర్లు ఇషాన్ కిషన్- అభిషేక్ శర్మను కొనసాగించాలని మేనేజ్మెంట్ నిర్ణయించుకున్నట్లు సమాచారం. గాయం నుంచి కోలుకున్న తర్వాత స్థాయికి తగ్గట్లు రాణించలేకపోతున్న మరో లెఫ్టాండర్ తిలక్ వర్మపై వేటు వేసి.. అతడి స్థానంలో అంటే వన్డౌన్లో కుడిచేతి వాటం బ్యాటర్ సంజూను ఆడించాలనే యోచనలో ఉన్నట్లు తెలుస్తోంది.అదే విధంగా.. సౌతాఫ్రికాతో మ్యాచ్లో అక్షర్ పటేల్ను ఆడించకుండా మూల్యం చెల్లించిన నేపథ్యంలో.. తిరిగి అతడిని ప్లేయింగ్ ఎలెవన్లోకి తీసుకున్నట్లు సమాచారం. అంతేకాదు స్పిన్కు అనుకూలమైన చెపాక్ పిచ్పై చైనామన్ బౌలర్ కుల్దీప్ యాదవ్ను కూడా ఆడించాలని మేనేజ్మెంట్ నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది.ఈ నేపథ్యంలో స్థానిక ఆల్రౌండర్, చెన్నై చిన్నోడు వాషింగ్టన్ సుందర్పై వేటు పడవచ్చు. అదే విధంగా రింకూ సింగ్ను కూడా పక్కనపెట్టే అవకాశం ఉంది. మొత్తానికి జింబాబ్వేతో మ్యాచ్లో తిలక్ స్థానంలో సంజూ.. వాషీ స్థానంలో కుల్దీప్.. రింకూ స్థానంలో అక్షర్ పటేల్ రావడం ఖాయంగా కనిపిస్తోంది.సఫారీల చేతిలో భారీ ఓటమితోకాగా గ్రూప్ దశలో అజేయంగా నిలిచిన టీమిండియా.. సూపర్-8 దశలో తొలి మ్యాచ్లోనే భారీ ఓటమిని మూటగట్టుకుంది. సౌతాఫ్రికా చేతిలో ఏకంగా 76 పరుగుల తేడాతో చిత్తుగా ఓడిపోయింది. దీంతో సెమీస్ అవకాశాలు సంక్లిష్టంగా మారాయి. ఈ నేపథ్యంలో సెమీ ఫైనల్ చేరాలంటే జింబాబ్వే, వెస్టిండీస్లపై తప్పక భారీ విజయాలు సాధించడంతో పాటు.. విండీస్- సౌతాఫ్రికా మ్యాచ్ ఫలితంపై ఆధారపడాల్సి ఉంటుంది.జింబాబ్వేతో సూపర్-8 మ్యాచ్కు భారత తుదిజట్టు (అంచనా)ఇషాన్ కిషన్ (వికెట్ కీపర్), అభిషేక్ శర్మ, సంజూ శాంసన్, సూర్యకుమార్ యాదవ్ (కెప్టెన్), అక్షర్ పటేల్, శివం దూబే, హార్దిక్ పాండ్యా, అర్ష్దీప్ సింగ్, కుల్దీప్ యాదవ్, జస్ప్రీత్ బుమ్రా, వరుణ్ చక్రవర్తి. చదవండి: పతనం అంచుల్లో శ్రీలంక క్రికెట్ -
IND vs ZIM: తుదిజట్టులో సంజూ.. అతడిపై వేటు!
టీ20 ప్రపంచకప్-2026 టోర్నమెంట్లో కీలక మ్యాచ్కు టీమిండియా సన్నద్ధమైంది. సూపర్-8 దశలో భాగంగా గురువారం చెన్నై వేదికగా జింబాబ్వేతో తలపడనుంది. ఈ నేపథ్యంలో తుదిజట్టు కూర్పు ఎలా ఉండబోతుందా? అన్న అంశం చర్చనీయాంశంగా మారింది.ఇషాన్ హిట్.. అభిషేక్ ఫ్లాప్కాగా ఓపెనింగ్ జోడీగా ఇషాన్ కిషన్- అభిషేక్ శర్మలకు అవకాశాలు వస్తుండగా.. సంజూ శాంసన్ బెంచ్కే పరిమితం అవ్వాల్సిన పరిస్థితి. అయితే వరల్డ్కప్ టోర్నీలో ఇషాన్ మెరుగ్గా రాణిస్తూ జట్టు విజయాల్లో కీలక పాత్ర పోషిస్తుండగా.. అభిషేక్ శర్మ లీగ్ దశలో తొలి మూడు మ్యాచ్లలోనూ డకౌట్ అయ్యాడు.ఇక సూపర్-8లో తొలుత సౌతాఫ్రికాతో టీమిండియా తలపడగా.. ఈసారి ఇషాన్ డకౌట్ కాగా.. అభిషేక్ 15 పరుగులు చేయగలిగాడు. మరోవైపు.. సంజూ లీగ్ దశలో నమీబియాతో మ్యాచ్లో బరిలోకి దిగి 8 బంతుల్లో 22 పరుగులు చేయగలిగాడు.తిలక్ వర్మపై విమర్శలుఇదిలా ఉంటే.. మూడో స్థానంలో ఆడుతున్న తిలక్ వర్మ ఇప్పటి వరకు పెద్దగా బ్యాట్ ఝులిపించనేలేదు. అతడి స్ట్రైక్రేటుపై విమర్శలు వస్తున్నాయి. ముగ్గురూ లెఫ్టాండర్లేఇక ఓపెనర్లు ఇషాన్- అభిషేక్.. వన్డౌన్లో వచ్చే తిలక్.. ఈ ముగ్గురూ లెఫ్టాండ్ బ్యాటర్లే. దీంతో ప్రత్యర్థి జట్టు బౌలర్లు, కెప్టెన్కు పని సులువు అయిపోతోంది. వ్యూహాల్లో పెద్దగా మార్పులు లేకుండానే వాళ్లు అనుకున్న ఫలితాలు రాబట్టగలుగుతున్నారు.లెఫ్ట్-రైట్ కాంబినేషన్ కోసంఇలాంటి తరుణంలో లెఫ్ట్-రైట్ కాంబినేషన్ కోసం టీమిండియా టాపార్డర్లో మార్పులు చేసేందుకు సిద్ధమైంది. బ్యాటింగ్ కోచ్ సితాన్షు కొటక్ స్వయంగా ఈ విషయాన్ని వెల్లడించాడు. జింబాబ్వేతో మ్యాచ్కు ముందు మీడియాతో మాట్లాడుతూ.. ‘‘తుదిజట్టులో సంజూ శాంసన్ను చేర్చే విషయమై చర్చ నడుస్తోంది.సంజూ వస్తాడని సంకేతంజింబాబ్వేతో మ్యాచ్ సందర్భంగా మార్పులు ఉండవచ్చు. మా ఓపెనర్లతో పాటు వన్డౌన్లో వచ్చే ఆటగాడు కూడా లెఫ్టాండర్ బ్యాటరే కావడం ఇందుకు కారణం. అందుకే ఈ విషయంలో పునరాలోచన చేస్తున్నాం. అయితే, మ్యాచ్ సమయంలోనే మేము తుది నిర్ణయం తీసుకుంటాం’’ అని కొటక్ తెలిపాడు.ఎవరిపై వేటు?ఒకవేళ సంజూ గనుక తుదిజట్టులోకి వస్తే ఎవరిపై వేటు పడుతుందనేది ప్రశ్నార్థకంగా మారింది. రింకూ సింగ్ స్థానంలో సంజూను ఆడిస్తారనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. అదే జరిగితే సంజూను వన్డౌన్లో ఆడించి.. తిలక్ను డిమోట్ చేయడం ఓ ఆప్షన్. అయితే, ఇప్పటికే తండ్రి ఆరోగ్య పరిస్థితి విషమించినా రింకూ జట్టుతో చేరేందుకు సుముఖంగా ఉన్నట్లు కొటక్ తెలిపాడు.రింకూ, తిలక్, అభిషేక్!అంటే రింకూ జింబాబ్వేతో మ్యాచ్ ఆడటం ఖాయమే అనిపిస్తోంది. ఈ నేపథ్యంలో అభిషేక్ శర్మపై వేటు పడనుందనే వార్తలు వినిపిస్తున్నాయి. వరుస వైఫల్యాల నేపథ్యంలో రీసెట్ అయ్యేందుకు.. లెఫ్ట్-రైట్ ఓపెనింగ్ కాంబినేషన్ కోసం అతడిని పక్కనపెడతారనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.మరోవైపు.. అభిషేక్- ఇషాన్ జోడిని కొనసాగిస్తే.. తిలక్ వర్మపై వేటు వేసి.. సంజూను మూడోస్థానంలోనే ఆడిస్తారనే ఊహాగానాలూ వినిపిస్తున్నాయి. ఏదేమైనా.. సితాన్షు కొటక్ చెప్పినట్లు మ్యాచ్ ఆరంభానికి ముందు వరకు భారత తుదిజట్టు ఎలా ఉండబోతుందో అంచనా వేయడం ఈసారి కాస్త కష్టమే అనిపిస్తోంది. కాగా చివరగా సౌతాఫ్రికాతో మ్యాచ్ ఆడిన భారత తుదిజట్టులో ఏకంగా ఏడుగురు ఎడమచేతి వాటం ఆటగాళ్లు ఉండటం విశేషం. ఈ మ్యాచ్లో సఫారీల చేతిలో 76 పరుగుల తేడాతో చిత్తుగా ఓడిన టీమిండియా సెమీస్ అవకాశాలను సంక్లిష్టం చేసుకుంది. చదవండి: T20 WC 2026: రింకూ సింగ్కు సంబంధించి బిగ్ అప్డేట్ -
అతడి గురించి బాధ లేదు.. సంజూ రావొచ్చు: టీమిండియా కోచ్
సౌతాఫ్రికా చేతిలో ఘోర పరాభవం తర్వాత టీమిండియా జింబాబ్వేతో తలపడేందుకు సిద్ధమైంది. టీ20 ప్రపంచకప్-2026 సూపర్-8 దశలో భాగంగా ఇరుజట్ల మధ్య గురువారం మ్యాచ్ నిర్వహణకు షెడ్యూల్ ఖరారైంది. చెన్నైలోని ఎంఏ చిదంబరం స్టేడియం ఇందుకు వేదిక.ఈ నేపథ్యంలో జింబాబ్వేతో మ్యాచ్కు ముందు టీమిండియా బ్యాటింగ్ కోచ్ సితాన్షు కొటక్ మీడియాతో మాట్లాడాడు. ఈ సందర్భంగా తుదిజట్టు కూర్పు గురించి ముఖ్యంగా.. అభిషేక్ శర్మ, తిలక్ వర్మ, సంజూ శాంసన్ల గురించి కొటక్ కీలక వ్యాఖ్యలు చేశాడు.సంజూకు మొండిచేయికాగా ఇషాన్ కిషన్ రాకతో భారత టీ20 జట్టులో ఓపెనర్గా సంజూ శాంసన్ స్థానం గల్లైంతైన విషయం తెలిసిందే. లీగ్ దశలో అమెరికా, పాకిస్తాన్, నెదర్లాండ్స్ మ్యాచ్లలో అభిషేక్ శర్మ- ఇషాన్ జోడీగా బరిలో దిగారు. అయితే, నమీబియాతో మ్యాచ్కు మాత్రం అభిషేక్ గైర్హాజరీలో సంజూ ఓపెనర్గా వచ్చాడు.తిలక్ వర్మ ఆట తీరుపై విమర్శలుమరోవైపు.. వన్డౌన్ బ్యాటర్ తిలక్ వర్మ క్రీజులో నిలదొక్కుకునేందుకు ఎక్కువ సమయం తీసుకుంటున్నాడు. అతడి స్ట్రైక్రేటు కూడా దారుణంగా ఉంది. ఈ నేపథ్యంలో జింబాబ్వేతో మ్యాచ్లో తిలక్ను తప్పించి సంజూను మూడో స్థానంలో ఆడించేందుకు యాజమాన్యం సుముఖంగా ఉన్నట్లు వార్తలు వచ్చాయి.తిలక్ గురించి బాధ లేదుఈ పరిణామాల నేపథ్యంలో సితాన్షు కొటక్ మాట్లాడుతూ.. ‘‘తిలక్ వర్మ బ్యాటింగ్ గురించి మాకు ఎలాంటి సమస్య లేదు. పాకిస్తాన్తో మ్యాచ్లో అతడు చక్కగా ఆడాడు. రెండు, మూడు బౌండరీలు బాదితే అంతా అదే సర్దుకుంటుంది. అతడు బంతులు వృథా చేస్తున్నాడన్న అంశంలో మాకు ఎలాంటి ఆందోళనా లేదు.అభిషేక్ శర్మ గురించి కూడా మేము ఆందోళన చెందడం లేదు. సౌతాఫ్రికా చేతిలో భారీ ఓటమి గురించి కూడా పెద్దగా ఆందోళన లేదు. తదుపరి మ్యాచ్లో ఎలాంటి వ్యూహాలు అమలు చేయాలన్న అంశం మీదే మేము ప్రస్తుతం దృష్టి సారించాము.సంజూ రావొచ్చుప్రత్యర్థి జట్టు బౌలింగ్ను అర్థం చేసుకుని.. సరైన జవాబు ఇచ్చే విధంగా మా బ్యాటర్లు సంసిద్ధం అవుతున్నారు. ప్రణాళిక, సన్నాహకాలపైనే అంతా ఆధారపడి ఉంటుంది. అతడి (సంజూ) గురించి చర్చ నడుస్తోంది. అయితే, మేము ముందుగానే తుదిజట్టును నిర్ణయించబోము. అతడిని ఆడించే ఆలోచన లేదని మాత్రం చెప్పము’’ అని సితాన్షు కొటక్ పేర్కొన్నాడు. అదే విధంగా.. వ్యక్తిగత కారణాల వల్ల జట్టును వీడిన రింకూ సింగ్ బుధవారం సాయంత్రం టీమ్తో కలుస్తాడని తెలిపాడు.సౌతాఫ్రికా చేతిలో 76 పరుగుల తేడాతోఇదిలా ఉంటే.. లీగ్ దశలో అమెరికా, నమీబియా, పాకిస్తాన్, నెదర్లాండ్స్లపై గెలుపొంది అజేయంగా నిలిచింది టీమిండియా. అయితే, సెమీస్ దిశగా అడుగులు వేసే క్రమంలో ఊహించని రీతిలో సూపర్-8 తొలి మ్యాచ్లోనే ఘోరంగా ఓడిపోయింది. సౌతాఫ్రికా చేతిలో 76 పరుగుల తేడాతో చిత్తుగా ఓడి సెమీ ఫైనల్ అవకాశాలు సంక్లిష్టం చేసుకుంది. తదుపరి జింబాబ్వే, వెస్టిండీస్లపై నెగ్గితేనే సెమీస్ ఆశలు సజీవంగా ఉంటాయి.చదవండి: T20 WC 2026: పాక్ జట్టులో కలకలం -
సౌతాఫ్రికా చేతిలో ఘోర పరాభవం.. టీమిండియాలో కీలక మార్పు
టీ20 ప్రపంచకప్ 2026 సూపర్-8 మ్యాచ్లో సౌతాఫ్రికా చేతిలో ఘోర పరాభవం ఎదురైన నేపథ్యంలో టీమిండియాలో కీలక మార్పు జరుగనుందని తెలుస్తుంది. జింబాబ్వేతో ఆడబోయే తదుపరి మ్యాచ్కు (ఫిబ్రవరి 26) స్టార్ ఆటగాడు సంజూ శాంసన్ జట్టులోకి వస్తాడని అసిస్టెంట్ కోచ్ ర్యాన్ టెన్ డస్కటే హింట్ ఇచ్చాడు. రాబోయే రోజుల్లో సంజూ టాకింగ్ పాయింట్ అవుతాడని డస్కటే సౌతాఫ్రికా మ్యాచ్ పూర్తయిన అనంతరం మీడియా సమావేశంలో అన్నాడు. దీన్ని బట్టి చూస్తే జింబాబ్వే మ్యాచ్లో సంజూ బరిలోకి దిగడం ఖాయమని తెలుస్తుంది.సంజూ జట్టులోకి వస్తే ఎవరిపై వేటు వేస్తారన్నదే, ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది. హ్యాట్రిక్ డకౌట్లు సహా వరుసగా నాలుగో మ్యాచ్లోనూ విఫలమైన అభిషేక్ శర్మను తప్పిస్తారా లేక చెత్త ఫామ్లో ఉన్న తిలక్ వర్మపై వేటు వేస్తారా అన్నది తెలియాల్సి ఉంది. డస్కటే వ్యాఖ్యలను అంచనా వేస్తే.. అభిషేక్పైనే వేటు పడే అవకాశాలు అధికంగా ఉన్నాయి.ఎందుకంటే డస్కటే లెఫ్ట్ అండ్ రైట్ ఓపెనింగ్ కాంబినేషన్ల గురించి ప్రస్తావించాడు. అతని మాటల్లో.. టాపార్డర్లో ఉన్న ముగ్గురు ఎడమచేతి వాటం బ్యాటర్లు ఇషాన్ కిషన్, అభిషేక్ శర్మ, తిలక్ వర్మ ప్రతి మ్యాచ్లో ఆఫ్ స్పిన్ బౌలర్లకు బలవుతున్నారు. పాకిస్తాన్ మ్యాచ్లో సల్మాన్ ఆఘా, దక్షిణాఫ్రికా మ్యాచ్లో మార్క్రమ్ పవర్ప్లేలోనే వికెట్లు తీశారు. దీంతో తక్కువ స్కోర్లకే భారత్ వికెట్లు కోల్పోయింది. ఇది ఆందోళన కలిగించే అంశం. గత 18 నెలల్లో బాగా ఆడిన ఆటగాళ్లను కొనసాగించాలా లేక సంజూని జట్టులోకి తీసుకురావాలా అన్నదే ప్రస్తుతం చర్చనీయాంశమని డస్కటే అన్నారు.డస్కటే వ్యాఖ్యలను బట్టి చూస్తే.. ప్రత్యర్ది ఆఫ్ స్పిన్ ప్రయోగాలను విజయవంతంగా ఎదుర్కొని, పవర్ ప్లేలో వికెట్లు కోల్పోకుండా ఉండాలంటే టాపార్డర్లో రైట్ హ్యాండ్ బ్యాటర్ అవశ్యకత ఉన్నట్లు తెలుస్తుంది. ప్రస్తుతం ఆ ఆప్షన్ సంజూ మాత్రమే. సంజూను ఓపెనర్గా జట్టులోకి తీసుకుంటే.. ఇషాన్ కిషన్తో కలిసి కుడి-ఎడమ కాంబినేషన్ అవుతుంది. ఈ కాంబినేషన్తో ఆఫ్ స్పిన్నర్ల ఆధిపత్యానికి అడ్డుకట్ట వేయడంతో పాటు మిగతా బౌలర్ల లైన్ అండ్ లెంగ్త్కు కూడా భంగం కలిగించవచ్చు. జింబాబ్వే మ్యాచ్లో భారత మేనేజ్మెంట్ ఈ ప్రయోగాన్ని అమలు చేస్తుందో లేదో చూడాలి.ఇషాన్కు డిమోషన్..?ఒకవేళ భారత మేనేజ్మెంట్ తదుపరి మ్యాచ్ల్లో సంజూను జట్టులోకి తీసుకొని, అభిషేక్ను కూడా కొనసాగించాలనుకుంటే గత కొంతకాలంగా చెత్త ఫామ్లో తిలక్ వర్మపై వేటు వేయక తప్పదు. అప్పుడు అభిషేక్, సంజూతో ఓపెనింగ్ చేయించి, ఇషాన్ను వన్డౌన్లో పంపవచ్చు. అయితే ఈ అడుగు పడటం అంత సులువు కాకపోవచ్చు. ఎందుకంటే, ఓపెనర్గా ఇషాన్ మంచి లయలో ఉన్నాడు. అతన్ని ఆ స్థానం నుంచి తప్పించడమంటే చాలా పెద్ద సాహసం అవుతుంది. సెమీస్ అవకాశాలు కఠినమైన తరుణంలో భారత మేనేజ్మెంట్ ఇలాంటి సాహసాల జోలికి పోకపోవచ్చు. -
అభిషేక్ శర్మ స్థానంలో సంజూకు చాన్స్?
మొట్ట మొదటి టి20 ప్రపంచకప్ ఆడుతున్న టీమిండియా విధ్వంకర ఓపెనర్ అభిషేక్ శర్మ తర్వాతి మ్యాచ్ల్లో ఆడతాడా, లేదా అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. లీగ్ మ్యాచ్ల్లో తీవ్రంగా నిరాశపరిచిన ఈ లెఫ్ట్ హ్యాండర్ బ్యాటర్కు సూపర్- 8 మ్యాచ్ల్లో ఆడే అవకాశం రాకపోవచ్చన్న వార్తలు వస్తున్నాయి. అతడి స్థానంలో సంజూ శామ్సన్ను తీసుకుంటారని క్రీడా విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. వరుసగా మూడుసార్లు డకౌట్ కావడంతో అభిషేక్పై వేటు తప్పదని భావిస్తున్నారు.లీగ్ దశలో నమీబియాతో జరిగిన మ్యాచ్కు అభిషేక్ దూరం కావడంతో సంజూకు అవకాశం దక్కింది. ఈ మ్యాచ్లో 8 బంతుల్లో 22 పరుగులు చేశాడు శామ్సన్. అయితే వరల్డ్కప్ టీమ్లో చోటు దక్కించుకున్న తర్వాత సంజూ ఇంపాక్ట్ చూపించలేకపోయాడు. వచ్చిన ఒక అవకాశాన్ని కూడా సద్వినియోగం చేసుకోలేకపోయాడు. గత కొన్నాళ్లుగా భారీ స్కోరు చేయడంలో విఫలమవుతున్నాడు. అయితే అభిషేక్ వైఫల్యం సంజూకు కలిసొచ్చే అవకాశం ఉందన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.మరోవైపు వరుస వైఫల్యాలతో సతమతవుతున్న అభిషేక్ కంటే సంజూయే కాస్త బెటరన్న వాదనలు విన్పిస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఫిబ్రవరి 22న అహ్మదాబాద్లో దక్షిణాఫ్రికాతో జరిగే మ్యాచ్లో సంజూకు చాన్స్ రావొచ్చని ఆశిస్తున్నారు. కాగా, టాపార్డర్లో ముగ్గురు లెఫ్టాండర్ బ్యాలర్లే ఉండడం సమస్యేనని టీమిండియా అసిస్టెంట్ కోచ్ ర్యాన్ డష్కాటే అంగీకరించడం గమనార్హం. ఈ నేపథ్యంలో టీమ్ మేనేజ్మెంట్, హెడ్ కోచ్ గంభీర్ ఎలాంటి నిర్ణయం తీసుకుంటారో వేచిచూడాలి.అటు బౌలింగ్లోనూ వరుణ్ చక్రవర్తి మినహా మిగతా స్పిన్నర్లు స్థాయికి తగ్గ ప్రదర్శన చేయలేకపోయారన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. సూపర్-8 మ్యాచ్ల్లో బౌలర్లు సమిష్టిగా రాణిస్తేనే టీమిండియా ఆధిపత్యం కొనసాగుతుందని విశ్లేషకులు అంటున్నారు. తర్వాతి మ్యాచ్కు వాషింగ్టన్ సుందర్ స్థానంలో అక్షర్ పటేల్ (Axar Patel) జట్టులోకి వచ్చే అవకాశముంది. రింకు సింగ్ స్థానంలో వాషింగ్టన్ సుందర్ను ఆడిస్తే ఎలా ఉంటుందన్న చర్చ కూడా క్రీడాభిమానుల్లో నడుస్తోంది. బౌలింగ్తో పాటు లోయర్ ఆర్డర్గా బ్యాటింగ్ చేయగల సత్తా వాషింగ్టన్ సుందర్కు ఉంది.చదవండి: అతడిని కావాలనే తొక్కేస్తున్నారా?భారత జట్టు అంచనా: అభిషేక్ శర్మ, ఇషాన్ కిషన్ (వికెట్ కీపర్), తిలక్ వర్మ, సూర్యకుమార్ యాదవ్ (కెప్టెన్), హార్దిక్ పాండ్యా, శివమ్ దూబే, అక్షర్ పటేల్, రింకు సింగ్, జస్ప్రీత్ బుమ్రా, అర్ష్దీప్ సింగ్, వరుణ్ చక్రవర్తి. -
T20 WC 2026: సంజూ శాంసన్కు జాక్పాట్
టీమిండియా విధ్వంసకర బ్యాటర్ సంజూ శాంసన్ జాక్పాట్ కొట్టాడు. ఇటీవల న్యూజిలాండ్ సిరీస్లో దారుణంగా విఫలమవడంతో ప్రపంచకప్ మ్యాచ్లు ఆడే సువర్ణావకాశాన్ని కోల్పోయిన అతను.. అనూహ్యంగా ప్లేయింగ్ ఎలెవెన్లోకి వచ్చేలా ఉన్నాడు. ఫిబ్రవరి 12న నమీబియాలో జరుగబోయే మ్యాచ్లో సంజూ ఆడటం దాదాపుగా ఖరారైనట్లు తెలుస్తుంది. రెగ్యులర్ ఓపెనర్ అభిషేక్ శర్మ గత కొన్ని రోజులుగా కడుపు సమస్యతో బాధపడుతుండటం సంజూకి కలిసొచ్చేలా ఉంది. నమీబియాతో మ్యాచ్ సమయానికి అభిషేక్ అందుబాటులో ఉండటం కష్టమేనని టీమిండియా అసిస్టెంట్ కోచ్ ర్యాన్ టెన్ డష్కటే పరోక్షంగా వెల్లడించాడు. ఇవాళ (ఫిబ్రవరి 10) అతను మీడియాతో మాట్లాడుతూ.. అభిషేక్ సహా మిగతా కీలక ఆటగాళ్లకు సంబంధించిన అప్డేట్ ఇచ్చాడు. అభిషేక్ కడుపు సమస్యతో బాధపడుతూ ఇంకా జట్టుతో కలవలేదని, నమీబియా మ్యాచ్కు అతను అందుబాటులో ఉండే అవకాశాలు చాలా తక్కువని చెప్పాడు. అభిషేక్ గైర్హాజరీలో సంజూ శాంసన్కు అవకాశం రావచ్చని పరోక్షంగా వెల్లడించాడు. ఒకవేళ సంజూ తుది జట్టులోకి వస్తే ఇషాన్ కిషన్తో కలిసి ఇన్నింగ్స్ను ప్రారంభిస్తాడు.డష్కటే.. బుమ్రా, వాషింగ్టన్ సుందర్ అందుబాటులో ఉండే విషయంపై కూడా అప్డేట్ ఇచ్చాడు. బుమ్రా జ్వరంతో తొలి మ్యాచ్ మిస్ అయినా, ఇప్పుడు పూర్తిగా ఫిట్ అయ్యాడని, ప్రాక్టీస్ కూడా మొదలుపెట్టాడని, నమీబియాపై ఆడేందుకు సిద్దంగా ఉన్నాడని వెల్లడించాడు.వాషింగ్టన్ సుందర్ కూడా రిబ్ ఫ్రాక్చర్ నుంచి కోలుకొని జట్టులో చేరాడని తెలిపాడు. సుందర్ అందుబాటులోకి వస్తే ఎవరిపై వేటు పడుతుందనే విషయంపై మాత్రం డష్కటే స్పష్టతనివ్వలేదు.ఇదే సందర్భంగా డష్కటే భారత్–పాకిస్తాన్ మ్యాచ్పై కూడా స్పందించాడు. పాక్తో మ్యాచ్ ఎప్పుడూ ఆసక్తికరంగా ఉంటుందని అన్నాడు. పాక్ తమ మనసు మార్చుకొని భారత్తో ఆడేందుకు సిద్దమవడం మంచి పరిణామంగా పేర్కొన్నాడు. ఈ మ్యాచ్ ప్రత్యేకంగా ఉండబోతుందని తెలిపాడు.కాగా, బుమ్రా, సుందర్ అందుబాటులోకి వస్తే ఎవరిని తప్పిస్తారన్నది ఆసక్తికరంగా మారింది. సిరాజ్ స్థానంలో బుమ్రా వచ్చినా, సుందర్ కోసం ఎవరిని తప్పిస్తారన్నది చర్చనీయాంశమైంది. అవకాశాలను పరిశీలిస్తే, అక్షర్ పటేల్ స్థానంలో సుందర్ తుది జట్టులోకి రావచ్చు. అభిషేక్ అందుబాటులోకి రాక సంజూ శాంసన్కు అవకాశం వస్తే.. నమీబియాతో మ్యాచ్కు భారత తుది జట్టు ఇలా ఉండవచ్చు.నమీబియాతో మ్యాచ్కు భారత తుదిజట్టు (అంచనా)ఇషాన్ కిషన్ (వికెట్ కీపర్), సంజూ శాంసన్, తిలక్ వర్మ, సూర్యకుమార్ యాదవ్, హార్దిక్ పాండ్యా, రింకూ సింగ్, శివం దూబే, వాషింగ్టన్ సుందర్, వరుణ్ చక్రవర్తి, అర్ష్దీప్ సింగ్, జస్ప్రీత్ బుమ్రా. -
శాంసన్పై వేటు..! టీమిండియా ఓపెనర్గా అతడే?
టీ20 వరల్డ్కప్-2026లో భారత క్రికెట్ జట్టు తమ తొలి మ్యాచ్ ఆడేందుకు సిద్దమైంది. టోర్నీ ఆరంభం రోజు(ఫిబ్రవరి 7)నే వాంఖడే వేదికగా అమెరికాతో టీమిండియా తలపడనుంది. అయితే భారత తుది జట్టులో వికెట్ కీపర్ సంజూ శాంసన్కు చోటు దక్కుతుందా? లేదా? అన్నది ప్రస్తుతం క్రికెట్ వర్గాల్లో చర్చానీయాంశమైంది. సంజూ పేలవ ఫామ్ కనబరుస్తుండడంతో అతడి స్దానంలో ఓపెనర్గా ఇషాన్ కిషన్ పంపాలని చాలా మంది మాజీ క్రికెటర్లు సూచించారు. దీంతో టీమ్ మెనెజ్మెంట్ శాంసన్పై వేటు వేసేందుకు సిద్దమైందని వార్తలు వస్తున్నాయి. తాజాగా సౌతాఫ్రికాతో జరిగిన వార్మప్ మ్యాచ్లలో సంజూ ఆడకపోవడం ఈ వార్తలకు మరింత ఊతమిచ్చాయి. తాజాగా కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ చేసిన వాఖ్యలు బట్టి సంజూకు ప్లేయింగ్ ఎలెవన్లో చోటు కష్టమే అన్పిస్తోంది.శాంసన్ స్దానంలో సూపర్ ఫామ్లో ఉన్న కిషన్ భారత ఇన్నింగ్స్ను ప్రారంభించడం దాదాపు ఖాయమైనట్లే అన్పిస్తోంది. అమెరికాతో మ్యాచ్కు ముందు విలేకరుల సమావేశంలో సూర్య పాల్గోన్నాడు. ఈ సందర్భంగా ఇషాన్పై సూర్యకుమార్ యాదవ్ ప్రశంసల వర్షం కురిపించాడు.ఓపెనర్గా ఇషాన్ కిషన్ఇషాన్ కిషన్ అద్భుతమైన ఫామ్లో ఉన్నాడు. కేవలం టీమిండియా తరపునే కాదు, దేశవాళీ క్రికెట్లో కూడా దుమ్ములేపాడు. అతడు కచ్చితంగా టాప్-3లో బ్యాటింగ్ చేస్తాడు. ఇషాన్ తనకు లభించిన అవకాశాలను చక్కగా వినియోగించుకున్నాడని సూర్య పేర్కొన్నాడు.కాగా రోహిత్ శర్మ రిటైర్మెంట్ తర్వాత ఓపెనర్గా వచ్చిన సంజూ.. వరుస సెంచరీలతో ఆకట్టుకున్నాడు. దీంతో శుభ్మన్ గిల్ను కాదని సంజూకు వరల్డ్కప్ జట్టులో సెలెక్టర్లు చోటు ఇచ్చారు. కానీ ఈ మెగా టోర్నీకి ముందు న్యూజిలాండ్తో జరిగిన సిరీస్లో శాంసన్ దారుణ ప్రదర్శన కనబరిచాడు.ఈ కేరళ వికెట్ కీపర్ బ్యాటర్ 5 మ్యాచ్ల్లో కేవలం 52 పరుగులు మాత్రమే చేసి నిరాశపరిచాడు. అదే సమయంలో రెండేళ్ల తర్వాత జాతీయ జట్టులోకి వచ్చిన కిషన్ తన సంచలన ప్రదర్శనలతో అందరిని మంత్రముగ్ధులను చేస్తున్నాడు. న్యూజిలాండ్ సిరీస్లో కూడా 200పైగా స్ట్రైక్ రేట్తో సెంచరీ సాధించి, సెలెక్టర్ల నమ్మకాన్ని నిలబెట్టుకున్నాడు. దక్షిణాఫ్రికాతో జరిగిన వార్మప్ మ్యాచ్లో కూడా ఓపెనర్గా వచ్చి కిషన్ సత్తాచాటాడు. దీంతో ప్రధాన టోర్నీలో కూడా కిషన్కే ఓపెనర్గా పంపాలని గంభీర్ అండ్ కో నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది.అమెరికాతో మ్యాచ్కు భారత తుది జట్టు(అంచనా)అభిషేక్ శర్మ, ఇషాన్ కిషన్ (వికెట్ కీపర్), తిలక్ వర్మ, సూర్యకుమార్ యాదవ్ (కెప్టెన్), రింకూ సింగ్, హార్దిక్ పాండ్యా, అక్షర్ పటేల్, శివం దూబే, జస్ప్రీత్ బుమ్రా, అర్ష్దీప్ సింగ్, వరుణ్ చక్రవర్తి. -
T20 WC: ఓపెనర్గా వచ్చి.. దంచికొట్టిన ఇషాన్ కిషన్
టీ20 ప్రపంచకప్-2026 టోర్నమెంట్కు టీమిండియా సిద్ధమైంది. సన్నాహకాల్లో భాగంగా బుధవారం సౌతాఫ్రికాతో వార్మప్ మ్యాచ్తో బరిలో దిగింది. ఈ మ్యాచ్లో సంజూ శాంసన్ స్థానంలో ఇషాన్ కిషన్ ఓపెనర్గా వచ్చాడు.6, 6, 4, 6విధ్వంసకర ఓపెనర్ అభిషేక్ శర్మకు జోడీగా వచ్చిన ఇషాన్.. ధనాధన్ దంచికొట్టాడు. సిక్సర్ల వర్షం కురిపిస్తూ ఆకాశమే హద్దుగా చెలరేగాడు. ముఖ్యంగా ఐదో ఓవర్లో ప్రొటిస్ పేసర్ అన్రిచ్ నోర్జే రంగంలోకి దిగగా.. ఇషాన్ అతడి బౌలింగ్ను చితక్కొట్టాడు. మూడు, నాలుగు బంతుల్లో సిక్సర్ బాదిన ఈ ఎడమచేతి వాటం బ్యాటర్.. ఐదో బంతిని బౌండరీకి తరలించాడు. ఆరో బంతిని మళ్లీ సిక్సర్గా మలిచాడు. అలా నాలుగు బంతుల్లోనే 22 పరుగులు పిండుకున్నాడు.20 బంతుల్లోనేఈ క్రమంలో 20 బంతుల్లోనే హాఫ్ సెంచరీ (53) పూర్తి చేసుకున్నాడు ఇషాన్ కిషన్. సిక్సర్తో యాభై పరుగుల మార్కు దాటిన ఈ ఓపెనింగ్ బ్యాటర్ రిటైర్డ్ అవుట్గా వెనుదిరిగాడు. ఇషాన్ ఇన్నింగ్స్లో ఏడు సిక్స్లు, రెండు ఫోర్లు ఉన్నాయి.కాగా టీ20 వరల్డ్కప్ వార్మప్ మ్యాచ్లో భాగంగా నవీ ముంబైలో టాస్ గెలిచిన టీమిండియా తొలుత బ్యాటింగ్ ఎంచుకుంది. ఓపెనర్లు అభిషేక్ శర్మ (18 బంతుల్లో 24), ఇషాన్ కిషన్ (20 బంతుల్లో 53) రిటైర్డ్ అవుట్గా నిష్క్రమించారు. టీ20 వరల్డ్కప్-2026 జట్లు భారత్అభిషేక్ శర్మ, ఇషాన్ కిషన్ (వికెట్ కీపర్), సూర్యకుమార్ యాదవ్ (కెప్టెన్), తిలక్ వర్మ,సంజు శాంసన్,హార్దిక్ పాండ్యా,రింకూ సింగ్,శివం దూబే,అక్షర్ పటేల్,అర్ష్దీప్ సింగ్,వరుణ్ చక్రవర్తి,జస్ప్రీత్ బుమ్రా,వాషింగ్టన్ సుందర్,హర్షిత్ రాణా,కుల్దీప్ యాదవ్.సౌతాఫ్రికాఐడెన్ మార్క్రామ్ (కెప్టెన్),క్వింటన్ డి కాక్,ర్యాన్ రికెల్టన్ (వారం),డెవాల్డ్ బ్రెవిస్,ట్రిస్టన్ స్టబ్స్,జాసన్ స్మిత్,డేవిడ్ మిల్లర్,మార్కో యాన్సెన్,జార్జ్ లిండే,కార్బిన్ బాష్,కేశవ్ మహారాజ్,క్వేనా మఫాకా,లుంగీ ఎన్గిడి,అన్రిచ్ నోర్ట్జే,కగిసో రబడ.చదవండి: WC 2026: వరల్డ్కప్ సెమీస్లో వైభవ్ సూర్యవంశీ విధ్వంసంT20 WC IND vs USA: భారత తుదిజట్టు ఇదే.. ఇషాన్కు నో ఛాన్స్!When you’re in form, everything goes your way!😮💨ICC Men's #T20WorldCup | Warm-Up Match | 👉 #INDvSA | LIVE NOW ➡️ https://t.co/KpRezrTaFe pic.twitter.com/51Mr18qE1g— Star Sports (@StarSportsIndia) February 4, 2026 -
IND vs USA: భారత తుదిజట్టు ఇదే.. ఇషాన్కు నో ఛాన్స్!
పొట్టి క్రికెట్ సమరానికి రంగం సిద్ధమైంది. భారత్- శ్రీలంక వేదికగా టీ20 ప్రపంచకప్-2026 టోర్నమెంట్కు శనివారం (ఫిబ్రవరి 7)న తెరలేవనుంది. ఈ ఐసీసీ ఈవెంట్లో తొలి రోజు మూడు మ్యాచ్లు జరుగుతాయి. తొలుత కొలంబో వేదికగా పాకిస్తాన్- నెదర్లాండ్స్.. ఆ తర్వాత కోల్కతాలో వెస్టిండీస్- స్కాట్లాండ్.. అనంతరం ముంబై వేదికగా టీమిండియా- అమెరికా (IND vs USA) జట్లు తలపడతాయి.ఇందుకోసం ఇప్పటికే జట్లన్నీ ప్రాక్టీస్ కూడా మొదలుపెట్టేశాయి. ఈ నేపథ్యంలో భారత తుదిజట్టు ఎలా ఉండబోతుందన్న అంశం ఆసక్తికరంగా మారింది. ముఖ్యంగా సంజూ శాంసన్ (Sanju Samson)ను ఓపెనర్గా కొనసాగిస్తారా? లేదా? అన్నది చర్చనీయాంశమైంది.వరుస వైఫల్యాలుగత కొన్నాళ్లుగా సంజూ ఫామ్లేమి (10, 6, 0, 24, 6)తో సతమతమవుతుండటం ఇందుకు కారణం. అదే సమయంలో.. చాన్నాళ్ల తర్వాత టీమిండియాలోకి రీఎంట్రీ ఇచ్చిన మరో వికెట్ కీపర్ బ్యాటర్ ఇషాన్ కిషన్ దుమ్ములేపుతున్నాడు. న్యూజిలాండ్తో టీ20 సిరీస్లో వన్డౌన్లో వచ్చి ఆఖరి మ్యాచ్లో సెంచరీ (103)తో అదరగొట్టాడు.తిలక్ వర్మ పునరాగమనంకాగా తిలక్ వర్మ గాయం కారణంగా జట్టుకు దూరమైనంద వల్ల ఇషాన్ అతడి స్థానంలో వన్డౌన్లో వచ్చాడు. అయితే, వరల్డ్కప్ టోర్నీతో తిలక్ వర్మ పునరాగమనం చేయనున్నాడు. దీంతో ఇషాన్ను ఓపెనర్గా ప్రమోట్ చేసి.. సంజూపై మేనేజ్మెంట్ వేటు వేస్తుందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.ఇషాన్కు నో ఛాన్స్ఇలాంటి తరుణంలో టీమిండియా వెటరన్ స్పిన్నర్ యజువేంద్ర చహల్ ఆసక్తికర అంచనాతో ముందుకు వచ్చాడు. స్టార్ స్పోర్ట్స్ షోలో మాట్లాడుతూ.. అమెరికాతో తలపడే భారత తుదిజట్టును ఎంచుకున్న చహల్.. ఇషాన్ కిషన్ను పక్కనపెట్టడం విశేషం. అభిషేక్ శర్మతో కలిసి సంజూ శాంసన్ ఓపెనింగ్ చేయాలని అతడు అభిప్రాయపడ్డాడు.ఇక మూడో స్థానంలోకి తిలక్ వర్మ తిరిగివస్తాడన్న చహల్.. కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ యథావిధిగా నాలుగో నంబర్ బ్యాటర్గా బరిలోకి దిగుతాడని పేర్కొన్నాడు. హార్దిక్ పాండ్యా, శివం దూబే, రింకూ సింగ్.. మిడిలార్డర్, ఫినిషర్ పాత్రలు పోషిస్తారని తెలిపాడు.కుల్దీప్నకు కూడా మొండిచేయితన జట్టులో ఇద్దరు స్పిన్నర్లు అక్షర్ పటేల్, వరుణ్ చక్రవర్తికి చోటిచ్చిన చహల్.. ఇద్దరు స్పెషలిస్టు సీమర్లుగా జస్ప్రీత్ బుమ్రా, అర్ష్దీప్ సింగ్లను ఎంచుకున్నాడు. ఈ క్రమంలో టాపార్డర్లో ఇషాన్ కిషన్తో పాటు.. స్పిన్ దళంలో కుల్దీప్ యాదవ్కు చహల్ మొండిచేయి చూపాడు. కాగా వరల్డ్కప్ టోర్నీలో ఇరవై జట్లు పాల్గొంటుండగా డిఫెండింగ్ చాంపియన్ భారత్.. పాకిస్తాన్, యూఎస్ఏ, నెదర్లాండ్స్, నమీబియాలతో కలిసి గ్రూప్-‘ఎ’లో ఉంది.టీ20 వరల్డ్కప్-2026లో అమెరికాతో మ్యాచ్కు చహల్ ఎంచుకున్న భారత తుదిజట్టుఅభిషేక్ శర్మ, సంజూ శాంసన్ (వికెట్ కీపర్), తిలక్ వర్మ, సూర్యకుమార్ యాదవ్ (కెప్టెన్), హార్దిక్ పాండ్యా, శివం దూబే, రింకూ సింగ్, అక్షర్ పటేల్, అర్ష్దీప్ సింగ్, వరుణ్ చక్రవర్తి, జస్ప్రీత్ బుమ్రా.చదవండి: ఇషాన్ కిషన్కు అండగా విరాట్ కోహ్లి.@yuzi_chahal picks his playing XI for India’s opening fixture! 👀 💪🏻Just 4 days to go before the defending champions begin their journey on T20 cricket’s biggest stage with one clear mission: 𝗥𝗘𝗣𝗘𝗔𝗧 & 𝗗𝗘𝗙𝗘𝗔𝗧 history 🔥🤩ICC Men’s #T20WorldCup 2026 👉 #INDvUSA |… pic.twitter.com/X9KsBx2CjQ— Star Sports (@StarSportsIndia) February 3, 2026 -
భారత తుది జట్టు ఇదే.. స్టార్ ప్లేయర్కు నో ఛాన్స్?
టీ20 ప్రపంచకప్-2026కు కౌంట్ డౌన్ మొదలైంది. ఫిబ్రవరి 7 నుంచి శ్రీలంక, భారత్ వేదికలగా ఈ మెగా టోర్నీ ఆరంభం కానుంది. ఈ పొట్టి ప్రపంచకప్లో టీమిండియా డిఫెండింగ్ ఛాంపియన్ హోదాలో బరిలోకి దిగనుంది. ఈసారి కూడా ఎలాగైనా గెలిచి టైటిల్ను రిటైన్ చేసుకోవాలని మెన్ ఇన్ బ్లూ పట్టుదలతో ఉంది.ఈ టోర్నీలో భారత్ తమ తొలి మ్యాచ్లో ఫిబ్రవరి 7న వాంఖడే స్టేడియం వేదికగా యూఎస్ఎతో తలపడనుంది. ఈ మ్యాచ్ కోసం భారత తుది జట్టును టీమిండియా మాజీ వికెట్ కీపర్ బ్యాటర్ పార్ధివ్ పటేల్ అంచనా వేశాడు. ఓపెనర్లుగా అభిషేక్ శర్మ, ఇషాన్ కిషన్కు అతడు అవకాశమిచ్చాడు. సంజూ శాంసన్ పేలవ ఫామ్ కనబరుస్తుండడంతో వికెట్ కీపర్ బ్యాటర్గా ఇషాన్ వైపే పార్ధివ్ మొగ్గు చూపాడు. కివీస్తో జరిగిన ఐదు మ్యాచ్ల టీ20 సిరీస్లో శాంసన్ కేవలం 46 పరుగులు మాత్రమే చేశాడు. ఇక కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్కు మూడో స్దానంలో, గాయం నుంచి కోలుకున్న తిలక్ వర్మకు నాలుగో స్ధానంలో పటేల్ ఛాన్స్ ఇచ్చాడు. పార్ధివ్ ఎంపిక చేసిన జట్టులో ఆల్రౌండర్లగా శివం దూబే,హార్దిక్ పాండ్యా, అక్షర్ పటేల్ చోటు దక్కించుకున్నాడు. ఫినిషర్గా రింకూ సింగ్ ఉన్నాడు. ఇక ఫాస్ట్ బౌలర్ల కోటాలో బుమ్రా, అర్ష్దీప్ సింగ్ను పార్ధివ్ ఎంపిక చేశాడు. యువ పేసర్ హర్షిత్ రాణాకు మాత్రం అతడు ఎంపిక చేసిన జట్టులో చోటు దక్కలేదు. ఈ జట్టులో స్పెషలిస్ట్ స్పిన్నర్గా వరుణ్ చక్రవర్తికి అవకాశం లభించింది.పార్ధివ్ పటేల్ ఎంపిక చేసిన ఇండియన్ ప్లేయింగ్ ఎలెవన్అభిషేక్ శర్మ, ఇషాన్ కిషన్, సూర్యకుమార్ యాదవ్, తిలక్ వర్మ, శివమ్ దూబే ,హార్దిక్ పాండ్యా, రింకూ సింగ్, అక్షర్ పటేల్, జస్ప్రీత్ బుమ్రా, అర్ష్దీప్ సింగ్, వరుణ్ చక్రవర్తి -
వికెట్ కీపర్గా సంజూకు నో ఛాన్స్.. క్లారిటీ ఇచ్చిన సూర్యకుమార్
టీ20 వరల్డ్కప్లో భారత జట్టు వికెట్ కీపర్ ఎవరు? సంజు శాంసన్కు తుది జట్టులో చోటు దక్కుతుందా? అన్న ప్రశ్నలు క్రికెట్ అభిమానుల్లో ఉత్పన్నమవుతున్నాయి. శాంసన్ పేలవ ఫామే ఇందుకు ప్రధాన కారణం. ఈ మెగా టోర్నీ సన్నాహాల్లో భాగంగా న్యూజిలాండ్తో జరిగిన ఐదు మ్యాచ్ల టీ20 సిరీస్లో శాంసన్ దారుణ ప్రదర్శన కనబరిచాడు.ఈ సిరీస్ మొత్తంగా అతడు కేవలం 46 పరుగులు మాత్రమే చేశాడు. దీంతో తిలక్ వర్మ తుది జట్టులోకి సంజూపై వేటు పడడం ఖాయమన్పిస్తోంది. అతడి స్ధానంలో ఇషాన్ కిషన్ భారత ఇన్నింగ్స్ ప్రారంభించే అవకాశముంది. తిలక్ యధావిధిగా మూడో స్థానంలో బరిలోకి దిగనున్నాడు. దాదాపు రెండేళ్ల తర్వాత భారత జట్టులోకి వచ్చిన ఇషాన్ అద్భుతమైన ప్రదర్శన కనబరుస్తున్నాడు.తిరువనంతపురం వేదికగా కివీస్తో జరిగిన ఐదో టీ20లో ఇషాన్ సెంచరీతో మెరిశాడు. అంతకుముందు మ్యాచ్లలో కూడా విధ్వంసకర ఇన్నింగ్స్లు ఆడాడు. దీంతో అతడికి ఓపెనర్గా అవకాశమివ్వాలని చాలా మంది మాజీ క్రికెటర్లు సూచిస్తున్నారు. అయితే ఆఖరి టీ20లో సంజు శాంసన్ జట్టులో ఉన్నప్పటికి ఇషాన్ వికెట్ కీపింగ్ బాధ్యతలు చేపట్టడం అందరిని ఆశ్చర్యపరిచింది.ఈ క్రమంలో సంజూ వరల్డ్కప్లో ఆడడం ఇక కష్టమేనన్న ఊహాగానాలు మొదలు అయ్యాయి. అయితే ఇదే విషయంపై టీమిండియా కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ స్పందించాడు. వికెట్ కీపింగ్ మార్పుపై తాము ముందే నిర్ణయం తీసుకున్నామని సూర్య చెప్పుకొచ్చాడు."తిలక్ వర్మ అందుబాటులో లేకపోవడంతో ఇద్దరు వికెట్ కీపర్ బ్యాటర్లకు ప్లేయింగ్ ఎలెవన్లో అవకాశం దక్కింది. అయితే కీపింగ్ బాధ్యతలను పంచుకోవడం సిరీస్ ప్రారంభానికి ముందే నిర్ణయించాము మొదటి మూడు మ్యాచ్లలో శాంసన్, చివరి రెండు మ్యాచ్లలో కిషన్కు వికెట్ కీపింగ్ చేసే అవకాశమివ్వాలని మేనేజ్మెంట్ నిర్ణయించింది.కానీ కిషన్ చిన్న గాయం కారణంగా నాలుగో టీ20లో ఆడలేదు, లేదంటే ఆ మ్యాచ్లో కూడా అతడే వికెట్ కీపింగ్ చేయాల్సింది ఉండేది. ఇప్పుడు కిషన్ తిరిగి రావడంతో వికెట్ల వెనక తన బాధ్యతలను నిర్వర్తించాడు" అని సూర్య మ్యాచ్ అనంతరం పేర్కొన్నాడు.చదవండి: IND vs NZ: టీమిండియా వరల్డ్ రికార్డు -
తీరు మారని సంజూ శాంసన్.. హోం గ్రౌండ్లోనూ
టీ20 వరల్డ్కప్-2026కు ముందు టీమిండియా వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ పేలవ ఫామ్ కొనసాగుతోంది. తిరువనంతపురం వేదికగా న్యూజిలాండ్తో జరుగుతున్న ఐదో టీ20లో కూడా సంజూ దారుణ ప్రదర్శన కనబరిచింది. సొంత ప్రేక్షకుల ముందు శాంసన్ అట్టర్ ప్లాప్ అయ్యాడు.6 బంతులు ఎదుర్కొన్న శాంసన్ కేవలం 6 పరుగులు మాత్రమే చేసి తీవ్ర నిరాశపరిచాడు. ఫెర్గూసన్ బౌలింగ్లో జాకబ్స్కు క్యాచ్ ఇచ్చి సంజూ ఔటయ్యాడు. ఈ సిరీస్ మొత్తంగా శాంసన్ కేవలం 46 పరుగులు మాత్రమే చేశాడు. దీంతో అతడిని నెటిజన్లు దారుణంగా ట్రోలు చేస్తున్నారు.తిలక్ వర్మ పునరాగమనం చేస్తే తుది జట్టులో సంజూ స్ధానం గల్లంతే అంటూ పోస్ట్లు పెడుతున్నారు. గాయం కారణంగా న్యూజిలాండ్తో సిరీస్కు దూరంగా ఉన్న మిడిలార్డర్ బ్యాటర్ తిలక్ వర్మ.. త్వరలోనే జట్టులో చేరనున్నాడు. తిలక్ జట్టులోకి వస్తే ఇషాన్ కిషన్ లేదా సంజూ శాంసన్లో ఎవరో బెంచ్కే పరిమితమవ్వాలి. అయితే ఇషాన్ తన రీఎంట్రీలో సత్తాచాటుతున్నాడు. శాంసన్ కంటే ఈ జార్ఖండ్ వికెట్ కీపర్ బ్యాటర్ అద్భుతమైన ఫామ్లో ఉన్నాడు. అంతేకాకుండా ఓపెనర్గా కూడా కిషన్కు మంచి రికార్డు ఉంది. ఈ నేపథ్యంలో సంజూపై వేటు పడడం ఖాయమన్పిస్తోంది. ఇషాన్ కిషన్.. అభిషేక్తో కలిసి భారత ఇన్నింగ్స్ను ప్రారంభించే అవకాశముంది.అంతకుముందు శుభ్మన్ గిల్ టీ20ల్లో రీఎంట్రీ ఇవ్వడంతో సంజూను బెంచ్కే పరిమితం చేశారు. ఆసియాకప్, సౌతాఫ్రికా సిరీస్లో ఇదే సీన్ రిపీట్ అయింది. దీంతో టీమ్మెనెజ్మెంట్పై పెద్ద ఎత్తున విమర్శలు వచ్చాయి. ఈ క్రమంలో గిల్ను టీ20ల నుంచి తప్పించి మళ్లీ ఓపెనర్గా శాంసన్కు అవకాశమిచ్చారు. కానీ తనకు వచ్చిన ఛాన్స్ను ఈ కేరళ వికెట్ కీపర్ బ్యాటర్ ఉపయోగించుకోలేకపోయాడు. -
టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న భారత్.. స్టార్ ప్లేయర్ రీఎంట్రీ
తిరువనంతపురం వేదికగా ఐదో టీ20లో భారత్-న్యూజిలాండ్ జట్లు తలపడతున్నాయి. ఈ మ్యాచ్లో టాస్ గెలిచిన భారత కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ తొలుత బ్యాటింగ్ ఎంచుకున్నాడు. ఈ ఆఖరి పోరులో టీమిండియా మూడు మార్పులతో బరిలోకి దిగింది. గాయం నుంచి కోలుకున్న స్టార్ ఆల్రౌండర్ అక్షర్ పటేల్ తిరిగి జట్టులోకి వచ్చాడు.అదేవిధంగా గత మ్యాచ్కు దూరంగా ఉన్న ఇషాన్ కిషన్, వరుణ్ చక్రవర్తిలు కూడా పునరాగమనం చేశారు. అయితే వరుసగా నాలుగు మ్యాచ్లలో విఫలమైన వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్కు మరోసారి టీమ్మెనెజ్మెంట్ అవకాశమిచ్చింది. తన సొంతమైదానంలో సంజూ సత్తాచాటాలని అభిమానులు కోరుకుంటున్నారు. మరోవైపు కివీస్ ఏకంగా తమ జట్టులో నాలుగు మార్పులు చేసింది. లాకీ ఫెర్గూసన్, అలెన్, నీషమ్,జాకబ్స్ జట్టులోకి వచ్చారు.తుది జట్లున్యూజిలాండ్: టిమ్ సీఫెర్ట్(వికెట్ కీపర్), ఫిన్ అలెన్, రాచిన్ రవీంద్ర, గ్లెన్ ఫిలిప్స్, డారిల్ మిచెల్, బెవాన్ జాకబ్స్, మిచెల్ సాంట్నర్(కెప్టెన్), కైల్ జామిసన్, ఇష్ సోధి, లాకీ ఫెర్గూసన్, జాకబ్ డఫీభారత్: అభిషేక్ శర్మ, సంజు సామ్సన్(వికెట్ కీపర్), ఇషాన్ కిషన్, సూర్యకుమార్ యాదవ్(కెప్టెన్), రింకు సింగ్, హార్దిక్ పాండ్యా, శివం దుబే, అక్షర్ పటేల్, అర్ష్దీప్ సింగ్, వరుణ్ చక్రవర్తి, జస్ప్రీత్ బుమ్రా -
IND vs NZ: అతడికి ఇదే లాస్ట్ ఛాన్స్
టీ20 ప్రపంచకప్-2026 టోర్నమెంట్కు ముందు టీమిండియా న్యూజిలాండ్తో ఆఖరి మ్యాచ్కు సిద్ధమైంది. తిరువనంతపురం వేదికగా భారత్- కివీస్ మధ్య శనివారం ఐదో టీ20కి షెడ్యూల్ ఖరారైంది. ఈ నేపథ్యంలో అందరి కళ్లు స్థానిక ఆటగాడు సంజూ శాంసన్పైనే ఉన్నాయి.గతేడాది కాలంలో టీమిండియా టీ20 ఓపెనర్గా రాణించిన సంజూ (Sanju Samson).. కివీస్తో గత నాలుగు మ్యాచ్లలో మాత్రం తేలిపోయాడు. ముఖ్యంగా వరల్డ్కప్ వంటి మెగా టోర్నీకి ముందు అతడు ఇలా విఫలం కావడం ఆందోళనకరంగా మారింది.మరోవైపు.. ఇషాన్ కిషన్ (Ishan Kishan) రూపంలో సంజూకు పోటీ తీవ్రతరమైంది. కివీస్ ఆఖరి మ్యాచ్లోనూ ఈ కేరళ స్టార్ విఫలమైతే.. ప్రపంచకప్ టోర్నీలో వికెట్ కీపర్గా.. ఓపెనర్గా అతడి స్థానాన్ని ఇషాన్ భర్తీ చేసే అవకాశాలు పెరుగుతాయి. ఈ నేపథ్యంలో టీమిండియా మాజీ ఓపెనర్, కామెంటేటర్ ఆకాశ్ చోప్రా కీలక వ్యాఖ్యలు చేశాడు.మరింత ఒత్తిడి "తిరువనంతపురంలో ఆఖరి మ్యాచ్. హోం బాయ్ సంజూ శాంసన్కు కూడా బహుశా ఇదే చివరి అవకాశం కావొచ్చు. ఈ మ్యాచ్లో అతడిపై ఒత్తిడి మరింత పెరగడం ఖాయం. గత కొన్నాళ్లుగా అతడు పరుగులు రాబట్టడంలో ఇబ్బంది పడుతున్నాడు.ఆత్మవిశ్వాసంతో షాట్లు ఆడలేకపోతున్నాడు. మరోవైపు.. ఇషాన్ కిషన్ దుమ్ములేపుతున్నాడు. కాబట్టి కివీస్తో ఐదో టీ20లో సంజూ బాగానే ఆడినా.. టీ20 ప్రపంచకప్లో ఓపెనర్గా అతడి స్థానం సుస్థిరం అని చెప్పలేము.అలా అనుకుంటే తప్ప చోటు కష్టమేఒకవేళ టాపార్డర్లో ముగ్గురు ఎడమచేతి వాటం బ్యాటర్లు వద్దు అని మేనేజ్మెంట్ అనుకుంటే మాత్రమే సంజూ.. ఇషాన్ను దాటి తుదిజట్టులోకి రాగలడు’’ అని ఆకాశ్ చోప్రా అభిప్రాయపడ్డాడు. కాగా గత నాలుగు మ్యాచ్లలో సంజూ చేసిన స్కోర్లు 10, 6, 0, 24.ఇదిలా ఉంటే.. మరో ఓపెనర్ అభిషేక్ శర్మతో పాటు వన్డౌన్ బ్యాటర్ తిలక్ వర్మ కూడా లెఫ్టాండర్ బ్యాటర్ అన్న సంగతి తెలిసిందే. ఇషాన్ కూడా ఎడమచేతి వాటం ఆటగాడే. ఈ నేపథ్యంలో ఆకాశ్ చోప్రా పైవిధంగా వ్యాఖ్యలు చేశాడు. కాగా తిలక్ వర్మ గాయం నుంచి కోలుకుని వరల్డ్కప్తో నేరుగా రీఎంట్రీ ఇవ్వనున్నాడు. ఇదిలా ఉంటే.. ఫిబ్రవరి 7 నుంచి టీ20 ప్రపంచకప్ మొదలుకానుంది. ఇందుకు భారత్- శ్రీలంక వేదికలు.చదవండి: WC 2026: భారత్తో మ్యాచ్కు ముందు పాకిస్తాన్కు భారీ షాక్ -
T20 WC: వరల్డ్కప్లో ఈసారి సెంచరీ చేసేది అతడే: రైనా
టీ20 ప్రపంచకప్ టోర్నమెంట్లో శతకం సాధించిన భారత ఏకైక క్రికెటర్గా సురేశ్ రైనా కొనసాగుతున్నాడు. సుమారుగా పదహారేళ్ల క్రితం 2010 నాటి వరల్డ్కప్ టోర్నీలో సౌతాఫ్రికా మీద రైనా శతక్కొట్టాడు. వెస్టిండీస్ వేదికగా లీగ్ దశలో సఫారీలతో మ్యాచ్లో 59 బంతుల్లోనే వంద పరుగుల మార్కు అందుకున్నాడు. మొత్తంగా 60 బంతుల్లో 101 పరుగులు చేసి నిష్క్రమించాడు.రైనా ఆడిన నాటి శతక ఇన్నింగ్స్లో తొమ్మిది ఫోర్లు, ఐదు సిక్సర్లు ఉన్నాయి. ఈ మ్యాచ్లో టీమిండియా 14 పరుగుల తేడాతో విజయం సాధించింది. అయితే, ఆ తర్వాత భారత్ తరఫున ఇంత వరకు ఒక్క ఆటగాడు కూడా టీ20 ప్రపంచకప్లో సెంచరీ చేయలేదు. తాజా ఎడిషన్ సందర్భంగా తన రికార్డును సమం చేయగల సత్తా ఉన్న ఆటగాడి పేరును సురేశ్ రైనా (Suresh Raina) తాజాగా వెల్లడించాడు.వరల్డ్కప్లో ఈసారి సెంచరీ చేసేది అతడేటీమిండియా టీ20 ఓపెనర్ సంజూ శాంసన్ (Sanju Samson)ఈసారి వరల్డ్కప్ టోర్నీలో సెంచరీ చేస్తాడని రైనా అంచనా వేశాడు. ‘‘సంజూ ఓపెనింగ్ బ్యాటర్. సెంచరీ చేయగల సత్తా అతడికి ఉంది. ఇప్పటికే అంతర్జాతీయ టీ20లలో అతడి పేరిట రెండు శతకాలు ఉన్నాయి.సౌతాఫ్రికా మీద రెండుసార్లు సంజూ శతక్కొట్టాడు. ఇక సంజూతో పాటు ఈసారి అభిషేక్ శర్మ, ఇషాన్ కిషన్ కూడా ఈ జాబితాలో చేరే అవకాశం ఉంది. ప్రస్తుతానికైతే నా ఓటు సంజూ శాంసన్కే’’ అని రైనా వెల్లడించాడు. కాగా సంజూ గత కొన్నాళ్లుగా ఫామ్లేమితో సతమతమవుతున్న విషయం తెలిసిందే. స్వదేశంలో న్యూజిలాండ్తో తాజా టీ20 సిరీస్లో అతడు చేసిన స్కోర్లు 10. 6. 0, 24. ఇలాంటి తరుణంలో రైనా సంజూకు మద్దతుగా నిలవడం విశేషం.సంజూ క్లాస్ బ్యాటర్“ఫామ్ తాత్కాలికం. సంజూ క్లాస్ బ్యాటర్. టీమిండియా తరఫున, ఓవరాల్గా టీ20 క్రికెట్లో అతడు భారీ ఎత్తున పరుగులు సాధించాడు. కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ కూడా చాలాకాలంగా ఫామ్లేమితో ఇబ్బందిపడ్డాడు.అయినప్పటికీ హెడ్కోచ్ అతడికి అండగా ఉన్నాడు. సంజూ విషయంలోనూ ఇదే జరగాలి. అతడికి ఒక్క ఛాన్స్ దొరికితే తిరిగి విజృంభించడం ఖాయం’’ అని రైనా ఈ కేరళ వికెట్ కీపర్ బ్యాటర్కు అండగా నిలిచాడు.చదవండి: ICC vs BCB: బంగ్లాదేశ్కు షాక్.. తొలిసారి స్పందించిన శ్రీలంక -
'ఇదేమి బ్యాటింగ్'.. సంజూపై గవాస్కర్ ఫైర్
టీ20 ప్రపంచకప్-2026కు ముందు భారత స్టార్ వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ పేలవ ఫామ్ టీమ్ మెనెజ్మెంట్కు తలనొప్పిగా మారింది. ఈ మెగా టోర్నీ సన్నాహాల్లో భాగంగా న్యూజిలాండ్తో జరుగుతున్న టీ20 సిరీస్లో శాంసన్ దారుణ ప్రదర్శన కనబరుస్తున్నాడు.తొలి మూడు టీ20ల్లో విఫలమైన సంజూ.. బుధవారం వైజాగ్ వేదికగా జరిగిన నాలుగో టీ20లోనూ నామమాత్రపు స్కోరుకే పరిమితమయ్యాడు. ఈ కేరళ వికెట్ కీపర్ బ్యాటర్ 15 బంతుల్లో 24 పరుగులు చేసి శాంట్నర్ బౌలింగ్లో క్లీన్ బౌల్డయ్యాడు. ఈ నేపథ్యంలో శాంసన్ ఔట్ అయిన తీరుపై సునీల్ గవాస్కర్ అసహనం వ్యక్తం చేశాడు.'శాంట్నర్ బౌలింగ్లో సంజూ అనవసరంగా వికెట్ సమర్పించుకున్నాడు. అతడి బ్యాటింగ్లో ఫుట్ వర్క్ అస్సలు లేదు. బంతి పెద్దగా టర్న్ అవ్వకపోయినా, కేవలం రూమ్ కల్పించి ఆఫ్-సైడ్ ఆడాలనే తొందరలో క్లీన్ బౌల్డయ్యాడు. శాంసన్ తరచుగా లెగ్-స్టంప్ బయటకు కదులుతూ షాట్లు ఆడటానికి ప్రయత్నిస్తున్నాడు. దీంతో మూడు స్టంప్లు బౌలర్కు క్లియర్గా కనిపిస్తున్నాయి. బౌలర్ స్టంప్స్ను టార్గెట్ చేయడంతో అతడు క్లీప్ బౌల్డ్ అవ్వాల్సి వచ్చింది" అని కామెంటరీ బాక్స్లో ఉన్న గవాస్కర్ పేర్కొన్నాడు. కాగా ఈ సిరీస్లో ఇప్పటివరకు నాలుగు మ్యాచ్లు ఆడిన సంజూ కేవలం 40 పరుగులు చేశాడు. దీంతో వరల్డ్కప్ తుది జట్టులో సంజూ స్ధానంపై సందిగ్థత నెలకొంది. ఎందుకంటే ప్రత్యామ్నయ ఓపెనర్గా జట్టులోకి వచ్చిన ఇషాన్ కిషన్ తన రీ ఎంట్రీలో ఇరగదీస్తున్నాడు. సంజూ స్ధానంలో ఓపెనర్గా ఇషాన్కు చోటు ఇవ్వాలని చాలా మంది సూచిస్తున్నారు.చదవండి: తుది నిర్ణయం వారిదే: గంభీర్ ‘తొలగింపు’పై బీసీసీఐ స్పందన -
వరల్డ్కప్లో అభిషేక్ శర్మ జోడీగా ఇషాన్ కిషన్?!
సంజూ శాంసన్.. గత కొన్నేళ్లుగా భారత క్రీడా వర్గాల్లో ఈ పేరు చర్చనీయాంశంగా ఉంది. ప్రతిభ ఉన్నా ఈ కేరళ వికెట్ కీపర్ బ్యాటర్కు తగినన్ని అవకాశాలు రావడం లేదని అతడి అభిమానులతో పాటు కొంతమంది మాజీ క్రికెటర్ల వాదన. అయితే, టీమిండియాలో చోటు కోసం తీవ్రమైన పోటీ నెలకొన్న సమయంలో.. వచ్చిన అవకాశాలను సద్వినియోగం చేసుకోలేకపోతున్నాడనేది విశ్లేషకుల మాట.పేలవ ప్రదర్శనఆటలో నిలకడలేమి కారణంగానే సంజూను యాజమాన్యం నమ్మదగిన ఆటగాడిగా చూడటం లేదని ఇంకొంతమంది అభిప్రాయం. తాజాగా న్యూజిలాండ్తో టీ20 సిరీస్లో సంజూ (Sanju Samson) పేలవ ప్రదర్శనలే ఇందుకు కారణం. నిజానికి గతేడాది కాలంగా భారత టీ20 జట్టులో ఓపెనర్గా ఈ కేరళ ఆటగాడు కొనసాగుతున్నాడు.సెంచరీలతో సత్తా చాటి విధ్వంసకర బ్యాటర్ అభిషేక్ శర్మ (Abhishek Sharma)కు జోడీగా సంజూ విదేశీ గడ్డలపై సెంచరీలతో సత్తా చాటాడు. అయితే, ఆసియా టీ20 కప్-2025 టోర్నీకి ముందు వైస్ కెప్టెన్గా శుబ్మన్ గిల్ తిరిగిరావడంతో సంజూపై వేటు పడింది. బ్యాటింగ్ ఆర్డర్లో తనకంటూ ఓ స్థానం లేకుండా పోయింది.వికెట్ కీపర్ కోటాలోనూ సంజూకు జితేశ్ శర్మ పోటీగా రావడంతో.. తుదిజట్టులో అతడు స్థానం కోల్పోయిన పరిస్థితి. ఇలాంటి తరుణంలో టీ20 ఓపెనర్గా గిల్ విఫలం కావడం సంజూకు కలిసి వచ్చింది. ఫలితంగా స్వదేశంలో న్యూజిలాండ్తో సిరీస్ సందర్భంగా తిరిగి ఓపెనర్గా అతడికి అవకాశం దక్కింది. అంతేకాదు.. ప్రపంచకప్ టోర్నీ-2026కు కూడా ప్రధాన వికెట్ కీపర్ బ్యాటర్గా సంజూ ఎంపికయ్యాడు.10, 6, 0.. పొంచి ఉన్న ఇషాన్ ముప్పుఅయితే, కివీస్తో సిరీస్ సందర్భంగా సంజూ తొలి మూడు టీ20లలోనూ తేలిపోయాడు. మూడు మ్యాచ్లలో అతడు చేసిన స్కోర్లు 10, 6, 0. మరోవైపు.. దాదాపు మూడేళ్ల తర్వాత టీమిండియాలో రీఎంట్రీ ఇచ్చిన ఇషాన్ కిషన్ దుమ్ములేపుతున్నాడు.వరల్డ్కప్లో అభిషేక్ జోడీగా ఇషాన్ కిషన్?!తిలక్ వర్మ గాయపడిన కారణంగా ఇషాన్ ప్రస్తుతం మూడో స్థానంలో బ్యాటింగ్ చేస్తున్నాడు. నిజానికి అతడు కూడా ఓపెనింగ్ బ్యాటర్. సంజూ వైఫల్యం కారణంగా ఈ జార్ఖండ్ డైనమైట్ ఓపెనర్గా ప్రమోట్ అయ్యే అవకాశాలు లేకపోలేదు. ఇప్పటికే తిలక్ వర్మ టీ20 ప్రపంచకప్ టోర్నీకి సిద్ధమవుతున్నాడని బీసీసీఐ ప్రకటించింది.నిజానికి తిలక్ గాయం వల్ల కివీస్తో మిగిలిన రెండు టీ20లకు కూడా దూరం కావడంతోనే సంజూ వేటు నుంచి తప్పించుకున్నాడు. కాబట్టి న్యూజిలాండ్తో నాలుగు, ఐదో టీ20 మ్యాచ్లు అతడికి అత్యంత కీలకంగా మారాయి.ఈ సందర్భంగా ఫామ్లోకి వస్తేనే వరల్డ్కప్లో సంజూ ఓపెనర్గా కొనసాగగలడు. లేదంటే.. అతడి స్థానాన్ని మరో వికెట్ కీపర్ బ్యాటర్ ఇషాన్ భర్తీ చేయడం ఖాయం. ప్రస్తుతానికి టీమిండియా యాజమాన్యం సంజూకు మద్దతుగా నిలవడం అతడికి ఊరటనిచ్చే అంశం.అండగా మేనేజ్మెంట్సంజూ వైఫల్యాలలపై బౌలింగ్ కోచ్ మోర్నీ మోర్కెల్ స్పందిస్తూ.. ‘‘సంజూ తిరిగి ఫామ్లోకి రావడానికి ఒకే ఒక్క ఇన్నింగ్స్ అవసరం. ఫలితంగా అతడి ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. సరైన సమయంలో ఆటగాళ్లు పుంజుకునేలా చేసి.. ప్రపంచకప్ టోర్నీకి వారిని పూర్తి స్థాయిలో సన్నద్ధం చేయడమే మా మొదటి ప్రాధాన్యం.సంజూ శ్రద్ధగా శిక్షణలో పాల్గొంటున్నాడు. నెట్స్లో ప్రతి బంతిని బౌండరీకి తరలిస్తున్నాడు. త్వరలోనే తిరిగి ఫామ్లోకి వస్తాడు’’ అని ధీమా వ్యక్తం చేశాడు. మోర్కెల్ చెప్పినట్లు సంజూ తిరిగి పుంజుకుంటే సరి.. లేదంటే అభిషేక్ శర్మ ఓపెనింగ్ జోడీగా సంజూ స్థానాన్ని ఇషాన్ కిషన్ భర్తీ చేయడం లాంఛనమే అవుతుంది.చదవండి: ICC: పాకిస్తాన్ స్థానంలో ఉగాండా!.. ట్వీట్ వైరల్ -
విరాట్ కోహ్లి సరసన సంజూ శాంసన్
గౌహతి వేదికగా న్యూజిలాండ్తో నిన్న (జనవరి 25) జరిగిన మూడో టీ20లో టీమిండియా ఓపెనింగ్ బ్యాటర్ సంజూ శాంసన్ ఓ అవమానకర రికార్డును మూటగట్టుకున్నాడు. ఈ మ్యాచ్లో గోల్డెన్ డకౌటైన (తొలి బంతికే ఔట్) శాంసన్.. అంతర్జాతీయ టీ20ల్లో భారత్ తరఫున అత్యధిక గోల్డెన్ డకౌట్లైన ఆటగాళ్ల జాబితాలో రెండో స్థానానికి ఎగబాకాడు. ఈ క్రమంలో దిగ్గజ బ్యాటర్ విరాట్ కోహ్లి సరసన చేరాడు. విరాట్, శాంసన్ భారత్ తరఫున అంతర్జాతీయ టీ20ల్లో తలో ఏడు సార్లు గోల్డెన్ డకౌట్లు అయ్యారు. విరాట్ ఈ అవాంఛిత రికార్డును చేరుకునేందుకు 117 మ్యాచ్లు తీసుకుంటే, శాంసన్ కేవలం 47 మ్యాచ్ల్లోనే ఈ అపవాదును మూటగట్టుకున్నాడు. ఈ జాబితాలో మరో దిగ్గజ బ్యాటర్ రోహిత్ శర్మ అగ్రస్థానంలో ఉన్నాడు. రోహిత్ తన 151 మ్యాచ్ల అంతర్జాతీయ టీ20 కెరీర్లో ఏకంగా 12 సార్లు ఎదుర్కొన్న తొలి బంతికే ఔటయ్యాడు.అంతర్జాతీయ టీ20ల్లో భారత్ తరఫున అత్యధిక గోల్డెన్ డకౌట్స్- 12 – రోహిత్ శర్మ (151 మ్యాచ్లు) - 7 – సంజు సాంసన్ (47 మ్యాచ్లు)* - 7 – విరాట్ కోహ్లీ (117 మ్యాచ్లు) - 6 – సూర్యకుమార్ యాదవ్ (96 మ్యాచ్లు) - 5 – కేఎల్ రాహుల్ (68 మ్యాచ్లు) మ్యాచ్ విషయానికొస్తే.. న్యూజిలాండ్ నిర్దేశించిన 154 పరుగుల లక్ష్యాన్ని కేవలం 10 ఓవర్లలనే ఛేదించిన భారత్ 8 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించి, ఐదు మ్యాచ్ల సిరీస్ను మరో రెండు మ్యాచ్లు మిగిలుండగానే 3-0తో కైవసం చేసుకుంది. ఈ మ్యాచ్లో టాస్ గెలిచి తొలుత బౌలింగ్ చేసిన భారత్.. న్యూజిలాండ్ను 153 పరుగులకే (9 వికెట్లకు) కట్టడి చేసింది. బుమ్రా (4-0-17-3), బిష్ణోయ్ (4-0-18-2), హార్దిక్ (3-0-23-2), హర్షిత్ రాణా (4-0-35-1) అద్బుతంగా బౌలింగ్ చేశారు. న్యూజిలాండ్ తరఫున గ్లెన్ ఫిలిప్స్ (48) టాప్ స్కోరర్గా నిలువగా.. చాప్మన్ (32), సాంట్నర్ (27) ఓ మోస్తరు స్కోర్లు చేశారు.అనంతరం స్వల్ప లక్ష్య ఛేదనకు దిగిన భారత్కు తొలి బంతికే ఎదురుదెబ్బ తగిలింది. మ్యాట్ హెన్రీ బౌలింగ్లో సంజూ శాంసన్ క్లీన్ బౌల్డ్ అయ్యాడు. అయితే ఆతర్వాత వచ్చిన ఇషాన్ కిషన్, అభిషేక్ శర్మ ఆకాశమే హద్దుగా చెలరేగి భారత గెలుపును ఆదిలోనే ఖరారు చేశారు. వీరిద్దరూ ప్రతి బంతిని బౌండరీ, సిక్సర్గా తరలించడమే లక్ష్యంగా పెట్టుకొని ఆడారు. ఇషాన్ 13 బంతుల్లో 3 ఫోర్లు, 2 సిక్సర్ల సాయంతో 28 పరుగులు చేసి ఔటయ్యాడు. అనంతరం వచ్చిన టీమిండియా కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ కూడా అభిషేక్, ఇషాన్ విధ్వంసాన్ని కొనసాగించాడు. వీరిద్దరి ధాటికి భారత్ కేవలం 10 ఓవర్లలోనే లక్ష్యాన్ని చేరుకుంది. అభిషేక్ 20 బంతుల్లో 7 ఫోర్లు, 5 సిక్సర్ల సాయంతో 68 పరుగులు.. స్కై 26 బంతుల్లో 6 ఫోర్లు, 3 సిక్సర్ల సాయంతో అజేయమైన 57 పరుగులు చేసి టీమిండియాకు మెరుపు విజయాన్ని అందించారు.శాంసన్ ఫామ్పై ఆందోళనలు ఈ సిరీస్లో శాంసన్ ఫామ్ ఆందోళన కలిగిస్తుంది. మొదటి రెండు మ్యాచ్ల్లోనూ అతను దారుణంగా విఫలమయ్యాడు. కేవలం 10, 6 పరుగులు మాత్రమే చేశాడు. ఈ సిరీస్కు ముందు సౌతాఫ్రికా సిరీస్లోనూ శాంసన్ చెప్పుకోదగ్గ ప్రదర్శనలు చేయలేదు. అయినా అతనికి ప్రపంచకప్ బెర్త్ దక్కింది. వరస వైఫల్యాల నేపథ్యంలో శాంసన్ భవిష్యత్తు ప్రశ్నార్థకంగా మారింది. అతనికి పోటీగా ఇషాన్ కిషన్ దూసుకొస్తున్నాడు. ఇషాన్ తనకు లభించిన అవకాశాలను సద్వినియోగం చేసుకుంటూ శాంసన్ స్థానానికి ఎసరు పెట్టేలా ఉన్నాడు. ఇషాన్ కాకపోయినా వన్డే, టెస్ట్ కెప్టెన్ శుభ్మన్ గిల్ పేరును సెలెక్టర్లు పరిశీలించవచ్చు. ఏం జరుగుతుందో వేచి చూడాలి. -
T20 WC 2026: సంజూ శాంసన్పై వేటు!?
భారత టీ20 జట్టు ఓపెనర్లుగా గత కొంతకాలంగా సంజూ శాంసన్- అభిషేక్ శర్మ జోడీ కొనసాగుతోంది. ఆసియా టీ20 కప్ సందర్భంగా శుబ్మన్ గిల్ (Shubman Gill) టీమ్లోకి తిరిగి రావడంతో కొన్నాళ్లపాటు సంజూ బెంచ్కే పరిమితం అయ్యాడు. అయితే, గిల్ కూడా ఓపెనర్గా విఫలం కావడం సంజూకు కలిసి వచ్చింది.ఈ నేపథ్యంలో న్యూజిలాండ్తో టీ20 సిరీస్తో పాటు టీ20 ప్రపంచకప్-2026 టోర్నీలో కూడా సంజూ శాంసన్కే ఓపెనర్గా అవకాశం దక్కింది. టెస్టు, వన్డే జట్ల కెప్టెన్ అయిన గిల్పై వేటు వేసి మరీ.. ఈ కేరళ వికెట్ కీపర్ బ్యాటర్కు మరో అవకాశం ఇచ్చింది యాజమాన్యం.సెలక్టర్ల వమ్ము చేస్తున్న సంజూఅయితే, సంజూ మాత్రం సెలక్టర్ల నమ్మకాన్ని నిలబెట్టలేకపోతున్నాడు. కివీస్తో మూడు మ్యాచ్లలో అతడు చేసిన స్కోర్లు (10, 6, 0) ఇందుకు నిదర్శనం. మరోవైపు.. దేశవాళీ క్రికెట్లో సత్తా చాటి టీమిండియాలో రీఎంట్రీ ఇచ్చిన ఇషాన్ కిషన్ అద్భుత ప్రదర్శనలతో దుమ్ములేపుతున్నాడు.పేలుతున్న జార్ఖండ్ డైనమైట్న్యూజిలాండ్తో తొలి మ్యాచ్లో విఫలమైనా (8).. రెండో టీ20లో 32 బంతుల్లో 76, మూడో టీ20లో 13 బంతుల్లో 28 పరుగులతో సత్తా చాటాడు ఇషాన్. తద్వారా జట్టులో తన స్థానం సుస్థిరం చేసుకునే దిశగా దూసుకుపోతున్నాడు ఈ జార్ఖండ్ డైనమైట్.ఈ నేపథ్యంలో టీమిండియా మాజీ కెప్టెన్ క్రిష్ణమాచారి శ్రీకాంత్ కీలక వ్యాఖ్యలు చేశాడు. సంజూ వైఫల్యాలు కొనసాగితే.. వరల్డ్కప్ టోర్నీలో భారత తుదిజట్టు నుంచి అతడిని తప్పించడం ఖాయమని అభిప్రాయపడ్డాడు. అదే విధంగా ప్రస్తుత ఫామ్ దృష్ట్యా ఇషాన్ కిషన్ను జట్టు నుంచి ఎవరూ తప్పించలేరని పేర్కొన్నాడు.ఇషాన్ను తుదిజట్టు నుంచి తప్పించలేరు"ఇప్పటి పరిస్థితులను బట్టి చూస్తే సెలక్టర్లు ఇషాన్ను తుదిజట్టు నుంచి తప్పించలేరు. ఇందుకు అవకాశమే లేదు. సంజూ శాంసన్ కంటే అతడు ఎంతో మెరుగ్గా ఆడుతున్నాడు. సంజూను చూస్తుంటే బాధగా ఉంది.పరుగులు చేయాలనే కసి అతడిలో కనిపిస్తోంది. కానీ సరిగ్గా ఆడలేకపోతున్నాడు. గత మ్యాచ్లో కనీసం నామమాత్రపు స్కోరైనా చేసి ఉండాల్సింది. నిలకడలేని ఆట తీరే సంజూకు ప్రధాన సమస్య. ఏడాదిన్నర క్రితం సెంచరీ చేశాడు. ఆ తర్వాత ఇదే తంతు కొనసాగుతోంది.సంజూపై వేటు తప్పదుఏదేమైనా సంజూ దురదృష్టవంతుడనే చెప్పాలి. అతడికి గట్టి పోటీ ఉంది. తిలక్ వర్మ, ఇషాన్ కిషన్ జట్టులో పాతుకుపోయే ప్రయత్నంలో ఉన్నారు. అభిషేక్ శర్మను ఎవరూ కదిలించలేరు. ఇషాన్ వంటి వికెట్ కీపర్ బ్యాటర్ డేంజరస్ ఫామ్లో ఉన్నపుడు సంజూ తుదిజట్టులో చోటు కోల్పోయే అవకాశాలే ఎక్కువ’’ అని చిక్కా అభిప్రాయపడ్డాడు. ఓపెనర్గా ఇషాన్ సంజూ స్థానాన్ని భర్తీ చేసే అవకాశం లేకపోలేదని పేర్కొన్నాడు.చదవండి: ICC: వెనక్కి తగ్గిన బంగ్లాదేశ్.. ఆ పని చేయబోముIshan-daar. Jabardast. Zindabaad. 🔥Started with a 2nd-ball six & Ishan Kishan is straightaway showing his intent in this run chase! 💪He is certainly on a mission to DEFEAT HISTORY! 🎯Watch Bhojpuri commentary on JioHotstar #INDvNZ, 3rd T20I | LIVE NOW 👉… pic.twitter.com/YY3fnv3WvD— Star Sports (@StarSportsIndia) January 25, 2026 -
T20 WC: వేటు వేసిన సెలక్టర్లు.. తొలిసారి స్పందించిన గిల్
టీ20 ప్రపంచకప్-2026లో పాల్గొనే భారత జట్టు నుంచి తనను తప్పించడంపై.. టీమిండియా వన్డే కెప్టెన్ శుబ్మన్ గిల్ స్పందించాడు. తనపై వేటు వేస్తూ సెలక్టర్లు తీసుకున్న నిర్ణయాన్ని గౌరవిస్తానని పేర్కొన్నాడు. కాగా ఆసియా టీ20 కప్-2025 ద్వారా గిల్ అంతర్జాతీయ టీ20లలో పునరాగమనం చేసిన విషయం తెలిసిందే.ఈ క్రమంలో అభిషేక్ శర్మకు విజయవంతమైన ఓపెనింగ్ జోడీగా ఉన్న సంజూ శాంసన్ (Sanju Samson)ను తప్పించి.. అతడి స్థానంలో గిల్ను ఓపెనర్గా పంపారు. అయితే, వరుస మ్యాచ్లలో ఈ కుడిచేతి వాటం బ్యాటర్ విఫలమయ్యాడు. గత ఇరవై ఇన్నింగ్స్లో అతడి ఖాతాలో ఒక్క టీ20 హాఫ్ సెంచరీ కూడా లేకపోవడం ఇందుకు నిదర్శనం.అయినప్పటికీ సౌతాఫ్రికాతో ఇటీవల స్వదేశంలో జరిగిన టీ20 సిరీస్లోనూ గిల్ (Shubman Gill).. తొలి మూడు మ్యాచ్లలో కొనసాగించారు. ఇక్కడా అతడు విఫలమయ్యాడు. అనంతరం పాదం నొప్పి కారణంగా సఫారీ జట్టుతో నాలుగు (వర్షం వల్ల రద్దు), ఐదో టీ20కి గిల్ దూరమయ్యాడు. ఈ క్రమంలో ప్రొటిస్తో ఐదో టీ20లో ఓపెనర్గా తిరిగి వచ్చి సంజూ మరోసారి సత్తా చాటాడు.అనూహ్య రీతిలో వేటుఫలితంగా.. గిల్కు పెద్ద పీట వేస్తూ.. సంజూకు అన్యాయం చేశారన్న విమర్శలు మరోసారి తెరమీదకు వచ్చాయి. ఈ నేపథ్యంలో అజిత్ అగార్కర్ నేతృత్వంలోని సెలక్షన్ కమిటీ అనూహ్య నిర్ణయం తీసుకుంది. టెస్టు, వన్డే జట్ల కెప్టెన్.. టీ20 జట్టు వైస్ కెప్టెన్ అయిన గిల్ను ప్రపంచకప్ జట్టు నుంచి తప్పించింది. ఊహించని రీతిలో భవిష్య కెప్టెన్పై వేటు వేసి.. అక్షర్ పటేల్ను సూర్యకుమార్ యాదవ్ డిప్యూటీగా నియమించింది.ఇక భారత జట్టు ప్రస్తుతం సొంతగడ్డపై న్యూజిలాండ్తో పరిమిత ఓవర్ల సిరీస్తో బిజీ కానుంది. జనవరి 11 నుంచి ఇరుజట్ల మధ్య వన్డే సిరీస్ మొదలుకానుండగా.. టీమిండియా వన్డే కెప్టెన్ గిల్ మీడియాతో మాట్లాడాడు. ఈ సందర్భంగా టీ20 జట్టులో చోటు కోల్పోవడంపై ప్రశ్న ఎదురైంది.అలా అయితే నన్నెవరూ ఆపలేరు కదా!ఇందుకు స్పందిస్తూ.. ‘‘సెలక్టర్ల నిర్ణయాన్ని నేను గౌరవిస్తాను. టీ20 ప్రపంచకప్ టోర్నీలో భారత జట్టుకు ఆల్ ది బెస్ట్. నా తలరాతలో రాసి ఉన్నదాన్ని బట్టే నేను ఈరోజు ఇక్కడ ఉన్నాను.నాకు దక్కాల్సిన వాటి గురించి నుదిటిరాతలో రాసి ఉంటే.. నా నుంచి దానిని ఎవరూ దూరం చేయలేరు. నన్నెవరూ ఆపలేరు. ప్రతి ఒక్క ఆటగాడు ఎల్లప్పుడూ దేశం కోసం ఆడుతూ.. అత్యుత్తమ ప్రదర్శన ఇవ్వాలనే కోరుకుంటాడు. నేను కూడా అంతే. అయితే, సెలక్టర్లే అంతిమ నిర్ణయం తీసుకుంటారు’’ అని శుబ్మన్ గిల్ పేర్కొన్నాడు.చదవండి: T20 WC 2026: ‘ఈసారి ఫైనల్లో టీమిండియాపై గెలుస్తాం’ -
సంజూ శాంసన్ కోసం రంగంలోకి యువీ!
టీమిండియా దిగ్గజ ఆల్రౌండర్గా యువరాజ్ సింగ్కు పేరుంది. టీ20 ప్రపంచకప్-2007, వన్డే వరల్డ్కప్-2011 టోర్నీల్లో భారత్ చాంపియన్గా నిలవడంలో అతడిది కీలక పాత్ర. పదిహేడేళ్లకుపైగా అంతర్జాతీయ క్రికెట్లో కొనసాగిన యువీ.. తన కెరీర్లో 40 టెస్టులు, 58 టీ20 మ్యాచ్లు.. అత్యధికంగా 304 వన్డేలు ఆడాడు.టెస్టుల్లో 1900, టీ20లలో 1177 పరుగులు చేసిన ఈ లెఫ్టాండర్ బ్యాటర్.. వన్డేల్లో 14 శతకాల సాయంతో 8701 పరుగులు సాధించాడు. ఈ లెఫ్టార్మ్ స్పిన్నర్ ఖాతాలో 9 టెస్టు, 111 వన్డే, 28 టీ20 వికెట్లు ఉన్నాయి. ఐపీఎల్లోనూ 132 మ్యాచ్లు ఆడిన యువీ.. 2750 పరుగులు చేయడంతో పాటు.. 36 వికెట్లు కూడా తీశాడు.ఇంతటి అనుభవం గల యువీ దగ్గర పంజాబీ బ్యాటర్లు, టీమిండియా స్టార్లు శుబ్మన్ గిల్, అభిషేక్ శర్మ శిక్షణ తీసుకున్నారు. అతడి మార్గదర్శనంలో వీరిద్దరు రాటుదేలారు. ముఖ్యంగా అభిషేక్ శర్మ టీమిండియా విధ్వంసకర ఓపెనర్గా, ప్రపంచ నంబర్ వన్ టీ20 బ్యాటర్గా ఎదగడంలో యువీది కీలక పాత్ర.మరోవైపు.. గిల్ ఏకంగా టీమిండియా టెస్టు, వన్డే కెప్టెన్ స్థాయికి ఎదిగాడు. ఇక యువీ శిష్యుల జాబితాలోకి తాజాగా సంజూ శాంసన్ కూడా చేరిపోయినట్లు తెలుస్తోంది. న్యూజిలాండ్తో స్వదేశంలో టీ20 సిరీస్కు ఈ కేరళ వికెట్ కీపర్ బ్యాటర్ సన్నద్ధమవుతున్నాడు. టీ20 ప్రపంచకప్-2026 టోర్నీకి సన్నాహకంగా సాగే ఈ సిరీస్లో సత్తా చాటి.. మెగా ఈవెంట్లోనూ మెరవాలని సంజూ పట్టుదలగా ఉన్నాడు.ఈ నేపథ్యంలో యువరాజ్ సింగ్ మార్గదర్శనంలో నెట్స్లో సంజూ శ్రమిస్తున్న దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్గా మారాయి. ఇందులో యువీ.. సంజూకు బ్యాటింగ్ పొజిషన్, టెక్నిక్స్ గురించి సలహాలు ఇస్తుండగా.. అతడు శ్రద్ధగా వింటున్నట్లు కనిపించిది. ఇది చూసిన నెటిజన్లు.. ‘‘క్రేజీ కాంబినేషన్.. సూపర్ భయ్యా’’ అంటూ కామెంట్లు చేస్తున్నారు. సంజూ శాంసన్ ఫ్యాన్స్ పేజీ నుంచి వచ్చిన ఈ వీడియోపై మరికొందరు మాత్రం.. ‘‘AI’’ కాదు కదా అంటూ సందేహాలు వ్యక్తం చేస్తున్నారు.కాగా న్యూజిలాండ్తో తొలుత మూడు వన్డేలు ఆడిన తర్వాత.. టీమిండియా ఐదు మ్యాచ్ల టీ20 సిరీస్ ఆడనుంది. జనవరి 11- 31 వరకు ఈ సిరీస్ నిర్వహణకు షెడ్యూల్ ఖరారైంది. ఆ తర్వాత ఫిబ్రవరి 7 నుంచి టీ20 ప్రపంచకప్-2026తో భారత జట్టు బిజీ అవుతుంది. Sanju Samson training session with Yuvraj Singh ❤️🔥@YUVSTRONG12 @IamSanjuSamson pic.twitter.com/gBc04dbKXs— Sanju Samson Fans Page (@SanjuSamsonFP) January 10, 2026 -
ఏంటి తమ్ముడూ ఇది!.. సంజూ స్థానంలో వైభవ్ సూర్యవంశీ ఫిక్స్!
భారత క్రికెట్లోకి దూసుకువచ్చిన సరికొత్త సంచలనం పేరు వైభవ్ సూర్యవంశీ. తోటి పిల్లలంతా స్కూల్ చదువుతో బిజీగా ఉంటే.. అతడు మాత్రం అద్భుత బ్యాటింగ్తో ప్రపంచవ్యాప్తంగా తనదైన ముద్ర వేస్తున్నాడు. పద్నాలుగేళ్ల వయసుకే ఇప్పటికే ఆరు దేశాల్లో ఆరు సెంచరీలు చేసి మరో ‘మాస్టర్ బ్లాస్టర్’గా నీరాజనాలు అందుకుంటున్నాడు.దూకుడైన ఆటకు మారుపేరైన వైభవ్ సూర్యవంశీ (Vaibhav Suryavanshi).. భారత అండర్-19 జట్టు కెప్టెన్గానూ అరంగేట్రంలోనే అదరగొట్టాడు. సౌతాఫ్రికా అండర్-19 జట్టుతో బుధవారం ముగిసిన మూడు మ్యాచ్ల యూత్ వన్డే సిరీస్ను 3-0తో క్లీన్స్వీప్ చేశాడు. ఆఖరి వన్డేలో విధ్వంసకర శతకం బాది.. మరోసారి తన ప్రతిభను నిరూపించుకున్నాడు.సెంచరీల మోతచెన్నై వేదికగా 2024లో ఆస్ట్రేలియా అండర్-19 జట్టు (104)తో యూత్ టెస్టులో శతక్కట్టిన వైభవ్.. ఐపీఎల్-2025లో రాజస్తాన్ రాయల్స్ తరఫున గుజరాత్ టైటాన్స్(101)పై సెంచరీ సాధించాడు. గతేడాది ఇంగ్లండ్ గడ్డ మీద యూత్ వన్డేలో శతకం (143) నమోదు చేసిన ఈ లెఫ్టాండర్ బ్యాటర్... ఆస్ట్రేలియాలో యూత్ టెస్టులోనూ (113) శతక్కొట్టాడు.ఇక ఇండియా-ఎ తరఫున దోహా వేదికగా యూఏఈపై టీ20 సెంచరీ (144) సాధించిన వైభవ్ సూర్యవంశీ.. తన సొంతజట్టు బిహార్ తరఫున దేశీ క్రికెట్లో మహారాష్ట్రపై టీ20 శతకం (108*) సాధించాడు. అనంతరం దుబాయ్లో యూఏఈ అండర్-19 జట్టుతో యూత్ వన్డేలో (171)లోనూ శతక్కొట్టిన ఈ ఓపెనింగ్ బ్యాటర్.. ఇటీవల విజయ్ హజారే వన్డే టోర్నీలో అరుణాచల్ ప్రదేశ్పై (190) భారీ శతకం సాధించాడు. తాజాగా సౌతాఫ్రికాతో మూడో యూత్ వన్డేలో 127 పరుగులతో సత్తా చాటాడు.ఆరు దేశాల్లో ఆరు సెంచరీలుఇలా భారత్, ఇంగ్లండ్, ఆస్ట్రేలియా, ఖతార్, యూఏఈ, సౌతాఫ్రికా దేశాల్లో సెంచరీలు చేసి.. తాను ఎక్కడైనా బ్యాట్ ఝులిపించగలనని నిరూపించుకున్నాడు. ఈ నేపథ్యంలో త్వరలోనే వైభవ్ టీమిండియాలో అరంగేట్రం చేయడం ఖాయమనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.ఈ విషయంపై భారత దిగ్గజ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ స్పందిస్తూ.. ‘‘171(95), 50(26), 190(84), 68(24), 108*(61), 46(25) & 127(74)... గత ముప్పై రోజులుగా దేశీ, అండర్-19 క్రికెట్లో వైభవ్ సూర్యవంశీ సాధించిన స్కోర్లు ఇవి.ఏంటి తమ్ముడూ ఇది!ఇదంతా ఏంటి తమ్ముడు?... శాంపిల్ చూపించావా? మున్ముందు ఇంతకంటే గొప్పగా చెలరేగిపోతావా?.. 14 ఏళ్ల వయసున్న పిల్లాడు ఇలా ఆడుతున్నాడంటే నమ్మబుద్ధికావడమే లేదు. అతడి ఆటను వర్ణించేందుకు మాటలు రావడం లేదు.సంజూ శాంసన్ స్థానంలోఅండర్-19 వరల్డ్కప్-2026లో అతడు షోటాపర్ కాబోతున్నాడు. ఆ తర్వాత ఐపీఎల్.. రాజస్తాన్ రాయల్స్లో సంజూ శాంసన్ స్థానంలో పూర్తి స్థాయి ఓపెనర్గా బరిలోకి దిగబోతున్నాడు. వచ్చే నాలుగు నెలలు మనకు వైభవ్ జాతరే!అతడి పట్టుదల, టెంపర్మెంట్, పరుగుల దాహం.. మనకు సరికొత్త అనుభూతి పంచబోతోంది’’ అంటూ అశూ.. వైభవ్ను ఆకాశానికెత్తాడు. ఐపీఎల్-2026లో రాజస్తాన్ ఓపెనర్గా సంజూ స్థానాన్ని ఈ చిచ్చరపిడుగు భర్తీ చేస్తాడని అంచనా వేశాడు. కాగా సంజూ శాంసన్ను రాజస్తాన్.. చెన్నై సూపర్ కింగ్స్కు ట్రేడ్ చేసిన విషయం తెలిసిందే.ఓపెనింగ్ స్థానానికి ఎసరుఈ నేపథ్యంలో కొంతమంది నెటిజన్లు మరో అడుగు ముందుకు వేసి.. భారత టీ20 జట్టులోనూ సంజూ ఓపెనింగ్ స్థానానికి వైభవ్ ఎసరుపెట్టబోతున్నాడని కామెంట్లు చేస్తున్నారు. టీ20 ప్రపంచకప్-2026లో సత్తా చాటితేనే సంజూ స్థానం పదిలంగా ఉంటుందని పేర్కొంటున్నారు.ఒకవేళ అన్నీ కలిసివచ్చి ఈ ఏడాదే గనుక వైభవ్ అంతర్జాతీయ క్రికెట్లో అడుగుపెడితే.. క్రికెట్ దేవుడు, దిగ్గజ బ్యాటర్ సచిన్ టెండుల్కర్ పేరిట ఉన్న రికార్డు బద్దలవడం ఖాయం. సచిన్ పదహారేళ్లకు టీమిండియా తరఫున అరంగేట్రం చేస్తే.. వైభవ్ పద్నాలుగు- పదిహేనేళ్ల వయసులోనే ఈ ఘనత సాధించే అవకాశం ఉంది. కాగా బిహార్లో 2011, మార్చి 27న వైభవ్ సూర్యవంశీ జన్మించాడు.చదవండి: శ్రేయస్ అయ్యర్కు షాక్.. ఒక్క పరుగు తేడాతో.. -
సంజూ శాంసన్ సూపర్ సెంచరీ.. 312 టార్గెట్ హాంఫట్
విజయ్ హజారే ట్రోఫీ 2025-26 సీజన్లో కేరళ మూడో విజయాన్ని అందుకుంది. శనివారం అహ్మదాబాద్ వేదికగా జార్ఖండ్తో జరిగిన మ్యాచ్లో కేరళ 8 వికెట్ల తేడాతో జయభేరి మోగించింది. ఈ మ్యాచ్లో తొలుత బ్యాటింగ్ చేసిన జార్ఖండ్ 50 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 311 పరుగులు చేసింది. కుమార్ కుశాగ్ర (137 బంతుల్లో 143 నాటౌట్; 8 ఫోర్లు, 7 సిక్స్లు) అజేయ శతకం సాధించాడు. అనుకూల్ రాయ్ (72 బంతుల్లో 72; 4 ఫోర్లు, 3 సిక్స్లు) రాణించాడు. నిధీశ్ 4, బాబా అపరాజిత్ 2 వికెట్లు తీశారు.రోహన్, సంజూ సెంచరీలుఅనంతరం 312 పరుగుల భారీ లక్ష్యాన్ని కేరళ కేవలం రెండే వికెట్లు కోల్పోయి 42.3 ఓవర్లలోనే చేధించింది. కెప్టెన్ రోహన్ కున్నుమ్మాళ్ (78 బంతుల్లో 124; 8 ఫోర్లు, 11 సిక్స్లు), సంజూ సామ్సన్ (95 బంతుల్లో 101; 9 ఫోర్లు, 3 సిక్స్లు)ల మెరుపు శతకాలు సాధించారు. సంజూ కాస్త ఆచితూచి ఆడినప్పటికి.. రోహన్ మాత్రం ఆకాశమే హద్దుగా చెలరేగాడు. అహ్మదాబాద్ మైదానంలో అతడు సిక్సర్ల వర్షం కురిపించాడు. వీరిద్దరితో పాటు బాబా అపరాజిత్ (41 నాటౌట్; 1 ఫోర్), విష్ణు వినోద్ (40 నాటౌట్; 3 ఫోర్లు, 2 సిక్స్లు) రాణించారు. ఇక సంజూ విషయానికి వస్తే.. టీ20 వరల్డ్కప్ సన్నాహకాలగా ఈ దేశవాళీ టోర్నీని ఉపయోగించుకుంటున్నాడు. టీ20 జట్టులో శుభ్మన్ గిల్ లేకపోవడంతో శాంసన్ ఓపెనర్గా మరోసారి బరిలోకి దిగనున్నాడు. శాంసన్కు ఇది నాలుగో లిస్ట్-ఎ సెంచరీ కావడం గమనార్హం.చదవండి: IPL 2026: వారు తొలిగిస్తే నేనేం చేయగలను? -
IPL 2026: రాజస్తాన్ రాయల్స్ ‘ఫ్యాన్స్’కి భారీ షాక్!
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) మొట్టమొదటి సీజన్ విజేతగా రాజస్తాన్ రాయల్స్ చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోతుంది. 2008లో ఢిల్లీలోని అరుణ్ జైట్లీ స్టేడియం వేదికగా తమ తొలి మ్యాచ్ ఆడిన రాజస్తాన్.. ఆ తర్వాత జైపూర్లోని సొంత మైదానం సవాయ్ మాన్సింగ్ స్టేడియం(SMS)లో తదుపరి మ్యాచ్ ఆడింది.సుదీర్ఘ బంధానికి వీడ్కోలుక్యాష్ రిచ్ లీగ్ ఆరంభం నుంచి ఈ మైదానాన్ని తమ హోం గ్రౌండ్గా ఎంచుకున్న రాజస్తాన్ జట్టు.. ఇప్పుడు ఈ సుదీర్ఘ బంధానికి వీడ్కోలు పలికేందుకు సిద్ధమైంది. రెవ్స్పోర్ట్స్ కథనం ప్రకారం.. ఐపీఎల్-2026 సీజన్ నుంచి రాజస్తాన్ రాయల్స్ హోం గ్రౌండ్ మారనుంది. పుణెలోని మహారాష్ట్ర క్రికెట్ అసోసియేషన్ స్టేడియాన్ని తమ సొంత మైదానంగా రాయల్స్ ఎంచుకుంది.కారణం ఇదేజైపూర్లోని ‘SMS’ గ్రౌండ్లో భద్రతా ప్రమాణాలు సరిగ్గా లేవని ఇప్పటికే రాయల్స్ యాజమాన్యం సంబంధిత అధికారులకు ఫిర్యాదు చేసింది. అయితే, ఈ విషయంలో వారి నుంచి సరైన స్పందన కరువైంది. ఈ సమస్యలు ఎప్పటికి పరిష్కారమవుతాయన్న అంశంపై కూడా సదరు అధికార వర్గాలు కచ్చితమైన సమాచారం ఇవ్వలేదట. దీంతో రాయల్స్ తమ హోం గ్రౌండ్ మార్పు గురించి తుదినిర్ణయానికి వచ్చినట్లు తెలుస్తోంది.పుణెలోఇప్పటికే రాయల్స్ ఆపరేషన్ టీమ్ పుణెకి వెళ్లి.. అక్కడి పిచ్ పరిస్థితులు, సీటింగ్ సామర్థ్యం, ఆటగాళ్ల సౌకర్యాలు, మంచి హోటళ్లు అందుబాటులో ఉన్నాయా? లేవా?, రవాణా తదితర అంశాల గురించి పరిశీలించినట్లు సమాచారం. ఈ క్రమంలో పుణెలోని మహారాష్ట్ర క్రికెట్ స్టేడియాన్ని (MCA) హోం గ్రౌండ్గా ఫైనల్ చేసినట్లు తెలుస్తోంది. ఇక రెండో హోం గ్రౌండ్గా అసోంలోని గువాహటి యథావిధిగా కొనసాగనుంది.కాగా MCA స్టేడియంలో గతం (2016-17)లో రైజింగ్ పుణె సూపర్ జెయింట్స్కు సొంత మైదానంగా ఉండేది. ఇక చెన్నూ సూపర్ కింగ్స్ 2018లో తమ తాత్కాలిక సొంత మైదానంగా MCAను ఎంచుకుంది. ఆర్సీబీని ఓడించి..ఇదిలా ఉంటే.. ఈ ఏడాది రాయల్స్తో పాటు ఆర్సీబీ కూడా ఈ మైదానం కోసం సంప్రదింపులు జరిపినట్లు సమాచారం. అయితే, చివరగా రాయల్స్కే ఇది హోం గ్రౌండ్గా మారనున్నట్లు తెలుస్తోంది. ఇదే జరిగితే SMSలో ఇన్నాళ్లు రాయల్స్ మ్యాచ్ వీక్షించిన స్థానిక ‘ఫ్యాన్స్’కు భారీ షాక్ తగిలినట్లే!!ఇక 2008లో విజేతగా నిలిచిన రాయల్స్.. మళ్లీ ఫైనల్ చేరడానికి దాదాపు పద్నాలుగేళ్లు పట్టింది. సంజూ శాంసన్ కెప్టెన్సీలో 2022లో గుజరాత్ టైటాన్స్ చేతిలో ఓడి రన్నరప్తో సరిపెట్టుకుంది. ఇక 2026 వేలానికి ముందే సంజూ శాంసన్ను చెన్నైకి ట్రేడ్ చేసిన రాయల్స్ యాజమాన్యం.. రవీంద్ర జడేజాను తమ జట్టులో చేర్చుకుంది. ఇంతవరకు తమ కెప్టెన్ను మాత్రం ప్రకటించలేదు.చదవండి: KKR: అతడొక ద్రోహి.. కేకేఆర్ ఇలాంటి పనిచేస్తుందా?.. బీసీసీఐ స్పందన ఇదే -
నా సూపర్స్టార్: భార్యకు సంజూ శాంసన్ విషెస్ (ఫొటోలు)
-
టీమిండియా సెలక్టర్లపై మాజీ క్రికెటర్ ఫైర్
టీమిండియా సెలక్టర్ల తీరుపై భారత మాజీ క్రికెటర్ మొహమ్మద్ కైఫ్ మండిపడ్డాడు. ప్రపంచకప్ టోర్నమెంట్కు సన్నద్ధమయ్యే క్రమంలో పిచ్చి ప్రయోగాలతో ఆటగాళ్లను గందరగోళానికి గురిచేశారని ఆగ్రహం వ్యక్తం చేశాడు. కనీసం రెండు నుంచి మూడు నెలల కాలం వృథా చేశారంటూ చీఫ్ సెలక్టర్ అజిత్ అగార్కర్ తీరును తప్పుబట్టాడు.గిల్పై వేటుఅసలు విషయమేమిటంటే.. భారత్- శ్రీలంక సంయుక్తంగా ఆతిథ్య ఇస్తున్న టీ20 ప్రపంచకప్-2026 టోర్నీకి బీసీసీఐ ఇటీవలే తమ జట్టును ప్రకటించిన సంగతి తెలిసిందే. అనూహ్య రీతిలో వైస్ కెప్టెన్గా ఉన్న శుబ్మన్ గిల్ (Shubman Gill)పై వేటు వేసిన యాజమాన్యం.. జితేశ్ శర్మను కూడా జట్టు నుంచి తప్పించింది.గిల్, జితేశ్ స్థానాల్లో రింకూ సింగ్, ఇషాన్ కిషన్ (Ishan Kishan)లను మేనేజ్మెంట్ ఎంపిక చేసింది. ఈ రెండు మార్పులు మినహా సౌతాఫ్రికాతో స్వదేశంలో ఇటీవల ముగిసిన టీ20 సిరీస్లో ఆడిన జట్టునే వరల్డ్కప్ టోర్నీకీ కొనసాగించింది. ఈ నేపథ్యంలో భారత మాజీ బ్యాటర్ మొహమ్మద్ కైఫ్ స్పందిస్తూ.. గిల్ విషయంలో మేనేజ్మెంట్ చేసిన తప్పును ఎత్తి చూపాడు.సెలక్టర్లు తప్పు చేశారు‘‘మెరుగైన ఆటగాళ్లు ఎవరో వాళ్లకు (సెలక్టర్లకు) ముందుగానే తెలుసు. ముఖ్యంగా టీ20 ఫార్మాట్కు ఎవరు సరిపోతారో వారికి ఓ అవగాహన ఉంది. గిల్ కంటే పొట్టి క్రికెట్లో బాగా ఆడే వాళ్లున్నారని వాళ్లకు తెలుసు. అయినప్పటికీ సెలక్టర్లు తప్పు చేశారు.వారి తప్పు వల్ల భారత క్రికెట్ వెనుకబడింది. గత రెండు- మూడు నెలలుగా గిల్కు బదులు వాళ్లు యశస్వి జైస్వాల్, సంజూ శాంసన్, జితేశ్ శర్మలను ఎక్కువగా ఆడించాల్సింది’’ అని కైఫ్ పేర్కొన్నాడు.కాగా ఆసియా టీ20 కప్-2025 టోర్నీతో గిల్ టీ20 జట్టులో పునరాగమనం చేయగా.. ఓపెనింగ్ జోడీగా ఉన్న అభిషేక్ శర్మ- సంజూ శాంసన్లను విడదీయాల్సి వచ్చింది. సంజూ స్థానంలో గిల్ ఓపెనర్గా వచ్చి వరుస మ్యాచ్లలో విఫలమయ్యాడు. ఈ నేపథ్యంలో చీఫ్ సెలక్టర్ అజిత్ అగార్కర్తో పాటు హెడ్కోచ్ గౌతం గంభీర్పై తీవ్ర స్థాయిలో విమర్శలు వచ్చాయి.భవిష్య సారథినే తప్పించారుఈ క్రమంలో అనూహ్య రీతిలో గిల్పై వేటు వేసిన యాజమాన్యం.. ప్రపంచకప్ జట్టుకు వైస్ కెప్టెన్గా అక్షర్ పటేల్ను తిరిగి నియమించింది. కాగా టీమిండియా టెస్టు, వన్డే జట్లకు గిల్ కెప్టెన్గా ఉన్న విషయం తెలిసిందే. టీ20 జట్టుకు కూడా భవిష్య సారథిగా అతడే ఉంటాడని బీసీసీఐ వర్గాలు గతంలో వెల్లడించాయి. కానీ బ్యాటర్గా వరుస మ్యాచ్లలో విఫలమైన నేపథ్యంలో మేనేజ్మెంట్ అతడిని జట్టు నుంచే తప్పించడం గమనార్హం.చదవండి: కెప్టెన్గా ఇషాన్ కిషన్ -
అద్భుతమైన ఆటగాడు.. అయినా ఎందుకు వేటు?
టీ20 ప్రపంచకప్-2026 టోర్నమెంట్కు భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) ప్రకటించిన జట్టు గురించే భారత క్రికెట్ వర్గాల్లో ప్రధానంగా చర్చ నడుస్తోంది. ఏకంగా వైస్ కెప్టెన్ శుబ్మన్ గిల్పైనే వేటు వేసిన యాజమాన్యం.. వికెట్ కీపర్ బ్యాటర్ జితేశ్ శర్మను కూడా తప్పించింది.ఇది సరైన నిర్ణయమే!అయితే, భవిష్య కెప్టెన్గా నీరాజనాలు అందుకున్న గిల్ (Shubman Gill).. టీ20 జట్టులో పునరాగమనం చేసిన నాటి నుంచి వరుసగా విఫలమవుతూనే ఉన్నాడు. అతడి కోసం సంజూ శాంసన్ (Sanju Samson)ను బలి చేయడం.. అందుకు తగ్గ మూల్యం చెల్లించడం జరిగాయి. కాబట్టి గిల్ను ప్రపంచకప్ జట్టు నుంచి పక్కనపెట్టడం సముచితమేనని మెజారిటి మంది విశ్లేషకుల అభిప్రాయం.కానీ జితేశ్ శర్మ విషయంలో మాత్రం మేనేజ్మెంట్ తీసుకున్న నిర్ణయం సరైందేనా? లేదా? అన్న విషయంపై మాత్రం ఏకాభిప్రాయం కుదరడం లేదు. టాపార్డర్ నుంచి సంజూని తప్పించిన తర్వాత వికెట్ కీపర్ బ్యాటర్గా జితేశ్కు యాజమాన్యం పెద్ద పీట వేసింది. లోయర్ ఆర్డర్లో హార్దిక్ పాండ్యా (Hardik Pandya)తో కలిసి ఫినిషర్గా పనికివస్తాడనే కారణంతో ఇలా చేసింది.గిల్ను తప్పించడంతోఅయితే, గిల్ను తప్పించడంతో జట్టు కూర్పులో తేడా రావడంతో జితేశ శర్మ స్థానం గల్లంతైంది. నిజానికి జితేశ్ శర్మ అద్భుతమైన ఫామ్లో ఉన్నాడు. ఐపీఎల్-2025లో రాయల్ చాలెంజర్స్ బెంగళూరు తరఫున అతడు సత్తా చాటాడు. పదకొండు మ్యాచ్లలో కలిపి 261 పరుగులు చేసిన ఈ వికెట్ కీపర్ బ్యాటర్.. స్ట్రైక్రేటు 176కు పైగా ఉండటం విశేషం.టీ20లలో తిరుగులేని ఆటగాడుబ్యాటర్గా రాణిస్తూనే.. రజత్ పాటిదార్ గైర్హాజరీలో కెప్టెన్గానూ సత్తా చాటి ఆర్సీబీ మొట్టమొదటిసారి ట్రోఫీని ముద్దాడంలో జితేశ్ కీలక పాత్ర పోషించాడు. ఇక టీమిండియా తరపున తనకు అడపాదడపా వచ్చిన అవకాశాలను కూడా అతడు సద్వినియోగం చేసుకున్నాడు.ఇప్పటికి 12 అంతర్జాతీయ టీ20లు ఆడిన జితేశ్ శర్మ.. 151కి పైగా స్ట్రైక్రేటుతో 162 పరుగులు సాధించాడు. ఓవరాల్గా పొట్టి ఫార్మాట్లో 142 మ్యాచ్లు ఆడిన ఈ కుడిచేతి వాటం బ్యాటర్.. 3163 పరుగులు చేశాడు. ఓవరాల్గా నిలకడైన ఆటతో టీ20లలో తనను తాను ఇప్పటికే మ్యాచ్ విన్నర్గా నిరూపించుకున్నాడు జితేశ్ శర్మ.కచ్చితంగా అర్హుడే.. కానీఈ గణాంకాలు, ప్రదర్శన ఆధారంగా సొంతగడ్డపై జరిగే ప్రపంచకప్-2026లో పాల్గొనే భారత జట్టులో ఉండేందుకు జితేశ్ శర్మ వందకు వంద శాతం అర్హుడు. అయితే, గిల్ స్థానంలో ఆల్రౌండర్ రింకూ సింగ్కు సెలక్టర్లు చోటిచ్చారు. లోయర్ ఆర్డర్లో ఫినిషర్గా రింకూ సేవలు అందిస్తాడు. మరోవైపు.. గిల్ లేడు కాబట్టి అభిషేక్ శర్మ- సంజూ శాంసన్లకు తోడుగా మరో బ్యాకప్ ఓపెనర్ కావాలి. ఓవైపు రింకూ రాక.. మరోవైపు.. ఓపెనింగ్ స్థానం కోసం రిజర్వు ప్లేయర్ను ఎంపిక చేయాల్సిన తరుణంలో జితేశ్ శర్మపై వేటుపడక తప్పలేదు. బ్యాకప్ ఓపెనర్గా దేశీ టీ20 టోర్నీ సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీ విజేత వికెట్ కీపర్ బ్యాటర్ ఇషాన్ కిషన్ను సెలక్టర్లు తిరిగి జాతీయ జట్టుకు ఎంపిక చేశారు.అయినా అందుకే వేటుసంజూ మొదటి ప్రాధాన్య ఓపెనర్, వికెట్ కీపర్గా ప్రపంచకప్ టోర్నీలో సేవలు అందించనుండగా.. ఇషాన్ అతడికి బ్యాకప్గా ఉంటాడు. ఊహించని రీతిలో గిల్పై వేటు, ఇషాన్ కిషన్ రాకతో.. కాంబినేషన్ల కోసం జితేశ్ శర్మను పక్కనపెట్టాల్సి వచ్చింది. చీఫ్ సెలక్టర్ అజిత్ అగార్కర్ కూడా ఈ విషయాన్ని అంగీకరించాడు. జితేశ్ అద్భుతమైన ఆటగాడే అయినా.. కూర్పు కోసం పక్కనపెట్టాల్సి వచ్చిందని స్పష్టం చేశాడు. ఏదేమైనా తొలి వరల్డ్కప్ ఆడాలన్న 32 ఏళ్ల జితేశ్ శర్మ కలకు ఇప్పటికి ఇలా బ్రేక్ పడింది.చదవండి: IND vs SL: చరిత్ర సృష్టించిన స్మృతి మంధాన.. తొలి ప్లేయర్గా -
సంజూ శాంసన్ కీలక నిర్ణయం
టీ20 వరల్డ్కప్-2026కు ఎంపికైన భారత స్టార్ వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ కీలక నిర్ణయం తీసుకున్నాడు. దేశవాళీ వన్డే టోర్నీ విజయ్ హజారే ట్రోఫీ-2025లో ఆడేందుకు శాంసన్ సిద్దమయ్యాడు. విజయ్ హజారే ట్రోఫీ కోసం కేరళ క్రికెట్ అసోసియేషన్ ప్రకటించిన జట్టులో సంజూకు చోటు దక్కింది.ఈ జట్టుకు యువ ఓపెనర్ రోహన్ కున్నుమ్మల్ కెప్టెన్గా ఎంపికయ్యాడు. ఐపీఎల్ 2025లో ముంబై ఇండియన్స్ తరపున రాణించిన స్పిన్నర్ విఘ్నేష్ పుత్తూర్ ఈ జట్టులో చోటు సంపాదించుకున్నాడు. కేరళ జట్టులో ఎండీ నిదీష్, విష్ణు వినోద్, మహ్మద్ అజారుద్దీన్, వంటి అనుభవం ఉన్న ప్లేయర్లు ఉన్నారు. ఈ టోర్నీలో కేరళ జట్టు గ్రూపు-ఈలో ఉంది. ఈ గ్రూప్లో కేరళతో పాటు త్రిపుర, కర్ణాటక, మధ్యప్రదేశ్, రాజస్థాన్, జార్ఖండ్, పాండిచ్చేరి, తమిళనాడు జట్లు ఉన్నాయి.వన్డే జట్టులోకి వచ్చేందుకు..భారత టీ20 టీ20 జట్టులో తన స్ధానాన్ని పదిలం చేసుకున్న సంజూ శాంసన్.. ఇప్పుడు వన్డే జట్టులోకి కూడా రావాలని తహతహలాడుతున్నాడు. వాస్తవానికి సంజూకు వన్డేల్లో అద్భుతమైన రికార్డు ఉంది. ఈ కేరళ వికెట్ కీపర్ బ్యాటర్ ఇప్పటివరకు భారత్ తరపున 16 వన్డేలు ఆడి 56.67 సగటుతో 510 పరుగులు చేశాడు. ఇందులో ఒక సెంచరీ, మూడు హాఫ్ సెంచరీలు ఉన్నాయి. ఈ విజయ్ హజారే ట్రోఫీలో సంజూ రాణిస్తే, భారత వన్డే జట్టులోకి రీఎంట్రీకి మార్గం సుగమం అవుతుంది. కాగా ఈ ఏడాది దేశవాళీ వన్డే టోర్నీలో విరాట్ కోహ్లి, రోహిత్ శర్మ, రిషబ్ పంత్ వంటి అగ్రశ్రేణి ఆటగాళ్లు ఆడనున్నారు.విజయ్ హజారే ట్రోఫీకి కేరళ జట్టు:రోహన్ కున్నుమ్మల్ (కెప్టెన్), సంజు శాంసన్, విష్ణు వినోద్ (వికెట్ కీపర్), మహమ్మద్ అజహరుద్దీన్ (వికెట్ కీపర్), అహమ్మద్ ఇమ్రాన్, సల్మాన్ నిజార్, అభిషేక్ జె. నాయర్, కృష్ణ ప్రసాద్, అఖిల్ స్కారియా, అభిజిత్ ప్రవీణ్ వి, బిజు నారాయణన్, అంకిత్ శర్మ, బాబా అపరాజిత్, విఘ్నేష్ పుత్తూర్, నిదీష్ ఎండి, ఆసిఫ్ కెఎమ్, అభిషేక్ పి. నాయర్, షరాఫుద్దీన్ ఎన్ఎమ్, ఎడెన్ ఆపిల్ టామ్.చదవండి: 'అతడి రీ ఎంట్రీ చాలా సంతోషంగా ఉంది' -
అందుకే గిల్ను సెలక్ట్ చేయలేదు: అజిత్ అగార్కర్
భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) సంచలన నిర్ణయం తీసుకుంది. వరుస మ్యాచ్లలో విఫలమవుతున్నా ఇన్నాళ్లు టీ20 జట్టు ఓపెనర్గా కొనసాగించిన శుబ్మన్ గిల్ (Shubman Gill)పై ఎట్టకేలకు వేటు వేసింది. ఊహించని రీతిలో ప్రపంచకప్-2026 జట్టు నుంచి అతడిని తప్పించింది.వైస్ కెప్టెన్గా రీఎంట్రీటీమిండియా టెస్టు, వన్డే జట్ల కెప్టెన్గా.. టీ20 జట్టు వైస్ కెప్టెన్గా ఉన్న గిల్ విషయంలో బీసీసీఐ ఇలాంటి నిర్ణయం తీసుకోవడం ఆసక్తికరంగా మారింది. కాగా ఆసియా టీ20 కప్-2025 టోర్నమెంట్తో వైస్ కెప్టెన్గా భారత జట్టులో రీఎంట్రీ ఇచ్చాడు గిల్.దీంతో దాదాపు ఏడాది కాలంపాటు అభిషేక్ శర్మ (Abhishek Sharma)తో కలిసి ఓపెనర్గా సత్తా చాటిన సంజూ శాంసన్కు కష్టాలు మొదలయ్యాయి. గిల్ను అభిషేక్ జోడీగా ఆడించిన యాజమాన్యం.. సంజూను తొలుత వన్డౌన్లో.. ఆ తర్వాత మిడిలార్డర్కు పంపింది. క్రమక్రమంగా తుదిజట్టు నుంచే తప్పించింది.వరుస మ్యాచ్లలో విఫలం వికెట్ కీపర్గానూ సంజూకు బదులు ఫినిషర్గా ఉపయోగపడే జితేశ్ శర్మకు ప్రాధాన్యం ఇచ్చింది. అయితే, సంజూ స్థానంలో ఓపెనర్గా తిరిగి వచ్చిన గిల్ వరుస మ్యాచ్లలో విఫలమయ్యాడు. అంతకు ముందు కూడా అతడి ప్రదర్శన అంతంత మా త్రమే.గత ఇరవై ఒక్క ఇన్నింగ్స్లో గిల్ సాధించిన స్కోర్లు వరుసగా.. 20(9), 10(7), 5(8), 47(28), 29(19), 4(3), 12(10), 37*(20), 5(10), 15(12), 46(40), 29(16), 4(2), 0(1).చివరగా సౌతాఫ్రికాతో స్వదేశంలో టీ20 సిరీస్లో తొలి రెండు మ్యాచ్లలో తీవ్రంగా నిరాశపరిచిన గిల్ (4(2), 0(1)).. మూడో టీ20లో 28 బంతుల్లో 28 పరుగులు చేయగలిగాడు. అయితే, పాదానికి గాయమైన కారణంగా ఆఖరి రెండు టీ20ల నుంచి అతడు తప్పుకొన్నాడు. ఈ క్రమంలో నాలుగో టీ20 పొగమంచు వల్ల రద్దు కాగా.. ఐదో టీ20తో సంజూ తుదిజట్టులోకి వచ్చాడు.నిరూపించుకున్న సంజూఅహ్మదాబాద్ వేదికగా ధనాధన్ ఇన్నింగ్స్ (22 బంతుల్లో 37) ఆడి తన సత్తాను మరోసారి నిరూపించుకున్నాడు సంజూ. గిల్ మూడు మ్యాచ్లలో కలిపి చేసిన పరుగుల కంటే ఒక్క ఇన్నింగ్స్లోనే సంజూనే ఎక్కువ పరుగులు చేయడం విశేషం.ఈ పరిణామాల నేపథ్యంలో మరోసారి మేనేజ్మెంట్ తీరుపై తీవ్రస్థాయిలో విమర్శలు వచ్చాయి. గిల్ కోసం ఇంకెన్నాళ్లు సంజూను బలిచేస్తారని రవిశాస్త్రి వంటి మాజీ క్రికెటర్లు సైతం ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలో బీసీసీఐ ఏకంగా ప్రపంచకప్ జట్టు నుంచే గిల్ను తప్పించడం సంచలనంగా మారింది.అందుకే గిల్ను సెలక్ట్ చేయలేదుఈ విషయం గురించి జట్టు ప్రకటన సందర్భంగా టీమిండియా చీఫ్ సెలక్టర్ అజిత్ అగార్కర్ స్పందించాడు. విలేకరుల ప్రశ్నకు బదులిస్తూ... ‘‘శుబ్మన్ గిల్ పరుగులు రాబట్టడంలో వెనుకబడ్డాడు. 2024 వరల్డ్కప్ జట్టులోనూ అతడు లేడు.మీ, నా అభిప్రాయాలు వేర్వేరుగా ఉండవచ్చు. కొన్నిసార్లు జట్టు ఎంపిక అత్యంత క్లిష్టంగా ఉంటుంది. గిల్ ఇప్పటకీ నాణ్యమైన ఆటగాడే అని మేము నమ్ముతున్నాం. ఫామ్ విషయంలో ప్రతి ఒక్కరి కెరీర్లో ఎత్తుపళ్లాలు సహజమే.అయితే, జట్టు కూర్పునకు అనుగుణంగా ఆటగాళ్లను ఎంపిక చేయాల్సి ఉంటుంది. అలాంటపుడు కొందరికి స్థానం దక్కదు. అతడు మెరుగైన ఆటగాడు కాదు కాబట్టి మేము ఈ నిర్ణయం తీసుకున్నామని అనుకోకూడదు. అదృష్టవశాత్తూ భారత క్రికెట్లో మనకెన్నో మంచి మంచి ఆప్షన్లు ఉన్నాయి’’ అని అగార్కర్ స్పష్టం చేశాడు. చదవండి: రోహిత్ శర్మ యూటర్న్! -
BCCI: వరల్డ్కప్ టోర్నీకి భారత జట్టు ప్రకటన.. గిల్ అవుట్
టీ20 ప్రపంచకప్-2026 టోర్నమెంట్కు భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) తమ జట్టును ప్రకటించింది. సొంతగడ్డపై జరిగే ఈ ఐసీసీ ఈవెంట్లో పాల్గొనే పదిహేను మంది సభ్యులతో కూడిన వివరాలను శనివారం వెల్లడించింది. స్వదేశంలో న్యూజిలాండ్తో జరిగే ఐదు మ్యాచ్ల టీ20 సిరీస్లోనూ ఇదే జట్టు ఆడుతుందని బోర్డు స్పష్టం చేసింది. ఇక అనూహ్య రీతిలో.. వైస్ కెప్టెన్గా ఉన్న గిల్ (Shubman Gill)కు ప్రపంచకప్ జట్టులో స్థానం దక్కలేదు. అతడి స్థానంలో ఆల్రౌండర్ అక్షర్ పటేల్ (Axar Patel) సూర్య డిప్యూటీగా నియమితుడయ్యాడు. మరోవైపు.. జితేశ్ శర్మ విషయంలోనూ యాజమాన్యం ఊహించని నిర్ణయం తీసుకుంది.జితేశ్కూ దక్కని చోటు.. దూసుకు వచ్చిన ఇషాన్తుదిజట్టులో గిల్ ఉండేలా.. సంజూ ఓపెనింగ్ స్థానం త్యాగం చేయించిన మేనేజ్మెంట్.. వికెట్ కీపర్గా జితేశ్కు పెద్ద పీట వేసి లోయర్ ఆర్డర్లో ఆడించింది. అయితే, ప్రపంచకప్ జట్టు నుంచి జితేశ్ను తప్పించి.. దేశీ టీ20 టోర్నీ సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీలో జార్ఖండ్ కెప్టెన్గా, బ్యాటర్గా దుమ్ములేపిన ఇషాన్ కిషన్ను తీసుకువచ్చింది. అతడిని బ్యాకప్ ఓపెనర్గా ఉపయోగించుకుంటామని తెలిపింది.అదే విధంగా.. నయా ఫినిషర్గా పేరొందిన రింకూ సింగ్ను మేనేజ్మెంట్ కనికరించింది. మరోసారి వరల్డ్కప్ జట్టులో భాగమయ్యే అవకాశం ఇచ్చింది. ఇక వరుస వైఫల్యాల నేపథ్యంలోనే గిల్ను జట్టు నుంచి తప్పించినట్లు స్పష్టమవుతోంది. కాగా భారత్- శ్రీలంక సంయుక్తంగా ఆతిథ్యం ఇస్తున్న వరల్డ్కప్ టోర్నీకి ఫిబ్రవరి 7- మార్చి 8 మధ్య షెడ్యూల్ ఖరారైంది. కొత్తగా బీసీసీఐ కార్యదర్శిఈసారి బీసీసీఐ కార్యదర్శి దేవజిత్ సైకియా.. టీమిండియా టీ20 సారథి సూర్యకుమార్ యాదవ్, చీఫ్ సెలక్టర్ అజిత్ అగార్కర్తో కలిసి మీడియా సమావేశంలో పాల్గొన్నారు. ఆయనే జట్టును కూడా ప్రకటించడం విశేషం.టీ20 ప్రపంచకప్-2026 టోర్నీకి భారత జట్టు సూర్యకుమార్ యాదవ్ (కెప్టెన్), అభిషేక్ శర్మ, సంజూ శాంసన్ (వికెట్ కీపర్), తిలక్ వర్మ, హార్దిక్ పాండ్యా, శివం దూబే, అక్షర్ పటేల్ (వైస్ కెప్టెన్), వాషింగ్టన్ సుందర్, వరుణ్ చక్రవర్తి, కుల్దీప్ యాదవ్, జస్ప్రీత్ బుమ్రా, అర్ష్దీప్ సింగ్, హర్షిత్ రాణా, ఇషాన్ కిషన్ (వికెట్ కీపర్), రింకూ సింగ్.చదవండి: WC 2026: ఒకప్పుడు విలన్.. ఈసారి హీరో అవుతాడా?.. ‘ఎక్స్ ఫ్యాక్టర్’ ఎవరంటే? -
గిల్ గాయపడితే ఇతడిని ఆడిస్తారా?: రవిశాస్త్రి ఫైర్
గత ఏడాది కాలంగా భారత టీ20 జట్టులో సంజూ శాంసన్ కీలక సభ్యుడిగా కొనసాగుతున్నాడు. అభిషేక్ శర్మకు సరైన ఓపెనింగ్ జోడీగా వచ్చి వరుస శతకాలతో అలరించాడు. కానీ ఆసియా టీ20 కప్-2025 సందర్భంగా వైస్ కెప్టెన్గా శుబ్మన్ గిల్ రీఎంట్రీ ఇవ్వడంతో సంజూ స్థానం గల్లంతైంది.గిల్ వరుస వైఫల్యాలుగిల్ను ఆడించే క్రమంలో సంజూను తొలుత మూడో స్థానంలో.. ఆ తర్వాత మిడిలార్డర్లో ఒకటీ రెండు మ్యాచ్లలో ఆడించి.. అనంతరం తుదిజట్టు నుంచే తప్పించింది యాజమాన్యం. మరోవైపు.. గిల్ (Shubman Gill) పునరాగమనంలో దారుణంగా విఫలమయ్యాడు. ఇప్పటి వరకు కనీసం ఒక్క హాఫ్ సెంచరీ కూడా చేయలేదు.సంజూ ధనాధన్సౌతాఫ్రికాతో టీ20 సిరీస్లో మూడు మ్యాచ్లలో కలిపి గిల్ కేవలం 33 పరుగులే చేశాడు. ఇందులో ఓ గోల్డెన్ డక్ కూడా ఉంది. ఇక పాదానికి గాయమైన కారణంగా గిల్ సౌతాఫ్రికా (IND vs SA)తో ఆఖరిదైన ఐదో టీ20కి దూరమయ్యాడు. దీంతో సంజూ (Sanju Samson)కు తుదిజట్టులో చోటు ఇచ్చిన మేనేజ్మెంట్ ప్రయోగాలకు వెళ్లకుండా ఈసారి అతడిని ఓపెనర్గానే పంపింది.వచ్చిన అవకాశాన్ని సంజూ సద్వినియోగం చేసుకున్నాడు. కేవలం 22 బంతుల్లోనే నాలుగు ఫోర్లు, రెండు సిక్సర్ల సాయంతో 37 పరుగులు సాధించాడు. అయితే, జార్జ్ లిండే అద్భుత బంతితో సంజూను బౌల్డ్ చేశాడు. కాగా గిల్ మూడు మ్యాచ్లలో కలిపి చేసిన పరుగుల కంటే కూడా సంజూ ఈ ఒక్క ఇన్నింగ్స్లో చేసిన పరుగులే ఎక్కువ కావడం గమనార్హం.గిల్ గాయపడితే ఇతడిని ఆడిస్తారా?ఈ నేపథ్యంలో టీమిండియా మాజీ హెడ్కోచ్ రవిశాస్త్రి మేనేజ్మెంట్ తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశాడు. కామెంట్రీలో భాగంగా మాట్లాడుతూ.. ‘‘తుదిజట్టులో అతడు అసలు ఎందుకు లేడు? ఇలాంటి ఆటగాడిని పక్కనపెడతారా? ఓ ఆటగాడు గాయపడితే అతడి స్థానంలో ఇతడిని ఆడిస్తారా?టాపార్డర్లో సంజూ సహజమైన శైలిలో ఆడగలడు. సౌతాఫ్రికా గడ్డ మీద టీ20 క్రికెట్లో వరుస సెంచరీలు బాదాడు. అతడొక విధ్వంసకర బ్యాటర్, డేంజరస్ ప్లేయర్. అద్భుతమైన షాట్లు ఆడటంలో దిట్ట. అయినా సరే అతడిని పక్కనపెడతారా?’’ అంటూ రవిశాస్త్రి యాజమాన్యం విధానాలను తప్పుబట్టాడు.కాగా అహ్మదాబాద్తో సౌతాఫ్రికాతో ఐదో టీ20 సందర్భంగా సంజూ శాంసన్ అంతర్జాతీయ పొట్టి ఫార్మాట్లో వెయ్యి పరుగులు పూర్తి చేసుకున్నాడు. ఈ ఘనత సాధించిన పద్నాలుగో భారత బ్యాటర్గా నిలిచాడు. ఓవరాల్గా టీ20 క్రికెట్లో 8 వేల పరుగుల మార్కును అందుకుని.. ఈ ఫీట్ నమోదు చేసిన ఏడో భారత బ్యాటర్గా అరుదైన జాబితాలో చోటు సంపాదించాడు. చదవండి: రోహిత్ శర్మ యూటర్న్!1000 T20I runs ✅8000 T20 runs ✅@IamSanjuSamson crosses some big milestones in splendid style! 🤩#INDvSA 5th T20I | LIVE NOW 👉 https://t.co/adG06ykx8o pic.twitter.com/F8O8ZAUz19— Star Sports (@StarSportsIndia) December 19, 2025 -
వరల్డ్కప్ జట్టు ప్రకటన నేడే.. అతడికి నో ఛాన్స్!
స్వదేశంలో జరిగే టీ20 వరల్డ్ కప్-2026లో పాల్గొనే భారత జట్టును శనివారం ఎంపిక చేయనున్నారు. అజిత్ అగార్కర్ నేతృత్వంలోని సెలక్షన్ కమిటీ 15 మంది సభ్యుల టీమ్ను ప్రకటించనుంది. ఈ మెగా టోర్నమెంట్కు ముందు న్యూజిలాండ్తో జరిగే ఐదు మ్యాచ్ల టీ20 సిరీస్లో కూడా వరల్డ్ కప్నకు ఎంపికయ్యే జట్టే ఆడుతుంది.కాగా ఫిబ్రవరి 7న మొదలయ్యే వరల్డ్ కప్లో భారత జట్టు డిఫెండింగ్ చాంపియన్గా బరిలోకి దిగుతోంది. టీ20 వరల్డ్ కప్-2024లో చాంపియన్గా నిలిచిన తర్వాతి నుంచి తాజాగా దక్షిణాఫ్రికాతో టీ20 సిరీస్ వరకు భారత జట్టు అద్భుత ప్రదర్శనను (35 మ్యాచ్లలో 26 విజయాలు) చూస్తే టీమ్ ఎంపికలో ఎలాంటి సంచలనాలు ఉండే అవకాశం లేదు.కెప్టెన్సీకి ఎలాంటి ఢోకా లేదుకెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ (Suryakumar Yadav) బ్యాటర్గా ఏడాదికి పైగా విఫలమవుతున్నా సరే... టోర్నీకి చాలా తక్కువ సమయం ఉన్న నేపథ్యంలో అతడి కెప్టెన్సీకి ఎలాంటి ఢోకా లేదు. విధ్వంసకర ఓపెనర్గా అదరగొడుతున్న అభిషేక్ శర్మకు.. వరుసగా విఫలమవుతున్నా సరే వైస్ కెప్టెన్ శుబ్మన్ గిల్నే జోడీగా కొనసాగించే అవకాశం ఉంది. ఇక రిజర్వు ఓపెనర్, వికెట్ కీపర్గా సంజూ శాంసన్ కూడా అందుబాటులో ఉన్నాడు కాబట్టి టాపార్డర్లో యశస్వి జైస్వాల్కు చోటు కష్టమే.రింకూ సింగ్కు మొండిచేయి!మరోవైపు.. ఆల్రౌండర్ కోటాలో వాషింగ్టన్ సుందర్కు స్థానం ఇస్తే.. నయా ఫినిషర్గా సత్తా చాటిన రింకూ సింగ్కు మొండిచేయి తప్పకపోవచ్చు. అతడి స్థానంలో వికెట్ కీపర్ బ్యాటర్ జితేశ్ శర్మ ఫినిషర్గా రాణిస్తున్నాడు. మరోవైపు.. జస్ప్రీత్ బుమ్రా నాయకత్వంలోని పేస్ దళంలో అర్ష్దీప్ సింగ్, హర్షిత్ రాణాలతో పాటు ఆల్రౌండర్లు హార్దిక్ పాండ్యా, శివం దూబే కూడా తమ వంతు సాయం అందించనున్నారు. టీ20 ప్రపంచకప్-2026 టోర్నీకి భారత జట్టు (అంచనా)అభిషేక్ శర్మ, శుబ్మన్ గిల్, సూర్యకుమార్ యాదవ్ (కెప్టెన్), తిలక్ వర్మ, సంజూ శాంసన్ (వికెట్ కీపర్), జితేశ్ శర్మ (వికెట్ కీపర్), హార్దిక్ పాండ్యా, శివం దూబే, అక్షర్ పటేల్, వాషింగ్టన్ సుందర్, వరుణ్ చక్రవర్తి, కుల్దీప్ యాదవ్, జస్ప్రీత్ బుమ్రా, అర్ష్దీప్ సింగ్, హర్షిత్ రాణా.చదవండి: విరాట్ కోహ్లి ఫ్యాన్స్కు శుభవార్త.. కెప్టెన్గా రిషభ్ పంత్ -
హార్దిక్ పాండ్యా ఫాస్టెస్ట్ ఫిఫ్టీ.. తిలక్ విధ్వంసం
సౌతాఫ్రికాతో ఐదో టీ20లో టీమిండియా స్టార్ హార్దిక్ పాండ్యా అదరగొట్టాడు. అహ్మదాబాద్ వేదికగా ఆకాశమే హద్దుగా చెలరేగుతూ ఫోర్లు, సిక్సర్ల వర్షం కురిపించాడు. ఈ క్రమంలో కేవలం పదహారు బంతుల్లోనే హార్దిక్ పాండ్యా అర్ధ శతకం పూర్తి చేసుకున్నాడు.ఫాస్టెస్ట్ ఫిఫ్టీతద్వారా అంతర్జాతీయ టీ20 ఫార్మాట్లో భారత్ తరఫున ఫాస్టెస్ట్ ఫిఫ్టీ సాధించిన రెండో ఆటగాడిగా హార్దిక్ పాండ్యా నిలిచాడు. ఈ క్రమంలో అభిషేక్ శర్మను అధిగమించి.. యువరాజ్ సింగ్ తర్వాతి స్థానాన్ని ఆక్రమించాడు. కాగా ఐదు మ్యాచ్ల టీ20 సిరీస్లో సౌతాఫ్రికాపై 2-1తో ఆధిక్యంలో ఉంది టీమిండియా.తిలక్ వర్మ విధ్వంసంఇక శుక్రవారం అహ్మదాబాద్లోనూ గెలిచి సిరీస్ను 3-1తో గెలుచుకోవాలనే సంకల్పంతో బరిలోకి దిగింది. నరేంద్ర మోదీ స్టేడియంలో టాస్ ఓడిన భారత్ తొలుత బ్యాటింగ్ చేసింది. ఓపెనర్లు సంజూ శాంసన్ (22 బంతుల్లో 37), అభిషేక్ శర్మ (21 బంతుల్లో 34) శుభారంభం అందించగా.. వన్డౌన్ బ్యాటర్ తిలక్ వర్మ విధ్వంసకర హాఫ్ సెంచరీతో దుమ్ములేపాడు..@TilakV9 is not holding back! Brings up a quick-fire half century! 💪#INDvSA 5th T20I | LIVE NOW 👉 https://t.co/adG06ykx8o pic.twitter.com/P4cz4TX7lc— Star Sports (@StarSportsIndia) December 19, 2025నాలుగో స్థానంలో వచ్చిన కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ (5) మరోసారి తీవ్రంగా నిరాశపరచగా.. అతడు అవుటైన తర్వాత క్రీజులోకి వచ్చిన హార్దిక్ పాండ్యా మెరుపులు మెరిపించాడు. వీలు చిక్కినప్పుడల్లా బంతిని బౌండరీకి, స్టాండ్స్లోకి తరలించి అభిమానులను ఉర్రూతలూగించాడు. నాలుగు ఫోర్లు, ఐదు సిక్స్లు బాది 16 బంతుల్లోనే యాభై పరుగుల మార్కు దాటేశాడు. అనూహ్య రీతిలోమొత్తంగా 25 బంతులు ఎదుర్కొన్న పాండ్యా.. 5 ఫోర్లు, 5 సిక్స్ల సాయంతో 63 పరుగులు సాధించాడు. అయితే, ఒట్నీల్ బార్ట్మన్ బౌలంగ్లో షాట్ ఆడే క్రమంలో రీజా హెండ్రిక్స్కు క్యాచ్ ఇచ్చి నాలుగో వికెట్గా వెనుదిరిగాడు. Watch out! The ball is being powered across the ground today. ⚡️@hardikpandya7 starts his innings with a maximum! 🙌#INDvSA 5th T20I | LIVE NOW 👉 https://t.co/adG06ykx8o pic.twitter.com/NjCNUJh71c— Star Sports (@StarSportsIndia) December 19, 2025ఇక తిలక్ వర్మ (42 బంతుల్లో 73) అనూహ్య రీతిలో పందొమ్మిదో ఓవర్ ఐదో బంతికి రనౌట్ కాగా.. శివం దూబే మూడు బంతుల్లో పది పరుగులతో అజేయంగా నిలిచాడు. ఫలితంగా నిర్ణీత 20 ఓవర్లలో ఐదు వికెట్ల నష్టానికి భారత్ 231 పరుగుల భారీ స్కోరు సాధించింది. సఫారీ బౌలర్లలో కార్బిన్ బాష్ రెండు వికెట్లు తీయగా.. జార్జ్ లిండే, ఒట్నీల్ బార్ట్మన్ తలా ఒక వికెట్ పడగొట్టారు.భారత్ తరఫున ఫాస్టెస్ట్ టీ20 ఫిఫ్టీలు నమోదు చేసింది వీరే🏏యువరాజ్ సింగ్- 2007 వరల్డ్కప్లో ఇంగ్లండ్ మీద 12 బంతుల్లో ఫిఫ్టీ🏏హార్దిక్ పాండ్యా- 2025లో సౌతాఫ్రికా మీద 16 బంతుల్లో ఫిఫ్టీ🏏అభిషేక్ శర్మ- 2025లో ఇంగ్లండ్ మీద 17 బంతుల్లో ఫిఫ్టీ🏏కేఎల్ రాహుల్- 2021లో స్కాట్లాండ్ మీద 18 బంతుల్లో ఫిఫ్టీ🏏సూర్యకుమార్ యాదవ్- 2022లో సౌతాఫ్రికా మీద 18 బంతుల్లో ఫిఫ్టీ.చదవండి: ఊహించని షాకిచ్చిన రోహిత్ శర్మ! -
గిల్కు గాయం.. అతడికి వరం! భారత తుది జట్టు ఇదే
అహ్మదాబాద్ వేదికగా శుక్రవారం దక్షిణాఫ్రికాతో ఐదో టీ20లో తలపడేందుకు భారత జట్టు సిద్దమవుతోంది. లక్నోలో జరగాల్సిన నాలుగో టీ20.. పొగమంచు కారణంగా రద్దు కావడంతో చివరిదైన ఐదో టీ20 టీమిండియాకు కీలకంగా మారింది.ఈ మ్యాచ్లో గెలిచి సిరీస్ను 3-1 తేడాతో సొంతం చేసుకోవాలని భారత్ పట్టుదలతో ఉంది. మరోవైపు సఫారీలు కూడా ఈ మ్యాచ్లో ఆతిథ్య జట్టును ఓడించి సిరీస్ను సమం చేయాలని భావిస్తున్నారు. అయితే ఈ నిర్ణయాత్మక పోరులో టీమిండియా కొన్ని కీలక మార్పులతో బరిలోకి దిగే అవకాశం ఉంది.సంజూకు లక్కీ ఛాన్స్!ఈ మ్యాచ్కు భారత వైస్ కెప్టెన్ శుభ్మన్ గిల్ గాయం కారణంగా దూరమయ్యాడు. నాలుగో టీ20కు ముందు ప్రాక్టీస్ చేస్తుండగా గిల్ పాదానికి గాయమైంది. దీంతో చివరి రెండు టీ20లకు అతడు దూరంగా ఉండనున్నట్లు బీసీసీఐ ఓ ప్రకటనలో పేర్కొంది.గిల్ గైర్హజరీలో స్టార్ వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ తిరిగి తుది జట్టులోకి వచ్చే అవకాశం ఉంది. అభిషేక్ శర్మతో కలిసి భారత ఇన్నింగ్స్ను సంజూ ప్రారంభించనున్నట్లు బీసీసీఐ వర్గాలు వెల్లడించాయి. ఈ సిరీస్లో ఇప్పటివరకు బెంచ్కే పరిమితమైన శాంసన్.. 2026 టీ20 వరల్డ్ కప్ నేపథ్యంలో తన ఫామ్ను నిరూపించుకోవడానికి ఇది మంచి అవకాశం.బుమ్రా రీఎంట్రీ!మరోవైపు ఈ కీలక మ్యాచ్కు స్టార్ పేసర్ జస్ప్రీత్ బూమ్రా అందుబాటులో ఉండవచ్చు. వ్యక్తిగత కారణాల వల్ల మూడో మ్యాచ్కు దూరమైన అతను.. నాలుగో మ్యాచ్ సందర్భంగా జట్టుతో కలిసి కనిపించాడు. కాబట్టి ఇప్పుడు ఐదో టీ20లో అతడు ఆడే సూచనలు కన్పిస్తున్నాయి.ఒకవేళ అతడు జట్టుతో కలిస్తే హర్షిత్ రాణా ప్లేయింగ్ ఎలెవన్లో ఉండకపోవచ్చు. అదేవిధంగా అక్షర్ పటేల్ స్ధానంలో ప్రధాన జట్టులోకి వచ్చిన ఆల్రౌండర్ షాబాజ్ అహ్మద్కు ప్లేయింగ్ ఎలెవన్లో చోటు దక్కకపోవచ్చు.భారత తుది జట్టు (అంచనా):అభిషేక్ శర్మ, సంజూ శాంసన్, సూర్యకుమార్ యాదవ్ (కెప్టెన్), తిలక్ వర్మ, హార్దిక్ పాండ్యా, శివమ్ దూబే, వాషింగ్టన్ సుందర్, అర్ష్దీప్ సింగ్, బుమ్రా/ హర్షిత్ రాణా, వరుణ్ చక్రవర్తి, కుల్దీప్ యాదవ్.చదవండి: IND vs SA: క్రికెట్ వర్సెస్ కాలుష్యం.. నిజంగా ఇది సిగ్గు చేటు! -
నాలుగో టీ20 నుంచి గిల్ అవుట్!
భారత్- దక్షిణాఫ్రికా మ్యాచ్కు పొగమంచు అంతరాయం కలిగించింది. ఫలితంగా ఇరుజట్ల మధ్య నాలుగో టీ20కి టాస్ ఆలస్యంగా పడనుంది. ఇదిలా ఉంటే.. ఈ మ్యాచ్కు టీమిండియా వైస్ కెప్టెన్ శుబ్మన్ గిల్ దూరమైనట్లు సమాచారం.పేలవ ప్రదర్శనకాగా ఆసియా టీ20 కప్-2025 టోర్నమెంట్ సందర్భంగా భారత టీ20 జట్టులో పునరాగమనం చేసిన గిల్.. నాటి నుంచి ఓపెనర్గా పేలవ ప్రదర్శనలతో తేలిపోతున్నాడు. అంతకు ముందు కూడా అంత గొప్పగా ఏమీ ఆడలేదు. గత ఇరవై ఇన్నింగ్స్లో అతడు సాధించిన స్కోర్లు వరుసగా.. 20(9), 10(7), 5(8), 47(28), 29(19), 4(3), 12(10), 37*(20), 5(10), 15(12), 46(40), 29(16), 4(2), 0(1).తాజాగా సౌతాఫ్రికాతో టీ20 సిరీస్లో తొలి రెండు మ్యాచ్లలో తీవ్రంగా నిరాశపరిచిన గిల్ (4(2), 0(1)).. చివరగా ధర్మశాలలో ఫర్వాలేదనిపించాడు. ఓపెనర్గా వచ్చి 28 బంతుల్లో 28 పరుగులు చేసి.. మార్కో యాన్సెన్ బౌలింగ్లో బౌల్డ్ అయ్యాడు. కాగా గిల్ కోసం.... విజయవంతమైన ఓపెనింగ్ జోడీగా కొనసాగుతున్న అభిషేక్ శర్మ- సంజూ శాంసన్లను యాజమాన్యం విడదీసింది.సంజూను పక్కనపెట్టేసి మరీ..అభిషేక్ను ఓపెనర్గా కొనసాగిస్తూ అతడికి గిల్ను జతచేసి.. సంజూను పక్కనపెట్టింది. ఈ నేపథ్యంలో గిల్ వరుస వైఫల్యాలు, అయినా అతడినే కొనసాగిస్తున్న మేనేజ్మెంట్ తీరుపై తీవ్ర స్థాయిలో విమర్శలు వెల్లువెత్తాయి. తాజాగా నాలుగో టీ20కి మాత్రం గిల్ దూరమైనట్లు క్రిక్బజ్ వెల్లడించింది. అయితే, పాదానికి గాయమైన కారణంగానే అతడు తప్పుకొన్నట్లు పేర్కొంది.కాగా స్వదేశంలో సౌతాఫ్రికాతో తొలి టెస్టు సందర్భంగా గాయపడ్డ గిల్.. రెండో టెస్టుతో పాటు మూడు వన్డేల సిరీస్కూ దూరమయ్యాడు. టీ20 సిరీస్తో రీఎంట్రీ ఇచ్చిన అతడు మరోసారి గాయపడటం గమనార్హం. ఇక టీమిండియా టెస్టు, వన్డేలకు గిల్ కెప్టెన్ కాగా.. టీ20లలో సూర్యకుమార్ యాదవ్ సారథ్యం వహిస్తున్న విషయం తెలిసిందే.చదవండి: నంబర్ 1: చరిత్ర సృష్టించిన వరుణ్ చక్రవర్తి -
సంజూ చేసిన తప్పు ఏంటి.. ఎందుకు బలి చేస్తున్నారు?: ఉతప్ప
ఈ ఏడాది ఆసియాకప్తో టీ20ల్లో రీఎంట్రీ ఇచ్చిన టీమిండియా స్టార్ శుభ్మన్ గిల్.. దారుణ ప్రదర్శన కనబరుస్తున్నాడు. టెస్టు, వన్డే ఫార్మాట్లలో రాణిస్తున్నప్పటికి టీ20ల్లో మాత్రం తన మార్క్ను చూపించలేకపోతున్నాడు. గిల్ తన చివరి పది మ్యాచ్లలో 181 పరుగులు మాత్రమే చేశాడు.అతడి స్ట్రైక్-రేట్ 140 కంటే తక్కువగా ఉంది. ప్రస్తుతం సౌతాఫ్రికాతో జరుగుతున్న టీ20 సిరీస్లోనూ అతడి పేలవ ఫామ్ కొనసాగుతోంది. తొలి టీ20లో కేవలం 5 పరుగులు మాత్రమే చేసిన గిల్.. రెండో టీ20ల్లో గోల్డెన్ డక్గా వెనుదిరిగాడు. దీంతో అతడిని జట్టు నుంచి తప్పించాలని చాలా మంది డిమాండ్ చేస్తున్నారు. ఎందుకంటే సూపర్ ఫామ్లో ఉన్న సంజూను కాదని మరి గిల్కు ఛాన్స్ ఇచ్చారు. గిల్ పునరాగమనం ముందువరకు టీ20ల్లో భారత్ ఓపెనింగ్ జోడీ అభిషేక్-సంజూ శాంసన్ ఉండేవారు. కానీ గిల్ రాకతో సంజూకు ప్లేయింగ్ ఎలెవన్లోనే చోటు లేకుండాపోయింది. అలా అని గిల్ రాణిస్తున్నాడా అంటే అది లేదు. ఈ నేపథ్యంలో టీమ్ మెనెజ్మెంట్పై భారత మాజీ కెప్టెన్ రాబిన్ ఊతప్ప ప్రశ్నల వర్షం కురిపించాడు.శాంసన్ చేసిన తప్పేంటి?"సంజూ శాంసన్ చేసిన తప్పు ఏంటి? ఎందుకు అతడికి అవకాశమివ్వడం లేదు? అభిషేక్ శర్మ, సంజూ శాంసన్ జోడీ టీ20ల్లో అద్భుతాలు చేశారు. అటువంటి ఓపెనింగ్ జోడీని బ్రేక్ చేయాల్సిన అవసరం ఏమి వచ్చింది. ఈ సిరీస్కు ముందు సూర్యకుమార్ మాట్లాడుతూ.. సంజూకు అవకాశం రాకముందే శుభ్మన్ టీ20 జట్టులో భాగంగా ఉన్నాడని చెప్పుకొచ్చాడు.ఆ విషయం నాకు కూడా తెలుసు. కానీ సంజూ అవకాశం వస్తే ఏమి చేశాడో మనందరికి తెలుసు. ఓపెనర్గా వచ్చి వరుసగా మూడు సెంచరీలు బాదాడు. ప్రస్తుత యువ క్రికెటర్లలో అందరికంటే ముందు సంజూనే చేశాడు. ఆ తర్వాత అభిషేక్, తిలక్ వర్మ సెంచరీలు సాధించారు. ఓపెనర్గా సంజూ తనను తాను నిరూపించుకున్నాడు. అభిషేక్ శర్మ సంజూనే విజయవంతమైన ఓపెనర్గా ఉన్నాడు. అయినప్పటికి అతడిని ఓపెనర్గా తప్పించారు. ఆ తర్వాత అతడిని మిడిల్ ఆర్డర్కు మార్చాలని నిర్ణయించుకున్నారు. ఆపై ఆపై నెమ్మదిగా జట్టు నుండి తొలగించారు. మరోసారి అడుగుతున్న అతడు చేసిన తప్పు ఏంటి? కచ్చితంగా ఓపెనింగ్ స్దానాన్ని అతడు అర్హుడు.ప్రస్తుతం శుభ్మన్ టీ20ల్లో రాణించలేకపోతున్నాడు. తన శైలికి విరుద్దంగా ప్రయత్నించి విఫలమవుతున్నాడు. మొదటిలో అభిషేక్తో పోటీపడానికి ప్రయత్నిస్తున్నాడని నేను భావిస్తున్నాను. తడు బ్యాటింగ్ చేసే విధానం ఇది కాదు. అతడు క్రీజులో సెటిల్ అయ్యేందుకు కాస్త సమయం తీసుకుంటాడు. 15 నుంచి 20 బంతులు ఆడిన తర్వాత అతడిని ఆపడం ఎవరి తరం కాదు. తానంతంట తానే ఔట్ అవ్వాలి. అలా ఆడితే గిల్కు టీ20కు సరిపోతుంది" అని ఉతప్ప స్టార్ స్పోర్ట్స్ షోలో పేర్కొన్నాడు. -
గంభీర్ సంచలన నిర్ణయం..? గిల్కు ఊహించని షాక్!
ధర్మశాల వేదికగా దక్షిణాఫ్రికా-భారత్ మధ్య మూడో టీ20 ఆదివారం జరగనుంది. ఈ మ్యాచ్లో ఎలాగైనా గెలిచి ముల్లాన్పూర్లో ఎదురైన ఘోర పరాభావానికి ప్రతీకారం తీర్చుకోవాలని టీమిండియా భావిస్తోంది. ఇప్పటికే ధర్మశాలకు చేరుకున్న భారత జట్టు శనివారం నెట్ ప్రాక్టీస్లో పాల్గోనుంది. ప్రస్తుతం ఐదు మ్యాచ్ల సిరీస్ 1-1 సమంగా ఉంది. సిరీస్ ఆధిక్యం పెంచుకునేందుకు మూడో టీ20ల్లో భారత్ తమ తుది జట్టులో కీలక మార్పులు చేయనున్నట్లు తెలుస్తోంది. తొలి రెండు టీ20ల్లో ఘోరంగా విఫలమైన వైస్ కెప్టెన్ శుభ్మన్ గిల్పై వేటు పడనున్నట్లు వార్తలు వస్తున్నాయి.సంజూకు చోటు!గిల్ స్దానంలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ తుది జట్టులోకి రానున్నట్లు పలు రిపోర్ట్లు పేర్కొంటున్నాయి. ఈ ఏడాది గిల్ టీ20 జట్టులోకి తిరిగి వచ్చేంతవరకు భారత ఇన్నింగ్స్ను అభిషేక్ శర్మ, శాంసన్లు ఆరంభించేవారు. ఓపెనర్గా సంజూ మూడు సెంచరీలు కూడా బాదాడు.అయితే గిల్ రీ ఎంట్రీతో శాంసన్ ఏకంగా జట్టులోనే చోటు కోల్పోయాడు. ప్రధాన జట్టులో ఉన్నప్పటికి చాలా మ్యాచ్లకు బెంచ్కే పరిమితమవుతున్నాడు. దీంతో హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్పై తీవ్ర స్ధాయిలో విమర్శలు వస్తున్నాయి. గిల్ కోసం సంజూను బలి చేస్తారా? అని మాజీలు సైతం మండిపడుతున్నారు. ఈ క్రమంలో శాంసన్ను మళ్లీ తుది జట్టులోకి తీసుకు రావాలని గంభీర్ నిర్ణయించినట్లు బీసీసీఐ వర్గాలు వెల్లడించాయి. అంతర్జాతీయ టీ20ల్లో గిల్ ప్రస్తుతం గడ్డు పరిస్థితులను ఎదుర్కొంటున్నాడు. ఈ ఏడాది గిల్ 14 ఇన్నింగ్స్లలో 23.90 సగటుతో కేవలం 263 పరుగులు మాత్రమే చేయగలిగాడు. దీంతో అతడిని టీ20ల నుంచి తప్పించాలని పెద్ద ఎత్తున డిమాండ్లు వస్తున్నాయి. మరి నిజంగానే గంభీర్.. మూడో టీ20 నుంచి గిల్ను తప్పిస్తాడా? అని తెలియాలంటే ఆదివారం వరకు వేచి ఉండాల్సిందే.మూడో టీ20 కోసం భారత తుది జట్టు(అంచనా)సంజూ శాంసన్, అభిషేక్ శర్మ, సూర్యకుమార్ యాదవ్ (కెప్టెన్), తిలక్ వర్మ, హార్దిక్ పాండ్యా, శివమ్ దూబే, అక్షర్ పటేల్, జితేష్ శర్మ (వికెట్ కీపర్), అర్ష్దీప్ సింగ్, వరుణ్ చక్రవర్తి, జస్ప్రీత్ బుమ్రాచదవండి: GOAT Tour India 2025: 70 అడుగుల విగ్రహం.. మెస్సీ తొలి రియాక్షన్ ఇదే! -
ఈసారి గోల్డెన్ డకౌట్.. అతడిని ఎందుకు బలి చేస్తున్నారు?
భారత టీ20 జట్టు ఓపెనర్గా శుబ్మన్ గిల్ మరోసారి విఫలమయ్యాడు. సౌతాఫ్రికాతో రెండో టీ20లో గోల్డెన్ డకౌట్గా వెనుదిరిగాడు. దీంతో గిల్తో పాటు టీమిండియా యాజమాన్యంపై మరోసారి తీవ్ర స్థాయిలో విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.సంజూకు ఓపెనర్గా మొండిచేయిఆసియా కప్-2025 టీ20 టోర్నీతో భారత టీ20 జట్టు వైస్ కెప్టెన్గా అంతర్జాతీయ పొట్టి ఫార్మాట్లో రీఎంట్రీ ఇచ్చాడు గిల్ (Shubman Gill). దీంతో అభిషేక్ శర్మ (Abhishek Sharma)కు విజయవంతమైన ఓపెనింగ్ జోడీగా కొనసాగుతున్న సంజూ శాంసన్ (Sanju Samson)ను మేనేజ్మెంట్ పక్కనపెట్టింది. వరుస మ్యాచ్లలో గిల్ విఫలమవుతున్నా.. భవిష్య కెప్టెన్ అనే ఒక్క కారణంతో అతడిని కొనసాగిస్తోంది.ఈసారి గోల్డెన్ డక్తాజాగా స్వదేశంలో టీ20 సిరీస్లోనూ సంజూకు ఓపెనర్గా మొండిచేయి చూపి.. యథావిధిగా గిల్కు పెద్దపీట వేసింది. అయితే, కటక్ వేదికగా తొలి టీ20లో రెండు బంతులు ఎదుర్కొని నాలుగు పరుగులకే నిష్క్రమించిన ఈ కుడిచేతి వాటం బ్యాటర్.. తాజాగా గురువారం నాటి మ్యాచ్లో ముల్లన్పూర్లో గోల్డెన్ డకౌట్ అయ్యాడు.వరుసగా వైఫల్యాలుసఫారీలు విధించిన 214 పరుగుల భారీ లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో తొలి ఓవర్లోనే గిల్ మొదటి వికెట్గా వెనుదిరిగాడు. లుంగి ఎంగిడి బౌలింగ్లో ఐదో బంతికి రీజా హెండ్రిక్స్కు క్యాచ్ ఇచ్చి పెవిలియన్ చేరాడు. ఇక టీమిండియా తరఫున గత ఇరవై ఇన్నింగ్స్లో గిల్ సాధించిన స్కోర్లు వరుసగా.. 20(9), 10(7), 5(8), 47(28), 29(19), 4(3), 12(10), 37*(20), 5(10), 15(12), 46(40), 29(16), 4(2), 0(1).ఈ స్థాయిలో గిల్ విఫలమవుతున్నా.. హెడ్కోచ్ గౌతం గంభీర్, మేనేజ్మెంట్ మాత్రం అతడికి వరుస అవకాశాలు ఇవ్వడం పట్ల విమర్శలు వస్తున్నాయి. ముఖ్యంగా ఓపెనర్గా గిల్ను ఆడించేందుకు సంజూను బలిచేయడాన్ని మాజీ క్రికెటర్లు సైతం ప్రశ్నిస్తున్నారు. సంజూను ఎందుకు బలి చేస్తున్నారు?టెస్టు, వన్డే జట్ల కెప్టెన్గా, బ్యాటర్గా మెరుగ్గా ఆడుతున్న గిల్ను రెండు ఫార్మాట్లకే పరిమితం చేయాలని.. టీ20లలో సంజూకు అవకాశం ఇవ్వాలని సూచిస్తున్నారు. టీ20 ప్రపంచకప్-2026 నాటికి తప్పు సరిదిద్దుకోకపోతే భారీ మూల్యమే చెల్లించాల్సి ఉంటుందని హెచ్చరిస్తున్నారు. మరోవైపు.. గిల్ కోసం సంజూను ఎందుకు బలి చేస్తున్నారని అతడి అభిమానులు మండిపడుతున్నారు.ఇదిలా ఉంటే.. ముల్లన్పూర్ మ్యాచ్లో టీమిండియా పవర్ ప్లేలో ఏకంగా మూడు వికెట్లు కోల్పోయి 51 పరుగులే చేసింది. గిల్తో పాటు.. అభిషేక్ శర్మ (17), కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ (5) విఫలమయ్యారు. అన్నట్లు ఈ మ్యాచ్లో టీమిండియా మరో ప్రయోగం చేసింది. వన్డౌన్లో ఆల్రౌండర్ అక్షర్ పటేల్ను పంపింది.చదవండి: విరాట్ కోహ్లి సంచలన నిర్ణయం! -
దక్షిణాఫ్రికాతో రెండో టీ20.. శాంసన్కు మరోసారి నో ఛాన్స్!
ముల్లాన్పూర్ వేదికగా సౌతాఫ్రికాతో రెండో టీ20లో తలపడేందుకు టీమిండియా సిద్దమైంది. ఈమ్యాచ్లో కూడా గెలిచి సిరీస్ ఆధిక్యాన్ని పెంచుకోవాలని భారత్ భావిస్తోంది. అయితే కటక్లో ఆడిన జట్టునే రెండో టీ20కు కూడా భారత్ కొనసాగించే అవకాశముంది.స్టార్ వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ మరోసారి బెంచ్కే పరిమితం కానున్నట్లు తెలుస్తోంది. తొలి టీ20లో ఆడిన జితీశ్ శర్మను వికెట్ కీపర్గా కొనసాగించాలని టీమ్ మెనెజ్మెంట్ నిర్ణయించినట్లు సమాచారం. కటక్ టీ20లో ఆఖరిలో బ్యాటింగ్కు వచ్చిన జితీశ్.. కేవలం 5 బంతుల్లో పది పరుగులు చేశాడు. అతడిని ఫినిషర్గా ఉపయోగించుకోవాలని హెడ్ కోచ్గా గౌతమ్ గంభీర్ భావిస్తున్నట్లు పలు రిపోర్ట్లు పేర్కొంటున్నాయి. ఒకవేళ టాపర్డర్లో ఎవరికైనా విశ్రాంతి ఇవ్వాలని భావిస్తే తప్ప సంజూకు తుది జట్టులో చోటు దక్కడం కష్టం. ఇక తొలి టీ20లో విఫలమైన కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్, వైస్ కెప్టెన్ శుభ్మన్ గిల్.. ఈ మ్యాచ్లో రాణించాల్సిన అవసరముంది. సూర్య గత కొంతకాలంగా మెరుగైన ప్రదర్శన చేయలేకపోతున్నాడు. టీ20 వరల్డ్కప్-2026కు ముందు అతడి ఫామ్ టీమ్ మెనెజ్మెంట్ను కలవరపెడుతోంది. కనీసం ఈ సిరీస్లో నైనా సూర్య తన రిథమ్ను తిరిగి అందుకోవాలని ఆశిస్తున్నారు. ఇక తొలి టీ20లో ఘోర ఓటమి చవిచూసిన పలు మార్పులు చేసే అవకాశముంది.తుది జట్లు(అంచనా)భారత్: అభిషేక్ శర్మ, శుభ్మన్ గిల్ (వైస్ కెప్టెన్), సూర్యకుమార్ యాదవ్ (కెప్టెన్), తిలక్ వర్మ, హార్దిక్ పాండ్యా, జితేశ్ శర్మ (వికెట్ కీపర్), అక్షర్ పటేల్, కుల్దీప్ యాదవ్, జస్ప్రీత్ బుమ్రా, అర్ష్దీప్ సింగ్, వరుణ్ చక్రవర్తి.దక్షిణాఫ్రికా: క్వింటన్ డి కాక్ (వికెట్ కీపర్), ఐడెన్ మార్క్రామ్ (కెప్టెన్), ట్రిస్టన్ స్టబ్స్, డెవాల్డ్ బ్రెవిస్, డేవిడ్ మిల్లర్, డొనోవన్ ఫెరీరా, మార్కో జాన్సెన్, ఎన్రిచ్ నోర్ట్జే, లుంగి ఎన్గిడి, కేశవ్ మహారాజ్/జార్జ్ లిండే, లుథో సిపమ్లా. -
సంజూ శాంసన్ పెద్దన్న లాంటోడు.. సై అంటే సై!
సంజూ శాంసన్.. భారత క్రికెట్ వర్గాల్లో ప్రస్తుతం ఈ పేరు మీదే చర్చ నడుస్తోంది. టీమిండియా టీ20 ఓపెనర్గా శుబ్మన్ గిల్ తిరిగి రావడంతో సంజూ స్థానం గల్లంతైంది. ఒకవేళ తుదిజట్టులో ఈ వికెట్ కీపర్ బ్యాటర్కు చోటు దక్కినా.. వన్డౌన్లో... ఐదో స్థానంలో బ్యాటింగ్కు పంపి యాజమాన్యం చేసిన ప్రయోగాలు బెడిసికొట్టాయి.ఫలితంగా.. వికెట్ కీపర్ కోటాలో సంజూ శాంసన్ స్థానాన్ని జితేశ్ శర్మ(Jitesh Sharma) భర్తీ చేశాడు. లోయర్ ఆర్డర్లో ఫినిషర్గానూ రాణించడం అతడికి అదనపు ప్రయోజనంగా మారింది. కాబట్టే సంజూ కంటే జితేశ్ వైపే తాము మొగ్గుచూపుతున్నట్లు టీమిండియా నాయకత్వ బృందం సంకేతాలు ఇచ్చింది కూడా!వికెట్ కీపర్గా జితేశ్కే పెద్ద పీటఇక సౌతాఫ్రికాతో తొలి టీ20లోనూ సంజూ (Sanju Samson)ను కాదని జితేశ్ను ఆడించింది యాజమాన్యం. ఈ నేపథ్యంలో టీ20 ప్రపంచకప్-2026 టోర్నీలో టీమిండియా వికెట్ కీపర్గా జితేశ్కే పెద్ద పీట వేస్తారనే ప్రచారం ఊపందుకుంది. ఈ విషయంపై జితేశ్ శర్మ స్పందించాడు.నాకు పెద్దన్న లాంటివాడు‘‘నిజం చెప్పాలంటే.. సంజూ నాకు పెద్దన్న లాంటివాడు. ఆరోగ్యకరమైన పోటీ ఉంటేనే మనలోని అత్యుత్తమ ప్రతిభ బయటకు వస్తుంది. జట్టుకు కూడా అదే మంచిది. భారత్లో టాలెంట్కు కొదవలేదు. అది అందరికీ తెలిసిన విషయమే.సంజూ భయ్యా గొప్ప ప్లేయర్. ఆయనతో నేను పోటీ పడాల్సి ఉంటుంది. అప్పుడే నా అత్యుత్తమ ప్రదర్శన ఇవ్వగలుగుతాను. మేము ఇద్దరం టీమిండియాకు ఆడాలనే కోరుకుంటాం. మేము సోదరుల లాంటి వాళ్లం. మా అనుభవాలను పరస్పరం పంచుకుంటాం.టీమిండియాలో స్థానం కోసం సై అంటే సై!అతడు నాకు చాలా సాయం చేశాడు. సలహాలు ఇస్తాడు. ఒకవేళ అతడితోనే నాకు పోటీ అంటే.. బెస్ట్ ఇచ్చి ఢీకొట్టడానికి ఎల్లప్పుడూ సిద్ధంగానే ఉంటాను’’ అని 32 ఏళ్ల జితేశ్ శర్మ.. 31 ఏళ్ల సంజూ గురించి చెప్పుకొచ్చాడు. 𝙄. 𝘾. 𝙔. 𝙈. 𝙄6⃣, 4⃣, 6⃣Hardik Pandya 🤝 Jitesh Sharma Updates ▶️ https://t.co/tiemfwcNPh#TeamIndia | #INDvSA | @hardikpandya7 | @jiteshsharma_ | @IDFCFIRSTBank pic.twitter.com/806L1KmQac— BCCI (@BCCI) December 9, 2025భారత్ ఘన విజయంకాగా కటక్ వేదికగా మంగళవారం తొలి టీ20లో టీమిండియా సౌతాఫ్రికాను 101 పరుగులతో చిత్తుగా ఓడించింది. ఈ మ్యాచ్లో జితేశ్ ఎనిమిదో స్థానంలో వచ్చి 5 బంతుల్లో 10 పరుగులతో అజేయంగా నిలిచాడు. అంతేకాదు నాలుగు డిస్మిసల్స్లో భాగమై కీపర్గానూ సత్తా చాటాడు.మరోవైపు.. ఓపెనర్ గిల్ (4) విఫలమయ్యాడు. కాగా ఆల్రౌండర్ హార్దిక్ పాండ్యా మెరుపు హాఫ్ సెంచరీ (28 బంతుల్లో 59 నాటౌట్)కి తోడు.. బౌలర్లు రాణించడంతో టీమిండియాకు విజయం సాధ్యమైంది. ఫలితంగా ఐదు మ్యాచ్ల సిరీస్లో భారత్ 1-0తో ముందంజ వేసింది. చదవండి: అతడొక అద్భుతం.. ఆ ముగ్గురూ సూపర్.. నమ్మశక్యంగా లేదు: సూర్యకుమార్Total dominance from Team India! 💥🇮🇳#SouthAfrica suffer their lowest T20I score as #India storm to a 101-run win their 3rd highest margin of victory against SA to go 1–0 up in the series! 💪#INDvSA 👉 2nd T20I 👉 11th DEC, 6 PM onwards pic.twitter.com/uwoZvWJa6Y— Star Sports (@StarSportsIndia) December 9, 2025 -
‘నిన్ను తప్పిస్తారన్న ఆలోచనే ఉండదు.. కానీ ఇక్కడ అలా కాదు’
టీమిండియా స్టార్ శుబ్మన్ గిల్ ఓపెనింగ్ బ్యాటర్గా మరోసారి విఫలమయ్యాడు. సౌతాఫ్రికాతో తొలి టీ20లో అతడు తీవ్రంగా నిరాశపరిచాడు. రెండు బంతులు ఎదుర్కొని కేవలం నాలుగు పరుగులే చేసి నిష్క్రమించాడు. సఫారీ పేసర్ లుంగి ఎంగిడి బౌలింగ్లో మార్కో యాన్సెన్కు క్యాచ్ ఇచ్చి పెవిలియన్ చేరాడు.ఈ నేపథ్యంలో గిల్ ఆట తీరుపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. టీ20లలో ఓపెనర్గా గిల్ కంటే మెరుగైన రికార్డు ఉన్నా.. సంజూ శాంసన్ (Sanju Samson)ను కావాలనే బలి చేస్తున్నారనే ఆరోపణలు మరోసారి తెరమీదకు వచ్చాయి. ఈ పరిణామాల నేపథ్యంలో సౌతాఫ్రికా మాజీ ఆల్రౌండర్ షాన్ పొలాక్ గిల్ (Shubman Gill)ను ఉద్దేశించి కీలక వ్యాఖ్యలు చేశాడు.నిన్ను తప్పిస్తారన్న ఊహే ఉండదుక్రిక్బజ్ షోలో మాట్లాడుతూ.. ‘‘ఐపీఎల్లో ఇలాంటి వాళ్లు ఎలా ఆడుతున్నారో మనం చూస్తూనే ఉన్నాం. నిజానికి అక్కడ.. జట్టులో ప్రధాన ఆటగాడు అతడే. అతడిని జట్టు నుంచి తప్పిస్తారన్న ఊహ కూడా ఉండదు. కాబట్టి ఒత్తిడీ తక్కువే.కానీ ఇక్కడ అలా కాదుకానీ టీమిండియాకు వచ్చే సరికి కథ మారుతుంది. ఇక్కడ జట్టులో స్థానం కోసం పోటీ ఉంటుంది. కాబట్టి బ్యాటర్ మైండ్సెట్ మారిపోతుంది. కాస్త ఒత్తిడి కూడా పెరుగుతుంది. బాగా ఆడకుంటే జట్టులో స్థానం గల్లంతు అవుతుందనే ఆందోళన ఉంటుంది.కనీసం ఒక్క హాఫ్ సెంచరీఅయితే, శుబ్మన్ గిల్ విషయం మాత్రం ఇందుకు భిన్నం. అతడిపై భారీ అంచనాలు ఉన్నాయి. అంతర్జాతీయ టీ20లలో మెరుగైన స్కోరు సాధించకపోవడం అతడిని నిరాశపరిచి ఉండవచ్చు. ప్రతి మూడు- నాలుగు మ్యాచ్లలో అతడు కనీసం ఒక్క హాఫ్ సెంచరీ అయినా చేయాలి.లేదంటే విమర్శలు తప్పవు. ఐపీఎల్లో మాదిరి ఇక్కడా ఉంటుంది అనుకోవడం పొరపాటు. వరుసగా విఫలమైతే ఇక్కడ మళ్లీ ఆడే అవకాశం రాకపోవచ్చు’’ అని షాన్ పొలాక్ చెప్పుకొచ్చాడు. వరుస మ్యాచ్లలో ఫెయిలైనాకాగా టీమిండియా టెస్టు, వన్డే సారథి అయిన గిల్ను.. టీ20లలోనూ కెప్టెన్గా చేయాలని మేనేజ్మెంట్ భావిస్తోంది. అందుకే వరుస మ్యాచ్లలో ఫెయిలైనా అవకాశాలు ఇస్తూనే ఉంది. అయితే, ఇందుకోసం సంజూ బలికావడం గమనార్హం. ఇదిలా ఉంటే.. సౌతాఫ్రికాతో కటక్ వేదికగా తొలి టీ20 మ్యాచ్లో భారత్ 101 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది.భారత్ వర్సెస్ సౌతాఫ్రికా తొలి టీ20 స్కోర్లు👉వేదిక: బారాబతి స్టేడియం, కటక్, ఒడిశా.👉టాస్: సౌతాఫ్రికా.. తొలుత బౌలింగ్👉భారత్ స్కోరు: 175/6(20)👉సౌతాఫ్రికా స్కోరు: 74(12.3)👉 ఫలితం: 101 పరుగుల తేడాతో సఫారీ జట్టుపై భారత్ గెలుపు👉ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్: హార్దిక్ పాండ్యా (28 బంతుల్లో 59 నాటౌట్, ఒక వికెట్).చదవండి: విరిగిన చెయ్యితోనే బ్యాటింగ్.. అతడి వల్లే టీమిండియా సెలక్ట్ అయ్యాను: సచిన్ -
ఒక్కో ఫార్మాట్కు ఒక్కొక్కరిని బలి తీసుకుంటున్న "పెద్ద తలకాయ"..!
భారత పురుషుల క్రికెట్కు సంబంధించిన ఓ పెద్ద తలకాయ ఒక్కో ఫార్మాట్లో ఒక్కో ఆటగాడిని బలి తీసుకుంటున్నాడు. బీసీసీఐ అండదండలు పూర్తిగా ఉన్న ఆ పెద్ద తలకాయ టీమిండియాలో చెప్పిందే వేదం. భారత జట్టులో అతనేమనుకుంటే అది జరిగి తీరాల్సిందే. అతడి అండదండలుంటే ఏ స్థాయి క్రికెట్ ఆడకపోయినా నేరుగా భారత తుది జట్టులోకి వస్తారు. అతడి ఆశీస్సులుంటే సాధారణ ఆటగాడు కూడా కెప్టెన్ అయిపోతాడు. భారత పురుషుల క్రికెట్ను శాశించే ఆ శక్తికి మరో పెద్ద తలకాయ మద్దతు కూడా ఉంది. వీరిద్దరూ తలచుకుంటే అనర్హులను అందలమెక్కిస్తారు. అర్హుల కెరీర్లను అర్దంతరంగా ముగిస్తారు. వీరి ఆగడాలకు అడ్డూ అదుపూ లేకుండా పోతుంది. ప్రశ్నించే వారిపై ఎదురుదాడి చేస్తారు. వారు చేసే ప్రతి పనికి వారి వద్ద ఓ సమర్దన స్క్రిప్ట్ ఉంటుంది. వారి జోలికి వెళ్లాలంటే మాజీలు, మాజీ బీసీసీఐ బాస్లు కూడా హడలిపోతారు. అంతలా వారు చెలరేగిపోతున్నారు.వీరి ప్రస్తావన మరోసారి ఎందుకు వచ్చిందంటే.. భారత్-సౌతాఫ్రికా మధ్య ఇవాల్టి నుంచి (డిసెంబర్ 9) ఐదు మ్యాచ్ల టీ20 సిరీస్ ప్రారంభమైంది. కటక్ వేదికగా జరుగుతున్న తొలి మ్యాచ్లో అందరూ ఊహించిన విధంగానే శుభ్మన్ గిల్ ఓపెనర్గా రీఎంట్రీ ఇచ్చాడు. సౌతాఫ్రికాతోనే టెస్ట్ సిరీస్ సందర్భంగా గాయపడిన గిల్.. గాయం నుంచి కోలుకోగానే నేరుగా తుది జట్టులో చోటు సంపాదించాడు.వాస్తవానికి గిల్ స్థానం సంజూ శాంసన్ది. సంజూ గత కొంతకాలంగా ఓపెనర్గా అద్భుతంగా రాణిస్తున్నాడు. గత సౌతాఫ్రికా సిరీస్లోనూ వరుస సెంచరీలతో విరుచుకుపడ్డాడు. అయితే గిల్ కోసం పైన చెప్పుకున్న పెద్ద తలకాయలు సంజూ కెరీర్ను బలి చేస్తున్నారు. నేరుగా మెడపై కత్తి పెట్టకుండా తొలుత స్థానచలనం చేసి గేమ్ను మొదలుపెట్టారు. ఆతర్వాత ప్రణాళిక ప్రకారం జట్టులో స్థానాన్నే గల్లంతు చేస్తున్నారు.ఇటీవలి ఆస్ట్రేలియా పర్యటనలో ఈ ప్రక్రియ మొదలైంది. రెండో టీ20 తర్వాత సంజూకు అవకాశమే ఇవ్వలేదు. ప్రస్తుతం సౌతాఫ్రికాతో జరుగుతున్న తొలి టీ20లోనూ అదే కొనసాగింది. సంజూను శాశ్వతంగా జట్టు నుంచి తప్పించే ప్రయత్నం జరుగుతుందని ఎవరికైనా ఇట్టే అర్దమవుతుంది. ఓ దశలో సదరు పెద్ద తలకాయల్లో మొదటివాడు సంజూ కెరీర్కు పూర్తి భరోసా ఇచ్చినట్లు నటించాడు. 21 సార్లు డకౌటైనా తుది జట్టులో ఉంటావని నమ్మించాడు.తీరా చూస్తే.. తన అనూనయుడికి అవకాశం ఇవ్వడం కోసం సంజూ కెరీర్నే బలి చేస్తున్నాడు. సదరు పెద్ద తలకాయకు తనకు సరిపోని ఆటగాళ్ల కెరీర్లతో ఆటాడుకోవడం కొత్తేమీ కాదు. దిగ్గజాలైన విరాట్ కోహ్లి, రోహిత్ శర్మలతోనే మైండ్ గేమ్ ఆడాడు. వారంతట వారే టెస్ట్, టీ20 కెరీర్లను అర్దంతరంగా ముగించుకునేలా చేశాడు. టీ20ల్లో గిల్ కోసం సంజూ కెరీర్ను పణంగా పెట్టిన ఆ పెద్ద తలకాయ.. మరో అనర్హమైన బౌలర్ కోసం షమీ లాంటి వరల్డ్ క్లాస్ బౌలర్ కెరీర్ను అంపశయ్యపై పెట్టాడు. ఇకనైనా ఈ పెద్ద తలకాయ విషయంలో బీసీసీఐ జోక్యం చేసుకోకపోతే అంతర్జాతీయ వేదికపై భారత క్రికెట్ గౌరవం పోతుంది. -
సంజూకు సరిపడా ఛాన్సులు.. ఇకపై: సూర్యకుమార్
టీ20 ప్రపంచకప్-2024 తర్వాత సంజూ శాంసన్కు వరుస అవకాశాలు వచ్చాయి. అభిషేక్ శర్మతో కలిసి టీమిండియా టీ20 ఓపెనర్గా ఈ కేరళ బ్యాటర్ అదరగొట్టాడు. వికెట్ కీపర్గా సేవలు అందిస్తూ.. టాపార్డర్లో రాణించాడు. ఈ క్రమంలో మూడు శతకాలు బాది జట్టులో తన స్థానం సుస్థిరం చేసుకునే దిశగా అడుగులు వేశాడు.విఫలమైనా.. అయితే, ఆసియా టీ20 కప్-2025 టోర్నీతో వైస్ కెప్టెన్గా శుబ్మన్ గిల్ (Shubman Gill) తిరిగి రావడంతో.. సంజూ భవిష్యత్తు ఆగమ్యగోచరంగా మారింది. అభిషేక్కు జోడీగా వస్తున్న గిల్ చాలాసార్లు విఫలమైనా.. యాజమాన్యం మాత్రం అతడికే మద్దతుగా నిలుస్తోంది. భవిష్య కెప్టెన్గా అతడికి పెద్ద పీట వేస్తూ ఒక్కోసారి భారీ మూల్యమే చెల్లిస్తోంది.మరోవైపు.. గిల్ రాకతో సంజూ (Sanju Samson)కు తుదిజట్టులో చోటు కష్టమైపోయింది. ఒకవేళ ప్లేయింగ్ ఎలెవన్లో స్థానం దక్కినా.. బ్యాటింగ్ ఆర్డర్లో ఎప్పుడు రావాలో తెలియని పరిస్థితి. ఓసారి వన్డౌన్లో.. మరోసారి ఐదో స్థానంలో మేనేజ్మెంట్ అతడిని బ్యాటింగ్కు పంపిస్తోంది.సంజూపై వేటు వేసి.. జితేశ్కు చోటుఇక ఇటీవల ఆస్ట్రేలియా పర్యటనలో భాగంగా ఆఖరిగా ఐదో స్థానంలో వచ్చి విఫలమైన సంజూ (4 బంతుల్లో 2)ను.. ఆ తర్వాత మేనేజ్మెంట్ తప్పించింది. ఐదు మ్యాచ్ల సిరీస్లో భాగంగా ఒకే ఒక్క మ్యాచ్ ఆడిన తర్వాత సంజూపై వేటు వేసి.. వికెట్ కీపర్ కోటాలో జితేశ్ శర్మను ఆడించింది.ఈ క్రమంలో తాజాగా సౌతాఫ్రికాతో స్వదేశంలో జరిగే టీ20 సిరీస్లోనూ సంజూకు మొండిచేయి చూపిస్తారనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఇందుకు కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ వ్యాఖ్యలు కూడా బలం చేకూరుస్తున్నాయి. సంజూ కంటే తమకు గిల్ ఎక్కువని సూర్య చెప్పకనే చెప్పాడు.గిల్కే పెద్దపీట వేస్తామన్న సూర్యసౌతాఫ్రికాతో కటక్ వేదికగా తొలి టీ20కి ముందు మీడియాతో మాట్లాడుతూ.. ‘‘సంజూ టాపార్డర్లో రాణిస్తాడు. అయితే, జట్టులో ఓపెనర్లు కాకుండా మిగిలిన ప్రతి ఒక్క ఆటగాడు ఏ స్థానంలో బ్యాటింగ్ చేసేందుకైనా సిద్ధంగా ఉండాలి.నిజానికి సంజూ ఓపెనర్గా అదరగొట్టాడు. మంచి ఇన్నింగ్స్ ఆడాడు. కానీ గతేడాది శ్రీలంక పర్యటనలో గిల్ ఓపెనర్గా ఉన్నాడు. సంజూ కంటే ముందు అతడే జట్టుతో ఉన్నాడు. కాబట్టి గిల్ తన స్థానంలోకి తిరిగి వచ్చేందుకు వందశాతం అర్హుడు.కావాల్సినన్ని అవకాశాలు ఇచ్చాముసంజూకు మేము కావాల్సినన్ని అవకాశాలు ఇచ్చాము. అతడు కూడా ఏ స్థానంలో బ్యాటింగ్ చేసేందుకైనా సిద్ధంగా ఉన్నాడు. జట్టుకు అదొక సానుకూలాంశం. మూడు- ఆరు వరకు ఏ స్థానంలో ఆడేందుకైనా మా ఆటగాళ్లు సిద్ధంగా ఉంటారు.టాపార్డర్లో ఆడుతూనే.. అవసరం వచ్చినపుడు మిడిల్ ఆర్డర్లోనూ రాణించగల ఆటగాళ్లు ఉండటం మా జట్టుకు అదృష్టం లాంటిదే. తుదిజట్టులో స్థానం ఇంత మంది ఆటగాళ్లు పోటీపడటం.. సెలక్షన్ విషయంలో మాకు ఇలాంటి తలనొప్పి ఉండటం ఎంతో బాగుంటుంది. వరల్డ్కప్ ఆశలు ఆవిరేనా?మా జట్టుకు ఉన్న వైవిధ్యమైన ఆప్షన్లను ఇది సూచిస్తుంది’’ అని సూర్యకుమార్ యాదవ్ చెప్పుకొచ్చాడు. టీ20 ప్రపంచకప్-2026 టోర్నీకి సమయం ఆసన్నమవుతున్న వేళ ప్రయోగాల పేరిట సంజూను పక్కనపెట్టడం చూస్తుంటే.. ఈసారి కూడా అతడికి వరల్డ్కప్లో ఆడే అవకాశం ఇవ్వరనే అనిపిస్తోంది. చదవండి: వాళ్లిద్దరికి మొండిచేయి!.. తొలి టీ20కి భారత తుదిజట్టు ఇదే! -
వాళ్లిద్దరికి మొండిచేయి!.. తొలి టీ20కి భారత తుదిజట్టు ఇదే!
భారత్- సౌతాఫ్రికా మధ్య మంగళవారం కటక్ వేదికగా తొలి టీ20 నిర్వహణకు షెడ్యూల్ ఖరారైంది. ఈ మ్యాచ్తో టీమిండియా స్టార్లు శుబ్మన్ గిల్, హార్దిక్ పాండ్యా పునరాగమనం చేయనున్నారు.టెస్టు సారథి గిల్ (Shubman Gill) మెడ నొప్పి కారణంగా సఫారీలతో రెండో టెస్టు, వన్డే సిరీస్ మొత్తానికి దూరమైన విషయం తెలిసిందే. ఈ క్రమంలో కోలుకుని పూర్తిస్థాయిలో ఫిట్నెస్ సాధించిన గిల్.. నేరుగా తుదిజట్టులోకి రీఎంట్రీ ఇవ్వనున్నాడు.మరోవైపు.. ఆసియా కప్-2025 టోర్నీ సందర్భంగా గాయపడిన ఆల్రౌండర్ హార్దిక్ పాండ్యా (Hardik Pandya)చాన్నాళ్ల తర్వాత మళ్లీ మైదానంలో అడుగుపెట్టనున్నాడు. జితేశ్ శర్మకే ప్రాధాన్యంఈ నేపథ్యంలో భారత తుదిజట్టు కూర్పుపై టీమిండియా మాజీ ఆల్రౌండర్ ఇర్ఫాన్ పఠాన్ (Irfan Pathan) తన అభిప్రాయాలు పంచుకున్నాడు. గిల్ రాకతో సంజూ శాంసన్పై వేటు తప్పదన్న పఠాన్.. వికెట్ కీపర్గా జితేశ్ శర్మకే తొలి ప్రాధాన్యం దక్కుతుందని పేర్కొన్నాడు.శివం దూబేకు నో ఛాన్స్అదే విధంగా.. హార్దిక్ వల్ల ఓ ఆల్రౌండర్కు మొండిచేయి తప్పదని ఇర్ఫాన్ పఠాన్ అభిప్రాయపడ్డాడు. ఇక ఓపెనింగ్ జోడీగా అభిషేక్ శర్మ- శుబ్మన్ గిల్ ఉంటారన్న అతడు.. స్పిన్నర్ల కోటాలో కుల్దీప్ యాదవ్తో పాటు.. వరుణ్ చక్రవర్తి ప్లేయింగ్ ఎలెవన్లో ఉంటాడని పేర్కొన్నాడు. ఆల్రౌండర్ల విభాగంలో హార్దిక్ పాండ్యాతో పాటు అక్షర్ పటేల్ తుదిజట్టులో ఉంటాడన్న ఇర్ఫాన్ పఠాన్.. శివం దూబేకు ఛాన్స్ ఉండదని అభిప్రాయపడ్డాడు.ఇర్ఫాన్ ఓటు అర్ష్కేఇక పేసర్ల కోటాలో నాయకుడు జస్ప్రీత్ బుమ్రాతో పాటు అర్ష్దీప్ సింగ్కు చోటు దక్కుతుందని ఇర్ఫాన్ పఠాన్ పేర్కొన్నాడు. అయితే, గత కొంతకాలంగా యువ పేసర్ హర్షిత్ రాణా కూడా మెరుగ్గా రాణిస్తున్నాడని.. అతడికి గనుక మేనేజ్మెంట్ అవకాశం ఇవ్వాలని భావిస్తే అర్ష్పైనే వేటు పడుతుందని అంచనా వేశాడు.ఎనిమిదో స్థానంలో బ్యాటింగ్ చేయగలనని హర్షిత్ ఆస్ట్రేలియా గడ్డ మీద నిరూపించుకున్నాడని.. కాబట్టి యాజమాన్యం అతడి వైపు మొగ్గు చూపే అవకాశం లేకపోలేదని పేర్కొన్నాడు. ఏదేమైనా తాను మాత్రం అర్ష్దీప్కే ఓటు వేస్తానని ఇర్ఫాన్ పఠాన్ ఈ సందర్భంగా వెల్లడించాడు.సౌతాఫ్రికాతో తొలి టీ20 మ్యాచ్కు ఇర్ఫాన్ పఠాన్ ఎంచుకున్న భారత తుదిజట్టుఅభిషేక్ శర్మ, శుబ్మన్ గిల్, సూర్యకుమార్ యాదవ్, తిలక్ వర్మ, అక్షర్ పటేల్, హార్దిక్ పాండ్యా, జితేశ్ శర్మ, కుల్దీప్ యాదవ్, అర్ష్దీప్ సింగ్, వరుణ్ చక్రవర్తి, జస్ప్రీత్ బుమ్రా.చదవండి: IND vs SA: టీమిండియాకు భారీ షాక్..! -
గిల్ వచ్చేశాడు.. సంజూ శాంసన్కు మళ్లీ నిరాశే..!
డిసెంబర్ 9 నుంచి కటక్ (ఒడిషా) వేదికగా భారత్, సౌతాఫ్రికా మధ్య 5 మ్యాచ్ల టీ20 సిరీస్ ప్రారంభం కానుంది. తొలి మ్యాచ్ కోసం భారత జట్టు మొత్తం ఇప్పటికే భువనేశ్వర్కు (ఒడిషా రాజధాని) చేరుకుంది. గాయం కారణంగా టెస్ట్, వన్డే సిరీస్కు (సౌతాఫ్రికాతో) దూరమైన శుభ్మన్ గిల్ కూడా నిన్న రాత్రి భువనేశ్వర్ చేరుకున్నాడు.గిల్ మెడ్ గాయం నుంచి పూర్తిగా కోలుకోని రీఎంట్రీకి సిద్దంగా ఉన్నాడు. గిల్ రాకతో టీమిండియాకు ఓపెనింగ్ జోడీ సమస్య తిరగబెట్టింది. అభిషేక్కు జోడీగా గిల్ బరిలోకి దిగితే సంజూ శాంసన్కు మళ్లీ నిరాశ తప్పదు.మిడిలార్డర్లో ఆడించాల్సి వస్తే మేనేజ్మెంట్ జితేశ్ శర్మకు ఓటు వస్తుంది తప్ప సంజూకు అవకాశం ఇవ్వదు. సంజూ ఓపెనర్గా అయితేనే సక్సెస్ కాగలడని మేనేజ్మెంట్ భావిస్తుంది. ఇది ఆసీస్ పర్యటనలో తొలి రెండు టీ20ల్లో నిరూపితమైంది. దీన్ని బట్టి చూస్తే సంజూ ఓపెనర్గా అవకాశం ఉంటేనే తుది జట్టులో ఉంటాడు. లేకపోతే జట్టులో చోటే ఉండదు.మేనేజ్మెంట్ దగ్గర మిడిలార్డర్ వికెట్ కీపర్ బ్యాటర్ కోసం జితేశ్ శర్మ రూపం మంచి ఆప్షన్ ఉంది. జితేశ్ మంచి ఫినిషర్గానూ గుర్తింపు తెచ్చుకున్నాడు. కాబట్టి సౌతాఫ్రికా టీ20 సిరీస్లో అతడికే అవకాశాలు ఉంటాయి. ఓపెనర్లలో ఎవరో ఒకరికి గాయమైతే తప్ప సంజూ తుది జట్టులోకి వచ్చే పరిస్థితి లేదు.గిల్ ఆకలితో ఉన్నాడు: గంభీర్గిల్ గాయంపై టీమిండియా హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్ రెండు రోజుల ముందే అప్డేట్ ఇచ్చాడు. దక్షిణాఫ్రికాతో వన్డే సిరీస్ ముగిశాక గంభీర్ మాట్లాడుతూ.. అవును, గిల్ సిద్ధంగా ఉన్నాడు. అందుకే అతన్ని ఎంపిక చేశాం. అతను ఫిట్గా, ఫైన్గా, ఆడేందుకు ఆకలితో ఉన్నాడని అన్నాడు.కాగా, సౌతాఫ్రికాతో జరిగిన తొలి టెస్ట్లో మెడ గాయానికి గురైన గిల్.. గత కొద్ది రోజులుగా బెంగళూరులోని BCCI సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్లో ఉన్నాడు. అక్కడ పూర్తిగా కోలుకొని, వైద్య బృందం నుంచి ఫిట్నెస్ క్లియరెన్స్ పొందాడు. టెస్ట్, వన్డే ఫార్మాట్లలో టీమిండియా కెప్టెన్గా ఉన్న గిల్.. టీ20ల్లో వైస్ కెప్టెన్గా వ్యవహరిస్తున్నాడు. సౌతాఫ్రికాతో తొలి టీ20 కోసం భారత జట్టు (అంచనా)..శుభ్మన్ గిల్, అభిషేక్ శర్మ, సూర్యకుమార్ యాదవ్ (కెప్టెన్), తిలక్ వర్మ, హార్దిక్ పాండ్యా, జితేశ్ శర్మ (వికెట్కీపర్), శివమ్ దూబే, కుల్దీప్ యాదవ్, వరుణ్ చక్రవర్తి, బుమ్రా, అర్షదీప్ సింగ్ -
సౌతాఫ్రికా సిరీస్కు ముందు దుమ్మురేపుతున్న సంజూ శాంసన్
టీమిండియా డాషింగ్ బ్యాటర్ సంజూ శాంసన్ (Sanju Samson) సౌతాఫ్రికా టీ20 సిరీస్కు గట్టిగా ప్రిపేర్ అవుతున్నాడు. సయ్యద్ ముస్తాక్ అలీ టీ20 టోర్నీలో వరుస మెరుపు ఇన్నింగ్స్లతో దుమ్మురేపుతున్నాడు. ఈ టోర్నీ తొలి మ్యాచ్లో 41 బంతుల్లో అజేయమైన 51 పరుగులు చేసిన అతడు.. ఆతర్వాతి మ్యాచ్లో 15 బంతుల్లో 43 పరుగులు బాదాడు. తాజాగా ముంబైతో జరుగుతున్న మ్యాచ్లో సంజూ మరోసారి చెలరేగి ఆడాడు. 28 బంతుల్లో 8 ఫోర్లు, సిక్సర్ సాయంతో 46 పరుగులు చేశాడు.ఇదే ఫామ్ను సంజూ సౌతాఫ్రికా సిరీస్లోనూ కొనసాగిస్తే టీమిండియాకు చాలా ప్లస్ అవుతుంది. ఇప్పటికే భారత బ్యాటింగ్ విభాగం చాలా పటిష్టంగా ఉంది. ఒక్కో స్థానం కోసం ఇద్దరు, ముగ్గురు పోటీపడుతున్నారంటే పరిస్థితి ఎలా ఉందో అర్దం చేసుకోవచ్చు. ఓ రకంగా చూస్తే.. ఆఖరి నిమిషం వరకు సంజూ స్థానానికి కూడా గ్యారెంటీ లేదు. జితేశ్ శర్మ రూపంలో అతడిని బలమైన పోటీ ఉంది.కాగా, నిన్ననే సౌతాఫ్రికా టీ20 సిరీస్ కోసం భారత జట్టును ప్రకటించారు. ఈ జట్టులో సంజూ వికెట్కీపర్ బ్యాటర్ కోటాలో స్థానం దక్కించుకున్నాడు. గాయపడినా ఈ జట్టుకు ఎంపికైన శుభ్మన్ గిల్ సిరీస్ సమయానికి అందుబాటులోకి రాకపోతే సంజూ స్థానానికి ఎలాంటి ఢోకా ఉండదు.సౌతాఫ్రికాతో టీ20 సిరీస్కు భారత జట్టు ఇదేసూర్యకుమార్ యాదవ్ (కెప్టెన్), శుబ్మన్ గిల్ (వైస్ కెప్టెన్- ఫిట్నెస్కు లోబడి), అభిషేక్ శర్మ, తిలక్ వర్మ, హార్దిక్ పాండ్యా, శివమ్ దూబే, అక్షర్ పటేల్, జితేశ్ శర్మ (వికెట్ కీపర్), సంజు శాంసన్ (వికెట్ కీపర్), జస్ప్రీత్ బుమ్రా, వరుణ్ చక్రవర్తి, అర్ష్దీప్ సింగ్, కుల్దీప్ యాదవ్, హర్షిత్ రాణా, వాషింగ్టన్ సుందర్.భారత్ వర్సెస్ సౌతాఫ్రికా టీ20 సిరీస్ షెడ్యూల్తొలి టీ20: డిసెంబరు 9- కటక్, ఒడిశారెండో టీ20: డిసెంబరు 11- ముల్లన్పూర్, చండీగఢ్మూడో టీ20: డిసెంబరు 14- ధర్మశాల, హిమాచల్ ప్రదేశ్నాలుగో టీ20: డిసెంబరు 17- లక్నో, ఉత్తరప్రదేశ్ఐదో టీ20: డిసెంబరు 19- అహ్మదాబాద్, గుజరాత్.ముంబైని ఓడించిన తొలి మొనగాడుప్రస్తుత సయ్యద్ ముస్తాక్ అలీ టోర్నీలో ముంబైని ఓడించిన ఏకైక కెప్టెన్ సంజూ శాంసన్ మాత్రమే. ఈ టోర్నీలో కేరళకు సారధిగా వ్యవహరిస్తున్న సంజూ ఇవాళ ముంబైతో జరిగిన మ్యాచ్లో బ్యాటర్గా, వికెట్కీపర్గా, కెప్టెన్గా రాణించి ముంబైని ఓడించడంలో కీలకపాత్ర పోషించాడు. తొలుత బ్యాట్తో మెరుపు ఇన్నింగ్స్ ఆడిన సంజూ, ఆతర్వాత వికెట్కీపింగ్లోనూ సత్తా చాటి కీలక సమయంలో శివమ్ దూబేను స్టంపౌట్ చేశాడు. ఈ వికెటే మ్యాచ్ను మలుపు తిప్పి, కేరళను గెలిచేలా చేసింది.స్కోర్ల వివరాలు..కేరళ-178/5ముంబై-163 ఆలౌట్ -
అభిషేక్ శర్మ అట్టర్ఫ్లాప్.. సంజూ శాంసన్ ఫెయిల్
టీమిండియా స్టార్లు అభిషేక్ శర్మ, సంజూ శాంసన్.. అభిమానులను తీవ్రంగా నిరాశపరిచారు. దేశవాళీ టీ20 టోర్నమెంట్ సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీ-2025 ఎలైట్ రెండో రౌండ్లో ఇద్దరూ విఫలమయ్యారు. దీంతో అభిషేక్ శర్మ సారథ్యం వహిస్తున్న పంజాబ్ జట్టుకు.. సంజూ కెప్టెన్గా ఉన్న కేరళ జట్టుకు ఓటములు ఎదురయ్యాయి.ఎలైట్ గ్రూప్-‘సి’లో భాగంగా హైదరాబాద్ వేదికగా పంజాబ్- హర్యానా (Punjab Vs Haryana ) శుక్రవారం తలపడ్డాయి. జింఖానా మైదానంలో టాస్ గెలిచిన పంజాబ్ తొలుత బౌలింగ్ ఎంచుకుంది. ఈ క్రమంలో బ్యాటింగ్కు దిగిన హర్యానా నిర్ణీత 20 ఓవర్లలో తొమ్మిది వికెట్ల నష్టానికి ఏకంగా 207 పరుగులు సాధించింది.సరిగ్గా 207 పరుగులే చేసి..హర్యానా కెప్టెన్ అంకిత్ కుమార్ (26 బంతుల్లో 51), వన్డౌన్ బ్యాటర్ నిషాంత్ సింధు (32 బంతుల్లో 61) మెరుపు అర్ధ శతకాలతో అదరగొట్టగా.. ఆఖర్లో సుమిత్ కుమార్ (14 బంతుల్లో 28) వేగంగా ఆడాడు. ఫలితంగా హర్యానా ఈ మేర స్కోరు సాధించింది.భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన పంజాబ్ కూడా 20 ఓవర్లలో ఏడు వికెట్లు నష్టపోయి సరిగ్గా 207 పరుగులే చేసింది. కెప్టెన్, విధ్వంసకర ఓపెనర్గా పేరొందిన అభిషేక్ శర్మ (Abhishek Sharma- 5 బంతుల్లో 6) దారుణంగా విఫలమైనా.. అన్మోల్ప్రీత్ సింగ్ (37 బంతుల్లో 81), సన్వీర్ సింగ్ (16 బంతుల్లో 36 నాటౌట్) అదరగొట్టారు.ఇక స్కోర్లు సమం కావడంతో సూపర్ ఓవర్ నిర్వహించగా హర్యానా గెలుపొందింది. సన్వీర్ సింగ్ (0), రమణ్దీప్ సింగ్ (1) విఫలం కావడంతో పంజాబ్కు ఓటమి తప్పలేదు.కేరళకు పరాభవంమరోవైపు.. తొలి మ్యాచ్లో ఒడిశాను పది వికెట్ల తేడాతో చిత్తు చేసిన కేరళ.. శుక్రవారం నాటి రెండో మ్యాచ్లో మాత్రం విఫలమైంది. లక్నోలో రైల్వేస్తో మ్యాచ్లో టాస్ గెలిచిన కేరళ తొలుత బౌలింగ్ ఎంచుకుంది. దీంతో బ్యాటింగ్కు దిగిన రైల్వేస్ 20 ఓవర్లలో ఏడు వికెట్లు నష్టపోయి 149 పరుగులు చేసింది.నామమాత్రపు లక్ష్యంతో ఛేదనకు దిగిన కేరళకు ఆదిలోనే షాకులు తగిలాయి. గత మ్యాచ్లో విధ్వంసకర ఇన్నింగ్స్తో విరుచుకుపడిన ఓపెనర్లు సంజూ శాంసన్, రోహన్ కణ్ణుమ్మల్ ఈసారి చేతులెత్తేశారు. సంజూ 25 బంతుల్లో కేవలం 19 పరుగులు చేయగా.. రోహన్ 14 బంతుల్లో 8 పరుగులే చేసి అవుటయ్యాడు. వన్డౌన్లో వచ్చిన అహ్మద్ ఇమ్రాన్ (12) సహా అబ్దుల్ బాసిత్ (7), సల్మాన్ నిజార్ (18), అఖిల్ స్కారియా (16), షరాఫుద్దీన్ (6) విఫలమయ్యారు. ఫలితంగా నిర్ణీత 20 ఓవర్లు పూర్తయ్యేసరికి ఎనిమిది వికెట్లు కోల్పోయిన కేరళ కేవలం 117 పరుగులే చేసింది. దీంతో రైల్వేస్ చేతిలో 32 పరుగుల తేడాతో ఓటమిపాలైంది.ఇద్దరూ విఫలం కావడంతో..ఇదిలా ఉంటే.. సౌతాఫ్రికాతో టీ20 సిరీస్కు ముందు అభిషేక్ శర్మ, సంజూ శాంసన్ ఇలా విఫలం కావడం ఆందోళనకరంగా పరిణమించింది. తదుపరి మ్యాచ్లలో ఇద్దరూ సత్తా చాటి ఫామ్లోకి రావాలని అభిమానులు కోరుకుంటున్నారు. కాగా డిసెంబరు 9- 19 వరకు భారత్- సౌతాఫ్రికా మధ్య ఐదు టీ20లు జరుగనున్న విషయం తెలిసిందే. -
ధోనీ కేరళ వస్తే? ఇది ఏఐ అని చెబితే తప్ప తెలియదు (ఫొటోలు)
-
సంజూ శాంసన్ ధనాధన్.. రోహన్ విధ్వంసకర సెంచరీ
దేశవాళీ టీ20 క్రికెట్ టోర్నమెంట్ సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీ-2025 సీజన్లో కేరళ తొలి మ్యాచ్లోనే దుమ్ములేపింది. ఎలైట్ గ్రూప్-‘ఎ’లో భాగంగా ఒడిషా (Kerala Vs Odisha)తో జరిగిన మ్యాచ్లో పది వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది.లక్నోలోని ఏకనా స్టేడియం వేదికగా బుధవారం జరిగిన మ్యాచ్లో టాస్ గెలిచిన కేరళ తొలుత బౌలింగ్ ఎంచుకోగా.. ఒడిషా బ్యాటింగ్కు దిగింది. ఓపెనర్లు స్వస్తిక్ సమాల్ (14 బంతుల్లో 20), గౌరవ్ చౌదరి (15 బంతుల్లో 29) మెరుగ్గా రాణించారు.176 పరుగులుమిగతా వారిలో వన్డౌన్ బ్యాటర్ సుభ్రాంషు నేనాపతి (15) నిరాశపరచగా.. కెప్టెన్ సమంత్రయ్ (41 బంతుల్లో 53) మెరుపు అర్ధ శతకంతో సత్తా చాటాడు. అతడికి తోడుగా సంబిత్ ఎస్ బరాల్ (32 బంతుల్లో 40) రాణించాడు. ఫలితంగా నిర్ణీత 20 ఓవర్లలో ఒడిషా ఏడు వికెట్ల నష్టానికి 176 పరుగులు సాధించింది. కేరళ బౌలర్లలో నిధీశ్ నాలుగు వికెట్లు తీయగా.. ఆసిఫ్ రెండు, అంకిత్ శర్మ ఒక వికెట్ తమ ఖాతాలో వేసుకున్నారు.బౌండరీల వర్షంఇక ఓ మోస్తరు లక్ష్యంతో బరిలోకి దిగిన కేరళకు ఓపెనర్లు కెప్టెన్ సంజూ శాంసన్, రోహన్ కణ్ణుమ్మల్ అదిరిపోయే ఆరంభం అందించారు. ఆది నుంచే ఒడిషా బౌలర్లపై ఎదురుదాడికి దిగి బౌండరీల వర్షం కురిపించారు. సంజూ 41 బంతుల్లో ఆరు ఫోర్లు, ఒక సిక్సర్ సాయంతో 51 పరుగులు సాధించాడు.సంజూ ధనాధన్.. రోహన్ విధ్వంసకర సెంచరీమరోవైపు.. రోహన్ విధ్వంసకర శతకంతో దుమ్ములేపాడు. మొత్తంగా 60 బంతులు ఎదుర్కొని 121 పరుగులు చేసిన ఈ కుడిచేతి వాటం బ్యాటర్ ఇన్నింగ్స్లో 10 ఫోర్లు, 10 సిక్సర్లు ఉండటం విశేషం. సంజూ, రోహన్ అజేయంగా నిలవడంతో 16.3 ఓవర్లలోనే కేరళ వికెట్ నష్టపోకుండా 177 పరుగులు సాధించి జయభేరి మోగించింది.ఇదిలా ఉంటే.. సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీ చరిత్రలో తొలి వికెట్కు అత్యధిక పరుగులు జోడించిన ఓపెనింగ్ జంటగా సంజూ శాంసన్, రోహన్ కణ్ణుమ్మల్ రికార్డు సాధించారు. వీరిద్దరు కలిసి తొలి వికెట్కు ఏకంగా 177 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పారు.కావాల్సినంత ప్రాక్టీస్కాగా సౌతాఫ్రికాతో స్వదేశంలో టీమిండియా వన్డే, టీ20 సిరీస్ ఆడనున్న విషయం తెలిసిందే. అయితే, వన్డే జట్టులో మరోసారి సంజూకు చోటివ్వలేదు సెలక్టర్లు. ఇక దేశీ టీ20 టోర్నీలో ప్రదర్శన ఆధారంగానైనా టీ20 జట్టుకు ఎంపిక చేసే అవకాశం ఉంది. టీ20 ప్రపంచకప్-2026కు సన్నద్ధమయ్యే క్రమంలో సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీ ద్వారా కావాల్సినంత ప్రాక్టీస్ దొరకనుంది.చదవండి: Gautam Gambhir: అందరూ నన్నే నిందిస్తారు.. బీసీసీఐదే తుది నిర్ణయం -
పాపం సంజూ.. వరల్డ్ మోస్ట్ అన్లక్కీ క్రికెటర్
సొంతగడ్డపై దక్షిణాఫ్రికాతో వన్డే సిరీస్కు భారత జట్టును బీసీసీఐ సెలక్షన్ కమిటీ ఆదివారం ప్రకటించింది. రెగ్యులర్ కెప్టెన్ శుబ్మన్ గిల్ గాయం కారణంగా జట్టుకు దూరమవడంతో... అతడి స్థానంలో సీనియర్ బ్యాటర్ రాహుల్కు సారథ్య బాధ్యతలు అప్పగించారు.అదేవిధంగా ఈ సిరీస్కు గిల్తో పాటు వైస్ కెప్టెన్ శ్రేయస్ అయ్యర్, హార్దిక్ పాండ్యా గాయాల కారణంగా దూరమయ్యారు. సీనియర్ పేసర్లు జస్ప్రీత్ బుమ్రా, మొహమ్మద్ సిరాజ్తో పాటు స్పిన్ ఆల్రౌండర్ అక్షర్ పటేల్కు విశ్రాంతినివ్వగా... రవీంద్ర జడేజా ఎనిమిది నెలల తర్వాత తిరిగి వన్డే జట్టులోకి వచ్చాడు.దిగ్గజ బ్యాటర్లు రోహిత్ శర్మ, విరాట్ కోహ్లి చాన్నాళ్ల తర్వాత బ్లూ జెర్సీలో సొంత అభిమానుల ముందు మైదానంలో అడుగు పెట్టనున్నారు. మరోవైపు మహారాష్ట్ర క్రికెటర్ రుతురాజ్ గైక్వాడ్ ఛాన్నాళ్ల తర్వాత జట్టులోకి తిరిగొచ్చాడు. గిల్ స్ధానంలో గైక్వాడ్కు చోటు దక్కింది. మిడిలార్డర్ బ్యాటర్ శ్రేయస్ అయ్యర్ స్ధానంలో తిలక్ వర్మకు సెలక్టర్లు పిలుపునిచ్చారు.సంజూ మరో 'సారీ'..ఇక భారత వన్డే జట్టులోకి రీ ఎంట్రీ ఇవ్వాలనుకున్న స్టార్ వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్కు మరోసారి సెలక్టర్లు మొండిచేయి చూపించారు. సఫారీలతో వన్డే సిరీస్కు రెగ్యూలర్ వికెట్ కీపర్గా రిషబ్ పంత్కు చోటు దక్కింది. పంత్ కూడా ఏడాది తర్వాత వన్డే జట్టులోకి వచ్చాడు. పంత్ గైర్హజరీలో కూడా సంజూకు చోటు దక్కలేదు. వన్డేల్లో కూడా బ్యాకప్ వికెట్ కీపర్గా ధ్రువ్ జురెల్ను సెలక్టర్లు పరిగణలోకి తీసుకుంటున్నారు. సఫారీలతో వన్డేలకు ఎంపిక చేసిన జట్టులో కూడా జురెల్ ఉన్నాడు. ఈ క్రమంలో వన్డేల్లో మంచి రికార్డు ఉన్నప్పటికి సంజూను జట్టులోకి తీసుకోకపోవడంపై నెటిజన్లు ఫైరవతున్నారు. బీసీసీఐ చీఫ్ సెలక్టర్ అజిత్ అగార్కర్పై విమర్శల వర్షం కురుపిస్తున్నారు.శాంసన్ చివరగా 2023 డిసెంబరులో దక్షిణాఫ్రికాపై వన్డే మ్యాచ్ ఆడాడు. ఆ తర్వాత శ్రీలంక, ఆస్ట్రేలియా, దక్షిణాఫ్రికాలతో సిరీస్లకు అతడికి చోటు దక్కలేదు. ఇప్పటివరకు 16 వన్డేలు ఆడిన సంజూ 56.66 సగటుతో 510 పరుగులు చేశాడు. ఇందులో ఒక సెంచరీ, మూడు హాఫ్ సెంచరీలు ఉన్నాయి.భారత వన్డే జట్టు: కేఎల్ రాహుల్ (కెప్టెన్), రోహిత్, జైస్వాల్, విరాట్ కోహ్లి, తిలక్ వర్మ, పంత్, సుందర్, జడేజా, కుల్దీప్, నితీశ్ కుమార్ రెడ్డి, హర్షిత్ రాణా, రుతురాజ్ గైక్వాడ్, ప్రసిధ్, అర్ష్దీప్, ధ్రువ్ జురెల్. -
కెప్టెన్గా సంజూ శాంసన్.. అధికారిక ప్రకటన
సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీ (SMAT) 2025-26 కోసం కేరళ క్రికెట్ అసోసియేషన్ (KCA) తమ జట్టును ప్రకటించింది. ఈ జట్టు కెప్టెన్గా టీమిండియా స్టార్ వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఎంపికయ్యాడు. టీ20 ప్రపంచకప్-2026 సన్నాహకంగా ఈ దేశవాళీ టోర్నీని ఉపయోగించుకోవాలని సంజూ భావిస్తున్నాడు.అయితే ఈ టోర్నీ మొత్తానికి శాంసన్ అందుబాటులో ఉండకపోవచ్చు. సంజూ కేవలం గ్రూపు స్టేజిలో మాత్రమే ఆడనున్నాడు. నవంబర్ 26 నుంచి ప్రారంభం కానున్న ఈ దేశవాళీ టోర్నీ లీగ్ గ్రూపు దశ మ్యాచ్లు డిసెంబర్ 8తో ముగుస్తాయి. అనంతరం డిసెంబర్ 9 నుంచి భారత్-దక్షిణాఫ్రికా మధ్య ఐదు మ్యాచ్ల టీ20 సిరీస్ ప్రారంభం కానుంది. ఈ సిరీస్లో సంజూ ఆడనున్నాడు. సంజూ గైర్హజరీలో కేరళ జట్టు కెప్టెన్గా మహ్మద్ ఇమ్రాన్ వ్యవహరించనున్నాడు. కేరళ తమ తొలి మ్యాచ్లో నవంబర్ 26న లక్నో వేదికగా తలపడనుంది. కేరళ జట్టులో రోహన్ ఎస్ కున్నుమ్మల్, మహ్మద్ అజరుద్దీన్ వంటి విధ్వంసకర ఆటగాళ్లు ఉన్నారు.ఇక ఇది ఇలా ఉండగా.. ఐపీఎల్-2026 సంజూ శాంసన్ చెన్నై సూపర్ కింగ్స్ కెప్టెన్గా వ్యవహరించనున్నాడు. మినీ వేలానికి ముందు రాజస్తాన్ నుంచి శాంసన్(రూ.18 కోట్లు)ను సీఎస్కే ట్రేడ్ చేసుకుంది. అందుకు బదులుగా రవీంద్ర జడేజా, సామ్ కుర్రాన్లను సీఎస్కే వదులుకుంది.సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీకి కేరళ జట్టుసంజూ శాంసన్ (కెప్టెన్), రోహన్ ఎస్ కున్నుమ్మల్, మహ్మద్ అజరుద్దీన్, అహమ్మద్ ఇమ్రాన్ (వైస్ కెప్టెన్), విష్ణు వినోద్, నిధీష్ ఎమ్ డి, ఆసిఫ్ కెఎమ్, అఖిల్ స్కారియా, బిజు నారాయణన్ ఎన్, అంకిత్ శర్మ, కృష్ణ దేవన్ ఆర్ జె, అబ్దుల్ బాజిత్ పిఎ, షరఫుద్దీన్ ఎన్ఎమ్, సిబిన్ వి, ప్రసాద్, సల్మాన్ నిజార్చదవండి: PAK vs SL: తీరు మారని శ్రీలంక.. పాకిస్తాన్ గ్రాండ్ విక్టరీ -
IPL 2026: ‘అతడొక డమ్మీ కెప్టెన్.. చేసేదంతా వేరొకరు’
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL)-2026 సీజన్ సందడి మొదలైపోయింది. ఇప్పటికే పది ఫ్రాంఛైజీలు రిటెన్షన్, రిలీజ్ జాబితాలు విడుదల చేసి వేలానికి సిద్ధమైపోయాయి. అబుదాబి వేదికగా డిసెంబరు 16న జరుగనున్న వేలం పాటలో పాల్గొనేందుకు వ్యూహాలు సిద్ధం చేసుకుంటున్నాయి.ఈ క్రమంలోనే ఇప్పటికే ఎనిమిది జట్లు తమ కెప్టెన్లను ఖరారు చేశాయి. ఇందులో ప్రధానంగా చెన్నై సూపర్ కింగ్స్ (CSK) రుతురాజ్ గైక్వాడ్ (Ruturaj Gaikwad)నే తమ సారథిగా కొనసాగిస్తానని చెప్పడం విశేషం. రవీంద్ర జడేజాను ఇచ్చేసి.. రాజస్తాన్ రాయల్స్ నుంచి ట్రేడ్ చేసుకున్న సంజూ శాంసన్ (Sanju Samson)కు సీఎస్కే కెప్టెన్సీ బాధ్యతలు అప్పగిస్తుందని తొలుత ప్రచారం జరిగింది. అయితే, యాజమాన్యం మాత్రం రుతు వైపే మొగ్గుచూపింది.ఇప్పుడే జట్టులో చేరిన సంజూ శాంసన్ను ప్రస్తుతానికి వైస్ కెప్టెన్గా నియమించాలని సీఎస్కే మేనేజ్మెంట్ నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో భారత మాజీ క్రికెటర్ మొహమ్మద్ కైఫ్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. అతడొక డమ్మీ కెప్టెన్.. రుతురాజ్ గైక్వాడ్ కేవలం పేపర్ మీద మాత్రమే సారథిగా కనిపిస్తాడని.. అతడొక డమ్మీ కెప్టెన్ అని అభిప్రాయపడ్డాడు. మహేంద్ర సింగ్ ధోనినే మైదానం లోపల, వెలుపల నిజమైన సారథిగా వ్యవహరిస్తాడని కైఫ్ పేర్కొన్నాడు.‘‘ధోని బ్యాటింగ్ చేయడానికి తుదిజట్టులోకి రాడు. 20 ఓవర్ల పాటు వికెట్ కీపింగ్ చేయడానికి.. 20 ఓవర్ల పాటు కెప్టెన్సీ చేయడానికి మాత్రమే జట్టులో ఉంటాడు. మిగతా ఆటగాళ్లు ఎలా ఆడాలో మైదానంలోనే మార్గదర్శనం చేస్తాడు.అంతా ధోని కనుసన్నల్లోనేగైక్వాడ్ను గైడ్ చేయడానికే ధోని మైదానంలో ఉంటాడు. మెంటార్గా, కెప్టెన్గా మాత్రమే ధోని మైదానంలో దిగుతాడు. పేపర్ మీద మాత్రం గైక్వాడ్ పేరు కెప్టెన్గా ఉంటుంది. అయితే, మైదానంలో, మైదానం వెలుపల అంతా ధోని కనుసన్నల్లోనే నడుస్తుంది.కాబట్టి ధోని ఇంపాక్ట్ ప్లేయర్గా వస్తాడని అనుకోవడం పొరపాటే. తనకు తానుగా ధోని ఈ నిర్ణయం తీసుకుంటే తప్ప.. అతడు ఇంపాక్ట్ ప్లేయర్గా వచ్చే అవకాశమే లేదు’’ అని కైఫ్ తన అభిప్రాయాలు పంచుకున్నాడు.ధోని వారసుడిగాకాగా చెన్నైని ఐదుసార్లు చాంపియన్గా నిలిపిన దిగ్గజ కెప్టెన్ ధోని. అయితే, 2022లో తన వారసుడిగా రవీంద్ర జడేజాను ధోని ప్రకటించగా.. వరుస మ్యాచ్లలో ఓటమి నేపథ్యంలో జడ్డూ మధ్యలోనే వైదొలిగాడు. దీంతో మళ్లీ ధోనినే పగ్గాలు చేపట్టాడు. ఆ తర్వాత 2024లో రుతురాజ్ గైక్వాడ్కు కెప్టెన్సీ బాధ్యతలు అప్పగించాడు. కానీ 2025లో గాయం వల్ల రుతు కూడా మధ్యలోనే దూరం కాగా.. మళ్లీ ధోనినే సారథిగా వ్యవహరించాడు. చదవండి: IPL 2026: రసెల్, మాక్సీ ఒకే జట్టులో.. వీళ్లతో మామూలుగా ఉండదు! -
సంజూ ఎంట్రీ.. అదిరిపోయే వీడియో షేర్ చేసిన సీఎస్కే
టీమిండియా టీ20 స్టార్ సంజూ శాంసన్కు చెన్నై సూపర్ కింగ్స్ (CSK) ఘన స్వాగతం పలికింది. అదిరిపోయే వీడియోతో ఈ వికెట్ కీపర్ బ్యాటర్ను తమ జట్టులోకి ఆహ్వానించింది. ఇందులో మలయాళీ డైరెక్టర్, నటుడు బాసిల్ జోసెఫ్ (Basil Joseph) కూడా కనిపించడం విశేషం.రూ. 18 కోట్లు చెల్లించిఐపీఎల్-2026 వేలానికి ముందే సీఎస్కే సంజూ శాంసన్ (Sanju Samson)ను తమ ఫ్రాంఛైజీలో చేర్చుకున్న విషయం తెలిసిందే. రూ. 18 కోట్లు చెల్లించి మరీ రాజస్తాన్ రాయల్స్ నుంచి సంజూను సీఎస్కే సొంతం చేసుకుంది. రాయల్స్ కెప్టెన్ను తమ జట్టులో చేర్చుకునేందుకు.. దాదాపు పదమూడేళ్లుగా తమతో కలిసి ప్రయాణం చేస్తున్న స్టార్ ఆల్రౌండర్ రవీంద్ర జడేజాను చెన్నై వదులుకుంది.వైస్ కెప్టెన్గా సంజూ!జడ్డూతో పాటు.. సామ్ కర్రాన్ను కూడా రాజస్తాన్ రాయల్స్కు ఇచ్చేసి.. సంజూను ట్రేడ్ చేసుకుంది సీఎస్కే. అంతేకాదు.. కెప్టెన్ రుతురాజ్ గైక్వాడ్కు డిప్యూటీగా.. వైస్ కెప్టెన్గా సంజూను నియమించే యోచనలో యాజమాన్యం ఉన్నట్లు సమాచారం. ఇక సంజూకు స్వాగతం పలుకుతూ.. ‘‘చేటా ఈజ్ హియర్ (అన్న వచ్చేశాడు)’’ సీఎస్కే షేర్ చేసిన వీడియో అభిమానులను ఆకర్షిస్తోంది.భారీ కటౌట్ఇందులో బాసిల్ జోసెఫ్.. ‘‘సోదరా.. సమయం వచ్చింది. పని మొదలుపెట్టండి.. ఎలాంటి తప్పిదాలు జరగకూడదు. మన వాళ్లందరినీ తీసుకురండి. సమయానికల్లా అంతా సిద్ధమైపోవాలి’’ అని చెప్పగా ఓ బృందమంతా కలిసి రాత్రీపగలు కష్టపడి సంజూ భారీ కటౌట్ను ఏర్పాటు చేస్తాయి. ఈ క్రమంలోనే సంజూ కూడా ఎల్లో జెర్సీ వేసుకుని రెడీ అయిపోతాడు. ఆఖర్లో విక్రమ్ మూవీ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్తో సంజూ ఎంట్రీకి మరింత హైప్ ఇచ్చారు. ‘‘రావాలనుకున్నపుడే.. సరైన సమయంలోనే వచ్చా’’ అన్న క్యాప్షన్తో షేర్ చేసిన ఈ వీడియో నెట్టింట వైరల్గా మారింది. కాగా సంజూ శాంసన్ చాలా ఏళ్లుగా రాజస్తాన్ రాయల్స్ కెప్టెన్గా ఉన్నాడు. 2022లో జట్టును ఫైనల్కు చేర్చాడు. అయితే, గతేడాది ఫిట్నెస్ సమస్యల వల్ల ఎక్కువ మ్యాచ్లు ఆడలేకపోయాడు. ఇందుకు తోడు మేనేజ్మెంట్తో విభేదాలు తలెత్తాయనే వార్తలు రాగా.. సంజూ సీఎస్కేకు మారడం గమనార్హం. ఇక ఐపీఎల్లో ఇప్పటి వరకు 172 ఇన్నింగ్స్ ఆడిన సంజూ 4704 పరుగులు చేశాడు. ఇందులో మూడు శతకాలు, 26 హాఫ్ సెంచరీలు ఉన్నాయి.చదవండి: IPL 2026: రసెల్, మాక్సీ ఒకే జట్టులో.. వీళ్లతో మామూలుగా ఉండదు! View this post on Instagram A post shared by Chennai Super Kings (@chennaiipl) -
IPL 2026: కెప్టెన్ పేరును ప్రకటించిన సీఎస్కే
ఐపీఎల్-2026 మినీ వేలానికి (IPL 2026 Auction) ముందు చెన్నై సూపర్ కింగ్స్ (CSK) కీలక నిర్ణయం తీసుకుంది. పదమూడేళ్లుగా తమతో ఉన్న రవీంద్ర జడేజాను రాజస్తాన్ రాయల్స్కు ట్రేడ్ చేసింది. జడ్డూకు బదులుగా రాయల్స్ కెప్టెన్ సంజూ శాంసన్ (Sanju Samson)ను జట్టులోకి చేర్చుకుంది.ఏకంగా రూ. 18 కోట్లుసంజూ కోసం సీఎస్కే ఏకంగా రూ. 18 కోట్లు చెల్లించగా.. రాయల్స్ మాత్రం జడ్డూ ధరను రూ. 18 కోట్ల నుంచి రూ. 14 కోట్లకు తగ్గించింది. జడేజాతో పాటు సామ్ కర్రాన్ను సీఎస్కే నుంచి ట్రేడ్ చేసుకుంది. ఇక కేరళ వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్కు సీఎస్కే ఇంతటి ప్రాధాన్యం ఇవ్వడం చర్చనీయాంశంగా మారింది.కెప్టెన్ పేరును ప్రకటించిన సీఎస్కేఈ నేపథ్యంలోనే సంజూకు సీఎస్కే కెప్టెన్సీ అప్పగిస్తారనే అభిప్రాయాలూ వ్యక్తమయ్యాయి. అయితే, ఈ ఊహాగానాలకు సీఎస్కే ఫ్రాంఛైజీ స్వయంగా తెరదించింది. రుతురాజ్ గైక్వాడ్నే తమ కెప్టెన్గా కొనసాగిస్తామని శనివారం స్పష్టం చేసింది. ‘‘ముందుకు నడిపించే సారథి.. మా కెప్టెన్ రుతురాజ్ గైక్వాడ్’’ అంటూ సోషల్ మీడియా వేదికగా అధికారికంగా ధ్రువీకరించింది.వైస్ కెప్టెన్గా?అంతేకాదు.. సంజూను వికెట్ కీపర్గానూ ఉపయోగించుకునేందుకు సీఎస్కే సిద్ధంగా లేనట్లే. దిగ్గజం మహేంద్ర సింగ్ ధోని ఉండగా.. కీపింగ్ సేవలు వేరే ఎవరి చేతికి ఇచ్చేందుకు ఫ్రాంఛైజీ ఆసక్తి చూపదన్నది బహిరంగ రహస్యమే. కాబట్టి సంజూ సీఎస్కేలో ఓ సాధారణ క్రికెటర్గా మాత్రమే ఉంటాడు. అయితే, టాపార్డర్లో అతడు కీలక ఆటగాడు అయ్యే అవకాశాలు ఉన్నాయి. ఒకవేళ రుతుకు డిప్యూటీగా వైస్ కెప్టెన్గా నియమితుడైనా ఆశ్చర్యం లేదు.కేవలం నాలుగే గెలిచికాగా గత నాలుగు సీజన్లుగా రాజస్తాన్ రాయల్స్ సారథిగా ఉన్న సంజూ.. 2022లో జట్టును ఫైనల్కు చేర్చాడు. ఇదిలా ఉంటే.. 2024 సీజన్లో ధోని నుంచి పగ్గాలు అందుకున్న రుతురాజ్ కెప్టెన్గా ఇంత వరకు తనదైన ముద్ర వేయలేదు. తాజా ఎడిషన్లో గాయం కారణంగా అతడు మధ్యలోనే నిష్క్రమించగా.. మళ్లీ ధోనినే జట్టును ముందుకు నడిపించాడు.అయితే, ఈసారి సీఎస్కే ప్రదర్శన మరీ దారుణంగా ఉంది. పద్నాలుగింట కేవలం నాలుగే గెలిచి పాయింట్ల పట్టికలో చిట్టచివరన పదోస్థానంలో నిలిచింది. అందుకే ఐపీఎల్-2026కు ముందే చాలా మంది ఆటగాళ్లను వదిలించుకున్న సీఎస్కే.. వేలంలో మెరికల్లాంటి ప్లేయర్లను కొనుగోలు చేయాలనే వ్యూహంతో ఉంది. చెన్నై సూపర్ కింగ్స్ అట్టి పెట్టుకున్న ఆటగాళ్లు (CSK Retention List)రుతురాజ్ గైక్వాడ్, ఆయుష్ మాత్రే, డెవాల్డ్ బ్రెవిస్, ఎంఎస్ ధోనీ, ఉర్విల్ పటేల్, సంజు శాంసన్ (RR నుంచి ట్రేడింగ్), శివమ్ దూబే, జామీ ఓవర్టన్, రామకృష్ణ ఘోష్, నూర్ అహ్మద్, ఖలీల్ అహ్మద్, అన్షుల్ కాంబోజ్, గుర్జన్ప్రీత్ సింగ్, నాథన్ ఎల్లిస్, శ్రేయాష్ గోపాల్, ముకేశ్ చౌదరి.చెన్నై సూపర్ కింగ్స్ విడిచిపెట్టిన ఆటగాళ్లుమతీశ పతిరణ, డెవాన్ కాన్వే, రచిన్ రవీంద్ర, రాహుల్ త్రిపాఠి, విజయ్ శంకర్, దీపక్ హుడా, వన్ష్ బేడి, సి ఆండ్రీ సిద్దార్థ్, షేక్ రషీద్, కమ్లేశ్ నాగర్కోటి, రవీంద్ర జడేజా (ట్రేడింగ్), సామ్ కర్రాన్ (ట్రేడింగ్).చదవండి: వెంకటేశ్ అయ్యర్కు భారీ షాక్.. పది ఫ్రాంఛైజీలు విడిచిపెట్టిన ఆటగాళ్లు వీరే -
IPL 2026: రిటెన్షన్ జాబితా విడుదల చేసిన ఫ్రాంఛైజీలు
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL)-2026 మినీ వేలానికి ముందు తాము అట్టిపెట్టుకున్న ఆటగాళ్ల జాబితాను ఫ్రాంఛైజీలు విడుదల చేశాయి. ఇందుకు సంబంధించి శనివారం అధికారిక ప్రకటన చేశాయి.గుజరాత్ టైటాన్స్ రిటెన్షన్ జాబితా ఇదే (Gujarat Titans Retention List)శుబ్మన్ గిల్, సాయి సుదర్శన్, జోస్ బట్లర్ (వికెట్ కీపర్), షారుఖ్ ఖాన్, కుమార్ కుశాగ్రా (వికెట్ కీపర్), అనూజ్ రావత్ (వికెట్ కీపర్), వాషింగ్టన్ సుందర్, రషీద్ ఖాన్, రాహుల్ తెవాటియా, నిషాంత్ సింధు, గ్లెన్ ఫిలిప్స్, అర్షద్ ఖాన్, మొహమ్మద్ సిరాజ్, ప్రసిద్ కృష్ణ, సాయి కిశోర్, కగిసో రబడ, ఇషాంత్ శర్మ, జయంత్ యాదవ్, గుర్నూర్ బ్రార్, మానవ్ సుతార్. చెన్నై సూపర్ కింగ్స్ అట్టి పెట్టుకున్న ఆటగాళ్లు (CSK Retention List)రుతురాజ్ గైక్వాడ్, ఆయుష్ మాత్రే, డెవాల్డ్ బ్రెవిస్, ఎంఎస్ ధోనీ, ఉర్విల్ పటేల్, సంజు శాంసన్ (RR నుంచి ట్రేడింగ్), శివమ్ దూబే, జామీ ఓవర్టన్, రామకృష్ణ ఘోష్, నూర్ అహ్మద్, ఖలీల్ అహ్మద్, అన్షుల్ కాంబోజ్, గుర్జన్ప్రీత్ సింగ్, నాథన్ ఎల్లిస్, శ్రేయాష్ గోపాల్, ముకేశ్ చౌదరి.సన్రైజర్స్ హైదరాబాద్ రిటెన్షన్ జాబితా (SRH Retention List)ప్యాట్ కమిన్స్, అభిషేక్ శర్మ, హెన్రిచ్ క్లాసెన్, ట్రవిస్ హెడ్, నితీశ్ కుమార్ రెడ్డి, ఇషాన్ కిషన్, హర్షల్ పటేల్, జయదేవ్ ఉనాద్కట్, స్మరణ్ రవిచంద్రన్, అనికేత్ వర్మ, జీషన్ అన్సారీ, హర్ష్ దూబే, కమిందు మెండిస్, ఇషాన్ మలింగ, బ్రైడన్ కార్స్.ఢిల్లీ క్యాపిటల్స్ అట్టిపెట్టుకున్న ఆటగాళ్లు (DC Retention List)అభిషేక్ పోరెల్, కుల్దీప్ యాదవ్, త్రిపురాణ విజయ్, అజయ్ మండల్, మాధవ్ తివారి, ట్రిస్టన్ స్టబ్స్, అశుతోశ్ శర్మ, మిచెల్ స్టార్క్, విప్రజ్ నిగమ్, అక్షర్ పటేల్, ముకేశ్ కుమార్, దుష్మంత చమీర, నితీశ్ రాణా (రాజస్తాన్ నుంచి ట్రేడింగ్), కరుణ్ నాయర్, సమీర్ రిజ్వి, కేఎల్ రాహుల్, టి.నటరాజన్.కోల్కతా నైట్ రైడర్స్ రిటెన్షన్ జాబితా (KKR Retention List)అజింక్య రహానే, రోవ్మన్ పావెల్, అంగ్క్రిష్ రఘువన్షి, సునిల్ నరైన్, అనుకుల్ రాయ్, ఉమ్రాన్ మాలిక్, హర్షిత్ రాణా, వైభవ్ అరోరా, మనీశ్ పాండే, వరుణ్ చక్రవర్తి, రమణ్దీప్ సింగ్, రింకూ సింగ్లక్నో సూపర్ జెయింట్స్ రిటైన్ చేసుకున్న ఆటగాళ్లు వీరే (LSG Retention List)అబ్దుల్ సమద్, దిగ్వేశ్ రాఠీ, మొహ్సిన్ ఖాన్, ఐడెన్ మార్క్రమ్, హిమ్మత్ సింగ్, నికోలస్ పూరన్. ఆకాశ్ సింగ్, మణిమరన్ సిద్దార్థ్, ప్రిన్స్ యాదవ్. అర్జున్ టెండుల్కర్ (ముంబై నుంచి ట్రేడింగ్), మాథ్యూ బ్రిట్జ్జ్కే, రిషభ్ పంత్, అర్షిన్ కులకర్ణి, మయాంక్ యాదవ్, షాబాజ్ అహ్మద్, ఆవేశ్ ఖాన్, మొహమమ్మద్ షమీ (సన్రైజర్స్ నుంచి ట్రేడింగ్), ఆయుశ్ బదోని, మిచెల్ మార్ష్.ముంబై ఇండియన్స్ అట్టిపెట్టుకున్న ఆటగాళ్ల జాబితా (MI Retention List)అల్లా ఘజన్ఫర్, మిచెల్ సాంట్నర్, శార్దూల్ ఠాకూర్ (లక్నో నుంచి ట్రేడింగ్), అశ్వనీ కుమార్, నమన్ ధీర్, షెర్ఫానే రూథర్ఫర్డ్ (ట్రేడింగ్), కార్బిన్ బాష్, రఘు శర్మ, సూర్యకుమార్ యాదవ్, దీపక్ చహర్, రాజ్ అంగద్బవా, తిలక్ వర్మ, హార్దిక్పాండ్యా, రాబిన్ మింజ్, ట్రెంట్ బౌల్ట్, జస్ప్రీత్ బుమ్రా, రోహిత్ శర్మ, విల్ జాక్స్, మయాంక్ మార్కండే (ట్రేడింగ్), రియాన్ రికెల్టన్.పంజాబ్ కింగ్స్ రిటెన్షన్ లిస్టు (PBKS Retention List)అర్ష్దీప్ సింగ్, మిచెల్ ఓవెన్, శ్రేయస్ అయ్యర్, అజ్మతుల్లా ఒమర్జాయ్, ముషీర్ ఖాన్. సూర్యాంశ్ షెడ్గే, హర్నూర్ పన్నూ, నేహాల్ వధేరా, విష్ణు వినోద్, హర్ప్రీత్ బ్రార్, ప్రభ్సిమ్రన్ సింగ్, వైశాక్ విజయ్కుమార్, లాకీ ఫెర్గూసన్, ప్రియాంశ్ ఆర్య, జేవియర్ బార్ట్లెట్, మార్కో యాన్సెన్, పైలా అవినాశ్, యశ్ ఠాకూర్, మార్కస్ స్టొయినిస్, శశాంక్ సింగ్, యజువేంద్ర చహల్.రాజస్తాన్ రాయల్స్ రిటైన్ చేసుకున్న ఆటగాళ్లు వీరే (RR Retention List)ధ్రువ్ జురెల్, రియాన్ పరాగ్, యశస్వి జైస్వాల్, డొనొవాన్ ఫెరీరా (ట్రేడింగ్), సామ్ కర్రాన్ (ట్రేడింగ్), యుధ్వీర్ చరక్, జోఫ్రా ఆర్చర్, సందీప్ శర్మ, క్వెనా మఫాక, షిమ్రన్ హెట్మెయిర్, లువాన్ డ్రి ప్రిటోరియస్, శుభమ్ దూబే, నండ్రీ బర్గర్, తుషార్ దేశ్పాండే, రవీంద్ర జడేజా (ట్రేడింగ్), వైభవ్ సూర్యవంశీ.రాయల్ చాలెంజర్స్ బెంగళూరు అట్టిపెట్టుకున్న ప్లేయర్ల జాబితా (RCB Retention List)అభినందన్ సింగ్, నువాన్ తుషార, టిమ్ డేవిడ్, భువనేశ్వర్ కుమార్, ఫిల్ సాల్ట్, విరాట్ కోహ్లి, దేవ్దత్ పడిక్కల్, రజత్ పాటిదార్, యశ్ దయాళ్, జేకబ్ బెతెల్, రసిఖ్ ధార్, జితేశ్ శర్మ, రొమారియో షెఫర్డ్, జోష్ హాజిల్వుడ్, సూయాంశ్ శర్మ, కృనాల్ పాండ్యా, స్వప్నిల్ సింగ్. -
అందుకే రాజస్తాన్ను వీడాను: సంజూ శాంసన్ పోస్ట్ వైరల్
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL)-2026 వేలం నేపథ్యంలో ఫ్రాంఛైజీ ట్రేడ్ డీల్స్ పూర్తి చేసుకున్నాయి. అట్టిపెట్టుకునే ఆటగాళ్ల జాబితాను విడుదల చేసేందుకు శనివారమే (నవంబరు 15) ఆఖరి తేదీ కావడంతో తాము ట్రేడ్ చేసుకున్న ఆటగాళ్ల వివరాలను వెల్లడిస్తున్నాయి.జడ్డూ అటు.. సంజూ ఇటుఈ నేపథ్యంలో చెన్నై సూపర్ కింగ్స్ (CSK)- రాజస్తాన్ రాయల్స్ (RR) మధ్య జరిగిన భారీ ట్రేడ్ వార్తల్లో నిలిచింది. ముందుగా ఊహించినట్లే సీఎస్కే.. టీమిండియా స్టార్ ఆల్రౌండర్ రవీంద్ర జడేజాను.. రాజస్తాన్కు ఇచ్చేసి.. ఆ జట్టు సారథి సంజూ శాంసన్ను తమ చెంతకు చేర్చుకుంది.ధరలో మార్పుఅయితే, ఈ ఒప్పందంలో భాగంగా సీఎస్కే సంజూకు రాజస్తాన్ గతంలో చెల్లించిన మొత్తాన్ని ఇచ్చి రూ. 18 కోట్లకు తీసుకోగా.. రాజస్తాన్ మాత్రం జడ్డూ ధరను రూ. 18 కోట్ల నుంచి రూ. 14 కోట్లకు తగ్గించింది. జడ్డూతో పాటు సామ్ కర్రన్ (రూ. 2.4 కోట్లు)ను కూడా సీఎస్కే నుంచి తీసుకుంది. ఇదిలా ఉంటే.. రాజస్తాన్ రాయల్స్ను వీడిన నేపథ్యంలో సంజూ శాంసన్ సోషల్ మీడియాలో షేర్ చేసిన పోస్ట్ వైరల్గా మారింది. సమయం వచ్చింది గనుకే తాను జట్టును వీడానంటూ అతడు స్పష్టతనిచ్చాడు.నా సర్వస్వం ధారబోశానుఈ మేరకు.. ‘‘మనం ఇక్కడ (ప్రపంచంలో) కొన్నాళ్ల పాటే ఉంటాము. ఫ్రాంఛైజీ కోసం నా సర్వస్వం ధారబోశాను. క్రికెట్ను గొప్పగా ఆస్వాదించాను. జీవితానికి సరిపడా జ్ఞాపకాలు, బంధాలు పోగు చేసుకున్నాను. ఫ్రాంఛైజీలోని ప్రతి ఒక్కరిని నా కుటుంబ సభ్యుడిగానే భావించాను. ఇప్పుడు సమయం వచ్చింది.. అందుకే నేను ఈ జట్టును వీడి వెళ్తున్నా.నాకు ఇక్కడ లభించిన దానికి నేను ఎల్లప్పుడూ రుణపడే ఉంటాను’’ అంటూ సంజూ శాంసన్ ఉద్వేగానికి లోనయ్యాడు. ఈ సందర్భంగా రాయల్స్తో చేరిన తొలి నాళ్లలో దిగిన ఫొటోను సంజూ షేర్ చేశాడు. కాగా 2013లో రాజస్తాన్ రాయల్స్ జట్టులో చేరిన కేరళ స్టార్ సంజూ.. 2016లో ఢిల్లీ క్యాపిటల్స్కు మారాడు. రెండేళ్లు అదే జట్టుకు ఆడాడు.ఫైనల్కు చేర్చిన సారథిఆ తర్వాత మళ్లీ 2018లో రాయల్స్లోకి తిరిగి వచ్చిన ఈ వికెట్ కీపర్ బ్యాటర్.. 2025 వరకు జట్టుతో కొనసాగాడు. కెప్టెన్గా రాజస్తాన్ను ముందుకు నడిపించిన సంజూ 2022 సీజన్లో ఫైనల్కు చేర్చాడు. అయితే, గుజరాత్ టైటాన్స్తో టైటిల్ పోరులో ఓడిన రాజస్తాన్ రన్నరప్తో సరిపెట్టుకుంది. ఇదిలా ఉంటే.. ఐపీఎల్లో ఇప్పటి వరకు 176 మ్యాచ్లు ఆడిన సంజూ.. 4704 పరుగులు సాధించాడు. ఇందులో మూడు శతకాలు ఉండటం విశేషం.చదవండి: IPL 2026: సచిన్ తనయుడికి ముంబై ఇండియన్స్ షాక్ -
సీఎస్కేలోకి శాంసన్, రాజస్తాన్లోకి జడేజా..
ఐపీఎల్-2026 సీజన్ మినీ వేలానికి ముందు రాజస్తాన్ రాయల్స్-చెన్నై సూపర్ కింగ్స్ మధ్య స్వాప్ ట్రేడ్ డీల్ అధికారికంగా పూర్తి అయింది. రాజస్తాన్ కెప్టెన్ సంజూ శాంసన్ను సీఎస్కే ట్రేడ్ చేసుకుంది. అందుకు బదులుగా సీఎస్కే స్టార్ ఆల్రౌండర్లు రవీంద్ర జడేజా, సామ్ కుర్రాన్లను రాజస్తాన్కు పంపింది.గత సీజన్కు ముందు జడేజాను రూ.18 కోట్ల భారీ వెచ్చించి సీఎస్కే రిటైన్ చేసుకుంది. ఇప్పుడు జడేజా ధరను రూ.14 కోట్లకు తగ్గించి రాజస్తాన్ ట్రేడ్ చేసుకుంది. ఐపీఎల్ 2026 సీజన్లో రవీంద్ర జడేజా రూ.14 కోట్లు అందుకోబోతున్నాడు. సామ్ కుర్రాన్ను మాత్రం రూ. 2.4 కోట్ల ప్రస్తుత ధరకే రాయల్స్ తమ జట్టులోకి తీసుకుంది. అయితే సంజూ శాంసన్ మాత్రం ధర మారలేదు. అతడు సీఎస్కే నుంచి రూ.18 కోట్లు అందుకోనున్నాడు. ఈ ట్రేడ్ డీల్ను సీఎస్కే సోషల్ మీడియా వేదికగా ధ్రువీకరించింది. తమ ఫ్రాంచైజీకి ప్రాతినిథ్యం వహించినందుకు సీఎస్కే యాజమాన్యం ధన్యవాదాలు తెలిపింది. జడేజా 12 సీజన్ల పాటు సీఎస్కే తరపున ఆడాడు.లక్నోకి సచిన్ తనయుడు..ఐపీఎల్ 2026 వేలానికి ముందు ఫ్రాంఛైజీలు ఆటగాళ్ల రిటెన్షన్ జాబితాను సమర్పించడానికి నేడే ఆఖరి రోజు కావడంతో మరికొన్ని ముఖ్యమైన ట్రేడ్ డీల్స్ జరిగాయి. సన్రైజర్స్ హైదరాబాద్ నుంచి స్టార్ పేసర్ మహ్మద్ షమీని రూ.10 కోట్లకు లక్నో సూపర్ జెయింట్స్ ట్రేడ్ చేసుకుంది.అదేవిధంగా లెగ్ స్పిన్నర్ మయాంక్ మార్కండేను కోల్కతా నైట్రైడర్స్ నుంచి ముంబై ఇండియన్స్ రూ.30 లక్షల బెస్ప్రైస్కు ట్రేడ్ చేసుకుంది. సచిన్ టెండూల్కర్ తనయుడు అర్జున్ టెండూల్కర్ను అతడి ధర రూ.30 లక్షలకు లక్నో ట్రేడ్ చేసుకుంది.Aaj rumour nahi, headline likhna. Ravindra 𝑻𝒉𝒂𝒍𝒂𝒑𝒂𝒕𝒉𝒚 Jadeja is coming home ⚔️🔥 pic.twitter.com/XJT5b5plCy— Rajasthan Royals (@rajasthanroyals) November 15, 2025ఇప్పటివరకు జరిగిన ట్రేడ్ డీల్స్ ఇవే..1.రవీంద్ర జడేజా- చెన్నై సూపర్ కింగ్స్ టూ రాజస్థాన్ రాయల్స్ 2. సంజూ శాంసన్- రాజస్థాన్ రాయల్స్ టూ చెన్నై సూపర్ కింగ్స్3. సామ్ కుర్రాన్ -చెన్నై సూపర్ కింగ్స్ టూ రాజస్థాన్ రాయల్స్4. మహ్మద్ షమీ- సన్రైజర్స్ హైదరాబాద్ టూ లక్నో సూపర్ జెయింట్స్5. నితీష్ రాణా- రాజస్థాన్ రాయల్స్ టూ ఢిల్లీ క్యాపిటల్స్ 6.అర్జున్ టెండూల్కర్- ముంబై ఇండియన్స్ టూ లక్నో సూపర్ జెయింట్స్ 7. మయాంక్ మార్కండే- కోల్కతా నైట్ రైడర్స్ టూ ముంబై ఇండియన్స్8. డోనోవన్ ఫెరీరా - ఢిల్లీ క్యాపిటల్స్ టూ రాజస్థాన్ రాయల్స్9. శార్దూల్ ఠాకూర్ - లక్నో సూపర్ జెయింట్స్ టూ ముంబై ఇండియన్స్ -
ఐపీఎల్ చరిత్రలో అతి భారీ ట్రేడ్ డీల్స్ ఇవే..!
ఐపీఎల్ 2026కి సంబంధించి ఆటగాళ్ల రిటెన్షన్, ట్రేడ్ డీల్కు రేపే (నవంబర్ 15) చివరి తేదీ. ఈ నేపథ్యంలో పలానా ఫ్రాంచైజీ పలానా ఆటగాడిని ట్రేడ్ చేసుకుంటుంది, పలానా ఫ్రాంచైజీ పలానా ఆటగాళ్లను రిటైన్ చేసుకుంటుందనే ప్రచారం జోరుగా సాగుతుంది.ట్రేడ్ డీల్స్కు సంబంధించి చాలా అంశాలు ప్రచారంలో ఉన్నా, ఓ విషయం మాత్రం కొలిక్కి వచ్చినట్లు తెలుస్తుంది. సుదీర్ఘ చర్చల అనంతరం రాజస్థాన్ రాయల్స్-సీఎస్కే ఓ డీల్ కుదుర్చుకున్నాయని సమాచారం. రాయల్స్ సంజూ శాంసన్ను సీఎస్కేకు ఇచ్చి, బదులుగా రవీంద్ర జడేజా, సామ్ కర్రన్ను ట్రేడింగ్ చేసుకున్నట్లు తెలుస్తుంది. ఈ ట్రేడ్ డీల్ ఆసక్తికరంగా మారిన నేపథ్యంలో గతంలో జరిగిన ట్రేడ్ డీల్స్, అందులో భాగంగా జరిగిన భారీ క్యాష్ డీల్స్పై ఓ లుక్కేద్దాం. ఐపీఎల్ చరిత్రలో ఇప్పటివరకు చాలా ట్రేడ్ డీల్స్ జరిగాయి. ట్రేడ్ డీల్ అంటే ఫ్రాంచైజీలు ఆటగాళ్లను మార్చుకోవడం ఓ పద్దతి. రెండోది వేలం బయట ఆటగాళ్లను కొనుగోలు చేయడం (క్యాష్ డీల్).ఈ ట్రేడింగ్ విండో తొలిసారి 2009 ఎడిషన్ ప్రవేశ పెట్టబడింది. ఆ ఎడిషన్లో ఆర్సీబీ నుంచి జహీర్ ఖాన్ ముంబై ఇండియన్స్కు మారాడు. ముంబై ఇండియన్స్ నుంచి రాబిన్ ఉతప్ప ఆర్సీబీకి ట్రేడ్ అయ్యాడు.అలాగే ఢిల్లీ డేర్ డెవిల్స్ నుంచి ఆశిష్ నెహ్రా ముంబై ఇండియన్స్కు మారగా.. ముంబై ఇండియన్స్ నుంచి శిఖర్ ధవన్ ఢిల్లీ డేర్ డెవిల్స్కు ట్రేడ్ అయ్యాడు.2012లో దినేశ్ కార్తీక్ క్యాష్ డీల్లో భాగంగా పంజాబ్ కింగ్స్ నుంచి ముంబై ఇండియన్స్కు మారాడు.2013లో రాస్ టేలర్ ఢిల్లీ క్యాపిటల్స్ నుంచి పూణే వారియర్స్కు.. 2015లో పార్థివ్ పటేల్ ఆర్సీబీ నుంచి ముంబై ఇండియన్స్కు.. మన్విందర్ బిస్లా కేకేఆర్ నుంచి ఆర్సీబీకి క్యాష్ డీల్ ద్వారా బదిలి అయ్యారు. 2016లో కేదార్ జాదవ్ను ఆర్సీబీ ఢిల్లీ క్యాపిటల్స్ నుంచి స్వాప్ చేసుకుంది.2019లో మన్దీప్ సింగ్, మార్కస్ స్టోయినిస్ విషయంలో ఆర్సీబీ-పంజాబ్ కింగ్స్ మధ్య స్వాపింగ్ జరిగింది.2019లో శిఖర్ ధవన్ను డీసీ ఎస్ఆర్హెచ్ నుంచి ట్రేడ్ చేసుకుంది. శిఖర్కు బదులుగా ఎస్ఆర్హెచ్ డీసీ నుంచి విజయ్ శంకర్, అభిషేక్ శర్మ, నదీమ్ను పొందింది. 2019- అశ్విన్ (పంజాబ్ నుంచి ఢిల్లీకి, క్యాష్ డీల్, రూ. 7.6 కోట్లు)2019- రహానే (రాజస్థాన్ నుంచి ఢిల్లీకి,స్వాపింగ్, రహానేకు బదులుగా మయాంక్ మార్కండే, రాహుల్ తెవాటియా రాయల్స్కు ట్రేడ్ అయ్యారు)2019- ట్రెంట్ బౌల్ట్ (ఢిల్లీ నుంచి ముంబై ఇండియన్స్, క్యాష్ డీల్, రూ. 3.2 కోట్లు)2020- రాబిన్ ఉతప్ప (రాజస్థాన్ నుంచి సీఎస్కే, క్యాష్ డీల్)2020- డేవియల్ సామ్స్, హర్షల్ పటేల్ (డీసీ నుంచి ఆర్సీబీ, స్వాపింగ్)2022- శార్దూల్ ఠాకూర్ (డీసీ నుంచి కేకేఆర్, క్యాష్ డీల్, రూ. 10.75 కోట్లు)2023- ఆవేశ్ ఖాన్-దేవ్దత్ పడిక్కల్ (లక్నో నుంచి రాజస్థాన్, స్వాపింగ్)2024- హార్దిక్ పాండ్యా- గుజరాత్ నుంచి ముంబై ఇండియన్స్ (క్యాష్ డీల్, రూ. 15 కోట్లు)2024- కెమరాన్ గ్రీన్- ముంబై ఇండియన్స్ నుంచి ఆర్సీబీ (క్యాష్ డీల్, రూ. 17.5 కోట్లు)- ఐపీఎల్ చరిత్రలో ఇదే అతి భారీ క్యాష్ డీల్చదవండి: IPL 2026: రేపే 'డెడ్లైన్' -
సంజూ, గిల్ కాదు!.. వాళ్లిద్దరే సరిజోడి
భారత టీ20 జట్టులో శుబ్మన్ గిల్ (Shubman Gill) అవసరమా?.. క్రికెట్ వర్గాల్లో చాన్నాళ్లుగా ఇదే చర్చ. టెస్టు, వన్డేల్లో సత్తా చాటుతూ ఏకంగా కెప్టెన్గా ఎదిగిన ఈ పంజాబీ బ్యాటర్.. అంతర్జాతీయ పొట్టి ఫార్మాట్లో స్థాయికి తగ్గట్లు ఆడలేకపోవడం ఇందుకు కారణం.దాదాపు ఏడాది కాలం పాటు భారత టీ20 జట్టుకు దూరంగా ఉన్న గిల్ను.. సెలక్టర్లు ఆసియా కప్ సందర్భంగా వైస్ కెప్టెన్గా తిరిగి తీసుకువచ్చారు. దీంతో అప్పటిదాకా ఓపెనింగ్ జోడీగా పాతుకుపోయిన అభిషేక్ శర్మ (Abhishek Sharma)- సంజూ శాంసన్ (Sanju Samson) విడిపోయారు.అంతంత మాత్రమేగిల్ ఓపెనర్గా రీఎంట్రీ ఇవ్వగా.. సంజూకు బ్యాటింగ్ ఆర్డర్లో ప్రత్యేక స్థానం అంటూ లేకుండా పోయింది. ఇక ఇటీవల ఆస్ట్రేలియా పర్యటనలోనూ గిల్ మరోసారి టీ20 ఫార్మాట్లో తన బలహీనతను బయటపెట్టుకున్నాడు. ఐదు మ్యాచ్ల టీ20 సిరీస్లో భాగంగా కేవలం 132 పరుగులే చేశాడు.ఈ నేపథ్యంలో మరోసారి గిల్ విమర్శలు పాలయ్యాడు. అతడి కారణంగా సంజూ శాంసన్తో పాటు యశస్వి జైస్వాల్ కూడా మూల్యం చెల్లించాల్సి వస్తోందని మాజీ క్రికెటర్లు విమర్శిస్తున్నారు. ఈ క్రమంలో భారత దిగ్గజ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ భారత టీ20 ఓపెనింగ్ జోడీ గురించి కీలక వ్యాఖ్యలు చేశాడు.అశ్ కీ బాత్లో మాట్లాడుతూ.. ‘‘టెస్టు ఫార్మాట్కు.. టీ20లకు ఎలాంటి పోలికా ఉండదు. ప్రతి ఫార్మాట్ దేనికదే ప్రత్యేకం. ఏదేమైనా రెండు ఫార్మాట్లలో జైస్వాల్ ఇప్పటికే తనను తాను నిరూపించుకున్నాడు.పవర్ ప్లేలో సూపర్టెస్టుల్లో పరుగులు చేయడం ద్వారా అతడు టీ20 జట్టులోకి రాలేడు. కానీ ఇప్పటికే పొట్టి క్రికెట్లో అతడికి మంచి రికార్డు ఉందన్న విషయం గుర్తుపెట్టుకోవాలి. 160కి పైగా స్ట్రైక్రేటుతో పరుగులు రాబట్టాడు. ముఖ్యంగా పవర్ ప్లేలో సూపర్గా ఆడతాడు.అతడి సగటు కూడా బాగుంది. ప్రస్తుతం అభిషేక్ శర్మతో పాటు విధ్వంసకర ఇన్నింగ్స్ ఆడగల సత్తా జైస్వాల్కే ఉంది. ఒకవేళ టీమిండియా అగ్రెసివ్ ఓపెనర్లను కోరుకుంటే వీళ్లిద్దరే సరిజోడి. అలా కాకుండా ఫైర్ అండ్ ఐస్ కాంబినేషన్ కావాలనుకుంటే అభిషేక్- గిల్ జోడీవైపు మొగ్గు చూపవచ్చు’’ అని అశ్విన్ పేర్కొన్నాడు.వాళ్లిద్దరే సరి జోడీఅభిషేక్ శర్మ దూకుడుగా ఆడితే.. గిల్ మాత్రం నెమ్మదిగా ఆడతాడనే ఉద్దేశంలో అశూ ఈ మేరకు వ్యాఖ్యలు చేశాడు. కాగా ఇటీవల మరో మాజీ క్రికెటర్ రమేశ్ సదగోపన్ మాట్లాడుతూ.. అభిషేక్ తుఫాన్ ఇన్నింగ్స్లో గిల్.. టేబుల్ ఫ్యాన్ను తలపిస్తున్నాడంటూ విమర్శించిన విషయం తెలిసిందే. తుఫాన్ ఉన్నంత వరకు టేబుల్ ఫ్యాన్పై దృష్టి పడదంటూ ఘాటు విమర్శలు చేశాడు. కాగా ఆస్ట్రేలియా పర్యటన ముగించుకున్న టీమిండియా.. స్వదేశంలో టెస్టు, వన్డే, టీ20 సిరీస్లు ఆడేందుకు సిద్ధమైంది. చదవండి: భారత జట్టులో ఆయుశ్ మాత్రే, వైభవ్ సూర్యవంశీలకు దక్కని చోటు.. కారణం ఇదే -
రాజస్తాన్ రాయల్స్ కొత్త కెప్టెన్గా అతడే!
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL) ఫ్రాంఛైజీ రాజస్తాన్ రాయల్స్తో టీమిండియా స్టార్ సంజూ శాంసన్ (Sanju Samson) బంధం ముగిసినట్లు తెలుస్తోంది. పదకొండు సీజన్లుగా రాజస్తాన్ జట్టుతో కొనసాగిన ఈ కేరళ వికెట్ కీపర్ బ్యాటర్.. కెప్టెన్గానూ సేవలు అందించాడు.ఐపీఎల్లో మొట్టమొదటి విజేత అయిన రాజస్తాన్ను.. పద్నాలుగేళ్ల సుదీర్ఘ నిరీక్షణ తర్వాత తన సారథ్యంలో రెండోసారి ఫైనల్ (2022)కు చేర్చాడు సంజూ. అయితే దురదృష్టవశాత్తూ గుజరాత్ టైటాన్స్తో ఫైనల్లో ఓడిపోవడంతో రాజస్తాన్తో పాటు కెప్టెన్గా కప్పు గెలవాలన్న సంజూ ఆశలకు గండిపడింది.యాజమాన్యంతో విభేదాలుకాగా గత కొంతకాలంగా సంజూకు.. రాజస్తాన్ జట్టు యాజమాన్యంతో విభేదాలు తలెత్తినట్లు వార్తలు వచ్చాయి. ఈ నేపథ్యంలో ఐపీఎల్-2026 వేలానికి ముందే ట్రేడింగ్ ద్వారా జట్టు మారేందుకు సంజూ నిశ్చియించుకున్నాడనే ప్రచారం తాజాగా జోరందుకుంది. చెన్నై సూపర్ కింగ్స్ (CSK) సంజూను రాజస్తాన్ నుంచి ట్రేడింగ్ (స్వాప్ డీల్) ద్వారా దక్కించుకోవడం దాదాపు ఖరారైనట్లు తెలుస్తోంది.రవీంద్ర జడేజా (Ravindra Jadeja)ను రాజస్తాన్కు ఇచ్చి.. అందుకు బదులుగా సంజూను సీఎస్కే దక్కించుకోనుందనే వార్తలు వినిపిస్తున్నాయి. ఒకవేళ అదే జరిగితే.. రాజస్తాన్ జట్టుకు కొత్త కెప్టెన్ ఎవరనే చర్చ మొదలైంది. రియాన్ పరాగ్ కాదు!కాగా సంజూ గైర్హాజరీలో అస్సాం ఆటగాడు రియాన్ పరాగ్ జట్టును ముందుకు నడిపించాడు. ఐపీఎల్-2025లో సంజూ ఫిట్నెస్ సమస్యల వల్ల కెప్టెన్సీని దూరంగా ఉండగా.. పరాగ్ సారథిగా ఏమాత్రం ఆకట్టుకోలేకపోయాడు.ఈసారి రాజస్తాన్ మరీ దారుణంగా పద్నాలుగింట కేవలం నాలుగు మాత్రమే గెలిచి తొమ్మిదో స్థానానికి పరిమితమైంది. ఈ నేపథ్యంలో పరాగ్కు కెప్టెన్సీ ఇవ్వకపోవచ్చనే అభిప్రాయాలు వ్యక్తం అవుతుండగా... టీమిండియా నయా సంచలనం ధ్రువ్ జురెల్ పేరు తెర మీదకు వచ్చింది.కెప్టెన్సీ రేసులో ఇద్దరురూ. 20 లక్షల కనీస ధరతో రాజస్తాన్ క్యాంపులోకి వచ్చిన జురెల్ అనతికాలంలోనే.. జట్టులో కీలక ఆటగాడిగా ఎదిగాడు. ఈ క్రమంలోనే అతడిని ఫ్రాంఛైజీ రూ. 14 కోట్ల భారీ మొత్తానికి గతేడాది రిటైన్ చేసుకుంది. గత కొంతకాలంగా అతడు సూపర్ఫామ్లో ఉన్నాడు. టీమిండియాలోనూ కీలక సభ్యుడిగా మారాడు.అంతేకాదు.. అనధికారిక టెస్టు సిరీస్లో భారత్- ‘ఎ’ జట్టు కెప్టెన్గా పనిచేసిన అనుభవం కూడా జురెల్కు ఉంది. అదే విధంగా.. అండర్-19 స్థాయిలో 2020 వరల్డ్కప్లో భారత జట్టు వైస్ కెప్టెన్గానూ జురెల్ సేవలు అందించాడు. ఇక యూపీ టీ20 లీగ్లో గోరఖ్పూర్ లయన్స్ జట్టుకు సారథి కూడా జురెలే!ఈ నేపథ్యంలో పరాగ్ను కాదని.. మేనేజ్మెంట్ జురెల్ వైపే మొగ్గుచూపుతుందనే విశ్లేషణలు వినిపిస్తున్నాయి. అయితే, మరికొందరు విశ్లేషకులు మాత్రం టీమిండియా స్టార్ ఓపెనర్ యశస్వి జైస్వాల్కే రాజస్తాన్ పగ్గాలు అప్పగిస్తారనే విశ్వాసం వ్యక్తం చేస్తున్నారు.కాగా 2020లో రాజస్తాన్ తరఫున అరంగేట్రం చేసిన జైస్వాల్.. ఇప్పటికి 66 మ్యాచ్లలో కలిపి 2166 పరుగులు సాధించాడు. ఈ లెఫ్టాండర్ ఖాతాలో రెండు సెంచరీలు కూడా ఉన్నాయి. అయితే, 23 ఏళ్ల జైసూకు ఏ స్థాయిలోనూ కెప్టెన్గా పనిచేసిన అనుభవం మాత్రం లేదు. అయితే, అతడి అవకాశాలను మాత్రం కొట్టిపడేయలేము.రాయల్స్ కొత్త కెప్టెన్గా అతడే!రాజస్తాన్ రాయల్స్ కొత్త హెడ్కోచ్ కుమార్ సంగక్కర.. జురెల్తో పాటు జైస్వాల్ కెప్టెన్సీ రేసులో ఉన్నాడని చెప్పినట్లు టైమ్స్ ఆఫ్ ఇండియా కథనం పేర్కొనడం గమనార్హం. అయితే, ఇంపాక్ట్ రూల్ ప్రకారం ఓపెనర్గా జైసూకు ప్రత్యామ్నాయం ఉంటుంది. కానీ వికెట్ కీపర్గా 24 ఏళ్ల జురెల్ కొనసాగుతాడు! కాబట్టి ప్లేయింగ్ ఎలెవన్లో తప్పకుండా ఉంటాడు. అందుకే అతడికే కెప్టెన్సీ చేపట్టే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి.చదవండి: ‘ఆడమని బతిమిలాడినా పట్టించుకోలేదు... సెలక్టర్లు అడిగినా రాలేదు’ -
సీఎస్కే కెప్టెన్గా సంజూ శాంసన్..! రాజస్తాన్లోకి జడేజా?
ఐపీఎల్-2026 మినీ వేలానికి ముందు రాజస్థాన్ రాయల్స్ (RR), చెన్నై సూపర్ కింగ్స్ (CSK) మధ్య సంచలన ట్రేడ్ డీల్ జరగనున్నట్లు తెలుస్తోంది. టీమిండియా స్టార్ సంజూ శాంస్న్ను రాజస్తాన్ నుంచి ట్రేడ్ చేసుకునేందుకు సీఎస్కే సిద్దమైనట్లు సమాచారం.ఐపీఎల్-2025 నుంచి శాంసన్, రాయల్స్ మధ్య విబేధాలు తలెత్తాయి. దీంతో రాజస్తాన్ ఫ్రాంచైజీని వీడాలని సంజూ నిర్ణయించుకున్నాడు. ఈ క్రమంలో సంజూ శాంసన్ను ఢిల్లీ క్యాపిటల్స్ తమ జట్టులోకి తీసుకోవాలని భావించింది. కానీ రాజస్తాన్, ఢిల్లీ మధ్య ట్రేడ్ డీల్ కుదరకపోయినట్లు ఐపీఎల్ వర్గాలు వెల్లడించాయి. ఇప్పుడు సీఎస్కే ఎంట్రీ ఇచ్చింది. సంజూ శాంసన్కు బదులుగా స్టార్ ఆల్రౌండర్ రవీంద్ర జడేజాను ఇచ్చేందుకు సీఎస్కే ప్రాంఛైజీ అంగీకరించినట్లు వార్తలు వచ్చాయి. కానీ అందుకు రాజస్తాన్ ఒప్పుకోలేదంట. జడేజాతో పాటు సౌతాఫ్రికా స్టార్ క్రికెటర్ డెవాల్డ్ బ్రెవిస్ను కూడా ఇవ్వాలని రాయల్స్ యాజమాన్యం డిమాండ్ చేసింది.అందుకు సీఎస్కే కూడా అంగీకరించింది. కానీ కొన్ని గంటల వ్యవధిలోనే రాజస్తాన్ తమ మనసు మార్చుకుంది. ఈఎస్పీఎన్ క్రిక్ఇన్ఫో ప్రకారం.. రాజస్తాన్ ఇప్పుడు బ్రెవిస్ను కాకుండా ఇంగ్లాండ్ ఆల్రౌండర్ సామ్ కరన్ను జడేజాతో పాటు కావాలని డిమాండ్ చేస్తున్నట్లు సమాచారం.రాజస్తాన్ మాస్టర్ ప్లాన్..ఒకే దెబ్బకు ఇద్దరు వరల్డ్ క్లాస్ ఆల్రౌండర్లను సొంతం చేసుకోవాలని రాజస్తాన్ ప్లాన్ చేసింది. అయితే అందుకోసం సీఎస్కే రూ. 2.40 కోట్లు చెల్లాంచాల్సి ఉంటుంది. శాంసన్, జడేజా ఇద్దరూ జీతం కూడా రూ. 18 కోట్లే. కాబట్టి ఇది సరిసమాన ట్రేడ్(స్వాప్ డీల్) అవుతోంది. కానీ కుర్రాన్ సీఎస్కే నుంచి రూ. 2.40 కోట్లు అందుకుంటున్నాడు. దీంతో ఆ మొత్తాన్ని రాజస్తాన్ సీఎస్కే ఇవ్వాల్సి ఉంటుంది. అయితే సీఎస్కే-రాజస్తాన్ మధ్య డీల్ దాదాపు ఖరారైనట్లు తెలుస్తోంది. త్వరలోనే అధికారిక ప్రకటన వచ్చే అవకాశముంది. అంతేకాకుండా సీఎస్కే యాజమాన్యం తమ జట్టు పగ్గాలను శాంసన్కు అప్పగించే యోచనలో కూడా ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది.ఇక ఐపీఎల్-2026 మినీ వేలం డిసెంబర్ ఆఖరిలో జరిగే ఛాన్స్ ఉంది. ఆయా ఫ్రాంచైజీలు నవంబర్ 15 లోపు తమ రిటెన్షన్ జాబితాను బీసీసీఐ సమర్పించాల్సి ఉంది.ఐపీఎల్ చరిత్రలో భారీ ట్రేడ్ డీల్స్ ఇవే..కామెరూన్ గ్రీన్-2024 సీజన్- ముంబై ఇండియన్స్ నుంచి రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు- రూ. 17.5 కోట్లుహార్దిక్ పాండ్యా- 2024 సీజన్- గుజరాత్ టైటాన్స్ నుంచి ముంబై ఇండియన్స్ (MI)-రూ. 17.5 కోట్లుశిఖర్ ధావన్- 2019 సీజన్- సన్రైజర్స్ హైదరాబాద్ నుంచి ఢిల్లీ క్యాపిటల్స్ (DC)- రూ. 12.5 కోట్లుచదవండి: ఆ ఓవరాక్షనే వద్దనేది.. అదేమైనా వరల్డ్ కప్ ట్రోఫీనా? -
‘అందుకే.. సంజూను కాదని జితేశ్ శర్మను ఆడిస్తున్నారు’
ఆసియా కప్-2025 సందర్భంగా భారత టీ20 జట్టులోకి శుబ్మన్ గిల్ (Shubman Gill) తిరిగి వచ్చిన నాటి నుంచి సంజూ శాంసన్ (Sanju Samson) చిక్కుల్లో పడ్డాడు. గిల్ గైర్హాజరీలో దాదాపు ఏడాది పాటు ఓపెనర్గా అదరగొట్టిన ఈ కేరళ బ్యాటర్కు ఇప్పుడు తుదిజట్టులో చోటే కరువయ్యే పరిస్థితి నెలకొంది.ఏ స్థానంలో బ్యాటింగ్కు రావాలో తెలియదుఒకవేళ ప్లేయింగ్ ఎలెవన్కు ఎంపికైనా.. ఏ స్థానంలో బ్యాటింగ్కు రావాలో ఆఖరి నిమిషం వరకు తనకే తెలియని దుస్థితి. ఆస్ట్రేలియా తాజా పర్యటన (IND vs AUS)లో ఐదు మ్యాచ్ల సిరీస్లో భాగంగా తొలి టీ20 వర్షార్పణం కాగా.. రెండో టీ20లో సంజూను వన్డౌన్లో ఆడించారు. అయితే, ఈ స్థానంలో సంజూ దారుణంగా విఫలమయ్యాడు. కేవలం రెండు పరుగులే చేసి నాథన్ ఎల్లిస్ బౌలింగ్లో బౌల్డ్ అయ్యాడు.ఈ క్రమంలో మూడో టీ20 నుంచి సంజూను తప్పించిన యాజమాన్యం అతడి స్థానంలో మరో వికెట్ కీపర్ బ్యాటర్ జితేశ్ శర్మకు చోటు కల్పించింది. ఏడో స్థానంలో వచ్చిన జితేశ్ 13 బంతుల్లో 22 పరుగులతో అజేయంగా నిలిచాడు. ఇక నాలుగో టీ20లో మాత్రం కేవలం మూడే పరుగులు చేసి నిష్క్రమించాడు.ఇదిలా ఉంటే.. ఆసీస్తో నాలుగో టీ20లో టీమిండియా మేనేజ్మెంట్ మరో ప్రయోగం చేసింది. ఆల్రౌండర్ శివం దూబేను మూడో స్థానంలో పంపింది. ఈ పరిణామాల నేపథ్యంలో భారత మాజీ క్రికెటర్ మొహమ్మద్ కైఫ్.. గిల్, సంజూ, జితేశ్లతో పాటు యశస్వి జైస్వాల్ను ఉద్దేశించి కీలక వ్యాఖ్యలు చేశాడు.గిల్ కోసం బలి‘‘ఒకవేళ సంజూ శాంసన్ తుదిజట్టులో ఉంటే బ్యాటింగ్ ఆర్డర్లో ఎలాంటి కన్ఫ్యూజన్ ఉండదు. అయితే, వైస్ కెప్టెన్ హోదాలో శుబ్మన్ గిల్ అన్ని మ్యాచ్లు ఆడటం ఖాయం. అందుకే సంజూను పక్కనపెట్టారు.సంజూను కాదని ..ఇక ఐదు లేదంటే ఆరో స్థానంలో ఫినిషర్గా.. సంజూ కంటే జితేశ్ మెరుగు అని భావించి అతడి వైపు మేనేజ్మెంట్ మొగ్గు చూపుతోంది. గిల్ కాబోయే కెప్టెన్ కాబట్టి సంజూకు ఇక స్థానం దక్కకపోవచ్చు.ఏదేమైనా సంజూ రికార్డు అద్భుతంగా ఉంది. 150కి పైగా స్ట్రైక్రేటుతో అతడు పరుగులు రాబట్టాడు. కానీ ఇప్పుడు ఏ స్థానంలో ఎవరు బెటర్ అన్న అంశం ఆధారంగానే జట్టును ఎంపిక చేస్తున్నారు కాబట్టి సంజూకు అవకాశం దక్కడం లేదు.గిల్ టీ20లలో మరీ అంత తీసిపారేసే బ్యాటరేమీ కాదు. ఐపీఎల్లో గుజరాత్ టైటాన్స్ ఓపెనర్గా మెరుగ్గా ఆడుతున్నాడు. కానీ అంతర్జాతీయ ఫార్మాట్లోనే విఫలమవుతున్నాడు. భారీ ఇన్నింగ్స్ ఆడితే తప్ప అతడిపై విమర్శలు ఆగవు. సంజూతో పాటు జైసూ జట్టులోకి!అప్పుడే సంజూ, యశస్వి జైస్వాల్ గురించి ఎవరూ మాట్లాడరు. సౌతాఫ్రికాతో స్వదేశంలో టీ20 సిరీస్లో గిల్కు విశ్రాంతినిచ్చే అవకాశం ఉంది. కాబట్టి ఓపెనింగ్ స్థానంలో సంజూ, జైసూ జట్టులోకి రావొచ్చు. వీరిద్దరు గనుక మరోసారి నిరూపించుకుంటే.. వరల్డ్కప్ రేసులో తప్పక ఉంటారు’’ అని కైఫ్ అభిప్రాయపడ్డాడు.కాగా ఆసీస్తో నాలుగు టీ20లలో కలిపి గిల్ కేవలం 103 పరుగులు రాబట్టాడు. ఈ సిరీస్లో భారత్ 2-1తో ముందంజలో ఉండగా.. ఇరుజట్ల మధ్య నిర్ణయాత్మక శనివారం నాటి ఐదో టీ20కి గబ్బా వేదిక.చదవండి: ICC: జై షా జోక్యం.. నాకూ వరల్డ్కప్ మెడల్: ప్రతికా రావల్ -
పాపం సంజూ శాంసన్..
క్వీన్స్ లాండ్ వేదికగా గురువారం (నవంబర్ 6) ఆస్ట్రేలియాతో జరగనున్న నాలుగో టీ20లో తలపడేందుకు భారత జట్టు సిద్దమవుతోంది. ఈ మ్యాచ్లో ఎలాగైనా గెలిచి సిరీస్లో 2-1 ఆధిక్యం సాధించాలని టీమిండియా పట్టుదలతో ఉంది. కాన్బెర్రాలో తొలి టీ20 వర్షం కారణంగా రద్దు కాగా.. మెల్బోర్న్ వేదికగా జరిగిన రెండో టీ20లో టీమిండియా ఘోర ఓటమి చవిచూసింది. కానీ హోబర్ట్లో జరిగిన మూడో టీ20లో మాత్రం ఆసీస్ను 5 వికెట్ల తేడాతో చిత్తు చేసిన భారత్.. ఐదు టీ20ల సిరీస్ను 1-1తో సమం చేసింది. దీంతో ఇప్పుడు అందరి కళ్లు నాలుగో టీ20 పైనే పడ్డాయి. ఈ మ్యాచ్లో ఎవరు గెలుస్తారా అని అభిమానులు ఆతృతగా ఎదురు చూస్తున్నారు. ఈ కీలక పోరులో టీమిండియా పలు మార్పులతో బరిలోకి దిగనున్నట్లు తెలుస్తోంది.దూబేపై వేటు.. రాణాకు చోటుహోబర్ట్ టీ20లో బెంచ్కే పరిమితమైన హర్షిత్ రాణా.. నాలుగవ టీ20కి తిరిగి తుది జట్టులోకి వచ్చే అవకాశం ఉంది. గత మ్యాచ్లో బౌలింగ్లో విఫలమైన ఆల్రౌండర్ శివమ్ దూబేను పక్కన పెట్టనున్నట్లు తెలుస్తోంది. దూబే స్దానంలోనే రాణా ప్లేయింగ్ ఎలెవన్లోకి రానున్నట్లు పలు రిపోర్ట్లు పేర్కొంటున్నాయి. మెల్బోర్న్ టీ20లో మిడిలార్డర్లో బ్యాటింగ్ వచ్చి కీలక నాక్ ఆడిన రాణాకు హెడ్కోచ్ గౌతమ్ గంభీర్ మరో అవకాశమివ్వనున్నట్లు సమాచారం.సంజూకు నో ఛాన్స్..ఇక వికెట్ కీపర్-బ్యాటర్ సంజు శాంసన్ మళ్లీ బెంచ్కే పరిమితమయ్యే అవకాశం ఉంది. హోబర్ట్లో ఆడిన జితేశ్ శర్మను తుది జట్టులో కొనసాగించాలని భారత జట్టు మెనెజ్మెంట్ భావిస్తుందంట. గత మ్యాచ్లో జితేశ్ మ్యాచ్ విన్నింగ్ నాక్ ఆడాడు. కేవలం 3 బంతుల్లో 22 పరుగులు చేసి భారత్ విజయంలో కీలకపాత్ర పోషించాడు.ఈ సిరీస్లో సంజూ తొలి రెండు మ్యాచ్లో ఆడినప్పటికి ఒక్క మ్యాచ్లోనే బ్యాటింగ్ చేసే ఛాన్స్ వచ్చింది. మెల్బోర్న్ టీ20లో టాపార్డర్లో బ్యాటింగ్కు వచ్చిన శాంసన్ తీవ్ర నిరాశపరిచాడు. దీంతో అతడిని మూడో టీ20కు పక్కన పెట్టారు.మరోవైపు అక్షర్ పటేల్, వరుణ్ చక్రవర్తి, వాషింగ్టన్ సుందర్లో కూడిన స్పిన్ త్రయాన్ని భారత్ కొనసాగించనుంది. గత మ్యాచ్లో ఒక్క ఓవర్ కూడా వేయని సుందర్కు నాలుగో టీ20లోనైనా బౌలింగ్ చేసే అవకాశం దక్కుతుందో లేదో వేచి చూడాలి. కానీ హెబర్ట్లో సుందర్ బ్యాట్తో మాత్రం అద్భుతం చేశాడు. ఫాస్ట్ బౌలింగ్ విభాగంలో అర్ష్దీప్ సింగ్, జస్ప్రీత్ బుమ్రాతో పాటు హర్షిత్ రాణా బంతిని పంచుకోనున్నాడు.భారత తుది జట్టు(అంచనా)శుభమన్ గిల్ (వైస్ కెప్టెన్), అభిషేక్ శర్మ, సూర్యకుమార్ యాదవ్ (కెప్టెన్), తిలక్ వర్మ, జితేష్ శర్మ, వాషింగ్టన్ సుందర్, అక్షర్ పటేల్, హర్షిత్ రాణా, వరుణ్ చక్రవర్తి, అర్ష్దీప్ సింగ్, జస్ప్రీత్ బుమ్రాచదవండి: కావ్య మారన్ సంచలన నిర్ణయం.. జట్టు పేరు మార్పు -
ఢిల్లీ క్యాపిటల్స్కు సంజూ శాంసన్..!
ఐపీఎల్ 2026 వేలానికి ముందు సంజూ శాంసన్ రాజస్థాన్ రాయల్స్ (RR) ఫ్రాంచైజీని వీడనున్నాడా? అంటే అవునానే సమాధానం ఎక్కువగా వినిపిస్తోంది. రాజస్తాన్ నుంచి శాంసన్ను ట్రేడ్ చేసుకోవడానికి ఢిల్లీ క్యాపిటల్స్ ఫ్రాంచైజీ సిద్దంగా ఉన్నట్లు తెలుస్తోంది. గత సీజన్ నుంచి రాయల్స్, సంజు శాంసన్ మధ్య విభేదాలు తలెత్తాయి.దీంతో సంజూను రాజస్తాన్ మెనెజ్మెంట్ విడిచిపెట్టేందుకు ఆసక్తిగా ఉందంట. ప్రస్తుతం కెప్టెన్గా ఉన్న శాంసన్ సైతం రాజస్తాన్ నుంచి బయటకు వచ్చేందుకు మొగ్గు చూపుతున్నట్లు వార్తలు వస్తున్నాయి. టైమ్స్ ఆఫ్ ఇండియా నివేదిక ప్రకారం.. వచ్చే సీజన్లో శాంసన్ ఢిల్లీ క్యాపిటల్స్ తరపున ఆడనున్నట్లు సమాచారం.రాజస్తాన్లోకి స్టబ్స్..రాజస్తాన్ ఫ్రాంచైజీ శాంసన్కు బదులుగా మరో వికెట్ కీపర్ బ్యాటర్ కేఎల్ రాహుల్ను ఇవ్వాలని ఢిల్లీని డిమాండ్ చేసినట్లు ప్రచారం జరుగుతోంది. అయితే అందుకు ఢిల్లీ యాజమాన్యం ఒప్పుకోలేదని ఐపీఎల్ వర్గాలు వెల్లడించాయి. కానీ రాహుల్కు బదులుగా దక్షిణాఫ్రికా బ్యాటర్ అయిన ట్రిస్టన్ స్టబ్స్ను ఇచ్చేందుకు తాము సిద్దమని ఢిల్లీ తెలిపినట్లు తెలుస్తోంది. అందుకు రాజస్తాన్ అంగీకరించినట్లు వినికిడి. స్టబ్స్తో పాటు ఓ అన్క్యాప్డ్ భారత ఆటగాడిని పంపమని ఆర్ఆర్ కోరిందంట.ఎందుంకంటే సంజు శాంసన్ ధర రూ.18 కోట్లు కాగా, స్టబ్స్ విలువ రూ.10 కోట్లు. ఎనిమిది కోట్లు వ్యత్యాసం రావడంతో ఓ అన్క్యాప్డ్ ఆటగాడిని తీసుకోవాలని రాజస్తాన్ భావిస్తోంది. ఆర్ఆర్కు మంచి ఫినిషర్ లేని లోటును స్టబ్స్ తీర్చగలడు. ఒకవేళ అన్క్యాప్డ్ ఆటగాడిని ఢిల్లీ ట్రేడ్ చేయకపోతే, మిగిలిన మొత్తాన్ని (సుమారు రూ.8 కోట్లు) రాజస్తాన్కు చెల్లించాల్సి ఉంటుంది. దీంతో ఐపీఎల్-2026 వేలంలో రాజస్తాన్ పర్స్ విలువ పెరుగుతుంది. కాగా సంజూ శాంసన్ తన ఐపీఎల్ అరంగేట్రం ఢిల్లీ క్యాపిటల్స్(అప్పటిలో ఢిల్లీ డేర్డేవిల్స్) తరపునే చేశాడు. -
పిచ్చి ప్రయోగాలు ఆపండి: సూర్య, గంభీర్పై మాజీ క్రికెటర్ ఫైర్
ఆస్ట్రేలియాతో రెండో టీ20లో టీమిండియా (IND vs AUS 2nd T20) యాజమాన్యం అనుసరించిన వ్యూహాలపై విమర్శలు వస్తున్నాయి. బ్యాటింగ్ ఆర్డర్లో ఇష్టారీతిన మార్పులు చేయడం వల్లే భారీ మూల్యం చెల్లించాల్సి వచ్చిందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. కాగా ఆసీస్తో టీ20 సిరీస్ను కూడా టీమిండియా ఓటమితో మొదలు పెట్టింది. కాన్బెర్రాలో జరగాల్సిన తొలి మ్యాచ్ వర్షార్పణం కాగా.. శుక్రవారం నాటి రెండో టీ20లో నెగ్గిన ఆసీస్ సిరీస్లో 1–0తో ముందంజ వేసింది. 125 పరుగులకే ఆలౌట్మెల్బోర్న్ క్రికెట్ గ్రౌండ్లో జరిగిన రెండో టీ20 మ్యాచ్లో ఆసీస్ 4 వికెట్లతో టీమిండియాపై విజయం సాధించింది. టాస్ ఓడి ముందుగా బ్యాటింగ్కు దిగిన భారత్ 18.4 ఓవర్లలో 125 పరుగులకే కుప్పకూలింది. అభిషేక్ శర్మ (Abhishek Sharma- 37 బంతుల్లో 68; 8 ఫోర్లు, 2 సిక్స్లు) తనదైన శైలిలో దూకుడుగా ఆడి అర్ధ సెంచరీ సాధించగా, హర్షిత్ రాణా (33 బంతుల్లో 35; 3 ఫోర్లు, 1 సిక్స్) రాణించాడు. వీరిద్దరు ఆరో వికెట్కు 47 బంతుల్లో 56 పరుగులు జోడించారు.‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’ జోష్ హాజిల్వుడ్ (3/13) మూడు కీలక వికెట్లు తీసి భారత్ను దెబ్బ తీశాడు. అనంతరం ఆస్ట్రేలియా 13.2 ఓవర్లలో 6 వికెట్లకు 126 పరుగులు చేసి విజయాన్నందుకుంది.GOOD GRIEF JOSH INGLIS 🤩 #AUSvIND | #PlayoftheDay | @BKTtires pic.twitter.com/g2Qb2CW7Pj— cricket.com.au (@cricketcomau) October 31, 2025 ఆసీస్ అలవోకగాఓపెనర్లు మిచెల్ మార్ష్ (26 బంతుల్లో 46; 2 ఫోర్లు, 4 సిక్స్లు), ట్రవిస్ హెడ్ (15 బంతుల్లో 28; 3 ఫోర్లు, 1 సిక్స్) తొలి వికెట్కు 28 బంతుల్లోనే 51 పరుగులు జోడించి ఆసీస్ గెలుపునకు పునాది వేశారు. జోష్ ఇంగ్లిస్ (20), మిచెల్ ఓవెన్ (14) ఓ మోస్తరుగా రాణించగా.. మార్స్ స్టొయినిస్ (6 నాటౌట్) పని పూర్తి చేశాడు.పిచ్చి ప్రయోగాలు ఆపండిఈ నేపథ్యంలో టీమిండియా ఓటమిపై భారత మాజీ క్రికెటర్ సదగోపన్ రమేశ్ స్పందించాడు. బ్యాటింగ్ ఆర్డర్లో ఇష్టం వచ్చినట్లుగా మార్పులు చేయడాన్ని తప్పుబట్టాడు. ‘‘ఇప్పటికైనా బ్యాటింగ్ ఆర్డర్లో పిచ్చి ప్రయోగాలకు టీమిండియా స్వస్తి పలకాలి.ఈ మ్యాచ్లో 160- 170 పరుగులు స్కోరు చేసి గెలవగల సత్తా టీమిండియాకు ఉంది. గత మ్యాచ్లో కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ మూడో స్థానంలో వచ్చి అదరగొట్టాడు. నాటౌట్గా నిలిచాడు.కానీ ఈ మ్యాచ్లో వన్డౌన్లో సంజూను ఎందుకు తీసుకువచ్చారు?.. సంజూను ఓపెనింగ్ స్థానం నుంచి మిడిలార్డర్కు పంపారు. మళ్లీ ఇప్పుడు ఐదు నుంచి మూడో స్థానానికి మార్చారు. ఇలాంటి పనుల వల్ల ఎవరు ఎప్పుడు బ్యాటింగ్కు రావాలో తెలియని గందరగోళం నెలకొంటుంది.తిలక వర్మ ఆసియా కప్ ఫైనల్లో నాలుగో స్థానంలో వచ్చి గెలిపించాడు. కానీ ఇప్పుడు అతడిని ఐదో స్థానానికి మార్చారు’’ అని కెప్టెన్ సూర్య, హెడ్కోచ్ గౌతం గంభీర్ తీరును సదగోపన్ రమేశ్ విమర్శించాడు.ఎవరి పని వాళ్లే చేస్తే బాగుంటుందిఅదే విధంగా.. శివం దూబేను కాదని హర్షిత్ రాణాను ఏడో స్థానంలో ఆడించడాన్ని కూడా సదగోపన్ రమేశ్ తీవ్ర స్థాయిలో తప్పుబట్టాడు. ‘‘ఎవరి పని వాళ్లే చేస్తే బాగుంటుంది. గొప్ప వంటకాడు గొప్ప డ్రైవర్ కాలేడు. అదే విధంగా మంచి డ్రైవర్ గొప్పగా వంట చేయలేడు.ఆటగాళ్ల బలాలపై దృష్టి పెట్టి మేనేజ్మెంట్ వారికి తగిన పాత్ర ఇవ్వాలి. వారిలోని అత్యుత్తమ ప్రతిభ బయటకు వచ్చేలా ప్రోత్సహించాలి. అంతేగానీ బౌలర్ను బ్యాటర్గా మారుస్తాం.. బ్యాటర్తో బౌలింగ్ చేయిస్తాం అంటే ప్రతికూల ఫలితాలు రావచ్చు. ఈ విషయంలో యాజమాన్యం ఇప్పటికైనా పొరపాట్లు సరిచేసుకుంటే బాగుంటుంది’’ అంటూ సదగోపన్ రమేశ్.. టీమిండియా నాయకత్వ బృందానికి సూచించాడు.మార్పులు ఇవేకాగా మెల్బోర్న్లో ఆసీస్తో రెండో టీ20లో సంజూ శాంసన్ (2) మూడో స్థానంలో రాగా.. సూర్య (1) నాలుగో నంబర్ బ్యాటర్గా వచ్చి విఫలమయ్యాడు. ఇక తిలక్ వర్మ ఐదో స్థానంలో బ్యాటింగ్కు దిగి డకౌట్ అయ్యాడు. మరోవైపు.. బ్యాటింగ్ ఆల్రౌండర్ శివం దూబే (4)ను ఎనిమిదో స్థానానికి డిమోట్ చేసి.. పేసర్ హర్షిత్ రాణా (35)ను ఏడో స్థానంలో ఆడించారు.చదవండి: అతడే మా ఓటమిని శాసించాడు.. అభిషేక్ మాత్రం అద్భుతం: భారత కెప్టెన్ -
సంజూకు ప్రమోషన్ ఇచ్చిన గంభీర్.. కట్ చేస్తే! 4 బంతులకే
టీమిండియా స్టార్ వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ బ్యాటింగ్ ఆర్డర్పై గత కొంతకాలంగా చర్చ నడుస్తున్న సంగతి తెలిసిందే. గౌతమ్ గంభీర్ హెడ్ కోచ్గా బాధ్యతలు చేపట్టాక టీ20ల్లో భారత ఇన్నింగ్స్ను సంజూ శాంసన్, అభిషేక్ శర్మ ప్రారంభించడం మొదలు పెట్టారు.అయితే అప్పుడు శుభ్మన్ గిల్ టీ20 జట్టుకు దూరంగా ఉండడంతో శాంసన్ను ఓపెనర్గా అవకాశముంది. కానీ గిల్ తిరిగి టీ20 సెటాప్లోకి రావడంతో ఆసియాకప్-2025 నుంచి సంజూ బ్యాటింగ్ ఆర్డర్ మారిపోయింది. ఈ ఏడాది జరిగిన ఆసియాకప్లో భారత ఓపెనర్లుగా గిల్, అభిషేక్ శర్మ బరిలోకి దిగగా.. శాంసన్ను మిడిలార్డర్లో బ్యాటింగ్కు పంపారు.కొన్ని మ్యాచ్లలో నంబర్ 6, మరి కొన్ని మ్యాచ్లలో ఐదో స్ధానంలో ఈ కేరళ బ్యాటర్ బ్యాటింగ్కు వచ్చాడు. దీంతో టీమ్ మెనెజ్మెంట్పై పెద్ద ఎత్తున విమర్శలు వచ్చాయి. సంజూ లాంటి అద్భుతమైన బ్యాటర్ను సరిగ్గా ఉపయోగించుకోవడంలేదని చాలా మంది మాజీలు మండిపడ్డారు.సంజూకు ప్రమోషన్..ఈ క్రమంలో మెల్బోర్న్ వేదికగా ఆస్ట్రేలియాతో జరుగుతున్న రెండో టీ20లో సంజూ శాంసన్కు హెడ్ కోచ్ గౌతం గంభీర్ ప్రమోషన్ ఇచ్చాడు. ఓపెనర్ శుభ్మన్ గిల్ త్వరగా ఔట్ కోవడంతో శాంసన్ను నంబర్ 3లో బ్యాటింగ్కు పంపాలని టీమ్ మెనెజ్మెంట్ నిర్ణయించుకుంది.కానీ సంజూ తనకు వచ్చిన అవకాశాన్ని అందిపుచ్చుకోలేకపోయాడు. ఈ కేరళ వికెట్ కీపర్ బ్యాటర్ 4 బంతులు ఎదుర్కొని 2 పరుగులు చేసి ఔటయ్యాడు. ఆసీస్ పేసర్ నాథన్ ఎల్లిస్ బౌలింగ్లో వికెట్ల ముందు దొరికపోయాడు. దీంతో సోషల్ మీడియాలో సంజూను ట్రోలు చేస్తున్నారు.టాపార్డర్లో అవకాశమిస్తే ఇలా ఆడుతావా అంటూ పోస్ట్లు పెడుతున్నారు. మరికొంత మంది శాంసన్ను మద్దతుగా నిలుస్తున్నారు. వేర్వేరు స్ధానాల్లో అతడిని బ్యాటింగ్కు పంపితే ఎలా, అతడికంటూ ఒక పొజిషన్ ఫిక్స్ చేయండి అంటూ కామెంట్లు పెడుతున్నారు.చదవండి: కేకేఆర్లోకి రోహిత్ శర్మ ‘కన్ఫామ్’!.. స్పందించిన ముంబై ఇండియన్స్Nathan Ellis got off to a rapid start, dismissing Sanju Samson for just two. #AUSvIND pic.twitter.com/lY4FAlbzDI— cricket.com.au (@cricketcomau) October 31, 2025 -
‘కుదిరితే పదకొండో స్థానంలో కూడా ఆడిస్తారు’
టీ20 ప్రపంచకప్-2024 తర్వాత టీమిండియా ఓపెనర్గా వచ్చి అదరగొట్టాడు సంజూ శాంసన్ (Sanju Samson). పదమూడు ఇన్నింగ్స్లో ఓపెనర్గా వచ్చి 183కు పైగా స్ట్రైక్రేటుతో పరుగులు రాబట్టాడు. ఇందులో ఏకంగా మూడు శతకాలు కూడా ఉండటం గమనార్హం.గిల్ రాకతో గందరగోళంఅయితే, ఆసియా టీ20 కప్-2025 సందర్భంగా శుబ్మన్ గిల్ (Shubman Gill) వైస్ కెప్టెన్గా రీ ఎంట్రీ ఇవ్వడంతో సంజూకు కష్టాలు మొదలయ్యాయి. భవిష్య కెప్టెన్ గిల్ ఓపెనర్గా వచ్చేందుకు సంజూపై వేటు వేసింది యాజమాన్యం. ఇక ఆ టోర్నీలో సంజూకంటూ బ్యాటింగ్ ఆర్డర్లో ప్రత్యేక స్థానం లేకుండా పోయింది.ఆసియా కప్ టోర్నీలో మూడుసార్లు ఐదో స్థానంలో.. ఓసారి ఆరో స్థానంలో సంజూను బ్యాటింగ్కు పంపారు. ఇక బంగ్లాదేశ్తో మ్యాచ్లోనైతే ఎనిమిదో స్థానం వరకు అతడికి పిలుపేరాలేదు. వికెట్ కీపర్గా మాత్రమే టోర్నీ ఆసాంతం అతడి సేవలు వాడుకున్నారు.తాజాగా ఆస్ట్రేలియా పర్యటనలోనూ తొలి టీ20లో శుబ్మన్ గిల్- అభిషేక్ శర్మ (Abhishek Sharma)తో కలిసి భారత ఇన్నింగ్స్ ఆరంభించాడు. ఈ నేపథ్యంలో టీమిండియా మాజీ కెప్టెన్, మాజీ చీఫ్ సెలక్టర్ క్రిష్ణమాచారి శ్రీకాంత్ సంజూ శాంసన్ను ఉద్దేశించి కీలక వ్యాఖ్యలు చేశాడు.దురదృష్టవంతుడైన ఆటగాడుయూట్యూబ్ చానెల్ వేదికగా మాట్లాడుతూ.. ‘‘జట్టులో ప్రస్తుతం అత్యంత దురదృష్టవంతుడైన ఆటగాడు సంజూ శాంసన్. ఓపెనర్గా సెంచరీ చేసిన ఘనత అతడిది. కానీ ఇప్పుడు 3-8 వరకు ఏ స్థానంలోనైనా మేనేజ్మెంట్ అతడిని పంపేందుకు వెనుకాడటం లేదు.కుదిరితే పదకొండో స్థానంలో కూడా ఆడిస్తారుఒకవేళ అవకాశం గనుక ఉంటే.. పదకొండో స్థానంలో కూడా సంజూను బ్యాటింగ్ చేయమంటారు. ఇలా చేయడం వల్ల ఆటగాడి మనసు గాయపడుతుంది. టాపార్డర్లో రాణించినా డిమోట్ చేయడం ఎంతమాత్రం సరికాదు. అయినా.. ఇప్పుడు అతడికి ఇంతకంటే గొప్ప ఆప్షన్ మరొకటి లేదు.వికెట్ కీపర్గానైనా అవకాశంమౌనంగా అన్నీ భరిస్తూనే యాజమాన్యం చెప్పినట్లు నడుచుకోవాల్సి ఉంటుంది. అయితే, ఆసియాకప్ టోర్నీలో ఐదో స్థానంలో వచ్చి అతడు మెరుగ్గా రాణించాడు. టీ20 ప్రపంచకప్ టోర్నీలో అతడు మొదటి ప్రాధాన్య వికెట్ కీపర్గా ఉంటే అంతకంటే మంచి విషయం మరొకటి ఉండదు. ఐదో నంబర్లో సంజూ మరింత మెరుగ్గా రాణిస్తే జట్టులో అతడి స్థానానికి ఢోకా ఉండదు. కాగా ఆసియా కప్లో సంజూ ఏడు మ్యాచ్లలో కలిపి 125 కంటే తక్కువ స్ట్రైక్రేటు నమోదు చేశాడు. అయితే, పాకిస్తాన్తో ఫైనల్లో 21 బంతుల్లో 24 పరుగులు చేసి సత్తా చాటాడు. ఇదిలా ఉంటే ఆసీస్- భారత్ మధ్య తొలి టీ20 వర్షం కారణంగా రద్దై పోయింది.చదవండి: IND vs AUS: అతడి కోసం అర్ష్దీప్ను బలిచేస్తారా?.. గంభీర్పై ఫైర్ -
ఆసీస్తో తొలి టీ20.. భారత తుది జట్టు ఇదే..?
ఐదు మ్యాచ్ల సిరీస్లో భాగంగా కాన్బెర్రా వేదికగా భారత్, ఆస్ట్రేలియా (India vs Australia) మధ్య రేపు (అక్టోబర్ 29) తొలి టీ20 జరుగనుంది. వన్డే సిరీస్ను 1-2 తేడాతో కోల్పోయిన భారత్.. టీ20 సిరీస్నైనా దక్కించుకొని పరువు కాపాడుకోవాలని పట్టుదలగా ఉంది. పొట్టి ఫార్మాట్లో ఆస్ట్రేలియాపై భారత్కు మంచి ట్రాక్ రికార్డే ఉంది. ఇప్పటివరకు ఆడిన 32 మ్యాచ్ల్లో 20 సార్లు గెలుపొందింది. ఆసీస్ కేవలం 11 మ్యాచ్ల్లో మాత్రమే విజయాలు సాధించింది. చివరిగా ఇరు జట్ల మధ్య జరిగిన 6 మ్యాచ్ల్లో భారత్ ఏకంగా 5 సార్లు విజయాలు సాధించింది. 2024 ప్రపంచకప్లో భాగంగా జరిగిన చివరి మ్యాచ్లో భారత్ 24 పరుగుల తేడాతో ఆసీస్ను చిత్తు చేసింది.అంతకుముందు స్వదేశంలో జరిగిన 5 మ్యాచ్ల సిరీస్ను భారత్ 4-1 తేడాతో కైవసం చేసుకుంది. సూర్యకుమార్ యాదవ్ నేతృత్వంలోని భారత యువ జట్టు ఇదే ఫామ్ను రేపటి నుంచి ప్రారంభం కాబోయే సిరీస్లోనూ కొనసాగించాలని భావిస్తుంది. ఇటీవలికాలంలో సూపర్ ఫామ్లో ఉండటంతో టీమిండియాపై అంచనాలు భారీగా ఉన్నాయి.విధ్వంసకర ఓపెనర్ అభిషేక్ శర్మ విశేషంగా రాణిస్తున్నాడు. వన్డౌన్లో తిలక్ వర్మ ఆకట్టుకుంటున్నాడు. సంజూ శాంసన్ సక్సెస్ ట్రాక్లో ఉన్నాడు. శుభ్మన్ గిల్ నుంచి స్థాయికి తగ్గ ఇన్నింగ్స్లు బాకీ ఉన్నాయి. శివమ్ దూబే, అక్షర్ పటేల్ ఆల్రౌండర్లుగా సత్తా చాటుతున్నారు. వరుణ్ చక్రవర్తి మ్యాజిక్ కొనసాగుతుంది. బుమ్రా, అర్షదీప్ సింగ్ రాణిస్తున్నారు. గంభీర సహకారంతో నెట్టుకొస్తున్న హర్షిత్ రాణా పర్వాలేదనిపిస్తున్నాడు. టీమిండియాను ప్రస్తుతం కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ ఫామ్ ఒక్కటే కలవరపెడుతుంది. స్కై బ్యాటింగ్లో రాణించి చాలాకాలమైంది. ఈ ఆసీస్ సిరీస్లో అయినా అతను సత్తా చాటాలని అభిమానులు కోరుకుంటున్నారు. వరుసగా విఫలమవుతున్నా మేనేజ్మెంట్, కోచ్ స్కైకు అండగా ఉన్నారు. వ్యక్తిగంతా విఫలమవుతున్నా జట్టును విజయవంతంగా ముందుండి నడిపిస్తున్నాడన్న కారణం చేత అతనికి మద్దతు లభిస్తుంది. అయితే ఇది ఎంతో కాలం ఉండే అవకాశం లేదు. ప్రస్తుత ఆస్ట్రేలియా సిరీస్లో విఫలమైతే మాత్రం సెలెక్టర్లు ప్రత్యామ్నాం వైపు చూడవచ్చు.ఆస్ట్రేలియాతో తొలి టీ20లో భారత జట్టు (అంచనా)..అభిషేక్ శర్మ, శుభ్మన్ గిల్, తిలక్ వర్మ, సూర్యకుమార్ యాదవ్ (కెప్టెన్), సంజు శాంసన్, శివమ్ దూబే, అక్షర్ పటేల్, హర్షిత్ రాణా, అర్ష్దీప్ సింగ్, వరుణ్ చక్రవర్తి, జస్ప్రీత్ బుమ్రాచదవండి: చరిత్ర సృష్టించిన శుభ్మన్ గిల్ -
రీఎంట్రీలో అదరగొట్టిన సంజూ శాంసన్.. ‘మెరుపు’ అర్ధ శతకం
టీమిండియా స్టార్ క్రికెటర్ సంజూ శాంసన్ (Sanju Samson) రంజీ ట్రోఫీ 2025-26 సీజన్లో శుభారంభం అందుకున్నాడు. మహారాష్ట్రతో మ్యాచ్లో ఈ కేరళ బ్యాటర్ ‘మెరుపు’ అర్ధ శతకం సాధించాడు. దేశీ ఫస్ట్క్లాస్ టోర్నీ రంజీ తాజా సీజన్ బుధవారం మొదలైన విషయం తెలిసిందే.రుతురాజ్ గైక్వాడ్ పోరాటంఈ క్రమంలో ఎలైట్ గ్రూప్-బిలో భాగంగా తిరువనంతపురం వేదికగా కేరళ- మహారాష్ట్ర (Kerala Vs Maharashtra) తలపడుతున్నాయి. టాస్ గెలిచిన కేరళ తొలుత బౌలింగ్ ఎంచుకోగా.. మహారాష్ట్ర బ్యాటింగ్కు దిగింది. టాపార్డర్ విఫలమైన చోట రుతురాజ్ గైక్వాడ్ (Ruturaj Gaikwad- 151 బంతుల్లో 91; 11 ఫోర్లు) విలువైన ఇన్నింగ్స్ ఆడటంతో... మహారాష్ట్ర తొలి ఇన్నింగ్స్లో 84.1 ఓవర్లలో 239 పరుగులకు ఆలౌటైంది. కేరళ బౌలర్ల ధాటికి ఒక దశలో 18/5తో నిలిచిన మహారాష్ట్ర ఆ తర్వాత లోయర్ ఆర్డర్ పోరాటంతో తేరుకుంది. జలజ్ సక్సేనా (49; 4 ఫోర్లు), వికీ ఓస్త్వాల్ (38), రామకృష్ణ ఘోష్ (31) ఆకట్టుకున్నారు.కేరళ బౌలర్లలో నిదీశ్ 5 వికెట్లతో సత్తాచాటాడు. అనంతరం తొలి ఇన్నింగ్స్ ప్రారంభించిన కేరళ జట్టు గురువారం నాటి రెండో రోజు ఆట ముగిసే సమయానికి 10.4 ఓవర్లలో 3 వికెట్లకు 35 పరుగులు చేసింది.ఘీ క్రమంలో 35/3 ఓవర్నైట్ స్కోరుతో శుక్రవారం నాటి మూడో రోజు ఆట మొదలు పెట్టిన కేరళ ఇన్నింగ్స్ను సంజూ చక్కదిద్దాడు.సంజూ శాంసన్ ‘మెరుపు’ అర్ధ శతకంఐదో స్థానంలో బ్యాటింగ్కు వచ్చిన సంజూ 63 బంతులు ఎదుర్కొని ఐదు ఫోర్లు, ఒక సిక్స్ సాయంతో 54 పరుగులు సాధించాడు. అతడికి తోడుగా కెప్టెన్, వికెట్ కీపర్ బ్యాటర్ అజారుద్దీన్ 36 పరుగులతో ఆకట్టుకోగా.. సల్మాన్ నిజార్ 49 పరుగులతో రాణించాడు.అయితే, మిగిలిన వారి నుంచి పెద్దగా సహకారం అందకపోవడంతో 63.2 ఓవర్లలో కేరళ 219 పరుగులకు ఆలౌట్ అయింది. సంజూ పోరాడినప్పటికీ కేరళను ఆధిక్యంలోకి తీసుకురాలేకపోయాడు. ఇరవై పరుగుల స్వల్ప ఆధిక్యంతో రెండో ఇన్నింగ్స్ మొదలుపెట్టిన మహారాష్ట్రకు శుభారంభమే దక్కింది. ఆధిక్యంలో మహారాష్ట్రతొలి ఇన్నింగ్స్లో డకౌట్ అయిన ఓపెనర్లు పృథ్వీ షా 37, అర్షిన్ కులకర్ణి 14 పరుగులతో క్రీజులో ఉన్నారు. ఫలితంగా మూడో రోజు ఆట ముగిసేసరికి తొమ్మిది ఓవర్లలో వికెట్ నష్టపోకుండా మహారాష్ట్ర 51 పరుగులు చేసింది. తద్వారా కేరళ కంటే 71 పరుగుల ఆధిక్యంలో నిలిచింది.ఆసీస్తో టీ20 సిరీస్ ఆడేందుకు సంజూకాగా ఆస్ట్రేలియాతో వన్డే సిరీస్కు టీమిండియా సెలక్టర్లు సంజూ శాంసన్ను ఎంపిక చేయలేదన్న విషయం తెలిసిందే. దీంతో అతడు సొంత జట్టు కేరళ తరఫున రీఎంట్రీ ఇస్తూ రంజీ బరిలో దిగాడు. అయితే, ఆసీస్తో టీ20 సిరీస్ కోసం సన్నద్ధమయ్యే క్రమంలో త్వరలోనే సంజూ జట్టును వీడనున్నాడు. ఇక అక్టోబరు 19- 29 వరకు ఆసీస్- భారత్ మధ్య వన్డే సిరీస్.. అక్టోబరు 29- నవంబరు 8 మధ్య టీ20 సిరీస్ జరుగునుంది. చదవండి: షమీ విమర్శలు.. స్పందించిన చీఫ్ సెలక్టర్ అగార్కర్ -
ఐపీఎల్ చరిత్రలో బెస్ట్ ఫినిషర్.. సంజూ కూడా సూపర్: వార్నర్
టీమిండియా స్టార్లు సంజూ శాంసన్ (Sanju Samson), రింకూ సింగ్ (Rinku Singh)లపై ఆస్ట్రేలియా మాజీ క్రికెటర్ డేవిడ్ వార్నర్ ప్రశంసలు కురిపించాడు. జట్టులో తమ స్థానాలను సుస్థిరం చేసుకునేందుకు వీరిద్దరు పెద్ద పోరాటమే చేయాల్సి వచ్చిందని పేర్కొన్నాడు. తోటి ఆటగాళ్ల నుంచి పోటీని తట్టుకుని అద్భుత ప్రదర్శనలతో రాణించారంటూ కొనియాడాడు.మూడు వన్డేలు, ఐదు టీ20 మ్యాచ్లు ఆడేందుకు టీమిండియా ఆస్ట్రేలియా పర్యటనకు వెళ్లిన విషయం తెలిసిందే. తొలుత వన్డే సిరీస్ జరుగనుండగా.. అనంతరం ఇరుజట్లు టీ20 సిరీస్లో పాల్గొంటాయి. ఇక ఈసారి కూడా సంజూ శాంసన్కు వన్డే జట్టులో చోటు దక్కలేదు. వికెట్ కీపర్ కోటాలో కేఎల్ రాహుల్తో కలిసి.. ధ్రువ్ జురెల్ (Dhruv Jurel) వన్డే టీమ్లోకి వచ్చాడు.సెలక్టర్ల తీరుపై విమర్శలుసంజూను కాదని మరీ జురెల్ను ఎంపిక చేయడం పట్ల టీమిండియా సెలక్టర్ల తీరుపై విమర్శలు వచ్చాయి. ఇదిలా ఉంటే.. టీ20 జట్టులో మాత్రం సంజూకు చోటు దక్కింది. ఇక రింకూ సింగ్ కూడా తన స్థానాన్ని నిలబెట్టుకున్నాడు.ఐపీఎల్ చరిత్రలో బెస్ట్ ఫినిషర్ఈ నేపథ్యంలో ఫాక్స్ క్రికెట్తో మాట్లాడుతూ డేవిడ్ వార్నర్.. సంజూ, రింకూలను ఉద్దేశించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. ‘‘టీమిండియా టీ20 జట్టులో తమ స్థానం పదిలం చేసుకునేందుకు వాళ్లిద్దరు ఎంతగానో కష్టపడ్డారు. ఐపీఎల్లో అద్భుత ప్రదర్శనలు ఇచ్చారు. ముఖ్యంగా రింకూ ఐపీఎల్ చరిత్రలోనే ప్రస్తుతం అత్యుత్తమ ఫినిషర్గా పేరు తెచ్చుకున్నాడు.ఇప్పటికే భారత జట్టులో ఎంతో మంది వరల్డ్క్లాస్ ప్లేయర్లు ఉన్నారు. వారితో పాటు ఇప్పుడు ఫియర్లెస్ యంగ్స్టర్లు కూడా వచ్చేశారు. భారత క్రికెట్కు ఇది శుభ పరిణామం. ఆస్ట్రేలియాకు ఈ యువ ఆటగాళ్ల రూపంలో కఠిన సవాలు ఎదురుకానుంది.మా వాళ్లకు అగ్ని పరీక్షఆస్ట్రేలియన్లకు ఈ సిరీస్ అగ్ని పరీక్ష వంటిది. మెల్బోర్న్ క్రికెట్ గ్రౌండ్లో తొంభై వేల ప్రేక్షకుల సమక్షంలో మ్యాచ్ ఎలా ఉండబోతుందో చూసేందుకు నేను ఆసక్తిగా ఉన్నాను’’ అని వార్నర్ పేర్కొన్నాడు. కాగా అక్టోబరు 19- నవంబరు 8 వరకు భారత్- ఆస్ట్రేలియా మధ్య మూడు వన్డేలు, ఐదు టీ20 మ్యాచ్లు జరుగనున్నాయి. కాగా టీమిండియా ఇటీవలే ఆసియా టీ20 కప్-2025 గెలిచి జోరు మీదుంది.చదవండి: IND vs AUS: ఈసారైనా కంగారులను కంగారు పెట్టిస్తారా? -
పృథ్వీ షా డకౌట్.. టాపార్డర్ సున్నా.. కెప్టెన్దీ అదే దారి
రంజీ ట్రోఫీ తాజా సీజన్ తొలి మ్యాచ్లోనే మహారాష్ట్ర ఆటగాడు పృథ్వీ షా (Prithvi Shaw)కు చేదు అనుభవం ఎదురైంది. కేరళతో బుధవారం మొదలైన మ్యాచ్లో ఈ కుడిచేతి వాటం బ్యాటర్ డకౌట్ అయ్యాడు. నాలుగు బంతులు ఎదుర్కొన్న పృథ్వీ.. పరుగుల ఖాతా తెరవకుండానే నిధీశ్ (Nidheesh) బౌలింగ్లో లెగ్ బిఫోర్ వికెట్గా వెనుదిరిగాడు.మహారాష్ట్ర Vs కేరళ ప్రతిష్టాత్మక దేశవాళీ క్రికెట్ టోర్నీ రంజీ ట్రోఫీ (Ranji Trophy) 91వ ఎడిషన్కు బుధవారం తెరలేచింది. ఇందులో భాగంగా ఎలైట్ గ్రూప్-బిలోని మహారాష్ట్ర- కేరళ మధ్య తిరువనంతపురం వేదికగా మ్యాచ్ మొదలైంది. టాస్ గెలిచిన ఆతిథ్య జట్టు కేరళ తొలుత బౌలింగ్ ఎంచుకుంది.పృథ్వీ షా డకౌట్.. టాపార్డర్ సున్నా.. కెప్టెన్దీ అదే దారిఈ క్రమంలో బ్యాటింగ్ మొదలుపెట్టిన మహారాష్ట్రకు ఊహించని రీతిలో వరుస షాకులు తగిలాయి. ఓపెనర్లు పృథ్వీ షా, అర్షిన్ కులకర్ణితో పాటు వన్డౌన్ బ్యాటర్ సిద్ధేశ్ వీర్ డకౌట్ అయ్యాడు. అర్షిన్ బాసిల్ బౌలింగ్లో కణ్ణుమ్మల్కు క్యాచ్ ఇచ్చి అర్షిన్ గోల్డెన్ డకౌట్ కాగా.. సిద్ధేశ్.. నిధీశ్ బౌలింగ్లో ఎదుర్కొన్న తొలి బంతికే అజారుద్దీన్కు క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు.ఖాతా తెరిచిన రుతువీరితో పాటు కెప్టెన్ అంకిత్ బావ్నే కూడా పరుగుల ఖాతా తెరవకుండానే నిష్క్రమించాడు. అయితే, ఏడు బంతుల పాటు క్రీజులో నిలిచిన అతడు బాసిల్ బౌలింగ్ బౌల్డ్ అయ్యాడు. ఈ క్రమంలో నాలుగో నంబర్ బ్యాటర్ రుతురాజ్ గైక్వాడ్ 25 బంతులు ఎదుర్కొన్న తర్వాత కానీ పరుగుల ఖాతా తెరవలేకపోయాడు. పది ఓవర్ల ఆట ముగిసే సరికి రుతు 28 బంతుల్లో ఒక పరుగు చేయగా.. సౌరభ్ నవాలే 20 బంతుల్లో 10 పరుగులతో క్రీజులో ఉన్నాడు.మొత్తానికి తొలిరోజు పది ఓవర్ల ఆటలో కేరళ బౌలర్ల ధాటికి మహారాష్ట్ర నాలుగు వికెట్ల నష్టానికి కేవలం 16 పరుగులే చేసి పీకల్లోతు కష్టాల్లో కూరుకుపోయింది. వరుస సెంచరీల తర్వాతకాగా కెరీర్ ఆరంభం నుంచి ముంబైకి ఆడిన పృథ్వీ షా.. ఈ ఏడాది మహారాష్ట్రకు మారాడు. ఇటీవల బుచ్చిబాబు ఇన్విటేషనల్ రెడ్బాల్ టోర్నీలో, ముంబైతో వార్మప్ మ్యాచ్లో సెంచరీలతో అలరించిన పృథ్వీ.. అసలైన పోరులో మాత్రం ఆదిలోనే తుస్సుమనిపించాడు.రంజీ ట్రోఫీ-2025: మహారాష్ట్ర వర్సెస్ కేరళ తుదిజట్లుమహారాష్ట్రఅంకిత్ బావ్నే (కెప్టెన్), పృథ్వీ షా, రుతురాజ్ గైక్వాడ్, సౌరభ్ నవాలే (వికెట్ కీపర్), జలజ్ సక్సేనా, రజనీశ్ గుర్బానీ, విక్కీ ఓస్త్వాల్, సిద్ధేష్ వీర్, ముఖేష్ చౌదరి, అర్షిన్ కులకర్ణి, రామకృష్ణ ఘోష్.కేరళమహ్మద్ అజారుద్దీన్ (కెప్టెన్, వికెట్ కీపర్), బాబా అపరాజిత్, సంజూ శాంసన్, సచిన్ బేబీ, ఎండీ నిధీశ్, అక్షయ్ చంద్రన్, రోహన్ కుణ్ణుమ్మల్, అంకిత్ శర్మ, ఈడెన్ యాపిల్ టామ్, నెడుమాన్కులి బాసిల్, సల్మాన్ నిజార్.చదవండి: BCCI: రోహిత్, కోహ్లిలకు ఇదే ఆఖరి సిరీస్!.. స్పందించిన బీసీసీఐ -
సంజూ శాంసన్ రీ ఎంట్రీ..
రంజీ ట్రోఫీ 2025–26 సీజన్ కోసం 15 మంది సభ్యులతో కూడిన తమ జట్టును కేరళ క్రికెట్ అసోసియేషన్ ప్రకటించింది. ఈ సందర్భంగా కేసీఎ కీలక నిర్ణయం తీసుకుంది. సచిన్ బేబీ స్థానంలో మహమ్మద్ అజారుద్దీన్ కొత్త కెప్టెన్గా ఎంపికయ్యాడు.అదేవిధంగా గత సీజన్కు దూరంగా ఉన్న సంజూ శాంసన్(Sanju Samson) తిరిగి జట్టులోకి వచ్చాడు. సంజూ జట్టుకు ఎంపికైనప్పటికి కేరళ ఆడే తొలి మ్యాచ్కు దూరంగా ఉండే అవకాశముంది. ఆక్టోబర్ 15 నుంచి 18 వరకు కేరళ-మహారాష్ట్ర జట్లు తలపడనున్నాయి.ఇదే సమయంలో సంజూ ఆసీస్ పర్యటనకు వెళ్లనున్నాడు. ఆసీస్తో టీ20 సిరీస్కు ఎంపిక చేసిన భారత జట్టులో శాంసన్ సభ్యునిగా ఉన్నాడు. ఆసీస్ నుంచి తిరిగొచ్చాక పూర్తి స్ధాయిలో తన రాష్ట్ర జట్టుకు అతడు అందుబాటులో ఉండే అవకాశముంది.వైస్ కెప్టెన్గా అపరాజిత్..ఇక రాబోయే రంజీ సీజన్కు ముందు తమిళనాడు ఆటగాడు బాబా అపరాజిత్ కేరళ క్రికెట్తో ఒప్పందం కుదుర్చుకున్నాడు. దీంతో అతడికి కూడా ఈ జట్టులో చోటు దక్కింది. వైస్ కెప్టెన్గా అపరాజిత్ ఎంపికయ్యాడు. ఎం డి నిధీష్, సల్మాన్ నిజార్, వత్సల్ గోవింద్ వంటి ఆటగాళ్లు జట్టులో ఉన్నారు.రంజీ ట్రోఫీకి కేరళ జట్టుమహ్మద్ అజారుద్దీన్ (కెప్టెన్), బాబా అపరాజిత్ (వైస్ కెప్టెన్), సంజు శాంసన్, రోహన్ ఎస్ కున్నుమ్మల్, వత్సల్ గోవింద్ శర్మ, అక్షయ్ చంద్రన్, సచిన్ బేబీ, సల్మాన్ నిజార్, అంకిత్ శర్మ, నిధీష్ ఎండి, బాసిల్ ఎన్పి, అహమ్మద్ ఇమ్రాన్, షోన్ రోజర్, అభిషేక్చదవండి: 'మీ అన్నయ్య లాంటి వాడిని'.. ముషీర్కు సారీ చెప్పిన పృథ్వీ షా -
ఇదొక తప్పుడు నిర్ణయం: టీమిండియా సెలక్టర్లపై మాజీ క్రికెటర్ ఫైర్
ఆస్ట్రేలియాతో వన్డేలకు ఎంపిక చేసిన భారత జట్టుపై టీమిండియా మాజీ క్రికెటర్ మొహమ్మద్ కైఫ్ (Mohammed Kaif) పెదవి విరిచాడు. అజిత్ అగార్కర్ (Ajit Agarkar) నేతృత్వంలోని టీమిండియా సెలక్టర్లు ఓ ఆటగాడి విషయంలో తప్పుడు నిర్ణయం తీసుకున్నారంటూ విమర్శించాడు. వెస్టిండీస్తో సొంతగడ్డపై జరుగుతున్న టెస్టు సిరీస్ ముగిసిన తర్వాత భారత జట్టు ఆస్ట్రేలియాలో పర్యటించనుంది.మూడు వన్డేలు, ఐదు టీ20లుఇందులో భాగంగా అక్టోబరు 19 నుంచి ఆసీస్తో జరగనున్న వన్డే సిరీస్ కోసం భారత క్రికెట్ జట్టు... 15న ఆస్ట్రేలియాకు బయలుదేరనుంది. న్యూఢిల్లీ నుంచి రెండు విడతలుగా మన ప్లేయర్లు పెర్త్కు చేరుకోనున్నారు. ఈ పర్యటనలో భాగంగా టీమిండియా... ఆసీస్తో మూడు వన్డేలు, ఐదు టీ20 మ్యాచ్లు ఆడనుంది. ఇందుకోసం భారత క్రికెట్ నియంత్రణ మండలి (BCCI) ఇప్పటికే వన్డే, టీ20 జట్లను ప్రకటించిన విషయం తెలిసిందే.సంజూ శాంసన్ను కాదని...అయితే, వికెట్ కీపర్ కోటాలో కేఎల్ రాహుల్కు తోడుగా.. ధ్రువ్ జురెల్ను వన్డేలకు తొలిసారి ఎంపిక చేశారు సెలక్టర్లు. పరిమిత ఓవర్ల క్రికెట్లో మెరుగైన రికార్డు ఉన్న సంజూ శాంసన్పై వేటు వేసి.. టెస్టుల్లో ఇరగదీస్తున్న జురెల్ను ఆసీస్ టూర్కు ఎంచుకున్నారు.అతడి ఆట తీరు ఎంతో గొప్పగా ఉంది.. కానీఈ నేపథ్యంలో కైఫ్ సెలక్టర్ల తీరును తప్పుబట్టాడు. ‘‘ఇటీవలి కాలంలో ధ్రువ్ జురెల్ అద్భుతంగా బ్యాటింగ్ చేస్తున్నాడు. ముఖ్యంగా వెస్టిండీస్తో తొలి టెస్టులో శతకంతో మెరవడం విశేషమే. అతడి ఆట తీరు ఎంతో గొప్పగా ఉంది.భారత క్రికెట్కు ఆశాకిరణం అతడు. ప్రతి మ్యాచ్లోనూ చితక్కొట్టగల నైపుణ్యాలు అతడికి ఉన్నాయి. కానీ వన్డేల్లో సంజూ శాంసన్ను కాదని జురెల్ను ఎంచుకోవడం తప్పుడు నిర్ణయం. ఎందుకంటే.. సంజూ సాధారణంగానే లోయర్ ఆర్డర్లో ఆడతాడు.వన్డేల్లో సంజూ గొప్ప ఆప్షన్ఐదు లేదంటే ఆరో స్థానంలో బ్యాటింగ్కు వస్తాడు. కాబట్టి జురెల్ కంటే వన్డేల్లో సంజూ గొప్ప ఆప్షన్ అవుతాడు. లోయర్ ఆర్డర్లో ముఖ్యంగా స్పిన్నర్లను ఎదుర్కోవడంలో సంజూ భేష్. సిక్సర్లు బాదగలడు. ఒకవేళ ఆసీస్తో వన్డేలో అతడిని ఆడిస్తే.. ఆడం జంపా బౌలింగ్లో హిట్టింగ్ ఆడగల సత్తా అతడికి ఉంది. ఐపీఎల్లో అత్యధిక సిక్సర్ల వీరుల జాబితాలో సంజూ టాప్-10లో ఉన్న సంగతి మర్చిపోవద్దు.ఆస్ట్రేలియా పిచ్ పరిస్థితులకు సంజూ ఐదు లేదంటే ఆరో స్థానంలో సరిగ్గా సరిపోతాడు. జురెల్ ఇటీవల మంచి ఫామ్లో ఉన్నాడు. అందుకోసం సంజూ వంటి నిలకడగా ఆడే బ్యాటర్లను పక్కన పెట్టడం సరికాదు. వన్డే జట్టులో చోటుకు అతడు అర్హుడు’’ అని కైఫ్ సోషల్ మీడియా వేదికగా తన అభిప్రాయాలు పంచుకున్నాడు. ఇదిలా ఉంటే.. ఆసీస్తో టీ20 సిరీస్కు మాత్రం సెలక్టర్లు సంజూను ఎంపిక చేయడం గమనార్హం.రోహిత్పై వేటు వేసి.. గిల్కు పగ్గాలుఇక ఆస్ట్రేలియా- టీమిండియా మధ్య పెర్త్ వేదికగా అక్టోబరు 19న తొలి వన్డే జరగనుంది. ఈ సిరీస్ నుంచి భారత వన్డే జట్టుకు కూడా శుబ్మన్ గిల్ సారథిగా వ్యవహరించనున్నాడు. ఇంగ్లండ్ టూర్లో టెస్టుల్లో మెరుగైన ప్రదర్శన చేసిన గిల్ను... తొలిసారి వన్డే జట్టుకు సారథిగా ఎంపిక చేశారు. టెస్టు, టీ20 ఫార్మాట్లకు వీడ్కోలు పలికిన రోహిత్, కోహ్లి చాన్నాళ్ల తర్వాత తిరిగి మైదానంలో దర్శనమివ్వనున్నారు. కాగా వన్డే సారథిగా రోహిత్ను ఇప్పుడే తప్పించడాన్ని కైఫ్ ఇప్పటికే తప్పుబట్టిన విషయం తెలిసిందే.చదవండి: అందుకే గెలవాల్సిన మ్యాచ్ ఓడిపోయాం.. తనొక అద్భుతం: భారత కెప్టెన్ -
CEAT అవార్డుల విజేతలు వీరే.. రోహిత్ శర్మకు ప్రత్యేక పురస్కారం
27వ CEAT క్రికెట్ రేటింగ్ (CCR) అవార్డుల వేడుక నిన్న (అక్టోబర్ 7) ముంబైలోని ఓ ఫైవ్ స్టార్ హోటల్లో అంగరంగ వైభవంగా జరిగింది. ఇటీవలికాలంలో ప్రపంచవ్యాప్తంగా అత్యుత్తమ ప్రదర్శన కనబర్చిన క్రికెటర్లకు ఈ వేడుకలో పురస్కారాలు లభించాయి. ఈ వేడుకలో మాజీ భారత కెప్టెన్ రోహిత్ శర్మ (Rohit Sharma) ప్రధాన ఆకర్షణగా నిలిచారు. భారత వన్డే జట్టు కెప్టెన్సీ నుంచి తప్పించబడిన తర్వాత రోహిత్కు ఇది మొదటి పబ్లిక్ అప్పియరెన్స్.ROHIT SHARMA - THE LEADER 🐐 Ro received the Special award from CEAT for winning the Champions Trophy. pic.twitter.com/ad5GbSdAZG— Johns. (@CricCrazyJohns) October 7, 2025ఈ వేడుకలో రోహిత్కు ఓ ప్రత్యేక అవార్డు లభించింది. 2025 ఛాంపియన్స్ ట్రోఫీని గెలిపించినందుకుగానూ అతన్ని ఈ అవార్డు వరించింది. రోహిత్ నాయకత్వంలో భారత్ వరుసగా గెలిచిన రెండో ఐసీసీ ట్రోఫీ ఇది. 2024లో రోహిత్ సారథ్యంలో టీమిండియా టీ20 ప్రపంచకప్ను కైవసం చేసుకుంది. రోహిత్కు ఈ అవార్డును భారత బ్యాటింగ్ లెజెండ్ సునీల్ గవాస్కర్ అందజేశారు.ఈసారి CCR అవార్డులను మెజార్టీ శాతం భారత క్రికెటర్లే గెలుచుకున్నారు. అభిషేక్ శర్మ, తిలక్ వర్మను కాదని సంజూ శాంసన్ (Sanju Samson) టీ20 బ్యాటర్ ఆఫ్ ద ఇయర్ అవార్డును గెలుచుకున్నాడు.ఇటీవలికాలంలో టీ20ల్లో అత్యుత్తమ ప్రదర్శన కనబరుస్తున్న మిస్టరీ స్పిన్నర్ వరుణ్ చక్రవర్తిని (Varun Chakravarthy) టీ20 బౌలర్ ఆఫ్ ద ఇయర్ అవార్డు వరించింది.సర్పంచ్ సాబ్ శ్రేయస్ అయ్యర్కు (Shreyas Iyer) ఓ ప్రత్యేక అవార్డు ఇచ్చారు. CEAT JioStar అవార్డుతో అతన్ని సత్కరించారు.మహిళల విభాగంలోనూ టీమిండియా ఆధిపత్యం కొనసాగింది. స్మృతి మంధన, దీప్తి శర్మ బెస్ట్ బ్యాటర్, బౌలర్ అవార్డులు గెలుచుకున్నారు. అయితే, వారు ఈ అవార్డులను అందుకునేందుకు రాలేకపోయారు. ప్రస్తుతం వారు వన్డే వరల్డ్కప్లో బిజీగా ఉన్నారు.విదేశీ ఆటగాళ్ల విషయానికొస్తే.. జో రూట్కు అంతర్జాతీయ క్రికెటర్ ఆఫ్ ది ఇయర్ అవార్డు లభించింది. కేన్ విలియమ్సన్కు వన్డే బ్యాటర్ ఆఫ్ ది ఇయర్ అవార్డు లభించింది. హ్యారీ బ్రూక్కు టెస్ట్ క్రికెటర్ ఆఫ్ ద ఇయర్ అవార్డు లభించింది. ఇటీవల సౌతాఫ్రికాను వరల్డ్ టెస్ట్ ఛాంపియన్గా నిలబెట్టిన టెంబా బవుమాకు బెస్ట్ కెప్టెన్ అవార్డు లభించింది. బ్యాటింగ్ దిగ్గజం బ్రియాన్ లారాకు లైఫ్టైమ్ అచీవ్మెంట్ అవార్డు లభించింది.విజేతల పూర్తి జాబితా:ఛాంపియన్స్ ట్రోఫీ విజయానికి గుర్తుగా ప్రత్యేక అవార్డు- రోహిత్ శర్మలైఫ్టైమ్ అచీవ్మెంట్ అవార్డు- బ్రియాన్ లారా అంతర్జాతీయ క్రికెటర్ ఆఫ్ ది ఇయర్- జో రూట్ T20I బ్యాటర్ ఆఫ్ ది ఇయర్- సంజు శాంసన్T20I బౌలర్ ఆఫ్ ది ఇయర్- వరుణ్ చక్రవర్తిCEAT JioStar అవార్డు- శ్రేయస్ అయ్యర్ODI బ్యాటర్ ఆఫ్ ది ఇయర్- కేన్ విలియమ్సన్ODI బౌలర్ ఆఫ్ ది ఇయర్- మ్యాట్ హెన్రీCEAT లైఫ్టైమ్ అచీవ్మెంట్ అవార్డు- B.S.చంద్రశేఖర్మహిళల బ్యాటర్ ఆఫ్ ది ఇయర్- స్మృతి మంధనమహిళల బౌలర్ ఆఫ్ ది ఇయర్- దీప్తి శర్మఎమర్జింగ్ ప్లేయర్ ఆఫ్ ది ఇయర్- అంగ్రిష్ రఘువంశీఉదాత్త నాయకత్వ అవార్డు- టెంబా బవుమాటెస్ట్ బౌలర్ ఆఫ్ ది ఇయర్- ప్రభాత్ జయసూర్యటెస్ట్ క్రికెటర్ ఆఫ్ ది ఇయర్- హ్యారీ బ్రూక్డొమెస్టిక్ క్రికెటర్ ఆఫ్ ది ఇయర్- హర్ష్ దూబేచదవండి: ఇంగ్లండ్ కెప్టెన్ ఎంగేజ్మెంట్.. పాక్ ఓవరాక్షన్ స్పిన్నర్ రిసెప్షన్ -
అకస్మాత్తుగా అతడెలా ఊడిపడ్డాడు?: బీసీసీఐపై మాజీ కెప్టెన్ ఫైర్
టీమిండియా సెలక్టర్ల తీరుపై భారత జట్టు మాజీ కెప్టెన్ క్రిష్ణమాచారి శ్రీకాంత్ (Kris Srikkanth) ఆగ్రహం వ్యక్తం చేశాడు. కొంతమంది ఆటగాళ్లను తప్పించడానికి వీరికి రోజుకో సాకు దొరుకుతుందని మండిపడ్డాడు. ఆస్ట్రేలియాతో వన్డేలకు ఎంపిక చేసిన జట్టు తనను ఆశ్చర్యపరిచిందని.. సంజూ శాంసన్ (Sanju Samson) పట్ల వివక్ష ఎందుకో అర్థం కావడం లేదని వాపోయాడు.ఆస్ట్రేలియా పర్యటనకు టీమిండియాస్వదేశంలో వెస్టిండీస్తో టెస్టు సిరీస్ ముగిసిన తర్వాత టీమిండియా ఆస్ట్రేలియా పర్యటన (India Tour Of Australia 2025)కు వెళ్లనున్న విషయం తెలిసిందే. అక్టోబరు 19- నవంబరు 8 మధ్య ఇరుజట్లు మూడు వన్డేలు, ఐదు టీ20 మ్యాచ్లలో తలపడనున్నాయి. ఈ నేపథ్యంలో భారత క్రికెట్ నియంత్రణ మండలి (BCCI) శనివారం ఇందుకు సంబంధించిన జట్లను ప్రకటించింది.వారిద్దరు తొలిసారి..వన్డే కెప్టెన్గా రోహిత్ శర్మపై వేటు వేసి.. శుబ్మన్ గిల్కు పగ్గాలు అప్పగించారు. ఇక శ్రేయస్ అయ్యర్కు వైస్ కెప్టెన్గా ప్రమోషన్ ఇవ్వడంతో పాటు.. నితీశ్ కుమార్ రెడ్డి, ధ్రువ్ జురెల్ను తొలిసారి వన్డే జట్టుకు ఎంపిక చేశారు. వికెట్ కీపర్ కోటాలో కేఎల్ రాహుల్తో పాటు జురెల్ను ఎంపిక చేసిన సెలక్టర్లు.. సంజూ శాంసన్కు మాత్రం మొండిచేయి చూపారు.అతడికి అన్యాయంఈ విషయంపై టీమిండియా మాజీ చీఫ్ సెలక్టర్ క్రిష్ణమాచారి శ్రీకాంత్ ఘాటుగా స్పందించాడు. ‘‘మరోసారి అతడికి అన్యాయం చేశారు. ఆఖరిగా ఆడిన వన్డేలో అతడు సెంచరీ చేశాడు. ఆసీస్తో వన్డే సిరీస్కు సంజూను తప్పక ఎంపిక చేయాల్సింది.కానీ ఓ ఆటగాడిని తప్పించడానికి వీళ్లకు (సెలక్టర్లు) రోజుకో సాకు దొరుకుతుంది. ఓసారి అతడిని ఐదో స్థానంలో బ్యాటింగ్ చేయమంటారు. మరోసారి ఓపెనర్గా రమ్మంటారు. ఇంకోసారి ఏడు లేదంటే ఎనిమిదో నంబర్ బ్యాటర్గా ఆడమంటారు.జురెల్ ఎక్కడి నుంచి ఊడిపడ్డాడు?అయినా.. అకస్మాత్తుగా ధ్రువ్ జురెల్ ఎక్కడి నుంచి ఊడిపడ్డాడు?.. వన్డేల్లో సంజూ శాంసన్ కంటే అతడికి మొదటి ప్రాధాన్యం ఎలా దక్కుతుంది?.. తుదిజట్టులో సంజూ ఉన్నా, లేకపోయినా జట్టులో మాత్రం అతడికి చోటివ్వాలి కదా!హర్షిత్ రాణా ఎందుకు?ఇలాంటి పనులు చేయడం ద్వారా ఆటగాళ్లను గందరగోళానికి గురిచేస్తున్నారు. ఒక్కోసారి యశస్వి జైస్వాల్ జట్టులో ఉంటాడు. మరోసారి అతడి పేరే కనిపించదు. అయితే, హర్షిత్ రాణా మాత్రం అన్ని జట్లలో ఉంటాడు.అతడు జట్టులో ఎందుకు ఉంటున్నాడో ఎవరికీ తెలియదు. ఇలా ప్రతిసారి ఒకరికి వరుస అవకాశాలు ఇస్తూ.. మరొకరిని తప్పించడం ద్వారా ఆటగాళ్ల ఆత్మవిశ్వాసం దెబ్బతింటుంది’’ అని చిక్కా సెలక్టర్ల తీరును విమర్శించాడు. కాగా ఇప్పటికే టెస్టుల్లో ఇరగదీస్తున్న జురెల్.. టీమిండియా తరఫున టీ20 ఫార్మాట్లోనూ అరంగేట్రం చేశాడు.సౌతాఫ్రికా జట్టుపై సంజూ సెంచరీమరోవైపు.. సంజూ చివరగా 2023లో సౌతాఫ్రికాతో వన్డేలో 108 పరుగులు సాధించి.. టీమిండియా గెలుపులో కీలక పాత్ర పోషించాడు. మొత్తంగా 16 వన్డేల్లో కలిపి సగటు 56తో 99కు పైగా స్ట్రైక్రేటుతో 510 పరుగులు సాధించాడు. అయినప్పటికీ సెలక్టర్లు మాత్రం అతడిని వన్డేలకు ఎంపిక చేయడం లేదు. అయితే, ఆసీస్తో టీ20 సిరీస్ ఆడే జట్టులో మాత్రం ఈ కేరళ వికెట్ కీపర్ బ్యాటర్కు చోటు దక్కింది.ఆస్ట్రేలియాతో వన్డే సిరీస్కు బీసీసీఐ ప్రకటించిన జట్టుశుబ్మన్ గిల్ (కెప్టెన్), రోహిత్ శర్మ, విరాట్ కోహ్లి, శ్రేయస్ అయ్యర్ (వైస్ కెప్టెన్), అక్షర్ పటేల్, కేఎల్ రాహుల్ (వికెట్ కీపర్), నితీశ్ కుమార్ రెడ్డి, వాషింగ్టన్ సుందర్, కుల్దీప్ యాదవ్, హర్షిత్ రాణా, మొహమ్మద్ సిరాజ్, అర్ష్దీప్ సింగ్, ప్రసిద్ కృష్ణ, ధ్రువ్ జురెల్ (వికెట్ కీపర్), యశస్వి జైశ్వాల్.చదవండి: 50 ఓవర్ల క్రికెట్లో ట్రిపుల్ సెంచరీ.. ఆసీస్ బ్యాటర్ విధ్వంసం -
చరిత్ర సృష్టించిన సంజూ శాంసన్
టీమిండియా వికెట్కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ (Sanju Samson) చరిత్ర సృష్టించాడు. భారత్ తరఫున టీ20ల్లో అత్యధిక సిక్సర్లు బాదిన వికెట్కీపర్ బ్యాటర్గా అవతరించాడు. తాజాగా జరిగిన ఆసియా కప్ ఫైనల్లో సంజూ ఈ ఘనత సాధించాడు. ఎంఎస్ ధోని (MS Dhoni) పేరిట ఉండిన ఈ రికార్డును సంజూ తన పేరిట బదిలి చేసుకున్నాడు.పాకిస్తాన్తో జరిగిన ఆసియా కప్ ఫైనల్లో (Asia Cup 2025) సంజూ ఓ సిక్సర్ కొట్టాడు. దీంతో కలుపుకొని టీ20ల్లో అతని సిక్సర్ల సంఖ్య 55కి చేరింది. కేవలం 48 ఇన్నింగ్స్ల్లోనే సంజూ ఈ సిక్సర్లను బాదాడు. ధోని విషయానికొస్తే.. అతని ఖాతాలో 54 టీ20 సిక్సర్లు ఉన్నాయి. ఈ విభాగంలో సంజూ, ధోని తర్వాతి స్థానంలో రిషబ్ పంత్ ఉన్నాడు. పంత్ ఖాతాలో 52 సిక్సర్లు ఉన్నాయి.ఆసియా కప్లో సంజూ మరో ఘనత కూడా సాధించాడు. ఓ టోర్నీలో అత్యధిక సిక్సర్లు బాదిన భారత వికెట్కీపర్ బ్యాటర్గా రికార్డు నెలకొల్పాడు. ఈ టోర్నీలో సంజూ మొత్తం 7 సిక్సర్లు బాదాడు. గతంలో ఈ రికార్డు ధోని, పంత్ పేరిట సంయుక్తంగా ఉంది. ధోని 2009 టీ20 వరల్డ్కప్లో, పంత్ 2024 టీ20 వరల్డ్కప్లో తలో 6 సిక్సర్లు బాదారు.కాగా, ఆసియా కప్ 2025లో భారత్ విజేతగా అవతరించింది. ఫైనల్లో పాకిస్తాన్పై 5 వికెట్ల తేడాతో గెలుపొంది, 9వ సారి ఆసియా ఛాంపియన్గా నిలిచింది. ఉత్కంఠగా సాగిన లో స్కోరింగ్ మ్యాచ్లో టాస్ ఓడి తొలుత బ్యాటింగ్కు దిగిన పాక్.. కుల్దీప్ యాదవ్ (4-0-30-4) ధాటికి 19.1 ఓవర్లలో 146 పరుగులకే కుప్పకూలింది.అనంతరం 147 పరుగుల స్వల్ప లక్ష్య ఛేదనలో భారత్ సైతం తొలుత తడబడినప్పటికీ.. తిలక్ వర్మ (53 బంతుల్లో 69; 3 ఫోర్లు, 4 సిక్సర్లు) అజేయ అర్ద శతకంతో టీమిండియాను గెలిపించాడు. సంజూ శాంసన్ (24), శివమ్ దూబే (33) తిలక్కు సహకరించారు. రింకూ సింగ్ బౌండరీ బాది మ్యాచ్ను ముగించాడు. ఈ టోర్నీలో భారత్ మొత్తం మూడు సార్లు పాక్ను ఓడించింది. చదవండి: ప్రపంచ క్రికెట్లో పెను సంచలనం.. మాజీ ఛాంపియన్ను మట్టికరిపించిన పసికూన -
IND Vs SL: అతడి వల్లే ఇది సాధ్యమైంది: సెహ్వాగ్ ప్రశంసలు
టీమిండియా యువ ఆటగాడు, హైదరాబాదీ స్టార్ తిలక్ వర్మ (Tilak Varma)పై భారత మాజీ ఓపెనర్ వీరేందర్ సెహ్వాగ్ ప్రశంసలు కురిపించాడు. శ్రీలంకతో మ్యాచ్లో ఈ యువ బ్యాటర్ అద్భుతమైన ఇన్నింగ్స్ ఆడాడని కొనియాడాడు. తిలక్ వర్మ వల్లే టీమిండియా భారీ స్కోరు చేసిందని పేర్కొన్నాడు. అదే విధంగా.. సంజూ శాంసన్ ఆట తీరును కూడా సెహ్వాగ్ ఈ సందర్భంగా ప్రశంసించాడు.ఆసియా కప్-2025 టోర్నమెంట్లో ఇప్పటికే ఫైనల్ చేరిన టీమిండియా.. సూపర్-4లో చివరిగా నామమాత్రపు మ్యాచ్లో శ్రీలంకతో తలపడింది. దుబాయ్ వేదికగా శుక్రవారం జరిగిన మ్యాచ్లో టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన భారత్.. నిర్ణీత 20 ఓవర్లలో ఐదు వికెట్ల నష్టానికి 202 పరుగులు చేసింది.అభిషేక్తో పాటు ఆ ఇద్దరుఓపెనర్ అభిషేక్ శర్మ (Abhishek Sharma) తనదైన శైలిలో విధ్వంసకర ఇన్నింగ్స్ (31 బంతుల్లో 61) ఆడగా.. మరో ఓపెనర్ శుబ్మన్ గిల్ (Shubman Gill) (4) విఫలమయ్యాడు. వన్డౌన్లో వచ్చిన కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ (12), ఆల్రౌండర్ హార్దిక్ పాండ్యా (2) కూడా పూర్తిగా నిరాశపరిచారు.అయితే, నాలుగో నంబర్ బ్యాటర్.. తిలక్ వర్మ, ఐదో స్థానంలో వచ్చిన సంజూ శాంసన్ బ్యాట్ ఝులిపించి ఇన్నింగ్స్ చక్కదిద్దారు. తిలక్ 34 బంతుల్లో 4 ఫోర్లు, ఒక సిక్సర్ బాది 49 పరుగులతో అజేయంగా నిలవగా.. వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ 23 బంతుల్లో 39 పరుగులు చేశాడు. ఆఖర్లో ఆల్రౌండర్ అక్షర్ పటేల్ (15 బంతుల్లో 21 నాటౌట్) మెరుపులు మెరిపించాడు.Tilak Varma showing us the art of the “𝐠𝐡𝐮𝐭𝐧𝐚 𝐭𝐞𝐤 𝐜𝐡𝐡𝐚𝐤𝐤𝐚” 🤌 Watch #INDvSL LIVE NOW on the Sony Sports Network TV channels & Sony LIV.#SonySportsNetwork #DPWorldAsiaCup2025 pic.twitter.com/uLCfH4YepT— Sony Sports Network (@SonySportsNetwk) September 26, 2025 తిలక్ వర్మ వల్లే ఇలా..ఈ నేపథ్యంలో వీరేందర్ సెహ్వాగ్ తిలక్ వర్మ ప్రదర్శనపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. సోనీ స్పోర్ట్స్ నెట్వర్క్తో మాట్లాడుతూ.. ‘‘అభిషేక్ శర్మ కాకుండా.. ఇంకా ఎవరైనా రాణించాలని, పరుగులు రాబట్టాలని టోర్నీ ఆరంభం నుంచి ఎదురుచూస్తూనే ఉన్నాం.ఈరోజు తిలక్ వర్మ.. సంజూ శాంసన్ ఆ పని చేశారు. వారిద్దరు భారీ ఇన్నింగ్స్ ఆడలేకపోవచ్చు. కానీ ఇద్దరూ అద్భుతమైన, జట్టుకు అవసరమైన ఇన్నింగ్స్ ఆడారు. వీరిద్దరి వల్లే టీమిండియా 200 పరుగుల మార్కు అందుకుంది.ముఖ్యంగా తిలక్ వర్మ ఆఖరి వరకు అజేయంగా ఉండటం కలిసి వచ్చింది. ఇలా ఓ బ్యాటర్ ఇన్నింగ్స్ ఆసాంతం నాటౌట్గా ఉన్నాడంటే.. అతడు తప్పక భారీ స్కోరు చేయగలడనే నమ్మకం వస్తుంది.ఫైనల్కు ముందు ఫామ్లో ఉండటం సానుకూలాంశంఫైనల్కు ముందు తిలక్ వర్మ, సంజూ శాంసన్ ఇలా బ్యాట్ ఝులిపించడం సానుకూలాంశం. వీరిద్దరి వల్ల టైటిల్ పోరులో భారత జట్టుకు తప్పక ప్రయోజనం చేకూరుతుంది’’ అని సెహ్వాగ్ అభిప్రాయపడ్డాడు.కాగా 203 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన శ్రీలంక.. టీమిండియా మాదిరే ఐదు వికెట్లు కోల్పోయి సరిగ్గా 202 పరుగులు చేసింది. ఫలితంగా మ్యాచ్ టై కాగా సూపర్ ఓవర్లో భారత్ విజయఢంకా మోగించింది. ఇదిలా ఉంటే.. హైదరాబాదీ స్టార్ తిలక్ వర్మ ఆసియా కప్ తాజా ఎడిషన్లో లెఫ్టాండర్ బ్యాటర్ తిలక్ వర్మ ఐదు ఇన్నింగ్స్ ఆడి 144 పరుగులు చేశాడు. మరోవైపు.. సంజూ మూడు ఇన్నింగ్స్లో 108 పరుగులు రాబట్టాడు. ఇక ఆదివారం నాటి ఆసియా కప్ ఫైనల్లో టీమిండియా.. దాయాది పాకిస్తాన్తో తలపడనున్న విషయం తెలిసిందే.చదవండి: Asia Cup 2025: పాక్తో ఫైనల్కు ముందు టీమిండియాకు రెండు భారీ షాకులు -
వాళ్లిద్దరు సూపర్.. అతడికే ఇది సాధ్యం.. ఫైనల్లా అనిపించింది: సూర్య
శ్రీలంకతో ఆఖరి వరకు ఉత్కంఠగా సాగిన మ్యాచ్లో గెలుపొందడం పట్ల టీమిండియా కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ (Suryakumar Yadav) హర్షం వ్యక్తం చేశాడు. జట్టు సమిష్టి కృషి, పట్టుదల కారణంగానే విజయం సొంతమైందని సహచర ఆటగాళ్లను ప్రశంసించాడు. ఫైనల్ మాదిరి ప్రతి ఒక్కరు పట్టువదలకుండా పోరాడిన తీరు అద్భుతమంటూ కొనియాడాడు.ఈసారి టీ20 ఫార్మాట్లో నిర్వహిస్తున్న ఆసియా కప్ టోర్నమెంట్లో లీగ్ దశలో అజేయంగా నిలిచిన టీమిండియా.. సూపర్-4 దశలోనూ అదే ఫలితాన్ని పునరావృతం చేసింది. తొలుత పాకిస్తాన్ను... ఆ తర్వాత బంగ్లాదేశ్ను ఓడించి ఫైనల్ చేరింది. ఈ క్రమంలో శుక్రవారం నాటి నామమాత్రపు సూపర్-4 మ్యాచ్లో శ్రీలంకతో తలపడింది.నువ్వా- నేనాఅయితే, ఇప్పటి వరకు పెద్దగా కష్టపడకుండానే ఈ టోర్నీలో మ్యాచ్లు గెలిచిన సూర్యకుమార్ సేనకు.. శ్రీలంక జట్టు చెమటలు పట్టించింది. నువ్వా- నేనా అన్నట్లు హోరాహోరీగా పోటీనిచ్చింది. 202 పరుగుల భారీ స్కోరు సాధించినా.. ధీటుగా బదులిచ్చి లంక మ్యాచ్ను టై చేసింది.అర్ష్దీప్ సింగ్ చేతికి బంతిఈ క్రమంలో సూపర్ ఓవర్ అనివార్యం కాగా.. ఈసారి భారత్ తమ సత్తా చూపించింది. యువ పేసర్ అర్ష్దీప్ సింగ్ చేతికి సూర్య బంతిని ఇవ్వగా.. అతడు నమ్మకాన్ని నిలబెట్టుకున్నాడు. లంకను రెండు పరుగులకే పరిమితం చేసి.. రెండు వికెట్లు తీశాడు. అనంతరం సూర్య బ్యాట్తో రంగంలోకి దిగి తొలి బంతికే మూడు పరుగులు రాబట్టి జట్టును విజయతీరాలకు చేర్చాడు.ఈ నేపథ్యంలో లంకపై గెలిచిన అనంతరం మీడియాతో సూర్యకుమార్ యాదవ్ మీడియాతో మాట్లాడాడు. ‘‘నాకైతే ఇదే ఫైనల్ మ్యాచ్లా అనిపించింది. మ్యాచ్ చేజారుతుందనుకున్న సమయంలో మా వాళ్లు అద్భుత పోరాటపటిమ కనబరిచి టై వరకు తీసుకువచ్చారు. ఆ తర్వాత అదే జోరు కొనసాగించి మేము గెలిచాము.సంజూ, తిలక్ సూపర్సంజూ, తిలక్ వర్మ బ్యాటింగ్ చేసిన తీరు కనువిందు చేసింది. సంజూ ఓపెనర్గా రాగలడు. మిడిలార్డర్లోనూ బాధ్యతాయుత ఇన్నింగ్స్ ఆడగలడు. తిలక్ కూడా ఆత్మవిశ్వాసంతో బ్యాటింగ్ చేయడం చూస్తుంటే సంతోషంగా ఉంది.ఇక అర్ష్దీప్ సింగ్.. గత రెండు- మూడేళ్లుగా జట్టుకు ఎంతో చేశాడు. ఈరోజు కూడా తన ప్రణాళికలకు కట్టుబడి ఉండి.. తనకు నచ్చినట్లుగానే వాటిని అమలు చేయమని చెప్పాను. ఇలాంటి క్లిష్ట పరిస్థితుల్లో (సూపర్ ఓవర్) అతడు అద్భుతం చేశాడు.అతడికే ఇది సాధ్యంగతంలో కూడా టీమిండియా తరఫున, ఐపీఎల్లోనూ ఇదే చేశాడు. అతడి ఆత్మవిశ్వాసమే బంతి రూపంలో ఇలా మాట్లాడుతుంది. అర్ష్దీప్ తప్ప ఈ సూపర్ ఓవర్ ఎవరూ ఇంత చక్కగా వేయలేరు’’ అని సూర్యకుమార్ యాదవ్ ప్రశంసలు కురిపించాడు.Arshdeep '𝘊𝘭𝘶𝘵𝘤𝘩' Singh 🔝🔥#SonySportsNetwork #DPWorldAsiaCup2025 #INDvSL pic.twitter.com/GnOq4conhn— Sony Sports Network (@SonySportsNetwk) September 26, 2025 కాగా లంకతో మ్యాచ్లో ఓపెనర్ అభిషేక్ శర్మ (31 బంతుల్లో 61) మరోసారి విజృంభించగా.. సంజూ శాంసన్ (23 బంతులో 39), తిలక్ వర్మ (34 బంతుల్లో 49 నాటౌట్), అక్షర్ పటేల్ (15 బంతుల్లో 21 నాటౌట్) రాణించాడు. ఇక పేసర్ అర్ష్దీప్ సింగ్ నాలుగు ఓవర్ల కోటా బౌలింగ్లో 46 పరుగులు ఇచ్చి ఒక వికెట్ తీశాడు.చదవండి: Asia Cup 2025: పాక్తో ఫైనల్కు ముందు టీమిండియాకు రెండు భారీ షాకులు1 ball is all it took! 😎Surya Kumar Yadav seals an epic super over win for India 👏#SonySportsNetwork #DPWorldAsiaCup2025 #INDvSL pic.twitter.com/H1z9GQQWDO— Sony Sports Network (@SonySportsNetwk) September 26, 2025 -
ఆసియా కప్-2025: ఇది కరెక్ట్ కాదు సూర్య!.. మేమిలాగే చేస్తాం
ఆసియా కప్-2025 టోర్నమెంట్లో టీమిండియా మరోసారి తమ బ్యాటింగ్ ఆర్డర్లో ప్రయోగాలు చేసింది. లీగ్ దశలో ఒమన్తో మ్యాచ్లో బ్యాటింగ్ దిగని కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్.. ఓపెనింగ్ జోడీ అభిషేక్ శర్మ (Abhishek Sharma)- శుబ్మన్ గిల్ (Shubman Gill)లను మినహా దాదాపుగా అందరి స్థానాలు మార్చాడు.అపుడు అలా.. ఇపుడు ఇలాసంజూ శాంసన్ (Sanju Samson)ను వన్డౌన్లో.. ఆ తర్వాతి స్థానాల్లో హార్దిక్ పాండ్యా, అక్షర్ పటేల్, తిలక్ వర్మ, హర్షిత్ రాణా, అర్ష్దీప్ సింగ్, కుల్దీప్ యాదవ్లను బరిలోకి దించాడు. తాజాగా సూపర్-4లో బంగ్లాదేశ్తో కీలకమైన బుధవారం నాటి మ్యాచ్లోనూ భారత బ్యాటింగ్ ఆర్డర్లో మార్పులు జరిగాయి.ఓపెనర్లుగా అభి (37 బంతుల్లో 75)- గిల్ (19 బంతుల్లో 29)లను కొనసాగించిన యాజమాన్యం.. ఆల్రౌండర్, ఫినిషర్ శివం దూబే (2)ను వన్డౌన్లో పంపగా విఫలమయ్యాడు. తనదైన నాలుగో స్థానంలో బ్యాటింగ్కు వచ్చిన సూర్య (5) కూడా విఫలమయ్యాడు. హార్దిక్ పాండ్యా (38) ఐదు, తిలక్ వర్మ (5) ఆరో స్థానంలో బ్యాటింగ్ చేయగా.. అక్షర్ పటేల్ (10 నాటౌట్) ఏడో ఆటగాడిగా వచ్చాడు.ఇక సంజూ శాంసన్ను ఎనిమిది.. ఆ తర్వాతి స్థానాల్లో కుల్దీప్ యాదవ్, జస్ప్రీత్ బుమ్రా, వరుణ్ చక్రవర్తి బ్యాటింగ్ చేయాల్సింది. అయితే, నిర్ణీత 20 ఓవర్లలో టీమిండియా ఆరు వికెట్ల నష్టానికి 168 పరుగులు చేయగా.. వీరంతా మైదానంలో అడుగుపెట్టాల్సిన అవసరం లేకుండా పోయింది.ఇదెలాంటి క్రికెట్ లాజిక్?అయితే, బంగ్లాదేశ్తో ఏకపక్షంగా సాగుతుందనుకున్న మ్యాచ్లో భారత్ నామమాత్రపు స్కోరు చేయడం.. ఆ తర్వాత 41 పరుగుల తేడాతో గెలవడం జరిగింది. ఈ నేపథ్యంలో బ్యాటింగ్ ఆర్డర్లో ప్రయోగాలపై కెప్టెన్ సూర్యకుమార్పై విమర్శలు వచ్చాయి.ముఖ్యంగా ఓ వైపు వికెట్లు పడుతున్నా సంజూ శాంసన్ ఎనిమిదో స్థానంలో దింపాలనుకోవడంపై భారత మాజీ క్రికెటర్ దొడ్డ గణేశ్ విస్మయం వ్యక్తం చేశాడు. ‘‘సంజూ శాంసన్ ఎనిమిదో స్థానంలో రావడమా? ఇదెలాంటి క్రికెట్ లాజిక్. ఇది ఎంతమాత్రమూ ఆమోదనీయం కాదు’’ అంటూ సూర్య నిర్ణయాన్ని తప్పుబట్టాడు.ఈ నేపథ్యంలో బంగ్లాదేశ్పై విజయానంతరం సూర్యకుమార్ యాదవ్ మాట్లాడుతూ.. విమర్శలకు బదులు ఇచ్చాడు. ‘‘ఈ టోర్నీలో మాకు తొలుత బ్యాటింగ్ చేసే అవకాశం ఎక్కువగా రాలేదు. ఒమన్పై మొదట బ్యాటింగ్ చేశాం. మళ్లీ ఇప్పుడు. సూపర్-4లో అనుకున్నట్లుగానే ముందుకు సాగుతున్నాం.మేమిలాగే చేస్తాంబంగ్లా బౌలింగ్ లైనప్ చూసిన తర్వాతే మా బ్యాటింగ్ ఆర్డర్లో మార్పులు చేసుకున్నాం. వారి జట్టులో లెఫ్టార్మ్ స్పిన్నర్, లెగ్ స్పిన్నర్ ఉన్నారు. దూబే స్పిన్ బాగా ఆడతాడనే అతడిని ముందుగా పంపించాం.కానీ ఈసారి అది వర్కౌట్ కాలేదు. కొన్నిసార్లు ఇలా జరుగుతుంది. అంతమాత్రాన మా ప్రణాళికలను పూర్తిగా మార్చుకోవాల్సిన అవసరం లేదు. అవుట్ఫీల్డ్ ఇంకాస్త మెరుగ్గా ఉంటే మేమే 180- 185 పరుగులు చేసేవాళ్లం. ఇక 12- 14 ఓవర్లు బాగా బౌలింగ్ చేసిన సందర్భాల్లోనూ మేము మెజారిటీ మ్యాచ్లలో గెలుపొందాం’’ అని తన నిర్ణయాన్ని సూర్య సమర్థించుకున్నాడు. కాగా బంగ్లాదేశ్పై విజయంతో టీమిండియా ఫైనల్కు దూసుకువెళ్లింది. ఇక.. టీమిండియా తదుపరి శ్రీలంకతో నామమాత్రపు మ్యాచ్ ఆడనుంది. ఇందుకు దుబాయ్ వేదిక. The moment India stormed into the Asia Cup Final 🌟 Watch #DPWorldAsiaCup2025 from September 9-28, 7 PM onwards, Live on the Sony Sports Network TV channels & Sony LIV.#SonySportsNetwork #INDvBAN pic.twitter.com/7VN6tJ0rwa— Sony Sports Network (@SonySportsNetwk) September 24, 2025చదవండి: టీమిండియా కెప్టెన్గా శ్రేయస్ అయ్యర్.. బీసీసీఐ ప్రకటన -
Asia cup 2025: సూర్యకుమార్ యాదవ్పై ఫ్యాన్స్ ఫైర్
ఆసియా కప్ 2025లో (Asia cup 2025) భాగంగా బంగ్లాదేశ్తో ఇవాళ (సెప్టెంబర్ 24) జరుగుతున్న సూపర్-4 మ్యాచ్లో (India vs Bangladesh) టాస్ ఓడి తొలుత బ్యాటింగ్కు దిగిన భారత జట్టు నామమాత్రపు స్కోర్కు పరిమితమైంది. ఓపెనర్లు అభిషేక్ శర్మ (37 బంతుల్లో 75; 6 ఫోర్లు, 5 సిక్సర్లు), శుభ్మన్ గిల్ (19 బంతుల్లో 29; 2 ఫోర్లు, సిక్స్) మంచి ఆరంభాన్ని ఇచ్చినా నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 168 పరుగులే చేసింది.అభిషేక్ క్రీజ్లో ఉండగా భారత్ స్కోర్ తప్పకుండా 200 పరుగులు దాటుతుందని అంతా అనుకున్నారు. అయితే అతను ఔట్ కావడంతో పరిస్థితితారుమారైంది. కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ (Surya kumar Yadav) బంతులు వృధా చేసి (11 బంతుల్లో 5) ఔటయ్యాడు. అంతకుముందే శివమ్ దూబే (2) నిరాశపరిచాడు.తిలక్ వర్మ (7 బంతుల్లో 5) కూడా స్థాయికి తగ్గట్టుగా ఆడలేకపోయాడు. హార్దిక్ పాండ్యా (29 బంతుల్లో 38; 4 ఫోర్లు, సిక్స్) ఓ మోస్తరు ఇన్నింగ్స్ ఆడినా.. టీ20 స్థాయి తగ్గట్టుగా లేదు. అక్షర్ పటేల్ (15 బంతుల్లో 10 నాటౌట్) దారుణంగా ఆడాడు. చివరి ఓవర్లో బంతులు వృధా చేసి భారత్ ఓ మోస్తరు స్కోర్కే పరిమితమయ్యేలా చేశాడు.తొలి 11 ఓవర్లలో 2 వికెట్ల నష్టానికి 112 పరుగులు చేసిన భారత్.. చివరి 9 ఓవర్లలో కేవలం 56 పరుగులే చేసి నాలుగు వికెట్లు కోల్పోయింది.మంచి ఆరంభం లభించినా టీమిండియా నామమాత్రపు స్కోర్కు పరిమితమవడానికి అభిషేక్, గిల్ మినహా అంతా కారణమైనప్పటికీ.. భారత అభిమానులు మాత్రం కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ను నిందిస్తున్నారు. బ్యాటింగ్ ఆర్డర్లో ఇన్ ఫామ్ బ్యాటర్ సంజూ శాంసన్ను కాదని అక్షర్ పటేల్ను ముందుగా పంపడాన్ని తప్పుబడుతున్నారు. శివమ్ దూబే విషయంలోనూ (తిలక్ వర్మను కాదని దూబేను వన్డౌన్లో పంపారు) ఇదే అభిప్రాయాన్ని వ్యక్తపరుస్తున్నారు. వ్యక్తితంగా విఫలమవడాన్ని నిందిస్తున్నారు. మొత్తంగా బ్యాటింగ్ ఆర్డర్లో అనవసర మార్పులపై ఫైరవుతున్నారు.భారత బ్యాటింగ్ ఆర్డర్లో మార్పుల గురించి అటుంచితే, ఈ మ్యాచ్లో బంగ్లా బౌలర్లకు క్రెడిట్ ఇవ్వాలి. భారత ఆటగాళ్ల వరుస విరామాల్లో ఔట్ చేసి ఒత్తిడి తెచ్చారు. ముస్తాఫిజుర్ తన అనుభవాన్నంతా రంగరించి చివరి ఓవర్ అద్భుతంగా బౌలింగ్ చేశాడు. రిషద్ హొసేన్, తంజిమ్ హసన్ కూడా భారత బ్యాటర్లను ఇబ్బంది పెట్టారు.169 పరుగుల నామమాత్రపు లక్ష్యాన్ని కాపాడుకునేందుకు బరిలోకి దిగిన భారత్.. ఆదిలోనే సత్ఫలితాన్ని రాబట్టగలిగింది. బుమ్రా తన తొలి ఓవర్లోనే తంజిద్ను (1) ఔట్ చేశాడు. ఆతర్వాత కుల్దీప్ ధాటిగా ఆడుతున్న పర్వేజ్ హొసేన్ను (21) పెవిలియన్కు పంపాడు. 9 ఓవర్ల తర్వాత బంగ్లా స్కోర్ 57/2గా ఉంది. సైఫ్ హసన్ (24), తౌమిద్ హృదోయ్ (6) క్రీజ్లో ఉన్నారు. చదవండి: Asia cup 2025: చరిత్ర సృష్టించిన అభిషేక్ శర్మ -
పాకిస్తాన్కు మరోసారి షాకిచ్చాడు!.. అప్పుడలా.. ఇప్పుడు ఇంకో ఏడుపు!
ఆసియా కప్-2025 టోర్నీలో పాకిస్తాన్కు మరోసారి చేదు అనుభవం తప్పలేదు. దుబాయ్లో ఆదివారం జరిగిన సూపర్- 4 మ్యాచ్లో టీమిండియా చేతిలో సల్మాన్ ఆఘా బృందం ఓటమిపాలైంది. ఈ నేపథ్యంలో.. నో-షేక్హ్యాండ్ వివాదం తర్వాత పాక్ క్రికెట్ బోర్డు మరోసారి అంతర్జాతీయ క్రికెట్ మండలి (ICC) తలుపుతట్టింది.అప్పుడలా.. ఇప్పుడు ఇంకో ఏడుపు!కాగా లీగ్ దశలో పాక్తో మ్యాచ్ సందర్భంగా టీమిండియా ఆటగాళ్లు పాక్ జట్టుతో కరచాలనం చేసేందుకు నిరాకరించారు. పహల్గామ్ ఉగ్రదాడికి నిరసనగా ఈ మేరకు నిర్ణయం తీసుకున్నారు. అయితే, దీనిని అవమానంగా భావించిన పాక్.. మ్యాచ్ రిఫరీ ఆండీ పైక్రాఫ్ట్ (Andy Pycropt) వల్లే ఇలా జరిగిందంటూ ఐసీసీకి ఫిర్యాదు చేసింది.రిఫరీగా ఆండీ పైక్రాఫ్ట్ను తొలగించాలంటూ డిమాండ్ చేసింది. అయితే, ఐసీసీ మాత్రం దిగిరాలేదు. పాక్ ఆడే మ్యాచ్లకు మరోసారి అతడినే రిఫరీగా ఎంపిక చేసింది. లీగ్ దశలో ఆఖరిగా యూఏఈతో పాటు.. తాజాగా టీమిండియాతో సూపర్-4 మ్యాచ్లోనూ ఆండీ పైక్రాఫ్ట్ రిఫరీగా వ్యవహరించాడు.క్యాచ్ విషయంలో వివాదంఇదిలా ఉంటే.. ఆదివారం నాటి మ్యాచ్లో పాక్ ఓపెనర్ ఫఖర్ జమాన్ 15 పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద ఉండగా.. హార్దిక్ పాండ్యా (Hardik Pandya) బౌలింగ్లో భారత వికెట్ కీపర్ సంజూ శాంసన్ (Sanju Samson)కు క్యాచ్ ఇచ్చి అవుటయ్యాడు. అయితే, బంతి నేలను తాకిన తర్వాతే సంజూ చేతుల్లోకి వెళ్లిందని భావించిన ఫఖర్ జమాన్.. కాసేపు క్రీజులోనే ఉండి అసహనం వ్యక్తం చేశాడు.ఈ విషయంలో ఫీల్డ్ అంపైర్ స్పష్టతనివ్వకపోవడంతో.. టీవీ అంపైర్ దగ్గరకు పంచాయతీ చేరింది. అయితే, వివిధ కోణాల్లో పరిశీలించిన తర్వాత.. బంతి కింద సంజూ వేళ్లు ఉన్నాయంటూ.. దీనిని క్లీన్ అవుట్గా ప్రకటించారు. ఈ నేపథ్యంలో పాక్ అంపైర్ తీరుపై అసంతృప్తి వెళ్లగక్కింది.పాకిస్తాన్కు మరోసారి షాకిచ్చాడు!ఈ విషయమై రిఫరీ ఆండీ పైక్రాఫ్ట్కు ఫిర్యాదు చేయగా.. తన పరిధిలో లేదంటూ ఆయన బదులిచ్చినట్లు సమాచారం. ఈ నేపథ్యంలో పాక్ సన్నిహిత వర్గాలు టెలికామ్ఏసియా.నెట్తో మాట్లాడుతూ.. ‘‘పాకిస్తాన్ జట్టు మేనేజర్ నవీద్ చీమా మ్యాచ్ రిఫరీ ఆండీ పైక్రాఫ్ట్కు ఈ విషయం గురించి ఫిర్యాదు చేశాడు.అయితే, తన పరిధిలో లేదంటూ ఆయన రిప్లై ఇచ్చాడు. దీంతో మేనేజర్ ఐసీసీకి మెయిల్ చేశాడు. అంపైర్పై ఫిర్యాదు చేశాడు’’ అని పేర్కొన్నాయి.ఇక మ్యాచ్ ముగిసిన తర్వాత పాక్ కెప్టెన్ సల్మాన్ ఆఘా మాట్లాడుతూ.. ‘‘అంపైర్లు కొన్నిసార్లు తప్పులు చేస్తారు. అది సహజమే. కానీ ఈసారి బంతి కీపర్ చేతుల్లో పడేకంటే ముందు నేలను తాకినట్లు అనిపించింది’’ అని పేర్కొన్నాడు.చదవండి: ఎవర్నీ లెక్కచేయను.. నా తీరే అంత.. నచ్చినట్లు చేస్తా: పాక్ బ్యాటర్ ఎక్స్ట్రాలు -
చరిత్ర సృష్టించిన సంజూ శాంసన్.. స్వల్ప కెరీర్లోనే..!
ఆసియా కప్ 2025లో భాగంగా ఒమన్తో నిన్న (సెప్టెంబర్ 19) జరిగిన మ్యాచ్లో భారత్ 21 పరుగుల తేడాతో గెలుపొందింది. ఈ మ్యాచ్లో తొలుత బ్యాటింగ్ చేసిన భారత్ ప్రయోగాలకు పోయి 188 పరుగులకే పరిమితమైంది. 56 పరుగులు చేసిన సంజూ శాంసన్ టాప్ స్కోరర్గా నిలిచాడు. వాస్తవానికి ఒమన్ లాంటి చిన్న జట్టుపై భారత్ భారీ స్కోర్ చేసుండాల్సింది. ఒమన్ బౌలర్లను తక్కువ అంచనా వేయడం, నిర్లక్ష్యంగా షాట్లు ఆడటం, అతి విశ్వాసంగా ఉండటం వల్ల భారత్ ఓ మోస్తరు స్కోర్కే పరిమితమైంది.అనంతరం లక్ష్యాన్ని కాపాడుకునే క్రమంలో ఒమన్ బ్యాటర్లు కూడా భారత బౌలర్లకు దడ పుట్టించారు. ఆమిర్ కలీమ్ (64), హమ్మద్ మీర్జా (51) అనే అనామక బ్యాటర్లు అనుభవజ్ఞులైన భారత బౌలర్ల పాలిట కొరకరాని కొయ్యలయ్యారు. కాస్త అటో ఇటో అయ్యుంటే ఈ మ్యాచ్లో భారత్కు ఘోర పరాభవం ఎదురయ్యేది. నిర్దేశిత లక్ష్యానికి ఒమన్ అతి చేరువగా (167/4) వచ్చి భారత ఆటగాళ్ల గుండెల్లో రైళ్లు పరిగెట్టించింది. అంతిమంగా భారత్ ఈ మ్యాచ్లో బయటపడి గ్రూప్ దశలో ఓటమెరుగని జట్టుగా సూపర్-4లోకి ప్రవేశించింది. భారత్ తరఫున టాప్ స్కోరర్గా నిలిచినందుకు గానూ సంజూ శాంసన్కు ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు లభించింది.ఈ అవార్డుతో సంజూ ఓ ఘనత సాధించాడు. భారత్ తరఫున టీ20ల్లో అత్యధిక ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డులు అందుకున్న వికెట్కీపర్ బ్యాటర్ అవతరించాడు. సంజూ 45 మ్యాచ్ల స్వల్ప కెరీర్లో 3 ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డులు గెలిచాడు. ఈ మ్యాచ్కు ముందు సంజూ దినేశ్ కార్తీక్తో (2) కలిసి సంయుక్తంగా ఈ అవార్డును పంచుకున్నాడు. భారత లెజెండరీ వికెట్ కీపర్ బ్యాటర్ ఎంఎస్ ధోని 98 మ్యాచ్ల సుదీర్ఘ కెరీర్ కలిగి కూడా కేవలం ఒకే ఒకసారి ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు అందుకున్నాడు. ధోని తర్వాత భారత్ తరఫున అత్యధిక టీ20లు ఆడిన రిషబ్ పంత్ కూడా తన 76 మ్యాచ్ల కెరీర్లో ఒకే ఒకసారి ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు అందుకున్నాడు. మొత్తంగా చూస్తే.. దిగ్గజ వికెట్కీపర్ బ్యాటర్ అయిన ధోని 98 మ్యాచ్ల కెరీర్లో సాధించలేనిది, సంజూ స్వల్ప కెరీర్లోనే సాధించాడు. ఓవరాల్గా అత్యధిక ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డులు అందుకున్న వికెట్ కీపర్ బ్యాటర్ల జాబితాలో పాకిస్తాన్కు చెందిన మొహమ్మద్ రిజ్వాన్ (12) ముందున్నాడు. అతని తర్వాతి స్థానాల్లో జోస్ బట్లర్ (10), మొహమ్మద్ షెహజాద్ (9), సంజూ శాంసన్ (3) ఉన్నారు. -
సంజూ ఎందుకు?.. అతడిని ఇంకెప్పుడు ఆడిస్తారు?
ఆసియా కప్-2025 టోర్నమెంట్లో టీమిండియా హ్యాట్రిక్ విజయాలు సాధించింది. లీగ్ దశలో తొలుత యూఏఈ, పాకిస్తాన్లను ఓడించిన సూర్యకుమార్ సేన.. శుక్రవారం నాటి నామమాత్రపు మ్యాచ్లో ఒమన్పై 21 పరుగుల తేడాతో గెలిచింది. తద్వారా గ్రూప్-ఎ టాపర్గా కొనసాగుతూ సూపర్-4 దశను ఆదివారం మొదలుపెట్టనుంది.ఓపెనర్లు మినహాఇదిలా ఉంటే.. ఒమన్తో మ్యాచ్లో టీమిండియా తమ బ్యాటింగ్ ఆర్డర్లో ప్రయోగాలు చేసింది. ఓపెనర్లు అభిషేక్ శర్మ (15 బంతుల్లో 38)- శుబ్మన్ గిల్(5) మినహా మిగతా వారి ఆర్డర్ను మార్చింది. వన్డౌన్లో సంజూ శాంసన్ (45 బంతుల్లో 56), నాలుగో నంబర్లో హార్దిక్ పాండ్యా (1).. ఆ తర్వాతి స్థానాల్లో అక్షర్ పటేల్ (13 బంతుల్లో 26), తిలక్ వర్మ (18 బంతుల్లో 29), హర్షిత్ రాణా (8 బంతుల్లో 13 నాటౌట్), అర్ష్దీప్ సింగ్ (1), కుల్దీప్ యాదవ్ (1 నాటౌట్)లను ఆడించింది.బ్యాటింగ్కు రాని సూర్యఇక కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ (Suryakumar Yadav) బ్యాటింగ్కు రానేరాలేదు. మరోవైపు.. గత రెండు మ్యాచ్లలోనూ బ్యాటింగ్ చేసే అవకాశమే పొందని వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ (Sanju Samson).. తాజాగా టాప్ రన్ స్కోరర్గా నిలిచి ‘ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్’ అవార్డు అందుకున్నాడు.ఈ నేపథ్యంలో టీమిండియా మాజీ క్రికెటర్ ఆకాశ్ చోప్రా ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. సంజూకు బదులు జితేశ్ శర్మను వికెట్ కీపర్గా బరిలోకి దించాల్సిందని అభిప్రాయపడ్డాడు. లీగ్ దశలో అన్ని మ్యాచ్లు ముగిసినా జితేశ్కు అవకాశం రాలేదని.. అతడొక్కడినే వదిలేశారని పేర్కొన్నాడు.వికెట్ కీపర్గా సంజూ ఎందుకు?‘‘తిలక్ వర్మ మరీ లోయర్ ఆర్డర్లో వచ్చాడు. సూర్య అసలు బ్యాటింగ్కు రాలేదు. అలాంటపుడు జితేశ్ను ఈ మ్యాచ్లో ఆడించాల్సింది కదా!.. జితేశ్ను ఆడిస్తారనే అనుకున్నా. ఇప్పటి వరకు.. అతడిని తప్ప అందరినీ ఆడించారు. వందకు వంద శాతం సూపర్ పవర్ హిట్టర్ను మాత్రం వదిలేశారు.అతడికి ఒక అవకాశమైతే ఇవ్వాలి కదామిడిలార్డర్లో వికెట్ కీపర్ అవసరం ఉంటుంది. కానీ మీరు సంజూను ఆ స్థానంలో ఆడించాలని ఫిక్సయిపోయారు కాబట్టి జితేశ్ను పక్కనపెట్టారు. వికెట్ కీపర్ రేసులో ఉండాలన్న.. సంజూతో పోటీపడాలన్నా అతడికి ఒక అవకాశమైతే ఇవ్వాలి కదా!’’ అని ఆకాశ్ చోప్రా పేర్కొన్నాడు.సంజూ సూపర్ఏదేమైనా ఒమన్తో మ్యాచ్లో వన్డౌన్లో వచ్చిన సంజూ.. అద్భుతంగా బ్యాటింగ్ చేశాడని ఆకాశ్ చోప్రా అభినందించాడు. ఆరంభంలో ఫాస్ట్బౌలర్ల కారణంగా కాస్త ఇబ్బందిపడినప్పటికీ.. తర్వాత పరుగులు రాబట్టాడని పేర్కొన్నాడు. వికెట్లు పడుతున్న వేళ విలువైన అర్ధ శతకంతో రాణించాడని ప్రశంసించాడు. కాగా తదుపరి సూపర్-4 దశలో తొలుత టీమిండియా ఆదివారం నాటి మ్యాచ్లో పాకిస్తాన్తో తలపడనుంది. ఇందుకు దుబాయ్ వేదిక.చదవండి: IND vs OMAN: సూర్యకుమార్ అనూహ్య నిర్ణయం.. గావస్కర్ స్పందన ఇదేThe Sanju Show was in full swing tonight! 👌Watch #INDvOMAN LIVE now on the Sony Sports Network TV channels & Sony LIV. #SonySportsNetwork #DPWorldAsiaCup2025 pic.twitter.com/ZYT9ptqCKR— Sony Sports Network (@SonySportsNetwk) September 19, 2025 -
IND vs OMAN: గర్వంగా ఉంది.. మా వాళ్లు సూపర్: ఒమన్ కెప్టెన్
భారత్ వంటి పటిష్ట జట్టుపై పసికూన ఒమన్ (IND vs OMAN) అద్బుత ఆట తీరుతో ఆకట్టుకుంది. వరల్డ్ నంబర్ వన్ టీమిండియా చేతిలో ఓటమిని అంతతేలికగా అంగీకరించకుండా ఆఖరి వరకు పోరాటం చేసింది. చివరికి 21 పరుగుల తేడాతో పరాజయం పాలైనా.. ఈ మ్యాచ్ ఒమన్ చరిత్రలో గుర్తుంచుకోదగ్గదిగా ఉండిపోతుందనడంలో సందేహం లేదు.ఈ నేపథ్యంలో భారత్తో మ్యాచ్ తర్వాత ఒమన్ కెప్టెన్ జతీందర్ సింగ్ (Jatinder Singh) మాట్లాడుతూ.. తమ జట్టు ప్రదర్శన పట్ల సంతృప్తి వ్యక్తం చేశాడు. ‘‘మా వాళ్ల ఆట తీరును చూస్తుంటే గర్వంగా అనిపించింది. మా ప్రణాళికలను పక్కాగా అమలు చేశాం,.గర్వంగా ఉంది.. మా వాళ్లు సూపర్ఎలాంటి పరిస్థితుల్లోనూ మా వాళ్లు పోరాట పటిమను వదల్లేదు. చివరి వరకు అద్భుతంగా పోరాడారు. ఇది నాకు గర్వకారణం. నిజానికి మా జట్టులో అంతగా అనుభవం ఉన్న ఆటగాళ్లులేరు. మా గురించి ఏమాత్రం హైప్ కూడా లేదు.అయినా సరే మేము ఇలా ఆడటం గొప్పగా అనిపించింది. మా దేశంలోనే వరల్డ్కప్ క్వాలిఫయర్స్ జరుగబోతున్నాయి. ఇందుకు మా వాళ్లు సిద్ధంగా ఉన్నారు. పపువా న్యూగినియా, సమోవా జట్లను మేము ఎదుర్కోబోతున్నాము.అతడు హైలైట్ఏదేమైనా టీమిండియాతో మ్యాచ్లో మా వాళ్లు సూపర్. ముఖ్యంగా జితేన్ రామ్నంది రనౌట్లతో హైలైట్ అయ్యాడు. అతడు టీమ్ మ్యాన్. జట్టు కోసం ఏమైనా చేస్తాడు’’ అని జతీందర్ సింగ్ సంతోషం వ్యక్తం చేశాడు. కాగా టీమిండియాతో మ్యాచ్లో ఒమన్ బౌలింగ్ ఆల్రౌండర్ జితేన్ రామ్నంది రెండు వికెట్లు తీయడంతో పాటు.. హార్దిక్ పాండ్యా (1), అర్ష్దీప్ సింగ్ (1)లను రనౌట్ చేశాడు.ఇక ఒమన్ బ్యాటర్లలో కెప్టెన్ జతీందర్ సింగ్ (32) ఓ మోస్తరుగా రాణించగా.. మరో ఓపెనర్ ఆమిర్ ఖలీమ్ (46 బంతుల్లో 64), వన్డౌన్ బ్యాటర్ హమ్మద్ మీర్జా (33 బంతుల్లో 51) మెరుపులు మెరిపించారు. అయితే, 189 పరుగుల లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో నిర్ణీత 20 ఓవర్లలో నాలుగు వికెట్లు కోల్పోయిన ఒమన్ 167 పరుగులకే పరిమితమైంది.టీమిండియా వర్సెస్ ఒమన్ స్కోర్లు👉వేదిక: షేక్ జాయేద్ స్టేడియం, అబుదాబి👉టాస్: టీమిండియా.. తొలుత బ్యాటింగ్👉టీమిండియా స్కోరు: 188/8 (20)👉ఒమన్ స్కోరు: 167/4 (20)👉ఫలితం: ఒమన్పై 21 పరుగుల తేడాతో టీమిండియా గెలుపు👉ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్: సంజూ శాంసన్ (టీమిండియా- 45 బంతుల్లో 56).Awww… we agree with you @sanjaymanjrekar 😊Sending some virtual hugs from us too Jatinder! 🤗Watch the #DPWorldAsiaCup2025, Sept 9-28, 7 PM onwards, LIVE on the Sony Sports Network TV channels & Sony LIV. #SonySportsNetwork #INDvOMAN pic.twitter.com/A6ZIElXmhl— Sony Sports Network (@SonySportsNetwk) September 19, 2025చదవండి: పాకిస్తాన్తో మ్యాచ్కు ముందు టీమిండియాకు భారీ షాక్! -
IND vs OMAN: సూర్య అనూహ్య నిర్ణయం.. గావస్కర్ స్పందన ఇదే
ఆసియా కప్-2025లో ఒమన్తో మ్యాచ్లో టీమిండియా కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ తీసుకున్న నిర్ణయం అభిమానులను ఆశ్చర్యపరిచింది. నామమాత్రపు మ్యాచ్లో అతడు బ్యాటింగ్కు రాలేదు. ఓవైపు వికెట్లు పడుతున్నా.. సూర్య మాత్రం డగౌట్లోనే ఉండిపోయాడు. బ్యాటింగ్ ఆర్డర్లో ప్రయోగాలు చేస్తూ.. ఆల్రౌండర్లతో పాటు బౌలర్లను ముందుకు పంపాడు.ఓపెనింగ్ జోడీ అభిషేక్ శర్మ (15 బంతుల్లో 38)- శుబ్మన్ గిల్(5)లను అలాగే కొనసాగించిన సూర్య.. వన్డౌన్లో సంజూ శాంసన్ (45 బంతుల్లో 56)ను పంపాడు. నాలుగో స్థానంలో హార్దిక్ పాండ్యా (1), ఐదో స్థానంలో అక్షర్ పటేల్ (13 బంతుల్లో 26)లను ఆడించాడు.ఆ తర్వాత వరుసగా తిలక్ వర్మ (18 బంతుల్లో 29), హర్షిత్ రాణా (8 బంతుల్లో 13 నాటౌట్), అర్ష్దీప్ సింగ్ (1), కుల్దీప్ యాదవ్ (1 నాటౌట్)లను పంపాడు. ఈ క్రమంలో టీమిండియా నిర్ణీత 20 ఓవర్లలో ఎనిమిది వికెట్ల నష్టానికి 188 పరుగులు చేసింది. ఆ తర్వాత ఒమన్ను 167 పరుగులకు పరిమితం చేసి విజయం సాధించింది.ఈ నేపథ్యంలో బ్యాటింగ్ ఆర్డర్ విషయంలో సూర్య తీసుకున్న నిర్ణయంపై టీమిండియా దిగ్గజం సునిల్ గావస్కర్ స్పందించాడు. ‘‘ఈ మ్యాచ్లో సూర్య బ్యాటింగ్ వస్తే కాసేపు ఫోర్లు, సిక్సర్లు కొట్టేవాడు. అతడికి అది మంచిది కూడా.అయితే, పాకిస్తాన్తో మ్యాచ్ సందర్భంగా సూర్యకు కావాల్సినంత బ్యాటింగ్ ప్రాక్టీస్ దొరికింది. తదుపరి అన్నీ కీలక మ్యాచ్లే. అందుకే ఒకవేళ టీమిండియా ఆదిలోనే వికెట్లు కోల్పోతే బ్యాటింగ్ పరిస్థితి ఏమిటన్నది చెక్ చేసేందుకు సూర్య ఈ నిర్ణయం తీసుకున్నాడు.కుల్దీప్ యాదవ్ను కూడా అందుకే బ్యాటింగ్కు పంపాడు. నిజంగా సూర్య వినూత్నమైన ఆలోచనలు గలవాడు. శ్రీలంకతో గతంలో ఓ మ్యాచ్లో తాను కూడా బౌలింగ్ చేశాడు. రింకూ చేతికి కూడా బంతినిచ్చాడు. తన నిర్ణయాలతో చేజారే మ్యాచ్లో టీమిండియాను గెలిపించాడు.ఇప్పుడు కూడా ప్రయోగం చేశాడు. తాను బ్యాటింగ్కు వెళ్లకుండా బౌలర్లు అర్ష్దీప్, కుల్దీప్లను ముందుకు పంపించాడు’’ అంటూ గావస్కర్ సూర్య నిర్ణయాన్ని సమర్థిస్తూ ప్రశంసలు కురిపించాడు. కాగా లీగ్ దశలో మూడింటికి మూడు గెలిచి హ్యాట్రిక్ కొట్టిన టీమిండియా తదుపరి సూపర్-4 దశలో పాకిస్తాన్, బంగ్లాదేశ్, శ్రీలంకతో మ్యాచ్లు ఆడనుంది. -
భారత్ అజేయంగా...
అబుదాబి: ఆసియా కప్ టి20 టోర్నీలో లీగ్ దశను భారత్ అజేయంగా ముగించింది. అంతర్జాతీయ క్రికెట్లో తొలిసారి తమతో తలపడిన చిన్న జట్టు ఒమన్పై సునాయాస విజయాన్ని అందుకుంది. బ్యాటర్ల పట్టుదలతో ఒమన్ కొంత పోరాడగలిగినా... టీమిండియా ముందు అది సరిపోలేదు. శుక్రవారం జరిగిన ఈ గ్రూప్ ‘ఎ’ పోరులో భారత్ 21 పరుగులతో గెలుపొందింది. టాస్ గెలిచి ముందుగా బ్యాటింగ్ ఎంచుకున్న భారత్ 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 188 పరుగులు చేసింది. సంజు సామ్సన్ (45 బంతుల్లో 56; 3 ఫోర్లు, 3 సిక్స్లు) అర్ధ సెంచరీ సాధించగా... అభిషేక్ శర్మ (15 బంతుల్లో 38; 5 ఫోర్లు, 2 సిక్స్లు), తిలక్ వర్మ (18 బంతుల్లో 29; 1 ఫోర్, 2 సిక్స్లు) రాణించారు. అనంతరం ఒమన్ 20 ఓవర్లలో 4 వికెట్లకు 167 పరుగులు చేసింది. ఆమిర్ కలీమ్ (46 బంతుల్లో 64; 7 ఫోర్లు, 2 సిక్స్లు), హమ్మద్ మీర్జా (33 బంతుల్లో 51; 5 ఫోర్లు, 2 సిక్స్లు) అర్ధ సెంచరీలతో ఆకట్టుకున్నారు. టోర్నీలో నేటి నుంచి సూపర్–4 దశ పోటీలు ప్రారంభం అవుతున్నాయి. తొలి పోరులో శ్రీలంకతో బంగ్లాదేశ్ తలపడనుండగా ... ఆదివారం పాకిస్తాన్ను భారత్ ఎదుర్కొంటుంది. రాణించిన అభిషేక్, తిలక్... శుబ్మన్ గిల్ (5) త్వరగానే వెనుదిరిగినా... అభిషేక్ మరోసారి తనదైన రీతిలో దూకుడుగా ఆడుతూ శుభారంభం అందించాడు. షకీల్ ఓవర్లో 2 ఫోర్లు, సిక్స్ కొట్టిన అతను నదీమ్ ఓవర్లో మరో మూడు ఫోర్లు బాదాడు. సామ్సన్ కూడా కొన్ని చక్కటి షాట్లు ఆడటంతో పవర్ప్లేలో భారత్ 60 పరుగులు చేసింది. అయితే రామనంది వేసిన ఓవర్లో ముందు అభిషేక్ అవుట్ కాగా... రెండు బంతుల తర్వాత దురదృష్టవశాత్తూ హార్దిక్ పాండ్యా (1) రనౌటయ్యాడు.సామ్సన్ కొట్టిన షాట్కు బంతి బౌలర్ చేతికి తాకుతూ స్టంప్స్ను పడగొట్టడంతో పాండ్యా వెనుదిరగాల్సి వచ్చింది. ఒకదశలో నాలుగు బంతుల వ్యవధిలో 2 ఫోర్లు, సిక్స్ బాదిన అక్షర్ను వెంటనే వెనక్కి పంపడంతో ఒమన్సఫలమైంది. శివమ్ దూబే (5) కూడా ఎక్కువ సేపు నిలవలేకపోగా, తన సహజశైలికి భిన్నంగా ఆడిన సామ్సన్ 41 బంతుల్లో అర్ధ సెంచరీ పూర్తి చేసుకున్నాడు.మరో వైపు క్రీజ్లో ఉన్నంత సేపు తిలక్ ధాటిని ప్రదర్శించాడు. అయితే వరుసగా వికెట్లు పడుతూ ప్రధాన బ్యాటర్లంతా వెనుదిరిగినా కూడా ఇతరులకు అవకాశం ఇచ్చేందుకు కెప్టెన్ సూర్యకుమార్ మాత్రం చివరి వరకు బ్యాటింగ్కు రాలేదు! కలీమ్, మీర్జా అర్ధసెంచరీలు... భారీ లక్ష్య ఛేదనలో ఒమన్కు సరైన ఆరంభం దక్కింది. ఓపెనర్లు జతీందర్, కలీమ్ జాగ్రత్తగా ఆడి తొలి 6 ఓవర్లలో 44 పరుగులు రాబట్టారు. ఎట్టకేలకు తొలి వికెట్కు 52 బంతుల్లో 56 పరుగుల భాగస్వామ్యం తర్వాత కుల్దీప్ ఈ జోడీని విడదీశాడు. ఆ తర్వాత కూడా భారత బౌలర్లను సమర్థంగా ఎదుర్కోవడంలో ఒమన్ సఫలమైంది. ఈ క్రమంలో 38 బంతుల్లో కలీమ్ హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. ఆ తర్వాత ఒమన్ బ్యాటర్లు మరింత దూకుడుగా ఆడారు. కలీమ్కు తోడు మీర్జా కూడా ధాటిని ప్రదర్శించాడు. 55 బంతుల్లోనే వీరిద్దరు 93 పరుగులు జత చేయడం విశేషం. 30 బంతుల్లో మీర్జా అర్ధ సెంచరీ సాధించగా... ఆ తర్వాత చేయాల్సిన రన్రేట్ పెరిగిపోయి ఒత్తిడిలో ఒమన్ ఓటమి దిశగా పయనించింది.1 అంతర్జాతీయ టి20ల్లో 100 వికెట్లు తీసిన తొలి భారత బౌలర్గా అర్ష్ దీప్ సింగ్ గుర్తింపు పొందాడు. ఓవరాల్గా ఇప్పటి వరకు అంతర్జాతీయ టి20 క్రికెట్లో 25 మంది బౌలర్లు 100 వికెట్ల మైలురాయిని దాటారు. ఈ జాబితాలో రషీద్ ఖాన్ (173 వికెట్లు) ‘టాప్’లో ఉన్నాడు. స్కోరు వివరాలు: భారత్ ఇన్నింగ్స్: అభిషేక్ (సి) శుక్లా (బి) రామనంది 38; గిల్ (బి) ఫైసల్ 5; సామ్సన్ (సి) బిష్త్ (బి) ఫైసల్ 56; పాండ్యా (రనౌట్) 1; అక్షర్ (సి) శుక్లా (బి) కలీమ్ 26; దూబే (సి) జతీందర్ (బి) కలీమ్ 5; తిలక్ (సి) జిక్రియా (బి) రామనంది 29; హర్షిత్ (నాటౌట్) 13; అర్ష్ దీప్ (రనౌట్) 1; కుల్దీప్ (నాటౌట్) 1; ఎక్స్ట్రాలు 13; మొత్తం (20 ఓవర్లలో 8 వికెట్లకు) 188. వికెట్ల పతనం: 1–6, 2–72, 3–73, 4–118, 5–130, 6–171, 7–176, 8–179. బౌలింగ్: షకీల్ 3–0–33–0, ఫైసల్ 4–1–23–2, నదీమ్ 1–0–19–0, రామనంది 4–0–32–2, శ్రీవాస్తవ 2–0–23–0, జిక్రియా 3–0–23–0, కలీమ్ 3–0–31–2. ఒమన్ ఇన్నింగ్స్: జతీందర్ (బి) కుల్దీప్ 32; కలీమ్ (సి) పాండ్యా (బి) హర్షిత్ 64; హమ్మద్ (సి) (సబ్) రింకూ (బి) పాండ్యా 51; జిక్రియా (నాటౌట్) 0; శుక్లా (సి) (సబ్) రింకూ (బి) అర్ష్ దీప్ 1; రామనంది (నాటౌట్) 12; ఎక్స్ట్రాలు 7; మొత్తం (20 ఓవర్లలో 4 వికెట్లకు) 167. వికెట్ల పతనం: 1–56, 2–149, 3–154, 4–155. బౌలింగ్: పాండ్యా 4–0–26–1, అర్ష్ దీప్ 4–0–37–1, హర్షిత్ 3–0–25–1, కుల్దీప్ 3–0–23–1, అక్షర్ 1–0–4–0, దూబే 3–0 –31–0, తిలక్ 1–0–8–0, అభిషేక్ 1–0–12–0. -
Asia Cup 2025: రాణించిన సంజూ.. ఒమన్పై టీమిండియా విజయం
ఆసియా కప్-2025లో భాగంగా సెప్టెంబర్ 19న జరిగిన నామమాత్రపు మ్యాచ్లో పసికూన ఒమన్పై భారత్ 21 పరుగుల తేడాతో విజయం సాధించింది. టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ చేసిన భారత్ నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 188 పరుగులు చేసింది.సంజూ శాంసన్ (56) అర్ద సెంచరీతో రాణించగా.. అభిషేక్ శర్మ (38), అక్షర్ పటేల్ (26), తిలక్ వర్మ (26) ఓ మోస్తరు స్కోర్లు చేశారు. ఒమన్ బౌలర్లలో షా ఫైసల్ (4-1-23-2), జితేన్ రామనంది (4-0-33-2), ఆమిర్ కలీమ్ (3-0-31-2) వికెట్లు తీశారు. అనంతరం 189 పరుగుల లక్ష్య ఛేదనకు దిగిన ఒమన్ ఏ దశలోనూ గెలుపు దిశగా సాగనప్పటికీ.. భారత బౌలర్లను సమర్దవంతంగా ఎదుర్కొని శభాష్ అనిపించుకుంది. నిర్ణీత ఓవర్లు పూర్తయ్యే సరికి ఆ జట్టు నాలుగు వికెట్లు కోల్పోయి 167 పరుగులు చేసింది.ఓపెనర్ ఆమిర్ కలీమ్ (64), వన్ డౌన్లో వచ్చిన హమ్మద్ మీర్జా (51) అద్బుతమైన అర్ద సెంచరీలతో టీమిండియా బౌలర్ల సహనాన్ని పరీక్షించారు. మరో ఓపెనర్, ఒమన్ కెప్టెన్ జతిందర్ సింగ్ (32) కూడా పర్వాలేదనిపించారు.ఈ మ్యాచ్ ఫలితంతో సంబంధం లేకుండా భారత్ సూపర్-4కు అర్హత సాధించగా.. ఒమన్ ఇదివరకే టోర్నీ నుంచి ఎలిమినేట్ అయ్యింది. సూపర్-4 దశలో భారత్ సెప్టెంబర్ 21న పాకిస్తాన్తో తలపడుతుంది. -
#INDvsPAK : పాకిస్తాన్పై భారత్ ఘనవిజయం (ఫొటోలు)


