Ind Vs WI 1st ODI: Ravindra Jadeja And Kuldeep Yadav Achieve Rare Feat In ODI Cricket, Deets Inside - Sakshi
Sakshi News home page

IND vs WI 1st ODI Highlights: చరిత్ర సృష్టించిన కుల్దీప్‌- జడేజా! 49 ఏళ్లలో ఇదే తొలి సారి

Jul 28 2023 9:28 AM | Updated on Jul 28 2023 9:58 AM

Ravindra Jadeja, Kuldeep Yadav Achieve Rare Feat In ODI Cricket - Sakshi

అంతర్జాతీయ వన్డేల్లో టీమిండియా స్పిన్నర్లు రవీంద్ర జడేజా, కుల్దీప్ యాదవ్ సరి కొత్త చరిత్ర సృష్టించారు. ఒక వన్డే మ్యాచ్‌లో ఏడు లేదా అంతకంటే ఎక్కువ వికెట్లు తీసిన తొలి భారత లెఫ్ట్‌ ఆర్మ్‌ స్పిన్నర్ల జంటగా జడేజా, కుల్దీప్ యాదవ్ నిలిచారు.  గురువారం బార్బోడస్‌ వేదికగా వెస్టిండీస్‌తో జరిగిన తొలి వన్డేలో వీరిద్దరూ కలిసి 7 వికెట్లు పడగొట్టారు. తద్వారా ఈ అరుదైన ఘనతను తమ పేరిట లిఖించుకున్నారు.

42 ఏళ్ల భారత వన్డే క్రికెట్‌ చరిత్రలో ఇలా జరగడం ఇదే మొదటి సారి. ఇక ఈ మ్యాచ్‌లో కుల్దీప్‌ యాదవ్‌ కేవలం 6 పరుగులు మాత్రమే ఇచ్చి నాలుగు వికెట్లు పడగొట్టగా..  జడేజా 37 పరుగులిచ్చి మూడు వికెట్లు సాధించాడు. ఇక ఈ మ్యాచ్‌లో టీమిండియా విండీస్‌ను చిత్తు చేసింది. ఏకపక్షంగా సాగిన మ్యాచ్‌లో 5 వికెట్ల తేడాతో భారత్‌ ఘన విజయం సాధించింది.

టాస్‌ ఓడి ముందుగా బ్యాటింగ్‌కు దిగిన విండీస్‌ 23 ఓవర్లలో 114 పరుగులకే ఆలౌటైంది. కెప్టెన్‌ షై హోప్‌ (45 బంతుల్లో 43; 4 ఫోర్లు, 1 సిక్స్‌) టాప్‌ స్కోరర్‌గా నిలిచాడు. అనంతరం భారత్‌ 22.5 ఓవర్లలో 5 వికెట్లకు 118 పరుగులు చేసింది. ఇషాన్‌ కిషన్‌ (46 బంతుల్లో 52; 7 ఫోర్లు, 1 సిక్స్‌) అర్ధ సెంచరీ సాధించాడు. ఇరు జట్ల మధ్య రెండో వన్డే శనివారం ఇదే మైదానంలో జరుగుతుంది. 
చదవండి: నేను అస్సలు ఊహించలేదు.. కానీ క్రెడిట్‌ మొత్తం వాళ్లకే! అతడు సూపర్‌: రోహిత్‌ శర్మ

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement