breaking news
Ravindra Jadeja
-
గిల్ ఒక అత్యద్బుతం.. వారిద్దరూ కూడా నిజంగా గ్రేట్: యువరాజ్
ఇంగ్లండ్ గడ్డపై టీమిండియా టెస్టు కెప్టెన్ శుబ్మన్ గిల్ అదరగొట్టిన సంగతి తెలిసిందే. ఈ ఐదు మ్యాచ్ల సిరీస్లో కెప్టెన్గా, బ్యాటర్గా గిల్ వందకు వంద మార్క్లు కొట్టేశాడు. కెప్టెన్గా తన తొలి సిరీస్లోనే అందరని ఆకట్టుకున్నాడు.అతడి సారథ్యంలోని భారత జట్టు ఐదు మ్యాచ్ల సిరీస్ను 2-2 సమం చేసింది. అదేవిధంగా ఆండర్సన్-టెండూల్కర్ ట్రోఫీలో గిల్ 754 లీడింగ్ రన్ స్కోరర్గా నిలిచాడు. ఈ క్రమంలో గిల్పై టీమిండియా లెజెండరీ ఆల్రౌండర్ యువరాజ్ సింగ్ ప్రశంసల వర్షం కురిపించాడు. ఇంగ్లండ్ వంటి కఠిన పరిస్థితుల్లో జట్టును బాగా నడిపించాడని గిల్ను యువీ కొనియాడాడు. కాగా గిల్ రోల్ మోడల్ యువీనే కావడం విశేషం."ఇంగ్లండ్ టూర్కు ముందు గిల్ విదేశీ రికార్డులపై ఎన్నో సందేహాలు, ప్రశ్నలు ఉండేవి. కానీ వాటిన్నటిని ఒక్క సిరీస్తో చెరిపేశాడు. కెప్టెన్ అయ్యాక అతడు ఇంగ్లండ్ వంటి కఠిన పరిస్థితుల్లో ఏకంగా నాలుగు టెస్టు సెంచరీలు చేశాడు. కెప్టెన్గా తన తొలి టెస్టు సిరీస్లో ఈ విధమైన ప్రదర్శన కనబరిచడం నిజంగా అత్యద్బుతం. ఓవల్లో చారిత్రత్మక విజయం సాధించిన భారత జట్టు పట్ల చాలా గర్వంగా ఉంది. డ్రా అయినప్పటికి సిరీస్ మనదేనని భావిస్తున్నాను. ఎందుకంటే ఇది యువ భారత జట్టు. ఇంగ్లండ్ వంటి జట్టుతో సిరీస్ డ్రా చేయడం అంత సులువు కాదు. అదేవిధంగా జడేజా, వాషింగ్టన్ సుందర్లు కూడా అద్బుతమైన ఇన్నింగ్స్లు ఆడారు. చాలా రోజుల తర్వాత ఇద్దరూ భారత బ్యాటర్లు సెంచరీలు చేసి మ్యాచ్ను డ్రా ముగించడం చూశాను. జడేజా ఎప్పటి నుంచో జట్టుకు తన సేవలను అందిస్తున్నాడు. కానీ సుందర్ మాత్రం ఈ తరహా ప్రదర్శన చేయడం చాలా గ్రేట్" అని యువరాజ్ ఐసీసీకి ఇచ్చిన ఇంటర్వ్యూలో పేర్కొన్నాడు.చదవండి: కెప్టెన్గా రుతురాజ్పై వేటు.. జట్టులో పృథ్వీషాకు చోటు -
సంజూకు బదులు జడ్డూ, రుతురాజ్.. సీఎస్కే నిర్ణయం ఇదే..!
ప్రస్తుతం ఐపీఎల్ వర్గాల్లో సంజూ శాంసన్ ట్రేడ్ డీల్కు సంబంధించిన అంశం హాట్హాట్గా నడుస్తుంది. సంజూ రాజస్థాన్ రాయల్స్ను వీడటం దాదాపుగా ఖాయమైన నేపథ్యంలో సీఎస్కే అతన్ని ట్రేడింగ్ ద్వారా దక్కించుకుంటుందని ప్రచారం జరుగుతుంది. ట్రేడ్ డీల్లో భాగంగా రాయల్స్ సంజూకు బదులు సీఎస్కేకు చెందిన ఇద్దరు స్టార్ ఆటగాళ్లను అడిగినట్లు సమాచారం. కొంత నగదుతో పాటు రవీంద్ర జడేజా, రుతురాజ్ గైక్వాడ్ లేదా శివమ్ దూబేలలో ఎవరో ఒకరిని డిమాండ్ చేసిందని తెలుస్తుంది. అయితే ఈ డీల్కు సీఎస్కే యాజమాన్యం ససేమిరా అనిందని క్రిక్బజ్ పేర్కొంది.సంజూకు బదులు నగదు డీల్ జరుగుతుందే కానీ, తమ ఆటగాళ్లలో ఏ ఒక్కరిని వదులుకునేది లేదని సీఎస్కే రాయల్స్కు స్పష్టం చేసినట్లు తెలుస్తుంది. ఒకవేళ రాయల్స్, సీఎస్కే మధ్య డీల్ కుదరకపోతే సంజూను ట్రేడ్ డీల్ ద్వారా దక్కించుకునేందుకు వేరే ఫ్రాంచైజీలు కూడా పోటీపడవచ్చు. ఏ ఫ్రాంచైజీ ఆసక్తి చూపకపోతే సంజూ ముందస్తు అగ్రిమెంట్ ప్రకారం 2027 సీజన్ వరకు రాయల్స్తోనే కొనసాగాల్సి వస్తుంది.సీఎస్కేకు వెళ్లాలన్నది సంజూ వ్యక్తిగత ఆప్షన్గా తెలుస్తుంది. రాయల్స్లో ఇమడలేకపోవడంతో అతను సీఎస్కే వైపు చూస్తున్నట్లు సమాచారం. ఫ్రాంచైజీ మారాలనుకున్న విషయాన్ని సంజూ చాలా గోప్యంగా ఉంచుతూనే లోలోపల పావులు కదుపుతున్నట్లు వినికిడి. మొత్తానికి సంజూ తమతో అసౌకర్యంగా ఉన్నాడన్న విషయాన్ని రాయల్స్ యాజమాన్యం గ్రహించింది. సంజూ నిర్ణయాన్ని ఫ్రాంచైజీ గౌరవించే అవకాశం ఉంది. ఏ ఫ్రాంచైజీతో ట్రేడ్ డీల్ కుదరకపోతే సంజూను వేలానికి వదిలేసినా ఆశ్చర్యపోనక్కర్లేదు. అదే జరిగితే సంజూకు రికార్డు ధర లభించే అవకాశం ఉంటుంది. సీఎస్కేతో పాటు కేకేఆర్, గుజరాత్ ఫ్రాంచైజీలు సంజూ కోసం ఎగబడవచ్చు. -
IND vs ENG: అతడొక అండర్రేటెడ్ ప్లేయర్: సచిన్ టెండుల్కర్
ఇంగ్లండ్తో టెస్టు సిరీస్లో టీమిండియా ఆల్రౌండర్ రవీంద్ర జడేజా (Ravnidra Jadeja) బ్యాట్తో అదరగొట్టాడు. ఆండర్సన్- టెండుల్కర్ ట్రోఫీ (Anderson- Tendulkar Trophy) ఆసాంతం నిలకడగా బ్యాటింగ్ చేశాడు. కీలక సమయాల్లో తానున్నానంటూ జట్టును ఆదుకున్నాడు.మొత్తంగా ఐదు టెస్టుల్లో కలిపి జడ్డూ 516 పరుగులు సాధించాడు. ఇందులో ఓ శతకం.. ఐదు అర్ధ శతకాలు ఉండటం విశేషం. అంతేకాదు జడ్డూ ఈ సిరీస్లో ఏడు వికెట్లు కూడా పడగొట్టడం గమనార్హం. ఇలా ఇంగ్లండ్తో సిరీస్ను టీమిండియా 2-2తో సమం చేయడంలో తన వంతు పాత్రను జడేజా సమర్థవంతంగా పూర్తి చేశాడు.అతడు ఓ అండర్రేటెడ్ ప్లేయర్ఈ నేపథ్యంలో భారత క్రికెట్ దిగ్గజం సచిన్ టెండుల్కర్ (Sachin Tendulkar) రవీంద్ర జడేజా గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. ఈ వెటరన్ ఆల్రౌండర్ అద్భుతంగా ఆడినా రావాల్సినంత గుర్తింపు దక్కడం లేదని పేర్కొన్నాడు. ‘‘అతడు ఓ అండర్రేటెడ్ ప్లేయర్ అనే చెప్తాను.క్రెడిట్ దక్కడం లేదుజట్టు కోసం అతడు ఎంతో కష్టపడతాడు. తన వంతుగా పరుగులు రాబడతాడు. వికెట్లు తీస్తాడు. కానీ అతడికి ఎక్కువగా క్రెడిట్ దక్కడం లేదు. ఇంగ్లండ్తో సిరీస్లో బ్యాటర్గా చిరస్మరణీయ ప్రదర్శన కనబరిచాడు.ఈ ఒక్క సిరీస్ అనే కాదు.. గతంలోనూ చాలా సార్లు జట్టుకు అవసరమైన వేళ నేనున్నానంటూ వచ్చి.. ప్రత్యర్థి జట్టును కుప్పకూల్చడంలో కీలక పాత్ర పోషించాడు’’ అని సచిన్ టెండుల్కర్ జడ్డూపై ప్రశంసల వర్షం కురిపించాడు.కేఎల్ రాహుల్ అత్యుత్తమ ప్రదర్శనఅదే విధంగా.. కేఎల్ రాహుల్ గురించి ప్రస్తావన రాగా.. ‘‘కేఎల్ రాహుల్ అత్యుత్తమ ప్రదర్శనను మరోసారి ఈ సిరీస్లో చూశాను. అతడు చక్కగా డిఫెండ్ చేసుకోవడంతో పాటు.. వీలు చిక్కినప్పుడల్లా తనవైన షాట్లతో అలరించాడు. ఏ బంతిని ఆడాలో.. దేనిని వదిలేయాలో అతడికి తెలుసు. కొన్నిసార్లు తన ప్లానింగ్తో బౌలర్లనే బోల్తా కొట్టించాడు కూడా’’ అని సచిన్ టెండుల్కర్ రాహుల్ను కొనియాడాడు.కాగా ఆండర్సన్- టెండుల్కర్ ట్రోఫీలో భాగంగా టీమిండియా ఇంగ్లండ్తో ఐదు టెస్టులు ఆడింది. తొలుత లీడ్స్లో ఓటమిపాలైన గిల్ సేన.. ఎడ్జ్బాస్టన్లో మాత్రం చారిత్రాత్మక విజయం సాధించింది. అనంతరం లార్డ్స్ టెస్టులో ఓడిన భారత జట్టు.. మాంచెస్టర్ టెస్టును డ్రా చేసింది. అయితే, చావోరేవో తేల్చుకోవాల్సిన ఆఖరిదైన ఓవల్ టెస్టులో మాత్రం అదరగొట్టింది. ఓటమి ఖాయమనుకున్న వేళ ఆరు పరుగుల స్వల్ప తేడాతో గెలిచి సిరీస్ను 2-2తో సమం చేసింది. ఇక ప్రపంచ టెస్టు చాంపియన్షిప్ 2025-27 సీజన్లోనూ భారత్కు ఇదే తొలి సిరీస్ అన్న విషయం తెలిసిందే. చదవండి: Dhruv Jurel: అతడికి నువ్వెందుకు చెప్పలేదు? గిల్తో సిరాజ్.. కొంప మునిగేదే! -
చరిత్ర సృష్టించిన జో రూట్.. టెస్ట్ క్రికెట్లో తొలి ఆటగాడిగా ప్రపంచ రికార్డు
ఇంగ్లండ్ స్టార్ బ్యాటర్ జో రూట్ సరికొత్త చరిత్ర సృష్టించాడు. టెస్ట్ క్రికెట్లో ఓ సింగిల్ బౌలర్ బౌలింగ్లో 600 పరుగులు సాధించిన తొలి బ్యాటర్గా ప్రపంచ రికార్డు నెలకొల్పాడు. రూట్.. టీమిండియా బౌలర్ రవీంద్ర జడేజాపై ఈ ఘనత సాధించాడు. తాజాగా ముగిసిన టెండూల్కర్-ఆండర్సన్ ట్రోఫీలో రూట్ ఈ ఫీట్ను నమోదు చేశాడు. రూట్ జడేజా బౌలింగ్లో ఇప్పటివరకు 602 పరుగులు సాధించాడు. ప్రపంచంలో ఏ బ్యాటర్ ఓ సింగిల్ బౌలర్ బౌలింగ్లో ఇన్ని పరుగులు సాధించలేదు. ఈ జాబితాలో రూట్ తర్వాతి స్థానంలో స్టీవ్ స్మిత్ ఉన్నాడు. స్మిత్ ఇంగ్లండ్ మాజీ పేసర్ స్టువర్ట్ బ్రాడ్ బౌలింగ్లో 577 పరుగులు చేశాడు. రూట్, స్మిత్ తర్వాతి స్థానంలో టీమిండియా స్టార్ విరాట్ కోహ్లి ఉన్నాడు. కోహ్లి ఆసీస్ స్పిన్నర్ నాథన్ లయోన్ బౌలింగ్లో 573 పరుగులు సాధించాడు.కాగా, టెండూల్కర్-ఆండర్సన్ ట్రోఫీ-2025లో రూట్-జడేజా మధ్య హోరాహోరీ పోటీ జరిగింది. ఈ సిరీస్లో జడేజా రూట్ను ఒక్కసారే (నాలుగో టెస్ట్ తొలి ఇన్నింగ్స్) ఔట్ చేసినా ఇరువురి మధ్య పోటీ నువ్వా-నేనా అన్నట్లుగా సాగింది. అంకెల ప్రకారం చూస్తే జడేజాపై రూట్ పైచేయి సాధించినట్లు కనిపించినా, జడ్డూను ఎదుర్కొనేందుకు రూట్ ఇబ్బంది పడ్డాడు. వాస్తవంగా ఉపఖండలో జడేజాను ఎదుర్కోవడం రూట్కు కత్తి మీద సాము అవుతుంది. స్పిన్కు అనుకూలించే పిచ్లపై జడేజా బౌలింగ్లో రూట్ చాలా ఇబ్బంది పడ్డాడు. జడ్డూ తన కెరీర్లో రూట్ను మొత్తం 9 సార్లు ఔట్ చేశాడు. తద్వారా ఓ బ్యాటర్ను అత్యధిక సార్లు ఔట్ చేసిన బౌలర్గానూ రికార్డు కలిగి ఉన్నాడు.ఇదిలా ఉంటే, తాజాగా ముగిసిన టెండూల్కర్-ఆండర్సన్ ట్రోఫీ డ్రాగా ముగిసింది. ఐదు మ్యాచ్ల ఈ సిరీస్లో భారత్, ఇంగ్లండ్ జట్లు తలో రెండు మ్యాచ్లు గెలువగా.. ఓ మ్యాచ్ డ్రా అయ్యింది. హోరాహోరీగా సాగిన ఈ సిరీస్లో ఇంగ్లండ్ 1,3 టెస్ట్లు గెలువగా.. భారత్ 2,5 మ్యాచ్ల్లో విజయం సాధించింది. నాలుగో టెస్ట్ డ్రాగా ముగిసింది. నువ్వా-నేనా అన్నట్లు సాగిన ఐదో టెస్ట్లో భారత్ 6 పరుగుల స్వల్ప తేడాతో ఇంగ్లండ్పై విజయం సాధించింది.ఈ మ్యాచ్ చివరి రోజు భారత్ 35 పరుగుల స్వల్ప లక్ష్యాన్ని కాపాడుకోవాల్సి ఉండగా.. సిరాజ్ అద్భుతం చేశాడు. ఇంగ్లండ్ చేతిలో ఉండిన 4 వికెట్లలో 3 వికెట్లు తీసి భారత్కు చిరస్మరణీయ విజయాన్నందించాడు.374 పరుగుల భారీ లక్ష్య ఛేదనలో ఇంగ్లండ్ ఓ దశలో పటిష్ట స్థితిలో (301/3) ఉన్నప్పటికీ.. భారత బౌలర్లు మ్యాచ్పై ఆశలు వదులుకోకుండా వీరోచితంగా పోరాడారు. ముఖ్యంగా సిరాజ్ ఓటమిని ఒప్పుకునే ప్రసక్తే లేదన్నట్లు ముందుకు సాగాడు. అతనికి ప్రసిద్ద్ సహకరించాడు. వీరిద్దరు కలిపి ఇంగ్లండ్ సెకెండ్ ఇన్నింగ్స్లో 9 వికెట్లు తీశారు. సెకెండ్ ఇన్నింగ్స్లో 5 వికెట్లు సహా మ్యాచ్ మొత్తంలో 9 వికెట్లు తీసిన సిరాజ్కు ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు లభించింది. -
చరిత్ర సృష్టించిన జడేజా.. ప్రపంచంలోనే తొలి ప్లేయర్గా
ఇంగ్లండ్ పర్యటనలో టీమిండియా స్టార్ ఆల్రౌండర్ రవీంద్ర జడేజా దుమ్ములేపాడు. ది ఓవల్లో జరుగుతున్న ఐదో టెస్టులోనూ జడ్డూ అద్బుతమైన ప్రదర్శన కనబరిచాడు. ఈ మ్యాచ్ సెకెండ్ ఇన్నింగ్స్లో జడేజా కీలక హాఫ్ సెంచరీ సాధించాడు.77 బంతుల్లో 5 ఫోర్లతో 53 పరుగులు చేశాడు. ఈ సిరీస్లో అతడికిది ఆరో హాఫ్ సెంచరీ కావడం గమనార్హం. మొత్తంగా ఈ సిరీస్లో జడేజా 516 పరుగులతో పాటు 7 వికెట్లు పడగొట్టాడు. తద్వారా జడేజా ఓ అరుదైన ఘనతను తన పేరిట లిఖించుకున్నాడు.జడేజా సాధించిన రికార్డులు ఇవే..👉ఇంగ్లండ్ గడ్డపై ఓ టెస్టు సిరీస్లో ఆరు లేదా అంతకంటే దిగువన బ్యాటింగ్కు వచ్చి 6 సార్లు ఫిప్టీ ప్లస్ స్కోర్లు సాధించిన ఆటగాడిగా జడ్డూ వరల్డ్ రికార్డు సృష్టించాడు. ఇంతకుముందు ఈ రికార్డు వెస్టిండీస్ క్రికెట్ లెజెండ్ గ్యారీ సోబర్స్ పేరిట ఉండేది. గ్యారీ సోబర్స్ 1966లో ఇంగ్లండ్ పర్యటనలో ఒకే సిరీస్లో ఐదు హాఫ్ సెంచరీలు సాధించారు. తాజా మ్యాచ్తో సోబర్స్ రికార్డును జడ్డూ బ్రేక్ చేశాడు.👉అదేవిధంగా ఓ టెస్టు సిరీస్లో ఆరు లేదా అంతకంటే దిగువన బ్యాటింగ్కు వచ్చి అత్యధిక పరుగులు చేసిన భారత ఆటగాడిగా సర్ రవీంద్ర జడేజా నిలిచాడు. జడేజా ఈ సిరీస్లో 516 పరుగులు చేశాడు. ఇప్పటివరకు ఈ రికార్డు భారత క్రికెట్ దిగ్గజం వివిఎస్ లక్ష్మణ్ పేరిట ఉండేది. 2002లో వెస్టిండీస్తో సిరీస్లో లక్ష్మణ్ 474 పరుగులు చేశాడు.👉ఇంగ్లండ్ గడ్డపై ఒక సిరీస్లో అత్యధికసార్లు ఫిప్టీ ప్లస్ స్కోర్లు చేసిన ఆటగాడిగా జడేజా( 6 సార్లు) నిలిచాడు. ఇంతకుముందు ఈ రికార్డు భారత లెజెండ్ సునీల్ గవాస్కర్ పేరిట ఉండేది. గవాస్కర్ 1979లో ఇంగ్లండ్ పర్యటనలో ఒకే సిరీస్లో 5 సార్లు ఏభైకి పైగా స్కోర్లు నమోదు చేశాడు.తొమ్మిది వికెట్ల దూరంలో..కాగా ఓవల్ టెస్టులో భారత్ గెలిచేందుకు 9 వికెట్ల దూరంలో నిలిచింది. 374 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన ఇంగ్లండ్ మూడో రోజు ఆట ముగిసే సమయానికి 13.5 ఓవర్లలో ఒక వికెట్ కోల్పోయి 50 పరుగులు చేసింది. అంతకుముందు భారత్ తమ సెకెండ్ ఇన్నింగ్స్లో 396 పరుగులకు ఆలౌటైంది.చదవండి: WCL: డివిలియర్స్ విధ్వంసకర సెంచరీ.. ఫైనల్లో పాక్ చిత్తు! టైటిల్ సౌతాఫ్రికాదే -
IND vs ENG: అదరగొట్టిన జైసూ, ఆకాశ్, జడ్డూ.. వాషీ మెరుపు ఇన్నింగ్స్
ఇంగ్లండ్తో ఐదో టెస్టు రెండో ఇన్నింగ్స్లో టీమిండియా 396 పరుగులకు ఆలౌట్ అయింది. దీంతో ఇంగ్లండ్ మీద తొలి ఇన్నింగ్స్లో 373 పరుగుల ఆధిక్యం సంపాదించిన భారత్.. ఆతిథ్య జట్టుకు 374 పరుగుల లక్ష్యం విధించింది. టీమిండియా బ్యాటర్లలో ఓపెనర్ యశస్వి జైస్వాల్ శతకం (118)తో చెలరేగితే.. ఆకాశ్ దీప్ (66), రవీంద్ర జడేజా (53) హాఫ్ సెంచరీలతో అలరించారు. వీరికి తోడు వాషింగ్టన్ సుందర్ మెరుపు అర్ధ శతకం (46 బంల్లో 53)తో అదరగొట్టాడు. ఇంగ్లండ్ బౌలర్లలో జోష్ టంగ్ ఐదు వికెట్లు తీయగా.. గస్ అట్కిన్సన్ 3, జేమీ ఓవర్టన్ రెండు వికెట్లు పడగొట్టారు.అదరగొట్టిన భారత బ్యాటర్లుఇంగ్లండ్తో ఐదో టెస్టు మూడో రోజు ఆటలో టీమిండియా బ్యాటర్లు ఆకట్టుకున్నారు. ఫలితంగా 87 ఓవర్ల ఆట ముగిసే సరికి టీమిండియా తొమ్మిది వికెట్ల నష్టానికి 396 పరుగులు చేసి.. ఇంగ్లండ్ కంటే 373 పరుగుల ఆధిక్యంలో నిలిచింది.కాగా ఆండర్సన్- టెండుల్కర్ ట్రోఫీలో భాగంగా భారత్- ఇంగ్లండ్ మధ్య గురువారం నిర్ణయాత్మక ఐదో టెస్టు మొదలైన విషయం తెలిసిందే. లండన్లో ఓవల్ మైదానంలో టాస్ గెలిచిన ఆతిథ్య ఇంగ్లండ్ టీమిండియాను తొలుత బ్యాటింగ్కు ఆహ్వానించింది.అయితే, తొలి ఇన్నింగ్స్ ఆరంభం నుంచే తడబడ్డ గిల్ సేన 69.4 ఓవర్లలో 224 పరుగులు చేసి ఆలౌట్ అయింది. ఓపెనర్లు యశస్వి జైస్వాల్ (2), కేఎల్ రాహుల్ (14) విఫలం కాగా.. వన్డౌన్ బ్యాటర్ సాయి సుదర్శన్ 38 పరుగులు చేయగలిగాడు.మిగతా వాళ్లలో కెప్టెన్ శుబ్మన్ గిల్ (21), రవీంద్ర జడేజా (9), ధ్రువ్ జురెల్ (19) విఫలం కాగా.. వాషింగ్టన్ సుందర్ 26 పరుగులు రాబట్టాడు. ఇక ఐదో నంబర్ బ్యాటర్ కరుణ్ నాయర్ ఒక్కడే అర్ధ శతకం (57)తో రాణించాడు.. అతడి ఇన్నింగ్స్ కారణంగానే భారత్ గౌరవప్రదమైన స్కోరు చేయగలిగింది. ఇక టెయిలెండర్లలో ఆకాశ్ దీప్ (0) నాటౌట్గా నిలవగా.. మహ్మద్ సిరాజ్, ప్రసిద్ కృష్ణ డకౌట్గా వెనుదిరిగారు.ఇంగ్లండ్ బౌలర్లలో గస్ అట్కిన్సన్ ఐదు వికెట్లతో చెలరేగగా.. జోష్ టంగ్ మూడు, క్రిస్ వోక్స్ ఒక వికెట్ దక్కించుకున్నారు. అనంతరం తొలి ఇన్నింగ్స్ మొదలుపెట్టిన ఇంగ్లండ్ 247 పరుగులకు ఆలౌట్ అయింది. ఓపెనర్లు జాక్ క్రాలే (64), బెన్ డకెట్ (43)తో పాటు హ్యారీ బ్రూక్ (53) రాణించాడు.భారత బౌలర్లలో సిరాజ్, ప్రసిద్ నాలుగేసి వికెట్లు కూల్చగా.. ఆకాశ్ దీప్ ఒక వికెట్ తన ఖాతాలో వేసుకున్నాడు. మరోవైపు.. ఇంగ్లండ్ టెయిలెండర్ క్రిస్ వోక్స్ ఆబ్సెంట్హర్ట్గా వెనుదిరిగాడు. ఈ క్రమంలో శుక్రవారం నాటి రెండో రోజు ఆటలో భాగంగా రెండో ఇన్నింగ్స్ మొదలుపెట్టిన భారత్.. రెండు వికెట్ల (కేఎల్ రాహుల్-7, సాయి సుదర్శన్- 11) నష్టానికి 75 పరుగులు చేసింది.వీలుచిక్కినప్పుడల్లా సిక్సర్లు బాదుతూఈ క్రమంలో 75/2 ఓవర్నైట్ స్కోరుతో శనివారం నాటి మూడో రోజు ఆట మొదలుపెట్టిన టీమిండియా పటిష్ట స్థితిలో నిలిచింది. ఓపెనర్ యశస్వి జైస్వాల్ శతక్కొట్టగా (118), నైట్ వాచ్మన్గా వచ్చిన పేసర్ ఆకాశ్ దీప్ సంచలన అర్ధ శతకం (66) సాధించాడు.ఇక కెప్టెన్ శుబ్మన్ గిల్ (11) మరోసారి నిరాశపరచగా.. కరుణ్ నాయర్ (17) కూడా విఫలమయ్యాడు. ఈ క్రమంలో వికెట్ కీపర్ బ్యాటర్ ధ్రువ్ జురెల్ (46 బంతుల్లో 34) వేగంగా ఆడే ప్రయత్నం చేసి జేమీ ఓవర్టన్ బౌలింగ్లో ఎల్బీడబ్ల్యూగా వెనుదిరిగాడు.మరోవైపు.. అర్ధ శతకంతో ఆకట్టుకున్న రవీంద్ర జడేజా (53)ను జడేజా జోష్ టంగ్ బౌలింగ్లో హ్యారీ బ్రూక్కు క్యాచ్ ఇచ్చి.. ఎనిమిదో వికెట్గా పెవిలియన్ చేరాడు. జడ్డూ అవుటయ్యే సరికి అంటే.. 83.2 ఓవర్లలో టీమిండియా 357 పరుగులు చేసింది. తద్వారా ఇంగ్లండ్ కంటే 334 పరుగుల ఆధిక్యంలో నిలిచింది. జడ్డూ స్థానంలో క్రీజులోకి వచ్చిన సిరాజ్ డకౌట్గా వెనుదిరిగాడు. ఈ క్రమంలో బాధ్యత తన మీద వేసుకున్న వాషింగ్టన్ సుందర్ వీలుచిక్కినప్పుడల్లా సిక్సర్లు బాదుతూ.. అద్భుత ఆట తీరుతో ఆకట్టుకున్నాడు. 39 బంతుల్లోనే 52 పరుగులతో సత్తా చాటాడు. -
టీమిండియా సరికొత్త చరిత్ర.. ప్రపంచ రికార్డు సమం
ఇంగ్లండ్తో ఐదో టెస్టు సందర్భంగా టీమిండియా (IND vs ENG 5th Test) సరికొత్త చరిత్ర లిఖించింది. ఒక టెస్టు సిరీస్లో అత్యధిక శతకాలు బాదిన జట్ల జాబితాలో చేరింది. తద్వారా ఆస్ట్రేలియా, పాకిస్తాన్, సౌతాఫ్రికా జట్ల సరసన నిలిచి ప్రపంచ రికార్డు సమం చేసింది. అయితే, విదేశీ గడ్డ మీద ఈ ఘనత సాధించిన రెండో టీమ్గా మరో అరుదైన ఫీట్ నమోదు చేసింది.కాగా టీమిండియా ప్రస్తుతం ఇంగ్లండ్ పర్యటనలో ఉన్న విషయం తెలిసిందే. ఆండర్సన్- టెండుల్కర్ ట్రోఫీ (Anderson- Tendulkar Trophy)లో భాగంగా ఆతిథ్య జట్టుతో ఐదు టెస్టులు ఆడుతోంది. ఇందులో ఇప్పటికే నాలుగు పూర్తి కాగా.. ఇంగ్లండ్ 2-1తో ఆధిక్యంలో ఉంది. ఓవల్ వేదికగా ఆఖరిదైన ఐదో టెస్టు గెలిస్తేనే టీమిండియా సిరీస్ను 2-2తో సమం చేయగలదు.జైసూ సెంచరీఇక ఈ మ్యాచ్లో శనివారం నాటి మూడో రోజు ఆటలో భాగంగా టీమిండియా ఓపెనర్ యశస్వి జైస్వాల్ (Yashasvi Jaiswal) సెంచరీ సాధించాడు. 127 బంతుల్లో శతక మార్కును అందుకున్నాడు. మొత్తంగా 164 బంతులు ఎదుర్కొని 118 పరుగులు సాధించి నిష్క్రమించాడు. కాగా అతడి టెస్టు కెరీర్లో ఇది ఆరో సెంచరీ.. ఈ సిరీస్లో రెండోది.12 సెంచరీలు అదే విధంగా.. జైసూ శతకంతో ఈ సిరీస్లో టీమిండియా తరఫున ఇప్పటికి 12 సెంచరీలు నమోదయ్యాయి. ఇప్పటి వరకు మూడు జట్లకు మాత్రమే ఈ ఘనత సాధ్యంకాగా.. తాజాగా టీమిండియా కూడా చరిత్ర పుటల్లోకెక్కింది. ఇదిలా ఉంటే.. 75/2 ఓవర్నైట్ స్కోరుతో శనివారం నాటి మూడో రోజు ఆట మొదలుపెట్టిన టీమిండియా.. టీ బ్రేక్ సమయానికి ఆరు వికెట్ల నష్టానికి 304 పరుగులు చేసింది. ధ్రువ్ జురెల్ 25, రవీంద్ర జడేజా 26 పరుగులతో క్రీజులో ఉన్నారు. జైస్వాల్ శతకం (118), ఆకాశ్ దీప్ అర్ధ శతకం (66)తో అదరగొట్టారు. ఇంగ్లండ్తో ఐదు టెస్టుల సిరీస్-2025లో ఇప్పటి వరకు శతకాలు బాదింది వీరేయశస్వి జైస్వాల్- 2 సెంచరీలు (హెడింగ్లీ- లీడ్స్, ది ఓవల్- లండన్)శుబ్మన్ గిల్- 4 సెంచరీలు (హెడింగ్లీ- లీడ్స్, ఎడ్జ్బాస్టన్- బర్మింగ్హామ్, ఓల్డ్ ట్రఫోర్డ్- మాంచెస్టర్ )రిషభ్ పంత్- 2 సెంచరీలు (హెడింగ్లీ- లీడ్స్)కేఎల్ రాహుల్- 2 సెంచరీలు (హెడింగ్లీ- లీడ్స్, లార్డ్స్- లండన్)రవీంద్ర జడేజా- 1 సెంచరీలు (ఓల్డ్ ట్రఫోర్డ్- మాంచెస్టర్)వాషింగ్టన్ సుందర్- 1 సెంచరీలు (ఓల్డ్ ట్రఫోర్డ్- మాంచెస్టర్)ఒక టెస్టు సిరీస్లో అత్యధిక సెంచరీలు సాధించిన జట్లుఆస్ట్రేలియా- 1955లో వెస్టిండీస్ వేదికగా ఆతిథ్య జట్టు మీద- ఐదు టెస్టుల్లో- 12 సెంచరీలుపాకిస్తాన్- 1982/83లో సొంతగడ్డపై టీమిండియా మీద ఆరు టెస్టుల్లో- 12 సెంచరీలుసౌతాఫ్రికా- 2003/04లో సొంతగడ్డపై వెస్టిండీస్ మీద నాలుగు టెస్టుల్లో- 12 సెంచరీలుటీమిండియా- 2025లో ఇంగ్లండ్ వేదికగా ఆతిథ్య జట్టు మీద- 12 సెంచరీలుచదవండి: IND vs ENG: నేనైతే ఆకాశ్కు ఒక్కటి ఇచ్చేవాడిని: రిక్కీ పాంటింగ్ 𝘾𝙚𝙣𝙩𝙪𝙧𝙮 𝙖𝙜𝙖𝙞𝙣𝙨𝙩 𝙖𝙡𝙡 𝙤𝙙𝙙𝙨 🥶🗣 #YashasviJaiswal completes a dramatic knock to bring up his 6th International Test century in style! 🔥#ENGvIND 👉 5th TEST, DAY 3 | LIVE NOW on JioHotstar 👉 https://t.co/3V6YCy3sHy pic.twitter.com/ezdwfz3oYi— Star Sports (@StarSportsIndia) August 2, 2025 -
ఊహించని రీతిలో చెలరేగిన ఆకాశ్.. గంభీర్, గిల్ రియాక్షన్ వైరల్
ఇంగ్లండ్తో ఐదో టెస్టులో టీమిండియా పేసర్ ఆకాశ్ దీప్ (Akash Deep) అర్ధ శతకంతో మెరిశాడు. శనివారం నాటి మూడో రోజు ఆట సందర్భంగా డెబ్బై బంతుల్లో యాభై పరుగుల మైలురాయిని చేరుకున్నాడు. టెస్టుల్లో తన తొలి హాఫ్ సెంచరీని ఇంగ్లండ్ గడ్డ మీద నమోదు చేశాడు.గంభీర్, గిల్, జడేజా రియాక్షన్ వైరల్నైట్ వాచ్మన్గా వచ్చి అర్ధ శతకంతో ఆకాశ్ దీప్ ఇరగదీయడంతో భారత శిబిరంలో నవ్వులు పూశాయి. హాఫ్ సెంచరీని సెలబ్రేట్ చేసుకునే క్రమంలో ఆకాశ్ బ్యాట్ పైకెత్తగానే.. కెమెరాలు ఇండియన్ డ్రెసింగ్రూమ్ వైపు మళ్లాయి. లోపల కూర్చుని ఉన్న హెడ్కోచ్ గౌతం గంభీర్ (Gautam Gambhir) చిరునవ్వులు చిందించాడు.మరోవైపు.. బయటకు వచ్చిన కెప్టెన్ శుబ్మన్ గిల్, ఆల్రౌండర్ రవీంద్ర జడేజా (Ravindra Jadeja) చప్పట్లతో ఆకాశ్ దీప్ను ఉత్సాహపరుస్తూ అతడికి శుభాకాంక్షలు తెలియజేశారు. అయితే, టీమిండియా రెండో ఇన్నింగ్స్ 43వ ఓవర్లో ఇంగ్లండ్ పేసర్ జేమీ ఓవర్టన్ బౌలింగ్లో షాట్ ఆడేందుకు ప్రయత్నించిన ఆకాశ్ దీప్.. పాయింట్ దిశగా బంతిని గాల్లోకి లేపాడు.66.. అవుట్అక్కడికి దగ్గర్లో ఫీల్డింగ్ చేస్తున్న గస్ అట్కిన్సన్ పరుగెత్తుకుని వచ్చి డైవ్ చేసి మరీ బంతిని అందుకున్నాడు. దీంతో ఆకాశ్ దీప్ ‘హీరోచిత’ ఇన్నింగ్స్కు తెరపడింది. మొత్తంగా 94 బంతులు ఎదుర్కొన్న అతడు.. 12 ఫోర్ల సాయంతో 66 పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద నిష్క్రమించాడు. ఫలితంగా టీమిండియా మూడో వికెట్ కోల్పోయింది. కాగా 75/2 ఓవర్నైట్ స్కోరుతో శనివారం నాటి ఆట మొదలుపెట్టి టీమిండియా.. భోజన విరామ సమయానికి 44 ఓవర్లలో మూడు వికెట్ల నష్టానికి 189 పరుగులు చేసింది. ఓపెనర్ యశస్వి జైస్వాల్ 85, కెప్టెన్ శుబ్మన్ గిల్ 11 పరుగులతో క్రీజులో ఉన్నారు. లంచ్ బ్రేక్ సమయానికి టీమిండియా ఇంగ్లండ్ కంటే 166 పరుగుల ఆధిక్యంలో ఉంది. ఇక ఈ మ్యాచ్లో గెలిస్తేనే టీమిండియా ఇంగ్లండ్తో ఐదు టెస్టుల సిరీస్ను 2-2తో సమం చేయగలుగుతుంది.భారత్ వర్సెస్ ఇంగ్లండ్ ఐదో టెస్టు👉వేదిక: కెన్నింగ్టన్ ఓవల్, లండన్👉టాస్: ఇంగ్లండ్.. తొలుత బౌలింగ్👉భారత్ తొలి ఇన్నింగ్స్ స్కోరు: 224👉ఇంగ్లండ్ తొలి ఇన్నింగ్స్ స్కోరు: 247.చదవండి: IND vs ENG: నేనైతే ఆకాశ్కు ఒక్కటి ఇచ్చేవాడిని: రిక్కీ పాంటింగ్A maiden international 5️⃣0️⃣ for Akash Deep 👏#SonySportsNetwork #ENGvIND #NayaIndia #DhaakadIndia #TeamIndia #ExtraaaInnings pic.twitter.com/O1wAt9ecyg— Sony Sports Network (@SonySportsNetwk) August 2, 2025 -
ENG VS IND 5th Test: పీకల్లోతు కష్టాల్లో టీమిండియా
మొదటిరోజు ఆట ముగిసే సమయానికి 6 వికెట్ల నష్టానికి టీమిండియా 204 పరుగులు చేసింది. కరుణ్ నాయర్ 52(98), వాషింగ్టన్ సుందర్ 19(45) పరుగులతో క్రీజులో ఉన్నారు. ఇంగ్లండ్ బౌలర్లలో జోష్ టంగ్ , గస్ అట్కిన్సన్ చెరో రెండు వికెట్లు సాధించగా క్రిస్ వోక్స్ ఒక వికెట్ పడగొట్టాడు. ఇంగ్లండ్తో జరుగుతున్న చివరిదైన ఐదో టెస్ట్లో టీమిండియా పీకల్లోతు కష్టాల్లో కూరుకుపోయింది. వర్షం అంతరాయాల నడుమ సాగుతున్న ఈ మ్యాచ్లో టాస్ ఓడి తొలుత బ్యాటింగ్కు దిగిన భారత్ 123 పరుగులకే సగం వికెట్లు కోల్పోయింది. యశస్వి జైస్వాల్ 2, కేఎల్ రాహుల్ 14, సాయి సుదర్శన్ 38, శుభ్మన్ గిల్ 21, రవీంద్ర జడేజా 9 పరుగులకు ఔట్ కాగా.. కరుణ్ నాయర్ (9), ధ్రువ్ జురెల్ (0) క్రీజ్లో ఉన్నారు.ఇంగ్లండ్ బౌలర్లలో జోష్ టంగ్ 2, క్రిస్ వోక్స్, గస్ అట్కిన్సన్ తలో వికెట్ తీయగా.. శుభ్మన్ గిల్ రనౌటయ్యాడు. ప్రస్తుతం ఔటైన వారంతా మంచి ఫామ్లో ఉన్న ఆటగాళ్లే. కొత్తగా జట్టులోకి వచ్చిన ధ్రువ్, ఈ సిరీస్లోనే ఆరు ఇన్నింగ్స్ల్లో దారుణంగా విఫలమైన కరుణ్ నాయర్ టీమిండియాను ఏమేరకు ఆదుకుంటారో చూడాలి. వీరిద్దరి తర్వాత గత మ్యాచ్ సెంచరీ హీరో వాషింగ్టన్ సుందర్పైనే టీమిండియా ఆశలన్నీ ఉన్నాయి. వీరే టీమిండియాను గట్టెక్కించాలి.కాగా, ఈ మ్యాచ్ కోసం భారత్, ఇంగ్లండ్ జట్లు చెరో నాలుగు మార్పులు చేశాయి. భారత్ తరఫున రిషబ్ పంత్, శార్దూల్ ఠాకూర్, బుమ్రా, అన్షుల్ కంబోజ్ స్థానాల్లో ధ్రువ్ జురెల్, కరుణ్ నాయర్, ప్రసిద్ద్ కృష్ణ, ఆకాశ్దీప్ తుది జట్టులోకి రాగా.. ఇంగ్లండ్ తరఫున బెన్ స్టోక్స్, జోఫ్రా ఆర్చర్, బ్రైడన్ కార్స్, లియామ్ డాసన్ స్థానాల్లో జేకబ్ బేతెల్, గస్ అట్కిన్సన్, జోష్ టంగ్, జేమీ ఓవర్టన్ ప్లేయింగ్ ఎలెవెన్లోకి వచ్చారు.ఐదు మ్యాచ్ల ఈ సిరీస్లో భారత్ 1-2తో వెనుకపడి ఉన్న విషయం తెలిసిందే. ఈ మ్యాచ్లో గెలిస్తేనే భారత్ సిరీస్ను సమం చేసుకోగలుగుతుంది. ఓడినా, డ్రా అయినా ఇంగ్లండే సిరీస్ ఎగరేసుకుపోతుంది. తుది జట్లు..భారత్ (ప్లేయింగ్ XI): యశస్వి జైస్వాల్, కేఎల్ రాహుల్, సాయి సుదర్శన్, శుభమన్ గిల్(కెప్టెన్), కరుణ్ నాయర్, రవీంద్ర జడేజా, ధ్రువ్ జురెల్ (వికెట్కీపర్), వాషింగ్టన్ సుందర్, ఆకాశ్ దీప్, ప్రసిద్ధ్ కృష్ణ, మహమ్మద్ సిరాజ్ఇంగ్లండ్ (ప్లేయింగ్ XI): జాక్ క్రాలే, బెన్ డకెట్, ఓలీ పోప్(కెప్టెన్), జో రూట్, హ్యారీ బ్రూక్, జాకబ్ బెథెల్, జామీ స్మిత్(వికెట్కీపర్), క్రిస్ వోక్స్, గస్ అట్కిన్సన్, జేమీ ఓవర్టన్, జోష్ టంగ్ -
‘స్టోక్స్ చేసింది కరెక్టే.. జడ్డూ, వాషీ అలా చేయడం సరికాదు’
ఇంగ్లండ్ టెస్టు జట్టు కెప్టెన్ బెన్ స్టోక్స్ (Ben Stokes)కు సౌతాఫ్రికా దిగ్గజ పేసర్ డేల్ స్టెయిన్ అండగా నిలిచాడు. మాంచెస్టర్ టెస్టులో టీమిండియా ఆటగాళ్లకు ముందుగానే ‘షేక్హ్యాండ్’ ఇవ్వడంలో తప్పులేదంటూ సమర్థించాడు. జెంటిల్మేన్ గేమ్ అంటే.. ఇలాగే ఉండాలంటూ స్టోక్స్కు మద్దతు పలికాడు.ఆద్యంతం ఉత్కంఠసౌతాఫ్రికా స్పిన్నర్ తబ్రేజ్ షంసీకి కౌంటర్ ఇచ్చే క్రమంలో డేల్ స్టెయిన్ ఈ మేరకు వ్యాఖ్యలు చేశాడు. అసలేం జరిగిందంటే.. భారత్- ఇంగ్లండ్ (Ind vs Eng) మధ్య ఐదు మ్యాచ్ల సిరీస్లో భాగంగా మాంచెస్టర్లో నాలుగో టెస్టు జరిగింది.ఈ మ్యాచ్లో టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన టీమిండియా తొలి ఇన్నింగ్స్లో 358 పరుగులకు ఆలౌట్ అయింది. అనంతరం బ్యాటింగ్కు దిగిన స్టోక్స్ బృందం ఏకంగా 669 పరుగులు చేసింది. ఫలితంగా మొదటి ఇన్నింగ్స్లో 311 పరుగుల ఆధిక్యం సంపాదించింది. ఈ క్రమంలో రెండో ఇన్నింగ్స్ మొదలుపెట్టిన భారత్ పరుగుల ఖాతా తెరవకుండానే రెండు వికెట్లు కోల్పోయింది.నలుగురు హీరోలుఅనంతరం ఊహించని రీతిలో పుంజుకుని ఆఖరి రోజు ఆఖరి సెషన్ వరకూ నిలబడి.. ఓడిపోతుందనుకున్న మ్యాచ్లో డ్రాతో గట్టెక్కింది. ఓపెనర్ కేఎల్ రాహుల్ (90) అద్భుత ప్రదర్శనతో ఆకట్టుకోగా.. శుబ్మన్ గిల్ కెప్టెన్ ఇన్నింగ్స్ (103) ఆడాడు. అయితే, వీరిద్దరు అవుటైన తర్వాత భారత శిబిరంలో ఆందోళన పెరిగింది.ఈ క్రమంలో స్పిన్ ఆల్రౌండర్లు రవీంద్ర జడేజా, వాషింగ్టన్ సుందర్ అద్భుతమే చేశారు. జడ్డూ 107, వాషీ 101 పరుగులతో సత్తా చాటారు. అయితే, వీరు శతకాలకు చేరువైన వేళ.. ఎలాగో ఫలితం తేలదు కాబట్టి ఇక చాలు ఆపేద్దాం అని స్టోక్స్ పదే పదే షేక్హ్యాండ్ ఇచ్చేందుకు వచ్చాడు. అయితే, జడ్డూ మాత్రం ఇందుకు నిరాకరించాడు.సెంచరీలు పూర్తి చేసుకున్న తర్వాతే డ్రాఇక జడ్డూ, వాషీ ఇద్దరూ సెంచరీలు పూర్తి చేసుకున్న తర్వాత టీమిండియా డ్రాకు సమ్మతం తెలిపింది. ఈ నేపథ్యంలో స్టోక్స్ తీరుపై విమర్శలు వచ్చాయి. సౌతాఫ్రికా స్పిన్నర్ షంసీ కూడా.. జడేజా, వాషీ శతకాలు పూర్తి చేసుకునేందుకు అర్హులంటూ స్టోక్స్ను సోషల్ మీడియా వేదికగా విమర్శించాడు.స్టోక్స్ చేసింది కరెక్టే.. జడ్డూ, వాషీ అలా చేయడం సరికాదుఇందుకు ప్రొటిస్ మాజీ పేసర్ డేల్ స్టెయిన్ బదులిస్తూ.. ‘‘షామో.. ఉల్లిపాయ ఎన్నో పొరలతో నిర్మితమై ఉంటుంది. ఒక్కో పొర తీస్తున్నకొద్దీ ఎవరో ఒకరు ఏడవక తప్పదు. సంక్లిష్టమైన సందర్భాల్లో దీనిని మనం అన్వయించుకోవచ్చు.అక్కడున్న బ్యాటర్లు సెంచరీలు పూర్తి చేసేందుకు ఆడటం లేదు. కేవలం మ్యాచ్ను డ్రా చేసుకునేందుకే వారు బ్యాటింగ్ చేస్తున్నారు. ఒక్కసారి ఆ పని పూర్తైన తర్వాత జెంటిల్మేన్ ఎవరైనా షేక్హ్యాండ్ ఇస్తారు.అంతేగానీ.. అక్కడ మిగిలి ఉన్న సమయాన్ని మైలురాళ్లను చేరుకునేందుకు ఉపయోగించుకోకూడదు. అయితే, నిబంధనల ప్రకారం వారు తమ పని పూర్తి చేసుకోవచ్చు. కానీ చూడటానికి ఇది అంత గొప్పగా కనిపించదు.ఒకవేళ నిజంగానే వాళ్లు సెంచరీలు పూర్తి చేయాలనుకుంటే ముందు నుంచే ఎందుకు వేగంగా ఆడలేదు. చివరి సెషన్.. చివరి గంట వరకూ ఎందుకు నెమ్మదిగానే ఆడారు. డ్రా కోసమే వారు అలా చేశారు. మరి అలాంటప్పుడు ఒక జట్టునే నిందించడం దేనికి?’’ అని ప్రశ్నించాడు. ‘నేను’ అనే స్వార్థానికి తావుండదుఇందుకు.. ‘‘ఇరుజట్లకూ తమ నిర్ణయాలు తీసుకునే హక్కు ఉంది. ఒకవేళ బ్యాటర్ను ఫీల్డ్ బయటకు పంపించాలంటే అవుట్ చేయవచ్చు కదా!’’ అంటూ షంసీ కౌంటర్ ఇచ్చాడు. ఈ క్రమంలో.. ‘‘చివరి గంట వ్యక్తిగత మైలురాళ్లను చేరుకోవడానికి కేటాయించింది కాదు. జట్టులో ‘నేను’ అనే స్వార్థానికి తావుండదు. ఒకవేళ నేనే అక్కడ 90 పరుగులతో ఉండి ఉంటే కచ్చితంగా డ్రాకు అంగీకరించేవాడిని’’ అని స్టెయిన్ బదులిచ్చాడు. చదవండి: నా కొడుకు ఏమి తప్పు చేశాడు: సెలక్టర్లపై సుందర్ తండ్రి ఫైర్ -
వారిద్దరూ అద్భుతం.. మాలో ఆత్మవిశ్వాసాన్ని పెంచింది: శుబ్మన్ గిల్
మాంచెస్టర్ వేదికగా ఇంగ్లండ్తో జరిగిన నాలుగో టెస్టులో ఓటమి అంచుల నుంచి తప్పించుకొని మ్యాచ్ను భారత్ ‘డ్రా’గా ముగించడంపై అన్ని వైపుల నుంచి ప్రశంసలు వచ్చాయి. రెండో ఇన్నింగ్స్ తొలి ఓవర్లోనే 2 వికెట్లు కోల్పోయి టీమిండియా... తర్వాతి ఐదు సెషన్లలో మరో రెండు వికెట్లు మాత్రమే కోల్పోయి ప్రత్యర్ధిని నిలువరించగలిగింది. ఇది మన జట్టు పట్టుదలను చూపించింది.మాది ఒక గొప్ప జట్టు..ఈ విషయాన్ని భారత కెప్టెన్ శుబ్మన్ గిల్ కూడా ప్రత్యేకంగా ప్రస్తావించాడు. మంచి జట్టుకు, గొప్ప జట్టుకు మధ్య ఉన్న తేడాను తాము చూపించగలిగామని అతను చెప్పాడు. ‘మైదానంలో 143 ఓవర్ల పాటు ఒకే లక్ష్యంతో ఒకే తరహా ఆలోచనతో మానసికంగా దృఢంగా ఉండటం చాలా కష్టం. కానీ మేం దానిని చేసి చూపించాం. ఒక మంచి జట్టుకు, గొప్ప జట్టుకు మధ్య ఇదే ప్రధాన తేడా. ఈ టెస్టులో ఆటతో మాది గొప్ప జట్టని నిరూపించాం’ అని గిల్ వ్యాఖ్యానించాడు.సున్నాకే 2 వికెట్లు కోల్పోయిన దశలో సీనియర్ కేఎల్ రాహుల్తో కలిసి గిల్ నెలకొల్పిన భాగస్వామ్యమే జట్టు రాతను మార్చింది. 70.3 ఓవర్ల వీరి భాగస్వామ్యంలో 188 పరుగులు వచ్చాయి. ఈ పార్ట్నర్షిప్తోనే తాము మ్యాచ్ను కాపాడుకోగలమనే నమ్మకం కలిగిందని గిల్ చెప్పాడు. ‘మా జట్టు పట్టుదలగా ముందుకు వెళ్లాలంటే కావాల్సిన అగ్గిని రగిల్చేందుకు ఒక నిప్పు కణిక అవసరమైంది. నేను, రాహుల్ కలిసి నెలకొల్పిన భాగస్వామ్యం అలాంటిదే. మేం పెట్టుకున్న లక్ష్యాన్ని అందుకోగలమని అప్పుడే అనిపించింది. తుది ఫలితం చాలా సంతోషాన్నిచ్చింది. శనివారం మేం ఉన్న స్థితితో పోలిస్తే మ్యాచ్ను డ్రా చేసుకోవడం ఎంతో సంతృప్తికరం. నా ఇన్నింగ్స్ పట్ల కూడా ఎంతో ఆనందంగా ఉన్నా’ అని గిల్ పేర్కొన్నాడు.భారత్ ఓటమి నుంచి తప్పించుకోవడంలో కీలక పాత్ర పోషించిన జడేజా, సుందర్లపై కూడా కెప్టెన్ ప్రశంసలు కురిపించాడు. వీరిద్దరు 55.2 ఓవర్లు ఆడి అభేద్యంగా 203 పరుగులు జత చేశారు. ‘జడేజా, సుందర్ క్రీజ్లో ఉన్నప్పుడు కూడా బ్యాటింగ్కు అంత అనుకూల పరిస్థితి ఏమీ లేదు.బంతి అనూహ్యంగా స్పందిస్తోంది. కానీ అలాంటి స్థితి నుంచి ప్రశాంతంగా ఆడుతూ ఇద్దరూ సెంచరీలు సాధించడం చాలా గొప్ప విషయం. ఏకాగ్రత చెదరకుండా ప్రతీ బంతిపై వారు దృష్టి పెట్టి డ్రా వరకు తీసుకెళ్లడం ఎంతో ప్రత్యేకం. ఇది మాలో ఆత్మవిశ్వాసాన్ని పెంచింది’ అని గిల్ అన్నాడు.చదవండి: IND vs PAK: ‘పాక్తో మ్యాచ్ ఆడాలి’!.. గంగూలీపై అభిమానుల ఆగ్రహం -
మాంచెస్టర్లో ఇంగ్లాండ్ ప్లేయర్ల హైడ్రామా.. బెన్ స్టోక్స్పై అమితాబ్ సెటైర్లు!
టీమిండియా నాలుగో టెస్ట్ మ్యాచ్పై బిగ్ బీ అమితాబ్ బచ్చన్ స్పందించారు. మాంచెస్టర్లోని ఓల్డ్ ట్రాఫోర్డ్లో చివర్లో జరిగిన హైడ్రామాపై సోషల్ మీడియా వేదికగా అమితాబ్ రియాక్ట్ అయ్యారు. ట్విటర్ వేదికగా చేసిన పోస్ట్కు తనదైన శైలిలో క్యాప్షన్ రాసుకొచ్చారు. అరే.. మనోడు తెల్లోడికి టీకా ఇచ్చిపడేశాడు అంటూ ట్వీట్ చేశారు. ఇది కాస్తా నెట్టంట వైరల్ కావడంతో ఫ్యాన్స్ సైతం ఈ పోస్ట్ రీపోస్ట్ చేస్తున్నారు.అయితే ఫోర్ట్ టెస్ట్లో జడేజా, సుందర్ సెంచరీకి చేరువలో ఉన్న సమయంలో ఇంగ్లాండ్ కెప్టెన్ బెన్ స్టోక్స్ డ్రాకు అంగీకరించాలని జడేజాను కోరాడు. కానీ జడేజా, సుందర్ మ్యాచ్ను ముగించేందుకు నిరాకరించారు. అప్పటికీ ఇంకా 15 ఓవర్ల ఆట మిగిలి ఉండడంతో భారత బ్యాట్స్మెన్ డ్రాకు నిరాకరించారు. బెన్ స్టోక్స్ డ్రా ఆఫర్ను తిరస్కరించాక.. జడేజా, సుందర్ తమ సెంచరీలు పూర్తి చేసుకున్నారు. ఆ తర్వాత ఇరు జట్ల కెప్టెన్ల అంగీకారంతో టెస్ట్ డ్రాగా ముగించారు. మ్యాచ్ చివర్లో ఇంగ్లాండ్ ప్లేయర్లు చేసిన హంగామాతో సోషల్ మీడియాలో ట్రోల్ పెద్దఎత్తున వైరలయ్యాయి. కాగా.. ఈ మ్యాచ్లో జడేజా 107 పరుగులు సాధించగా.. వాషింగ్టన్ సుందర్ 101 రన్స్తో నాటౌట్గా నిలిచారు.ఇక సినిమాల విషయానికొస్తే అమితాబ్ బచ్చన్ సెక్షన్ 84 అనే చిత్రంలో కనిపించనున్నారు. ఇందులో నిమ్రత్ కౌర్, డయానా పెంటీ, అభిషేక్ బెనర్జీ కీలక పాత్రల్లో నటించారు. ఆ తర్వాత టాలీవుడ్ మూవీ కల్కి 2898 ఏడీ పార్ట్-2లో నటించనున్నారు. Take !?? अरे गोरे को टिका (tika - sorry tayka diya ) दिया रे !!🤣 https://t.co/1ybakYvNFM— Amitabh Bachchan (@SrBachchan) July 27, 2025 -
IND vs ENG: ‘రెండు కుక్కలు తెచ్చి.. ఆ పేర్లు పెడతాడు’
టీమిండియా క్రికెటర్లు వాషింగ్టన్ సుందర్ (Washington Sundar), రవీంద్ర జడేజాలపై భారత మాజీ ఆటగాడు ఆశిష్ నెహ్రా ప్రశంసలు కురిపించాడు. లార్డ్స్ (Lord's Test), మాంచెస్టర్ టెస్టుల్లో ఈ ఇద్దరు స్పిన్ బౌలింగ్ ఆల్రౌండర్లు అద్భుతంగా ఆడారని కొనియాడాడు. నాలుగో టెస్టులో సెంచరీ పూర్తి చేసుకునేందుకు వీరిద్దరు అర్హులని.. వారి స్థానంలో ఇంగ్లండ్ బ్యాటర్లు ఉన్నా అదే పని చేసేవారన్నాడు.ఊహించని రీతిలో పుంజుకునిభారత్- ఇంగ్లండ్ (Ind vs Eng) మధ్య మాంచెస్టర్ వేదికగా బుధవారం నుంచి ఆదివారం వరకు నాలుగో టెస్టు జరిగింది. టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన టీమిండియా 358 పరుగులకు ఆలౌట్ అయింది. అనంతరం బ్యాటింగ్కు దిగిన ఇంగ్లండ్ ఏకంగా 669 పరుగులు చేసి.. తొలి ఇన్నింగ్స్లో భారత్పై 311 పరుగుల ఆధిక్యంలో నిలిచింది.గిల్తో పాటు జడ్డూ, వాషీ శతకాలుఇలాంటి తరుణంలో నాలుగో రోజు బ్యాటింగ్ మొదలుపెట్టిన టీమిండియా సున్నా పరుగులకే రెండు వికెట్లు కోల్పోయింది. అయితే, ఓపెనర్ కేఎల్ రాహుల్ (90), కెప్టెన్ శుబ్మన్ గిల్ (103) ఇన్నింగ్స్ చక్కదిద్దగా.. జడ్డూ (107), వాషీ (101) ఆఖరి రోజు ఆఖరి సెషన్ వరకూ పట్టుదలగా నిలబడి అజేయ శతకాలతో మ్యాచ్ డ్రా అయ్యేలా చూశారు.రెండు కుక్కలు తెచ్చి.. ఆ పేర్లు పెడతాడుఈ నేపథ్యంలో వాషీ, జడ్డూలపై ప్రశంసల వర్షం కురిపించిన ఆశిష్ నెహ్రా ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. ‘‘వాషింగ్టన్ సుందర్ గబ్బా మైదానంలో టీమిండియా టెస్టు గెలిచిన తర్వాత తన పెంపుడు కుక్కకు గబ్బాగా నామకరణం చేశాడు.ఇక ఇప్పుడు.. అతడు మరో రెండు కుక్కలను కొని... వాటికి లార్డ్స్, మాంచెస్టర్ అనే పేర్లు పెడితే బాగుంటుంది. ఇక రవీంద్ర జడేజా రెండు గుర్రాలు తెచ్చి వాటికి ఈ పేర్లు పెట్టుకోవాలి. ఎందుకంటే.. అతడికి డాగ్స్తో వర్కౌట్ కాదు మరి’’ అంటూ సరదాగా వ్యాఖ్యానించాడు. కాగా జడేజాకు గుర్రపు స్వారీ అంటే ఇష్టమన్న విషయం తెలిసిందే.ఇదిలా ఉంటే.. లార్డ్స్లో వాషీ నాలుగు వికెట్లతో సత్తా చాటగా.. జడ్డూ 61 పరుగులతో అజేయంగా నిలిచి.. జట్టును భారీ ఓటమి నుంచి తప్పించాడు. అయితే, మిగతా వారి నుంచి సహకారం లేకపోవడంతో ఆఖరికి 22 పరుగుల తేడాతో ఇంగ్లండ్ చేతిలో టీమిండియా పరాజయం పాలైంది.చావోరేవోఇక ఇంగ్లండ్- భారత్ మధ్య ఐదు టెస్టుల సిరీస్లో భాగంగా ఇప్పటికి నాలుగు టెస్టులు పూర్తి కాగా... రెండింట స్టోక్స్ బృందం.. ఒక మ్యాచ్లో గిల్ సేన గెలిచాయి. నాలుగో టెస్టు డ్రా కావడంతో 2-1తో ఇంగ్లండ్ ఆధిక్యంలోనే కొనసాగుతోంది. ఇరుజట్ల మధ్య జూలై 31- ఆగష్టు 4 వరకు లండన్లోని ఓవల్ మైదానం వేదికగా ఐదో టెస్టు నిర్వహణకు షెడ్యూల్ ఖరారైంది. ఈ మ్యాచ్లో గెలిస్తేనే టీమిండియా ఈ సిరీస్ను 2-2తో సమం చేసి డ్రా చేసుకోగలుగుతుంది.చదవండి: మీ వాళ్లైతే ఇలాగే చేస్తావా?.. స్టోక్స్పై మండిపడ్డ గంభీర్ -
IND vs ENG: సుందర్-జడేజా జోడీ సరికొత్త చరిత్ర..
మాంచెస్టర్ వేదికగా ఇంగ్లండ్తో జరిగిన నాలుగో టెస్టు.. భారత క్రికెట్ చరిత్రలో చిరస్మరణీయంగా మిగిలిపోనుంది. ఓటమి తప్పదనుకున్న చోట భారత బ్యాటర్లు అద్బుతం చేశారు. తమ విరోచిత పోరాటంతో మ్యాచ్ను డ్రా ముగించి సిరీస్ ఆశలను సజీవంగా ఉంచుకున్నారు.ఈ మ్యాచ్ను భారత్ డ్రా ముగించడంలో రవీంద్ర జడేజా, వాషింగ్టన్ సుందర్లది కీలక పాత్ర. ఆఖరి రోజు ఆటలో కేఎల్ రాహుల్, శుబ్మన్ గిల్ ఔటైన తర్వాత ఈ ఇద్దరు ఆల్రౌండర్లు జట్టు బాధ్యతను తమ భుజాలపై వేసుకున్నారు.ఇంగ్లండ్ బౌలర్ల సహనాన్ని పరీక్షిస్తూ తమ సెంచరీల మార్క్ను అందుకున్నారు. ఇద్దరూ కలసి ఐదో వికెట్కు 203 పరుగుల అజేయ భాగస్వామ్యం అందించారు. ఈ క్రమంలో ఈ ఎడమ చేతి వాటం జోడీ ఓ అరుదైన ఘనతను తమ పేరిట లిఖించుకున్నారు.ఓల్డ్ట్రాఫర్డ్ మైదానంలో టెస్టుల్లో ఐదో వికెట్కు అత్యధిక భాగస్వామ్యం నెలకొల్పిన భారత జోడీగా సుందర్- జడేజా నిలిచారు. ఇంతకుముందు ఈ రికార్డు భారత క్రికెట్ దిగ్గజాలు సచిన్ టెండూల్కర్, మహ్మద్ అజారుద్దీన్ పేరిట ఉండేది. ఈ ఇద్దరు లెజెండరీ క్రికెటర్లు 1990లో మాంచెస్టర్ వేదికగా జరిగిన టెస్టు మ్యాచ్లో ఐదో వికెట్కు 112 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పారు. తాజా మ్యాచ్తో ఈ ఆల్టైమ్ రికార్డు బ్రేక్ అయ్యింది. ఇక భారత్-ఇంగ్లండ్ మధ్య ఐదో టెస్టు జూలై 31 నుంచి లండన్లోని ఓవెల్ వేదికగా జరగనుంది.చదవండి: మీ వాళ్లైతే ఇలాగే చేస్తావా?.. స్టోక్స్పై మండిపడ్డ గంభీర్ -
చరిత్ర సృష్టించిన జడేజా.. రెండో ఆల్రౌండర్గా అరుదైన ఘనత
టీమిండియా స్టార్ క్రికెటర్ రవీంద్ర జడేజా (Ravindra Jadeja) ఇంగ్లండ్ గడ్డ మీద అద్భుత ప్రదర్శనతో ఆకట్టుకుంటున్నాడు. లార్డ్స్లో జరిగిన మూడో టెస్టులో ఆఖరి వరకు పోరాడిన జడ్డూ.. తాజాగా నాలుగో టెస్టులోనూ పట్టుదలగా నిలబడ్డాడు. సహచర ఆల్రౌండర్ వాషింగ్టన్ సుందర్ (Washington Sundar)తో కలిసి శతక్కొట్టి మ్యాచ్ డ్రా కావడంలో కీలక పాత్ర పోషించాడు.ఈ క్రమంలోనే రవీంద్ర జడేజా సరికొత్త చరిత్ర సృష్టించాడు. ఇంగ్లండ్ గడ్డ మీద 30కి పైగా వికెట్లు తీయడంతో పాటు.. వెయ్యి పరుగులు పూర్తి చేసుకున్న ఆల్రౌండర్గా రెండో ఆల్రౌండర్గా అరుదైన ఘనత సాధించాడు. కాగా టెండుల్కర్- ఆండర్సన్ ట్రోఫీ (Tendulkar- Anderson Trophy) ఆడేందుకు టీమిండియా ఇంగ్లండ్లో పర్యటిస్తున్న విషయం తెలిసిందే.జడేజా వీరోచిత పోరాటంఇందులో భాగంగా లీడ్స్ టెస్టులో 36 పరుగులు చేసిన జడేజా.. ఒక వికెట్ తీశాడు. ఎడ్జ్బాస్టన్ టెస్టులో తొలి ఇన్నింగ్స్లో 89 విలువైన పరుగులు చేసిన జడ్డూ.. రెండో ఇన్నింగ్స్లో 69 పరుగులతో నాటౌట్గా నిలిచాడు. అదే విధంగా.. ఈ మ్యాచ్లో ఒక వికెట్ కూడా పడగొట్టాడు.ఇక ప్రఖ్యాత లార్డ్స్ మైదానంలో జడేజా రెండు అద్భుత అర్ధ శతకాలు (72, 61 నాటౌట్) చేశాడు. అంతేకాదు.. ఒక వికెట్ కూడా తన ఖాతాలో వేసుకున్నాడు. అయితే, మాంచెస్టర్ టెస్టులో క్లిష్ట పరిస్థితుల్లో ఈ ఎడమచేతి వాటం బ్యాటర్.. తన హాఫ్ సెంచరీని శతకంగా మలిచాడు. తొలి ఇన్నింగ్స్లో 20 పరుగులే చేసినప్పటికీ.. రెండో ఇన్నింగ్స్లో అజేయ శతకం (107)తో మెరిశాడు. అదే విధంగా.. ఈ లెఫ్టార్మ్ స్పిన్నర్ నాలుగు వికెట్లతో సత్తా చాటాడు.రెండో ఆల్రౌండర్గా అరుదైన ఘనతఈ నేపథ్యంలో ఇంగ్లండ్ గడ్డ మీద ఇప్పటి వరకు 34 వికెట్లు తీయడంతో పాటు వెయ్యి పరుగులు పూర్తి చేసుకున్నాడు జడ్డూ. తద్వారా వెస్టిండీస్ దిగ్గజం గ్యారీఫీల్డ్ సోబర్స్ తర్వాత ఇంగ్లండ్లో 30కి పైగా వికెట్లు తీయడంతో పాటు వెయ్యి పరుగులు సాధించిన రెండో ఆల్రౌండర్గా చరిత్రకెక్కాడు. ఇక ఓవరాల్గా విదేశీ గడ్డ మీద ఈ ఘనత సాధించిన మూడో ఆల్రౌండర్ జడ్డూ. అతడి కంటే ముందు సోబర్స్తో పాటు ఇంగ్లండ్కు చెందిన విల్ఫ్రెడ్ రోడ్స్ ఈ ఫీట్ నమోదు చేశారు.‘డ్రా’ గా ముగిసిన నాలుగో టెస్టుకాగా మాంచెస్టర్ వేదికగా బుధవారం - ఆదివారం జరిగిన నాలుగో టెస్టు డ్రా అయింది. తొలి ఇన్నింగ్స్లో భారత్ 358 పరుగులకు ఆలౌట్ కాగా.. ఇంగ్లండ్ తమ మొదటి ఇన్నింగ్స్లో ఏకంగా 669 పరుగులు చేసింది. తద్వారా 311 పరుగుల ఆధిక్యం సంపాదించింది.ఈ క్రమంలో రెండో ఇన్నింగ్స్ మొదలుపెట్టిన భారత్ సున్నా పరుగులకే రెండు వికెట్లు కోల్పోయి కష్టాలో పడిన వేళ.. కెప్టెన్ శుబ్మన్ గిల్ అద్భుత శతకం (103) సాధించగా.. ఓపెనర్ కేఎల్ రాహుల్ భారీ హాఫ్ సెంచరీ (90)తో ఆకట్టుకున్నాడు.ఇక స్పిన్ బౌలింగ్ ఆల్రౌండర్లు వాషింగ్టన్ సుందర్ (101 నాటౌట్), రవీంద్ర జడేజా కలిసి ఐదో వికెట్కు ఏకంగా 203 పరుగుల భాగస్వామ్యం నమోదు చేసి.. ఓడిపోతుందనుకున్న మ్యాచ్ను డ్రాతో గట్టెక్కించారు. ఇక ఇప్పటికి ఐదు మ్యాచ్ల సిరీస్లో 2-1తో ముందున్న ఇంగ్లండ్కు.. ఓవల్లో జరిగే ఐదో టెస్టులో చెక్ పెట్టి సిరీస్ను డ్రా చేసుకోవాలని టీమిండియా భావిస్తోంది.చదవండి: మీ వాళ్లైతే ఇలాగే చేస్తావా?.. స్టోక్స్పై మండిపడ్డ గంభీర్ -
మీ వాళ్లైతే ఇలాగే చేస్తావా?.. స్టోక్స్పై మండిపడ్డ గంభీర్
ఇంగ్లండ్ క్రికెట్ జట్టు కెప్టెన్ బెన్ స్టోక్స్ (Ben Stokes) తీరుపై టీమిండియా హెడ్కోచ్ గౌతం గంభీర్ ఆగ్రహం వ్యక్తం చేశాడు. భారత ఆల్రౌండర్లు రవీంద్ర జడేజా (Ravindra Jadeja), వాషింగ్టన్ సుందర్ సెంచరీ చేయకుండా అడ్డుకునేందుకు ఇంగ్లండ్ జట్టు ప్రవర్తించిన తీరును తప్పుబట్టాడు. టీమిండియా ఆటగాళ్ల స్థానంలో తమ ప్లేయర్లు ఉంటే కూడా స్టోక్స్ ఇలాగే చేసేవాడా అని ప్రశ్నించాడు. అసలేం విషయం ఏమిటంటే..ఆపేద్దాం.. లేదు ఆడేద్దాంభారత్- ఇంగ్లండ్ మధ్య నాలుగో టెస్టు (Ind vs Eng 4th Test)లో ఆఖరిదైన ఐదో రోజు ఆటలో ఆఖరి గంటలో... ఆపేద్దామంటే, ఆడేద్దామనే హైడ్రామా చోటు చేసుకుంది. చివరి సెషన్లో ఇక గంట ఆటే మిగిలుంది. 15 ఓవర్లు పడాల్సి ఉంది. ఫలితం తేలని సందర్భాల్లో ఆ కనీస ఓవర్లకు ముందే ఇరు జట్ల కెప్టెన్లు పరస్పర సమ్మతితో ‘డ్రా’ పాట పాడే ఆనవాయితీ ఎప్పటి నుంచో ఉంది. దీనికోసం ప్రయత్నించి ఇంగ్లండ్ కెప్టెన్ స్టోక్స్ భంగపడ్డాడు.స్టోక్స్కు మింగుడుపడని విధంగా అసలేం జరిగిందంటే... 138 ఓవర్లలో భారత్ స్కోరు 386/4. 75 పరుగుల ఆధిక్యంలో ఉంది. ఇక మిగిలిపోయిన ఆ 15 ఓవర్లతో ఆలౌట్ చేయడం, తర్వాత లక్ష్యాన్ని ఛేదించడం, ఇంగ్లండ్ గెలవడం జరిగేది కాదని అర్థమైంది. దీంతో అలసిన సహచరులకు కాస్త ముందుగానే విశ్రాంతినిద్దామనే ఆలోచనతో స్టోక్స్ డ్రా కోసం ‘ఇక చాలు ఆపేద్దాం’ అన్నాడు.శతకాలు పూర్తి చేసుకున్న తర్వాతకానీ అవతలి వైపు జడేజా (89 బ్యాటింగ్), సుందర్ (80 బ్యాటింగ్) సెంచరీలకు దగ్గరవడంతో భారత దళం ‘కుదరదు... ఆడేద్దాం’ అంది. స్టోక్స్ ప్రతిపాదనను జడేజా తోసిపుచ్చాడు. క్రీజులో ఉన్న ఇద్దరం శతకరేసులో ఉన్నామన్నాడు. దీంతో చేసేదేమీలేక చిన్నబుచ్చుకున్న స్టోక్స్ సులువైన బౌలింగ్నే పురమాయించాడు. ఫోరు, సిక్స్తో జడేజా... తర్వాత బౌండరీలతో సుందర్ చకచకా సెంచరీలను పూర్తి చేసుకున్నారు. ఈ ఆఖరి దూకుడుతో 5 ఓవర్ల వ్యవధిలో భారత్ 39 పరుగులు చేసింది. 400 స్కోరునూ దాటింది.మీ వాళ్లైతే ఇలాగే చేస్తావా?అయితే, ముందు జడ్డూ, వాషీల శతకాలకు అడ్డుపడేలా.. పదే పదే షేక్హ్యాండ్ ఇస్తూ స్టోక్స్ వ్యవహరించిన తీరుపై విమర్శలు వెల్లువెత్తాయి. ఈ విషయంపై టీమిండియా హెడ్కోచ్ గౌతం గంభీర్ కూడా స్పందించాడు. ‘‘ఒకరేమో 90, మరొకరేమో 85 పరుగుల వద్ద ఉన్నప్పుడు... సెంచరీ పూర్తి చేసుకునేందుకు వారు అర్హులా? కాదా?ఒకవేళ వారి ఆటగాళ్లు కూడా ఇలా మైలురాయికి చేరువైన వేళ ఇలాగే డ్రా ప్రతిపాదన తెచ్చేవారా? మా వాళ్లు పట్టుదలగా పోరాడారు. వాళ్ల కష్టానికి ప్రతిఫలమే ఆ శతకాలు. ఎవరినో సంతోష పెట్టడానికి మేము ఇక్కడ లేము’’ అంటూ స్టోక్స్ తీరుపై గంభీర్ మండిపడ్డాడు.ఆఖరి టెస్టు గెలిస్తేనేకాగా ఆండర్సన్- టెండుల్కర్ ట్రోఫీలో భాగంగా ఐదు టెస్టులు ఆడేందుకు టీమిండియా ఇంగ్లండ్లో పర్యటిస్తోంది. ఈ క్రమంలో లీడ్స్లో తొలి టెస్టులో ఆతిథ్య జట్టు గెలవగా.. ఎడ్జ్బాస్టన్లో భారత్ జయభేరి మోగించింది. అయితే, లార్డ్స్లో జరిగిన మూడో టెస్టులో ఇంగ్లండ్ గెలవగా.. తాజాగా మాంచెస్టర్లో ముగిసిన నాలుగో టెస్టులో ఫలితం తేలలేదు. ప్రస్తుతం ఇంగ్లండ్ 2-1తో ఆధిక్యంలో ఉండగా.. ఓవల్ మైదానంలో ఆఖరిదైన ఐదో టెస్టు గెలిస్తేనే టీమిండియా సిరీస్ను కనీసం డ్రా చేసుకోగలుగుతుంది.భారత్ వర్సెస్ ఇంగ్లండ్ నాలుగో టెస్టు సంక్షిప్త స్కోర్లు👉భారత్: 358 & 425/4👉ఇంగ్లండ్: 669.చదవండి: IND vs ENG: చరిత్ర సృష్టించిన టీమిండియా.. ప్రపంచంలోనే తొలి జట్టుగాA day defined by three centurions as #ShubmanGill, #RavindraJadeja & #WashingtonSundar led #TeamIndia’s defiance & secured a draw! 🙌🏻Which moments did you enjoy the most? ✍🏻👇#ENGvIND 👉 5th TEST | Starts THU, 31st July, 2:30 PM | Streaming on JioHotstar! pic.twitter.com/5uLQZD24Cq— Star Sports (@StarSportsIndia) July 27, 2025 -
స్టుపిడ్ పనులు చేయొద్దని బ్రూక్కు ముందే చెప్పా: బెన్ స్టోక్స్
మాంచెస్టర్లోని ఓల్డ్ ట్రాఫర్డ్ మైదానంలో భారత్-ఇంగ్లండ్ మధ్య జరిగిన నాలుగో టెస్టు డ్రాగా ముగిసింది. అయితే ఈ మ్యాచ్లో ఇంగ్లండ్ కెప్టెన్ బెన్ స్టోక్స్ వ్యవహరించిన తీరుపై విమర్శల వర్షం కురుస్తోంది. భారత బ్యాటర్లు రవీంద్ర జడేజా, వాషింగ్టన్ సుందర్లు తమ సెంచరీలకు దగ్గరగా ఉన్నప్పుడు స్టోక్స్.. కరచాలనం చేసి మ్యాచ్ను డ్రాగా ముగించాలని కోరుకున్నాడు.ఇంకా అప్పటికి 15 ఓవర్ల ఆట మిగిలి ఉంది. స్టోక్స్ ప్రతిపాదనను జడేజా, సుందర్లు తిరష్కరించారు. దీంతో స్టోక్స్ ఫ్రస్ట్రేషన్ తారస్థాయికి చేరుకుంది. ఈ క్రమంలో స్టోక్స్తో పాటు తన సహచర ఆటగాళ్లు తమ నోటికి పనిచెప్పారు. క్రీడాస్పూర్తిని మరిచి గల్లీ క్రికెటర్లా ప్రవర్తించారు. టీమిండియాకు డ్రాకు ఒప్పుకోలేదనో అక్కసుతో బ్రూక్తో స్టోక్స్ బౌలింగ్ చేశాడు. సాధరణంగా బ్రూక్ చాలా సందర్భాల్లో పార్ట్ టైమ్ స్పిన్నర్గా తన సేవలను అందించాడు. కానీ ఈ మ్యాచ్లో మాత్రం బ్రూక్ స్లోగా ఫుల్ టాస్లు వేస్తూ, ఈజీగా పరుగులు ఇవ్వాలనే ఉద్దేశ్యంతో బౌలింగ్ చేశాడు. దీంతో ఇంగ్లండ్ కెప్టెన్ భారత అభిమానుల అగ్రహానికి గురయ్యాడు.కాగాఈ హ్యాండ్షేక్ వివాదంపై మ్యాచ్ అనంతరం స్టోక్స్ స్పందించాడు. డ్రా తప్పదనే ఉద్దేశ్యంతో ముందుగానే హ్యాండ్ షేక్ ఇవ్వాలనుకున్నాను స్టోక్స్ తెలిపాడు."రవీంద్ర జడేజా, వాషింగ్టన్ సుందర్లు అద్భుతమైన ఇన్నింగ్స్లు ఆడారు. మ్యాచ్ను వారికి అనుకూలంగా మార్చుకోవడంలో వీరిద్దరి భాగస్వామ్యం కీలకం మారింది. వారు బాగా ఆడారని అప్పటికే మేము ఒప్పుకొన్నాము . 80,90 పరుగులతో నాటౌట్గా ఉండి జట్టును క్లిష్ట పరిస్థితి నుంచి కాపాడడం కంటే, సెంచరీ చేసి ఆజేయంగా డ్రెసింగ్స్ రూమ్కు వెళ్లడం ఎక్కువ సంతృప్తి ఇస్తుందని నేను అనుకోవడం లేదు. సెంచరీకి 10 పరుగులు లేదా అంతకంటే ఎక్కువ ఏదైనా సరే ఫలితం మాత్రం మారదు. ఆ విషయం వారికి కూడా తెలుసు. చాలా క్లిష్ట పరిస్థితి నుంచి జట్టును కాపాడడంలో విజయం సాధించారు. చివరి మ్యాచ్ కంటే ముందు సిరీస్ ఓటమి నుంచి మీ జట్టును కాపాడారు. అంతకుమించి ఇంకేమి కావాలి.అందుకే బ్రూక్కు ఇచ్చా..ఈ మ్యాచ్లో ఫలితం వచ్చే వచ్చే అవకాశం లేనందున, మిగిలిన ఓవర్లను ఫ్రంట్లైన్ బౌలర్లతో బౌలింగ్ చేయించి రిస్క్ తీసుకోడదని భావించాను. మా ప్రధాన బౌలర్లు వర్క్లోడ్ కారణంగా చాలా ఇబ్బందిపడ్డారు.అందుకే బ్రూక్తో బౌలింగ్ చేయించాను. ఎటువంటి స్టుపిడ్ పనులు చేయోద్దని బ్రూక్కు బంతి ఇచ్చే ముందు చెప్పా. మేము అప్పటికే ఎక్కువ సమయం ఫీల్డింగ్ చేసి అలిసిపోయాము. కానీ పరుగులిచ్చి మ్యాచ్ను తొందరగా ముగించాలని మేము అనుకోలేదు. సహజంగా మనం బౌలింగ్ చేయకపోయినా కూడా ఫీల్డ్లో ఉంటే అలసట వస్తుంది. అందుకే డ్రాకు వెళ్లాలని భావించాను. గంట ఆట మాత్రమే ఉన్నప్పుడు డ్రా కోసం షేక్హ్యాండ్స్ ఇచ్చుకోవచ్చు. కానీ అందుకు భారత్ తిరష్కరించింది" అని పోస్ట్ మ్యాచ్ కాన్ఫరెన్స్లో స్టోక్స్ పేర్కొన్నాడు.చదవండి: IND vs ENG: చరిత్ర సృష్టించిన టీమిండియా.. ప్రపంచంలోనే తొలి జట్టుగా -
బెన్ స్టోక్స్ నోటి దురుసు.. అస్సలు నీవు కెప్టెన్వేనా? వీడియో వైరల్
మాంచెస్టర్ టెస్టును టీమిండియా ఆద్వితీయ పోరాటంతో డ్రా ముగించింది. తద్వారా ఐదు మ్యాచ్ల సిరీస్లో తమ ఆశలను భారత్ సజీవంగా నిలుపునకుంది. ఓవర్ నైట్స్కోర్ 171/2తో ఐదో రోజు ఆటను ప్రారంభించిన భారత్.. కేఎల్ రాహుల్(90) వికెట్ను త్వరగానే కోల్పోయింది.లంచ్ విరామానికి ముందు ఇన్ఫామ్ బ్యాటర్ శుబ్మన్ గిల్(103) కూడా పెవిలియన్కు చేరాడు. దీంతో భారత్ ఓటమి తప్పదని అంతా భావించారు. ఈ క్రమంలో సర్ రవీంద్ర జడేజా, వాషింగ్టన్ సుందర్ అద్బుతం చేశారు. వీరిద్దరూ తమ ఆసాధరణ బ్యాటింగ్తో ఇంగ్లండ్ ప్లేయర్లు విసుగుతెప్పించారు.ఎన్నో ప్రయత్నాలు చేసినప్పటికి ఈ జోడీని ఇంగ్లండ్ విడగొట్టలేకపోయింది. ఇద్దరూ కలసి ఐదో వికెట్కు 203 పరుగుల అజేయ భాగస్వామ్యం అందించారు. అయితే వీరిని ఔట్ చేయలేక అలిసిపోయిన ఇంగ్లండ్ కెప్టెన్ బెన్ స్టోక్స్.. 15 ఓవర్ల ఆట మిగిలూండగానే చేతులెత్తేశాడు.స్టోక్స్ డ్రా ఆఫర్ చేస్తూ రవీంద్ర జడేజా వద్దకు షేక్ హ్యాండ్ ఇచ్చే ప్రయత్నం చేశాడు. అందుకు జడేజా తిరస్కరించాడు. నాకేమి సంబంధం లేదు, కెప్టెన్ చెప్పినట్లు చేస్తా అని జడ్డూ సమాధనమిచ్చాడు. అయితే అప్పటికే రవీంద్ర జడేజా 89 పరుగులు, వాషింగ్టన్ సుందర్ 80 పరుగులు చేసి సెంచరీలకు చేరువలో ఉన్నారు. అందుకే వారిద్దరూ డ్రాకు అంగీకరించలేదు. దీంతో సహనం కోల్పోయిన స్టోక్స్ తన నోటికి పనిచెప్పాడు. బ్రూక్, బెన్ డకెట్ బౌలింగ్లో సెంచరీలు చేయాలనుకుంటున్నారా అంటూ జడేజాతో వెటకారంగా అన్నాడు. ఇంగ్లండ్ ప్లేయర్లు కూడా స్టోక్స్కు జతయ్యారు. జాక్ క్రాలీ డ్రాకు ఒప్పుకొవచ్చుగా అని జడేజాతో అన్నాడు.కానీ జడేజా, సుందర్ మాత్రం ఒకే మాటపై ముందుకు వెళ్లారు. స్టోక్స్ అన్నవిధంగానే పార్ట్ టైమ్ స్పిన్నర్ హ్యారీ బ్రూక్కు బంతి అందించాడు. బ్రూక్ గల్లీ క్రికెట్లో బౌలింగ్ చేసినట్లు చేశాడు. అతడి బౌలింగ్లోనే సిక్స్ బాది జడేజా(107) సెంచరీ పూర్తి చేసుకోగా.. ఆ తర్వాత రెండు ఓవర్లకే సుందర్(101) తన తొలి టెస్టు సెంచరీ మార్క్ను అందుకున్నాడు.కాగా ఈ మ్యాచ్లో స్టోక్స్ ప్రవర్తనపై నెటిజన్లు ఫైరవతున్నారు. అస్సలు నీకు క్రీడాస్పూర్తి ఉందా? ఆ స్దానంలో మీ ప్లేయర్లు ఉంటే ప్రత్యర్ధి కెప్టెన్ ఇలా చేస్తే ఊరుకుంటావా? అని సోషల్ మీడియాలో పోస్ట్లు పెడుతున్నారు.చదవండి: IND vs ENG: చరిత్ర సృష్టించిన టీమిండియా.. ప్రపంచంలోనే తొలి జట్టుగాScored a hundred, saved the Test, farmed ♾ aura! 💁♂#RavindraJadeja didn't hesitate, till the end 👀#ENGvIND 👉 5th TEST | Starts THU, 31st July, 2:30 PM | Streaming on JioHotstar! pic.twitter.com/cc3INlS07P— Star Sports (@StarSportsIndia) July 27, 2025 -
చరిత్ర సృష్టించిన టీమిండియా.. ప్రపంచంలోనే తొలి జట్టుగా
ఇంగ్లండ్తో ఐదు మ్యాచ్ల టెస్టు సిరీస్లో భారత జట్టు తమ ఆశలను సజీవంగా ఉంచుకుంది. మాంచెస్టర్ వేదికగా ఇంగ్లండ్ జరిగిన నాలుగో టెస్టును టీమిండియా డ్రా ముగించింది. ఓటమి తప్పదనుకున్న మ్యాచ్లో భారత బ్యాటర్లు అద్బుతం చేశారు.రవీంద్ర జడేజా (107 నాటౌట్), వాషింగ్టన్ సుందర్ (101 నాటౌట్), కెప్టెన్ శుబ్మన్ గిల్ (103), కేఎల్ రాహుల్(90) తమ విరోచిత పోరాటాలతో భారత్ను ఓటమి నుంచి గటెక్కించారు. 174/2 ఓవర్నైట్ స్కోరుతో చివరి రోజు ఆటను ప్రారంభించిన టీమిండియా.. 4 వికెట్ల నష్టానికి 425 పరుగులు చేసింది. తొలుత రాహుల్, గిల్ అడ్డుగోడగా నిలవగా.. ఆ తర్వాత వాషింగ్టన్ సుందర్, జడేజా ఇంగ్లండ్ బౌలర్ల సహనాన్ని పరీక్షించారు.వీరిద్దరిని ఔట్ చేయడం ఇంగ్లీష్ బౌలర్ల తరం కాలేదు. ఆఖరికి ఇంగ్లండ్ ప్లేయర్లు దిగొచ్చి డ్రాకు అంగీకరించాలని భారత ప్లేయర్లను కోరారు. కానీ జడేజా, సుందర్లు తమ సెంచరీలు పూర్తియ్యాక డ్రా అంగీకరించారు. ఇక ఈ మ్యాచ్ను డ్రా ముగించిన భారత జట్టు ఓ అరుదైన రికార్డును తమ పేరిట లిఖించుకుంది.👉ఒక టెస్టు సిరీస్లో అత్యధిక సార్లు 350కు పైగా పరుగులు చేసిన జట్టుగా టీమిండియా వరల్డ్ రికార్డు సృష్టించింది. ప్రస్తుతం ఇంగ్లండ్తో జరుగుతున్న సిరీస్లో భారత్ 7 సార్లు 350+ స్కోర్లు సాధించింది. ఇంతకుముందు ఈ రికార్డు ఆస్ట్రేలియా పేరిట ఉండేది.ఆస్ట్రేలియా మూడు టెస్టు సిరీస్లలో 6 సార్లు 350కు పైగా పరుగులు చేసింది. ఆసీస్ చివరగా 1980లో ఇంగ్లండ్తో జరిగిన టెస్టు సిరీస్లో 6 సార్లు 350+ స్కోర్లు చేసింది. తాజా మ్యాచ్తో ఆసీస్ ఆల్టైమ్ రికార్డును భారత్ బ్రేక్ చేసింది.👉ఒక టెస్ట్ సిరీస్లో నలుగురు భారత బ్యాటర్లు 400 కంటే ఎక్కువ పరుగులు చేయడం ఇదే తొలిసారి. ఈ సిరీస్లో శుబ్మన్ గిల్, రిషబ్ పంత్, రవీంద్ర జడేజా 400కు పైగా పరుగులు చేశారు.చదవండి: చాలా సంతోషంగా ఉంది.. అందుకే వారు షేక్ హ్యాండ్స్ ఇవ్వలేదు: గిల్ -
జడేజా, సుందర్ వీరోచిత శతకాలు.. డ్రాగా ముగిసిన నాలుగో టెస్ట్
ఐదు మ్యాచ్ల టెస్ట్ సిరీస్లో భాగంగా భారత్, ఇంగ్లండ్ మధ్య మాంచెస్టర్ వేదికగా జరిగిన నాలుగో మ్యాచ్ డ్రాగా ముగిసింది. 311 పరుగులు వెనుకపడి రెండో ఇన్నింగ్స్ను ప్రారంభించిన భారత్ (నాలుగో రోజు).. ఖాతా తెరవకుండానే యశస్వి జైస్వాల్ (0), సాయి సుదర్శన్ (0) వికెట్లు కోల్పోయినప్పటికీ వీరోచితంగా పోరాడింది.తొలుత కేఎల్ రాహుల్ (90), శుభ్మన్ గిల్ (103) అద్భుతంగా బ్యాటింగ్ చేసి మూడో వికెట్కు రికార్డు స్థాయిలో 188 పరుగులు జోడించగా.. ఆతర్వాత వాషింగ్టన్ సుందర్ (101 నాటౌట్), రవీంద్ర జడేజా (107 నాటౌట్) వీరోచిత శతకాలు బాది మ్యాచ్ను డ్రా చేశారు. సుందర్-జడేజా జోడీ ఐదో వికెట్కు అజేయమైన 203 పరుగులు జోడించింది. ఫలితంగా భారత్ సెకెండ్ ఇన్నింగ్స్లో 4 వికెట్ల నష్టానికి 425 పరుగులు చేసింది. అంతకుముందు ఇంగ్లండ్తో తొలి ఇన్నింగ్స్లో 669 పరుగులకు ఆలౌటైంది. జో రూట్ (150), బెన్ స్టోక్స్ (141) భారీ శతకాలతో కదంతొక్కగా.. జాక్ క్రాలే (84), బెన్ డకెట్ (94) సెంచరీలకు చేరువలో ఔటయ్యారు. భారత బౌలర్లలో రవీంద్ర జడేజా 4, బుమ్రా, సుందర్ తలో 2, అన్షుల్ కంబోజ్, సిరాజ్ చెరో వికెట్ పడగొట్టారు.ఈ మ్యాచ్లో తొలుత బ్యాటింగ్ చేసిన భారత్ తొలి ఇన్నింగ్స్లో 358 పరుగులకు ఆలౌటైంది. యశస్వి జైస్వాల్ 58, కేఎల్ రాహుల్ 46, సాయి సుదర్శన్ 61, రిషబ్ పంత్ 54, శార్దూల్ ఠాకూర్ 41 రాణించారు. ఇంగ్లండ్ బౌలర్లలో బెన్ స్టోక్స్ 5 వికెట్లు తీశాడు.నాలుగో టెస్ట్ డ్రా కావడంతో సిరీస్లో ఇంగ్లండ్ ఆధిపత్యం 2-1తో కొనసాగుతుంది. చివరిదైన ఐదో టెస్ట్ జులై 31 నుంచి లండన్లోని కెన్నింగ్టన్ ఓవల్లో ప్రారంభమవుతుంది. ఈ సిరీస్లో ఒకటి, మూడు మ్యాచ్లు ఇంగ్లండ్ గెలువగా.. భారత్ రెండో మ్యాచ్లో విజయం సాధించింది. -
వీరోచితంగా పోరాడుతున్న సుందర్, జడేజా.. దిగ్గజాల సరసన చేరిన వెటరన్ ఆల్రౌండర్
మాంచెస్టర్ టెస్ట్లో టీమిండియా స్టార్ ఆల్రౌండర్ రవీంద్ర జడేజా వీరోచితంగా పోరాడుతున్నాడు. జట్టు తీవ్ర కష్టాల్లో ఉన్నప్పుడు అజేయమైన హాఫ్ సెంచరీతో ఆదుకున్నాడు. ఈ క్రమంలో ఓ అరుదైన ఘనత సాధించాడు. ఇంగ్లండ్ గడ్డపై 1000 పరుగులు పూర్తి చేసుకున్న ఏడో భారత బ్యాటర్గా రికార్డుల్లోకెక్కాడు. తద్వారా బ్యాటింగ్ దిగ్గజాలైన సచిన్ టెండూల్కర్, విరాట్ కోహ్లి సరసన చేరాడు.ఇంగ్లండ్ గడ్డపై టెస్ట్ల్లో అత్యధిక పరుగులు చేసిన భారత ఆటగాళ్లుసచిన్ టెండూల్కర్ - 30 ఇన్నింగ్స్లలో 1575 పరుగులురాహుల్ ద్రవిడ్ - 23 ఇన్నింగ్స్లలో 1376 పరుగులుసునీల్ గవాస్కర్ - 28 ఇన్నింగ్స్లలో 1152 పరుగులుకేఎల్ రాహుల్ - 26 ఇన్నింగ్స్లలో 1125 పరుగులువిరాట్ కోహ్లీ - 33 ఇన్నింగ్స్లలో 1096 పరుగులురిషబ్ పంత్ - 24 ఇన్నింగ్స్లలో 1035 పరుగులురవీంద్ర జడేజా - 31 ఇన్నింగ్స్లలో 1016* పరుగులుమ్యాచ్ విషయానికొస్తే.. ఆట చివరి రోజు టీమిండియా ఆల్రౌండర్లు వాషింగ్టన్ సుందర్, రవీంద్ర జడేజా వీరోచితంగా పోరాడుతున్నారు. వీరిద్దరు ఐదో వికెట్కు అజేయమైన 100 పరుగులు జోడించి ఇన్నింగ్స్లు కొనసాగిస్తున్నారు. సుందర్ 58, జడ్డూ 53 పరుగులతో క్రీజ్లో ఉన్నారు.టీ విరామం సమయానికి భారత్ సెకెండ్ ఇన్నింగ్స్ స్కోర్ 322/4గా ఉంది. ప్రస్తుతం భారత్ 11 పరుగుల ఆధిక్యంలో ఉంది. ఈ మ్యాచ్ను డ్రాగా ముగించాలంటే భారత్ మరో రెండున్నర గంటల్లోపు ఆలౌట్ కాకుండా చూసుకోవాలి.311 పరుగుల లోటుతో రెండో ఇన్నింగ్స్ను ప్రారంభించిన భారత్.. ఖాతా తెరవకుండానే యశస్వి జైస్వాల్, సాయి సుదర్శన్ వికెట్లు కోల్పోయింది. ఈ దశలో గిల్, కేఎల్ రాహుల్ అద్భుతంగా బ్యాటింగ్ చేసి మూడో వికెట్కు రికార్డు స్థాయిలో 188 పరుగులు జోడించారు. అనంతరం రాహుల్ 90 పరుగుల వ్యక్తిగత స్కోర్ వద్ద ఔటయ్యాడు. బెన్ స్టోక్స్ అద్భుతమైన బంతితో రాహుల్ను ఎల్బీడబ్ల్యూ చేశాడు.రాహుల్ ఔటయ్యాక చాలా జాగ్రత్తగా ఆడిన గిల్ ఈ సిరీస్లో నాలుగో సెంచరీ పూర్తి చేసుకున్నాడు. అయితే ఆ వెంటనే జోఫ్రా ఆర్చర్ బౌలింగ్లో వికెట్కీపర్ జేమీ స్మిత్కు క్యాచ్ ఇచ్చి నాలుగో వికెట్గా (222 పరుగుల వద్ద) వెనుదిరిగాడు. ఇవాళ భారత్ తొలి సెషన్లోనే ఓవర్నైట్ బ్యాటర్లు కేఎల్ రాహుల్ (90), శుభ్మన్ గిల్ (103) వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది.ఈ దశలో సుందర్, జడేజా భారత ఇన్నింగ్స్ను నిలబెట్టారు. వీరిద్దరు ఇంగ్లండ్ బౌలర్ల సహనాన్ని పరీక్షిస్తూ హాఫ్ సెంచరీలు పూర్తి చేసుకున్నారు. స్కోర్ వివరాలు..భారత్ తొలి ఇన్నింగ్స్- 358 ఆలౌట్ (సాయి సుదర్శన్ 61, జైస్వాల్ 58, పంత్ 54, స్టోక్స్ 5/72)ఇంగ్లండ్ తొలి ఇన్నింగ్స్- 669 ఆలౌట్ (రూట్ 150, స్టోక్స్ 141, రవీంద్ర జడేజా 4/143) -
ఏయ్.. అక్కడేమి చేస్తున్నావ్? యువ ఆటగాడిపై జడేజా ఫైర్! వీడియో వైరల్
మాంచెస్టర్ వేదికగా ఇంగ్లండ్తో జరుగుతున్న నాలుగో టెస్టులో టీమిండియా తడబడుతోంది. వరుసగా రెండు రోజుల పాటు భారత్పై ఆతిథ్య ఇంగ్లండ్ పూర్తి ఆధిపత్యం చెలాయించింది. మూడో రోజు ఆట ముగిసే సమయానికి ఇంగ్లండ్ తొలి ఇన్నింగ్స్లో 7 వికెట్ల నష్టానికి 544 పరుగులు చేసింది. ఇంగ్లండ్ ప్రస్తుతం 186 పరుగుల లీడ్లో కొనసాగుతోంది. ఇంగ్లండ్ సీనియర్ బ్యాటర్ జో రూట్(150) అద్బుతమైన సెంచరీతో కదం తొక్కాడు. తన సూపర్ బ్యాటింగ్తో భారత బౌలర్ల సహనాన్ని పరీక్షించాడు. ఆఖరికి రవీంద్ర జడేజా బౌలింగ్లో రూట్ స్టంపౌట్గా వెనుదిరిగాడు. అయితే సెంచరీతో మెరిసిన జో రూట్కు మూడో రోజు ఆట ఆరంభంలోనే భారత ఫీల్డర్లు ఓ లైఫ్లైన్ ఇచ్చేశారు. రూట్ 23 పరుగుల వ్యక్తిగత స్కోర్ భారత ఫీల్డర్ల తప్పిదం వల్ల ఔటయ్యే ప్రమాదం నుంచి తప్పించుకున్నాడు. ఈ క్రమంలో రవీంద్ర జడేజా తన సహచర ఆటగాడు అన్షుల్ కాంబోజ్పై కోపంతో ఊగిపోయాడు.ఏమి జరిగిందంటే?ఇంగ్లండ్ ఇన్నింగ్స్ 54 ఓవర్ వేసిన మహ్మద్ సిరాజ్ బౌలింగ్లో ఆఖరి బంతిని రూట్ గల్లీ దిశగా ఆడాడు. గల్లీ పొజిషేన్లో ఉన్న జైశ్వాల్ ఆ బంతిని ఆపేందుకు ప్రయత్నించాడు. జైశ్వాల్ చేతికి తాకి కాస్త దూరంగా వెళ్లిన బంతిని జడేజా అందుకున్నాడు. అయితే బంతిని చూస్తూ ఉండిపోయిన రూట్ నాన్స్ట్రైక్ ఎండ్కు వెళ్లేందుకు ఆలస్యం చేశాడు.ఈ క్రమంలో బంతిని అందుకున్న జడేజా నాన్స్ట్రైక్ ఎండ్వైపు త్రో చేశాడు. కానీ బంతి మాత్రం స్టంప్స్కు తాకలేదు. అయితే జడేజా విసిరిన బంతిని అందుకోవడనికి కూడా కనీసం స్టంప్స్ దగ్గర ఎవరూ లేరు. జడేజా విసిరిన బంతిని మిడ్-ఆన్లో ఫీల్డింగ్ చేస్తున్న కాంబోజ్ అందుకున్నాడు.కానీ కాంబోజ్ ముందే బంతిని తీసుకోవడానికి స్టంప్స్ దగ్గరకు రాకపోవడంతో జడేజా సీరియస్ అయ్యాడు. అక్కడ ఏమిచేస్తున్నావు? ఇక్కడకు రావాలి కాదా అంటూ కోపంతో ఊగిపోయాడు. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరలవుతోంది. ఒకవేళ రూట్ రనౌట్ అయ్యింటే ఇంగ్లండ్ పరిస్థితి మరో విధంగా ఉండేది. ఈ తప్పిదానికి భారత్ భారీ మూల్యం చెల్లించుకోవాల్సి వచ్చింది.చదవండి: IND vs ENG: టీమిండియాకు డేంజర్ బెల్స్.. పేస్ గుర్రానికి ఏమైంది?pic.twitter.com/Fh7dXQIX4S— Drizzyat12Kennyat8 (@45kennyat7PM) July 25, 2025 -
జడేజాది క్లియర్గా నాటౌట్.. కావాలనే ఔట్ ఇచ్చారు! ఫ్యాన్స్ ఫైర్
మాంచెస్టర్ వేదికగా జరుగుతున్న నాలుగు టెస్టులో టీమిండియాపై ఇంగ్లండ్ ఆదిపత్యం చెలాయిస్తోంది. రెండో రోజు ఆట ముగిసే సమయానికి ఆతిథ్య ఇంగ్లండ్ కేవలం 2 వికెట్లు మాత్రమే కోల్పోయి 225 పరుగులు చేసింది. ఇంగ్లండ్ ఇంకా భారత్ కంటే 133 పరుగులు వెనకంజలో ఉంది.అంతకుముందు భారత్ తమ తొలి ఇన్నింగ్స్లో 358 పరుగులకు ఆలౌటైంది. ఓవర్నైట్ స్కోరు 264/4తో రెండో రోజు ఆటను ప్రారంభించిన భారత్.. ఆదనంగా 94 పరుగులు జోడించి తమ ఇన్నింగ్స్ను ముగించింది. భారత బ్యాటర్లలో సాయిసుదర్శన్(61) టాప్ స్కోరర్గా నిలవగా.. రిషబ్ పంత్(54) విరోచిత పోరాటం కనబరిచాడు. ఇంగ్లండ్ బౌలర్లలో బెన్ స్టోక్స్ 5 వికెట్లతో చెలరేగాడు.ఇక ఇది ఇలా ఉండగా.. ఈ మ్యాచ్లో భారత ఆల్రౌండర్ రవీంద్ర జడేజా ఔటైన తీరు వివాదస్పదమైంది. జడేజా ఇచ్చిన క్యాచ్ను ఇంగ్లండ్ ఫీల్డర్ హ్యారీ బ్రూక్ క్లీన్గా అందుకోలేదన్న చర్చ క్రికెట్ వర్గాల్లో నడుస్తోంది. భారత ఇన్నింగ్స్ 85వ ఓవర్ వేసిన ఆర్చర్.. ఐదో బంతిని జడేజాకు ఎవే స్వింగర్గా సంధించాడు.ఆ బంతిని జడేజా డిఫెన్స్ ఆడేందుకు ప్రయత్నించాడు. ఈ క్రమంలో బంతి ఎడ్జ్ తీసుకుని సెకెండ్ స్లిప్ దిశగా వెళ్లింది. సెకెండ్ స్లిప్లో ఉన్న బ్రూక్ డైవ్ చేస్తూ క్యాచ్ను అందుకున్నాడు. అయితే బ్రూక్ క్యాచ్ను అందుకునేటప్పుడు బంతి నేలకు తాకినట్లు కన్పించింది. కానీ ఫీల్డ్ అంపైర్ మాత్రం అది క్లీన్ క్యాచ్ కాదా కనీసం చెక్ చేయకుండా ఔట్ అని వేలు పైకెత్తాడు. దీంతో జడేజా(20 పరుగులు) కూడా ఔట్ అని భావించి రివ్యూ తీసుకోకుండా మైదానం వీడాడు. ఈ నేపథ్యంలో ఫీల్డ్ అంపైర్లు పై భారత అభిమానులు మండిపడుతున్నారు. కనీస నిబంధనలు పాటించకుండా ఎలా ఔట్ ఇస్తారని ప్రశ్నల వర్షం కురిపిస్తున్నారు. బంతి క్లియర్గా నేలకు తాకిందంటూ స్క్రీన్ షాట్లను ఎక్స్లో షేర్ చేస్తున్నారు.The @imjadeja catch by Harry Brook had clearly touched the groundJadeja stood his ground as he too saw it. Why would he give way? #INDvsENG#ECB pic.twitter.com/23Fqnj4SEB— Vivek J (@Vivekrvcse) July 24, 2025చదవండి: ఏడ్చేసిన కరుణ్ నాయర్.. ఓదార్చిన కేఎల్ రాహుల్.. ఇక గుడ్బై!? -
కోహ్లి కంటే జడేజా ఎక్కువ పరుగులు చేశాడు.. కానీ: సురేశ్ రైనా
టీమిండియా స్టార్ రవీంద్ర జడేజా (Ravindra Jadeja)పై భారత మాజీ క్రికెటర్ సురేశ్ రైనా (Suresh Raina) ప్రశంసలు కురిపించాడు. టెస్టు క్రికెట్లో జడ్డూ ప్రపంచంలోనే ఉత్తమ ఆల్రౌండర్ అని కొనియాడాడు. ఇంగ్లండ్ గడ్డ మీద బ్యాటింగ్ దిగ్గజం విరాట్ కోహ్లి కంటే.. జడ్డూ ఎక్కువే పరుగులే రాబట్టాడని పేర్కొన్నాడు.కాగా టెండుల్కర్-ఆండర్సన్ ట్రోఫీ (Tendulkar- Anderson Trophy)లో భాగంగా టీమిండియా ఇంగ్లండ్తో ఐదు టెస్టులు ఆడుతోంది. లీడ్స్లో జరిగిన తొలి మ్యాచ్లో ఆతిథ్య జట్టు గెలవగా.. రెండో టెస్టులో భారత్ విజయం సాధించింది. ఎడ్జ్బాస్టన్లో తొలిసారి గెలిచి చరిత్ర సృష్టించింది గిల్ సేన.పోరాడిన జడేజాఅయితే, లార్డ్స్ టెస్టులో ఆఖరి వరకు పోరాడినా ఓటమి తప్పలేదు. నిజానికి ఈ మ్యాచ్లో భారత్ భారీ తేడాతో ఓడిపోయే క్లిష్ట పరిస్థితుల్లో రవీంద్ర జడేజా (181 బంతుల్లో 61 నాటౌట్) ఒంటరి పోరాటం చేశాడు. ఈ నేపథ్యంలో సురేశ్ రైనా జడ్డూను ప్రశంసిస్తూనే.. కాస్త వేగంగా ఆడి ఉంటే బాగుండేదని విమర్శించాడు.కోహ్లి కంటే అతడే ఎక్కువ పరుగులు చేశాడుఈ మేరకు.. ‘‘ఇంగ్లండ్లో విరాట్ కోహ్లి కంటే రవీంద్ర జడేజా ఎక్కువ పరుగులు స్కోరు చేశాడు. ఇద్దరి మధ్య హాఫ్ సెంచరీల సంఖ్యలో వ్యత్యాసం మీకు కనిపిస్తుంది. ఇక టెస్టు క్రికెట్లో ప్రపంచంలోనే జడేజా అత్యుత్తమ ఆల్రౌండర్.ఫీల్డింగ్, బ్యాటింగ్, బౌలింగ్ విభాగాల్లో అత్యుత్తమంగా రాణిస్తూ క్లిష్ట పరిస్థితుల్లో జట్టును కాపాడతాడు. లార్డ్స్ టెస్టులో ఒకానొక సందర్భంలో మనం 100 పరుగుల తేడాతో ఓడిపోతాం అనిపించింది. అయితే, పట్టుదలగా అతడు ఆఖరి వరకు నిలబడిన తీరు అమోఘం.అయితే, జడ్డూ కాస్త రిస్క్ తీసుకుని ఆడి ఉంటే విజయ లాంఛనం పూర్తి చేసేవాడేమో! బుమ్రా క్రీజులో ఉన్నంత సేపు జడ్డూకు ఆ అవకాశం ఉండేది. కొన్ని ఫోర్లు, సిక్సర్లు బాదితే బాగుండేది’’ అని సురేశ్ రైనా స్పోర్ట్తక్తో పేర్కొన్నాడు. కాగా లార్డ్స్లో జరిగిన మూడో టెస్టులో టీమిండియా ఇంగ్లండ్ చేతిలో 22 పరుగుల తేడాతో ఓటమిపాలైంది. ఇరుజట్ల మధ్య నాలుగో టెస్టు (జూలై 23-27)కు మాంచెస్టర్లోని ఓల్డ్ ట్రఫోర్డ్ మైదానం వేదిక.ఏడు హాఫ్ సెంచరీలుఇదిలా ఉంటే.. ఇంగ్లండ్ గడ్డ మీద భారత మాజీ టెస్టు బ్యాటర్ కోహ్లి 33 ఇన్నింగ్స్లో కలిపి 1096 పరుగులు చేశాడు. ఇందులో రెండు శతకాలు, ఐదు హాఫ్ సెంచరీలు ఉన్నాయి. మరోవైపు.. కోహ్లికి సమకాలీనుడైన జడ్డూ 29 ఇన్నింగ్స్ ఆడి.. ఓ సెంచరీ, ఏడు హాఫ్ సెంచరీల సాయంతో 969 పరుగులు సాధించాడు. తాజా సిరీస్లో ఆరు ఇన్నింగ్స్లో కలిపి జడేజా ఇప్పటికి 327 పరుగులు పూర్తి చేసుకున్నాడు.చదవండి: BCCI: నితీశ్ రెడ్డితో పాటు అతడూ అవుట్.. జట్టులోకి కొత్త ప్లేయర్ -
India-England Test XI: భారత్ నుంచి ఏడుగురు.. సచిన్కు నో ప్లేస్
టీమిండియా- ఇంగ్లండ్ మధ్య టెస్టు సిరీస్ రసవత్తరంగా సాగుతోంది. ఆండర్సన్- టెండుల్కర్ ట్రోఫీ (Anderson- Tendulkar)లో భాగంగా లీడ్స్లో జరిగిన తొలి టెస్టులో ఆతిథ్య జట్టు గెలిస్తే.. ఎడ్జ్బాస్టన్లో భారత్ తొలిసారి విజయబావుటా ఎగురవేసింది. అయితే, లార్డ్స్లో ఆఖరి వరకు పోరాడిన గిల్ సేనకు చేదు అనుభవమే మిగిలింది. దీంతో ప్రస్తుతం ఇంగ్లండ్ 2-1తో ఆధిక్యంలో ఉండగా.. మాంచెస్టర్లోనూ తొలిసారి గెలిచి సిరీస్ను సమం చేయాలని టీమిండియా పట్టుదలగా ఉంది.అత్యుత్తమ టెస్టు ప్లేయింగ్ ఎలెవన్ఇక ఈ ఐదు మ్యాచ్ల టెస్టు సిరీస్కు కామెంటేటర్ వ్యవహరిస్తున్న టీమిండియా వెటరన్ బ్యాటర్ ఛతేశ్వర్ పుజారా ఆసక్తికర ఎంపికతో ముందుకు వచ్చాడు. ఇరుజట్ల నుంచి 21వ శతాబ్దానికి గానూ తన అత్యుత్తమ టెస్టు ప్లేయింగ్ ఎలెవన్ను ప్రకటించాడు. దిగ్గజాలకు నో ప్లేస్అయితే, ఇందులో దిగ్గజ బ్యాటర్ సచిన్ టెండుల్కర్ (Sachin Tendulkar)తో పాటు గౌతం గంభీర్, మాజీ కెప్టెన్లు మహేంద్ర సింగ్ ధోని, రోహిత్ శర్మలకు మాత్రం పుజ్జీ చోటివ్వలేదు.అదే విధంగా.. ఇంగ్లండ్ లెజెండరీ ఆటగాళ్లు సర్ అలిస్టర్ కుక్, జేమ్స్ ఆండర్సన్ (James Anderson)లను కూడా పుజారా పట్టించుకోలేదు. ఇక తన కంబైన్డ్ జట్టుకు ఓపెనర్లుగా అలెక్ స్టెవార్ట్, రాహుల్ ద్రవిడ్లను ఎంచుకున్న పుజారా.. వన్డౌన్లో జో రూట్ను ఆడిస్తానని తెలిపాడు. భారత్ నుంచి ఏడుగురుమరోవైపు.. మిడిలార్డర్లో కీలకమైన నాలుగో స్థానంలో టీమిండియా దిగ్గజం విరాట్ కోహ్లిని ఎంపిక చేసుకున్న ఈ వెటరన్ బ్యాటర్.. ఐదో స్థానంలో వీవీఎస్ లక్ష్మణ్ను ఎంపిక చేసుకున్నాడు.అదే విధంగా.. బౌలింగ్ విభాగంలోనూ టీమిండియా ఆటగాళ్లకే పుజారా పెద్ద పీట వేశాడు. పేస్ దళంలో జస్ప్రీత్ బుమ్రా, మహ్మద్ షమీలకు చోటిచ్చిన పుజారా.. స్పిన్ విభాగంలో ఆల్రౌండర్లు రవీంద్ర జడేజా, రవిచంద్రన్ అశ్విన్లకు స్థానం కల్పించాడు. ఇంగ్లండ్ నుంచి ఇద్దరు సీమ్ బౌలింగ్ ఆల్రౌండర్లు ఆండ్రూ ఫ్లింటాఫ్, బెన్ స్టోక్స్లను పుజారా ఎంపిక చేశాడు. మొత్తంగా టీమిండియా- ఇంగ్లండ్ 21వ శతాబ్దపు అత్యుత్తమ టెస్టు ప్లేయింగ్ ఎలెవన్లో నలుగురు ఇంగ్లండ్ ఆటగాళ్లకు మాత్రమే పుజారా చోటివ్వడం విశేషం. పన్నెండో ఆటగాడిగా మాథ్యూ హోగర్డ్ను పుజ్జీ ఎంచుకున్నాడు.ఎదురుచూపులే మిగిలాయికాగా టీమిండియా తరఫున ఇప్పటి వరకు 103 టెస్టులు ఆడిన పుజారా 7195 పరుగులు సాధించాడు. ఇందులో 19 శతకాలు, 3 డబుల్ సెంచరీలు ఉన్నాయి. ఇక ఐదు వన్డేల్లో కలిపి 51 పరుగులు మాత్రమే చేసిన ఈ కుడిచేతి వాటం బ్యాటర్.. ఐపీఎల్లో 30 మ్యాచ్లలో కలిపి 390 రన్స్ చేశాడు. చివరగా ఆస్ట్రేలియాతో ప్రపంచ టెస్టు చాంపియన్షిప్-2023 ఫైనల్ ఆడిన పుజారా.. టీమిండియాలో పునరాగమనం కోసం ఎదురుచూస్తున్నాడు. అయితే, యువ ఆటగాళ్లతో పోటీలో అతడు పూర్తిగా వెనుకబడ్డాడు.పుజారా ఎంచుకున్న 21వ శతాబ్దపు భారత్- ఇంగ్లండ్ కంబైన్డ్ టెస్టు ప్లేయింగ్ ఎలెవన్అలెస్ స్టెవార్ట్ (వికెట్ కీపర్), రాహుల్ ద్రవిడ్, జో రూట్, విరాట్ కోహ్లి, వీవీఎస్ లక్ష్మణ్, బెన్ స్టోక్స్, ఆండ్రూ ఫ్లింటాఫ్, రవీంద్ర జడేజా, రవిచంద్రన్ అశ్విన్, మహ్మద్ షమీ, జస్ప్రీత్ బుమ్రా, మాథ్యూ హొగర్డ్ (12th man).చదవండి: ODI WC 2011: యువీని సెలక్ట్ చేయడం అవసరమా?.. ధోని నిర్ణయం ఇదే.. -
రిస్క్ తీసుకోవా?.. సింగిల్స్ తీయడానికే ఉన్నావా?
భారత స్టార్ ఆల్రౌండర్ రవీంద్ర జడేజా (Ravindra Jadeja) ఆట తీరును టీమిండియా మాజీ హెడ్కోచ్ గ్రెగ్ చాపెల్ విమర్శించాడు. లార్డ్స్ టెస్టు (Lord's Test)లో జడ్డూ సింగిల్స్కే పరిమితం కావడం సరికాదని.. టెయిలెండర్లకు స్ట్రైక్ రొటేట్ చేయడం వల్ల వచ్చే లాభమేమీ ఉండదంటూ ఘాటు వ్యాఖ్యలు చేశాడు. కీలక సమయంలో సరైన వ్యూహంతో షాట్లు బాదితే ఫలితం వేరేలా ఉండేదని అభిప్రాయపడ్డాడు.టీమిండియా ప్రస్తుతం ఇంగ్లండ్ పర్యటనలో ఉన్న విషయం తెలిసిందే. ఆతిథ్య జట్టుతో ఐదు టెస్టుల సిరీస్లో భాగంగా ఇప్పటికి మూడు మ్యాచ్లు పూర్తి కాగా.. రెండింట ఓడిన గిల్ సేన.. ఒకటి గెలిచింది. చివరగా లార్డ్స్లో జరిగిన మూడో టెస్టులో ఆఖరి వరకు పోరాడినప్పటికీ భారత జట్టుకు చేదు అనుభవమే మిగిలింది.ఆశాకిరణంలా..ఆఖరి రోజు ఆటలో వరుస విరామాల్లో వికెట్లు కోల్పోయిన భారత్కు స్పిన్ బౌలింగ్ ఆల్రౌండర్ రవీంద్ర జడేజా ఆశాకిరణంలా కనిపించాడు. కీలక బ్యాటర్లు అవుటైనప్పటికీ టెయిలెండర్లు జస్ప్రీత్ బుమ్రా (54 బంతుల్లో 5), మహ్మద్ సిరాజ్ (30 బంతుల్లో 4)తో కలిసి జట్టును గట్టెక్కించే ప్రయత్నం చేశాడు.పోరాటం వృథాఇంగ్లండ్ విధించిన 193 పరుగుల లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో జడ్డూ 181 బంతుల్లో 61 పరుగులతో అజేయంగా నిలిచాడు. అయితే, ఇంగ్లండ్ స్పిన్నర్ షోయబ్ బషీర్ బౌలింగ్లో సిరాజ్ అనూహ్య రీతిలో పదో వికెట్గా వెనుదిరగడంతో టీమిండియా ఓటమి ఖరారైంది. ఇంగ్లండ్ 22 పరుగుల తేడాతో గెలవడంతో జడ్డూ పోరాటం వృథాగా పోయింది.ఈ నేపథ్యంలో జడ్డూ పోరాటపటిమను ప్రశంసిస్తూ హెడ్కోచ్ గౌతం గంభీర్తో పాటు భారత మాజీ క్రికెటర్లు కామెంట్లు చేయగా.. గ్రెగ్ చాపెల్ మాత్రం భిన్నంగా స్పందించాడు. ఈఎస్పీఎన్క్రిక్ఇన్ఫోకు రాసిన కాలమ్లో.. ‘‘అప్పటికి ప్రధాన బ్యాటర్గా జడేజా ఒక్కడే క్రీజులో ఉన్నాడు. టీమిండియా కచ్చితంగా స్వల్ప లక్ష్యాన్ని ఛేదించాలనే పట్టుదలతో ఉంది.బంతుల్ని వదిలేస్తూ.. సింగిల్స్ తీస్తూ ఉంటే ఎలా?అలాంటి సమయంలో అతడు కొన్ని వ్యూహాత్మకమైన రిస్కులు తీసుకోవాల్సింది. బంతుల్ని వదిలేస్తూ.. సింగిల్స్ తీస్తూ ఉంటే ఎలా?.. గెలవాల్సిన మ్యాచ్లో ఇలా ఎవరైనా ఆడతారా?నిజానికి డ్రెసింగ్రూమ్ నుంచి అతడికి కచ్చితమైన సందేశం ఇచ్చి ఉండాల్సింది. ‘నువ్వే ఈ పని పూర్తి చేయాలి. టెయిలెండర్లు నీకు మద్దతుగా మాత్రమే నిలవగలరు. కానీ నువ్వే గెలిపించాలి’ అనే సందేశాన్ని కెప్టెన్ అతడికి అందించాల్సింది.ఆ పరిస్థితిలో జడేజా స్పెషలిస్టు బ్యాటర్లా ఆలోచించి ఉండాల్సింది. టెయిలెండర్లకు స్ట్రైక్ రొటేట్ చేయడం వల్ల ఏం ప్రయోజనం?.. లార్డ్స్ పిచ్ మీద ఇది క్రమశిక్షణతో కూడిన ఇన్నింగ్సే. కానీ.. సరైందేనా? అంటే మాత్రం సమాధానం ఉండదు’’ అంటూ గ్రెగ్ చాపెల్ జడ్డూ ఆట తీరును విమర్శించాడు.కాగా భారత్- ఇంగ్లండ్ మధ్య మాంచెస్టర్లోని ఓల్డ్ ట్రఫోర్డ్ మైదానంలో నాలుగో టెస్టు (జూలై 23- 27) నిర్వహణకు షెడ్యూల్ ఖరారైంది. తదుపరి ఇరుజట్ల మధ్య ఆఖరిదైన ఐదో టెస్టు (జూలై 31- ఆగష్టు 4)కు లండన్లోని కెన్నింగ్ ఓవల్ మైదానం వేదిక.చదవండి: రుతురాజ్ గైక్వాడ్ కీలక నిర్ణయం -
లార్డ్స్లో అతడి పోరాటం అసాధారణం: గంభీర్ ప్రశంసలు
లార్డ్స్ టెస్టులో ఆల్రౌండర్ రవీంద్ర జడేజా (Ravindra Jadeja) అసాధారణ పోరాటం చేశాడని టీమిండియా హెడ్కోచ్ గౌతం గంభీర్ (Gautam Gambhir) ప్రశంసలు కురిపించాడు. విజయం కోసం చివరి వరకు పట్టుదలగా నిలబడిన జడ్డూ అద్భుత ఇన్నింగ్స్ ఆడాడని కొనియాడాడు. కాగా ఆండర్సన్- టెండుల్కర్ ట్రోఫీలో భాగంగా టీమిండియా ఇంగ్లండ్తో ఐదు టెస్టుల సిరీస్లో తలపడుతోంది.ఇందులో భాగంగా తొలుత లీడ్స్లో ఇంగ్లండ్ గెలవగా.. ఎడ్జ్బాస్టన్లో టీమిండియా చారిత్రాత్మక విజయం సాధించింది. ఈ క్రమంలో సిరీస్ 1-1తో సమంగా ఉన్న వేళ లార్డ్స్ (Lord's Test)లో జరిగిన మూడో టెస్టు ఆఖరి రోజు వరకు ఉత్కంఠగా సాగింది. 193 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన భారత జట్టు.. 22 పరుగుల తేడాతో ఓటమిపాలైంది.జడ్డూ పోరాటం వృథాఅయితే, వరుస విరామాల్లో వికెట్లు కోల్పోయిన తరుణంలో టీమిండియా సులువుగానే ఓటమిని అంగీకరిస్తుందని అంతా భావించారు. కానీ జడేజా (181 బంతుల్లో 61 నాటౌట్) అద్భుత పోరాటపటిమతో ఆఖరి వరకు అజేయంగా నిలిచాడు. అయితే, టెయిలెండర్ మహ్మద్ సిరాజ్ (30 బంతుల్లో 4) అనూహ్య రీతిలో బౌల్డ్ కావడంతో టీమిండియా ఓటమి ఖరారైంది. జడ్డూ పోరాటం వృథాగా పోయింది.ఈ నేపథ్యంలో అనిల్ కుంబ్లే, సునిల్ గావస్కర్ వంటి భారత క్రికెట్ దిగ్గజాలు జడ్డూ ఇంకాస్త దూకుడుగా ఆడి ఉంటే బాగుండేదని విమర్శించారు. అయితే, కోచ్ గంభీర్ మాత్రం జడేజా సరైన రీతిలోనే ఆడాడంటూ విమర్శకులకు కౌంటర్ ఇచ్చాడు. ‘‘అదొక అసాధారణ పోరాటం. జడ్డూ పోరాడిన తీరు నిజంగా ఒక అద్భుతం లాంటిదే’’ అని గంభీర్ జడ్డూను కొనియాడాడు. డ్రెసింగ్రూమ్లో ఈ మేరకు అతడు వ్యాఖ్యలు చేయగా.. ఇందుకు సంబంధించిన వీడియోను బీసీసీఐ తాజాగా సోషల్ మీడియాలో షేర్ చేసింది. మా జట్టులో ఉండటం అదృష్టంఇక సిరాజ్ మాట్లాడుతూ.. ‘‘ఫీల్డింగ్, బౌలింగ్, బ్యాటింగ్... ఇలా మూడు విభాగాల్లోనూ జడ్డూ భాయ్ అద్భుతంగా రాణిస్తున్నాడు. జట్టు కోసం ఎంతగానో కష్టపడుతున్నాడు.జట్టుకు అవసరమైన ప్రతిసారీ నేనున్నానంటూ బ్యాట్తో ఆదుకుంటాడు. క్షిష్ట సమయాల్లో రాణించే ఇలాంటి ప్లేయర్ అన్ని జట్లలోనూ ఉండడు. అతడు మా జట్టులో ఉండటం నిజంగా మా అదృష్టం’’ అంటూ ప్రశంసించాడు. కాగా టీమిండియాతో సిరీస్లో 2-1తో ఇంగ్లండ్ ప్రస్తుతం ఆధిక్యంలో ఉంది. ఇరుజట్ల మధ్య జరిగే నాలుగో టెస్టు (జూలై 23- 27)కు మాంచెస్టర్ వేదిక.భారత్ వర్సెస్ ఇంగ్లండ్ మూడో టెస్టు సంక్షిప్త స్కోర్లు👉ఇంగ్లండ్: 387 & 192👉భారత్: 387 & 170👉ఫలితం: 22 పరుగుల తేడాతో ఇంగ్లండ్ గెలుపు.చదవండి: వైభవ్ సూర్యవంశీ ఖాతాలో మరో ప్రపంచ రికార్డు View this post on Instagram A post shared by Team India (@indiancricketteam) -
Ravindra Jadeja: అసలు సిసలు ఆల్రౌండర్
రెప్ప పాటులో దూసుకొచ్చే బంతులను ఒడిసి పట్టాలంటే అతడు ఉండాలి...పాయింట్, కవర్స్, మిడాన్, మిడాఫ్ ఇలా ఎక్కడైనా నమ్మశక్యం కాని క్యాచ్లు అందుకోవాలంటే అతడు కావాలి...అవుట్ఫీల్డ్ నుంచి నేరుగా వికెట్లను గురిచూసి గిరాటేయాలంటే బంతి అతడికి చేతికి చిక్కాలి!పిచ్ నుంచి కాస్త సహకారం లభిస్తుందంటే చాలు ప్రత్యర్థిని చుట్టేయడానికి అతడు కావాలి...ప్రత్యర్థి బ్యాటర్లు క్రీజులో నిలదొక్కుకున్నారంటే భాగస్వామ్యాన్ని విడదీయడానికి అతడు రావాలి...స్లో ఓవర్రేట్ బారిన పడకుండా చకచకా ఓవర్లు ముగించాలంటే అతడికి బౌలింగ్ ఇవ్వాలి!!టాపార్డర్ బ్యాటర్లకు సరైన సహకారం లభించాలంటే నాన్స్ట్రయికర్గా అతడు ఉండాలి...లోయర్ ఆర్డర్ను కాచుకుంటూ విలువైన పరుగులు చేయాలంటే క్రీజులో అతడు ఉండాలి...గడ్డు పరిస్థితుల్లో జట్టును గట్టెక్కించాలంటే అతడు బ్యాట్తో ‘కత్తిసాము’ చేయాలి!!ఇలా బౌలింగ్, బ్యాటింగ్, ఫీల్డింగ్ అన్నిట్లో అతి ముఖ్యమైన ఆ అతడు మరెవరో కాదు... రవీంద్ర సింగ్ జడేజా. పుష్కర కాలానికి పైగా భారత టెస్టు జట్టులో కొనసాగుతున్న ఈ సౌరాష్ట్ర ఆల్రౌండర్ తాజాగా ఇంగ్లండ్తో టెస్టు సిరీస్లో తన విలువ చాటుకుంటున్నాడు. గత నాలుగు ఇన్నింగ్స్ల్లోనూ అర్ధశతకాలతో మెరిసిన ‘జడ్డూ’... లార్డ్స్లో ఓటమి అంచున నిలిచిన జట్టును దాదాపు విజయానికి చేరువ చేశాడు. ‘బిట్స్ అండ్ పీసెస్’ క్రికెటర్ అనే విమర్శల నుంచి... పరిపూర్ణ ఆల్రౌండర్ అనిపించుకును స్థాయికి ఎదిగిన జడేజాపై ప్రత్యేక కథనం... – సాక్షి క్రీడా విభాగంఇంగ్లండ్తో లార్డ్స్ వేదికగా జరిగిన మూడో టెస్టులో భారత్ విజయానికి 193 పరుగులు అవసరం కాగా... 82 పరుగులకే టీమిండియా 7 వికెట్లు కోల్పోయింది. ఇంకేముంది మరో పది, ఇరవై పరుగుల వ్యవధిలో మిగిలిన మూడు వికెట్లు కూలడం ఖాయమే అనే ఊహగానాల మధ్య భారత జట్టు చివరకు 170 పరుగులు చేయగలిగింది. చివరి ముగ్గురు బ్యాటర్లు వీరోచిత పోరాటం చేసిన మాట వాస్తవమే అయినా... దానికి నాయకత్వం వహించింది మాత్రం ముమ్మాటికీ రవీంద్ర జడేజానే. యశస్వి జైస్వాల్, కరుణ్ నాయర్, శుబ్మన్ గిల్, రిషభ్ పంత్ ఇలా నమ్ముకున్న వాళ్లంతా ఒక్కొక్కరుగా పెవిలియన్ బాట పడుతుంటే జడేజా మాత్రం మొక్కవోనిసంకల్పంతో బ్యాటింగ్ చేశాడు. ప్రత్యర్థికి ఏమాత్రం అవకాశం ఇవ్వకుండా దుర్బేధ్యమైన డిఫెన్స్తో కట్టిపడేశాడు. మరో ఎండ్లో వికెట్ కాపాడుకోవడం కూడా ముఖ్యమైన తరుణంలో నితీశ్ కుమార్ రెడ్డి, బుమ్రా, సిరాజ్ అండతో జట్టును గెలుపు అంచుల వరకు తీసుకొచ్చాడు. ఈ క్రమంలో అతడు స్టోక్స్, ఆర్చర్, వోక్స్, కార్స్ వేసిన బౌన్సర్లకు ఎదురు నిలిచిన తీరు... పోరాట యోధుడిని తలపించింది. స్కోరు బోర్డు పరిశీలిస్తే జడేజా పేరిట అర్ధశతకం మాత్రమే కనిపిస్తుంది కానీ... లార్డ్స్లో అతడు చేసిన పోరాటం సెంచరీకి తీసిపోనిది. కఠిన క్షణాలు, పరీక్ష పెడుతున్న బంతులు, బ్యాటింగ్కు కష్టసాధ్యమైన పరిస్థితులు... వీటన్నిటితో పోరాడిన జడ్డూ క్రికెట్ ప్రేమికుల మనసు గెలుచుకున్నాడు. వరుసగా నాలుగు ఫిఫ్టీలు... 11, 25 నాటౌట్, 89, 69 నాటౌట్, 72, 61 నాటౌట్... తాజా ఇంగ్లండ్ సిరీస్లో జడేజా గణాంకాలివి. తొలి మ్యాచ్ తొలి ఇన్నింగ్స్లో తప్ప అతడు విఫలమైంది లేదు. లీడ్స్లో జరిగిన ఆ మ్యాచ్లో భారత్ తరఫున జైస్వాల్, గిల్, రాహుల్ ఒక్కో సెంచరీ చేస్తే పంత్ రెండు ఇన్నింగ్స్ల్లోనూ శతకాలు బాదాడు. దీంతో జడేజాకు ఎక్కువ బ్యాటింగ్ చేసే అవకాశం రాకపోగా... బర్మింగ్హామ్ వేదికగా జరిగిన రెండో టెస్టులో కెప్టెన్ గిల్ అనితరసాధ్యమైన బ్యాటింగ్ ప్రదర్శనకు సంపూర్ణ సహకారం అందించిన ఘనత జడేజాదే. తొలి ఇన్నింగ్స్లో ఆరో వికెట్కు గిల్తో కలిసి 203 పరుగులు జోడించి జట్టుకు కొండంత స్కోరు అందించిన ‘జడ్డూ’... రెండో ఇన్నింగ్స్లోనూ సారథితో కలిసి ఐదో వికెట్కు 175 పరుగులు జతచేశాడు. తొలి ఇన్నింగ్స్లో కెపె్టన్కు అండగా నిలుస్తూ స్ట్రయిక్ రొటేట్ చేసిన జడేజా.. రెండో ఇన్నింగ్స్లో వేగంగా ఆడుతూ స్కోరు బోర్డును పరుగులు పెట్టించాడు. మూడో టెస్టు తొలి ఇన్నింగ్స్లో టాపార్డర్ ఓ మాదిరిగా రాణించిన సమయంలో నితీశ్ కుమార్ రెడ్డి, వాషింగ్టన్ సుందర్తో విలువైన భాగస్వామ్యాలు నమోదు చేసిన అతడు... రెండో ఇన్నింగ్స్లో అసాధారణంగా పోరాడాడు. ఇంగ్లండ్ బౌలర్లంతా ఒకదశలో జడేజాను అవుట్ చేయడం సాధ్యం కాదని నిర్ణయించుకొని అవతలి ఎండ్లో వికెట్ పడగొట్టేందుకే ప్రయత్నించారంటే అతడు ఎంత పట్టుదలగా ఆడాడో అర్థం చేసుకోవచ్చు. వికెట్ విలువ గుర్తెరిగి... గత ఏడాది భారత జట్టు టి20 ప్రపంచకప్ గెలిచిన అనంతరం ఆ ఫార్మాట్ నుంచి విరాట్ కోహ్లి, రోహిత్ శర్మతో పాటు జడేజా కూడా వీడ్కోలు పలికాడు. తదనంతరం ఆ ఇద్దరు స్టార్ ఆటగాళ్లు సుదీర్ఘ ఫార్మాట్కు కూడా రిటైర్మెంట్ ప్రకటించగా... ‘జడ్డూ’ మాత్రం కొనసాగుతున్నాడు. జైస్వాల్, గిల్, సుదర్శన్, సుందర్, నితీశ్ వంటి యువ ఆటగాళ్లతో కూడిన జట్టులో... రాహుల్, పంత్ కన్నా ఎక్కువ టెస్టులు ఆడిన అనుభవం ఉన్న జడేజా ఈ సిరీస్లో తన వికెట్ విలువ గుర్తెరిగి బ్యాటింగ్ చేస్తున్నాడు. పరిస్థితులకు తగ్గట్లు తన బ్యాటింగ్ను మార్చుకుంటూ ప్రతి కెప్టెన్ తన జట్టులో ఇలాంటి ప్లేయర్ ఉండాలనుకునే విధంగా ఆడుతున్నాడు. గతంలో కేవలం తన బౌలింగ్, ఫీల్డింగ్తోనే జట్టులో చోటు దక్కించుకున్న ‘జడ్డూ’... ఇప్పుడు నమ్మదగ్గ బ్యాటర్గా ఎదిగాడు. ఒకప్పుడు ‘బిట్స్ అండ్ పీసెస్’ క్రికెటర్ అని విమర్శలు ఎదుర్కొన్న అతడు... వాటికి తన బ్యాట్తోనే సమాధానం చెప్పాడు. భారత గడ్డపై మ్యాచ్ల్లో ఎక్కువ వికెట్లు తీసిన జడేజా... విదేశాల్లో బౌలింగ్తో అద్భుతాలు చేయలేకపోయినా... నిఖార్సైన బ్యాటర్గానూ జట్టులో చోటు నిలుపుకునే స్థాయికి ఎదిగాడు. తాజా ఇంగ్లండ్ పర్యటనలో పేసర్లు వికెట్ల పండగ చేసుకుంటుండగా... ఈ లెఫ్టార్మ్ స్పిన్నర్ 3 వికెట్లు తన ఖాతాలో వేసుకున్నాడు. రెండో టెస్టు రెండో ఇన్నింగ్స్లో లంచ్కు ముందు చివరి ఓవర్లో స్టోక్స్ అవుట్ కావడం వెనక ‘జడ్డూ’ కృషి ఉంది. అంతకుముందు ఓవర్ వేసిన అతడు కేవలం 90 సెకన్లలోనే ఆరు బంతులు వేయడంతో మరో అదనపు ఓవర్ వేసే అవకాశం దక్కగా... అందులో సుందర్ బౌలింగ్లో స్టోక్స్ పెవిలియన్ చేరాడు. ఎప్పుడూ తెరవెనుకే! జడేజా టెస్టు అరంగేట్రం చేసినప్పటి నుంచి చూసుకుంటే... అతడి కంటే ఐదుగురు బౌలర్లు మాత్రమే ఎక్కువ బంతులు వేశారు. 2018 తర్వాతి నుంచి అతడు 42.01 సగటుతో పరుగులు రాబట్టాడు. 83 టెస్టుల్లో జడ్డూ 4 సెంచరీలు, 26 అర్ధసెంచరీలతో 3697 పరుగులు చేయడంతో పాటు... 326 వికెట్లు పడగొట్టాడు. అందులో 15 సార్లు ఐదు వికెట్ల ప్రదర్శనలు ఉన్నాయి. అయితే ఇందులో అధిక శాతం ఉపఖండ పిచ్లపైనే నమోదవడం... జడేజా మంచి స్కోరు చేసిన మ్యాచ్ల్లో టాపార్డర్ భారీగా పరుగులు రాబట్టడంతో ఎప్పుడూ అతడి పేరు పెద్దగా వెలుగులోకి రాలేదు. పదకొండేళ్ల క్రితం 2014లో లార్డ్స్ వేదికగా ఇంగ్లండ్తో టెస్టులో ధనాధన్ హాఫ్ సెంచరీతో పాటు ఆఖర్లో చక్కటి త్రోతో అండర్సన్ను రనౌట్ చేసి జట్టు విజయంలో కీలకపాత్ర పోషించిన జడేజా ఈసారి ఒంటిచేత్తో మ్యాచ్ను గెలిపించాలని విశ్వప్రయత్నం చేసి విఫలమయ్యాడు. అయితే ఈ క్రమంలో తన పోరాటంతో మాత్రం అందలమెక్కాడు. ఇకపై కూడా అతడు ఇదే నిలకడ కొనసాగించాలని టీమ్ మేనేజ్మెంట్ కోరుకుంటోంది. ఆరు బంతులను ఒకే ప్రాంతంలో వేయగల నైపుణ్యంతో పాటు... వేర్వేరుగా సంధించగల వైవిధ్యం గల జడేజా... నోబాల్స్ విషయంలో మరింత దృష్టి పెట్టాల్సిన అవసరముంది! -
జడేజాపై విమర్శలు!.. టీమిండియా దిగ్గజాలకు ఇచ్చిపడేసిన పుజారా
లార్డ్స్ టెస్టులో టీమిండియా ఆల్రౌండర్ రవీంద్ర జడేజా (Ravindra Jadeja) ఆఖరి వరకు పోరాడిన తీరు అద్భుతం. టాపార్డర్ చేతులెత్తేసిన వేళ.. టెయిలెండర్లతో కలిసి ఒక్కో పరుగు జత చేస్తూ స్కోరు బోర్డును ముందుకు నడిపించాడు. భారీ తేడాతో ఓటమి ఖాయమనుకున్న తరుణంలో.. తన నిలకడైన బ్యాటింగ్తో భారత శిబిరంలో గెలుపు ఆశలు రేకెత్తించాడు.అయితే, దురదృష్టవశాత్తూ టెయిలెండర్ మహ్మద్ సిరాజ్ (Mohammed Siraj) పదో వికెట్గా వెనుదిరడంతో.. టీమిండియా ఓటమి ఖరారైంది. ఆఖరికి 22 పరుగుల తేడాతో గిల్ సేన పరాజయాన్ని మూటగట్టుకుంది. మొత్తంగా 181 బంతులు ఎదుర్కొని అర్ధ శతకం (61; 4 ఫోర్లు, ఒక సిక్సర్) సాధించి ఆఖరి వరకు అజేయంగా నిలిచిన జడేజా పోరాటం వృథా అయిపోయింది.జడేజా దూకుడుగా ఆడాల్సింది!అయితే, జడ్డూ జిడ్డు ఇన్నింగ్స్ ఆడకుండా ఉండాల్సిందంటూ టీమిండియా దిగ్గజాలు అనిల్ కుంబ్లే, సునిల్ గావస్కర్ (Sunil Gavaskar) వంటి వాళ్లు అతడిని విమర్శించడం గమనార్హం. జడేజా కాస్త దూకుడుగా ఆడి ప్రత్యర్థిపై ఒత్తిడి పెంచి ఉంటే ఫలితం వేరేలా ఉండేదని వీరు అభిప్రాయపడ్డారు.ఈ నేపథ్యంలో టీమిండియా వెటరన్ బ్యాటర్, కామెంటేటర్ ఛతేశ్వర్ పుజారా మాత్రం భిన్నంగా స్పందించాడు. వీరోచిత పోరాటం చేసిన జడేజాను విమర్శించడం ఎంతమాత్రమూ సరికాదంటూ విమర్శకులకు కౌంటర్ ఇచ్చాడు.గొప్పగా బ్యాటింగ్ చేశాడు‘‘ఆ పిచ్పై జడేజా వేగంగా పరుగులు చేయడానికి ఆస్కారం లేదు. వికెట్ స్వభావం అలా ఉంది. టెయిలెండర్లు వికెట్ కాపాడుకుంటే.. నెమ్మదిగా అయినా సరే అతడు జట్టును లక్ష్యానికి మరింత చేరువగా తీసుకువచ్చేవాడు.అప్పుడు తనలోని దూకుడును బయటకు తీసి పని పూర్తి చేసేవాడు. నిజానికి అతడు గొప్పగా బ్యాటింగ్ చేశాడు. ఏదేమైనా అలాంటి పిచ్పై పరుగులు రాబట్టడం కష్టతరమనే చెబుతాను. అయితే, జడేజా స్ట్రెయిట్డౌన్ షాట్లు ఆడితే బాగుండేది. అదొక్కటే కాస్త మిస్ అయిందని చెప్పవచ్చు’’ అని పుజారా తన అభిప్రాయాలు పంచుకున్నాడు. కాగా ఐదు టెస్టులు ఆడేందుకు ఇంగ్లండ్లో పర్యటిస్తోంది టీమిండియా.ఈ క్రమంలో లీడ్స్లో జరిగిన తొలి టెస్టులో ఇంగ్లండ్ గెలవగా.. ఎడ్జ్బాస్టన్లో జరిగిన రెండో టెస్టులో భారత్ విజయం సాధించింది. అయితే, లార్డ్స్లో 22 పరుగుల తేడాతో ఓటమిపాలైన టీమిండియా.. ప్రస్తుతం 1-2తో వెనుకబడి ఉంది. ఇరుజట్ల మధ్య మాంచెస్టర్ వేదికగా నాలుగో టెస్టు (జూలై 23- 27) జరుగనుంది.భారత్ వర్సెస్ ఇంగ్లండ్- మూడో టెస్టు సంక్షిప్త స్కోర్లు🏏ఇంగ్లండ్: 387 & 192🏏భారత్: 387 & 170.చదవండి: అతడికి ఇంకొక్క అవకాశం ఇవ్వండి.. నాలుగో టెస్టులో ఆడించండి: కుంబ్లే -
క్రికెట్ చరిత్రలో అత్యంత అరుదైన ఘనత సాధించిన రవీంద్ర జడేజా
తాజాగా ముగిన లార్డ్స్ టెస్ట్లో వీరోచితమైన పోరాటం చేసి భారత్ను గెలిపించేందుకు శాయశక్తులా ప్రయత్నించి విఫలమైన రవీంద్ర జడేజా ఓ అద్భుత రికార్డును సొంతం చేసుకున్నాడు. ఈ మ్యాచ్ రెండో ఇన్నింగ్స్లో జడ్డూ భారత్ను గెలిపించే ప్రయత్నంలో భాగంగా అజేయమైన 61 పరుగులు చేయడంతో అంతర్జాతీయ క్రికెట్లో (మూడు ఫార్మాట్లలో) 7000 పరుగులు పూర్తి చేసుకున్నాడు. తద్వారా క్రికెట్ చరిత్రలో 7000 అంతర్జాతీయ పరుగులు పూర్తి చేయడంతో పాటు 600కు పైగా వికెట్లు సాధించిన నాలుగో ఆటగాడిగా రికార్డుల్లోకెక్కాడు. జడ్డూకు ముందు కపిల్ దేవ్, షాన్ పొల్లాక్, షకీబ్ అల్ హసన్ మాత్రమే ఈ ఘనత సాధించారు.కపిల్ 356 మ్యాచ్ల్లో 9031 పరుగులు చేసి 687 వికెట్లు తీయగా.. పొల్లాక్ 423 మ్యాచ్ల్లో 7386 పరుగులు, 829 వికెట్లు.. షకీబ్ 447 మ్యాచ్ల్లో 14730 పరుగులు, 712 వికెట్లు తీశారు. జడేజా విషయానికొస్తే.. లార్డ్స్ టెస్ట్తో కలుపుకొని జడ్డూ 302 ఇన్నింగ్స్ల్లో 33.41 సగటున, నాలుగు సెంచరీలు, 39 అర్ద సెంచరీల సాయంతో 7018 పరుగులు చేశాడు. బౌలింగ్లో 29.33 సగటున 17 ఐదు వికెట్ల ప్రదర్శనల సాయంతో 611 వికెట్లు తీశాడు.ఫార్మాట్ల వారీగా చూస్తే.. గతేడాది పొట్టి క్రికెట్కు రిటైర్మెంట్ ప్రకటించిన జడ్డూ.. ఈ ఫార్మాట్లో 41 ఇన్నింగ్స్ల్లో 515 పరుగులు చేసి, 71 ఇన్నింగ్స్ల్లో 54 వికెట్లు తీశాడు. వన్డేల విషయానికొస్తే.. ఈ ఫార్మాట్లో 137 ఇన్నింగ్స్ల్లో బ్యాటింగ్ చేసిన జడ్డూ 32.63 సగటున 13 అర్ద శతకాల సాయంతో 2806 పరుగులు చేసి, 196 ఇన్నింగ్స్ల్లో 231 వికెట్లు తీశాడు. పరిమిత ఓవర్ల ఫార్మాట్లతో పోలిస్తే జడేజాకు టెస్ట్ల్లో ఘనమైన ట్రాక్ రికార్డు ఉంది. సుదీర్ఘ ఫార్మాట్లో జడ్డూ 124 ఇన్నింగ్స్ల్లో 4 సెంచరీలు, 26 అర్ద సెంచరీల సాయంతో 36.97 సగటున 3697 పరుగులు చేశాడు. బౌలింగ్లో 156 ఇన్నింగ్స్ల్లో 15 ఐదు వికెట్ల ప్రదర్శనలు, మూడు 10 వికెట్ల ప్రదర్శనల సాయంతో 326 వికెట్లు తీశాడు.కాగా, లార్డ్స్ టెస్ట్లో (మూడవది) భారత్ ఇంగ్లండ్ చేతిలో 22 పరుగుల స్వల్ప తేడాతో పోరాడి ఓడిన విషయం తెలిసిందే. ఈ మ్యాచ్లో టీమిండియా 193 పరుగుల లక్ష్యాన్ని కూడా ఛేదించలేక బోల్తా పడింది. ఆల్రౌండర్ రవీంద్ర జడేజా.. టెయిలెండర్ల సహకారంతో వీరోచితంగా పోరాడినా టీమిండియాను గట్టెక్కించలేకపోయాడు. తద్వారా ఐదు మ్యాచ్ల సిరీస్లో ఇంగ్లండ్ 2-1 ఆధిక్యంలోకి వెళ్లింది. -
భారత్ ఓటమికి కారణమదే.. అతడు మాత్రం అద్భుతం: సునీల్ గవాస్కర్
లార్డ్స్ వేదికగా ఇంగ్లండ్తో జరిగిన మూడో టెస్టులో 22 పరుగుల తేడాతో భారత్ ఓటమి పాలైన సంగతి తెలిసిందే. 193 పరుగుల లక్ష్యాన్ని చేధించలేక టీమిండియా చతకలపడింది. రవీంద్ర జడేజా (61 నాటౌట్; 181 బంతుల్లో 4 ఫోర్లు, 1 సిక్స్) ఒంటరి పోరాటం చేసినా.. మిగిలిన బ్యాటర్లు విఫలం కావడంతో భారత్ ఓటమి చవిచూడాల్సి వచ్చింది.ఇంగ్లండ్ బౌలర్లలో కెప్టెన్ బెన్ స్టోక్స్, జోఫ్రా ఆర్చర్ తలా మూడు వికెట్లు పడగొట్టగా.. బ్రైడన్ కార్స్ రెండు వికెట్లు సాధించాడు. ఇక గిల్ సేన ఓటమిపై మ్యాచ్ అనంతరం భారత క్రికెట్ దిగ్గజం సునీల్ గవాస్కర్ స్పందించారు. లక్ష్య చేధనలో బ్యాటర్లు భాగస్వామ్యాలను నెలకొల్పకపోవడం వల్ల భారత్ ఓటమి పాలైందని ఆయన తెలిపారు."భారత రెండో ఇన్నింగ్స్లో కనీసం ఒక్కటైన 60 నుంచి 70 పరుగుల భాగస్వామ్యం నమోదైంటే ఫలితం మరో విధంగా ఉండేది. కానీ భారత బ్యాటర్లు అలా చేయడంలో విఫలమయ్యారు. స్పిన్నర్లు జో రూట్, షోయబ్ బషీర్ బౌలింగ్ చేస్తున్నప్పుడు జడేజా దూకుడుగా ఆడలేదని కొంతమంది విమర్శిస్తున్నారు. కానీ ఆ సమయంలో అతడు ఆడిన తీరు సరైనదే. ఎందుకుంటే బయట మరో వికెట్ లేదు. జడేజా పోరాటానికి పూర్తి మార్క్లు ఇవ్వాల్సిందేనని" అధికారిక బ్రాడ్కాస్టర్ సోనీ స్పోర్ట్స్కు ఇచ్చిన ఇంటర్వ్యూలో సన్నీ పేర్కొన్నారు. కాగా భారత కెప్టెన్ శుబ్మన్ గిల్ సైతం తమ ఓటమికి కారణం ఇదే చెప్పుకొచ్చాడు. ఒక 50 పరుగుల భాగస్వామ్యం వచ్చి వున్నా తాము గెలిచే వాళ్లమని గిల్ అన్నాడు. ఇక భారత్-ఇంగ్లండ్ మధ్య మూడో టెస్టు జూలై 23 నుంచి మాంచెస్టర్ వేదికగా ప్రారంభం కానుంది. ఈ మ్యాచ్ కోసం ఇంగ్లండ్ తమ జట్టును ప్రకటించింది. ఎనిమిదేళ్ల తర్వాత ఇంగ్లండ్ టెస్టు జట్టులోకి లైమ్ డాసన్ వచ్చాడు. భారత్ కూడా తమ తుది జట్టులో మార్పులు చేసే ఛాన్స్ ఉంది.చదవండి: IND vs ENG: భారత్తో నాలుగో టెస్టు.. ఇంగ్లండ్ జట్టు ప్రకటన! 8 ఏళ్ల తర్వాత స్టార్ ప్లేయర్ రీఎంట్రీ -
ENG Vs IND: పోరాడినా... పరాజయమే
లార్డ్స్ టెస్టులో భారత్ గుండె పగిలింది. విజయానికి ఎంతో చేరువగా వచ్చినా చివరకు ఓటమే పలకరించింది. ఐదో రోజు చేతిలో 6 వికెట్లతో 135 పరుగులు చేయాల్సిన టీమిండియా లక్ష్యాన్ని అందుకోవడంలో విఫలమైంది. ఆశలు పెట్టుకున్న పంత్, రాహుల్ విఫలం కాగా... 82/7 నుంచి జట్టును గెలిపించేందుకు రవీంద్ర జడేజా పోరాడినా లాభం లేకపోయింది. ఇంగ్లండ్ కెప్టెన్ స్టోక్స్ జట్టును ముందుండి నడిపించగా... పట్టుదలగా బౌలింగ్ చేసిన ఆతిథ్య జట్టు మ్యాచ్ చేజారకుండా కాపాడుకోగలిగింది. ఈ టెస్టులో పలు సందర్భాల్లో శుబ్మన్ గిల్ బృందం ఆధిక్యం ప్రదర్శించినా... కీలక క్షణాలను ఇంగ్లండ్ సరిగ్గా ఒడిసి పట్టుకుంది. టీమ్ వెనుకబడిన ప్రతీసారి పోరాటయోధుడిలా నేనున్నానంటూ ముందుకొచ్చి సత్తా చాటిన స్టోక్స్దే ఈ గెలుపు అనడం అతిశయోక్తి కాదు. లండన్: ‘అండర్సన్–టెండూల్కర్ ట్రోఫీ’లో ఇంగ్లండ్ ఆధిక్యంలోకి దూసుకెళ్లింది. సోమవారం లార్డ్స్ మైదానంలో ముగిసిన మూడో టెస్టులో ఇంగ్లండ్ 22 పరుగుల స్వల్ప తేడాతో భారత్పై విజయం సాధించింది. అనూహ్య మలుపులు, ఉత్కంఠతో సాగుతూ వచ్చిన మ్యాచ్లో బ్యాటింగ్ వైఫల్యం భారత్ను దెబ్బ తీసింది. 193 పరుగుల లక్ష్యంతో ఐదో రోజు బరిలోకి దిగిన భారత్ తమ రెండో ఇన్నింగ్స్లో 74.5 ఓవర్లలో 170 పరుగులకు ఆలౌటైంది. రవీంద్ర జడేజా (181 బంతుల్లో 61 నాటౌట్; 4 ఫోర్లు, 1 సిక్స్) మినహా ఎవరూ ప్రభావం చూపలేకపోయారు. ఇంగ్లండ్ పదునైన బౌలింగ్తో స్వల్ప స్కోరును కూడా కాపాడుకోవడంలో సఫలమైంది. రెండు ఇన్నింగ్స్లలో కలిపి 77 పరుగులు చేయడంతో పాటు 5 వికెట్లు తీసిన బెన్ స్టోక్స్ ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’ అవార్డు గెల్చుకున్నాడు. సిరీస్లో ఇంగ్లండ్ 2–1తో ముందంజలో ఉండగా... నాలుగో టెస్టు ఈ నెల 23 నుంచి మాంచెస్టర్లో జరుగుతుంది. ఆర్చర్ పదునైన బౌలింగ్... ఓవర్నైట్ స్కోరు 58/4తో ఆటను కొనసాగించిన భారత్కు చివరి రోజు సరైన ఆరంభం లభించలేదు. 11 పరుగుల వ్యవధిలో జట్టు మూడు కీలక వికెట్లు కోల్పోయింది. గాయంతో బాధపడుతున్న పంత్ తడబడుతూనే బ్యాటింగ్ చేశాడు. ఆర్చర్ అద్భుత బంతితో పంత్ (9)ను క్లీన్బౌల్డ్ చేయగా, స్టోక్స్ బౌలింగ్లో కేఎల్ రాహుల్ (58 బంతుల్లో 39; 6 ఫోర్లు) వికెట్ల ముందు దొరికిపోయాడు. అంపైర్ అవుట్ ఇవ్వకపోవడంతో రివ్యూ కోరిన ఇంగ్లండ్ ఫలితం సాధించింది. తర్వాతి ఓవర్లోనే ఆర్చర్ తన బౌలింగ్లో అద్భుత రిటర్న్ క్యాచ్తో సుందర్ (0)ను పెవిలియన్ పంపించాడు. 82/7 వద్ద పరిస్థితి చూస్తే భారత్ ఇన్నింగ్స్ ముగిసేందుకు ఎంతో సమయం పట్టదనిపించింది. జడేజా పోరాటం... అప్పటి వరకు 15 బంతులు ఎదుర్కొని 8 పరుగులు చేసిన జడేజా... జట్టు భారాన్ని తనపై వేసుకున్నాడు. తాను ప్రధాన పాత్ర పోషిస్తూ తర్వాతి ముగ్గురు బ్యాటర్లతో అతను కీలక భాగస్వామ్యాలు నెలకొల్పాడు. భారీ షాట్లకు పోకుండా సింగిల్స్తోనే ఒక్కో పరుగు జోడించడంతో పాటు అవతలి బ్యాటర్లను కాపాడుకుంటూ అతని ఇన్నింగ్స్ సాగింది. ఈ క్రమంలో పరుగుల రాక కూడా బాగా తగ్గిపోయింది. పదునైన డిఫెన్స్ చూపించగలిగినా... నితీశ్ కుమార్ రెడ్డి (53 బంతుల్లో 13; 1 ఫోర్) లంచ్కు ముందు వోక్స్ చక్కటి బంతికి వెనుదిరిగాడు. ఆ తర్వాత జస్ప్రీత్ బుమ్రా (54 బంతుల్లో 5; 1 ఫోర్), జడేజా భాగస్వామ్యం ఏకంగా 22 ఓవర్ల పాటు సాగింది. సహనం కోల్పోయిన బుమ్రా భారీ షాట్ ఆడబోయి అవుట్ కాగా... మొహమ్మద్ సిరాజ్ (40 బంతుల్లో 4) అండతో జడేజా జట్టును గెలుపు దిశగా నడిపించాడు. అయితే చివర్లో పెరిగిన ఉత్కంఠ మధ్య స్పిన్నర్ బషీర్ బౌలింగ్లో సిరాజ్ వికెట్తో భారత్ ఓటమి ఖాయయైంది. అలా ముగిసింది... భారత్ విజయానికి మరో 46 పరుగులు కావాల్సిన సమయంలో జడేజాతో సిరాజ్ జత కలిశాడు. జడేజా జాగ్రత్తగా స్ట్రయికింగ్ నిలబెట్టుకుంటుండగా... సిరాజ్ కూడా పట్టుదలగా 29 బంతులు ఆడి సహకరించాడు. మెలమెల్లగా భాగస్వామ్యం 13.1 ఓవర్లలో 23 పరుగులు పూర్తి చేసుకుంది. ఎన్ని ప్రయత్నాలు చేసినా చివరి వికెట్ తీయలేక ఇంగ్లండ్ శిబిరంలో అసహనం పెరిగిపోతోంది. ఇలాగే సాగితే సింగిల్స్తో మరో 23 పరుగులు కావడం సాధ్యమే అనిపించింది. అయితే సిరాజ్ అనూహ్య వికెట్తో ఆట ముగిసింది. బషీర్ వేసిన బంతిని సిరాజ్ దానిని చక్కగా డిఫెన్స్ ఆడాడు. అయితే కింద పడిన బంతి నెమ్మదిగా అతని కాలి వెనక భాగం వైపు వెళ్లగా, దానిని సిరాజ్ గుర్తించలేకపోయాడు. తేరుకునేలోపే బంతి స్టంప్స్ను తాకి ఒక బెయిల్ కింద పడటంతో ఇంగ్లండ్ సంబరాలు చేసుకుంది.స్కోరు వివరాలు ఇంగ్లండ్ తొలి ఇన్నింగ్స్: 387; భారత్ తొలి ఇన్నింగ్స్: 387; ఇంగ్లండ్ రెండో ఇన్నింగ్స్: 192; భారత్ రెండో ఇన్నింగ్స్: జైస్వాల్ (సి) స్మిత్ (బి) ఆర్చర్ 0; రాహుల్ (ఎల్బీ) (బి) స్టోక్స్ 39; కరుణ్ నాయర్ (ఎల్బీ) (బి) కార్స్ 14; గిల్ (సి) స్మిత్ (బి) కార్స్ 6; ఆకాశ్దీప్ (బి) స్టోక్స్ 1; పంత్ (బి) ఆర్చర్ 9; జడేజా (నాటౌట్) 61; సుందర్ (సి అండ్ బి) ఆర్చర్ 0; నితీశ్ రెడ్డి (సి) స్మిత్ (బి) వోక్స్ 13; బుమ్రా (సి) (సబ్) కుక్ (బి) స్టోక్స్ 5; సిరాజ్ (బి) బషీర్ 4; ఎక్స్ట్రాలు 18; మొత్తం (74.5 ఓవర్లలో ఆలౌట్) 170. వికెట్ల పతనం: 1–5, 2–41, 3–53, 4–58, 5–71, 6–81, 7–82, 8–112, 9–147, 10–170. బౌలింగ్: వోక్స్ 12–5–21–1, ఆర్చర్ 16–1–55–3, స్టోక్స్ 24–4–48–3, కార్స్ 16–2–30–2, రూట్ 1–0–1–0, బషీర్ 5.5–1–6–1. -
జడేజా పోరాటం వృథా.. ఉత్కంఠ పోరులో భారత్ ఓటమి
లార్డ్స్ వేదికగా ఇంగ్లండ్-భారత్ మధ్య జరిగిన మూడో టెస్టు మ్యాచ్ అభిమానులను మునివేళ్లపై నిలబెట్టింది. ఆఖరివరకు నువ్వానేనా అన్నట్లు సాగిన మ్యాచ్లో 22 పరుగుల తేడాతో టీమిండియా ఓటమి పాలైంది. 193 పరుగుల లక్ష్యాన్ని చేధించిలేక భారత జట్టు చతికల పడింది. ఈ స్వల్ప లక్ష్య చేధనలో 170 పరుగులకే టీమిండియా ఆలౌటైంది. రవీంద్ర జడేజా (181 బంతుల్లో 61 నాటౌట్) ఒంటరిపోరాటం చేసినప్పటికి జట్టును విజయతీరాలకు చేర్చలేకపోయాడు. ఆరంభం నుంచే..జడేజాతో పాటు కేఎల్ రాహుల్(54) పర్వాలేదన్పించగా మిగితా ప్లేయర్లంతా దారుణంగా విఫలమయ్యారు. 58/4 ఓవర్నైట్ స్కోరుతో ఐదో రోజు ఆట మొదలుపెట్టిన భారత్.. ఆరంభం నుంచే తడబడింది. రిషబ్ పంత్, వాషింగ్టన్ సుందర్, రాహుల్ వరుస క్రమంలో పెవిలియన్కు చేరారు. ఆ తర్వాత రవీంద్ర జడేజా, నితీశ్ కాసేపు నిలకడగా ఆడి భారత గెలుపుపై ఆశలు రెకెత్తించారు. అయితే లంచ్ బ్రేక్కు ముందు నితీశ్ ఔట్ కావడంతో మ్యాచ్ మళ్లీ ఇంగ్లండ్ వైపు టర్న్ అయింది. ఆ తర్వాత జడేజా.. జస్ప్రీత్ బమ్రాతో కలిసి ఇన్నింగ్స్ను ముందుకు నడిపించాడు.బుమ్రా ఇంగ్లండ్ పేసర్లను ఎదుర్కొంటూ జడేజాకు మద్దతుగా నిలిచాడు. అయితే 50 బంతులకు పైగా బ్యాటింగ్ చేసిన బుమ్రా(5) భారీ షాట్కు ప్రయత్నించి తొమ్మిదో వికెట్గా వెనుదిరిగాడు. ఈ క్రమంలో క్రీజులోకి వచ్చిన మహ్మద్ సిరాజ్ సైతం తన వంతు సహకారం అందించాడు.కానీ ఇంగ్లండ్ స్పిన్నర్ షోయబ్ బషీర్ బౌలింగ్లో సిరాజ్ బౌల్డ్ కావడంతో టీమిండియా అభిమానుల హార్ట్ బ్రేక్ అయింది. సిరాజ్ సైతం భావోద్వేగానికి లోనయ్యాడు. ఇంగ్లండ్ మాత్రం గెలుపు సంబరాల్లో మునిగి తేలిపోయింది. ఇంగ్లండ్ బౌలర్లలో జోఫ్రా ఆర్చర్, కెప్టెన్ బెన్ స్టోక్స్ తలా మూడు వికెట్లు పడగొట్టి గిల్ సేన పతనాన్ని శాసించారు. వీరిద్దరితో పాటు కార్స్ రెండు, బషీర్, వోక్స్ తలా వికెట్ సాధించారు. అంతకుముందు తొలి ఇన్నింగ్స్లో ఇంగ్లండ్ 387 పరుగులు చేయగా.. టీమిండియా సైతం సరిగ్గా 387 పరుగులకే చేయగల్గింది. అనంతరం ఇంగ్లండ్ తమ తొలి ఇన్నింగ్స్లో 192 పరుగులకు ఆలౌటైంది. సెకెండ్ ఇన్నింగ్స్లో బౌలర్లు అద్బుతంగా రాణించినప్పటికి.. బ్యాటర్లు విఫలం కావడంతో భారత్ ఓటమి చవిచూడాల్సి వచ్చింది.చదవండి: మెడ చుట్టూ చేయి వేసి ఆపేశాడు!.. ఇచ్చిపడేసిన జడ్డూ -
ఇంగ్లండ్ బౌలర్ ఓవరాక్షన్!.. ఇచ్చిపడేసిన జడ్డూ.. మధ్యలోకి స్టోక్స్
లార్డ్స్ టెస్టు సందర్భంగా ఇంగ్లండ్ పేసర్ బ్రైడన్ కార్స్ (Brydon Carse)- టీమిండియా ఆల్రౌండర్ రవీంద్ర జడేజా (Ravidndra Jadeja) మధ్య గొడవ జరిగింది. కార్స్ చేసిన పనికి జడ్డూ గట్టిగానే ఇచ్చిపడేశాడు. ఈ క్రమంలో ఇరువురి మధ్య వాగ్వాదం తారస్థాయికి చేరగా ఇంగ్లండ్ కెప్టెన్ బెన్ స్టోక్స్ (Ben Stokes) అడ్డుగోడలా నిలబడి వారిని విడదీయడంతో పరిస్థితి సద్దుమణిగింది.అసలేం జరిగిందంటే.. భారత్- ఇంగ్లండ్ మధ్య లార్డ్స్ మైదానంలో గురువారం మొదలైన మూడో టెస్టు తుది అంకానికి చేరింది. ఆఖరిదైన సోమవారం నాటి ఐదో రోజు ఆటలో విజేత ఎవరన్నది తేలనుంది. ఇంగ్లండ్ విధించిన 193 పరుగుల లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో 58/4 ఓవర్నైట్ స్కోరుతో ఆట మొదలుపెట్టిన భారత్.. ఆరంభం నుంచే తడబడింది.రిషభ్ పంత్ (9)ను జోఫ్రా ఆర్చర్ అద్భుత డెలివరీతో బౌల్డ్ చేయగా.. కేఎల్ రాహుల్ (39)ను స్టోక్స్ లెగ్ బిఫోర్ వికెట్గా వెనక్కి పంపాడు. ఆ తర్వాత వాషింగ్టన్ సుందర్ (0) ఇలా వచ్చి అలా వెళ్లగా.. నితీశ్ కుమార్రెడ్డి 53 బంతులు ఎదుర్కొని 13 పరుగులు చేసి నిష్క్రమించాడు. ఫలితంగా భోజన విరామ సమయానికి భారత్ 39.3 ఓవర్లలో ఎనిమిది వికెట్ల నష్టానికి 112 పరుగులు చేసింది. ఇలాంటి క్లిష్ట పరిస్థితుల్లో జడేజా నిలకడగా ఆడుతూ ఇన్నింగ్స్ చక్కదిద్దే ప్రయత్నంలో.. కార్స్ అతడికి అడ్డు తగిలాడు.జడ్డూ మెడ చుట్టూ చేయి వేసిటీమిండియా ఇన్నింగ్స్లో 35వ ఓవర్లో రంగంలోకి దిగిన కార్స్ బౌలింగ్లో.. ఆఖరి బంతికి జడ్డూ నితీశ్ రెడ్డితో కలిసి రెండు పరుగులు పూర్తి చేశాడు. అయితే, సింగిల్కు వెళ్లే క్రమంలో జడ్డూకు కార్స్ అడ్డుగా నిలవగా.. బంతిని చూస్తూ పరుగుకు వెళ్లిన జడ్డూ అతడిని ఢీకొట్టాడు. దీంతో తాను పడిపోకుండా ఉండేందుకు అన్నట్లుగా... జడ్డూ మెడ చుట్టూ చేయి వేసి అతడిని బంధించేందుకు కార్స్ ప్రయత్నం చేయగా.. జడ్డూ విడిపించుకుని పరుగులు పూర్తి చేశాడు.ఇచ్చి పడేసిన జడేజాఅనంతరం కార్స్ దగ్గరికి వచ్చి ఏంటి సంగతి అంటూ అడుగగా.. కార్స్ దురుసుగా ఎదురు సమాధానం ఇచ్చాడు. దీంతో మాటామాటా పెరగగా.. స్టోక్స్ వచ్చి ఇద్దరినీ విడదీశాడు. ఇందుకు సంబంధించిన దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్గా మారాయి.కాగా లార్డ్స్' టెస్టులో ఇలాంటి జగడాలు ఎక్కువయ్యాయి. మూడో రోజు ముగింపు సమయంలో టీమిండియా కెప్టెన్ శుబ్మన్ గిల్.. ఇంగ్లండ్ ఆటగాడు జాక్ క్రాలీ మధ్య కూడా వాగ్వాదం జరిగింది. ఇక ఐదోరోజు రిషభ్ పంత్ను అవుట్ చేసిన తర్వాత జోఫ్రా ఆర్చర్ కూడా అతడిని స్లెడ్జ్ చేశాడు.చదవండి: ఇదేం పద్ధతి?.. ఎవరి కోసం ఇదంతా?!: సునిల్ గావస్కర్ ఫైర్Drama, more drama! 👀#ENGvIND 👉 3rd TEST, DAY 5 | LIVE NOW on JioHotstar 👉 https://t.co/DTsJzJLwUc pic.twitter.com/eiakcyShHV— Star Sports (@StarSportsIndia) July 14, 2025 -
అదరగొట్టిన టీమిండియా.. ఇంగ్లండ్కు కొండంత లక్ష్యం
రెండో టెస్టులో టీమిండియా ఇంగ్లండ్కు భారీ లక్ష్యం విధించింది. ఆతిథ్య జట్టుపై ఆద్యంతం పైచేయి సాధించిన భారత్.. ఏకంగా 608 పరుగుల టార్గెట్ ఇచ్చింది. టెండుల్కర్- ఆండర్సన్ ట్రోఫీ (Tendulkar- Anderson Torphy)లో భాగంగా బర్మింగ్హామ్ వేదికగా భారత్- ఇంగ్లండ్ మధ్య రెండో టెస్టు బుధవారం మొదలైంది.587 పరుగులుఈ క్రమంలో టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన భారత్ తొలి ఇన్నింగ్స్లో 587 పరుగులు స్కోరు చేసింది. కెప్టెన్ శుబ్మన్ గిల్ (Shubman Gill) భారీ ద్విశతకం (269) బాదగా.. రవీంద్ర జడేజా (89), యశస్వి జైస్వాల్ (87) అద్భుత ఇన్నింగ్స్తో ఆకట్టుకున్నారు. వీరితో పాటు వాషింగ్టన్ సుందర్ (42) కూడా రాణించాడు.ఇక ఇంగ్లండ్ బౌలర్లలో షోయబ్ బషీర్ అత్యధికంగా మూడు వికెట్లు తీయగా.. క్రిస్ వోక్స్, జోష్ టంగ్ రెండు వికెట్లు దక్కించుకున్నారు. మిగిలిన వారిలో కెప్టెన్ బెన్ స్టోక్స్, బ్రైడన్ కార్స్ తలా ఒక వికెట్ తమ ఖాతాలో వేసుకున్నారు. అనంతరం తొలి ఇన్నింగ్స్ మొదలుపెట్టిన ఇంగ్లండ్.. మూడో రోజు ఆటలో భాగంగా 407 పరుగులకు ఆలౌట్ అయింది.హ్యారీ బ్రూక్ (158), జేమీ స్మిత్ (184 నాటౌట్) అద్భుత శతకాలతో 303 పరుగుల భాగస్వామ్యం నమోదు చేయడంతో.. ఇంగ్లండ్ మేర స్కోరు చేయగలిగింది. భారత బౌలర్లలో పేసర్లు మహ్మద్ సిరాజ్ ఆరు వికెట్లతో చెలరేగగా.. ఆకాశ్ దీప్ నాలుగు వికెట్లు దక్కించుకున్నాడు. ఇక తొలి ఇన్నింగ్స్తో కలుపుకొని 180 పరుగుల ఆధిక్యం సంపాదించిన భారత్.. ఓవర్ నైట్ స్కోరు 64/1 (13)తో శనివారం నాటి నాలుగో రోజు ఆట మొదలుపెట్టింది.మరోసారి గిల్ దంచేశాడుఆట మొదలైన కాసేపటికే కరుణ్ నాయర్ (26) పెవిలియన్ చేరగా.. ఓపెనర్ కేఎల్ రాహుల్ (55) అర్ధ శతకంతో రాణించాడు. ఇక గిల్ మరోసారి భారీ శతకం (161)తో దుమ్ములేపగా.. వికెట కీపర్ బ్యాటర్ రిషభ్ పంత్ (65), ఆల్రౌండర్ రవీంద్ర జడేజా (69 నాటౌట్) అర్ధ శతకాలతో అదరగొట్టారు. నితీశ్ రెడ్డి (1) మరోసారి నిరాశపరచగా.. వాషింగ్టన్ సుందర్ జడేజాతో కలిసి 12 పరుగులతో అజేయంగా నిలిచాడు.గిల్ భారీ శతకం పూర్తైన కాసేపటికి భారత్ తమ ఇన్నింగ్స్ డిక్లేర్ చేసింది. 83 ఓవర్ల ఆటలో ఆరు వికెట్ల నష్టానికి 427 పరుగుల వద్ద డిక్లేర్ చేస్తున్నట్లు ప్రకటించింది. ఈ క్రమంలో తొలి ఇన్నింగ్స్లో దక్కిన 180 పరుగులకు ఈ మేర (427) స్కోరు జతచేసి... ప్రత్యర్థికి భారీ లక్ష్యం విధించింది. ఈ క్రమంలో శనివారం మూడో సెషన్ ఆఖర్లో లక్ష్య ఛేదనకు దిగిన ఇంగ్లండ్.. 108 ఓవర్లలో పనిపూర్తి చేయాలి. ఈ నేపథ్యంలో ఆదివారం నాటి ఆఖరి రోజు ఆట ఆసక్తికరంగా మారింది. ఇంగ్లండ్ను టీమిండియా ఆలౌట్ చేస్తుందా? లేదంటే.. డ్రా చేసుకునేందుకు స్టోక్స్ బృందం చేసే ప్రయత్నాలు ఫలిస్తాయా? అన్న విషయం తేలుతుంది.చదవండి: వైభవ్ సూర్యవంశీ ప్రపంచ రికార్డు.. మరో ఆటగాడి శతకం.. భారత్ భారీ స్కోరు -
అయ్యో జడేజా.. టైం అయిపోయిందంటూ..!
ప్రస్తుత టీమిండియా టెస్ట్ టీమ్లో అందరికంటే సీనియర్ ఆటగాడు రవీంద్ర జడేజా. రోహిత్ శర్మ, విరాట్ కోహ్లి రిటైర్ కావడంతో జట్టులో సీనియర్గా కొనసాగుతున్నాడు జడ్డూ. ఇంగ్లండ్తో జరుగుతున్న తాజా టెస్ట్ సిరీస్లో శుబ్మన్ గిల్ నాయకత్వంలోని జట్టులో అతడు సభ్యుడిగా ఉన్నాడు. రెండో టెస్టులో కీలకమైన ఇన్నింగ్స్ ఆడి.. జట్టు భారీ స్కోరు చేయడంలో తనవంతు పాత్ర పోషించాడు. ఆట రెండో రోజు 89 పరుగులు చేసి జట్టుకు తన విలువను మరోసారి గుర్తు చేశాడీ సీనియర్ ఆల్రౌండర్. కెప్టెన్ గిల్తో కలిసి కీలకమైన 203 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పాడు. ఆరో వికెట్ అంతకంటే దిగువ స్థానాల్లో 200 పరుగులు భాగస్వామ్యాల్లో పాలుపంచుకోవడం జడేజాకు ఇది మూడోసారి.కాగా, ఇంగ్లండ్తో సెకండ్ టెస్ట్ మ్యాచ్లో రెండో రోజు ఆట ముగిసిన తర్వాత జడేజాకు మీడియా నుంచి ఆసక్తికర ప్రశ్న ఎదురైంది. కెప్టెన్సీపై ఇంకా ఆశలు ఉన్నాయా అని మీడియా ప్రతినిధి అడగ్గా.. చిరునవ్వుతో లేదన్నట్టుగా సమాధానం ఇచ్చాడు. 'వో టైమ్ గయా' (ఆ సమయం దాటిపోయింది) అని వ్యాఖ్యానించాడు.చాన్స్ లేదా?నిజంగానే అతడికి సమయం మించిపోయిందని క్రీడావ్యాఖ్యతలు అభిప్రాయపడుతున్నారు. జడేజా వయసు ఇప్పుడు 35 ఏళ్లు. ఇంకో రెండుమూడేళ్లు క్రికెట్ ఆడినా కూడా అతడికి కెప్టెన్ చాన్స్ రాదు. ఎందుకంటే జట్టు ప్రయోజనాలను గమనంలోకి తీసుకుని గిల్కు టెస్ట్ టీమ్ సారథ్య బాధ్యతలు కట్టబెట్టింది బీసీసీఐ. నాయకత్వ బాధ్యతను భుజానికెత్తుకోవడానికి బుమ్రా నిరాకరించడంతో గిల్కు చాన్స్ దక్కింది. బహుశా రోహిత్ శర్మ తప్పుకున్న తర్వాత వన్డే జట్టు పగ్గాలు కూడా శుబ్మన్కే దక్కుతాయి. ఈ నేపథ్యంలోనే తనకు ఇక చాన్స్ లేదని జడేజా వ్యాఖ్యానించి ఉంటాడని క్రీడావ్యాఖ్యతలు పేర్కొంటున్నారు.కలిసిరాని కెప్టెన్సీఅయితే దేశం తరపున జాతీయ జట్టుకు నాయకత్వం వహించే చాన్స్ రాకపోయినా.. మరోవిధంగా అతడికి కెప్టెన్సీ దక్కింది. సారథిగా తనకు వచ్చిన అవకాశాన్ని జడేజా సద్వినియోగం చేసుకోలేకపోయాడు. ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్)లో అత్యంత విజయవంతమైన జట్టుగా పేరున్న చెన్నై సూపర్ కింగ్స్ (సీఎస్కే)కు 2022లో కెప్టెన్గా చాన్స్ దక్కించకున్నాడు. వరుస పరాజయాలతోనే మధ్యలోనే నాయకత్వం నుంచి వైదొలగడంతో మళ్లీ ధోనికే పగ్గాలు అప్పగించాల్సి వచ్చింది. ఆ రకంగా చూస్తే కెప్టెన్సీ జడ్డూకు కలిసిరాలేదనే చెప్పాలి.నంబర్ 1 ఆల్రౌండర్ఆల్రౌండర్గా జడేజా ఆటకు పేరు పెట్టలేం. బ్యాట్తోనే కాకుండా బంతితో కూడా తానేంటో నిరూపించుకున్నాడు. మెరుపు ఫీల్డింగ్తో జట్టు విజయాల్లో ఎన్నోసార్లు కీలకపాత్ర పోషించాడు. ఇప్పటికీ యంగ్ ప్లేయర్స్తో పోటీ పడుతూ మైదానంలో విన్యాసాలు చేస్తుంటాడు. చాలా సందర్భాల్లో జట్టును కష్టాల నుంచి గట్టెక్కించిన ఘనత అతడికి ఉంది. అందుకే ఐసీసీ టెస్ట్ ఆల్రౌండర్ల ర్యాంకుల్లో టాప్లో కొనసాగుతున్నాడు.చదవండి: చరిత్ర సృష్టించిన జడేజా.. డబ్ల్యూటీసీలో తొలి ప్లేయర్ గిల్ గురించి జడేజా.. ఆటగాడి నుంచి టెస్ట్ కెప్టెన్ వరకు గిల్ ఎదుగుదల గురించి మీడియా ప్రతినిధులు జడేజాను అడగ్గా.. శుబ్మన్ గిల్ (shubhman gills) ఎంత ఎదిగాడో మీరు చూడలేదా? అంటూ ఎదురు ప్రశ్నించాడు. డబుల్ సెంచరీ చేసిన గిల్ను ప్రశంసించాడు. సుదీర్ఘ భాగస్వామ్యం నెలకొల్పాలని తామిద్దం మాట్లాడుకున్నామని వెల్లడించాడు. -
ENG VS IND 2nd Test: చరిత్ర సృష్టించిన రవీంద్ర జడేజా
ఎడ్జ్బాస్టన్ వేదికగా ఇంగ్లండ్తో జరుగుతున్న రెండో టెస్ట్లో టీమిండియా భారీ స్కోర్ చేసింది. కెప్టెన్ శుభ్మన్ గిల్ రికార్డు డబుల్ సెంచరీతో (387 బంతుల్లో 269; 30 ఫోర్లు, 3 సిక్సర్లు) చెలరేగడంతో 587 పరుగులకు ఆలౌటైంది (తొలి ఇన్నింగ్స్లో).భారత ఇన్నింగ్స్లో గిల్తో పాటు యశస్వి జైస్వాల్ (87), రవీంద్ర జడేజా (89), వాషింగ్టన్ సుందర్ (42) రాణించారు. గిల్.. జడేజాతో ఆరో వికెట్కు 203 పరుగులు , వాషింగ్టన్ సుందర్తో (42) ఏడో వికెట్కు 144 పరుగులు జోడించాడు.మిగతా భారత ఆటగాళ్లలో కేఎల్ రాహుల్ 2, కరుణ్ నాయర్ 31, రిషబ్ పంత్ 25, నితీశ్ కుమార్ రెడ్డి 1, ఆకాశ్దీప్ 6, సిరాజ్ 8, ప్రసిద్ద్ కృష్ణ 5 (నాటౌట్) పరుగులు చేశారు. ఇంగ్లండ్ బౌలర్లలో షోయబ్ బషీర్ 3, క్రిస్ వోక్స్, జోష్ టంగ్ తలో 2, బ్రైడన్ కార్స్, బెన్ స్టోక్స్, జో రూట్ చెరో వికెట్ పడగొట్టారు.అనంతరం బరిలోకి దిగిన ఇంగ్లండ్కు ఆదిలోనే వరుస షాక్లు తగిలాయి. బుమ్రా స్థానంలో ఈ మ్యాచ్ ఆడుతున్న ఆకాశ్దీప్ వరుస బంతుల్లో తొలి టెస్ట్ సెంచరీ హీరోలు బెన్ డకెట్, ఓలీ పోప్లను డకౌట్ చేశాడు. దీంతో ఇంగ్లండ్ 13 పరుగలకే 2 కీలక వికెట్లు కోల్పోయి పీకల్లోతు కష్టాల్లో పడింది. 25 పరుగుల వద్ద ఇంగ్లండ్కు మరో ఎదురుదెబ్బ తగిలింది. సిరాజ్ బౌలింగ్లో కరుణ్ నాయర్ క్యాచ్ పట్టడంతో జాక్ క్రాలే (19) ఔటయ్యాడు. రెండో రోజు ఆట ముగిసే సమయానికి ఇంగ్లండ్ 3 వికెట్లు కోల్పోయి 77 పరుగులు చేసింది. రూట్ (18), బ్రూక్ (30) క్రీజ్లో ఉన్నారు.చరిత్ర సృష్టించిన రవీంద్ర జడేజాఈ మ్యాచ్లో గిల్తో కలిసి అద్భుతమైన భాగస్వామ్యం నెలకొల్పి టీమిండియాకు జీవం పోసిన జడేజా ఓ భారీ రికార్డును సొంతం చేసుకున్నాడు. 79 పరుగుల వ్యక్తిగత స్కోర్ వద్ద వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్లో 2000 పరుగులు పూర్తి చేసుకున్నాడు. అప్పటికే బౌలర్గా 132 వికెట్లు తీసిన జడ్డూ.. డబ్ల్యూటీసీలో 2000 పరుగులు, 100 వికెట్లు సాధించిన తొలి ఆటగాడిగా చరిత్ర సృష్టించాడు. డబ్ల్యూటీసీలో మొత్తం 41 మ్యాచ్లు ఆడిన జడేజా తాజా ఇన్నింగ్స్తో కలుపుకొని 39 సగటుతో 2010 పరుగులు చేశాడు.బౌలింగ్లో 25.92 సగటున 132 వికెట్లు తీశాడు.ఎడ్జ్బాస్టన్ అంటే చాలు పూనకాలు వస్తాయి..!రవీంద్ర జడేజాకు ఇంగ్లండ్లోని ఎడ్జ్బాస్టన్ మైదానం అంటే చాలు పూనకాలు వస్తాయి. జడ్డూ ఇక్కడ ఆడిన రెండు మ్యాచ్ల్లో మరపురాని ఇన్నింగ్స్లు ఆడాడు. 2022 పర్యటనలో సెంచరీ (194 బంతుల్లో 104; 13 ఫోర్లు) చేసిన జడ్డూ.. ఈసారి కూడా సెంచరీ చేసినంత పని చేశాడు. నాడు రిషబ్ పంత్తో కలిసి 222 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పిన జడేజా.. తాజాగా గిల్తో కలిసి 203 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పాడు. -
కావాలనే ఖరాబ్ చేస్తున్నాడు!.. స్టోక్స్కు ఇచ్చిపడేసిన జడ్డూ
ఇంగ్లండ్ కెప్టెన్ బెన్ స్టోక్స్ (Ben Stokes) తనపై చేసిన ఆరోపణలపై టీమిండియా ఆల్రౌండర్ రవీంద్ర జడేజా (Ravindra Jadeja) స్పందించాడు. తాను ఉద్దేశపూర్వకంగా పిచ్ మధ్యలోకి వెళ్లలేదని.. ఇంగ్లండ్ బౌలింగ్ విధానమే తనను అందుకు పురిగొల్పిందని పేర్కొన్నాడు. తాను ఎలాంటి తప్పు చేయకపోయినా ఇంగ్లండ్ ఆటగాళ్లు పదే పదే అంపైర్ దగ్గరకు వెళ్లి ఫిర్యాదు చేశారని.. కానీ తాము మాత్రం ఇలాంటి తప్పులు చేయమని తెలిపాడు.కాగా ఐదు మ్యాచ్ల సిరీస్లో భాగంగా భారత్- ఇంగ్లండ్ (Ind vs Eng) మధ్య ఎడ్జ్బాస్టన్ వేదికగా బుధవారం రెండో టెస్టు మొదలైంది. ఇందులో టాస్ ఓడిన భారత్ తొలుత బ్యాటింగ్ చేసింది. కెప్టెన్ శుబ్మన్ గిల్ భారీ డబుల్ సెంచరీ (269)తో పాటు రవీంద్ర జడేజా (89), యశస్వి జైస్వాల్ (87 అద్భుతంగా రాణించగా.. తొలి ఇన్నింగ్స్లో 587 పరుగులు చేసింది.అంపైర్కు ఫిర్యాదుఇక గురువారం నాటి రెండో రోజు ఆట సందర్భంగా జడ్డూపై ఇంగ్లండ్ పేసర్ క్రిస్వోక్స్, కెప్టెన్ స్టోక్స్ పిచ్ను పాడుచేస్తున్నాడంటూ అంపైర్కు ఫిర్యాదు చేశారు. కావాలనే పదే పదే పిచ్ మధ్యలోకి పరిగెత్తుకు వచ్చి డ్యామేజ్ చేస్తున్నాడంటూ ఆరోపించారు.స్టోక్స్కు ఇచ్చిపడేసిన జడ్డూఇదే విషయంపై స్టోక్స్ జడ్డూతో.. ‘‘చూడు మేట్.. నువ్వేం చేస్తున్నావో కనబడుతోందా?’’ అంటూ మైదానంలోనే వాగ్వాదానికి దిగాడు కూడా!.. ఇందుకు జడ్డూ గట్టిగానే బదులిచ్చాడు. ‘‘నేను ఎక్కడి నుంచి వస్తున్నానో చూస్తూనే ఉన్నావు కదా!..నేనైతే ఇలాంటి ఏరియాల్లో బౌలింగ్ చేయను. అయినా నా దృష్టి మొత్తం ఇప్పుడు బ్యాటింగ్ మీదే ఉంది’’ అని కౌంటర్ ఇచ్చాడు. ఇక ఇదే విషయంపై మ్యాచ్ అనంతరం జడేజా స్పందించాడు.మీడియా సమావేశంలో మాట్లాడుతూ.. ‘‘నేనేదో కావాలనే పిచ్ను తొక్కుతున్నట్లు వారు భావించారు. నిజానికి ఫాస్ట్ బౌలర్ల బౌలింగ్ను ఎలా ఎదుర్కోవాలో నేను అదే పని చేశాను. కానీ వాళ్లు ప్రతిసారి అంపైర్ దగ్గరకు వెళ్లి ఫిర్యాదు చేశారు.నాకైతే పిచ్ మధ్యలోకి వెళ్లాలన్న ఉద్దేశం ఎంతమాత్రమూ లేదు. పరుగులు తీసే క్రమంలో నేను ముందుకు సాగిపోతూ ఉన్నానంతే!.. ఏదేమైనా నాకు అవకాశం వస్తే గనుక... నేను వాళ్లలా బౌల్ చేయను. సరైన లైన్ అండ్ లెంగ్త్తో.. సరైన చోటే బంతిని వేస్తాను’’ అని జడ్డూ చెప్పుకొచ్చాడు. కాగా గురువారం నాటి ఆట ముగిసే సరికి ఇంగ్లండ్ మూడు వికెట్ల నష్టానికి 77 పరుగులు చేసింది. చదవండి: IND vs ENG 2nd Test: వైభవ్ సూర్యవంశీని పిలిపించిన బీసీసీఐ! Sir Jadeja classic on the Stumps Mic. 😂 pic.twitter.com/SqhuVJqq4f— Mufaddal Vohra (@mufaddal_vohra) July 4, 2025 -
ENG VS IND 2nd Test: పాపం జడేజా.. తృటిలో సెంచరీ మిస్..!
ఎడ్జ్బాస్టన్ వేదికగా ఇంగ్లండ్తో జరుగుతున్న రెండో టెస్ట్లో టీమిండియా భారీ స్కోర్ దిశగా సాగుతోంది. 310/5 స్కోర్ వద్ద రెండో రోజు ఆట ప్రారంభించిన భారత్ లంచ్ విరామం సమయానికి 6 వికెట్ల నష్టానికి 419 పరుగులు చేసింది. 114 పరుగుల ఓవర్నైట్ స్కోర్తో రెండో రోజు బరిలోకి దిగిన శుభ్మన్ గిల్ 150 పరుగులు పూర్తి చేసుకొని ఇన్నింగ్స్ను కొనసాగిస్తున్నాడు. 41 పరుగుల ఓవర్నైట్ స్కోర్తో రెండో రోజు ఆటను ప్రారంభించిన రవీంద్ర జడేజా 89 పరుగుల స్కోర్ (137 బంతుల్లో 10 ఫోర్లు, సిక్సర్ సాయంతో) వద్ద ఔటయ్యాడు.జట్టు కష్టాల్లో ఉన్నప్పుడు బరిలోకి దిగిన జడేజా గిల్తో అద్భుతమైన భాగస్వామ్యం నెలకొల్పి టీమిండియాను పటిష్ట స్థితికి చేర్చాడు. గిల్-జడేజా ఆరో వికెట్కు 203 పరుగులు జోడించారు. గిల్తో పాటు అద్భుతమైన ఇన్నింగ్స్ ఆడిన జడేజా సెంచరీ మిస్ చేసుకోవడంతో టీమిండియా అభిమానులు పాపం అంటున్నారు. తొలి టెస్ట్లో సామర్థ్యం మేరకు రాణించలేక (11, 25 నాటౌట్) విమర్శలు ఎదుర్కొన్న జడేజా ఈ మ్యాచ్లో తానేంటో నిరూపించుకున్నాడు. జోష్ టంగ్ బౌలింగ్లో వికెట్కీపర్ జేమీ స్మిత్కు క్యాచ్ ఇచ్చి జడేజా ఔటయ్యాడు. లంచ్ విరామం సమయానికి గిల్ 168, వాషింగ్టన్ సుందర్ (1) క్రీజ్లో ఉన్నారు. ఈ ఇన్నింగ్స్తో గిల్ విరాట్ కోహ్లి రికార్డును బద్దలు కొట్టాడు. ఎడ్జ్బాస్టన్ మైదానంలో అత్యధిక వ్యక్తిగత స్కోరు (168) సాధించిన భారత క్రికెటర్గా అవతరించాడు. గతంలో ఈ రికార్డు విరాట్ కోహ్లి (149) పేరిట ఉండేది. టెస్టుల్లో గిల్ 150 పరుగుల మార్కుకు చేరుకోవడం కూడా ఇదే తొలిసారి. ఇంగ్లండ్ గడ్డ మీద ఓ టెస్టు మ్యాచ్ ఇన్నింగ్స్లో నూట యాభైకి పైగా వ్యక్తిగత స్కోరు సాధించిన టీమిండియా రెండో కెప్టెన్గానూ గిల్ నిలిచాడు. 1990లో ఓల్డ్ ట్రఫోర్డ్ మైదానంలో మహ్మద్ అజారుద్దీన్ కెప్టెన్ హోదాలో 179 పరుగులు సాధించాడు. -
ENG VS IND, 2nd Test: టీమిండియాను ఆదుకున్న కెప్టెన్ 'గిల్' సెంచరీ
ఎడ్జ్బాస్టన్ వేదికగా భారత్, ఇంగ్లండ్ మధ్య రెండో టెస్ట్ ఇవాళ (జులై 2) ప్రారంభమైంది. ఈ మ్యాచ్లో ఇంగ్లండ్ టాస్ గెలిచి తొలుత బౌలింగ్ ఎంచుకుంది. ఈ మ్యాచ్ కోసం భారత్ మూడు మార్పులు చేయగా.. ఇంగ్లండ్ తొలి టెస్ట్లో ఆడిన జట్టునే యధాతథంగా కొనసాగించింది.భారత్ తరఫున బుమ్రా స్థానంలో ఆకాశ్దీప్.. సాయి సుదర్శన్ స్థానంలో వాషింగ్టన్ సుందర్.. శార్దూల్ ఠాకూర్ స్థానంలో నితీశ్ కుమార్ రెడ్డి తుది జట్టులో చోటు దక్కించుకున్నారు.తొలుత బ్యాటింగ్ చేస్తున్న భారత్కు ఆదిలోనే భారీ షాక్ తగిలింది. ఇన్ ఫామ్ బ్యాటర్ కేఎల్ రాహుల్ 2 పరుగులకే ఔటై నిరాశపరిచాడు. క్రిస్ వోక్స్ బౌలింగ్లో రాహుల్ క్లీన్ బౌల్డ్ అయ్యాడు.రాహుల్ తర్వాత బరిలోకి దిగిన కరుణ్ నాయర్ కూడా తక్కువ స్కోర్కే (31) ఔటయ్యాడు. కరుణ్ వికెట్ బ్రైడన్ కార్స్కు దక్కింది. ఈ మధ్యలో యశస్వి జైస్వాల్ హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. జైస్వాల్కు టెస్ట్ల్లో ఇది 11వ అర్ద సెంచరీ. జైస్వాల్ తొలి టెస్ట్ తొలి ఇన్నింగ్స్లో సెంచరీతో చెలరేగిన విషయం తెలిసిందే.రాహుల్, కరుణ్ వికెట్లు కోల్పోయాక జాగ్రత్తగా ఆడిన జైస్వాల్, శుభ్మన్ గిల్ మూడో వికెట్కు 66 పరుగులు జోడించారు. ఈ దశలో జైస్వాల్ (107 బంతుల్లో 13 ఫోర్ల సాయంతో 87 పరుగులు) ఓ అనవసర షాట్ ఆడి వికెట్ పారేసుకున్నాడు. బెన్ స్టోక్స్ బౌలింగ్లో కట్ షాట్ ఆడే ప్రయత్నం చేయగా బంతి బాటమ్ ఎడ్జ్ తీసుకొని వికెట్కీపర్ జేమీ స్మిత్ చేతుల్లోకి వెళ్లింది.జైస్వాల్ ఔటయ్యాక శుభ్మన్ గిల్, రిషబ్ పంత్ కొద్ది సేపు జాగ్రత్తగా ఆడారు. వీరిద్దరు నాలుగో వికెట్కు 47 పరుగులు జోడించాక రిషబ్ పంత్ (25) షోయబ్ బషీర్ బౌలింగ్లో ఔటయ్యాడు. జాక్ క్రాలే అద్బుతమైన క్యాచ్ పట్టడంతో పంత్ పెవిలియన్ బాట పట్టాడు. అనంతరం క్రీజ్లోకి వచ్చిన నితీశ్ కుమార్ రెడ్డి (1) ఇలా వచ్చి అలా వెళ్లాడు. ఇతని వికెట్ వోక్స్కు దక్కింది. వోక్స్ బౌలింగ్లో నితీశ్ క్లీన్ బౌల్ట్ అయ్యాడు.211 పరుగులకే 5 వికెట్లు కోల్పోయి కష్టాల్లో ఉన్న టీమిండియాను గిల్, రవీంద్ర జడేజా గట్టెక్కించే ప్రయత్నం చేశారు. వీరిద్దరు ఆరో వికెట్కు 99 పరుగులు జోడించి ఇన్నింగ్స్లను కొనసాగిస్తున్నారు. గిల్ 114, రవీంద్ర జడేజా 41 పరుగులతో క్రీజ్లో ఉన్నారు. 85 ఓవర్ల తర్వాత టీమిండియా స్కోర్ 310/5గా ఉంది. -
రషీద్ ఖాన్ కాదు!.. షేన్ వార్న్ తర్వాత అతడే అత్యుత్తమం: గ్రెగ్ చాపెల్
ఇంగ్లండ్ చేతిలో టీమిండియా ఓటమి నేపథ్యంలో భారత జట్టు మాజీ కోచ్ గ్రెగ్ చాపెల్ (Greg Chappell) కీలక వ్యాఖ్యలు చేశాడు. కేవలం ఫీల్డింగ్ తప్పిదాల వల్లే గిల్ సేన ఓడిపోలేదని.. బౌలింగ్లో వైవిధ్యం లేకపోవడం ఇందుకు ప్రధాన కారణమని పేర్కొన్నాడు. టెండుల్కర్- ఆండర్సన్ ట్రోఫీ (Tendulkar- Anderson Trophy) ఆడేందుకు టీమిండియా ఇంగ్లండ్లో పర్యటిస్తున్న విషయం తెలిసిందే.ఐదు మ్యాచ్ల సిరీస్లో భాగంగా ఇరుజట్ల మధ్య లీడ్స్ వేదికగా జరిగిన తొలి టెస్టు (IND vs ENG)లో భారత్ ఓటమిపాలైంది. గెలవాల్సిన మ్యాచ్లో ఐదు వికెట్ల తేడాతో ఆతిథ్య జట్టు చేతిలో పరాజయాన్ని చవిచూసింది. అత్యధికంగా ఆరు క్యాచ్లు వదిలేయడం, కీలక సమయాల్లో నో బాల్స్ వేయడం తీవ్ర ప్రభావం చూపాయి.టీమిండియా ఓడిపోవడానికి ప్రధాన కారణం ఇదేఈ నేపథ్యంలో టీమిండియా మాజీ కోచ్ గ్రెగ్ చాపెల్ మాట్లాడుతూ.. ‘‘హెడింగ్లీ మైదానంలో భారత జట్టు ఫీల్డింగ్ చేసిన తీరు తీవ్రంగా నిరాశపరిచిన మాట వాస్తవం. అయితే, తొలి టెస్టులో టీమిండియా ఓడిపోవడానికి ప్రధాన కారణం మాత్రం.. ఇంగ్లండ్ సెకండ్ ఇన్నింగ్స్లో హ్యారీ బ్రూక్ను అవుట్ చేసినపుడు అది నో బాల్గా తేలడం.భారత బౌలింగ్ అటాక్లో ఏమాత్రం వైవిధ్యం లేదు. జస్ప్రీత్ బుమ్రా మినహా అందరు సీమర్లూ ఒకేలా బౌలింగ్ చేస్తున్నారు. అందరూ రైటార్మ్ మీడియం ఫాస్ట్ బౌలర్లే. బౌలర్లను మార్చిన ప్రతిసారీ కచ్చితంగా ఫలితం ఉంటుంది.బౌలింగ్లో వైవిధ్యం ఉన్నప్పుడు బ్యాటర్ తడబడతాడు. కానీ టీమిండియాలో ఇప్పుడు అది కనిపించడం లేదు. బుమ్రాతో పాటు లెఫ్టార్మ్ పేసర్ అర్ష్దీప్ సింగ్ను జట్టులోకి తీసుకుంటే బాగుంటుంది.షేన్ వార్న్ తర్వాత అతడే అత్యుత్తమ బౌలర్ఇక కుల్దీప్ యాదవ్.. షేన్ వార్న్ తర్వాత ప్రపంచంలోనే అత్యుత్తమ మణికట్టు స్పిన్నర్ అతడు. అతడిని కూడా వీరికి జతగా తుదిజట్టుకు ఎంపిక చేస్తే బౌలింగ్లో వైవిధ్యం కనబడుతుంది.బుమ్రా తప్ప మిగతా సీమర్లు సరైన లెంగ్త్తో బౌలింగ్ చేయడం లేదు. వేస్తూ ఫుల్ బాల్స్.. లేదంటే మరీ షార్ట్ బాల్స్. ఇలా అయితే కష్టం. బుమ్రాపైనే భారం ఉంటుందని ఇంగ్లండ్ బ్యాటర్లుకు తెలుసు. ఒత్తిడిలో ఉన్న అతడిని వారు ఈజీగా టార్గెట్ చేస్తారు.జడ్డూ విషయంలో పునరాలోచన చేయాలిఅందుకే కుల్దీప్ యాదవ్ను కచ్చితంగా ఆడించాలి. రవీంద్ర జడేజా ఇంగ్లండ్ గడ్డపై ఫ్రంట్లైన్ స్పిన్నర్గా పనికిరాడు. బ్యాటింగ్ కారణంగా అతడికి అవకాశం ఇస్తున్నారు. కానీ.. అతడిని ఆడించే విషయంలో పునరాలోచన చేయాలి’’ అని గ్రెగ్ చాపెల్ ఈఎస్పీఎన్క్రిక్ఇన్ఫోకు రాసిన కాలమ్లో తన అభిప్రాయాలు పంచుకున్నాడు.ఇక ప్రపంచంలో ప్రస్తుతం అత్యుత్తమ స్పిన్నర్లలో ఒకడిగా కొనసాగుతున్న అఫ్గనిస్తాన్ స్టార్ రషీద్ ఖాన్ను కాదని.. దిగ్గజ షేన్ వార్న్ తర్వాత బెస్ట్ అంటూ చాపెల్ కుల్దీప్ యాదవ్కు కితాబులివ్వడం విశేషం. కాగా భారత్-ఇంగ్లండ్ మధ్య బర్మింగ్హామ్లోని ఎడ్జ్బాస్టన్ స్టేడియంలో (జూలై 2-6) రెండో టెస్టు జరుగుతుంది. అక్కడి పిచ్ పొడిగా ఉండనున్న నేపథ్యంలో కుల్దీప్ తప్పనిసరిగా ఆడే అవకాశాలు ఉన్నాయి.చదవండి: నా మనసంతా అక్కడే.. ఎక్కడున్నా పట్టేస్తారు: పెదవి విప్పిన కావ్యా మారన్ -
అనుభవం ఉండి ఏం లాభం?.. మరీ ఇలా ఆడతావా?: డీకే ఫైర్
ఇంగ్లండ్తో తొలి టెస్టులో టీమిండియా స్టార్ రవీంద్ర జడేజా (Ravindra Jadeja) ఆట తీరును భారత మాజీ క్రికెటర్ దినేశ్ కార్తిక్ (Dinesh Karthik) విమర్శించాడు. జడ్డూ బౌలింగ్ చేసిన విధానం తనను ఆశ్చర్యానికి లోనుచేసిందన్నాడు. అనుభవజ్ఞుడైన అతడు విఫలం కావడం వల్ల జట్టు భారీ మూల్యమే చెల్లించాల్సి వచ్చిందని పేర్కొన్నాడు.కాగా టెండుల్కర్- ఆండర్సన్ ట్రోఫీ (Tendulkar-Anderson Trophy)లో భాగంగా ఐదు టెస్టులు ఆడేందుకు టీమిండియా ఇంగ్లండ్తో పర్యటిస్తోంది. ఈ క్రమంలో ఇరుజట్ల మధ్య శుక్రవారం- మంగళవారం తొలి టెస్టు జరిగింది. లీడ్స్లోని హెడింగ్లీ మైదానంలో జరిగిన ఈ మ్యాచ్తో భారత టెస్టు జట్టు కెప్టెన్గా శుబ్మన్ గిల్ తన ప్రయాణం మొదలుపెట్టాడు.అందరికంటే సీనియర్ఇక ఇంగ్లండ్కు వెళ్లిన జట్టులో రవీంద్ర జడేజానే అందరికంటే సీనియర్. అయితే, తొలి టెస్టులో ఈ స్పిన్ బౌలింగ్ ఆల్రౌండర్ నిరాశపరిచాడు. రెండు ఇన్నింగ్స్లో కలిపి 36 (11, 25 నాటౌట్) పరుగులు చేసిన జడ్డూ.. బౌలింగ్లో పూర్తిగా తేలిపోయాడు.ఇంగ్లండ్ తొలి ఇన్నింగ్స్లో 23 ఓవర్లు బౌలింగ్ వేసిన జడ్డూ.. 68 పరుగులు ఇచ్చి ఒక్క వికెట్ కూడా తీయలేకపోయాడు. ఇక రెండో ఇన్నింగ్స్లోనూ అతడు విఫలం చెందాడు. ముఖ్యంగా ఫలితాన్ని తేల్చే మంగళవారం నాటి ఐదో రోజు ఆటలో భాగంగా జడ్డూ స్థాయికి తగ్గట్లు బౌలింగ్ చేయలేకపోయాడు.ముఖ్యంగా ఎడమచేతి వాటం బ్యాటర్ల పని పట్టడంలో ఈ లెఫ్టార్మ్ స్పిన్నర్ విఫలమయ్యాడు. అతడి బౌలింగ్లో ఇంగ్లండ్ బ్యాటర్లు తొలి రెండు సెషన్లలో రివర్స్ స్వీప్ షాట్లతో తేలికగా పరుగులు పిండుకున్నారు. బెన్ డకెట్ శతకం (149)తో చెలరేగగా.. టీ బ్రేక్ తర్వాత పాత బడిన పిచ్పై జడ్డూ మ్యాజిక్ చేయగలిగాడు. బెన్ స్టోక్స్ (33)ను ఎట్టకేలకు పెవిలియన్కు పంపాడు.అనుభవం ఉండి ఏం లాభం?ఈ విషయంపై భారత మాజీ వికెట్ కీపర్ బ్యాటర్ దినేశ్ కార్తిక్ స్పందిస్తూ.. ‘‘జడేజా రఫ్సైడ్ వేయకుండా స్ట్రెయిట్గా బౌల్ చేశాడు. అది నన్ను ఆశ్చర్యపరిచింది. అన్ఈవెన్ పిచ్పై తన పాత్ర పోషించడంలో విఫలమయ్యాడు.అనుభవం ఉన్న ఆటగాడు అతడు. అయినా.. ఇలా ఎందుకు ఎలా చేశాడో తెలియదు. వైడ్ ఆఫ్ ది వికెట్ వేయాల్సింది. సరైన చోట బంతులు వేయడంలో జడ్డూ విఫలమయ్యాడు’’ అని విమర్శించాడు.కాగా తొలి టెస్టులో ఓటమితో గిల్ సేన ఐదు మ్యాచ్ల టెస్టు సిరీస్లో 0-1తో వెనుకబడింది. ఇక ఇంగ్లండ్- భారత్ మధ్య జూలై 2- జూలై 6 వరకు బర్మింగ్హామ్లోని ఎడ్జ్బాస్టన్ మైదానంలో రెండో టెస్టు నిర్వహించేందుకు షెడ్యూల్ ఖరారైంది.భారత్ వర్సెస్ ఇంగ్లండ్ తొలి టెస్టు స్కోర్లుభారత్ స్కోర్లు: 471 & 364ఇంగ్లండ్ స్కోర్లు: 465 & 373/5ఫలితం: ఐదు వికెట్ల తేడాతో ఇంగ్లండ్ చేతిలో భారత జట్టు ఓటమి.చదవండి: ఏ ఒక్కరినో తప్పుబట్టను.. కెప్టెన్ నిర్ణయం ప్రకారమే అలా చేశాం: గంభీర్#BenDuckett’s brilliant 149 set the tone for England’s highest successful chase at Leeds and their second-highest in Test history.👉 Relive the innings that turned the tide in the 1st Test : https://t.co/MhwlN52U7s#ENGvIND 👉🏻 2nd TEST | WED, 2nd JULY, 2.30 PM on JioHotstar pic.twitter.com/1uRcpT5vRE— Star Sports (@StarSportsIndia) June 24, 2025 -
గిల్ అసంతృప్తి.. జడ్డూ చర్య వైరల్!.. ఆఖరికి మేమే గెలిచాం!
ఇంగ్లండ్తో తొలి టెస్టు (Ind vs Eng 1st Test)లో ఐదో రోజు తొలి సెషన్లో టీమిండియాకు కలిసిరాలేదు. లీడ్స్ (Leeds)లో భారత్ విధించిన 371 పరుగుల లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో ఆతిథ్య జట్టు నిలకడగా ముందుకు సాగుతోంది. ఓపెనర్లు జాక్ క్రాలే, బెన్ డకెట్ క్రీజులో పాతుకుపోగా.. ఈ జోడీని విడదీసేందుకు భారత బౌలర్లు ఎంతగా ప్రయత్నించినా అనుకున్న ఫలితం రాబట్టలేకపోయారు.లంచ్ బ్రేక్కు వెళ్లేసరికి ఇలా..దీంతో.. ఓవర్ నైట్ స్కోరు 21/0తో మంగళవారం నాటి ఐదో రోజు ఆట మొదలుపెట్టిన ఇంగ్లండ్.. భోజన విరామ సమయానికి ముప్పై ఓవర్ల ఆట పూర్తి చేసుకుని వికెట్ నష్టపోకుండా 117 పరుగులు సాధించింది. లంచ్ బ్రేక్కు వెళ్లేసరికి జాక్ క్రాలే 42, బెన్ డకెట్ 64 పరుగులతో క్రీజులో ఉన్నారు.శుబ్మన్ గిల్ అసంతృప్తిఇక ఎంతగా ప్రయత్నించినప్పటికీ క్రాలే, డకెట్ను అవుట్ చేయడం సాధ్యం కాకపోవడంతో భారత శిబిరంలో అసంతృప్తి నెలకొంది. బౌలర్లతో పాటు కెప్టెన్ శుబ్మన్ గిల్ కూడా అసంతృప్తికి లోనయ్యాడు. బంతి ఆకారం మారిందని, దానిని మార్చి కొత్త బంతి ఇవ్వాలని ఫీల్డ్ అంపైర్లు క్రిస్ గఫానీ, పాల్ రీఫిల్లకు భారత ఆటగాళ్లు కేఎల్ రాహుల్, సిరాజ్ తదితరులు విజ్ఞప్తి చేశారు.కెప్టెన్ గిల్ కూడా వారి వద్దకు వెళ్లి మర్యాదపూర్వకంగా, నవ్వులు చిందిస్తూ బంతిని మార్చమని అడిగాడు. కానీ అంపైర్లు మాత్రం ఇందుకు అంగీకరించలేదు. అయితే, టీమిండియా పట్టుబట్టడంతో గేజ్ టెస్టులో బంతి ఆకారం మారినట్లు తేలింది. దీంతో అంపైర్లు కొత్త బంతి ఇవ్వక తప్పని పరిస్థితి.జడ్డూ చర్య వైరల్ఈ నేపథ్యంలో భారత స్పిన్ బౌలింగ్ ఆల్రౌండర్ రవీంద్ర జడేజా అంపైర్ వద్దకు వెళ్లి.. ‘‘చూశారా.. మేము చెప్పింది నిజం.. ఆఖరికి మాదే విజయం’’ అన్నట్లుగా పిడికిలి మడిచి సెలబ్రేట్ చేసుకున్నాడు. ఇందుకు బదులుగా అంపైర్ కూడా నవ్వులు చిందించాడు. ఇందుకు సంబంధించిన వీడియో వైరల్గా మారింది. ఏదేమైనా ఎట్టకేలకు కొత్త బంతిని తెచ్చుకోవడంలో టీమిండియా సఫలమైంది. ఇక భారమంతా బౌలర్లదే. ఇంగ్లండ్ను కట్టడి చేసి జట్టుకు విజయం అందించాల్సిన బాధ్యత వారిదే.ఇదిలా ఉంటే.. ఇంగ్లండ్ తొలి ఇన్నింగ్స్లో వైస్ కెప్టెన్ రిషభ్ పంత్ సైతం బంతిని మార్చమని అంపైర్లను కోరగా.. నిరాశే ఎదురైంది. దీంతో అతడు తన చేతిలో ఉన్న బంతిని నేలకేసి కొట్టగా.. అంతర్జాతీయ క్రికెట్ మండలి మందలించింది. ప్రవర్తనా నియమావళిని ఉల్లంఘించినందుకు అతడి ఖాతాలో ఓ డిమెరిట్ పాయింట్ జతచేసింది.ఇంగ్లండ్ వర్సెస్ భారత్ తొలి టెస్టు🏏షెడ్యూల్: జూన్ 20- 24🏏వేదిక: హెడింగ్లీ, లీడ్స్🏏టాస్: ఇంగ్లండ్.. తొలుత బౌలింగ్🏏భారత్ తొలి ఇన్నింగ్స్: 471 ఆలౌట్🏏ఇంగ్లండ్ తొలి ఇన్నింగ్స్: 465 ఆలౌట్🏏భారత్కు ఆరు పరుగుల ఆధిక్యం🏏భారత్ రెండో ఇన్నింగ్స్: 364 ఆలౌట్🏏ఇంగ్లండ్ లక్ష్యం: 371🏏నాలుగో రోజు ఆట ముగిసే సరికి ఇంగ్లండ్ స్కోరు: 21/0 (6) 🏏ఐదో రోజు భోజన విరామ సమయానికి ఇంగ్లండ్ స్కోరు: 117/0.చదవండి: వసీం అక్రం, షేన్ వార్న్ కాదు!.. నన్ను భయపెట్టింది ఆ బౌలరే: గంగూలీ.@imjadeja is all fired up as the umpire allows #TeamIndia a ball change! 🔄💥Is a breakthrough around the corner? Will the next two sessions bring the wickets India needs? 👀#ENGvIND 1st Test Day 5 LIVE NOW Streaming on JioHotstar 👉 https://t.co/0K41uhrKJ5 pic.twitter.com/qKMYKc6gDl— Star Sports (@StarSportsIndia) June 24, 2025 -
అడ్డుగోడలా..: జైస్వాల్, జడ్డూలపై సచిన్ ఫైర్!.. పోస్ట్ వైరల్
ఇంగ్లండ్తో తొలి టెస్టులో టీమిండియా ప్రధాన పేసర్ జస్ప్రీత్ బుమ్రా (Jasprit Bumrah) అదరగొడుతున్నాడు. లీడ్స్ వేదికగా ఆతిథ్య జట్టు మొదటి ఇన్నింగ్స్లో ఈ పేస్ గుర్రం ఐదు వికెట్లతో చెలరేగాడు. తద్వారా స్టోక్స్ బృందాన్ని 465 పరుగులకు కట్టడి చేయడంలో కీలక పాత్ర పోషించాడు. మరోసారి బౌలింగ్ విభాగం భారమంతా తన భుజాలపైనే వేసుకుని ముందుకు నడిపించాడు.అయితే, మిగతా బౌలర్ల నుంచి బుమ్రాకు అంతగా సహకారం లభించలేదు. మరోవైపు.. ఫీల్డర్ల తప్పిదాల కారణంగా బుమ్రా బౌలింగ్లో ఇంగ్లండ్ బ్యాటర్లు ఇచ్చిన దాదాపు ఐదు క్యాచ్లు నేలపాలయ్యాయి. శనివారం నాటి రెండో రోజు ఆటలో మూడు.. ఆదివారం నాటి మూడో రోజు ఆటలో రెండు క్యాచ్లను భారత ఫీల్డర్లు జారవిడిచారు.క్యాచ్లు నేలపాలు చేసిన జైసూ, జడ్డూముఖ్యంగా యువ ఆటగాడు యశస్వి జైస్వాల్ (Yashasvi Jaiswal) బుమ్రా బౌలింగ్లో ఇంగ్లండ్ ఓపెనర్ బెన్ డకెట్ (62), వన్డౌన్ బ్యాటర్, శతక వీరుడు ఓలీ పోప్ (106), మరో కీలక బ్యాటర్ హ్యారీ బ్రూక్ (99) ఇచ్చిన క్యాచ్లను నేలపాలు చేశాడు. మరోవైపు.. రవీంద్ర జడేజా (Ravindra Jadeja) కూడా బుమ్రా బౌలింగ్లో డకెట్ క్యాచ్ను జారవిడిచాడు. ఇదిలా ఉంటే.. బ్రూక్ను బుమ్రా డకౌట్ చేశాడని భావించగా.. అది నో బాల్గా తేలడం.. ఆ తర్వాత బ్రూక్ శతకానికి సమీపించడం జరిగాయి. ఈ నేపథ్యంలో టీమిండియా బ్యాటింగ్ దిగ్గజం సచిన్ టెండుల్కర్ జస్ప్రీత్ బుమ్రాను ప్రశంసిస్తూనే.. భారత ఫీల్డర్ల వైఫల్యాన్ని విమర్శిస్తూ ట్వీట్ చేశాడు. జైస్వాల్, జడ్డూలపై సచిన్ ఫైర్!‘‘బుమ్రాకు శుభాకాంక్షలు!.. ఒక నో బాల్.. మూడు జారవిడిచిన క్యాచ్లు నీకూ.. తొమ్మిది వికెట్లకు మధ్య అడ్డుగోడలా నిలిచాయి’’ అని పేర్కొన్నాడు.జైసూ, జడ్డూ ఫీల్డింగ్ తప్పిదాలతో, బ్రుక్కు వేసిన బంతి నో బాల్గా తేలనట్లయితే బుమ్రా ఖాతాలో మరో నాలుగు వికెట్లు చేరేవని.. తద్వారా అతడు తొమ్మిది వికెట్లు తీసేవాడని సచిన్ టెండుల్కర్ పరోక్షంగా వ్యాఖ్యానించాడు. ఎవరి వికెట్లు తీశాడంటే?కాగా ఇంగ్లండ్ ఇన్నింగ్స్లో బుమ్రా 24.4 ఓవర్ల బౌలింగ్లో 83 పరుగులు (3.40 ఎకానమీ) ఇచ్చి ఐదు వికెట్లు కూల్చాడు. ఇందులో నాలుగు నో బాల్స్ ఉన్నాయి. ఇక ఇంగ్లండ్ బ్యాటర్లలో బుమ్రా.. జాక్ క్రాలే (4), బెన్ డకెట్ (62), జో రూట్ (28), క్రిస్ వోక్స్(38), జోష్ టంగ్ (11) వికెట్లు పడగొట్టాడు. ఇందులో డకెట్తో పాటు.. వోక్స్, టంగ్లను బుమ్రా బౌల్డ్ చేశాడు.ఇక భారత్- ఇంగ్లండ్ మధ్య టెస్టు సిరీస్ను గతంలో పటౌడీ ట్రోఫీ అని పిలిచేవారన్న విషయం తెలిసిందే. అయితే, తాజా సిరీస్ నుంచి దీనికి టెండుల్కర్-ఆండర్సన్ ట్రోఫీగా నామకరణం చేసింది ఇంగ్లండ్ క్రికెట్ బోర్డు. ఇందులో భాగంగా ఇరుజట్ల మధ్య ఐదు టెస్టులు జరుగనున్నాయి. ప్రపంచ టెస్టు చాంపియన్షిప్ 2025-27 సైకిల్లో టీమిండియా- ఇంగ్లండ్కు ఇదే తొలి సిరీస్ కావడం గమనార్హం. ఇక ఈ సిరీస్తోనే భారత టెస్టు జట్టు కొత్త కెప్టెన్గా శుబ్మన్ గిల్ తన ప్రయాణం ఆరంభించాడు.భారత్ వర్సెస్ ఇంగ్లండ్ తొలి టెస్టు (జూన్ 20-24)🏏వేదిక: హెడింగ్లీ, లీడ్స్🏏టాస్: ఇంగ్లండ్.. తొలుత బౌలింగ్🏏టీమిండియా తొలి ఇన్నింగ్స్: 471 ఆలౌట్ (జైస్వాల్ (101), గిల్ (147), రిషభ్ పంత్ (134) శతకాలు)🏏ఇంగ్లండ్ తొలి ఇన్నింగ్స్: 465 ఆలౌట్ (ఓలీ పోప్ (106) శతకం)🏏ఆదివారం నాటి మూడో రోజు ఆట ముగిసేసరికి: టీమిండియా స్కోరు: 90/2 (23.5).. 96 పరుగుల ఆధిక్యం.చదవండి: అతడిపై నమ్మకం లేనపుడు.. ఎందుకు ఎంపిక చేశారు?: భారత మాజీ క్రికెటర్ Congratulations Bumrah!A no-ball and 3 missed chances stood between you and 𝙣𝙖𝙪 wickets. 🤪 pic.twitter.com/09rJNI9KP0— Sachin Tendulkar (@sachin_rt) June 22, 2025 -
డబ్ల్యూటీసీ 2023-25 అత్యుత్తమ జట్టు ఇదే.. ఛాంపియన్ జట్టు నుంచి ఒక్కరికే అవకాశం
9 జట్లతో రెండేళ్ల పాటు సాగిన వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్ 2023-25 సైకిల్ మే 14న ముగిసింది. ఈ సైకిల్లో అత్యుత్తమ ప్రదర్శన కనబర్చిన ఆస్ట్రేలియా, సౌతాఫ్రికా ఫైనల్స్కు చేరాయి. లార్డ్స్ వేదికగా జరిగిన టైటిల్ పోరులో సౌతాఫ్రికా డిఫెండింగ్ ఛాంపియన్ ఆస్ట్రేలియాకు షాకిచ్చి విజేతగా అవతరించింది. తద్వారా సౌతాఫ్రికా 27 తర్వాత తొలి ఐసీసీ టైటిల్ సాధించింది. ఈ టైటిల్ సౌతాఫ్రికాకు తొలి ప్రపంచ టైటిల్. 1998లో ఆ జట్టు గ్రేమ్ స్మిత్ నేతృత్వంలో ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ నెగ్గింది. తాజాగా ముగిసిన సైకిల్లో సౌతాఫ్రికా విజేతగా ఆవిర్భవించడంతో డబ్ల్యూటీసీ ప్రారంభమైన సీజన్ నుంచి వరుసగా మూడు సీజన్లలో మూడు కొత్త ఛాంపియన్ జట్లు అవతరించినట్లైంది.అరంగేట్రం ఎడిషన్ ఫైనల్లో (2019-21) న్యూజిలాండ్ భారత్ను ఓడించి విజేతగా నిలువగా.. రెండో ఎడిషన్ ఫైనల్లో (2021-23) ఆస్ట్రేలియా భారత్ను ఓడించి విజేతగా అవతరించింది. తాజాగా జరిగిన మూడో ఎడిషన్లో (2023-25) సౌతాఫ్రికా ఆసీస్ను చిత్తు చేసి టెస్ట్ ఛాంపియన్షిప్ను చేజిక్కించుకుంది. తొలి రెండు ఎడిషన్లలో ఫైనల్స్కు చేరిన భారత్ తాజాగా ముగిసిన సీజన్లో మూడో స్థానంతో సరిపెట్టుకుంది.వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్ 2023-25 ముగిసిన నేపథ్యంలో ఈ ఎడిషన్ అత్యుత్తమ జట్టు ఇదే అంటూ సోషల్మీడియాలో జోరుగా ప్రచారం జరుగుతుంది. గత ఎడిషన్లో అత్యుత్తమ ప్రదర్శలు చేసిన ఆటగాళ్లను ఈ జట్టుకు ఎంపిక చేసినట్లు తెలుస్తుంది. డబ్ల్యూటీసీ టీమ్ ఆఫ్ ద టోర్నమెంట్కు కెప్టెన్గా ఆసీస్ సారధి పాట్ కమిన్స్ ఎంపికయ్యాడు. ఈ జట్టులో టీమిండియా, ఆసీస్ నుంచి తలో ముగ్గురు, ఇంగ్లండ్ నుంచి ఇద్దరు, న్యూజిలాండ్, శ్రీలంక, సౌతాఫ్రికా నుంచి ఒక్కొక్కరు చోటు దక్కించుకున్నారు.ఈ జట్టు ఓపెనర్లుగా టీమిండియా యువ ఆటగాడు యశస్వి జైస్వాల్, ఇంగ్లండ్ ఆటగాడు బెన్ డకెట్ ఎంపికయ్యారు. వన్డౌన్లో రూట్, నాలుగో స్థానంలో విలియమ్సన్, ఐదో ప్లేస్లో కమిందు మెండిస్ అవకాశాలు దక్కించుకున్నారు. వికెట్కీపర్గా అలెక్స్ క్యారీ, ఆల్రౌండర్ కోటాలో రవీంద్ర జడేజా, పేసర్లుగా కమిన్స్, రబాడ, బుమ్రా, స్పెషలిస్ట్ స్పిన్నర్గా నాథన్ లయోన్ ఎంపికయ్యారు. ఛాంపియన్ జట్టు సౌతాఫ్రికా నుంచి ఈ జట్టుకు కేవలం ఒక్కరు మాత్రమే (రబాడ) ఎంపికయ్యారు. ఫాబ్ ఫోర్లో ముఖ్యుడైన విరాట్ కోహ్లి ఇటీవలే టెస్ట్లకు రిటైర్మెంట్ ప్రకటించడంతో అతనికి చోటు దక్కలేదు. ఆశ్చర్యకరంగా ఫాబ్ ఫోర్లోని మరో ఆటగాడు స్టీవ్ స్మిత్కు కూడా ఈ జట్టులో చోటు దక్కలేదు. ఈ జట్టులో చోటు దక్కని మరికొంత మంది అర్హులు కూడా ఉన్నారు. ఇంగ్లండ్కు చెందిన హ్యారీ బ్రూక్, ఆసీస్ స్పీడ్ గన్ మిచెల్ స్టార్క్, టీమిండియా స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్, లంక స్పిన్నర్ ప్రభాత్ జయసూర్య కూడా ఈ జట్టులో చోటు దక్కించుకునేందుకు అర్హులే. డబ్ల్యూటీసీ 2023-25 టీమ్ ఆఫ్ ద టోర్నమెంట్..యశస్వి జైస్వాల్, బెన్ డకెట్, జో రూట్, కేన్ విలియమ్సన్, కమిందు మెండిస్, అలెక్స్ క్యారీ (వికెట్కీపర్), రవీంద్ర జడేజా, పాట్ కమిన్స్ (కెప్టెన్), కగిసో రబాడ, జస్ప్రీత్ బుమ్రా, నాథన్ లయోన్ -
ఇంగ్లండ్తో తొలి టెస్టు.. భారత తుది జట్టు ఇదే! జడేజాకు నో ఛాన్స్?
భారత్-ఇంగ్లండ్ మధ్య ఐదు మ్యాచ్ల టెస్టు సిరీస్ ఆరంభానికి కేవలం వారం రోజుల సమయం మాత్రమే మిగిలి ఉంది. ఈ సిరీస్లో భాగంగా తొలి టెస్టు లీడ్స్ వేదికగా జూన్ 20 నుంచి 24 వరకు జరగనుంది. ఇప్పటికే ఇంగ్లండ్ గడ్డపై అడుగుపెట్టిన భారత జట్టు నెట్స్లో తీవ్రంగా శ్రమిస్తోంది.ఈ మ్యాచ్లో ఎలాగైనా గెలిచి సిరీస్లో శుభారంభం చేయాలని శుబ్మన్ గిల్ సారథ్యంలోని టీమిండియా భావిస్తోంది. ఈ క్రమంలో తొలి టెస్టు కోసం టీమిండియా ప్లేయింగ్ ఎలెవన్ను భారత మాజీ బ్యాటింగ్ కోచ్ సంజయ్ బంగర్ ఎంచుకున్నాడు. బంగర్ తన ఎంపిక చేసిన తుది జట్టులో ఓపెనర్లగా యశస్వి జైశ్వాల్, కేఎల్ రాహుల్కు అవకాశమిచ్చాడు.రోహిత్ శర్మ స్ధానంలో ఓపెనర్గా రాహుల్ సరైనోడని స్టార్ స్పోర్ట్స్ చర్చాకార్యక్రమంలో బంగర్ అభిప్రాయపడ్డాడు. అదేవిధంగా ఫస్ట్ డౌన్లో ఆన్క్యాప్డ్ ప్లేయర్ అభిమన్యు ఈశ్వరన్కు అతడు ఛాన్స్ ఇచ్చాడు. ఇక నాలుగో స్ధానంలో కెప్టెన్ శుబ్మన్ గిల్ బ్యాటింగ్కు రావాలని సంజయ్ సూచించాడు.ఇక ఎనిమిదేళ్ల తర్వాత రీఎంట్రీ ఇచ్చిన కరుణ్ నాయర్కు ఐదో స్ధానంలో ఈ భారత మాజీ క్రికెటర్ చోటు ఇచ్చాడు. ఈ జట్టులో వికెట్ కీపర్గా రిషబ్ పంత్, ఆల్రౌండర్ కోటాలో నితీష్ కుమార్ రెడ్డిలకు స్ధానం దక్కింది. స్పెషలిస్టు స్పిన్నర్గా కుల్దీప్ యాదవ్.. ఫాస్ట్ బౌలర్ల కోటాలో జస్ప్రీత్ బుమ్రా, ప్రసిద్ద్ కృష్ణ, సిరాజ్ను బంగర్ ఎంపిక చేశాడు.అయితే ఈ మాజీ బ్యాటింగ్ కోచ్ ఎంపిక చేసిన జట్టులో స్టార్ ఆల్రౌండర్ రవీంద్ర జడేజాకు చోటు దక్కకపోవడం గమనార్హం. జడేజాతో పాటు యువ సంచలనం సాయిసుదర్శన్ను కూడా అతడు పరిగణలోకి తీసుకోలేదు.ఇంగ్లండ్తో తొలి టెస్టుకు బంగర్ ఎంచుకున్న భారత తుది జట్టుయశస్వి జైశ్వాల్, కేఎల్ రాహుల్, అభిమన్యు ఈశ్వరన్, శుబ్మన్ గిల్(కెప్టెన్), కరుణ్ నాయర్, రిషబ్ పంత్, నితీష్ కుమార్ రెడ్డి, కుల్దీప్ యాదవ్,జస్ప్రీత్ బుమ్రా, ప్రసిద్ద్ కృష్ణ, సిరాజ్చదవండి: Wtc Final 2025: నిలకడగా ఆడుతున్న బావుమా, బెడింగ్హామ్ -
శుబ్మన్ గిల్, పంత్ కాదు.. అతడి టెస్టు కెప్టెన్ చేయండి: అశ్విన్
ఇంగ్లండ్ పర్యటనకు ముందు టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ టెస్టులకు రిటైర్మెంట్ ప్రకటించిన సంగతి తెలిసిందే. దీంతో భారత తదుపరి టెస్టు కెప్టెన్ ఎవరన్న చర్చ మొదలైంది. టెస్టు కెప్టెన్సీ రేసులో యువ ఓపెనర్ శుబ్మన్ గిల్ ముందుంజలో ఉన్నాడు. కెప్టెన్గా గిల్ ఎంపిక దాదాపు ఖాయమైందని వార్తలు వినిపిస్తున్నాయి. అయితే టీమిండియా తదుపరి కెప్టెన్ గిల్ అన్న ఊహాగానాలపై భిన్నభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి.కొంతమంది మాజీలు సంతృప్తి వ్యక్తం చేస్తూంటే.. మరి కొంత మంది సీనియర్ ఆటగాడిని కెప్టెన్గా చేయాలని బీసీసీఐని సూచిస్తున్నారు. ఈ క్రమంలో టీమిండియా స్పిన్ దిగ్గజం రవిచంద్రన్ అశ్విన్ తన అభిప్రాయాన్ని వెల్లడించాడు. స్టార్ ఆల్రౌండర్ రవీంద్ర జడేజాను భారత కెప్టెన్గా ఎంపిక చేయాలని అశ్విన్ సూచించాడు.."ప్రస్తుత భారత జట్టులో రవీంద్ర జడేజా అత్యంత అనుభవజ్ఞుడైన ఆటగాడు. అతడిని కూడా కెప్టెన్సీ ఎంపికగా పరిగణించాలి. మీరు కొత్త ఆటగాడికి శిక్షణ ఇచ్చి తర్వాత కెప్టెన్గా చేయాలని భావిస్తుంటే.. సారథిగా మీకు జడేజా బెస్ట్ ఛాయిస్. జడేజా రెండేళ్ల పాటు జట్టుకు నాయకత్వం వహించవచ్చు. జడ్డూకు డిప్యూటీగా మీరు ఎవరినైతే కెప్టెన్గా చేయాలనకుంటున్నారో వారిని నియమించండి. అప్పుడు అతడు మరింత రాటుదేలుతాడు. భారత జట్టుకు కెప్టెన్ కావడం ప్రతి ఆటగాడి కల. జడేజాకు అవకాశమిస్తే అతడు కచ్చితంగా స్వీకరిస్తాడని" అశ్విన్ తన యూట్యూబ్ ఛానల్లో పేర్కొన్నాడు.అదేవిధంగా శుబ్మన్ గిల్పై కూడా అశూ ప్రశంసల వర్షం కురిపించాడు. ఐపీఎల్-2025లో గుజరాత్ టైటాన్స్ ఐపీఎల్ ప్లేఆఫ్స్కు అర్హత సాధిస్తుందని నేను ఆశిస్తున్నాను. గిల్ అక్కడ జట్టును గెలిపిస్తే.. కెప్టెన్గా పరిపక్వత సాధించినట్లు అవుతోంది. అయితే టెస్టుల్లో కెప్టెన్సీ అంత సలువు కాదు. ఒక కెప్టెన్గా ఫస్ట్-క్లాస్ క్రికెట్లో కూడా ఏమి జరుగుతుందో తెలుసుకోవాలని అశ్విన్ అన్నాడు.చదవండి: IND vs ENG: ఇంగ్లండ్ టూర్కు భారత జట్టు ప్రకటన.. విధ్వంసకర ఓపెనర్ రీ ఎంట్రీ -
చరిత్ర సృష్టించిన రవీంద్ర జడేజా.. దిగ్గజాలకు సైతం సాధ్యం కాని ఘనత సాధించాడు
టీమిండియా ఆల్రౌండర్ రవీంద్ర జడేజా చరిత్ర సృష్టించాడు. ఐసీసీ టెస్ట్ ఆల్రౌండర్ల ర్యాంకింగ్స్లో అత్యధిక కాలం టాప్ ర్యాంక్లో కొనసాగిన ఆటగాడిగా అవతరించాడు. ఇవాళ (మే 14) విడుదల చేసిన ర్యాంకింగ్స్ల జడేజా టాప్ ప్లేస్ను నిలబెట్టుకున్నాడు. ప్రస్తుతం జడేజా ఖాతాలో 400 రేటింగ్ పాయింట్లు ఉన్నాయి. 2022, మార్చి 9న విండీస్ ఆటగాడు జేసన్ హెల్డర్ను గద్దె దించి అగ్రపీఠాన్ని అధిరోహించిన జడ్డూ.. 1152 రోజుల పాటు (38 నెలలకు పైగా) టాప్ ర్యాంక్డ్ టెస్ట్ ఆల్రౌండర్గా కొనసాగాడు. టెస్ట్ క్రికెట్ చరిత్రలో దిగ్గజ ఆల్రౌండర్లైన జాక్ కల్లిస్, కపిల్ దేవ్, ఇమ్రాన్ ఖాన్కు కూడా ఇది (ఇంతకాలం) సాధ్యం కాలేదు.36 ఏళ్ల జడ్డూ 2022 మార్చి నుంచి 23 టెస్ట్లు ఆడి 36.71 సగటున 1175 పరుగులు చేశాడు. ఇందులో మూడు సెంచరీలు, ఐదు అర్ద సెంచరీలు ఉన్నాయి. బౌలింగ్లో జడ్డూ 22.34 సగటున 91 వికెట్లు పడగొట్టాడు. ఇందులో ఆరు 5 వికెట్ల ప్రదర్శనలు, రెండు 10 వికెట్ల ప్రదర్శనలు ఉన్నాయి. తాజా ర్యాంకింగ్స్లో జడేజా, తర్వాతి స్థానాల్లో మెహిది హసన్ మిరాజ్ (బంగ్లాదేశ్), మార్కో జన్సెన్ (సౌతాఫ్రికా), పాట్ కమిన్స్ (ఆస్ట్రేలియా), షకీబ్ అల్ హసన్ (బంగ్లాదేశ్) ఉన్నారు. మెహిది హసన్ ఇటీవల బంగ్లాదేశ్తో జరిగిన టెస్ట్ మ్యాచ్లో సెంచరీ సహా 5 వికెట్ల ప్రదర్శన నమోదు చేసి జన్సెన్ను కిందికి దించి రెండో స్థానానికి ఎగబాకాడు. మెహిది హసన్కు జడేజాకు మధ్య 73 రేటింగ్ పాయింట్ల వ్యత్యాసం ఉంది.ప్రస్తుతం ఐపీఎల్తో బిజీగా ఉన్న జడేజా జూన్లో ఇంగ్లండ్తో జరుగబోయే టెస్ట్ సిరీస్లో బరిలోకి దిగే అవకాశం ఉంది. 2024 టీ20 వరల్డ్కప్ తర్వాత పొట్టి క్రికెట్కు రిటైర్మెంట్ ప్రకటించిన అతను.. టెస్ట్, వన్డేల్లో కొనసాగుతున్నాడు. గత కొంతకాలంగా అత్యుత్తమ ప్రదర్శన కనబరుస్తున్న జడేజా 2024 ఐసీసీ టెస్ట్ జట్టులో చోటు దక్కించుకున్నాడు. -
KKR Vs CSK: చరిత్ర సృష్టించిన రవీంద్ర జడేజా
వెటరన్ ఆల్రౌండర్ రవీంద్ర జడేజా చరిత్ర సృష్టించాడు. ఐపీఎల్లో సీఎస్కే తరఫున ఆల్టైమ్ లీడింగ్ వికెట్ టేకర్గా అవతరించాడు. ఐపీఎల్ 2025లో భాగంగా కేకేఆర్తో ఇవాళ (మే 7) జరుగుతున్న మ్యాచ్లో ఈ ఘనత సాధించాడు. ఈ మ్యాచ్లో తన కోటా 4 ఓవర్లు వేసిన జడేజా కీలకమైన రహానే వికెట్ తీశాడు. సీఎస్కే తరఫున లీడింగ్ వికెట్ టేకర్గా అవతరించే క్రమంలో జడేజా డ్వేన్ బ్రావోను అధిగమించాడు. ఐపీఎల్లో జడేజా సీఎస్కే తరఫున 184 మ్యాచ్ల్లో 141 వికెట్లు సాధించగా.. బ్రావో 116 మ్యాచ్ల్లో 140 వికెట్లు తీశాడు.ఐపీఎల్లో సీఎస్కే తరఫున అత్యధిక వికెట్లు తీసిన బౌలర్లు..141* - రవీంద్ర జడేజా (184 మ్యాచ్లు)140 - డ్వేన్ బ్రావో (116 మ్యాచ్లు)95 - ఆర్ అశ్విన్ (104 మ్యాచ్లు)76 - దీపక్ చాహర్ (76 మ్యాచ్లు)76 - ఆల్బీ మోర్కెల్ (78 మ్యాచ్లు)60 - శార్దూల్ ఠాకూర్ (57 మ్యాచ్లు)58 - మోహిత్ శర్మ (48 మ్యాచ్లు)మ్యాచ్ విషయానికొస్తే.. టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ చేసిన కేకేఆర్ నామమాత్రపు స్కోర్కే పరిమితమైంది. ఆ జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 179 పరుగులు చేసింది. నూర్ అహ్మద్ 4 వికెట్లు తీసి కేకేఆర్ను దెబ్బేశాడు. అన్షుల్ కంబోజ్, జడేజా తలో వికెట్ తీశారు. కేకేఆర్ ఇన్నింగ్స్లో రహానే (48), మనీశ్ పాండే (36 నాటౌట్), రసెల్ (38) ఓ మోస్తరు స్కోర్లు చేయగా.. సునీల్ నరైన్ 26, గుర్భాజ్ 11, రఘువంశీ 1, రింకూ సింగ్ 9 పరుగులు చేసి ఔటయ్యారు.కాగా, ఈ సీజన్లో సీఎస్కే కథ ముగిసిన విషయం తెలిసిందే. ఆ జట్టు ఇప్పటికే ప్లే ఆఫ్స్ రేసు నుంచి నిష్క్రమించింది. ప్రస్తుతం ఆ జట్టు పాయింట్ల పట్టికలో చివరి స్థానంలో ఉంది. ఈ సీజన్లో ఆడిన 11 మ్యాచ్ల్లో రెండే విజయాలు సాధించింది.కేకేఆర్ విషయానికొస్తే.. ఈ జట్టు ప్లే ఆఫ్స్ బెర్త్ కోసం ఇంకా పోటీలో ఉంది. ప్రస్తుతం ఆ జట్టు పాయింట్ల పట్టికలో ఆరో స్థానంలో ఉంది. ఇప్పటివరకు ఆడిన 11 మ్యాచ్ల్లో 5 విజయాలతో 11 పాయింట్లు సాధించింది. ఓ మ్యాచ్ వర్షం కారణంగా రద్దు కావడంతో ఓ పాయింట్ వచ్చింది. కేకేఆర్ ఈ మ్యాచ్తో కలుపుకుని ఆడాల్సిన మూడు మ్యాచ్ల్లో గెలిస్తే ప్లే ఆఫ్స్ రేసులో ఉంటుంది. -
టాప్లో కొనసాగుతున్న జడేజా.. అగ్రస్థానం దిశగా దూసుకొచ్చిన బంగ్లా ఆల్రౌండర్
ఐసీసీ తాజాగా విడుదల చేసిన టెస్ట్ ర్యాంకింగ్స్లో భారత ఆటగాళ్లు తమ ర్యాంక్లను పదిలంగా కాపాడుకున్నారు. బౌలర్ల విభాగంలో బుమ్రా టాప్ ప్లేస్ను నిలబెట్టుకోగా.. ఆల్రౌండర్ల విభాగంలో రవీంద్ర జడేజా అగ్రస్థానాన్ని పదిలం చేసుకున్నాడు. బ్యాటర్ల విభాగంలో జో రూట్ టాప్ ప్లేస్లో కొనసాగుతుండగా.. భారత బ్యాటర్లు యశస్వి జైస్వాల్ (4), రిషబ్ పంత్ (10), టాప్-10లో తమ స్థానాలను నిలబెట్టుకున్నారు.ఆటగాళ్లంతా ఐపీఎల్లో బిజీగా ఉండటం చేత ఈ వారం ర్యాంకింగ్స్లో చెప్పుకోదగ్గ మార్పులేమీ జరగలేదు. ఈ మధ్యలో బంగ్లాదేశ్, జింబాబ్వే మాత్రమే రెండు మ్యాచ్ల టెస్ట్ సిరీస్ ఆడాయి. ఈ సిరీస్ 1-1తో డ్రాగా ముగిసింది. ఈ సిరీస్లో బంగ్లా ఆల్రౌండర్ మెహిది హసన్ ఆకాశమే హద్దుగా చెలరేగాడు. తొలి టెస్ట్లో 2 ఐదు వికెట్ల ప్రదర్శనలు సహా 10 వికెట్ల ఘనత.. రెండో టెస్ట్లో సెంచరీ సహా ఓ 5 వికెట్ల ప్రదర్శన నమోదు చేశాడు. ఈ ప్రదర్శనల కారణంగా మిరాజ్ ర్యాంకింగ్స్లో భారీగా లబ్ది పొందాడు. ఆల్రౌండర్ల విభాగంలో కెరీర్ బెస్ట్ రెండో ర్యాంకింగ్ సాధించి అగ్రపీఠం దిశగా దూసుకొచ్చాడు. బౌలింగ్, బ్యాటింగ్ విభాగాల్లోనూ మిరాజ్ ర్యాంకింగ్స్ను మెరుగుపర్చుకున్నాడు. బౌలింగ్లో రెండు స్థానాలు ఎగబాకి 24వ స్థానానికి చేరుకోగా.. బ్యాటింగ్ విభాగంలో 8 స్థానాలు మెరుగుపర్చుకుని 55వ స్థానానికి చేరాడు.టాప్-10 టెస్ట్ బ్యాటర్లు1. జో రూట్2. హ్యారీ బ్రూక్3. కేన్ విలియమ్సన్4. యశస్వి జైస్వాల్5. స్టీవ్ స్మిత్6. టెంబా బవుమా7. కమిందు మెండిస్8. ట్రవిస్ హెడ్9. ఉస్మాన్ ఖ్వాజా10. రిషబ్ పంత్టాప్-10 టెస్ట్ బౌలర్లు1. జస్ప్రీత్ బుమ్రా2. కగిసో రబాడ3. పాట్ కమిన్స్4. జోష్ హాజిల్వుడ్5. నాథన్ లియోన్6. నౌమాన్ అలీ7. మార్కో జన్సెన్8. మ్యాట్ హెన్రీ9. ప్రభాత్ జయసూర్య10. రవీంద్ర జడేజాటాప్-5 టెస్ట్ ఆల్రౌండర్లు1. రవీంద్ర జడేజా2. మెహిది హసన్ మిరాజ్3. మార్కో జన్సెన్4. పాట్ కమిన్స్5. షకీబ్ అల్ హసన్ -
RCB VS CSK: రాకాసి సిక్సర్ బాదిన జడేజా.. క్లాసెన్, రసెల్ కూడా సాధ్యం కాలేదు..!
సీఎస్కే ఆల్రౌండర్ రవీంద్ర జడేజా ప్రస్తుత ఐపీఎల్ సీజన్లో అత్యంత భారీ సిక్సర్ (109 మీటర్లు) కొట్టాడు. నిన్న (మే 3) ఆర్సీబీతో జరిగిన మ్యాచ్లో జడ్డూ ఈ ఘనత సాధించాడు. ఇన్నింగ్స్ 17వ ఓవర్ ఐదో బంతికి (ఛేదనలో) లుంగి ఎంగిడి వేసిన ఫుల్ టాస్ బంతిని జడేజా స్టేడియం పైకప్పు పైకి పంపించాడు. దీనికి సంబంధించిన వీడియో సోషల్మీడియాలో చక్కర్లు కొడుతుంది. 109m six! 👏Ravindra Jadeja hit a MONSTROUS maximum during his fighting knock of 77*(45)! 🔥 Watch his full knock▶️ https://t.co/76RyGG8wAn#TATAIPL | #RCBvCSK | @ChennaiIPL | @imjadeja pic.twitter.com/L5Lv6291pT— IndianPremierLeague (@IPL) May 3, 2025జడేజా బాదిన ఈ సిక్సర్కు ముందు ఈ సీజన్లో అత్యంత భారీ సిక్సర్ రికార్డు సన్రైజర్స్ ఆటగాడు హెన్రిచ్ క్లాసెన్ పేరిట ఉండేది. క్లాసెన్ ముంబై ఇండియన్స్తో జరిగిన మ్యాచ్లో 107 మీటర్ల సిక్సర్ బాదాడు. క్లాసెన్ తర్వాత ఈ సీజన్ బిగ్గెస్ట్ సిక్సర్ల రికార్డు ఆండ్రీ రసెల్, అభిషేక్ శర్మ పేరిట ఉంది. రసెల్ ఢిల్లీ క్యాపిటల్స్పై.. అభిషేక్ పంజాబ్పై 106 మీటర్ల భారీ సిక్సర్లు కొట్టారు. ఈ సీజన్లో ఐదో భారీ సిక్సర్ రికార్డు ఆర్సీబీ ఓపెనర్ ఫిల్ సాల్ట్ పేరిట ఉంది. సాల్ట్ గుజరాత్ టైటాన్స్తో జరిగిన మ్యాచ్లో 105 మీటర్ల సిక్సర్ కొట్టాడు.మ్యాచ్ విషయానికొస్తే.. జడేజా (45 బంతుల్లో 77 నాటౌట్; 8 ఫోర్లు, 2 సిక్సర్లు), ఆయుశ్ మాత్రే (48 బంతుల్లో 94; 9 ఫోర్లు, 5 సిక్సర్లు) అర్ద సెంచరీలతో చెలరేగినా ఆర్సీబీ చేతిలో సీఎస్కే 2 పరుగుల స్వల్ప తేడాతో ఓడింది.చివరి బంతి వరకు ఉత్కంఠగా సాగిన ఈ మ్యాచ్లో టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన ఆర్సీబీ.. జేకబ్ బేతెల్ (33 బంతుల్లో 55; 8 ఫోర్లు, 2 సిక్సర్లు), విరాట్ కోహ్లి (33 బంతుల్లో 62; 5 ఫోర్లు, 5 సిక్సర్లు), రొమారియో షెపర్ట్ (14 బంతుల్లో 53 నాటౌట్; 4 ఫోర్లు, 6 సిక్సర్లు) చెలరేగడంతో నిర్ణీత ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 213 పరుగులు చేసింది.సీఎస్కే బౌలర్లలో పతిరణ (4-0-36-3), నూర్ అహ్మద్ (4-0-26-1) అద్భుతంగా బౌలింగ్ చేయగా.. ఖలీల్ అహ్మద్ ధారాళంగా పరుగులు సమర్పించుకున్నాడు (3-0-65-0). ఖలీల్ వేసిన ఇన్నింగ్స్ 19వ ఓవర్లో షెపర్డ్ ఆకాశమే హద్దుగా చెలరేగిపోయి 4 సిక్సర్లు, 2 ఫోర్లు సహా 33 పరుగులు పిండుకున్నాడు. పతిరణ వేసిన చివరి ఓవర్లోనూ అదే జోరు కొనసాగించిన షెపర్డ్ ఆ ఓవర్లో 2 సిక్సర్లు, 2 ఫోర్లు సహా 21 పరుగులు రాబట్టాడు.అనంతరం 214 పరుగుల భారీ లక్ష్య ఛేదనకు దిగిన సీఎస్కే.. చివరి బంతి వరకు పోరాడి నిర్ణీత ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 211 పరుగులకే పరిమితమైంది. ఆయుశ్ మాత్రే, రవీంద్ర జడేజా సీఎస్కేను గెలిపించేందుకు విఫలయత్నం చేశారు.సీఎస్కే గెలుపుకు చివరి ఓవర్లో 15 పరుగులు అవసరం కాగా.. యశ్ దయాల్ అద్భుతంగా బౌలింగ్ చేసి 12 పరుగులు మాత్రమే ఇచ్చాడు. ఫలితంగా సీఎస్కే లక్ష్యానికి మూడు పరుగుల దూరంలో నిలిచిపోయింది. ఆర్సీబీ బౌలర్లలో ఎంగిడి 3 వికెట్లు తీయగా.. దయాల్, కృనాల్ చెరో వికెట్ దక్కించుకున్నారు. ఈ గెలుపుతో ఆర్సీబీ పాయింట్ల పట్టికలో అగ్రస్థానానికి చేరుకుంది. ప్లే ఆఫ్స్ రేసు నుంచి ఇదివరకే నిష్క్రమించిన సీఎస్కే ఈ ఓటమితో చివరి స్థానాన్ని మరింత సుస్థిరం చేసుకుంది. ఈ గెలుపుతో ఆర్సీబీ ప్లే ఆఫ్స్ బెర్త్ దాదాపుగా ఖరారైనట్లే. -
అందుకే రోహిత్, విరాట్, జడేజా ఏ ప్లస్లో ఉన్నారు..!
భారత క్రికెట్ కంట్రోల్ బోర్డు (బీసీసీఐ) నిన్న (ఏప్రిల్ 21) తమ సెంట్రల్ కాంట్రాక్ట్ (2024-25) ఆటగాళ్ల జాబితాను ప్రకటించింది. ఈ జాబితాలో రోహిత్ శర్మ, విరాట్ కోహ్లి, జస్ప్రీత్ బుమ్రా, రవీంద్ర జడేజా ఏ ప్లస్ కేటగిరీలో చోటు దక్కించుకున్నారు. నిబంధనల ప్రకారం ఓ ఆటగాడికి బీసీసీఐ ఏ ప్లస్ కాంట్రాక్ట్ లభించాలంటే అతను ఆల్ ఫార్మాట్ ప్లేయర్ అయ్యుండాలి. అయితే రోహిత్, విరాట్, జడేజా గతేడాది టీ20 వరల్డ్కప్ తర్వాత పొట్టి క్రికెట్కు గుడ్బై చెప్పి కేవలం వన్డేలు, టెస్ట్ల్లో మాత్రమే కొనసాగుతున్నారు. అయినా వారికి ఏ ప్లస్ కాంట్రాక్ట్ లభించింది. దీనిపై నిన్నటి నుంచి క్రికెట్ అభిమానుల్లో సందేహాలు ఉన్నాయి. టీ20లకు రిటైర్మెంట్ ప్రకటించినా వారిని ఎందుకు ఏ ప్లస్ కేటగిరీలో కొనసాగిస్తున్నారని సోషల్మీడియా వేదికగా డిస్కషన్స్ నడిచాయి. ఈ అంశంపై బీసీసీఐకి చెందిన ఓ కీలక అధికారి తాజాగా స్పందించాడు.రోహిత్, విరాట్, జడేజా ఆల్ ఫార్మాట్ ప్లేయర్లు కానప్పటికీ ఎందుకు ఏ ప్లస్ కేటగిరీలో ఉన్నారన్న విషయంపై వివరణ ఇచ్చాడు. 2024-25 సంవత్సరాని గానూ బీసీసీఐ సెంట్రల్ కాంట్రాక్ట్ వ్యవధి అక్టోబర్ 1, 2024 నుండి సెప్టెంబర్ 30, 2025 వరకు ఉంటుంది. అయితే దీని అసెస్మెంట్ సంవత్సరం మాత్రం అక్టోబర్ 1, 2023 నుండి సెప్టెంబర్ 30, 2024 మధ్యలో ఉంటుంది. ఆ వ్యవధిలో కోహ్లీ, రోహిత్ , జడేజా అన్ని ఫార్మాట్లలో రెగ్యులర్ సభ్యులుగా ఉన్నారు. జూన్ 2024లో భారత్ టీ20 ప్రపంచ కప్ గెలిచిన తర్వాత ఆ ముగ్గురు టీ20ల నుంచి తప్పుకున్నారు. ఈ సాంకేతికత ప్రకారం.. రోహిత్, విరాట్, జడేజా ఏ ప్లస్ కేటగిరీలో ఉన్నారని సదరు బీసీసీఐ అధికారి తెలిపారు.ఇదిలా ఉంటే, నిన్న ప్రకటించిన బీసీసీఐ సెంట్రల్ కాంట్రాక్ట్ ఆటగాళ్ల జాబితాలో మొత్తం 34 మంది చోటు దక్కించుకున్నారు. వీరిలో విరాట్ కోహ్లి, రోహిత్ శర్మ, రవీంద్ర జడేజా, జస్ప్రీత్ బుమ్రా తమ ఏ ప్లస్ కేటగిరీని రీటైన్ చేసుకోగా.. క్రమశిక్షణారాహిత్యం కారణంగా గతేడాది కాంట్రాక్ట్ కోల్పోయిన శ్రేయస్ అయ్యర్, ఇషాన్ కిషన్ కాంట్రాక్ట్ జాబితాలోకి రీ ఎంట్రీ ఇచ్చారు.శ్రేయస్ బి కేటగిరీలో, ఇషాన్ సి కేటగిరీలో చోటు దక్కించుకున్నారు. ఆంధ్ర ఆల్రౌండర్ నితీశ్ కుమార్ రెడ్డి, ఆర్సీబీ కెప్టెన్ రజత్ పాటిదార్, యువ పేసర్ హర్షిత్ రాణా తొలిసారి బీసీసీఐ సెంట్రల్ కాంట్రాక్ట్ పొందారు.ఈ ఏడాది కొత్తగా ఏడుగురు (ధృవ్ జురెల్, సర్ఫరాజ్ ఖాన్, నితీష్ కుమార్ రెడ్డి, అభిషేక్ శర్మ, ఆకాష్ దీప్, వరుణ్ చకరవర్తి, హర్షిత్ రాణా) సెంట్రల్ కాంట్రాక్ట్ దక్కించకున్నారు. శార్దూల్ ఠాకూర్, జితేష్ శర్మ, కేఎస్ భరత్, అవేష్ ఖాన్ తమ కాంట్రాక్ట్ను కోల్పోయారు. రిషబ్ పంత్కు బి నుంచి ఏ కేటగిరీకి ప్రమోషన్ లభించింది. టెస్ట్లకు రిటైర్మెంట్ ప్రకటించిన అశ్విన్ కాంట్రాక్ట్ను కోల్పోయాడు.ఏ ప్లస్లో విరాట్ కోహ్లి, రోహిత్ శర్మ, రవీంద్ర జడేజా, జస్ప్రీత్ బుమ్రా ఉన్నారు. వీరికి ఏడాది 7 కోట్ల రూపాయల శాలరీ లభించనుంది.గ్రేడ్-ఏలో సిరాజ్, కేఎల్ రాహుల్, శుభ్మన్ గిల్, హార్దిక్ పాండ్యా, షమీ, రిషబ్ పంత్ ఉన్నారు. వీరికి ఏడాదికి 5 కోట్ల రూపాయల శాలరీ లభించనుంది.గ్రేడ్-బిలో సూర్యకుమార్ యాదవ్, కుల్దీప్ యాదవ్, అక్షర్ పటేల్, యశస్వి జైస్వాల్, శ్రేయస్ అయ్యర్ ఉన్నారు. వీరికి ఏడాదికి 3 కోట్ల రూపాయలు శాలరీగా లభించనుంది.గ్రేడ్-సిలో రింకూ సింగ్, తిలక్ వర్మ, రుతురాజ్ గైక్వాడ్, శివం దూబే, రవి బిష్ణోయ్, వాషింగ్టన్ సుందర్, ముఖేష్ కుమార్, సంజు శాంసన్, అర్ష్దీప్ సింగ్, ప్రసిద్ కృష్ణ, రజత్ పాటిదార్, ధృవ్ జురెల్, సర్ఫరాజ్ ఖాన్, నితీష్ కుమార్ రెడ్డి, ఇషాన్ కిషన్, అభిషేక్ శర్మ, ఆకాష్ దీప్, వరుణ్ చక్రవర్తి, హర్షిత్ రాణా ఉన్నారు. వీరికి ఏడాదికి కోటి రూపాయలు శాలరీగా లభించనుంది. -
సీఎస్కే బౌలర్ ‘ఓవరాక్షన్’.. ఇచ్చిపడేసిన కోహ్లి! నవ్వేసిన జడ్డూ
ఐపీఎల్-2025లో భాగంగా రాయల్ చాలెంజర్స్ బెంగళూరు (RCB)- చెన్నై సూపర్ కింగ్స్ (CSK) మధ్య పోరు ఆద్యంతం ఆసక్తికరంగా సాగింది. ముఖాముఖి పోటీలో సీఎస్కేదే పైచేయి అయినా.. ఈసారి మాత్రం ఆర్సీబీ అదరగొట్టింది. చెన్నై కంచుకోటను బద్దలు కొట్టి 2008 తర్వాత మొదటిసారి చెపాక్లో జయకేతనం ఎగురవేసింది.టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన బెంగళూరు జట్టు నిర్ణీత 20 ఓవర్లలో ఏడు వికెట్ల నష్టానికి 196 పరుగులు సాధించింది. ఓపెనర్లు ఫిల్ సాల్ట్(32), విరాట్ కోహ్లి (Virat Kohli- 31) ఫర్వాలేదనిపించగా.. దేవదత్ పడిక్కల్(14 బంతుల్లో 27), కెప్టెన్ రజత్ పాటిదార్ (32 బంతుల్లో 51), టిమ్ డేవిడ్ (8 బంతుల్లో 22 నాటౌట్) రాణించారు.ఇక చెన్నై బౌలర్లలో నూర్ అహ్మద్ మూడు వికెట్లు తీయగా.. మతీశ పతిరణకు రెండు వికెట్లు దక్కాయి. మిగతా వాళ్లలో ఖలీల్ అహ్మద్, రవిచంద్రన్ అశ్విన్ ఒక్కో వికెట్ తమ ఖాతాలో వేసుకున్నారు. ఇక లక్ష్య ఛేదనలో చెన్నై 146 పరుగులకే పరిమితం కావడంతో ఆర్సీబీ 50 పరుగుల తేడాతో గెలుపొందింది. Back 2️⃣ back wins! 🔥Chat, how are we feeling? 🤩pic.twitter.com/8xT6VaS7hf— Royal Challengers Bengaluru (@RCBTweets) March 28, 2025 చెన్నై బ్యాటర్లలో రచిన్ రవీంద్ర (31 బంతుల్లో 41), రవీంద్ర జడేజా (19 బంతుల్లో 25), మహేంద్ర సింగ్ ధోని (16 బంతుల్లో 30 నాటౌట్) మాత్రమే చెప్పుకోదగ్గ స్కోర్లు చేశారు.జడేజాతో ముచ్చట్లుఇదిలా ఉంటే.. మ్యాచ్ ముగిసిన తర్వాత కోహ్లి.. చెన్నై స్టార్ రవీంద్ర జడేజాతో కలిసి ముచ్చట్లు పెట్టాడు. ఆ సమయంలో కోహ్లి కాస్త సీరియస్గా మాట్లాడుతున్నట్లు కనిపించగా.. జడ్డూ మాత్రం నవ్వులు చిందించాడు. ఇంతలో అక్కడికి చెన్నై పేసర్ ఖలీల్ అహ్మద్ రాగానే కోహ్లి మరింత సీరియస్ అయినట్లు కనిపించింది. అతడితో వాదనకు దిగిన కోహ్లి.. ఖలీల్ ఏం చెప్తున్నా పట్టించుకోకుండా తన పాటికి తాను ఏదో మాట్లాడుతూనే కనిపించాడు.కోహ్లి చేయి పట్టుకుని మరీ ఖలీల్ అతడిని అనునయించేందుకు ప్రయత్నించగా.. అతడు మాత్రం అందుకు సుముఖంగా కనిపించలేదు. ఇంతలో కోహ్లికి డ్రెస్సింగ్రూమ్ నుంచి పిలుపు రావడటంతో వెళ్లిపోయాడు. ఇందుకు సంబంధించిన దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి.సీఎస్కే బౌలర్ ‘ఓవరాక్షన్’కాగా చెన్నై బౌలింగ్ అటాక్ను ఆరంభించిన ఖలీల్.. ఆర్సీబీ ఇన్నింగ్స్లో మూడో ఓవర్ కూడా తానే వేశాడు. ఆ ఓవర్ తొలి బంతికే కోహ్లిని ఎల్బీడబ్ల్యూ(లెగ్ బిఫోర్ వికెట్) చేసినట్లుగా భావించిన ఖలీల్.. సంబరాలు మొదలుపెట్టేశాడు. కానీ ఫీల్డ్ అంపైర్ మాత్రం నాటౌట్ ఇచ్చాడు.అయితే, అంపైర్ నిర్ణయంతో సంతృప్తి చెందని ఖలీల్.. కెప్టెన్ రుతురాజ్ గైక్వాడ్ను ఒప్పించి డీఆర్ఎస్కు వెళ్లాడు. కానీ అక్కడ చెన్నైకి విరుద్ధంగా థర్డ్ అంపైర్ తీర్పు వచ్చింది. బంతి లెగ్ స్టంప్ ఆవలి దిశగా పిచ్ అయినట్లు స్పష్టంగా కనిపించింది. దీంతో కోహ్లి సేవ్ అవ్వగా.. సీఎస్కే ఓ రివ్యూను కోల్పోయింది. ఈ నేపథ్యంలో కోహ్లి ఇదే విషయమై ఖలీల్తో సీరియస్గా చర్చించి ఉంటాడని నెటిజన్లు అభిప్రాయపడుతున్నారు. చదవండి: MS Dhoni: బయటకు చెప్పరు గానీ.. ‘తలా’ వల్ల అందరికీ ఇబ్బందే! Kohli mere bacche shant hoja 😭😭 pic.twitter.com/yGITzOsOXr— n (@humsuffer_) March 29, 2025 -
ఇంత త్వరగా వస్తాడనుకోలేదు: ధోనిపై సెహ్వాగ్ ఘాటు విమర్శలు
చెన్నై సూపర్ కింగ్స్ (CSK) స్టార్ మహేంద్ర సింగ్ ధోని (MS Dhoni) ఆట తీరుపై టీమిండియా మాజీ క్రికెటర్ వీరేంద్ర సెహ్వాగ్ వ్యంగ్యాస్త్రాలు సంధించాడు. రాయల్ చాలెంజర్స్ బెంగళూరు (RCB)తో మ్యాచ్లో ‘తలా’ అంత త్వరగా బ్యాటింగ్కు వస్తాడని ఊహించలేదన్నాడు. ఇందుకు కారణమేమిటో తనకు అర్థంకాలేదంటూ సీఎస్కే బ్యాటర్లపై జోకులు వేశాడు.ఐపీఎల్-2025లో భాగంగా సీఎస్కే శుక్రవారం ఆర్సీబీతో తలపడింది. సొంతమైదానం చెపాక్లో టాస్ గెలిచిన చెన్నై.. ప్రత్యర్థిని తొలుత బ్యాటింగ్కు ఆహ్వానించింది. ఈ క్రమంలో ఆర్సీబీ నిర్ణీత 20 ఓవర్లలో ఏడు వికెట్లు నష్టపోయి 196 పరుగులు చేసింది. అయితే, లక్ష్య ఛేదనలో చెన్నై 146 పరుగులకే పరిమితమైంది.ఓపెనర్లలో రచిన్ రవీంద్ర (31 బంతుల్లో 41) ఫర్వాలేదనిపించగా.. రాహుల్ త్రిపాఠి (5) మరోసారి విఫలమయ్యాడు. వన్డౌన్లో వచ్చిన కెప్టెన్ రుతురాజ్ గైక్వాడ్ మరీ ఘోరంగా డకౌట్ అయ్యాడు. ఆ తర్వాతి స్థానాల్లో బ్యాటింగ్ చేసిన దీపక్ హుడా 4, సామ్ కర్రన్ 8, శివం దూబే 19 పరుగులకు వెనుదిరిగారు.తొమ్మిదో స్థానంలో ధోనిఈ క్రమంలో ఏడో స్థానంలో రవీంద్ర జడేజా (19 బంతుల్లో 25) రాగా.. రవిచంద్రన్ అశ్విన్(8 బంతుల్లో 11) ఎనిమిదో స్థానంలో బ్యాటింగ్ చేశాడు. ఇక పవర్ఫుల్ ఫినిషర్గా పేర్కొంది ధోని తొమ్మిదో నంబర్లో బ్యాట్తో రంగంలోకి దిగి 16 బంతుల్లో 30 పరుగులతో అజేయంగా నిలిచాడు. A never ending story 😊Last over 🤝 MS Dhoni superhits 🔥Scorecard ▶ https://t.co/I7maHMwxDS #TATAIPL | #CSKvRCB | @ChennaiIPL pic.twitter.com/j5USqXvf7r— IndianPremierLeague (@IPL) March 28, 2025అతడి ధనాధన్ ఇన్నింగ్స్లో మూడు ఫోర్లు, రెండు సిక్సర్లు ఉన్నాయి. అయితే, జట్టు క్లిష్ట పరిస్థితుల్లో ఉన్న వేళ ఆల్రౌండర్ల తర్వాత ధోని బ్యాటింగ్కు రావడంపై తీవ్ర స్థాయిలో విమర్శలు వస్తున్నాయి.43 ఏళ్ల ధోనిని కేవలం వికెట్ కీపర్ బ్యాటర్గా మాత్రమే జట్టులో ఉంచితే.. సీఎస్కే మున్ముందు మరిన్ని చేదు అనుభవాలు చూస్తుందనే హెచ్చరికలు వస్తున్నాయి. జట్టుకు అవసరమైన వేళనైనా తలా ఇంకాస్త ముందుగా బ్యాటింగ్కు రావాల్సిందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.ఈ నేపథ్యంలో భారత మాజీ క్రికెటర్లు వీరేంద్ర సెహ్వాగ్, మనోజ్ తివారి ధోనిపై క్రిక్బజ్ షోలో జోకులు వేశారు. సెహ్వాగ్ మాట్లాడుతూ.. ‘‘ఈసారి చాలా తొందరగానే బ్యాటింగ్కు వచ్చాడే!’’ అని సెటైర్ వేయగా.. ‘‘అవును.. నేనైతే అతడు పదో స్థానంలో వస్తాడేమో అనుకున్నా’’ అని బదులిచ్చాడు.అతడు తొందరగా బ్యాటింగ్కు వచ్చాడా?ఇందుకు స్పందిస్తూ.. ‘‘16 ఓవర్ల ఆట పూర్తైన తర్వాత వచ్చాడు. మామూలుగా అయితే, 19 లేదా 20వ ఓవర్లోనే అతడు బ్యాటింగ్కు వస్తాడు. అందుకే త్వరగా వచ్చాడని అన్నాను. మీకూ అలాగే అనిపిస్తోందా?అతడు తొందరగా బ్యాటింగ్కు వచ్చాడా? లేదంటే మిగతా బ్యాటర్లు త్వరత్వరగా వికెట్లు కోల్పోయి అతడిని రప్పించారా?’’ అని సెహ్వాగ్ వ్యంగ్యంగా కామెంట్లు చేశాడు. కాగా ధోని ఈ మ్యాచ్లో 30 పరుగులు చేసిన క్రమంలో.. సీఎస్కే తరఫున అత్యధిక పరుగులు (204 ఇన్నింగ్స్లో 4699) సాధించిన క్రికెటర్గా చరిత్రకెక్కాడు. అంతకుముందు ఈ రికార్డు సురేశ్ రైనా పేరిట ఉండేది. అతడు చెన్నై తరఫున 171 ఇన్నింగ్స్ ఆడి 4687 పరుగులు చేశాడు. ఐపీఎల్-2025: చెన్నై వర్సెస్ బెంగళూరు👉 బెంగళూరు స్కోరు: 196/7 (20)👉చెన్నై స్కోరు: 146/8 (20)👉ఫలితం: యాభై పరుగుల తేడాతో చెన్నైపై బెంగళూరు విజయం.చదవండి: ఇదేం ప్రశ్న? ఆఖర్లో ఎవరు గెలుస్తారో చూడాలి: సీఎస్కే కోచ్ ఆగ్రహం -
చరిత్ర సృష్టించిన జడ్డూ భాయ్.. ఐపీఎల్లో తొలి మొనగాడు
చెన్నై సూపర్ కింగ్స్ స్టార్ ఆల్రౌండర్ రవీంద్ర జడేజా చరిత్ర సృష్టించాడు. ఐపీఎల్లో 100 వికెట్లతో పాటు 3000 పరుగులు పూర్తి చేసి తొలి ఆటగాడిగా రికార్డు నెలకొల్పాడు. నిన్న (మార్చి 28) ఆర్సీబీతో జరిగిన మ్యాచ్లో జడ్డూ ఈ ఘనత సాధించాడు. ఈ మ్యాచ్లో 19 బంతుల్లో 2 ఫోర్లు, సిక్సర్ సాయంతో 25 పరుగులు చేసిన జడేజా.. తన చివరి పరుగు వద్ద ఐపీఎల్లో 3000 పరుగుల మార్కును తాకాడు. జడేజా ఖాతాలో 160 ఐపీఎల్ వికెట్లు కూడా ఉన్నాయి. జడ్డూ తన ఐపీఎల్ కెరీర్లో 242 మ్యాచ్లు ఆడాడు. ఇందులో 3 హాఫ్ సెంచరీలు, ఓ ఐదు వికెట్ల ఘనత ఉంది.ఐపీఎల్లో ఇప్పటివరకు 27 మంది 3000 పరుగులు స్కోర్ చేయగా.. అందులో జడేజా మాత్రమే 100కుపైగా వికెట్లు కూడా తీశాడు. 3000 పరుగులు చేసిన మరో ఇద్దరు మాత్రమే 50కి పైగా వికెట్లు తీశారు. వీరిలో ఒకరు షేన్ వాట్సన్ కాగా.. మరొకరు కీరన్ పోలార్డ్. వాట్సన్ 145 ఐపీఎల్ మ్యాచ్ల్లో 3874 పరుగులతో పాటు 92 వికెట్లు తీయగా.. పోలార్డ్ 189 ఐపీఎల్ మ్యాచ్ల్లో 3412 పరుగులు చేసి 69 వికెట్లు పడగొట్టాడు.మ్యాచ్ విషయానికొస్తే.. నిన్న జరిగిన మ్యాచ్లో ఆర్సీబీ చేతిలో చెన్నై సూపర్ కింగ్స్ 50 పరుగుల తేడాతో ఘోర పరాజయాన్ని ఎదుర్కొంది. ఈ మ్యాచ్లో సీఎస్కే అన్ని విభాగాల్లో ఘోరంగా విఫలమైంది. తొలుత బౌలింగ్ చేసి 20-30 పరుగులు అదనంగా సమర్పించుకోవడంతో పాటు కీలక సమయాల్లో క్యాచ్లు వదిలేసింది. అనంతరం బ్యాటింగ్లో కనీస పోరాటం కూడా చూపలేక ప్రత్యర్థికి దాసోహమైంది.తొలుత బ్యాటింగ్ చేసిన ఆర్సీబీ.. రజత్ పాటిదార్ (32 బంతుల్లో 51; 4 ఫోర్లు, 3 సిక్సర్లు), ఫిల్ సాల్ట్ (16 బంతుల్లో 32; 5 ఫోర్లు, సిక్స్), పడిక్కల్ (14 బంతుల్లో 27; 2 ఫోర్లు, 2 సిక్సర్లు), టిమ్ డేవిడ్ (8 బంతుల్లో 22 నాటౌట్; ఫోర్, 3 సిక్సర్లు) సత్తా చాటడంతో నిర్ణీత ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 196 పరుగుల భారీ స్కోర్ చేసింది. స్లోగా ఉన్న పిచ్పై ఇది చాలా మంచి స్కోర్. సీఎస్కే బౌలర్లలో నూర్ అహ్మద్ (4-0-36-3), పతిరణ (4-0-36-2), ఖలీల్ అహ్మద్ (4-0-28-1) బాగానే బౌలింగ్ చేసినా అశ్విన్ (2-0-22-1), జడ్డూ (3-0-37-0) సామర్థ్యం మేరకు రాణించలేక ధారాళంగా పరుగులు సమర్పించుకున్నారు.అనంతరం భారీ లక్ష్య ఛేదనలో సీఎస్కే ఆదిలోనే చేతులెత్తేసింది. 8 పరుగులకే (రెండో ఓవర్లో) 2 వికెట్లు కోల్పోయిన ఆ జట్టు.. ఆతర్వాత కూడా వరుస విరామాల్లో వికెట్లు కోల్పోయి నిర్ణీత ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 148 పరుగులు మాత్రమే చేయగలిగింది. ఈ మ్యాచ్లో ఆర్సీబీ బౌలర్లు అద్బుతంగా బౌలింగ్ చేశారు. హాజిల్వుడ్ (4-0-21-3), లవింగ్స్టోన్ (4-0-28-2), యశ్ దయాల్ (3-0-18-2) వికెట్లు తీయడంతో పాటు పొదుపుగా బౌలింగ్ చేశారు. ఫలితంగా ఆర్సీబీ సీఎస్కేను 17 ఏళ్ల తర్వాత వారి సొంత ఇలాకాలో ఓడించింది. సీఎస్కే ఇన్నింగ్స్లో రచిన్ రవీంద్ర (41) టాప్ స్కోరర్గా నిలువగా.. ఆఖర్లో ధోని (16 బంతుల్లో 30 నాటౌట్; 3 ఫోర్లు, 2 సిక్సర్లు) మెరుపు ఇన్నింగ్స్ ఆడాడు. -
జామ్నగర్లో రవీంద్ర జడేజా ఫామ్లో గుర్రాలను మీరు చూడండి (ఫొటోలు)
-
రిటైర్మెంట్ ప్రకటిస్తాడంటూ వార్తలు.. జడ్డు రియాక్షన్ ఇదే!
దాదాపు ఎనిమిదేళ్ల విరామం తర్వాత ఐసీసీ చాంపియన్స్ ట్రోఫీ(ICC Champions Trophy) టోర్నమెంట్ జరుగగా.. టీమిండియా విజేతగా అవతరించింది. డిఫెండింగ్ చాంపియన్ పాకిస్తాన్ ఒక్క గెలుపు కూడా లేకుండా నిష్క్రమించగా.. భారత్ ఆఖరి వరకు అజేయంగా నిలిచి ట్రోఫీని ముద్దాడింది. దుబాయ్ వేదికగా ఆదివారం నాటి ఫైనల్లో న్యూజిలాండ్(India vs New Zealand)ను నాలుగు వికెట్ల తేడాతో ఓడించి చాంపియన్గా నిలిచింది.ఆ నలుగురు.. అప్పుడూ.. ఇప్పుడూఇక 2017 చాంపియన్స్ ట్రోఫీ నాటి భారత జట్టులో ఉన్న రోహిత్ శర్మ, విరాట్ కోహ్లి, రవీంద్ర జడేజా(Ravindra Jadeja), హార్దిక్ పాండ్యా.. తాజా ఎడిషన్లోనూ ఆడారు. ప్రస్తుతం ఈ వన్డే టోర్నమెంట్ గెలిచిన జట్టుకు రోహిత్ కెప్టెన్గా ఉండగా.. మిగతా ముగ్గురు అతడితో కలిసి టీమిండియాను విజేతగా నిలపడంలో తమ వంతు పాత్ర పోషించారు.ముఖ్యంగా స్పిన్కు అనుకూలించిన దుబాయ్ పిచ్పై ఆల్రౌండర్ జడ్డూ ప్రభావం చూపాడు. మొత్తంగా ఐదు మ్యాచ్లలో పొదుపుగా బౌలింగ్ చేసిన జడ్డూ మొత్తంగా ఐదు వికెట్లు తీశాడు. ప్రత్యర్థి జట్ల బ్యాటర్లపై ఒత్తిడి పెంచుతూ కీలక వికెట్లు కూల్చి టీమిండియాను విజయపథంలో నిలపడంలో కీలకంగా వ్యవహరించాడు. ఈ టోర్నీలో ఐదు మ్యాచ్లలో కలిపి 42 ఓవర్లు బౌలింగ్ చేసిన జడేజా.. 4.35 ఎకానమీ రేటుతో 183 పరుగులు ఇచ్చి ఐదు వికెట్లు తీశాడు. బంతితోనే కాకుండా.. అవసరమైన వేళ బ్యాట్తోనూ జడ్డూ రాణించాడు. ముఖ్యంగా కివీస్తో ఫైనల్లో ఫోర్ బాది టీమిండియా విజయాన్ని ఖరారు చేసి.. ఈ టోర్నీని చిరస్మరణీయంగా మార్చుకున్నాడు. జడేజా రిటైర్మెంట్ గురించి ఊహాగానాలుఅయితే, ఫీల్డింగ్ చేస్తున్న సమయంలో జడేజా తన బౌలింగ్ ఓవర్ల కోటా పూర్తి చేయగానే విరాట్ కోహ్లి వచ్చి జడ్డూను ఆత్మీయంగా హత్తుకున్నాడు. ఇందుకు సంబంధించిన దృశ్యాలు నెట్టింట విస్తృతంగా వైరల్ అయ్యాయి.ఈ నేపథ్యంలో చాంపియన్స్ ట్రోఫీ-2025లో ఆస్ట్రేలియాకు కెప్టెన్గా వ్యవహరించిన స్టీవ్ స్మిత్కు కోహ్లి హగ్ ఇచ్చిన ఫొటోలను షేర్ చేస్తూ.. జడేజా రిటైర్మెంట్ గురించి ఊహాగానాలు వచ్చాయి. జడ్డూ వన్డేల్లో తన చివరి స్పెల్ వేసేశాడని.. ఇక రిటైర్మెంట్ ప్రకటనే తరువాయి అన్నట్టుగా ప్రచారం సాగింది.జడ్డు రియాక్షన్ ఇదే!టీమిండియా విజయానంతరం ఈ విషయంపై స్పందించిన జడేజా.. ‘‘అనవసరంగా వదంతులు ప్రచారం చేయద్దు.. ధన్యవాదాలు’’ అంటూ చేతులెత్తి నమస్కరిస్తున్నట్లుగా ఉన్న ఎమోజీతో పాటు సెల్యూట్ చేస్తున్నట్లుగా ఉన్న ఎమోజీని జత చేశాడు. కాగా ఫైనల్లో జడ్డూ ఎనిమిదో స్థానంలో బ్యాటింగ్కు వచ్చి ఆరు బంతుల్లో ఒక ఫోర్ సాయంతో తొమ్మిది పరుగులతో అజేయంగా నిలిచి జట్టును విజయతీరాలకు చేర్చాడు.ఇదిలా ఉంటే.. సెమీ ఫైనల్లో టీమిండియా చేతిలో ఆస్ట్రేలియా ఓడిపోయిన తర్వాత స్టీవ్ స్మిత్ వన్డేలకు రిటైర్మెంట్ ప్రకటించిన విషయం తెలిసిందే. అంతకంటే ముందు కోహ్లి అతడిని ఆలింగనం చేసుకోగా.. అధికారిక ప్రకటన కంటే ముందే స్మిత్ కోహ్లికి ఈ విషయం చెప్పాడని వార్తలు వచ్చాయి. జడ్డూ విషయంలో కూడా ఇలాగే జరుగుతుందని భావించిన వాళ్లకు తాజాగా అతడి పోస్టుతో స్పష్టతవచ్చింది.చదవండి: తప్పులు సరిదిద్దుకుని.. ‘టాప్’ రన్ స్కోరర్గా.. మాటలకు అందని అనుభూతి!Ravindra Jadeja with his family!#INDvsNZ #ChampionsTrophy2025 pic.twitter.com/16MpYrm7V6— Chandra 🇮🇳 (@cbatrody) March 9, 2025 -
CT 2025 Final: రవీంద్ర జడేజా రిటైర్మెంట్..?
భారత్, న్యూజిలాండ్ మధ్య జరుగుతున్న ఛాంపియన్స్ ట్రోఫీ-2025 ఫైనల్ తర్వాత టీమిండియా స్టార్ ఆల్రౌండర్ రవీంద్ర జడేజా వన్డేలకు రిటైర్మెంట్ ప్రకటిస్తాడని సోషల్మీడియా కోడై కూస్తుంది. ఫైనల్ మ్యాచ్లో జడ్డూ తన కోటా 10 ఓవర్లు పూర్తి చేసిన తర్వాత విరాట్ కోహ్లి అతన్ని భావోద్వేగంతో హగ్ చేసుకోవడంతో ఈ ప్రచారం మొదలైంది. విరాట్.. ఆసీస్తో జరిగిన సెమీఫైనల్ తర్వాత స్టీవ్ స్మిత్ను కూడా ఇలాగే హగ్ చేసుకున్నాడు. ఆ మ్యాచ్ అనంతరం స్టీవ్ స్మిత్ వన్డేలకు గుడ్ బై చెప్పాడు. దీంతో ఫైనల్ మ్యాచ్ తర్వాత జడేజా కూడా రిటైర్ అవుతాడని సోషల్మీడియాలో కామెంట్ల వర్షం కురుస్తుంది.Kohli hugged Smith - Retirement Kohli hugged jadeja - Retirement??#Indvsnz #Indvsnzfinal pic.twitter.com/DtKFESNFii— भाई साहब (@Bhai_saheb) March 9, 2025కాగా, న్యూజిలాండ్తో జరుగుతున్న ఫైనల్లో జడేజా ఎక్కువ వికెట్లు తీయకపోయినా చాలా పొదుపుగా బౌలింగ్ చేశాడు. ఈ మ్యాచ్లో జడ్డూ కీలకమైన టామ్ లాథమ్ వికెట్ తీసి తన కోటా 10 ఓవర్లలో కేవలం 30 పరుగులు మాత్రమే ఇచ్చాడు. జడేజా మిడిల్ ఓవర్లలో చాలా పొదుపుగా బౌలింగ్ చేసి న్యూజిలాండ్ బ్యాటర్లను ముప్పుతిప్పలు పెట్టాడు. ఈ టోర్నీలో జడేజా మొదటి మ్యాచ్ నుంచి ఇలాంటి ప్రదర్శనలతోనే ఆకట్టుకున్నాడు. ఈ టోర్నీలో జడేజా 5 మ్యాచ్ల్లో 4.36 ఎకానమీతో 5 వికెట్లు తీశాడు. జడేజా గతేడాది టీ20 వరల్డ్కప్ తర్వాత టీ20లకు రిటైర్మెంట్ ప్రకటించాడు. ఆ టోర్నీలో భారత్ విజేతగా నిలిచిన విషయం తెలిసిందే. 2024 టీ20 వరల్డ్కప్ తర్వాత జడేజాతో పాటు రోహిత్ శర్మ, విరాట్ కోహ్లి కూడా పొట్టి ఫార్మాట్కు రిటైర్మెంట్ ప్రకటించారు. ఒకవేళ జడేజా ఛాంపియన్స్ ట్రోఫీ ఫైనల్ తర్వాత నిజంగానే వన్డేలకు రిటైర్మెంట్ ప్రకటించినా టెస్ట్ల్లో కొనసాగే అవకాశం ఉంది.మ్యాచ్ విషయానికొస్తే.. న్యూజిలాండ్తో జరుగుతున్న ఫైనల్లో భారత స్పిన్నర్లు చెలరేగడంతో తొలుత బ్యాటింగ్ చేసిన న్యూజిలాండ్ నిర్ణీత 50 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 251 పరుగులు చేసింది. ఈ మ్యాచ్లో జడేజా సహా భారత స్పిన్నర్లంతా చెలరేగినా న్యూజిలాండ్ బ్యాటర్లు మంచి స్కోర్నే చేశారు. స్పిన్కు అనుకూలిస్తున్న పిచ్పై డారిల్ మిచెల్ (63), మైఖేల్ బ్రేస్వెల్ (53 నాటౌట్) అద్భుతమైన అర్ద సెంచరీలు చేసి న్యూజిలాండ్కు గౌరవప్రదమైన స్కోర్ అందించారు. న్యూజిలాండ్ ఇన్నింగ్స్లో విల్ యంగ్ 15, రచిన్ రవీంద్ర 37, కేన్ విలియమ్సన్ 11, టామ్ లాథమ్ 14, గ్లెన్ ఫిలిప్స్ 34, మిచెల్ సాంట్నర్ 8 పరుగులు చేసి ఔటయ్యారు. భారత బౌలర్లలో వరుణ్ చక్రవర్తి, కుల్దీప్ యాదవ్ తలో రెండు.. షమీ, జడేజా చెరో వికెట్ పడగొట్టారు. భారత బౌలర్లలో షమీ, హార్దిక్ ధారాళంగా పరుగులు సమర్పించుకున్నారు.252 పరుగుల ఛేదనలో భారత్కు రోహిత్ శర్మ మెరుపు ఆరంభాన్ని అందించాడు. రోహిత్ 35 బంతుల్లో 5 ఫోర్లు, 3 సిక్సర్ల సాయంతో 47 పరుగులు చేసి అజేయంగా ఉన్నాడు. మరో ఎండ్లో శుభ్మన్ గిల్ 13 బంతుల్లో 7 పరుగులు చేసి రోహిత్కు ఎక్కువగా స్ట్రయిక్ ఇస్తున్నాడు. 8 ఓవర్ల తర్వాత ఇండియా స్కోర్ 59/0గా ఉంది. -
'వరుణ్ కాదు.. అతడితోనే న్యూజిలాండ్కు ముప్పు'
ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ-2025 ఫైనల్ పోరుకు మరి కొన్ని గంటల్లో తెరలేవనుంది. దుబాయ్ వేదికగా జరగనున్న ఈ ఫైనల్ మ్యాచ్లో భారత్-న్యూజిలాండ్ జట్లు తాడోపేడో తెల్చుకోనున్నాయి. ఈ మ్యాచ్లో ఎలాగైనా గెలిచి 25 ఏళ్ల పగకు ప్రతీకారం తీర్చుకోవాలని భారత జట్టు భావిస్తుంటే.. న్యూజిలాండ్ మాత్రం మరోసారి టీమిండియాను మట్టికర్పించాలని పట్టుదలతో ఉంది.ఇప్పటివరకు భారత్-కివీస్ రెండు సార్లు ఐసీసీ టోర్నమెంట్ ఫైనల్లో తలపడ్డాయి. ఛాంపియన్స్ ట్రోఫీ-2000, వరల్డ్ టెస్టు ఛాంపియన్షిప్-2021 ఫైనల్లో కివీస్ చేతిలో టీమిండియా ఓటమి చవిచూసింది. ఇక ఈ టైటిల్ పోరు కోసం ఇరు జట్లు తమ ఆస్త్రశాస్రాలను సిద్దం చేసుకున్నాయి.మరోసారి స్పిన్నర్లు కీలక పాత్ర పోషించే అవకాశముంది. ఈ క్రమంలో ఇరు జట్ల ఆటగాళ్లు కూడా స్పిన్నర్లను నెట్స్లో ఎక్కువగా ఎదుర్కొన్నారు. న్యూజిలాండ్ అయితే ప్రత్యేకంగా శశ్వత్ తివారీ అనే ఓ స్పిన్నర్ను నెట్బౌలర్గా ఎంపిక చేసి మరి ప్రాక్టీస్ చేసింది.వరుణ్ కాదు.. అతడితోనే ముప్పు?అయితే న్యూజిలాండ్ టీమ్ ఆందోళన చెందుతుంది మిస్టరీ స్పిన్నర్ వరుణ్ చక్రవర్తి కోసం కాదంట. రవీంద్ర జడేజా వంటి ఎడమచేతి వాటం స్పిన్నర్ను సమర్ధవంతంగా ఎదుర్కోవడానికి వారు సిద్దమవుతున్నారంట. ఈ విషయాన్ని స్వయంగా కివీస్ నెట్బౌలర్గా ఉన్న శశ్వత్ తివారీ వెల్లడించాడు."ఈ రోజు న్యూజిలాండ్ జట్టుకు నెట్స్లో చాలా సమయం పాటు బౌలింగ్ చేశాను. వారు రవీంద్ర జడేజాను ధీటుగా ఎదుర్కొనేందుకు సిద్దమవుతున్నారు. జడేజా బౌలింగ్లో వేరియేషన్స్ ఉంటాయి. అతడు చాలా వేగంతో బంతిని స్పిన్ చేస్తాడు. ఆ స్పీడ్ను అలవాటు చేసుకునేందుకు నన్ను 18 యార్డ్స్ నుంచి బౌలింగ్ చేయమన్నారు.నేను వారి చెప్పినట్లగానే ఆ పాయింట్ నుంచి బౌలింగ్ చేశారు. కొద్దిసేపు వారు ప్రాక్టీస్ చేశారు. కానీ బంతి చాలా త్వరగా డెలివరీ అవుతుండడంతో 22 గజాల నుంచే తిరిగి బౌలింగ్ చేయమని చెప్పారు. వారు ముఖ్యంగా ఎడమచేతి వాటం బౌలర్లపై ఎక్కువగా దృష్టిపెట్టారు. ప్రాక్టీస్లో స్పిన్ను ఎదుర్కొవడంలో వారు ఎక్కడా ఇబ్బంది పడలేదు.కానీ భారత జట్టులో టాప్-క్లాస్ స్పిన్నర్లు ఉన్నారు. కాబట్టి భారత స్పిన్నర్ల నుంచి మరోసారి వారికి కఠిన సవాలు ఎదురు కానుంది" అని శశ్వత్ తివారీ ఓ స్పోర్ట్స్ ఛానల్కు ఇచ్చిన ఇంటర్వ్యూలో పేర్కొన్నాడు. కాగా కివీస్తో జరిగిన ఆఖరి లీగ్ మ్యాచ్లో చక్రవర్తి 5 వికెట్లతో సత్తాచాటాడు. దీంతో అతడి నుంచి మరోసారి కివీస్కు ముప్పు పొంచి ఉందని అంతా భావిస్తున్నారు.చదవండి: చాంపియన్ నువ్వా.. నేనా -
భారత తుదిజట్టులో ఓ మార్పు.. ‘ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్’ వారికే!
భారత్- న్యూజిలాండ్ మధ్య చాంపియన్స్ ట్రోఫీ-2025(ICC Champions Trophy) నేపథ్యంలో టీమిండియా మాజీ కోచ్ రవిశాస్త్రి(Ravi Shastri) కీలక వ్యాఖ్యలు చేశాడు. కివీస్తో మ్యాచ్లో భారత తుదిజట్టులో ఓ మార్పు చోటు చేసుకోవచ్చని అంచనా వేశాడు. పిచ్ పరిస్థితికి తగ్గట్లుగా టీమిండియా మేనేజ్మెంట్ ఈ మేరకు నిర్ణయం తీసుకోవచ్చని అంచనా వేశాడు.అయితే, ఎవరిపై వేటు వేస్తారు? ఎవరిని తీసుకువస్తారన్న విషయంపై మాత్రం రవిశాస్త్రి స్పష్టతనివ్వలేకపోయాడు. కాగా పాకిస్తాన్ వేదికగా ఫిబ్రవరి 19న మొదలైన చాంపియన్స్ ట్రోఫీ తాజా ఎడిషన్ మార్చి 9న దుబాయ్ వేదికగా భారత్- న్యూజిలాండ్ మధ్య ఫైనల్తో ముగుస్తుంది. ఆతిథ్య జట్టు హోదాలో పాకిస్తాన్ సహా భారత్, ఆస్ట్రేలియా, సౌతాఫ్రికా, న్యూజిలాండ్, అఫ్గనిస్తాన్, బంగ్లాదేశ్, ఇంగ్లండ్ ఈ వన్డే టోర్నమెంట్లో పాల్గొన్నాయి. ఈ క్రమంలో తొలి సెమీ ఫైనల్లో ఆసీస్ను ఓడించి రోహిత్ సేన.. సౌతాఫ్రికాను చిత్తు చేసి సాంట్నర్ బృందం టైటిల్ పోరుకు అర్హత సాధించాయి. ఇక టీమిండియా తమ మ్యాచ్లన్నీ దుబాయ్లోనే ఆడగా.. కివీస్కు కూడా ఇక్కడ ఓ మ్యాచ్ ఆడిన అనుభవం ఉంది కాబట్టి తమకూ పిచ్ పరిస్థితులపై అవగాహన ఉందని కోచ్ గ్యారీ స్టెడ్ అన్నాడు.భారత తుదిజట్టులో ఓ మార్పుఇదిలా ఉంటే.. గ్రూప్ దశలో భాగంగా భారత్- పాకిస్తాన్ మ్యాచ్కు వాడిన పిచ్నే భారత్- కివీస్ ఫైనల్కు తిరిగి ఉపయోగించబోతున్నారనే వార్తలు వినిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో కామెంటేటర్ రవిశాస్త్రి ఐసీసీ రివ్యూలో మాట్లాడుతూ.. ‘‘ఫైనల్ మ్యాచ్లో భారత తుదిజట్టులో ఓ మార్పు చోటుచేసుకున్నా ఆశ్చర్యం లేదు. పిచ్ పరిస్థితికి అనుగుణంగా నిర్ణయం ఉంటుంది.టీమిండియా- ఆస్ట్రేలియా మధ్య మ్యాచ్ జరిగిన పిచ్ ఈ టోర్నమెంట్లోనే అత్యుత్తమైనది. మళ్లీ అలాంటి హోరాహోరీ చూడాలని ఉంది. ఇక ఈ మ్యాచ్ ముగిసిన తర్వాత గ్రౌండ్స్మెన్కి దాదాపు ఐదు రోజుల విరామం లభించింది. 280- 300 పరుగుల మేర రాబట్టగలిగే పిచ్ తయారు చేసి ఉండవచ్చు’’ అని అభిప్రాయపడ్డాడు.ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ వారికేఇక ఫైనల్లో ‘ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్’గా ఆల్రౌండర్ ఉండబోతున్నాడని రవిశాస్త్రి ఈ సందర్భంగా అంచనా వేశాడు. ‘‘అక్షర్ పటేల్ లేదంటే రవీంద్ర జడేజా టీమిండియా తరఫున ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్గా నిలవబోతున్నారు. ఒకవేళ న్యూజిలాండ్కు అవకాశం ఉంటే మాత్రం నేను గ్లెన్ ఫిలిప్స్ వైపు మొగ్గుచూపుతాను. అతడు అద్భుతంగా ఫీల్డింగ్ చేస్తాడు. మెరుపు ఇన్నింగ్స్తో 4- 50 పరుగులు రాబట్టగలడు. ఒకటీ లేదా రెండు వికెట్లు తీసి ఆశ్చర్యపరచనూగలడు’’ అని రవిశాస్త్రి పేర్కొన్నాడు. ఆసీస్తో సెమీస్ ఆడిన భారత తుదిజట్టురోహిత్ శర్మ (కెప్టెన్), శుబ్మన్ గిల్, విరాట్ కోహ్లీ, శ్రేయాస్ అయ్యర్, అక్షర్ పటేల్, కేఎల్ రాహుల్ (వికెట్ కీపర్), హార్దిక్ పాండ్యా, రవీంద్ర జడేజా, మమ్మద్ షమీ, కుల్దీప్ యాదవ్, వరుణ్ చక్రవర్తి.సౌతాఫ్రికాతో సెమీ ఫైనల్ ఆడిన న్యూజిలాండ్ ప్లేయింగ్ ఎలెవన్విల్ యంగ్, రచిన్ రవీంద్ర, కేన్ విలియమ్సన్, డారిల్ మిచెల్, టామ్ లాథమ్ (వికెట్ కీపర్), గ్లెన్ ఫిలిప్స్, మైఖేల్ బ్రేస్వెల్, మిచెల్ సాంట్నర్ (కెప్టెన్), మ్యాట్ హెన్రీ, కైలీ జెమీసన్, విలియం ఓ రూర్కీ.చదవండి: CT 2025: వరుణ్తోనే పెను ముప్పు: కివీస్ కోచ్ -
మాట్లాడుకుంటూనే ఉండండి: రోహిత్-రాహుల్పై జడ్డూ అసహనం!
ఐసీసీ చాంపియన్స్ ట్రోఫీ-2025(ICC Champions Trophy)లో జైత్రయాత్ర కొనసాగించిన భారత క్రికెట్ జట్టు.. ఫైనల్లోనూ గెలిచి విజయాన్ని పరిపూర్ణం చేసుకోవాలని పట్టుదలగా ఉంది. సమిష్టి ప్రదర్శనతో గ్రూప్ దశలో టాపర్గా నిలిచిన రోహిత్ సేన సెమీస్లోనూ అదరగొట్టిన విషయం తెలిసిందే. ఐసీసీ నాకౌట్ మ్యాచ్లలో గత కొంతకాలంగా భారత్కు చేదు అనుభవాలను మిగిల్చిన ఆస్ట్రేలియా(India vs Australia)ను ఓడించింది.కంగారూ జట్టును ఏ దశలోనూ కోలుకోనివ్వకుండా చేసి చిరస్మరణీయ విజయంతో టీమిండియా ఫైనల్కు దూసుకువెళ్లింది. ఇక ఈ మ్యాచ్ సందర్భంగా చోటు చేసుకున్న ఓ సరదా సంఘటన తాజాగా వెలుగులోకి వచ్చింది. భారత కెప్టెన్ రోహిత్ శర్మ(Rohit Sharma), వికెట్ కీపర్ కేఎల్ రాహుల్, స్పిన్ బౌలింగ్ ఆల్రౌండర్ రవీంద్ర జడేజా మాట్లాడుకున్న మాటలు స్టంప్ మైకులో రికార్డు కాగా.. ప్రస్తుతం వైరల్ అవుతున్నాయి.264 పరుగులకు ఆసీస్ ఆలౌట్కాగా ఫిబ్రవరి 19న పాకిస్తాన్లో చాంపియన్స్ ట్రోఫీ మొదలుకాగా.. టీమిండియా మాత్రం తమ మ్యాచ్లన్నీ తటస్థ వేదికైన దుబాయ్లో ఆడుతున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో తొలి సెమీస్లో భాగంగా భారత్ మంగళవారం ఆసీస్ జట్టును ఢీకొట్టింది. టాస్ గెలిచిన ఆస్ట్రేలియా కెప్టెన్ స్టీవ్ స్మిత్ తొలుత బ్యాటింగ్ ఎంచుకున్నాడు.ఈ క్రమంలో ఓపెనర్ కూపర్ కన్నోలి(0)ని డకౌట్ చేసి మహ్మద్ షమీ టీమిండియాకు శుభారంభం అందించగా.. విధ్వంసకర ఓపెనర్ ట్రవిస్ హెడ్(39)ను వరుణ్ చక్రవర్తి స్వల్ప స్కోరుకే పెవిలియన్కు చేర్చాడు. ఈ దశలో స్మిత్ కెప్టెన్ ఇన్నింగ్స్(73)తో ఆకట్టుకోగా.. అలెక్స్ క్యారీ(61)అతడికి సహకరించాడు. అయితే, మిగతా వాళ్లు స్థాయికి తగ్గట్లు రాణించకపోవడంతో ఆసీస్ 49.3 ఓవర్లలోనే ఆలౌట్ అయింది. 264 పరుగులు స్కోరు చేసింది.టీమిండియా బౌలర్లలో మహ్మద్ షమీ మూడు వికెట్లు పడగొట్టగా.. రవీంద్ర జడేజా, వరుణ్ చక్రవర్తి రెండు, హార్దిక్ పాండ్యా, అక్షర్ పటేల్ ఒక్కో వికెట్ తీశారు. అయితే, జడ్డూ బౌలింగ్ చేసే సమయంలో ఓ ఆసక్తికర ఘటన జరిగింది. మాములుగా తనకు ఇచ్చిన సమయంలోపే ఓవర్లు ముగిస్తాడని జడేజాకు పేరుంది.జడేజా అసహనంఅయితే, కెప్టెన్ రోహిత్ , వికెట్ కీపర్ రాహుల్ వల్ల ఆలస్యం అవుతుందేమోనని జడ్డూ ఒకింత అసహనం వ్యక్తం చేశాడు. స్టంప్ మైకులో రికార్డైన సంభాషణ ప్రకారం.. జడేజా..‘‘బంతి అంతగా టర్న్ అవటం లేదు’’ అనగా.. రోహిత్ ఇందుకు బదులిస్తూ.. ‘‘ఇంకో మూడు బాల్స్ వేయాల్సి ఉంది కదా. స్లిప్ తీసుకో. బంతి స్పిన్ అవ్వచ్చు’’ అని పేర్కొన్నాడు.మీరు చర్చలు జరుపుతూనే ఉండండిఇంతలో కేఎల్ రాహుల్ జోక్యం చేసుకుంటూ.. ‘‘ఇప్పటి వరకు ఒక్క బంతి మాత్రమే టర్న్ అయింది’’ అని పేర్కొన్నాడు. వీళ్ల చర్చలతో చిర్రెత్తిపోయిన జడేజా.. ‘‘మీరిద్దరు ఇలా మట్లాడుతూనే ఉండండి. ఈ వ్యవధిలోనే నేను మిగిలిన నా మూడు బంతులు వేసేస్తా’’ అని కౌంటర్ వేశాడు.ఇదిలా ఉంటే.. ఆసీస్ విధించిన 265 పరుగుల లక్ష్య ఛేదనను భారత్ మరో పదకొండు బంతులు మిగిలి ఉండగానే పూర్తి చేసింది. విరాట్ కోహ్లి అర్ధ శతకం(84)తో అదరగొట్టగా.. శ్రేయస్ అయ్యర్(45), కేఎల్ రాహుల్(42 నాటౌట్) రాణించారు. ఆఖర్లో హార్దిక్ పాండ్యా(24 బంతుల్లో 28) కూడా తన వంతు పాత్ర పోషించాడు. ఈ క్రమంలో 48.1 ఓవర్లలో ఆరు వికెట్ల నష్టానికి 267 పరుగులు చేసిన టీమిండియా.. ఆసీస్ను నాలుగు వికెట్ల తేడాతో ఓడించి ఫైనల్కు చేరుకుంది. దుబాయ్ వేదికగా ఆదివారం న్యూజిలాండ్తో టైటిల్ పోరులో తలపడుతుంది.చదవండి: Steve Smith: కోహ్లికి ముందే తెలుసు!Jab tak baat hogi, ek aur over hojayegi! 🤣That’s the speed of #Jadeja – blink, and the over’s done! Some on field stump mic gold!#ChampionsTrophyOnJioStar 👉 🇮🇳🆚🇦🇺 LIVE NOW on Star Sports 1, Star Sports 1 Hindi, Star Sports 2 & Sports18-1!📺📱 Start Watching FREE on… pic.twitter.com/nsIpsZyAbb— Star Sports (@StarSportsIndia) March 4, 2025 -
ఇదేం పని? ఆటగాడు ఇలా చేయొచ్చా?: కివీస్ మాజీ క్రికెటర్ ఫైర్
న్యూజిలాండ్తో మ్యాచ్లో టీమిండియా స్టార్ రవీంద్ర జడేజా(Ravindra Jadeja) వ్యవహరించిన తీరును కివీస్ మాజీ క్రికెటర్ సైమన్ డౌల్ తప్పుబట్టాడు. వికెట్ కోసం అప్పీలు చేసే క్రమంలో జడ్డూ ప్రవర్తించిన విధానం సరికాదని.. అంపైర్ అతడికి హెచ్చరికలు జారీ చేసి ఉండాల్సిందని అభిప్రాయపడ్డాడు. కాగా ఐసీసీ చాంపియన్స్ ట్రోఫీ-2025(ICC Champions Trophy) చివరి మ్యాచ్లో భాగంగా భారత్- న్యూజిలాండ్తో తలపడిన విషయం తెలిసిందే.శ్రేయస్ అద్భుత అర్ధ శతకందుబాయ్ ఇంటర్నేషనల్ స్టేడియంలో ఆదివారం జరిగిన మ్యాచ్లో టాస్ గెలిచిన న్యూజిలాండ్(India vs New Zealand) తొలుత బౌలింగ్ ఎంచుకుంది. ఈ క్రమంలో బ్యాటింగ్కు దిగిన టీమిండియా నిర్ణీత యాభై ఓవర్లలో తొమ్మిది వికెట్ల నష్టానికి 249 పరుగులు చేసింది. టాపార్డర్లో కెప్టెన్ రోహిత్ శర్మ(15), శుబ్మన్ గిల్(2), విరాట్ కోహ్లి(11) విఫలం కాగా.. మిడిలార్డర్ రాణించింది.నాలుగో నంబర్ బ్యాటర్ శ్రేయస్ అయ్యర్ అద్భుత అర్ధ శతకం(98 బంతుల్లో 79) సాధించగా.. అక్షర్ పటేల్(42), హార్దిక్ పాండ్యా(45) రాణించారు. కివీస్ పేసర్ మ్యాట్ హెన్రీ ఐదు వికెట్లతో చెలరేగగా.. మిగతా వారిలో కైలీ జెమీసన్, విలియం ఓ రూర్కీ, కెప్టెన్ మిచెల్ సాంట్నర్, రచిన్ రవీంద్ర ఒక్కో వికెట్ సాధించారు.విలియమ్సన్ హాఫ్ సెంచరీఇక 250 పరుగుల నామమాత్రపు లక్ష్యంతో బరిలోకి దిగిన న్యూజిలాండ్కు భారత స్పిన్నర్లు చుక్కలు చూపించారు. వీరి దెబ్బకు 45.3 ఓవర్లలో 205 పరుగులు మాత్రమే చేసి కివీస్ జట్టు ఆలౌట్ అయింది. రచిన్ విఫలం(6) కాగా.. విలియమ్సన్ హాఫ్ సెంచరీ(81) చేయగా.. ఓపెనర్ విల్ యంగ్(22), మిచెల్ సాంట్నర్(28) మాత్రమే ఇరవై పరుగుల మార్కు అందుకోగా.. మిగతా వాళ్లంతా చేతులెత్తేశారు.భారత బౌలర్లలో మిస్టరీ స్పిన్నర్ వరుణ్ చక్రవర్తి ఐదు వికెట్లతో అద్భుతంగా రాణించగా.. కుల్దీప్ యాదవ్ రెండు, అక్షర్ పటేల్, రవీంద్ర జడేజా చెరో వికెట్ తీశారు. పేసర్లలో ఆల్రౌండర్ హార్దిక్ పాండ్యా ఒక వికెట్ దక్కించుకున్నాడు. ఇదిలా ఉంటే.. కివీస్ వికెట్ కీపర్ బ్యాటర్ టామ్ లాథమ్ను అవుట్ చేసే క్రమంలో జడేజా వ్యవహరించిన తీరును కామెంటేటర్ సైమన్ డౌల్ విమర్శించాడు.కివీస్ ఇన్నింగ్స్ 33వ ఓవర్ వేసిన జడ్డూ రెండో బంతిని అద్భుతంగా సంధించాడు. అతడి స్పిన్ మాయాజాలంలో చిక్కుకున్న లాథమ్ రివర్స్ స్వీప్ షాట్ ఆడేందుకు ప్రయత్నించి విఫలం కాగా.. బంతి అతడి తొడకు తాకింది. లేదంటే బంతి నేరుగా ఆఫ్ స్టంప్ను ఎగురగొట్టేదే. ఈ నేపథ్యంలో అంపైర్ లాథమ్ను లెగ్ బిఫోర్ వికెట్గా ప్రకటించగా అతడు పెవిలియన్ చేరాడు.ఇదేం పని? ఆటగాడు ఇలా చేయొచ్చా?అయితే, లాథమ్ విషయంలో జడేజా పిచ్ మధ్య వరకు వచ్చి అప్పీలు చేయడం సరికాదంటూ సైమన్ డౌల్ కామెంట్రీలో పేర్కొన్నాడు. ‘‘అతడు ఏం చేశాడో చూడండి. ఆటగాళ్లు ఇలా చేయవచ్చా? అతడిని అంపైర్ హెచ్చరించి ఉండాల్సింది’’ అని డౌల్ అభిప్రాయపడ్డాడు. అసలు ఆటగాడు పిచ్ మధ్యలోకి రావడం ఏమిటంటూ అసహనం వెళ్లగక్కాడు. కాగా న్యూజిలాండ్తో మ్యాచ్లో 44 పరుగుల తేడాతో గెలిచిన భారత్.. గ్రూప్-‘ఎ’ టాపర్గా నిలిచింది. ఇక అంతకుముందు ఇదే గ్రూపులో ఉన్న బంగ్లాదేశ్, పాకిస్తాన్లను టీమిండియా ఓడించిన విషయం తెలిసిందే. ఇదే జోరులో... దుబాయ్ వేదికగా ఆస్ట్రేలియాతో మంగళవారం నాటి సెమీస్లోనూ గెలిచి ఫైనల్కు దూసుకువెళ్లాలని పట్టుదలగా ఉంది. చదవండి: వారిద్దరూ అద్భుతం.. కానీ అది మాకు తలనొప్పిగా మారింది: రోహిత్ -
ఆ ముగ్గురు అద్బుతం.. కోహ్లి గురించి చెప్పేదేమీ లేదు: రోహిత్ శర్మ
టీమిండియా బౌలింగ్ దళంపై కెప్టెన్ రోహిత్ శర్మ(Rohit Sharma) ప్రశంసలు కురిపించాడు. పాకిస్తాన్తో మ్యాచ్లో తమ బౌలర్లు అదరగొట్టారని.. ప్రత్యర్థిని నామమాత్రపు స్కోరుకు కట్టడి చేసి తమపై కాస్త ఒత్తిడిని తగ్గించారని అన్నాడు. మిడిల్ ఓవర్లలో పొదుపుగా బౌలింగ్ చేసిన తీరు అద్భుతమని బౌలర్లను కొనియాడిన రోహిత్ శర్మ.. ఇక ఛేజ్మాస్టర్ విరాట్ కోహ్లి(Virat Kohli) నుంచి ఇలాంటి ఇన్నింగ్స్ రావడం తననేమీ ఆశ్చర్యపరచలేదని తెలిపాడు.చాంపియన్స్ ట్రోఫీ-2025లో బంగ్లాదేశ్పై గెలిచి విజయంతో ఈ ఐసీసీ టోర్నీని ఆరంభించిన రోహిత్ సేన.. ఆదివారం నాటి తమ రెండో మ్యాచ్లో పాకిస్తాన్ను ఓడించింది. చిరకాల ప్రత్యర్థిపై ఆరు వికెట్ల తేడాతో జయభేరి మోగించి సెమీ ఫైనల్ రేసులో మున్ముందుకు దూసుకుపోయింది.దుబాయ్ వేదికగా దాయాది పాకిస్తాన్తో తలపడ్డ టీమిండియా.. టాస్ ఓడి తొలుత బౌలింగ్ చేసింది. ఈ క్రమంలో 49.4 ఓవర్లలో ప్రత్యర్థిని 241 పరుగులకు ఆలౌట్ చేసింది. కుల్దీప్ యాదవ్ మూడు, హార్దిక్ పాండ్యా రెండు వికెట్లతో మెరవగా.. అక్షర్ పటేల్, రవీంద్ర జడేజా, హర్షిత్ రాణా ఒక్కో వికెట్ తీశారు. అదే విధంగా.. అక్షర్ తన అద్భుత ఫీల్డింగ్తో రెండు రనౌట్లలో భాగమయ్యాడు.ఇక లక్ష్య ఛేదనకు దిగిన భారత్ 42.3 ఓవర్లలోనే టార్గెట్ను ఊదేసింది. విరాట్ కోహ్లి ఫోర్ బాది శతకం పూర్తి చేసుకోవడంతో జట్టును విజయతీరాలకు చేర్చాడు. మిగతా వాళ్లలో ఓపెనర్ శుబ్మన్ గిల్(46), మిడిలార్డర్ స్టార్ శ్రేయస్ అయ్యర్(56) అద్బుత ఇన్నింగ్స్ ఆడారు.ఈ నేపథ్యంలో విజయానంతరం టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ మాట్లాడుతూ... జట్టు ప్రదర్శన పట్ల సంతృప్తి వ్యక్తం చేశాడు. ‘‘బంతితో మేము మ్యాచ్ ఆరంభించిన విధానం సూపర్. బౌలింగ్ విభాగం అద్భుతమైన ప్రదర్శనతో పాకిస్తాన్ను నామమాత్రపు స్కోరుకే పరిమితం చేసింది. లక్ష్య ఛేదనలో లైట్ల వెలుగులో బ్యాటింగ్ చేయడం ఈ పిచ్పై ఎంత బాగుంటుందో.. స్లో వికెట్పై ఆడటం అంతే కఠినంగానూ ఉంటుందని మాకు తెలుసు.అయితే, మా బ్యాటింగ్ లైనప్ త్వరగానే పనిపూర్తి చేసింది. ఏదేమైనా.. అక్షర్, కుల్దీప్, జడేజా మిడిల్ ఓవర్లలో గొప్పగా రాణించారు. వన్డే ఫార్మాట్లో తమకున్న అనుభవాన్ని ఇక్కడ చూపించారు. రిజ్వాన్తో పాటు సౌద్ షకీల్ల వికెట్లు మాకు కీలకం. వారిద్దరిని ఎక్కువ సేపు క్రీజులో ఉండనీయవద్దనే మా ప్రయత్నాలు ఫలించాయి.ఈ ముగ్గురు స్పిన్నర్లు ఈరోజు అద్భుతమే చేశారు. అయితే, పేసర్లు హార్దిక్, హర్షిత్, షమీ బౌలింగ్ చేసిన విధానాన్ని కూడా మనం మర్చిపోకూడదు. బౌలింగ్ యూనిట్లో ప్రతి ఒక్కరు తమ కర్తవ్యాన్ని చక్కగా నిర్వర్తించారు.ఇక కోహ్లి దేశం కోసం ఆడటాన్ని ఎంతగా ఇష్టపడతాడో నేను ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. జట్టు ప్రయోజనాల కోసం తన శక్తినంతా ధారపోస్తాడు. కీలక సమయంలో తనలోని అత్యుత్తమ నైపుణ్యాలను మరింత మెరుగ్గా ప్రదర్శిస్తాడు. కోహ్లి అంటే ఏమిటో ఈరోజు మరోసారి నిరూపించాడు.డ్రెసింగ్ రూంలో కూర్చున వాళ్లలో ఒక్కరు కూడా కోహ్లి ఇన్నింగ్స్ చూసి ఆశ్చర్యపోలేదు. ఎందుకంటే.. సుదీర్ఘకాలంగా జట్టు కోసం అతడేం చేస్తున్నాడో అందరికీ తెలుసు. మిడిల్ ఓవర్లలో.. మరో ఎండ్లోని బ్యాటర్లతో చక్కటి సమన్వయంతో అతడు ముందుకు సాగిన విధానం అద్భుతం. అంతేకాదు తనదైన స్టైల్లో మ్యాచ్ను ముగించడం రెట్టింపు సంతోషం. గిల్, శ్రేయస్ కూడా విలువైన ఇన్నింగ్స్ ఆడారు’’ అని రోహిత్ శర్మ చెప్పుకొచ్చాడు.చదవండి: ‘ఏంటిది?’.. రిజ్వాన్ చర్యకు హర్షిత్ రాణా రియాక్షన్ వైరల్.. గంభీర్ కూడా! -
Ind vs Ban: ‘నీకు తుదిజట్టులో చోటు లేదు.. అతడినే ఆడిస్తాం’
చాంపియన్స్ ట్రోఫీ-2025(ICC Champions Trophy)లో టీమిండియా ప్రయాణం గురువారం మొదలుకానుంది. ఈ ఐసీసీ టోర్నమెంట్ ఆరంభ మ్యాచ్లో రోహిత్ సేన తొలుత దుబాయ్ వేదికగా బంగ్లాదేశ్తో తలపడనుంది. భారత కాలమానం ప్రకారం మధ్యాహ్నం రెండున్నర గంటలకు ఆరంభమయ్యే ఈ మ్యాచ్ను స్టార్ స్పోర్ట్స్ నెట్వర్క్, జియోహాట్స్టార్లో వీక్షించవచ్చు.గంభీర్తో జడ్డూ వాదన!ఇక తొలి మ్యాచ్లో భారత తుదిజట్టు ఎలా ఉంటుందన్న అంశంపై క్రికెట్ వర్గాల్లో ఆసక్తినెలకొంది. ఏకంగా ఐదుగురు స్పిన్నర్లను సెలక్ట్ చేసిన భారత జట్టు యాజమాన్యం ప్లేయింగ్ ఎలెవన్లో ఎవరికి చోటు ఇస్తుందనేది చర్చనీయాంశంగా మారింది. ఈ నేపథ్యంలో ప్రాక్టీస్ సెషన్లో భాగంగా ఆల్రౌండర్ రవీంద్ర జడేజా(Ravindra Jadeja) హెడ్కోచ్ గౌతం గంభీర్(Gautam Gambhir)తో చర్చిస్తున్నట్లు కనిపించిన దృశ్యాలు నెట్టింట వైరల్గా మారాయి.ఈ క్రమంలో బంగ్లాదేశ్తో మ్యాచ్లో జడ్డూకు గౌతీ తుదిజట్టులో స్థానం ఇవ్వడం లేదని.. తనకు ఇష్టమైన వాషింగ్టన్ సుందర్ను ఆడిస్తాడనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఈ నేపథ్యంలో న్యూజిలాండ్, రాయల్ చాలెంజర్స్ బెంగళూరు జట్ల మాజీ కోచ్ మైక్ హసన్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు.నీకు తుదిజట్టులో చోటు లేదు.. అతడినే ఆడిస్తాం‘‘జడేజా ఈరోజు మ్యాచ్ ఆడటం లేదు. అతడి బాడీలాంగ్వేజ్ చూస్తే ఇలాగే అనిపిస్తోంది. ‘నా నిర్ణయం ఇదే. నేను ఫిక్సైపోయాను. నువ్వు నా నిర్ణయంతో అంగీకరించకపోవచ్చు. అయినా మరేం పర్లేదు. థాంక్స్.. తదుపరి మ్యాచ్లో నువ్వే ఆడతావు. కానీ ఇప్పుడు మాత్రం మేము ఆఫ్ స్పిన్నర్తో బరిలోకి దిగుతాం’ అని గంభీర్ జడేజాకు చెప్పి ఉంటాడు’’ అని మైక్ హసన్ తన అభిప్రాయాన్ని పంచుకున్నాడు.వాళ్లిద్దరికి జట్టులో చోటుఅయితే, టీమిండియా మాజీ క్రికెటర్ పీయూశ్ చావ్లా మాత్రం.. ‘‘బంగ్లాదేశ్ తుదిజట్టులో ఎక్కువ మంది ఎడమచేతి వాటం బ్యాటర్లు ఉన్నారు. గత కొద్ది రోజులుగా జడేజా, అక్షర్ మంచి ఫామ్లో ఉన్నారు. కాబట్టి వాళ్లిద్దరికి జట్టులో చోటు ఉంటుంది’’ అని అభిప్రాయపడ్డాడు. కాగా బంగ్లా జట్టులో తాంజిద్ హసన్, సౌమ్య సర్కార్తో కెప్టెన్ నజ్ముల్ హుసేన్ షాంటో కూడా లెఫ్టాండర్ బ్యాటర్లేనన్న విషయం తెలిసిందే.ఇక చాంపియన్స్ ట్రోఫీ టోర్నమెంట్కు ఎంపిక చేసిన జట్టులో భారత క్రికెట్ నియంత్రణ మండలి(బీసీసీఐ) ఐదుగురు స్పిన్నర్లకు చోటిచ్చింది. ఆల్రౌండర్లు రవీంద్ర జడేజా, అక్షర్ పటేల్(ఇద్దరూ లెఫ్టార్మ్ స్పిన్నర్లే), వాషింగ్టన్ సుందర్(రైటార్మ్ ఆఫ్ బ్రేక్ స్పిన్నర్)లతో పాటు చైనామన్ స్పిన్నర్ కుల్దీప్ యాదవ్(లెఫ్టార్మ్ రిస్ట్ స్పిన్), మిస్టరీ స్పిన్నర్ వరుణ్ చక్రవర్తి(రైటార్మ్ లెగ్ బ్రేక్)లను ఎంపిక చేసింది. చాంపియన్స్ ట్రోఫీ-2025లో పాల్గొనే భారత జట్టురోహిత్ శర్మ(కెప్టెన్), శుబ్మన్ గిల్(వైస్ కెప్టెన్), విరాట్ కోహ్లి, శ్రేయస్ అయ్యర్, కేఎల్ రాహుల్(వికెట్ కీపర్), రిషభ్ పంత్(వికెట్ కీపర్), హార్దిక్ పాండ్యా, అక్షర్ పటేల్, వాషింగ్టన్ సుందర్, కుల్దీప్ యాదవ్, హర్షిత్ రాణా, మహ్మద్ షమీ, అర్ష్దీప్ సింగ్, రవీంద్ర జడేజా, వరుణ్ చక్రవర్తి.చదవండి: CT 2025: అదొక చెత్త నిర్ణయం.. అతడి వల్లే ఇదంతా: మాజీ క్రికెటర్ ఫైర్ -
మా జట్టులో ఇద్దరు స్పిన్నర్లే ఉన్నారు: రోహిత్ శర్మ కౌంటర్
మెగా క్రికెట్ పోరుకు టీమిండియా సిద్ధమైంది. దుబాయ్ వేదికగా గురువారం చాంపియన్స్ ట్రోఫీ(ICC Champions Trophy) బరిలో దిగనుంది. తొలి పోరులో రోహిత్ సేన బంగ్లాదేశ్తో తలపడనుంది. ఈ క్రమంలో శనివారమే దుబాయ్(Dubai)కు చేరుకున్న భారత జట్టు నెట్స్లో తీవ్రంగా శ్రమించింది. లీగ్ దశలో మూడు మ్యాచ్లు కీలకమే కాబట్టి విజయంతో టోర్నమెంట్ను మొదలుపెట్టాలనే పట్టుదలతో ఉంది.మా జట్టులో ఇద్దరు స్పిన్నర్లే ఉన్నారుఈ నేపథ్యంలో మీడియాతో మాట్లాడిన టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ(Rohit Sharma) జట్టు ఎంపిక తీరుపై వస్తున్న విమర్శలపై స్పందించాడు. ‘‘చాంపియన్స్ ట్రోఫీ కోసం భారత జట్టులో ఐదుగురు స్పిన్నర్లను ఎంపిక చేయడంపై తీవ్ర చర్చ సాగుతోంది. అయితే మా జట్టులో ఇద్దరు స్పిన్నర్లను మాత్రమే ఎంపిక చేశాం. మరో ముగ్గురు బ్యాటింగ్ చేయగల ఆల్రౌండర్లు. అటు బ్యాటింగ్, ఇటు బౌలింగ్ చేయగల ప్లేయర్లు జట్టుకు అవసరం. ఈ ముగ్గురు జట్టుకు వైవిధ్యాన్ని అందిస్తారు. అయినా మేం మా బలాన్ని బట్టి ఆటగాళ్లను ఎంచుకుంటాం. జడేజా, అక్షర్, వాషీ జట్టులో ఉంటే మాకు భిన్న రకాల ప్రణాళికలతో ముందుకు వెళ్లేందుకు ఆస్కారం ఉంటుంది. మాకు బ్యాటింగ్, బౌలింగ్ చేయగల ఆటగాళ్ల అవసరం ఉంది.టీమిండియా గురించి మాట్లాడేవారు ఇతర జట్లలో ముగ్గురు పేస్ బౌలింగ్ ఆల్రౌండర్లు ఉంటే.. వారి వద్ద ఆరుగురు పేసర్లు ఉన్నారేంటి అని అడగరు’’ అంటూ రోహిత్ శర్మ విమర్శకులకు కౌంటర్ ఇచ్చాడు. ఈ సందర్భంగా చాంపియన్స్ ట్రోఫీ గెలవడమే తమ ప్రధాన లక్ష్యం అని పేర్కొన్న హిట్మ్యాన్.. ప్రస్తుతం బంగ్లాదేశ్తో మ్యాచ్పైనే తమ దృష్టి మొత్తం కేంద్రీకృతమై ఉందని తెలిపాడు.కొత్తగా వరుణ్ చక్రవర్తికాగా చాంపియన్స్ ట్రోఫీ-2025కి ఎంపిక చేసిన పదిహేను మంది సభ్యుల భారత జట్టులో స్పిన్ దళానికి ప్రాధాన్యం దక్కింది. ప్రాథమిక జట్టులో ఆల్రౌండర్లు రవీంద్ర జడేజా, అక్షర్ పటేల్, వాషింగ్టన్ సుందర్తో పాటు చైనామన్ స్పిన్నర్ కుల్దీప్ యాదవ్ మాత్రమే ఉన్నాడు. అయితే, ఫైనల్ టీమ్ను ఖరారు చేసే సమయంలో బీసీసీఐ సెలక్టర్లు ఓపెనింగ్ బ్యాటర్ యశస్వి జైస్వాల్పై వేటు వేసి అతడి స్థానంలో మిస్టరీ స్పిన్నర్ వరుణ్ చక్రవర్తిని తీసుకువచ్చారు. ఫలితంగా జట్టులో ఏకంగా ఐదుగురు స్పిన్నర్లకు చోటు దక్కినట్లయింది.ఈ నేపథ్యంలో భారత స్పిన్ దిగ్గజం రవిచంద్రన్ అశ్విన్, మాజీ వికెట్ కీపర్ బ్యాటర్ దినేశ్ కార్తిక్ సహా పలువురు మాజీ క్రికెటర్లు సెలక్టర్ల తీరును విమర్శించారు. మెగా టోర్నీకి ఏకంగా ఐదుగురు స్పిన్నర్లను ఎంపిక చేయడం వల్ల తుదిజట్టు కూర్పు దెబ్బతినే అవకాశం ఉందని అభిప్రాయపడ్డారు. ఈ క్రమంలో రోహిత్ శర్మ పైవిధంగా స్పందించాడు.ఇదిలా ఉంటే.. గ్రూప్-‘ఎ’ పోటీలో భాగంగా గురువారం తమ తొలి మ్యాచ్లో బంగ్లాదేశ్తో తలపడనున్న టీమిండియా.. తదుపరి ఫిబ్రవరి 23న దాయాది పాకిస్తాన్ను ఢీకొట్టనుంది. అనంతరం లీగ్ దశలో ఆఖరిగా న్యూజిలాండ్తో మార్చి 2న మ్యాచ్ ఆడనుంది. ఇక ఈ టోర్నీలో గ్రూప్-బి నుంచి ఆస్ట్రేలియా, సౌతాఫ్రికా, అఫ్గనిస్తాన్, బంగ్లాదేశ్ పోటీపడుతున్నాయి. కాగా మెగా ఈవెంట్లో తొలి మ్యాచ్లో ఆతిథ్య పాకిస్తాన్ జట్టు న్యూజిలాండ్ చేతిలో చిత్తుగా ఓడింది.చాంపియన్స్ ట్రోఫీ-2025కి భారత జట్టురోహిత్ శర్మ(కెప్టెన్), శుబ్మన్ గిల్(వైస్ కెప్టెన్), విరాట్ కోహ్లి, శ్రేయస్ అయ్యర్, కేఎల్ రాహుల్(వికెట్ కీపర్), రిషభ్ పంత్(వికెట్ కీపర్), హార్దిక్ పాండ్యా, అక్షర్ పటేల్, వాషింగ్టన్ సుందర్, కుల్దీప్ యాదవ్, హర్షిత్ రాణా, మహ్మద్ షమీ, అర్ష్దీప్ సింగ్, రవీంద్ర జడేజా, వరుణ్ చక్రవర్తి.చదవండి: CT 2025: షెడ్యూల్, జట్లు, మ్యాచ్ ఆరంభ సమయం.. లైవ్ స్ట్రీమింగ్.. పూర్తి వివరాలు -
రోహిత్, కోహ్లి, జడేజా లపైనే ఛాంపియన్స్ ట్రోఫీ భారం
దాదాపు పదేళ్ల విరామం తర్వాత ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీని రెండోసారి గెలుచుకోవాలనే భారత జట్టు గట్టి పట్టుదలతో ఉంది. గతంలో 2013లో ఇంగ్లాండ్లోని బర్మింగ్హామ్ లో జరిగిన ఫైనల్ లో ఎంఎస్ ధోనీ నాయకత్వంలోని భారత్ జట్టు ఐదు పరుగుల తేడాతో ఇంగ్లాండ్ పై విజయసాధించి ఈ ట్రోఫీని చేజిక్కించుకుంది. మళ్ళీ ఇప్పటి దాకా భారత్ ఈ ట్రోఫీని గెలుచుకోలేక పోయింది. 2017 జరిగిన ఛాంపియన్స్ ట్రోఫీ ఫైనల్లో పాకిస్తాన్ జట్టు భారత్ పై 180 పరుగుల తేడాతో భారీ విజయం సాధించి ట్రోఫీ ని దక్కించుకుంది. మళ్ళీ ఈ ట్రోఫీ ని సాధించాలంటే భారత్ తన సత్తా చావాల్సిందే. ఈ నేపథ్యంలో పాకిస్తాన్, దుబాయ్ లలో ఈ నెల 19 వ తేదీ నుంచి ప్రారంభం కానున్న ఛాంపియన్స్ ట్రోఫీ టోర్నమెంట్ కి ఎంతో ప్రాముఖ్యముంది.ప్రధాన పేస్ బౌలర్ జస్ప్రీత్ బుమ్రా లేని భారత్ జట్టు ఫిబ్రవరి 20వ తేదీన దుబాయ్లో బంగ్లాదేశ్తో తన తొలి మ్యాచ్ ఆడుతుంది. తర్వాత ఫిబ్రవరి 23న ఇదే వేదిక పైన తన చిరకాల ప్రత్యర్థి పాకిస్తాన్ని ఎదుర్కొంటుంది. ఆ తర్వాత మెన్ ఇన్ బ్లూ మార్చి 2న న్యూజిలాండ్తో తలపడనుంది.ఇంగ్లండ్పై స్వదేశంలో భారత్ ఇటీవల 3-0 తేడాతో వన్డే సిరీస్ను చేజిక్కించుకోవడంతో అభిమానుల్లోనూ, జట్టు ఆటగాళ్లలోనూ ఆత్మవిశ్వాసం పెరిగింది. కెప్టెన్ రోహిత్ శర్మ, స్టార్ బ్యాటర్ గతేడాది వెస్టిండీస్ లో జరిగిన టి20 ప్రపంచ కప్ లో ఆడిన రీతి లో మళ్ళీ రాణించి మరో ఐసీసీ ట్రోఫీ ని భారత్ కి తెస్తారని అభిమానులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.రోహిత్, కోహ్లి, జడేజా లకు చివరి అవకాశం?గత సంవత్సరం టీ 20 ప్రపంచ కప్ సాధించిన తర్వాత భారత్ జట్టు ముంబై వాంఖడే స్టేడియం సమీపంలోని వీధుల్లో ఓపెన్ బస్సు లో పరేడ్ చేసింది. మళ్ళీ అలాంటి దృశ్యం రిపీట్ కావాలంటే కెప్టెన్ రోహిత్, కోహ్లీ మళ్ళీ తమ మునుపటి ఫామ్ ని కనిపించడం తప్పనిసరి.అయితే ఆస్ట్రేలియా పర్యటన లో ఘోరంగా విఫలమైన ఈ ఇద్దరు టాప్ ఆర్డర్ బ్యాటర్ ఇంగ్లాండ్ సిరీస్ లో పరుగులు సాధించి ఆత్మవిశ్వాసం తో ఉన్నారు. ఇంగ్లాండ్తో జరిగిన కటక్ వన్డేలో రోహిత్ 90 బంతుల్లో 119 పరుగులు చేశాడు. కోహ్లీ అహ్మదాబాద్లో జరిగిన చివరి వన్డే లో తన 73వ అర్ధ సెంచరీ నమోదు చేసుకున్నాడు. ఇది వారిద్దరికీ తాత్కాలిక ఉపశమనం కలిగించి ఉండవచ్చు కానీ ఛాంపియన్స్ ట్రోఫీ టోర్నమెంట్ లో ఈ అగ్రశ్రేణి క్రికెటర్లు ఇద్దరూ తమ మునుపటి ఫామ్ ని చూపించక తప్పదు.వన్డే చరిత్రలో 14,000 పరుగులు చేసిన మూడవ బ్యాటర్గా నిలిచేందుకు కోహ్లీకి 37 పరుగులు అవసరం, మరో వైపు 11,000 పరుగులు పూర్తి చేసిన పదో బ్యాట్స్మన్గా నిలిచేందుకు రోహిత్కు కేవలం 12 పరుగులు మాత్రమే అవసరం. కానీ భారత్ ఛాంపియన్స్ ట్రోఫీ గెలవకుండా వీరిద్దరూ ఈ వ్యక్తిగత రికార్డులు సాధించినా పెద్దగా ప్రయోజనం ఉండదు.భవిష్యత్తు పై చర్చ ఐసిసి మెగా ఈవెంట్కు ముందు, రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ, రవీంద్ర జడేజా వంటి సీనియర్ ఆటగాళ్ల భవిష్యత్తు పై చర్చ జరుగుతోంది. గత సంవత్సరం టి 20 ప్రపంచ కప్ గెలుచుకున్న తర్వాత ఈ ముగ్గురూ ఇప్పటికే అంతర్జాతీయ టి 20 క్రికెట్కు రిటైర్మెంట్ ప్రకటించారు. ఇటీవలి ఆస్ట్రేలియా పర్యటనలో విఫలమైన తర్వాత జట్టులోని సీనియర్ ఆటగాళ్ల ఇక రిటైర్మెంట్ ప్రకటించవచ్చని పుకార్లు వ్యాపించాయి. అయితే, ఛాంపియన్స్ ట్రోఫీ గెలిచినట్లయితే ఈ ముగ్గురు సీనియర్లు ఆటగాళ్లు మరికొంత కాలం ఆడే అవకాశం ఉందని, భారత మాజీ క్రికెటర్ ఆకాశ్ చోప్రా సూచించాడు. "ఈ ఛాంపియన్స్ ట్రోఫీ తర్వాత మరో ఐసీసీ టోర్నమెంట్ మరో రెండు, మూడు ఏళ్ళ వరకు లేదు.వచ్చే ఏడాది టి 20 ప్రపంచ కప్ ఉన్నప్పటికీ ఈ ముగ్గురు ఇప్పటికే టి 20ల నుంచి రిటైర్ అయ్యారు. ఇక 2027 లో జరిగే వన్డే ప్రపంచ కప్ కి చాల కాలం ఉంది. అప్పటి దాకా వీరు ముగ్గురూ వన్డే క్రికెట్ లో కొనసాగడం కష్టంగానే కనిపిస్తోంది. ఈ నేపధ్యంలో రోహిత్, విరాట్, జడేజా లకు ఇదే చివరి ఐసీసీ టోర్నమెంట్ కావచ్చని, చోప్రా వ్యాఖ్యానించాడు.యువ ఆటగాళ్ల కు అద్భుత అవకాశంవన్డే వైస్ కెప్టెన్గా యువ బ్యాటర్ శుభమాన్ గిల్కు పెద్ద ప్రమోషన్ వచ్చింది. పైగా ఈ ఫార్మాట్లో దాదాపు 61 సగటు ఉన్న ఈ బ్యాట్స్మన్ ఛాంపియన్స్ ట్రోఫీలో విజృభించి తన సత్తా చాటాలని ఎంతో ఆసక్తి గా ఉన్నాడు. గాయం కారణంగా బుమ్రా లేకపోయిన కారణంగా అర్ష్దీప్ సింగ్ , హర్షిత్ రాణా వంటి యువ బౌలర్లకు ఇది అద్భుత అవకాశం. ఈ నేపధ్యం లో గిల్, శ్రేయాస్ అయ్యర్, కె ఎల్ రాహుల్ వంటి బ్యాటర్, అర్ష్దీప్ సింగ్, రాణా వంటి యువ ఆటగాళ్లకి అంతర్జాతీయ వేదిక పై తమ సత్తా చాటేందుకు ఈ ఛాంపియన్స్ ట్రోఫీ ఒక అద్భుత అవకాశంగా కనిపిస్తోంది. మరి ఈ యువ ఆటగాళ్లు రాణించి భారత్ కి మరో ఐసీసీ ట్రోఫీ తెస్తారేమో చూడాలి. -
ఆ ముగ్గురికి ఇదే ఆఖరి ఐసీసీ టోర్నీ: భారత మాజీ క్రికెటర్
దాదాపు ఎనిమిదేళ్ల విరామం తర్వాత చాంపియన్స్ ట్రోఫీ(ICC Champions Trophy) టోర్నమెంట్ నిర్వహణకు ముహూర్తం ఖరారైంది. పాకిస్తాన్ వేదికగా ఫిబ్రవరి 19 నుంచి ఈ ఐసీసీ ఈవెంట్ మొదలుకానుంది. ఈ టోర్నీలో మొత్తం ఎనిమిది జట్లు పాల్గొంటున్నాయి. గ్రూప్-‘ఎ’ నుంచి భారత్, పాకిస్తాన్, బంగ్లాదేశ్, న్యూజిలాండ్.. గ్రూప్-‘బి’ నుంచి అఫ్గనిస్తాన్, ఆస్ట్రేలియా, సౌతాఫ్రికా, ఇంగ్లండ్ టైటిల్ కోసం పోటీపడనున్నాయి.ఇందుకు సంబంధించి ఇప్పటికే ఎనిమిది బోర్డులు తమ జట్లను ప్రకటించాయి. ఇక 2017లో చివరగా విరాట్ కోహ్లి(Virat Kohli) సారథ్యంలో చాంపియన్స్ ట్రోఫీ ఆడిన టీమిండియా.. ఈసారి రోహిత్ శర్మ(Rohit Sharma) కెప్టెన్సీలో బరిలో దిగనుంది. నాటి జట్టులో భాగమైన కోహ్లి, రోహిత్తో పాటు.. రవీంద్ర జడేజా, హార్దిక్ పాండ్యా కూడా ఈసారి చాంపియన్స్ ట్రోఫీ టీమ్లో చోటు దక్కించుకున్నారు.ఆ ముగ్గురికి ఇదే ఆఖరి ఐసీసీ టోర్నీఈ నేపథ్యంలో భారత మాజీ క్రికెటర్, కామెంటేటర్ ఆకాశ్ చోప్రా ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. ఈ నలుగురిలో ముగ్గురికి ఇదే ఆఖరి ఐసీసీ టోర్నీ కాబోతుందంటూ జోస్యం చెప్పాడు. ఈ మేరకు తన యూట్యూబ్ చానెల్ వేదికగా ఓ యూజర్ అడిగిన ప్రశ్నకు సమాధానమిస్తూ.. ‘‘మీ అంచనా వందశాతం నిజమేనని మనస్ఫూర్తిగా చెబుతున్నా.కచ్చితంగా ఇలా జరిగే అవకాశం అయితే ఉంది. త్వరలోనే చాంపియన్స్ ట్రోఫీ మొదలుకానుంది. ఆ తర్వాత వరల్డ్ టెస్టు చాంపియన్షిప్ రూపంలో మరో ఐసీసీ టోర్నీ ఉంది. అయితే, ఈ ఈవెంట్లో టీమిండియా ఫైనల్కు చేరలేదు కాబట్టి.. విరాట్ కోహ్లి, రోహిత్ శర్మ, రవీంద్ర జడేజా ఇందులో ఆడే అవకాశం లేదు.కారణం ఇదేఇక మరుసటి ఏడాది టీ20 ప్రపంచకప్ జరుగనుంది. అయితే, ఇప్పటికే ఈ ముగ్గురు అంతర్జాతీయ టీ20లకు రిటైర్మెంట్ ప్రకటించారు. కాబట్టి ఇందులోనూ వీరు భాగం కాలేరు. ఇక.. మళ్లీ 2027లో వన్డే వరల్డ్కప్ జరుగుతుంది. అందుకు ఇంకా చాలా సమయమే ఉంది. అప్పటికి పరిస్థితుల్లో భారీ మార్పులు రావచ్చు. కాబట్టి.. కోహ్లి, రోహిత్, జడేజాలకు ఇదే ఆఖరి ఐసీసీ టోర్నీ కానుందని చెప్పవచ్చు’’ అని ఆకాశ్ చోప్రా అభిప్రాయపడ్డాడు.అన్నీ బాగుండి ఆడాలని కోరుకుంటే మాత్రంఅయితే, ఈ ముగ్గురు లేని లోటు తెలియకుండా టీమిండియా ఆడగలిగినపుడే ఇది సాధ్యమవుతుందని ఆకాశ్ చోప్రా పేర్కొన్నాడు. ఫిట్గా ఉండటంతో పాటు ఫామ్ కొనసాగిస్తూ తమకు నచ్చినంత కాలం ఆడాలని ఫిక్సయితే మాత్రం వీరిని ఎవరూ ఆపలేరనే అభిప్రాయం వ్యక్తం చేశాడు.కాగా టీ20 ప్రపంచకప్-2024లో టీమిండియా చాంపియన్గా నిలిచిన తర్వాత కెప్టెన్ రోహిత్ శర్మతో పాటు విరాట్ కోహ్లి, స్పిన్ బౌలింగ్ ఆల్రౌండర్ రవీంద్ర జడేజా ఇంటర్నేషనల్ పొట్టి ఫార్మాట్కు గుడ్బై చెప్పారు. అయితే, ఐపీఎల్లో మాత్రం ఈ ముగ్గురూ కొనసాగుతున్నారు. ఇక రోహిత్ త్వరలోనే 38వ వసంతంలో అడుగుపెట్టనుండగా.. కోహ్లి, జడేజాలకు ఇప్పుడు 36 ఏళ్లు. చాంపియన్స్ ట్రోఫీ-2025కి భారత జట్టురోహిత్ శర్మ(కెప్టెన్), శుబ్మన్ గిల్(వైస్ కెప్టెన్), విరాట్ కోహ్లి, శ్రేయస్ అయ్యర్, కేఎల్ రాహుల్(వికెట్ కీపర్), రిషభ్ పంత్(వికెట్ కీపర్), హార్దిక్ పాండ్యా, అక్షర్ పటేల్, వాషింగ్టన్ సుందర్, కుల్దీప్ యాదవ్, హర్షిత్ రాణా, మహ్మద్ షమీ, అర్ష్దీప్ సింగ్, రవీంద్ర జడేజా, వరుణ్ చక్రవర్తి.చదవండి: CT 2025: సురేశ్ రైనా ఎంచుకున్న భారత తుదిజట్టు... వరల్డ్కప్ వీరులకు నో ఛాన్స్! -
తుదిజట్టులో ఆ ఇద్దరు పక్కా.. మరీ అంతమంది ఎందుకు?: అశ్విన్
టీమిండియా సెలక్టర్ల తీరును భారత స్పిన్ దిగ్గజం రవిచంద్రన్ అశ్విన్(Ravichandran Ashwin) విమర్శించాడు. చాంపియన్స్ ట్రోఫీ-2025(ICC Champions Trophy 2025)కి ఎంపిక చేసిన జట్టులో ఐదుగురు స్పిన్నర్లకు చోటు ఇవ్వడం ఏమిటని ప్రశ్నించాడు. తుదిజట్టు కూర్పు విషయంలో ఇబ్బందులు తప్పవని అభిప్రాయపడ్డాడు.యశస్వి జైస్వాల్ను తప్పించికాగా ఈ ఐసీసీ టోర్నీకి భారత క్రికెట్ నియంత్రణ మండలి(BCCI) మంగళవారం తమ పూర్తిస్థాయి జట్టును ప్రకటించిన విషయం తెలిసిందే. ప్రాథమిక జట్టులో ఉన్న బ్యాటర్ యశస్వి జైస్వాల్ను తప్పించి.. అతడి స్థానంలో కొత్తగా మిస్టరీ స్పిన్నర్ వరుణ్ చక్రవర్తిని చేర్చింది. అదే విధంగా.. జస్ప్రీత్ బుమ్రా గాయం కారణంగా దూరం కాగా.. హర్షిత్ రాణాకు పిలుపునిచ్చింది.ఇదిలా ఉంటే.. ఇప్పటికే జట్టులో కుల్దీప్ యాదవ్తో పాటు ఆల్రౌండర్లు అక్షర్ పటేల్, రవీంద్ర జడేజా, వాషింగ్టన్ సుందర్ల రూపంలో నలుగురు స్పిన్నర్లు ఉన్నారు. వరుణ్ రాకతో ఆ సంఖ్య ఐదుకు చేరింది. ఈ నేపథ్యంలో మాజీ క్రికెటర్ రవిచంద్రన్ అశ్విన్ కీలక వ్యాఖ్యలు చేశాడు.నాకు అర్థం కావడం లేదు‘‘దుబాయ్కు ఇంతమంది స్పిన్నర్లను తీసుకువెళ్లడంలో మర్మమేమిటో నాకు అర్థం కావడం లేదు. యశస్వి జైస్వాల్పై వేటు వేసి స్పిన్నర్ల సంఖ్య ఐదుకు పెంచారు. ఈ పర్యటనలో ముగ్గురు లేదంటే నలుగురు స్పిన్నర్లు ఉంటారని ముందుగానే ఊహించాం.కానీ దుబాయ్కు ఏకంగా ఐదుగురు స్పిన్నర్లతో వెళ్తున్నామా? ఒకరు.. లేదంటే ఇద్దరు అదనంగా ఉన్నారని అనిపించడం లేదా?.. అందులో ఇద్దరు లెఫ్టార్మ్ స్పిన్నర్లు(రవీంద్ర జడేజా, అక్షర్ పటేల్). ఇద్దరూ అత్యుత్తమ ఆటగాళ్లే.పేస్ బౌలింగ్ ఆల్రౌండర్ హార్దిక్ పాండ్యాతో పాటు జడేజా, అక్షర్ తుదిజట్టులో ఉంటారు. కుల్దీప్ కూడా ఆడతాడు. ఇలాంటపుడు ఒకవేళ మీరు వరుణ్ చక్రవర్తిని కూడా జట్టులోకి తీసుకోవాలనుకుంటే.. ఓ పేసర్ను పక్కనపెట్టాల్సి ఉంటుంది.అప్పుడు హార్దిక్ పాండ్యాను రెండో పేసర్గా ఉపయోగించుకోవాలి. లేదంటే.. స్పిన్నర్ను తప్పించి మూడో సీమర్ను తుదిజట్టులోకి తెచ్చుకోవాలి. నాకు తెలిసి కుల్దీప్ యాదవ్ నేరుగా ప్లేయింగ్ ఎలెవన్లో చోటు దక్కించుకున్నాడు. మరి అప్పుడు వరుణ్కు ఎలా చోటిస్తారు?ఒకవేళ కుల్దీప్తో పాటు వరుణ్ కూడా తీసుకుంటే బాగానే ఉంటుంది. కానీ దుబాయ్లో బంతి అంతగా టర్న్ అవుతుందని మీరు భావిస్తున్నారా? నేనైతే ఈ జట్టు ఎంపిక తీరు పట్ల సంతృప్తిగా లేను’’ అని అశ్విన్ తన యూట్యూబ్ చానెల్ వేదికగా అభిప్రాయాలు పంచుకున్నాడు.3-0తో క్లీన్స్వీప్కాగా చాంపియన్స్ ట్రోఫీకి ముందు టీమిండియా ఇంగ్లండ్తో మూడు వన్డేల సిరీస్లో అదరగొట్టిన విషయం తెలిసిందే. ఆల్రౌండ్ ప్రదర్శనతో సొంతగడ్డపై బట్లర్ బృందాన్ని 3-0తో క్లీన్స్వీప్ చేసింది. ఇదిలా ఉంటే.. చాంపియన్స్ ట్రోఫీ ఆడే భారత తుదిజట్టులో జడేజాతో పాటు అక్షర్ పటేల్ ఉండటం ఖాయం. ఎనిమిదో స్థానంలో బ్యాటింగ్కు వీలుగా వీరికి ప్రాధాన్యం ఉంటుంది. ఇక ఇద్దరు స్పెషలిస్టు పేసర్లను ఆడించాలనుకుంటే కుల్దీప్ యాదవ్ లేదంటే వరుణ్ చక్రవర్తిలలో ఒక్కరికే స్థానం దక్కుతుంది. కాగా ఫిబ్రవరి 19 నుంచి పాకిస్తాన్ వేదికగా చాంపియన్స్ ట్రోఫీ మొదలుకానుండగా.. టీమిండియా మాత్రం తమ మ్యాచ్లు దుబాయ్లో ఆడుతుంది.ఐసీసీ చాంపియన్స్ ట్రోఫీ-2025కి భారత జట్టు:రోహిత్ శర్మ(కెప్టెన్), శుబ్మన్ గిల్(వైస్ కెప్టెన్), విరాట్ కోహ్లి, శ్రేయస్ అయ్యర్, కేఎల్ రాహుల్(వికెట్ కీపర్), రిషభ్ పంత్(వికెట్ కీపర్), హార్దిక్ పాండ్యా, అక్షర్ పటేల్, వాషింగ్టన్ సుందర్, కుల్దీప్ యాదవ్, హర్షిత్ రాణా, మహ్మద్ షమీ, అర్ష్దీప్ సింగ్, రవీంద్ర జడేజా, వరుణ్ చక్రవర్తి. చదవండి: CT 2025: ఏ జట్టునైనా ఓడిస్తాం.. చాంపియన్స్ ట్రోఫీ మాదే: బంగ్లాదేశ్ కెప్టెన్ -
Ind vs Eng: ‘రోహిత్ కెప్టెన్సీలో ఆ ఇద్దరు కలిసి ఆడటం ఆశ్చర్యమే’
ఇంగ్లండ్తో వన్డే సిరీస్ను టీమిండియా(India vs England) విజయంతో ఆరంభించింది. ఆల్రౌండ్ ప్రదర్శనతో నాగ్పూర్ వేదికగా పర్యాటక జట్టును నాలుగు వికెట్ల తేడాతో ఓడించి 1-0తో ఆధిక్యంలోకి వెళ్లింది. ఇక ఈ మ్యాచ్లో స్పిన్ బౌలింగ్ ఆల్రౌండర్లు రవీంద్ర జడేజా(Ravindra Jadeja), అక్షర్ పటేల్(Axar Patel).. ఇద్దరూ అదరగొట్టడం విశేషం.ఈ నేపథ్యంలో భారత మాజీ ఓపెనర్ ఆకాశ్ చోప్రా ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. రోహిత్ శర్మ కెప్టెన్సీలో ఇలా జడ్డూ, అక్షర్ కలిసి ఆడతారని తాను అస్సలు ఊహించలేదన్నాడు. ఏదేమైనా ఈ మ్యాచ్లో ఇద్దరు రాణించడం శుభసూచకమని.. అయితే అక్షర్ కంటే జడ్డూ మెరుగ్గా బౌలింగ్ చేశాడని కితాబిచ్చాడు.జడ్డూ, అక్షర్.. ఒకరు బౌలింగ్లో.. ఒకరు బ్యాటింగ్లోకాగా ఇంగ్లండ్తో తొలి వన్డేలో లెఫ్టార్మ్ స్పిన్నర్ రవీంద్ర జడేజా పొదుపుగా బౌలింగ్ చేయడంతో పాటు కీలక వికెట్లు తీశాడు. తొమ్మిది ఓవర్ల బౌలింగ్లో కేవలం 26 పరుగులే ఇచ్చి స్టార్ బ్యాటర్లు జో రూట్(19), జొకొబ్ బెతెల్(51) వికెట్లతో పాటు.. టెయిలెండర్ ఆదిల్ రషీద్(8)ను అవుట్ చేశాడు.ఇక లక్ష్య ఛేదనలో భాగంగా జడేజాకు ఎక్కువగా బ్యాటింగ్ చేసే అవకాశం రాలేదు. మొత్తంగా 10 బంతులు ఎదుర్కొని 12 పరుగులతో అజేయంగా నిలిచాడు. మరోవైపు.. జోస్ బట్లర్ (52) రూపంలో బిగ్ వికెట్ దక్కించుకున్న మరో లెఫ్టార్మ్ స్పిన్నర్ అక్షర్ పటేల్.. బ్యాటర్గానూ దుమ్ములేపాడు.ఐదో స్థానంలో బ్యాటింగ్కు వచ్చిన అక్షర్ పటేల్ 47 బంతుల్లో ఆరు ఫోర్లు, ఒక సిక్సర్సాయంతో 52 పరుగులు సాధించాడు. ఈ నేపథ్యంలో కామెంటేటర్ ఆకాశ్ చోప్రా వీరిద్దరి గురించి తన అభిప్రాయాలు పంచుకున్నాడు. ‘‘ఈ మ్యాచ్ సందర్భంగా రవీంద్ర జడేజా అంతర్జాతీయ క్రికెట్లో 6000 పరుగులు పూర్తి చేసుకోవడంతో 600 వికెట్ల క్లబ్లో చేరాడు.రోహిత్ కెప్టెన్సీలో ఆ ఇద్దరు కలిసి ఆడతారని అస్సలు అనుకోలేదుతద్వారా భారత్ తరఫున ఈ ఘనత సాధించిన తొలి స్పిన్నర్గా రికార్డు సాధించాడు. అంతకు ముందు ఫాస్ట్బౌలర్ కపిల్ పాజీ ఈ ఫీట్ అందుకున్నాడు. నిజానికి ఈ మ్యాచ్లో అతడికి ఆడే అవకాశం వస్తుందా లేదా అన్న సందేహం ఉండేది. ఎందుకంటే.. చాంపియన్స్ ట్రోఫీ జట్టులో అతడు పదిహేనవ ఆటగాడిగా ఉన్నాడు.నిజానికి ఇద్దరు లెఫ్టార్మ్ స్పిన్నర్లను ఒకే మ్యాచ్లో ఆడించరనే అభిప్రాయం ఉంది. ముఖ్యంగా రోహిత్ శర్మ కెప్టెన్సీలో ఇలాంటిది జరుగుతుందని నేను అనుకోలేదు. కానీ ఈరోజు(గురువారం) ఇది జరిగింది.ఈ మ్యాచ్లో జడ్డూ అక్షర్ కంటే మెరుగ్గా బౌలింగ్ చేశాడు. అక్షర్కు బ్యాటింగ్కు చేసే అవకాశం వచ్చింది. ఇకపై జడ్డూ బౌలింగ్ ఆల్రౌండర్.. అక్షర్ బ్యాటింగ్ ఆల్రౌండర్గా మీకు(మేనేజ్మెంట్) ఉపయోగపడతాడు’’ అని ఆకాశ్ చోప్రా చెప్పుకొచ్చాడు.భారత్ వర్సెస్ ఇంగ్లండ్ తొలి వన్డే స్కోర్లు👉వేదిక: విదర్భ క్రికెట్ అసోసియేషన్ స్టేడియం, నాగ్పూర్👉టాస్: ఇంగ్లండ్.. బ్యాటింగ్👉ఇంగ్లండ్ స్కోరు: 248 (47.4)👉భారత్ స్కోరు: 251/6 (38.4)👉ఫలితం: నాలుగు వికెట్ల తేడాతో ఇంగ్లండ్పై భారత్ విజయం👉ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్: శుబ్మన్ గిల్(96 బంతుల్లో 87 పరుగులు).చదవండి: సెంచరీకి చేరువలో ఉన్నాడని.. ఇలా చేస్తావా?: మండిపడ్డ గావస్కర్ -
రాణించిన జడ్డూ, శ్రేయస్, గిల్, అక్షర్.. తొలి వన్డేలో టీమిండియా ఘన విజయం
ఇంగ్లండ్తో (England) మూడు మ్యాచ్ల టీ20 సిరీస్ను టీమిండియా (Team India) ఘనంగా ప్రారంభించింది. నాగ్పూర్ వేదికగా జరిగిన తొలి వన్డేలో భారత్ 4 వికెట్ల తేడాతో గెలుపొందింది. ఈ మ్యాచ్లో టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ చేసిన ఇంగ్లండ్.. టీమిండియా బౌలర్లు చెలరేగడంతో 248 పరుగులకే (47.4 ఓవర్లలో) ఆలౌటైంది. రవీంద్ర జడేజా, హర్షిత్ రాణా తలో మూడు వికెట్లు తీసి ఇంగ్లండ్ను దెబ్బ కొట్టారు. షమీ, అక్షర్, కుల్దీప్ తలో వికెట్ తీశారు.ఇంగ్లండ్ బ్యాటర్లలో జోస్ బట్లర్ (52), జేకబ్ బేతెల్ (51) హాఫ్ సెంచరీలతో రాణించగా.. ఓపెనర్లు బెన్ డకెట్ (32), ఫిలిప్ సాల్ట్ (43) ఓ మోస్తరు స్కోర్లు చేశారు. రూట్ 19, బ్రూక్ 0, లివింగ్స్టోన్ 5, కార్స్ 10, ఆదిల్ రషీద్ 8, సాకిబ్ మహమూద్ 2 పరుగులు చేసి ఔటయ్యారు. ఆఖర్లో జోఫ్రా ఆర్చర్ (21 నాటౌట్) బ్యాట్ ఝులిపించడంతో ఇంగ్లండ్ ఈ మాత్రం స్కోరైనా చేయగలిగింది.అనంతరం బ్యాటింగ్కు దిగిన భారత్.. 38.4 ఓవర్లలో 6 వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని ఛేదించింది. ఛేదనలో ఓపెనర్లు రోహిత్ శర్మ (2), యశస్వి జైస్వాల్ (15) త్వరగా ఔటైనా.. మిడిలార్డర్ బ్యాటర్లు శ్రేయస్ అయ్యర్ (59), శుభ్మన్ గిల్ (87), అక్షర్ పటేల్ (52) అద్భుతంగా ఆడారు. ముఖ్యంగా శ్రేయస్ మెరుపు ఇన్నింగ్స్ ఆడి మధ్యలోనే భారత్ గెలుపు ఖరారు చేశాడు. లక్ష్యానికి చేరువైన తరుణంలో భారత్ వరుసగా వికెట్లు కోల్పోయింది. హార్దిక్ పాండ్యా (9 నాటౌట్), రవీంద్ర జడేజా (12 నాటౌట్) భారత్ను విజయతీరాలకు చేర్చారు. ఇంగ్లండ్ బౌలర్లలో సాకిబ్ మహమూద్, ఆదిల్ రషీద్ తలో రెండు వికెట్లు పడగొట్టగా.. ఆర్చర్, జేకబ్ బేతెల్ చెరో వికెట్ దక్కించుకున్నారు. రెండో వన్డే కటక్ వేదికగా ఫిబ్రవరి 9న జరుగనుంది.జడేజా@600ఈ మ్యాచ్లో టీమిండియా లెఫ్ట్ ఆర్మ్ స్పిన్నర్ రవీంద్ర జడేజా ఓ అరుదైన మైలురాయిని తాకాడు. ఈ మ్యాచ్లో మూడు వికెట్లు తీసిన జడేజా.. అంతర్జాతీయ క్రికెట్లో 600 వికెట్లు పూర్తి చేసుకున్నాడు. తద్వారా భారత్ తరఫున ఈ ఘనత సాధించిన ఐదో బౌలర్గా రికార్డు నెలకొల్పాడు. జడ్డూకు ముందు అనిల్ కుంబ్లే (953), అశ్విన్ (765), హర్భజన్ సింగ్ (707), కపిల్ దేవ్ (687) మాత్రమే 600 అంతర్జాతీయ వికెట్లు పడగొట్టారు. భారత్ తరఫున 600 వికెట్లు పడగొట్టిన తొలి లెఫ్ట్ ఆర్మ్ స్పిన్నర్, అలాగే అంతర్జాతీయ క్రికెట్లో 600 వికెట్లతో పాటు 6000 పరుగులు చేసిన ఏకైక భారత స్పిన్నర్ జడేజానే.అరంగ్రేటంలోనే మెరిసిన రాణా.. నిరాశపరిచిన జైస్వాల్ఈ మ్యాచ్తో వన్డే క్రికెట్లోకి ఎంట్రీ ఇచ్చిన హర్షిత్ రాణా తనపై పెట్టుకున్న అంచనాలకు న్యాయం చేశాడు. ఈ మ్యాచ్లో తొలుత ధారాళంగా పరుగులు సమర్పించుకున్న ఆతను.. ఆతర్వాత కోలుకుని మూడు వికెట్లు తీశాడు. ఇంగ్లండ్ ఇన్నింగ్స్ ఆరంభంలో ఫిల్ సాల్ట్ రాణాకు చుక్కలు చూపించాడు. ఇదే మ్యాచ్తో వన్డే అరంగేట్రం చేసిన మరో భారత ఆటగాడు యశస్వి జైస్వాల్ నిరాశపరిచాడు. ఈ మ్యాచ్లో జైస్వాల్ 22 బంతుల్లో 15 పరుగులు చేసి ఔటయ్యాడు.కొనసాగిన రోహిత్ వైఫల్యాల పరంపరఅంతర్జాతీయ క్రికెట్లో రోహిత్ వైఫల్యాల పరంపర కొనసాగింది. ఈ మ్యాచ్లో అతను 7 బంతులు ఎదుర్కొని 2 పరుగులకే ఔటయ్యాడు. ఇటీవలికాలంలో ఫార్మాట్లకతీతంగా రోహిత్ ప్రదర్శనలు చాలా దారుణంగా ఉన్నాయి.గత 16 ఇన్నింగ్స్ల్లో రోహిత్ కేవలం ఒకే అర్ద సెంచరీ చేశాడు. గత ఏడాదంతా కలుపుకుని రోహిత్ చేసింది కేవలం 166 పరుగులే. విరాట్ దూరం.. పంత్కు నో ప్లేస్ఈ మ్యాచ్కు టీమిండియా స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లి దూరంగా ఉన్నాడు. మోకాలి గాయం కారణంగా కోహ్లి ఈ మ్యాచ్లో ఆడలేదు. గాయాల కారణంగా కోహ్లి మ్యాచ్లకు దూరం కావడం చాలా అరుదు. ఈ మ్యాచ్లో మరో భారత స్టార్ ఆటగాడికి కూడా చోటు దక్కలేదు. వికెట్కీపర్, బ్యాటర్ రిషబ్ పంత్ బెంచ్కే పరిమితమయ్యాడు. కేఎల్ రాహుల్ అదనంగా వికెట్కీపింగ్ బాధ్యతలు మోశాడు. -
IND VS ENG 1st ODI: చరిత్ర సృష్టించిన రవీంద్ర జడేజా
టీమిండియా (Team India) లెఫ్ట్ ఆర్మ్ స్పిన్నర్ రవీంద్ర జడేజా (Ravindra Jadeja) అంతర్జాతీయ క్రికెట్లో ఓ అరుదైన మైలురాయిని తాకాడు. నాగ్పూర్ వేదికగా ఇంగ్లండ్తో (England) జరుగుతున్న తొలి వన్డేలో మూడు వికెట్లు తీసిన జడేజా.. అంతర్జాతీయ క్రికెట్లో 600 వికెట్లు పూర్తి చేసుకున్నాడు. తద్వారా భారత్ తరఫున ఈ ఘనత సాధించిన ఐదో బౌలర్గా రికార్డు నెలకొల్పాడు. జడ్డూకు ముందు అనిల్ కుంబ్లే (953), రవిచంద్రన్ అశ్విన్ (765), హర్భజన్ సింగ్ (707), కపిల్ దేవ్ (687) మాత్రమే 600 అంతర్జాతీయ వికెట్లు పడగొట్టారు. భారత్ తరఫున 600 వికెట్లు పడగొట్టిన తొలి లెఫ్ట్ ఆర్మ్ స్పిన్నర్ జడేజానే.ఏకైక భారత స్పిన్నర్ఈ ఘనత సాధించిన అనంతరం జడేజా మరో భారీ రికార్డు కూడా సొంతం చేసుకున్నాడు. అంతర్జాతీయ క్రికెట్లో 600 వికెట్లతో పాటు 6000 పరుగులు చేసిన ఏకైక భారత స్పిన్నర్గా రికార్డు నెలకొల్పాడు. తాజా ప్రదర్శనతో జడ్డూ.. ఇంగ్లండ్పై వన్డేల్లో అత్యధిక వికెట్లు (43) సాధించిన బౌలర్గానూ రికార్డుల్లోకెక్కాడు. ఈ మ్యాచ్కు ముందు ఈ రికార్డు ఇంగ్లండ్ దిగ్గజ పేసర్ జేమ్స్ ఆండర్సన్ పేరిట ఉండేది. ఆండర్సన్ భారత్తో జరిగిన వన్డేల్లో 40 వికెట్లు తీశాడు. వన్డే క్రికెట్ చరిత్రలో అత్యధిక వికెట్లు (198 మ్యాచ్ల్లో 223 వికెట్లు) తీసిన లెఫ్ట్ ఆర్మ్ స్పిన్నర్ల జాబితాలో జడ్డూ నాలుగో స్థానంలో ఉన్నాడు. ఈ జాబితాలో లంక దిగ్గజం సనత్ జయసూర్య (445 మ్యాచ్ల్లో 323 వికెట్లు) అగ్రస్థానంలో ఉండగా.. షకీబ్ అల్ హసన్ (247 మ్యాచ్ల్లో 317), డేనియల్ వెటోరీ (295 మ్యాచ్ల్లో 305) రెండు, మూడు స్థానాల్లో నిలిచారు.మ్యాచ్ విషయానికొస్తే.. తొలి వన్డేలో టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ చేసిన ఇంగ్లండ్.. 248 పరుగులకే ఆలౌటైంది. రవీంద్ర జడేజా, హర్షిత్ రాణా తలో మూడు వికెట్లు తీసి ఇంగ్లండ్ను చావుదెబ్బ కొట్టారు. షమీ, అక్షర్, కుల్దీప్ తలో వికెట్ తీశారు. ఇంగ్లండ్ బ్యాటర్లలో జోస్ బట్లర్ (52), జేకబ్ బేతెల్ (51) హాఫ్ సెంచరీలతో రాణించగా.. ఓపెనర్లు బెన్ డకెట్ (32), ఫిలిప్ సాల్ట్ (43) ఓ మోస్తరు స్కోర్లు చేశారు. రూట్ 19, బ్రూక్ 0, లివింగ్స్టోన్ 5, కార్స్ 10, ఆదిల్ రషీద్ 8, సాకిబ్ మహమూద్ 2 పరుగులు చేసి ఔటయ్యారు. ఆఖర్లో జోఫ్రా ఆర్చర్ (21 నాటౌట్) బ్యాట్ ఝులిపించడంతో ఇంగ్లండ్ ఈ మాత్రం స్కోరైనా చేయగలిగింది. -
వన్డే జట్టులోకి వచ్చేశాడు.. కానీ ఆ విషయంలో కష్టమే!
ఇంగ్లండ్తో గురువారం నాగ్పూర్లో ప్రారంభమయ్యే మూడు మ్యాచ్ల వన్డే సిరీస్(India vs England) కోసం సంసిద్ధమవుతున్న భారత జట్టుతో మిస్టరీ స్పిన్నర్ వరుణ్ చక్రవర్తి(Varun Chakravarthy) కూడా చేరడం ఆశించిన పరిణామమే. చక్రవర్తి వన్డే జట్టులోకి చేరడంపై భారత్ క్రికెట్ కంట్రోల్ బోర్డు (బీసీసీఐ) తాజాగా అధికారిక ప్రకటన చేసింది. ఈ క్రమంలో.. మరి కొద్దీ రోజుల్లో పాకిస్తాన్-దుబాయ్లలో ప్రారంభం కానున్న చాంపియన్స్ ట్రోఫీ తుది జట్టులో 33 ఏళ్ల వరుణ్ చక్రవర్తిని కూడా చేర్చే అవకాశం ఉన్నట్టు స్పష్టం అవుతోంది. అరంగేట్రం ఖాయమేఇక ఇంగ్లండ్తో జరిగిన టీ20 సిరీస్లో వరుణ్ రాణించిన విషయం తెలిసిందే. వరుణ్ వన్డే టోర్నమెంట్లో కూడా అరంగేట్రం చేయడం ఖాయమనిపిస్తోంది. మంగళవారం విదర్భ క్రికెట్ స్టేడియం లో వరుణ్ ఒక గంటకు పైగా బౌలింగ్ చేస్తూ కనిపించాడు.ఇంగ్లండ్పై 4-1 తేడాతో గెలిచిన ఐదు మ్యాచ్ల టీ20 సిరీస్లో చక్రవర్తి భారత బౌలర్లలో ప్రధాన ఆకర్షణ అయ్యాడు. కర్ణాటకకు చెందిన ఈ స్పిన్నర్ ఏకంగా 14 వికెట్లు పడగొట్టాడు. ఇటీవల ముగిసిన దేశవాళీ 50 ఓవర్ల విజయ్ హజారే ట్రోఫీ టోర్నమెంట్లో కూడా బాగా రాణించిన స్పిన్నర్లలో చక్రవర్తి మొదటి స్థానాన్ని ఆక్రమించాడు. వరుణ్ ఈ టోర్నమెంట్లో 12.16 సగటుతో మొత్తం 18 వికెట్లు పడగొట్టాడు.అయితే వరుణ్ ఎవరి స్థానంలో భారత్ జట్టులో వస్తాడన్నది ఆసక్తిగా మారింది. ఇప్పటికే ఛాంపియన్స్ ట్రోఫీ కోసం ప్రకటించిన ముందస్తు జట్టులో రవీంద్ర జడేజా, అక్షర్ పటేల్, వాషింగ్టన్ సుందర్, కుల్దీప్ యాదవ్లతో కలిపి నలుగురు స్పిన్నర్లు ఉన్నారు. అయితే వీరిలో ఎవరి స్థానంలో వరుణ్ జట్టులోకి వస్తాడన్నది ఆసక్తికర అంశం. ఫిబ్రవరి 12లోగా ఛాంపియన్స్ ట్రోఫీకి భారత్ తన తుది జట్టు ని ప్రకటించాల్సిన అవసరం ఉంది. ఇక వరుణ్కి ఇప్పటికే తమిళనాడుకు చెందిన భారత మాజీ ఆఫ్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ తన మద్దతు ప్రకటించాడు. చాంపియన్స్ ట్రోఫీ ఆడే భారత జట్టులో అతనిని చేర్చాలని కూడా విజ్ఞప్తి చేశాడు.ఇంగ్లండ్తో జరగబోయే మూడు మ్యాచ్ల వన్డే సిరీస్లో వరుణ్ చక్రవర్తిని ఆడించే అవకాశం ఉందని అశ్విన్ ముందే ప్రకటించాడు. "ఇంగ్లండ్తో జరిగే వన్డే సిరీస్లో వరుణ్కు ఆడే అవకాశం లభిస్తుందని నేను భావిస్తున్నాను. పేలవమైన బ్యాటింగ్ రికార్డ్ఈ టోర్నమెంట్ లో అతని ప్రదర్శన ఆధారంగా ఛాంపియన్స్ ట్రోఫీ జట్టుకి ఎంపిక చేసే అవంకాశముందని" అశ్విన్ వ్యాఖ్యానించాడు. అయితే వరుణ్ పేలవమైన బ్యాటింగ్ రికార్డ్ అతనికి అడ్డంకిగా పరిణమించే అవకాశం ఉంది. కొద్దో గొప్పో బ్యాటింగ్ వచ్చిన వారికే భారత్ జట్టు ఎంపికలో ప్రాధాన్యం ఇచ్చే అవకాశం ఉంది. ఎందుకంటె అవసరమైన పక్షంలో వారు తమ బ్యాటింగ్ తో జట్టు ని ఆదుకునే అవకాశం ఉండటమే ఇందుకు కారణం.ఇప్పటికే జట్టులో ఉన్న రవీంద్ర జడేజా, అక్షర్ పటేల్ మరియు వాషింగ్టన్ సుందర్ లు లోయర్ మిడిల్ ఆర్డర్లో సమర్థులైన బ్యాటర్లుగా గుర్తింపు పొందారు. మరో స్పిన్నర్ కుల్దీప్ యాదవ్ కూడా ఒక మోస్తరుగా బ్యాటింగ్ లో రాణించగలనని ఇప్పటికే నిరూపించుకున్నాడు. ఈ నేపథ్యంలో తన బౌలింగ్ ప్రతిభతో నిలకడ గా రాణించగలిగితేనే వరుణ్ చక్రవర్తికి ఛాంపియన్స్ ట్రోఫీ తుది జట్టులో చోటు లభించే అవకాశం ఉంది. ఇందుకు గురువారం నుంచి ప్రారంభం కానున్న ఇంగ్లండ్ వన్డే సిరీస్ కీలకం కానుంది.అయితే భారత్ బౌలింగ్ మార్పులు చేర్పులు అంతా జట్టు ప్రధాన పేస్ బౌలర్ జస్ప్రీత్ బుమ్రా ఫిట్ నెస్ పైనే ఆధారపడి ఉంటుంది. బుమ్రా ఛాంపియన్స్ ట్రోఫీ లో ఆడే విషయం పై స్పష్టం వచ్చినట్లయితే జట్టులో మరో స్పిన్నర్ కి స్థానం లభించే అవకాశం ఉంది. బుమ్రా తన వెన్ను సమస్యల నుండి సకాలంలో కోలుకో లేకపోతే, భారత్ తన బౌలింగ్ ని పునః పరిశీలించాల్సిన ఆవరసం ఉంది. -
12 వికెట్లతో చెలరేగిన జడేజా.. పంత్ టీమ్ చిత్తు
టీమిండియా స్టార్ ఆల్రౌండర్ రవీంద్ర జడేజా(Ravindra Jadeja) తన రంజీ పునరాగమనంలో సత్తాచాటాడు. రంజీ ట్రోఫీ 2024-25లో సౌరాష్ట్రకు ప్రాతినిధ్యం వహిస్తున్న జడేజా.. ఢిల్లీతో జరిగిన మ్యాచ్లో 12 వికెట్లతో చెలరేగాడు. తొలి ఇన్నింగ్స్లో 5 వికెట్లు పడగొట్టిన జడ్డూ.. రెండో ఇన్నింగ్స్లో 7 వికెట్లతో మెరిశాడు. అతడి స్పిన్ మయాజాలానికి ప్రత్యర్ధి బ్యాటర్లు విల్లవిల్లాడారు. అటు బ్యాటింగ్లోనూ జడేజా అదరగొట్టాడు. 38 పరుగులతో కీలక ఇన్నింగ్స్ ఆడాడు.ఢిల్లీని చిత్తు చేసిన సౌరాష్ట్ర..ఇక ఈ మ్యాచ్లో ఢిల్లీపై సౌరాష్ట్ర 10 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. ఈ మ్యాచ్ కేవలం రెండు రోజుల్లో మాత్రమే ముగిసిపోయింది. ఢిల్లీ విధించిన 15 పరుగుల స్వల్ప లక్ష్యాన్ని సౌరాష్ట్ర జట్టు వికెట్ నష్టపోకుండా చేధించింది. ఓపెనర్లు హర్విక్ దేశాయ్(6), అర్పిత్ రానా(4) ఆజేయంగా నిలిచి మ్యాచ్ను ఫినిష్ చేశారు.కాగా అంతకముందు 163/5 ఓవర్నైట్ స్కోర్తో రెండో రోజు ఆటను ప్రారంభించిన సౌరాష్ట్ర తమ తొలి ఇన్నింగ్స్లో 271 పరుగులకు ఆలౌటైంది. దీంతో సౌరాష్ట్రకు తొలి ఇన్నింగ్స్లో 83 పరుగుల ఆధిక్యం లభించింది. సౌరాష్ట్ర బ్యాటర్లలో హర్విక్ దేశాయ్(93) టాప్ స్కోరర్గా నిలవగా.. వాస్వాద(62), జడేజా(38) పరుగులతో రాణించారు.ఢిల్లీ బౌలర్లలో హర్ష్ త్యాగీ నాలుగు వికెట్లు పడగొట్టగా.. అయూష్ బదోని మూడు వికెట్లు సాధించాడు. అనంతరం 83 పరుగుల లోటుతో రెండో ఇన్నింగ్స్ను ప్రారంభించిన ఢిల్లీ కేవలం 94 పరుగులకే ఆలౌటైంది. దీంతో సౌరాష్ట్రముందు ఢిల్లీ కేవలం 15 పరుగుల లక్ష్యాన్ని మాత్రమే ఉంచగల్గింది.ఢిల్లీ ఇన్నింగ్స్లో కెప్టెన్ అయూష్ బదోని(44) టాప్ స్కోరర్గా నిలిచాడు. ఢిల్లీ స్టార్ ప్లేయర్ రిషబ్ పంత్(Rishabh Pant) రెండు ఇన్నింగ్స్లలో తీవ్రనిరాశపరిచాడు. తొలి ఇన్నింగ్స్లో కేవలం ఒక్క పరుగు మాత్రమే చేసిన పంత్.. రెండో ఇన్నింగ్స్లో 17 పరుగులు చేసి ఔటయ్యాడు. సౌరాష్ట్ర బౌలర్లలో జడేజా(7 వికెట్లు)తో పాటు దర్మేంద్ర జడేజా రెండు వికెట్లు సాధించారు. కాగా తొలి ఇన్నింగ్స్లో ఢిల్లీ 188 పరుగులకు ఆలౌటైంది.ఇక 12 వికెట్లతో మెరిసిన రవీంద్ర జడేజాకు ప్లేయర్ ఆఫ్ది మ్యాచ్ అవార్డు దక్కింది.చదవండి: రోహిత్, కోహ్లి పరుగుల వరద పారించడం ఖాయం: ఇర్ఫాన్ పఠాన్ -
ఘోరంగా విఫలమైన రోహిత్, యశస్వి, గిల్, పంత్.. ఐదు వికెట్లతో సత్తా చాటిన జడేజా
రంజీ ట్రోఫీ 2024-25 సెకెండ్ లెగ్ మ్యాచ్లు ఇవాల్టి నుంచి (జనవరి 23) ప్రారంభమయ్యాయి. ఖాళీగా ఉన్న టీమిండియా ఆటగాళ్లంతా రంజీల్లో తప్పక ఆడాలని బీసీసీఐ కండీషన్ పెట్టిన నేపథ్యంలో హేమాహేమీలంతా బరిలోకి దిగారు. ముంబై తరఫున రోహిత్ శర్మ, యశస్వి జైస్వాల్, శ్రేయస్ అయ్యర్.. పంజాబ్ తరఫున శుభ్మన్ గిల్.. ఢిల్లీ తరఫున రిషబ్ పంత్.. సౌరాష్ట్ర తరఫున రవీంద్ర జడేజా తమ అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారు.తేలిపోయిన పంత్.. ఐదేసిన జడేజాఎలైట్ గ్రూప్ డిలో భాగంగా ఇవాళ ఢిల్లీ, సౌరాష్ట్ర జట్లు తలపడుతున్నాయి. ఈ మ్యాచ్లో తొలుత బ్యాటింగ్ చేసిన ఢిల్లీ 188 పరుగులకే ఆలౌటైంది. ఢిల్లీ తరఫున బరిలోకి దిగిన టీమిండియా స్టార్ రిషబ్ పంత్ దారుణంగా విఫలమయ్యాడు. పంత్ 10 బంతులు ఎదుర్కొని ఒక్క పరుగు మాత్రమే చేసి వెనుదిరిగాడు. ఆయుశ్ బదోని (60), యశ్ ధుల్ (44), మయాంక్ గుసెయిన్ (38 నాటౌట్) ఓ మోస్తరు ఇన్నింగ్స్లు ఆడటంతో ఢిల్లీ ఈ మాత్రం స్కోరైనా చేయగలిగింది. ఢిల్లీ బ్యాటింగ్ లైనప్ను టీమిండియా స్టార్ ఆల్రౌండర్ రవీంద్ర జడేజా కకావికలం చేశాడు. జడ్డూ 17.4 ఓవర్లలో 66 పరుగులిచ్చి ఐదు వికెట్లు తీశాడు. జడేజాకు మరో జడేజా (ధర్మేంద్రసిన్హ్) తోడయ్యాడు. ఈ జడేజా 19 ఓవర్లలో 63 పరుగులిచ్చి 3 వికెట్లు పడగొట్టాడు. సౌరాష్ట్ర కెప్టెన్ జయదేవ్ ఉనద్కత్, యువరాజ్ సింగ్ దోడియా తలో వికెట్ దక్కించుకున్నారు. ఢిల్లీ ఇన్నింగ్స్ చివరి రెండు బంతులకు వికెట్లు తీసిన రవీంద్ర జడేజాకు సెకెండ్ ఇన్నింగ్స్లో హ్యాట్రిక్ తీసే అవకాశం ఉంటుంది. 36 ఏళ్ల జడ్డూకు ఫస్ట్ క్లాస్ కెరీర్లో ఇది 35వ ఐదు వికెట్ల ఘనత.పేలవ ఫామ్ను కొనసాగించిన రోహిత్.. నిరాశపరిచిన జైస్వాల్, శ్రేయస్, దూబేఎలైట్ గ్రూప్-ఏలో భాగంగా రోహిత్ శర్మ, జైస్వాల్ ప్రాతినిథ్యం వహిస్తున్న ముంబై.. జమ్మూ అండ్ కశ్మీర్తో తలపడుతుంది. ఈ మ్యాచ్లో పటిష్టమైన బ్యాటింగ్ లైనప్ కలిగిన ముంబై.. జమ్మూ అండ్ కశ్మీర్ బౌలర్ల ధాటికి విలవిలలాడిపోయింది. ముంబై తొలి ఇన్నింగ్స్లో 33.2 ఓవర్లలో 120 పరుగులకే కుప్పకూలింది. టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ పేలవ ప్రదర్శన రంజీల్లోనూ కొనసాగింది. హిట్మ్యాన్ కేవలం 3 పరుగులకే వెనుదిరిగాడు. మరో టీమిండియా స్టార్ యశస్వి జైస్వాల్ 4 పరుగులకే ఔటయ్యాడు. టీమిండియా పరిమిత ఓవర్ల స్పెషలిస్ట్లు శ్రేయస్ అయ్యర్ (11), శివమ్ దూబే (0) నిరాశపరిచారు. ముంబై కెప్టెన్, టీమిండియా ఆటగాడు అజింక్య రహానే (12) కూడా తేలిపోయాడు. పీకల్లోతు కష్టాల్లో ఉన్న ముంబైను మరో టీమిండియా ఆటగాడు శార్దూల్ ఠాకూర్ (51) గట్టెక్కించే ప్రయత్నం చేశాడు. శార్దూల్ హాఫ్ సెంచరీ పుణ్యమా అని ముంబై 100 పరుగుల మార్కును దాటగలిగింది. శార్దూల్కు తనుశ్ కోటియన్ (26) కాసేపు సహకరించాడు. జమ్మూ అండ్ కశ్మీర్ బౌలర్లు యుద్వీర్ సింగ్ చరక్ (8.2-2-31-4), ఉమర్ నజీర్ మిర్ (11-2-41-4), ఆకిబ్ నబీ దార్ (13-3-36-2) స్టార్లతో నిండిన ముంబై బ్యాటింగ్ లైనప్కు బెంబేలెత్తించారు.తీరు మార్చుకోని గిల్గిల్ వైఫల్యాల పరంపర రంజీల్లోనూ కొనసాగుతుంది. బీజీటీ వచ్చిన అవకాశాలను సద్వినియోగం చేసుకోలేకపోయిన గిల్.. కర్ణాటకతో జరుగుతున్న రంజీ మ్యాచ్లోనూ నిరాశపరిచాడు. ఈ మ్యాచ్లో తొలుత బ్యాటింగ్ చేసిన పంజాబ్ 55 పరుగులకే కుప్పకూలింది. కర్ణాటక బౌలర్లు ఆకాశమే హద్దుగా చెలరేగి పంజాబ్ ఇన్నింగ్స్ను మట్టుబెట్టారు. వి కౌశిక్ 4, అభిలాశ్ షెట్టి 3, ప్రసిద్ద్ కృష్ణ 2, యశోవర్దన్ పరంతాప్ ఓ వికెట్ పడగొట్టారు. ఈ మ్యాచ్లో పంజాబ్ సారధిగా వ్యవహరిస్తున్న గిల్ కేవలం 4 పరుగులకే ఔటయ్యాడు. పంజాబ్ ఇన్నింగ్స్లో రమన్దీప్సింగ్ (16), మార్కండే (12) మాత్రమే రెండంకెల స్కోర్ చేయగలిగారు. -
టాప్లో బుమ్రా, జడేజా.. దిగజారిన రోహిత్ శర్మ ర్యాంక్
ఐసీసీ టెస్టు బౌలర్ల ర్యాంకింగ్స్లో టీమిండియా స్టార్ పేసర్ జస్ప్రీత్ బుమ్రా(jasprith Bumrah) హవా కొనసాగుతున్నాడు. ఐసీసీ తాజాగా ప్రకటించిన ర్యాంకింగ్స్లో బుమ్రా 904 పాయింట్లతో తన అగ్రస్ధానాన్ని మరింత పదిలం చేసుకున్నాడు. బోర్డర్ గవాస్కర్ ట్రోఫీ 2024-25 సిరీస్లో బుమ్రా అద్బుతమైన ప్రదర్శన కనబరిచాడు.మొత్తం 5 టెస్టుల్లో 13.06 సగటుతో 32 వికెట్లు సాధించి ప్లేయర్ ఆఫ్ది సిరీస్గా బుమ్రా నిలిచాడు. ఈ క్రమంలోనే తన టెస్టు రేటింగ్ పాయింట్స్ను బుమ్రా మెరుగుపరుచుకున్నాడు. ఇక బౌలర్ల ర్యాంకింగ్స్లో బుమ్రా తర్వాత స్ధానాల్లో వరుసగా ఆసీస్ కెప్టెన్ ప్యాట్ కమ్మిన్స్(841), సౌతాఫ్రికా స్టార్ పేసర్ కగిసో రబాడ(837) కొనసాగుతున్నారు.మరోవైపు ఆల్రౌండర్ల ర్యాంకింగ్స్లో టీమిండియా స్టార్ ప్లేయర్ రవీంద్ర జడేజా(Ravindra jadeja) తన అగ్రస్ధానాన్ని సుస్థిరం చేసుకున్నాడు. జడేజా ఖాతాలో ప్రస్తుతం 400 రేటింగ్ పాయింట్లు ఉన్నాయి. ఆస్ట్రేలియాతో సిరీస్లో జడేజా పర్వాలేదన్పించాడు. మిగితా ప్లేయర్లతో పోలిస్తే కాస్త మెరుగ్గానే కన్పించాడు.ఈ సిరీస్లో మొత్తం ఐదు మ్యాచ్లు ఆడిన జడ్డూ.. 27 సగటుతో 135 పరుగులు చేశాడు. జడేజా తర్వాత స్ధానాల్లో ప్రోటీస్ ఆల్రౌండర్ మార్కో జాన్సెన్ (294), బంగ్లా ప్లేయర్ మెహిదీ హసన్ (294) నిలిచారు. ఇక బ్యాటర్ల ర్యాంకింగ్స్ విషయానికి వస్తే.. టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ(Rohit sharma) ర్యాంక్ మరింత దిగజారింది.రోహిత్ ఒక స్ధానం దిగజారి 43వ ర్యాంక్లో కొనసాగుతున్నాడు. బీజీటీ సిరీస్లో రోహిత్ తీవ్ర నిరాశపరిచాడు. కాగా బీజీటీ సిరీస్లో రోహిత్ శర్మ తీవ్ర నిరాశపరిచాడు. అటు కెప్టెన్సీ, ఇటు బ్యాటింగ్ పరంగా రోహిత్ శర్మ పూర్తిగా తేలిపోయాడు. ఐదు ఇన్నింగ్స్ల్లో కేవలం 31 పరుగులు మాత్రమే చేశాడు. రోహిత్ తన ఫామ్ను తిరిగి పొందేందుకు పదేళ్ల తర్వాత రంజీల్లో ఆడనున్నాడు.చదవండి: Ind vs Eng: అతడికి ఇదే చివరి అవకాశం.. ఊపిరి కూడా ఆడనివ్వడు! -
జడేజా స్ధానంలో అతడికి ఛాన్స్ ఇవ్వాల్సింది: ఆకాష్ చోప్రా
ఛాంపియన్స్ ట్రోఫీ 2025 కోసం ఎంపిక చేసిన భారత జట్టుపై భిన్నాభిప్రాయాలు వ్యక్తం అవుతున్న సంగతి తెలిసిందే. ముఖ్యంగా ఈ జట్టులో స్టార్ పేసర్ మహ్మద్ సిరాజ్కు చోటు దక్కకపోవడం తీవ్ర చర్చానీయంశమైంది. అతడి స్ధానంలో యువ ఫాస్ట్ బౌలర్ అర్ష్దీప్ సింగ్కు సెలక్టర్లు ఛాన్స్ ఇచ్చారు.దీంతో సెలక్టర్ల నిర్ణయాన్ని పలువురు మాజీ క్రికెటర్లు తప్పుబడుతున్నారు. ఈ జాబితాలో తాజాగా భారత మాజీ క్రికెటర్ ఆకాష్ చోప్రా చేరాడు. జడేజా స్ధానంలో సిరాజ్కు ఛాన్స్ ఇచ్చి ఉంటే జట్టు బౌలింగ్ యూనిట్ బలంగా ఉండేది అని చోప్రా అభిప్రాయపడ్డాడు. చాంపియన్స్ ట్రోఫీలో పాల్గోనే భారత జట్టు.. జస్ప్రీత్ బుమ్రా, మహ్మద్ షమీ, అర్ష్దీప్ సింగ్లతో కూడిన బలమైన పేస్ బౌలింగ్ ఎటాక్ను కలిగింది. అయినప్పటికి గత రెండేళ్ల నుంచి వన్డేల్లో అద్బుతంగా రాణిస్తున్న సిరాజ్ను జట్టు నుంచి తప్పించడం క్రికెట్ వర్గాల్లో హాట్టాపిక్గా మారింది. గత 43 వన్డే ఇన్నింగ్స్ల్లో 24.04 యావరేజ్తో 71 వికెట్లు తీశాడు మహ్మద్ సిరాజ్. 5.18 ఎకానమీతో పరుగులు ఇచ్చాడు. కొన్నాళ్లపాటు వన్డే నెం1 బౌలర్గా కూడా సిరాజ్ కొనసాగాడు."చాంపియన్స్ ట్రోఫీలో పాల్గోనే భారత జట్టులో మహ్మద్ సిరాజ్కు ఛాన్స్ ఇవ్వాల్సింది. సెలక్టర్లు ఎంపిక చేసిన జట్టులో కుల్దీప్ యాదవ్, అక్షర్ పటేల్, రవీంద్ర జడేజా రూపంలో ముగ్గురు లెఫ్ట్ ఆర్మ్ స్పిన్నర్లు ఉన్నారు. వారిలో ఒకరిని పక్కన పెట్టాల్సింది. నా వరకు అయితే రవీంద్ర జడేజా స్ధానంలో సిరాజ్ను ఎంపిక చేయాల్సింది. సిరాజ్ జట్టులో ఉండి ఉంటే కొత్త బంతితో అద్బుతంగా బౌలింగ్ చేసేవాడు. నిజం చెప్పాలంటే జడేజాకు తుది జట్టులో చోటు దక్కే అవకాశాలు కూడా తక్కువగా ఉన్నాయి. అటువంటి అతడిని ఎంపిక చేయడం ఎటువంటి లాభం ఉండదు. అదే సిరాజ్ను తీసుకుని ఉంటే ఎక్స్ ఫ్యాక్టర్గా మారేవాడు" అని చోప్రా తన యూట్యూబ్ ఛానల్లో పేర్కొన్నాడు. ఈ మెగా టోర్నీ ఫిబ్రవరి 19 నుంచి ప్రారంభం కానుంది.ఛాంపియన్స్ ట్రోఫీకి భారత జట్టు: రోహిత్ శర్మ (కెప్టెన్), శుభమన్ గిల్ (విసి), విరాట్ కోహ్లీ, శ్రేయాస్ అయ్యర్, కెఎల్ రాహుల్, హార్దిక్ పాండ్యా, అక్షర్ పటేల్, వాషింగ్టన్ సుందర్, కుల్దీప్ యాదవ్, జస్ప్రీత్ బుమ్రా, మహ్మద్ షమీ, అర్ష్దీప్ సింగ్, యశస్వి జైస్వాల్, రిషబ్ పంత్, రవీంద్ర జడేజా.ట్రావెలింగ్ రిజర్వ్స్: వరుణ్ చక్రవర్తి, ఆవేశ్ ఖాన్, నితీశ్ కుమార్ రెడ్డిచదవండి: చాంపియన్స్ ట్రోఫీ జట్టులో నో ఛాన్స్: సిరాజ్ కీలక నిర్ణయం!? -
రంజీ బాటలో జడేజా
న్యూఢిల్లీ: జాతీయ జట్టుకు ప్రాతినిధ్యం వహించాలంటే... దేశవాళీల్లో తప్పక ఆడాలని భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) చేసిన హెచ్చరికలు ఫలితాన్నిస్తున్నాయి. గతంలో అంతర్జాతీయ షెడ్యూల్ లేని సమయంలో కూడా దేశవాళీ మ్యాచ్లకు దూరంగా ఉన్న టీమిండియా ఆటగాళ్లు ఇప్పుడు... రంజీ ట్రోఫీలో ఆడేందుకు ఆసక్తి చూపుతున్నారు. ఆస్ట్రేలియా పర్యటనలో పేలవ ప్రదర్శన చేసిన భారత కెప్టెన్ రోహిత్ శర్మ ముంబై జట్టు తరఫున బరిలోకి దిగనున్నట్లు స్పష్టం చేయగా... ఇప్పుడు ఆ జాబితాలో స్పిన్ ఆల్రౌండర్ రవీంద్ర జడేజా కూడా చేరాడు. చివరిసారిగా రెండేళ్ల క్రితం సౌరాష్ట్ర తరఫున బరిలోకి దిగిన జడేజా... ఈ నెల 23 నుంచి ఢిల్లీతో జరగనున్న మ్యాచ్లో ఆడనున్నాడు. ఆదివారం రాజ్కోట్లో సౌరాష్ట్ర జట్టు సభ్యులతో కలిసి జడేజా ప్రాక్టీస్ సెషన్లో పాల్గొన్నాడు. ‘జడేజా ప్రాక్టీస్లో పాల్గొన్నాడు. ఢిల్లీతో జరగనున్న మ్యాచ్లో అతడు బరిలోకి దిగుతాడు’ అని సౌరాష్ట్ర క్రికెట్ అసోసియేషన్ అధ్యక్షుడు జయ్దేవ్ షా తెలిపారు. గతేడాది టి20 ప్రపంచకప్ అనంతరం ఆ ఫార్మాట్కు వీడ్కోలు పలికిన ఈ స్పిన్ ఆల్రౌండర్... చాంపియన్స్ ట్రోఫీకి ఎంపిక చేసిన జట్టులో చోటు దక్కించుకున్నాడు. స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లి గాయం కారణంగా రంజీ మ్యాచ్ ఆడలేనని వెల్లడించగా... రిషబ్ పంత్, శుబ్మన్ గిల్, యశస్వి జైస్వాల్ కూడా తమ తమ జట్ల తరఫున రంజీ మ్యాచ్లు ఆడనున్నారు. దీంతో ఢిల్లీ, సౌరాష్ట్ర మధ్య జరిగే మ్యాచ్లో ఢిల్లీ తరఫున రిషబ్ పంత్, సౌరాష్ట్ర తరఫున జడేజా ఆడనున్నారు. విదర్భతో పోరుకు సిరాజ్ భారత పేసర్ మొహమ్మద్ సిరాజ్ హైదరాబాద్ తరఫున రంజీ మ్యాచ్ ఆడనున్నాడు. ఆస్ట్రేలియాతో ‘బోర్డర్–గావస్కర్ ట్రోఫీ’లో ఐదు టెస్టు మ్యాచ్లాడిన సిరాజ్... పని భారం కారణంగా ఈ నెల 23 నుంచి హిమాచల్ ప్రదేశ్, హైదరాబాద్ మధ్య జరగనున్న మ్యాచ్కు ఆడకూడదని నిర్ణయించుకున్నాడు. అయితే గ్రూప్ దశలో హైదరాబాద్ ఆడే చివరి మ్యాచ్లో సిరాజ్ బరిలోకి దిగనున్నట్లు హైదరాబాద్ క్రికెట్ సంఘం (హెచ్సీఏ) వర్గాలు వెల్లడించాయి. ‘వర్క్లోడ్ కారణంగా హిమాచల్ ప్రదేశ్తో మ్యాచ్లో సిరాజ్ ఆడటం లేదు. విదర్భతో పోరులో మాత్రం అతడు జట్టులో ఉంటాడు’ అని ఓ హెచ్సీఏ అధికారి తెలిపారు. ఐసీసీ చాంపియన్స్ ట్రోఫీ కోసం ఎంపిక చేసిన భారత జట్టులో సిరాజ్కు చోటు దక్కని విషయం తెలిసిందే. కొత్త బంతితో పాటు పాత బంతితోనూ మెరుగైన ప్రదర్శన చేయగలడనే నమ్మకంతో సెలెక్టర్లు సిరాజ్ను కాదని అర్‡్షదీప్ సింగ్ను ఎంపిక చేశారు. -
రవీంద్ర జడేజా రిటైర్మెంట్..! హింట్ ఇచ్చిన స్టార్ ఆల్రౌండర్
టీమిండియా స్టార్ ఆల్ రౌండర్ రవీంద్ర జడేజా టెస్టులకు గుడ్బై చెప్పనున్నాడా? అంటే అవును అనే సమాధనమే ఎక్కువ విన్పిస్తోంది. ఆస్ట్రేలియాతో సిడ్నీలో ఆడిన టెస్టే తన చివరి మ్యాచ్, త్వరలోనే జడ్డూ రెడ్ బాల్ క్రికెట్కు విడ్కోలు పలకనున్నాడని వార్తలు వినిపిస్తున్నాయి.తాజాగా జడేజా పెట్టిన ఓ పోస్ట్ ఈ వార్తలకు మరింత ఊతమిస్తోంది. సిడ్నీ టెస్టు మ్యాచ్లో మూడో ధరించిన జెర్సీ ఫొటోను ఈ సౌరాష్ట్ర క్రికెటర్ ఇన్స్టాగ్రామ్లో షేర్ చేశాడు. ప్రస్తుతం ఈ ఫోటో సోషల్ మీడియాలో వైరలవుతోంది. దీంతో అతడు టెస్టులకు గుడ్బై చెప్పనున్నాడనే ప్రచారం మరింత ఊపందుకుంది.ఇక బోర్డర్ గవాస్కర్ ట్రోఫీ 2024-25లో జడేజా పర్వాలేదన్పించాడు. మిగితా క్రికెటర్లతో పోలిస్తే కాస్త మెరుగ్గానే కన్పించాడు. ఈ సిరీస్లో మొత్తం ఐదు మ్యాచ్లు ఆడిన జడ్డూ.. 27 సగటుతో 135 పరుగులు చేశాడు.అదే విధంగా బౌలింగ్లో నాలుగు వికెట్లు పడగొట్టాడు. ఓవరాల్గా ఇప్పటి వరకు 80 టెస్ట్లు ఆడిన జడేజా 3, 370 పరుగులు చేసి 323 వికెట్లు పడగొట్టాడు. కాగా సిరీస్ను 3-1 తేడాతో భారత్ కోల్పోయిన సంగతి తెలిసిందే. అదే విధంగా ఈ సిరీస్ మధ్యలోనే స్టార్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ అంతర్జాతీయ క్రికెట్కు విడ్కోలు పలికాడు. వన్డేల్లో డౌటే..ఇక ఇప్పటికే టీ20లకు విడ్కోలు పలికిన రవీంద్ర జడేజా.. వన్డేల్లో ఆడేది కూడా అనుమానమే. ప్రస్తుత పరిస్థితుల దృష్టా భారత వన్డే జట్టులో జడేజా చోటు ప్రశ్నర్ధాకంగా మారింది. జడేజా వన్డే కెరీర్ ముగిసినట్లు పలు రిపోర్ట్లు పేర్కొంటున్నాయి. ఇంగ్లండ్తో వన్డేలు, ఛాంపియన్స్ ట్రోఫీకి అతడి స్దానంలో ఆల్రౌండర్ అక్షర్ పటేల్, వాషింగ్టన్ సుందర్ పేర్లను సెలక్టర్లు పరిశీలిస్తున్నారు. వీరిద్దరూ ఇప్పటికే తమకు వచ్చిన అవకాశాలను సద్వినియోగ పరుచుకున్నారు. ఇంగ్లీష్ జట్టుతో సిరీస్కు, ఛాంపియన్స్ ట్రోఫీకి భారత జట్టును బీసీసీఐ ఒకట్రెండు రోజుల్లో ప్రకటించే అవకాశముంది. ఒకవేళ ఈ జట్టులో జడ్డూ చోటు దక్కకపోతే పూర్తిగా అంతర్జాతీయ క్రికెట్కు విడ్కోలు పలికే అవకాశముందని క్రికెట్ నిపుణులు అభిప్రాయపడుతున్నారు. ఇప్పటివరకు 197 వన్డేలు ఆడిన జడేజా 2756 పరుగులతో పాటు 220 వికెట్లు తీసుకున్నాడు.చదవండి: CT 2025: ఛాంపియన్స్ ట్రోఫీకి ముందు స్టార్ ప్లేయర్ రిటైర్మెంట్.. -
గల్లీ క్రికెట్ ఆడుతున్నావా?.. చెప్పింది చెయ్: రోహిత్ శర్మ ఫైర్
ఆస్ట్రేలియాతో నాలుగో టెస్టులో టీమిండియాకు శుభారంభం లభించలేదు. తొలిరోజు అద్భుత ఆట తీరు కనబరిచిన ఆతిథ్య ఆసీస్ పైచేయి సాధించింది. ఆది నుంచి భారత జట్టుపై ఆధిపత్యం చెలాయిస్తూ పటిష్ట స్థితిలో నిలిచింది. ఆసీస్ బ్యాటర్లను కట్టడి చేయడానికి టీమిండియా బౌలర్లు కష్టపడాల్సి వచ్చింది.భారత బౌలర్ల సహనానికి పరీక్షముఖ్యంగా అరంగేట్ర ఓపెనర్, 19 ఏళ్ల సామ్ కొన్స్టాస్(Sam Konstas) కొరకరాని కొయ్యగా మారి.. భారత బౌలర్ల సహనాన్ని పరీక్షించాడు. అంతర్జాతీయ క్రికెట్లో తొలి మ్యాచ్ ఆడుతున్నప్పటికీ అనుభవజ్ఞుడిలా దూకుడు ప్రదర్శించాడు. అయితే, ఎట్టకేలకు రవీంద్ర జడేజా కొన్స్టాస్ను వికెట్ల ముందు దొరకబుచ్చుకోవడంతో అతడి ఇన్నింగ్స్కు తెరపడింది.మరో ఓపెనర్ ఉస్మాన్ ఖవాజా(57), మార్నస్ లబుషేన్(72) కూడా అర్ధ శతకాలతో రాణించగా.. ట్రవిస్ హెడ్(0), మిచెల్ మార్ష్(4) మాత్రం పూర్తిగా విఫలమయ్యారు. మరోవైపు.. వికెట్ కీపర్ అలెక్స్ క్యారీ(31) కూడా తక్కువ స్కోరుకే పరిమితమయ్యాడు. ఇక స్టీవ్ స్మిత్ సైతం బ్యాట్ ఝులిపించాడు. తొలిరోజు ఆట పూర్తయ్యేసరికి స్మిత్ కూడా హాఫ్ సెంచరీ పూర్తి చేసుకుని అజేయంగా నిలిచాడు.సహనం కోల్పోయిన రోహిత్ఈ నేపథ్యంలో చిరాకెత్తిపోయిన టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ(Rohit Sharma) మైదానంలోనే చాలాసార్లు తన అసహనాన్ని వ్యక్తం చేశాడు. ఈ క్రమంలో ఫీల్డింగ్ విషయంలో నిర్లక్ష్యంగా కనిపించిన యశస్వి జైస్వాల్పై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశాడు. జడ్డూ బౌలింగ్లో స్మిత్ డిఫెన్సివ్ షాట్ ఆడగా.. సిల్లీ పాయింట్లో ఫీల్డింగ్ చేస్తున్న జైస్వాల్(Yashasvi Jaiswal) బంతిని ఆపాల్సింది పోయి.. జంప్ చేశాడు.ఏయ్.. గల్లీ క్రికెట్ ఆడుతున్నావా?అంతేకాదు.. అక్కడి నుంచి కొంచెం కూడా కదలకుండా అలాగే నిల్చుండిపోయాడు. ఇక జడ్డూ అప్పటికే బంతిని ఆపేందుకు పరుగెత్తాడు. ఈ ఘటన నేపథ్యంలో అసహనానికి గురైన రోహిత్ శర్మ.. ‘‘ఏయ్ జైసూ.. ఇక్కడ ఏమైనా గల్లీ క్రికెట్ ఆడుతున్నావా? బ్యాటర్ బంతిని టచ్ చేసేంత వరకు నీ పొజిషన్లోనే ఉండు. కింద కూర్చున్నట్లుగానే ఉండు. అంతేగానీ.. నిలబడేందుకు ప్రయత్నించకు’’ అంటూ చివాట్లు పెట్టాడు. ఇందుకు సంబంధించిన వీడియో వైరల్గా మారింది.తొలిరోజు కంగారూలదేకాగా మెల్బోర్న్ వేదికగా జరుగుతున్న నాలుగో టెస్టులో ఆస్ట్రేలియా మొదటిరోజే మెరుగైన స్కోరు సాధించింది. బాక్సింగ్ డే(క్రిస్మస్ తెల్లవారి) మ్యాచ్లో టాపార్డర్ దంచికొట్టడంతో మూడు వందల పైచిలుకు స్కోరు సాధించింది. 86 ఓవర్ల ఆటలో ఆరు వికెట్లు నష్టపోయి 311 రన్స్ చేసింది. ఇక స్టీవ్ స్మిత్ 68, ప్యాట్ కమిన్స్ 8 పరుగులతో క్రీజులో ఉన్నారు. భారత బౌలర్లలో పేసర్ జస్ప్రీత్ బుమ్రా మూడు. ఆకాశ్ దీప్ ఒక వికెట్ తీయగా.. స్పిన్నర్లు రవీంద్ర జడేజా, వాషింగ్టన్ సుందర్ ఒక్కో వికెట్ తమ ఖాతాలో వేసుకున్నారు. చదవండి: IND vs AUS: బుమ్రా సూపర్ బాల్..హెడ్ మైండ్ బ్లాంక్! వీడియోStump Mic Gold ft. THE BEST, @ImRo45! 🎙️😂The Indian skipper never fails to entertain when he’s near the mic! 😁#AUSvINDOnStar 👉 4th Test, Day 1 LIVE NOW pic.twitter.com/1fnc6X054a— Star Sports (@StarSportsIndia) December 26, 2024 -
ఆస్ట్రేలియా గడ్డపై హ్యాట్రిక్ కొడతాం: రవీంద్ర జడేజా
మెల్బోర్న్ వేదికగా డిసెంబర్ 26 నుంచి ఆస్ట్రేలియాతో జరగనున్న నాలుగో టెస్టుకు టీమిండియా సిద్దమవుతోంది. ఈ మ్యాచ్లో గెలిచి సిరీస్లో ఆధిక్యం సాధించాలని పట్టుదలతో ఉంది. ఇప్పటికే మెల్బోర్న్ చేరుకున్న రోహిత్ సేన నెట్స్లో తీవ్రంగా శ్రమిస్తోంది. ఈ క్రమంలో శనివారం ప్రాక్టీస్ అనంతరం టీమిండియా స్టార్ ఆల్రౌండర్ రవీంద్ర జడేజా విలేకరుల సమావేశంలో మాట్లాడాడు.మెల్బోర్న్ టెస్టులో భారత టాపార్డర్నుంచి మరింత మెరుగైన ప్రదర్శన ఆశిస్తున్నట్లు జడేజా అన్నాడు. ఆరంభంలో పరుగులు రాకపోతే ఆ తర్వాత ఒత్తిడి పెరిగిపోతుందని అతను అభిప్రాయ పడ్డాడు.‘ఆ్రస్టేలియా, దక్షిణాఫ్రికాలాంటి చోట టాపార్డర్ పరుగులు కీలకంగా మారతాయి. వారు పరుగులు చేయకపోతే లోయర్ ఆర్డర్పై చాలా ఒత్తిడి పెరిగిపోతుంది. ఈ టెస్టులో అలా జరగదని ఆశిస్తున్నా. జట్టుగా చూస్తే బ్యాటింగ్లో అందరూ రాణిస్తేనే భారీ స్కోరుకు అవకాశం ఉన్నా టాపార్డర్, మిడిలార్డర్ పరుగులు ప్రధానం’ అని జడేజా వ్యాఖ్యానించాడు.గత మ్యాచ్లో బ్యాటింగ్లో రాణించడం పట్ల సంతృప్తి వ్యక్తం చేసిన జడేజా... ఆసీస్ గడ్డపై అడుగు పెట్టిన దగ్గరినుంచి పరిస్థితులను దృష్టిలో పెట్టుకుంటూ సాధన చేసినట్లు వెల్లడించాడు.‘మూడు టెస్టుల తర్వాత 1–1తో సమంగా ముందుకు వెళ్లడం మంచి స్థితిగా భావిస్తున్నా. తర్వాతి రెండు మ్యాచ్లు ఆసక్తికరంగా సాగుతాయి. మేం ఒకటి గెలిచినా చాలు బోర్డర్–గావస్కర్ ట్రోఫీని నిలబెట్టుకుంటాం. ఇందులో సత్తా చాటితే చివరి టెస్టు గురించి ఆలోచన లేకుండా ఫలితం సాధించవచ్చు. గత పర్యాయాలు ఇక్కడ భారత్ సిరీస్ గెలిచింది. ఇప్పుడు హ్యాట్రిక్పై కన్నేశాము" అని జడ్డూ పేర్కొన్నాడు. -
IND vs AUS 3rd Test: ఫాలో ఆన్ గండం గట్టెక్కిన భారత్
IND vs AUS 3rd Test Day 4 live updates and highlights: బ్రిస్బేన్ వేదికగా భారత్-ఆస్ట్రేలియా మధ్య మూడో టెస్టు నాలుగో రోజు ఆట ప్రారంభమైంది.ఫాలో ఆన్ గండం గట్టెక్కిన భారత్బ్రిస్బేన్ టెస్టులో టీమిండియా ఫాలో ఆన్ గండం నుంచి తప్పించుకుంది. టెయిలాండర్లు ఆకాష్ దీప్(27 బ్యాటింగ్), జస్ప్రీత్ బుమ్రా(10 బ్యాటింగ్) అద్బుతమైన పోరాటంతో భారత్ను మ్యాచ్లో నిలిపారు. పదో వికెట్కు వీరిద్దరూ 39 పరుగుల ఆజేయ భాగస్వామ్యం నెలకొల్పారు. వెలుతురు లేమి కారణంగా నాలుగో రోజు ఆటను 14 ఓవర్ల ముందే అంపైర్లు నిలిపేశారు. నాలుగో రోజు ఆట ముగిసే సమయానికి భారత్ 9 వికెట్ల నష్టానికి 252 పరుగులుచేసింది. టీమిండియా ఇంకా తొలి ఇన్నింగ్స్లో 193 పరుగులు వెనకంజలో ఉంది. భారత ఫాలో ఆన్ తప్పించుకోవడంలో వీరిద్దరితో పాటు కేఎల్ రాహుల్(84), జడేజా(10) కీలక పాత్ర పోషించారు.జడ్డూ అవుట్కేఎల్ రాహుల్(84) మినహా స్పెషలిస్టు బ్యాటర్లంతా విఫలమైన వేళ టీమిండియాను ఆదుకున్న స్పిన్ బౌలింగ్ ఆల్రౌండర్ రవీంద్ర జడేజా ఇన్నింగ్స్కు తెరపడింది. 77 పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద కమిన్స్ బౌలింగ్లో మార్ష్కు క్యాచ్ ఇచ్చి జడ్డూ వెనుదిరిగాడు. దీంతో భారత్ ఎనిమిదో వికెట్ కోల్పోయింది. టీమిండియా స్కోరు: 215/9 (66.2). ఫాలో ఆన్ గండం నుంచి తప్పించుకోవాలంటే భారత్ ఇంకా 30 రన్స్ చేయాలి.ఎనిమిదో వికెట్ కోల్పోయిన భారత్సిరాజ్ (1) రూపంలో టీమిండియా ఎనిమిదో వికెట్ కోల్పోయింది. స్టార్క్ బౌలింగ్లో కీపర్ క్యారీకి క్యాచ్ ఇచ్చి సిరాజ్ పెవిలియన్ చేరాడు. బుమ్రాక్రీజులోకి వచ్చాడు.భారత్ ఏడో వికెట్ డౌన్నితీశ్ రెడ్డి రూపంలో భారత్ ఏడో వికెట్ కోల్పోయింది. 16 పరుగులు చేసిన నితీశ్.. ప్యాట్ కమ్మిన్స్ బౌలింగ్లో ఔటయ్యాడు. భారత్ ఫాలో ఆన్ తప్పించుకోవాలంటే ఇంకా 52 పరుగులు కావాలి. ప్రస్తుతం భారత్ స్కోర్: 194/710:45 AM: మొదలైన ఆటవర్షం తెరిపినివ్వడంతో ఆట మళ్లీ మొదలైంది.09:53 AM: వర్షం వల్ల మరోసారి ఆగిన ఆటటీమిండియా స్కోరు: 180/6 (51.5)జడేజా 52, నితీశ్ రెడ్డి 9 పరుగులతో ఉన్నారు జడేజా హాఫ్ సెంచరీ..బ్రిస్బేన్ టెస్టులో రవీంద్ర జడేజా కీలక హాఫ్ సెంచరీ సాధించాడు. 50 ఓవర్లు ముగిసే సరికి భారత్ తమ తొలి ఇన్నింగ్స్లో 6 వికెట్ల నష్టానికి 176 పరుగులు చేసింది. క్రీజులో జడేజా(50)తో పాటు నితీశ్(8) పరుగులతో ఉన్నారు.వరుణుడు ఎంట్రీ.. నిలిచిన పోయిన ఆటబ్రిస్బేన్ వేదికగా భారత్-ఆస్ట్రేలియా మధ్య మూడో టెస్టు వరుణుడు మరోసారి అంతరాయం కలిగించాడు. వర్షం కారణంగా నాలుగో రోజు ఆట నిలిచిపోయింది. లంచ్ విరామం తర్వాత వరుణుడు ఎంట్రీ ఇవ్వడంతో ఆట ఇంకా ప్రారంభం కాలేదు. లంచ్ బ్రేక్ సమయానికి భారత్ 6 వికెట్ల నష్టానికి 147 పరుగులు చేసింది. లంచ్ బ్రేక్కు భారత్ స్కోర్: 167/6లంచ్ బ్రేక్ సమయానికి భారత్ 6 వికెట్ల నష్టానికి 147 పరుగులు చేసింది. ఫాల్ ఆన్ గండం దాటాలంటే భారత్ ఇంకా 79 పరుగులు వెనకబడి ఉంది. క్రీజులో రవీంద్ర జడేజా(41), నితీశ్ కుమార్(7) పరుగులతో ఉన్నారు.కేఎల్ రాహుల్ ఔట్..కేఎల్ రూపంలో టీమిండియా ఆరో వికెట్ కోల్పోయింది. 84 పరుగులు చేసిన కేఎల్ రాహుల్.. నాథన్ లియోన్ బౌలింగ్లో పెవిలియన్కు చేరాడు. క్రీజులోకి నితీశ్ కుమార్ రెడ్డి వచ్చాడు.సెంచరీ దిశగా కేఎల్ రాహుల్..42 ఓవర్లు ముగిసే సరికి భారత్ 5 వికెట్ల నష్టానికి 141 పరుగులు చేసింది. కేఎల్ రాహుల్(84), రవీంద్ర జడేజా(26) నిలకడగా ఆడుతున్నారు. నిలకడగా ఆడుతున్న రాహుల్, జడేజా..34 ఓవర్లు ముగిసే సరికి భారత్ తమ తొలి ఇన్నింగ్స్లో 5 వికెట్ల నష్టానికి 117 పరుగులు చేసింది. కేఎల్ రాహుల్(76), రవీంద్ర జడేజా(10) నిలకడగా ఆడుతున్నారు. భారత్ ఇంకా 328 పరుగులు వెనకబడి ఉంది.రోహిత్ శర్మ ఔట్...నాలుగో రోజు ఆట ఆరంభంలోనే టీమిండియాకు భారీ షాక్ తగిలింది. ప్యాట్ కమ్మిన్స్ బౌలింగ్లో కెప్టెన్ రోహిత్ శర్మ(10) వికెట్ కీపర్కు క్యాచ్ ఇచ్చి ఔటయ్యాడు. క్రీజులోకి రవీంద్ర జడేజా వచ్చాడు.మూడో రోజు ఆట ఆరంభం..బ్రిస్బేన్ వేదికగా భారత్-ఆస్ట్రేలియా మధ్య మూడో టెస్టు నాలుగో రోజు ఆట ప్రారంభమైంది. ఆస్ట్రేలియా బౌలింగ్ ఎటాక్ను ప్యాట్ కమ్మిన్స్ ప్రారంభించాడు. మూడో రోజు ఆట ముగిసే సమయానికి భారత్ 4 వికెట్ల నష్టానికి 51 పరుగులు చేసింది. క్రీజులో కేఎల్ రాహుల్(34), రోహిత్ శర్మ(0) ఉన్నారు. -
సిరాజ్పై మండిపడ్డ జడేజా!.. నీకు ఎందుకంత దూకుడు?
టీమిండియా స్టార్ పేసర్ మహ్మద్ సిరాజ్కు బ్రిస్బేన్లో వరుస చేదు అనుభవాలు ఎదురవుతున్నాయి. మూడో టెస్టు సందర్భంగా ఈ హైదరాబాదీ బౌలర్ను ఆస్ట్రేలియా అభిమానులు పరుష పదజాలం వాడుతూ హేళన చేశారు. అడిలైడ్ పింక్బాల్ టెస్టులో ట్రవిస్ హెడ్కు సిరాజ్ సెండాఫ్ ఇచ్చిన తీరును విమర్శిస్తూ.. అవమానించేలా గట్టిగా అరిచారు.ఆస్ట్రేలియా- భారత్ మధ్య శనివారం గబ్బా మైదానంలో మొదలైన మూడో టెస్టు తొలి రోజు ఆట సందర్భంగా సిరాజ్ను కించపరిచేలా ఆసీస్ ఫ్యాన్స్ ప్రవర్తించారు. తాజాగా ఆదివారం నాటి రెండో రోజు ఆటలోనూ సిరాజ్కు మరో చేదు అనుభవం ఎదురైంది. సహచర ఆటగాడు రవీంద్ర జడేజా.. ఈ స్పీడ్స్టర్పై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశాడు.సిరాజ్పై మండిపడ్డ జడేజా!కాగా బోర్డర్- గావస్కర్ ట్రోఫీ ఆడేందుకు టీమిండియా ఆస్ట్రేలియా పర్యటనకు వెళ్లిన విషయం తెలిసిందే. ఇందులో భాగంగా ఇరుజట్ల మధ్య ఐదు మ్యాచ్ల టెస్టు సిరీస్ జరుగుతోంది. ఈ క్రమంలో పెర్త్లో భారత్, అడిలైడ్లో ఆస్ట్రేలియా విజయం సాధించి 1-1తో సమంగా ఉన్నాయి.ఇక ఇరుజట్ల మధ్య బ్రిస్బేన్ వేదికగా గబ్బా స్టేడియంలో మూడో టెస్టు జరుగుతోంది. వర్షం వల్ల శనివారం నాటి తొలిరోజు ఆట అర్ధంతరంగా ముగిసిపోయింది. టాస్ ఓడి తొలుత బ్యాటింగ్కు దిగిన ఆతిథ్య ఆసీస్.. 13.2 ఓవర్లలో వికెట్ నష్టపోకుండా 28 పరుగులు చేసింది.బుమ్రాకు ఐదుఈ క్రమంలో ఆదివారం రెండో రోజు ఆట మాత్రం సజావుగా సాగింది. ట్రవిస్ హెడ్ భారీ శతకం(152), స్టీవ్ స్మిత్(101) సెంచరీ కారణంగా ఆసీస్ పటిష్ట స్థితిలో నిలిచింది. ఏడు వికెట్లు నష్టపోయి 405 పరుగుల మేర భారీ స్కోరు సాధించింది. భారత బౌలర్లలో ప్రధాన పేసర్ జస్ప్రీత్ బుమ్రా ఐదు వికెట్లు కూల్చగా.. సిరాజ్, నితీశ్ కుమార్ రెడ్డి తలా ఒక వికెట్ తమ ఖాతాలో వేసుకున్నారు.జడ్డూ కోపానికి కారణం అదేఇక మూడో టెస్టుతో భారత తుదిజట్టులోకి వచ్చిన స్పిన్ బౌలింగ్ ఆల్రౌండర్ రవీంద్ర జడేజా.. ఆదివారం బంతితో బరిలో దిగాడు. పదహారు ఓవర్ల పాటు బౌల్ చేసి 76 పరుగులు సమర్పించుకున్నాడు. అయితే, వికెట్ మాత్రం తీయలేకపోయాడు. అయితే, లంచ్ తర్వాత తాను బౌలింగ్ చేస్తున్న సమయంలో ఫీల్డర్ సిరాజ్ వ్యవహరించిన తీరు జడ్డూ కోపం తెప్పించింది.జడేజా బౌలింగ్లో ట్రవిస్ హెడ్ ఆఫ్సైడ్ దిశగా బంతిని తరలించి.. సింగిల్కు వచ్చాడు. ఈ క్రమంలో బాల్ను అందుకున్న సిరాజ్ కాస్త నిర్లక్ష్య రీతిలో నాన్ స్ట్రైకర్ ఎండ్ వైపు బంతిని విసిరినట్లు కనిపించింది. హెడ్ తలమీదుగా వచ్చిన ఆ బంతిని అందుకునే క్రమంలో జడ్డూ చేతి వేళ్లకు బలంగా తగిలింది.దీంతో జడేజా కోపంతో సిరాజ్ వైపు చూస్తూ ఏదో అన్నట్లుగా కనిపించింది. అంత దూకుడు అవసరమా అన్నట్లు అసహనం ప్రదర్శించాడు. ఇందుకు చిన్నబుచ్చుకున్న సిరాజ్.. సారీ అన్నట్లుగా ఎక్స్ప్రెషన్స్ ఇచ్చాడు. ఇందుకు సంబంధించిన దృశ్యాలు వైరల్ అవుతున్నాయి.నా వేలును విరగ్గొట్టేశావు పో..ఈ నేపథ్యంలో కామెంటేటర్, ఇంగ్లండ్ మాజీ క్రికెటర్ మార్క్ నికోలస్ స్పందిస్తూ.. సిరాజ్ అత్యుత్సాహం జడేజాతో మాటల యుద్ధానికి దారి తీసిందంటూ ఘాటు వ్యాఖ్యలు చేశాడు. నిజానికి జడ్డూ చేసింది సరైందేనని.. ‘‘నా వేలును విరగ్గొట్టేశావు పో.. ఏంటిది ఫ్రెండ్.. కాస్త సంయమనం పాటించు’’ అన్నట్లుగా అతడు లుక్ ఇచ్చాడని నికోలస్ పేర్కొన్నాడు.చదవండి: భారత్తో మూడో టెస్టు: ట్రవిస్ హెడ్ వరల్డ్ రికార్డు.. సరికొత్త చరిత్రpic.twitter.com/iJC2zadOh7— Sunil Gavaskar (@gavaskar_theman) December 15, 2024pic.twitter.com/oCw1kXmsYl— The Game Changer (@TheGame_26) December 15, 2024 -
వారిద్దరూ చాలా సీనియర్ ఆటగాళ్లు.. కానీ పక్కన పెట్టాల్సి వచ్చింది: రోహిత్
క్రికెట్ అభిమానులు ఎంతో ఉత్కంఠగా ఎదురుచూస్తున్న భారత్-ఆస్ట్రేలియా మధ్య పింక్ బాల్ టెస్టుకు సమయం అసన్నమైంది. శుక్రవారం(డిసెంబర్ 6) నుంచి ఆడిలైడ్ ఓవల్ వేదికగా ఈ డే అండ్ నైట్ టెస్టు ప్రారంభం కానుంది. ఈ మ్యాచ్ కోసం ఇరు జట్లు తీవ్రంగా శ్రమించాయి.ఈ అడిలైడ్ టెస్టులో ఎలాగైనా గెలిచి కమ్ బ్యాక్ ఇవ్వాలని ఆతిథ్య ఆసీస్ భావిస్తుంటే.. భారత్ మాత్రం తమ జోరును కొనసాగించాలని యోచిస్తోంది. ఈ మ్యాచ్కు ముందు టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ విలేకరుల సమావేశంలో పాల్గోనున్నాడు. ఈ సందర్భంగా స్టార్ ప్లేయర్లు రవిచంద్రన్ అశ్విన్, రవీంద్ర జడేజాలకు తుది జట్టులో చోటుపై రోహిత్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు.జడ్డూ, అశ్విన్ ఇద్దరూ చాలా సీనియర్ ప్లేయర్లు అని, వారిద్దరూ ఈ సిరీస్లో భారత్కు కీలకంగా మారనున్నారని హిట్మ్యాన్ తెలిపాడు. ఈ కానీ ఈ స్పిన్ దయం రెండో టెస్టులో ఆడుతారా లేదా అన్నది భారత కెప్టెన్ క్లారిటీ ఇవ్వలేదు. కాగా పెర్త్ వేదికగా జరిగిన తొలి టెస్టులో వీరిద్దిరికి తుది జట్టులో చోటు దక్కకపోవడం అందరని ఆశ్చర్యపరిచింది. భారత్ కేవలం ఒక స్పిన్నర్తో ఆడింది. ఈ క్రమంలో రెండో టెస్టుకు ఈ స్పిన్ మాంత్రకులకు చోటు లభిస్తుందని ఫ్యాన్స్ ఆశిస్తున్నారు. కానీ రోహిత్ వ్యాఖ్యలు చూస్తుంటే రెండో టెస్టుకూ వీరిద్దరూ బెంచ్కే పరిమితమయ్యే సూచనలు కన్పిస్తున్నాయి."అశ్విన్, జడేజా వంటి అనుభవజ్ఞులైన ఆటగాళ్లకు తుది జట్టులో చోటు ఇవ్వకుండా వదిలివేయడం ఎల్లప్పుడూ కష్టమే. కానీ కొన్ని సమయాల్లో జట్టుకు ఏదో ఉత్తమమో అదే చేయాలి. అందుకే వారికి తొలి టెస్టులో ఆడే అవకాశం లభించలేదు.కానీ ఈ సిరీస్లో మిగిలిన మ్యాచ్ల్లో వారిద్దరూ భారత్కు కీలకంగా మారుతారని భావిస్తున్నాను అని రోహిత్ పేర్కొన్నాడు. అదే విధంగా కేఎల్ రాహుల్ ఓపెననర్గానే కొనసాగనున్నాడని హిట్మ్యాన్ స్పష్టం చేశాడు.చదవండి: SMT 2024: అభిషేక్ శర్మ ఊచకోత.. టీ20ల్లో ఫాస్టెస్ట్ సెంచరీ -
IND VS AUS 1st Test: అశ్విన్, జడేజా లేకుండానే..!
బోర్డర్ గవాస్కర్ ట్రోఫీ తొలి టెస్ట్లో టీమిండియా ఇద్దరు స్ట్రయిట్ స్పిన్నర్లు లేకుండానే బరిలోకి దిగింది. ఈ మ్యాచ్లో భారత్ రవిచంద్రన్ అశ్విన్, రవీంద్ర జడేజా లాంటి అనుభవజ్ఞులను పక్కన పెట్టి అంతంతమాత్రం అనుభవం ఉన్న వాషింగ్టన్ సుందర్ను తుది జట్టులోకి తీసుకుంది. ఈ మ్యాచ్లో భారత్ ఏకైక స్పిన్నర్తో బరిలోకి దిగింది. మ్యాచ్ ముందు వరకు ఆ ఏకైక స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ అని అంతా అనుకున్నారు. అయితే టీమిండియా మేనేజ్మెంట్ ఆఖరి నిమిషంలో సుందర్వైపు మొగ్గు చూపింది. అశ్విన్తో పోలిస్తే సుందర్ మెరుగ్గా బ్యాటింగ్ చేస్తాడన్న కారణంగా అతన్ని తుది జట్టులోకి తీసుకోవడమైంది. మరి టీమిండియా అవళభించిన ఈ వ్యూహం సక్సెస్ అవుతుందా లేక బెడిసికొడుతుందా అన్నది వేచి చూడాలి.ఎందుకంటే అశ్విన్, జడేజా ఇద్దరికి కూడా బ్యాటింగ్ చేసే సామర్థ్యం ఉన్నప్పటికీ మేనేజ్మెంట్ సుందర్నే ఎంచుకుని పెద్ద సాహసమే చేసింది. ఇటీవలికాలంలో అశ్విన్, జడేజా లేకుండా టీమిండియా బరిలోకి దిగిందే లేదు. వీరిద్దరు లేకుండా 2021 గబ్బా టెస్ట్లో భారత్ చివరిసారిగా బరిలోకి దిగింది.మరోవైపు ఈ మ్యాచ్లో భారత్ తరఫున ఇద్దరు ఆటగాళ్లు అరంగేట్రం చేస్తున్నారు. ఇందులో ఒకరు నితీశ్ కుమార్ రెడ్డి కాగా.. రెండో ఆటగాడు హర్షిత్ రాణా. నితీశ్ కుమార్ పేస్ బౌలింగ్ ఆల్రౌండర్ కాగా.. హర్షిత్ రాణా రైట్ ఆర్మ్ మీడియం ఫాస్ట్ బౌలర్. పెర్త్ పిచ్ పేస్ బౌలర్లకు అనుకూలించనుండటంతో ఈ మ్యాచ్లో భారత్ ముగ్గురు స్పెషలిస్ట్ పేసర్లు, ఓ పేస్ బౌలింగ్ ఆల్రౌండర్తో బరిలోకి దిగింది. బుమ్రా భారత పేస్ అటాక్ను లీడ్ చేయనుండగా.. హర్షిత్ రాణా, మహ్మద్ సిరాజ్ మరో ఇద్దరు పేసర్లుగా ఉన్నారు. నితీశ్ కుమార్ నాలుగో పేస్ బౌలింగ్ ఆప్షన్గా ఉంటాడు.మ్యాచ్ విషయానికొస్తే.. టీమిండియా టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ ఎంచుకుంది. ఆసీస్ పేసర్ల ధాటికి భారత్ ఆదిలోనే రెండు వికెట్లు కోల్పోయింది. ఓపెనర్ యశస్వి జైస్వాల్, వన్డౌన్ బ్యాటర్ దేవ్దత్ పడిక్కల్ ఇద్దరూ డకౌట్ అయ్యారు. జైస్వాల్ను స్టార్క్ పెవిలియన్కు పంపగా.. పడిక్కల్ను హాజిల్వుడ్ ఔట్ చేశాడు. 14 ఓవర్ల అనంతరం భారత స్కోర్ 20/2గా ఉంది. కేఎల్ రాహుల్ (14), విరాట్ కోహ్లి (0) క్రీజ్లో ఉన్నారు.తుది జట్లు..ఆస్ట్రేలియా (ప్లేయింగ్ XI): ఉస్మాన్ ఖ్వాజా, నాథన్ మెక్స్వీని, మార్నస్ లబూషేన్, స్టీవెన్ స్మిత్, ట్రవిస్ హెడ్, మిచెల్ మార్ష్, అలెక్స్ క్యారీ(వికెట్కీపర్), పాట్ కమిన్స్(కెప్టెన్), మిచెల్ స్టార్క్, నాథన్ లియోన్, జోష్ హేజిల్వుడ్భారత్ (ప్లేయింగ్ XI): కేఎల్ రాహుల్, యశస్వి జైస్వాల్, దేవదత్ పడిక్కల్, విరాట్ కోహ్లి, రిషబ్ పంత్(వికెట్కీపర్), ధ్రువ్ జురెల్, నితీష్ కుమార్ రెడ్డి, వాషింగ్టన్ సుందర్, హర్షిత్ రాణా, జస్ప్రీత్ బుమ్రా(కెప్టెన్), మహ్మద్ సిరాజ్ -
ఆసీస్తో తొలి టెస్ట్.. జడేజాకు నో ప్లేస్..!
భారత్, ఆస్ట్రేలియా మధ్య జరిగే బోర్డర్ గవాస్కర్ ట్రోఫీ ఈనెల 22 నుంచి ప్రారంభం కానుంది. ఈ సిరీస్లో మొత్తం ఐదు టెస్ట్ మ్యాచ్లు జరుగనున్నాయి. తొలి టెస్ట్ పెర్త్ వేదికగా జరుగనుంది. ఈ మ్యాచ్లో టీమిండియాకు తుది జట్టు కూర్పు సమస్యగా మారింది. కెప్టెన్ రోహిత్ శర్మ అందుబాటులో లేకపోవడం.. శుభ్మన్ గిల్ గాయపడటంతో టీమిండియా ప్రత్యామ్నాయ ఆటగాళ్లను వెతుక్కునే పనిలో పడింది.రోహిత్ శర్మ స్థానంలో ఓపెనర్గా కేఎల్ రాహుల్ వైపు మొగ్గు చూపుతున్న టీమిండియా మేనేజ్మెంట్.. శుభ్మన్ గిల్ స్థానంలో (వన్డౌన్లో) ఎవరిని ఆడించాలో అర్దం కాక తలలు పట్టుకుని కూర్చుంది. జట్టులో లేని దేవ్దత్ పడిక్కల్ను ఆడించాలని కొందరంటుంటే.. ధృవ్ జురెల్, సర్ఫరాజ్ ఖాన్లలో ఎవరో ఒకరికి అవకాశం కల్పించాలని మరికొందరంటున్నారు. మొత్తానికి ఎలా చూసినా టీమిండియా బ్యాటింగ్ లైనప్లో విరాట్, రిషబ్ పంత్ మినహా పెద్ద అనుభవజ్ఞులు లేరు.ఈ మ్యాచ్లో టీమిండియా ముగ్గురు స్పెషలిస్ట్ పేసర్లు, ఓ పేస్ బౌలింగ్ ఆల్రౌండర్తో బరిలోకి దిగాలని భావిస్తుంది. స్పెషలిస్ట్ పేసర్ల కోటాలో బుమ్రా, సిరాజ్, ఆకాశ్దీప్ తుది జట్టులో చోటు దక్కించుకోనుండగా.. పేస్ బౌలింగ్ ఆల్రౌండర్ నితీశ్ కుమార్ రెడ్డి బరిలోకి దిగడం దాదాపుగా ఖాయమైపోయింది. పెర్త్ పిచ్ పేసర్లకు సహకరించనుండటంతో భారత్ తప్పకుండా నలుగురు పేస్ బౌలర్లతో బరిలోకి దిగుతుంది.జడేజాకు నో ప్లేస్ఈ మ్యాచ్లో టీమిండియా ముగ్గురు పేసర్లు, ఒకే ఒక స్పిన్నర్ ఫార్ములాతో బరిలోకి దిగుతుంది. ఈ క్రమంలో భారత మేనేజ్మెంట్ రవీంద్ర జడేజాను పక్కన పెట్టి అశ్విన్ను తుది జట్టులో ఆడించనుంది. ఆసీస్ జట్టులో ఎక్కువగా లెఫ్ హ్యాండ్ బ్యాటర్లు ఉండటంతో కోచ్ గంభీర్ సైతం ఇదే నిర్ణయం వైపు మొగ్గు చూపుతున్నాడు. రోహిత్ గైర్హాజరీలో తొలి టెస్ట్లో బుమ్రా కెప్టెన్గా వ్యవహరిస్తున్న విషయం తెలిసిందే.తొలి టెస్ట్కు భారత తుది జట్టు (అంచనా)..కేఎల్ రాహుల్, యశస్వి జైస్వాల్, దేవ్దత్ పడిక్కల్, విరాట్ కోహ్లి, రిషబ్ పంత్ (వికెట్కీపర్), ధృవ్ జురెల్, నితీశ్ కుమార్ రెడ్డి, రవిచంద్రన్ అశ్విన్, ఆకాశ్దీప్, మొహమ్మద్ సిరాజ్, జస్ప్రీత్ బుమ్రా -
IND VS NZ 3rd Test: క్రికెట్ చరిత్రలో తొలిసారి ఇలా..!
టెస్ట్ క్రికెట్ చరిత్ర ఓ ఆసక్తికర ఘటన చోటు చేసుకుంది. ఒకే మ్యాచ్లో ఇద్దరు లెఫ్ట్ ఆర్మ్ బౌలర్లు నాలుగు ఐదు వికెట్ల ప్రదర్శనలు నమోదు చేశారు. టెస్ట్ క్రికెట్ చరిత్రలో ఇలా జరగడం ఇది తొలిసారి. భారత్, న్యూజిలాండ్ మధ్య జరిగిన మూడో టెస్ట్లో ఇది జరిగింది. టీమిండియా బౌలర్ రవీంద్ర జడేజా, న్యూజిలాండ్ బౌలర్ అజాజ్ పటేల్ రెండు ఇన్నింగ్స్ల్లో ఐదు వికెట్ల ప్రదర్శనలు నమోదు చేశారు. జడేజా తొలి ఇన్నింగ్స్లో ఐదు వికెట్లు, రెండో ఇన్నింగ్స్లో ఐదు వికెట్లు తీయగా.. అజాజ్ పటేల్ తొలి ఇన్నింగ్స్లో ఐదు, రెండో ఇన్నింగ్స్లో ఆరు వికెట్లు పడగొట్టాడు.కాగా, న్యూజిలాండ్తో జరిగిన మూడో టెస్ట్లో టీమిండియా 25 పరుగుల తేడాతో ఓటమిపాలైంది. ఈ మ్యాచ్లో తొలుత బ్యాటింగ్ చేసిన న్యూజిలాండ్ 235 పరుగులకు ఆలౌటైంది. విల్ యంగ్ (71), డారిల్ మిచెల్ (82) రాణించారు. భారత బౌలర్లలో రవీంద్ర జడేజా ఐదు, వాషింగ్టన్ సుందర్ నాలుగు, ఆకాశ్దీప్ ఓ వికెట్ పడగొట్టాడు. అనంతరం బరిలోకి దిగిన భారత్.. 263 పరుగులకు ఆలౌటైంది. శుభ్మన్ గిల్ (90), రిషబ్ పంత్ (60) అర్ద సెంచరీలతో రాణించారు. న్యూజిలాండ్ బౌలర్లలో అజాజ్ పటేల్ ఐదు వికెట్లు పడగొట్టాడు.28 పరుగులు వెనుకపడి రెండో ఇన్నింగ్స్ ప్రారంభించిన న్యూజిలాండ్ 174 పరుగులకు ఆలౌటైంది. రవీంద్ర జడేజా ఐదు వికెట్లు తీయగా.. అశ్విన్ మూడు, వాషింగ్టన్ సుందర్, ఆకాశ్దీప్ తలో వికెట్ పడగొట్టారు. 147 పరుగుల స్వల్ప లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన భారత్ 121 పరుగులకే ఆలౌటై ఘోర పరాజయాన్ని మూటగట్టుకుంది. న్యూజిలాండ్ బౌలర్లలో అజాజ్ పటేల్ 6 వికెట్లు పడగొట్టగా.. ఫిలిప్స్ 3 వికెట్లతో తీశాడు. భారత బ్యాటర్లలో రిషబ్ పంత్(64) మినహా మిగితా బ్యాటర్లంతా దారుణంగా విఫలమయ్యారు. -
చరిత్రకెక్కిన జడేజా.. రికార్డు బ్రేక్.. అరుదైన జాబితాలో చోటు
-
ముంబై టెస్టులో పట్టు బిగించిన టీమిండియా
ముంబై వేదికగా న్యూజిలాండ్తో జరుగుతున్న మూడో టెస్టులో టీమిండియా పట్టు బిగించింది. రెండో రోజు ఆటముగిసే సమయానికి కివీస్ తమ సెకెండ్ ఇన్నింగ్స్లో 9 వికెట్లు కోల్పోయి 171 పరుగులు చేసింది. న్యూజిలాండ్ ప్రస్తుతం కేవలం 143 పరుగుల ఆధిక్యంలో మాత్రమే ఉంది. కాగా తొలి ఇన్నింగ్స్లో సత్తాచాటిన భారత స్పిన్నర్లు.. ఇప్పుడు రెండో ఇన్నింగ్స్లో కూడా అదరగొట్టారు. అశ్విన్, రవీంద్ర జడేజా స్పిన్ మయాజాలానికి బ్లాక్క్యాప్స్ బ్యాటర్లు పెవిలియన్కు క్యూ కట్టారు. భారత బౌలర్లలో ఇప్పటివరకు జడేజా 4 వికెట్లు పడగొట్టగా, అశ్విన్ చెరో మూడు వికెట్లను తన ఖాతాలో వేసుకున్నాడు. వీరిద్దరితో పాటు పేసర్ ఆకాష్ దీప్, వాషింగ్టన్ సుందర్ తలా వికెట్ సాధించారు. ప్రస్తుతం క్రీజులో మాట్ హెన్రీ(10), ఓ రూర్కే ఉన్నారు. కివీస్ బ్యాటర్లలో విల్ యంగ్(51) హాఫ్ సెంచరీ సాధించాడు.263కు భారత్ ఆలౌట్..అంతకుముందు టీమిండియా తమ తొలి ఇన్నింగ్స్లో 263 పరుగులకు ఆలౌటైంది. భారత బ్యాటర్లలో యువ ఆటగాడు శుబ్మన్ గిల్(90), రిషబ్ పంత్(60) హాఫ్ సెంచరీలతో మెరిశాడు. కివీస్ బౌలర్లలో స్పిన్నర్ అజాజ్ పటేల్ 5 వికెట్ల ఘనత సాధించాడు. అతడితో పాటు హెన్రీ, ఫిలిప్స్, సోధీ ఒక్క వికెట్ సాధించారు. కాగా కివీస్ తమ మొదటి ఇన్నింగ్స్లో 235 పరుగులకే ఆలౌటైన సంగతి తెలిసిందే.చదవండి: IND vs UAE: టీమిండియాకు హార్ట్ బ్రేక్.. ఒక్క పరుగు తేడాతో ఓటమి -
పంత్ అవుట్.. గిల్ సెంచరీ మిస్.. భారత్ స్కోరెంతంటే?
న్యూజిలాండ్తో మూడో టెస్టులో టీమిండియా మెరుగైన స్కోరు దిశగా పయనిస్తోంది. శనివారం నాటి మూడో రోజు ఆటలో భోజన విరామ సమయానికి ఐదు వికెట్ల నష్టానికి 195 పరుగుల వద్ద నిలిచింది. కాగా కివీస్తో స్వదేశంలో జరుగుతున్న మూడు మ్యాచ్ల టెస్టు సిరీస్ను రోహిత్ సేన ఇప్పటికే 0-2తో చేజార్చుకుంది.ఈ క్రమంలో ముంబై వేదికగా శుక్రవారం మొదలైన మూడో టెస్టు టీమిండియాకు కీలకంగా మారింది. ప్రపంచ టెస్టు చాంపియన్షిప్ 2023-25 ఫైనల్ చేరాలన్నా.. కివీస్ చేతిలో వైట్వాష్ నుంచి తప్పించుకోవాలన్నా భారత్ ఈ మ్యాచ్లో తప్పక గెలవాలి.తొలిరోజు కివీస్ 235 పరుగులకు ఆలౌట్ ఇక వాంఖడే వేదికగా టాస్ ఓడి తొలుత బౌలింగ్ చేసిన టీమిండియా.. న్యూజిలాండ్ జట్టును నామమాత్రపు స్కోరుకు పరిమితం చేయగలిగింది. స్పిన్కు అనుకూలిస్తున్న వాంఖడే పిచ్పై రవీంద్ర జడేజా ఐదు, వాషింగ్టన్ సుందర్ నాలుగు వికెట్లు తీయగా.. పేసర్ ఆకాశ్ దీప్ ఒక వికెట్ పడగొట్టాడు. ఈ క్రమంలో కివీస్ జట్టు తొలి రోజే.. తొలి ఇన్నింగ్స్లో 235 పరుగులకు ఆలౌట్ అయింది.రోహిత్, కోహ్లి ఫెయిల్ఈ క్రమంలో బ్యాటింగ్ మొదలుపెట్టిన టీమిండియాకు శుభారంభం లభించలేదు. ఓపెనర్లలో యశస్వి జైస్వాల్(30) ఫర్వాలేదనిపించగా.. కెప్టెన్ రోహిత్ శర్మ(18) మరోసారి విఫలమయ్యాడు. ఇక జైస్వాల్ వచ్చిన మహ్మద్ సిరాజ్ డకౌట్ కాగా.. విరాట్ కోహ్లి(4) రనౌట్ రూపంలో టీమిండియా నాలుగో వికెట్ కోల్పోయింది.ఫలితంగా శుక్రవారం నాటి ఆట ముగిసే సరికి టీమిండియా నాలుగు వికెట్ల నష్టానికి 86 పరుగులే చేసింది. ఈ క్రమంలో శుబ్మన్ గిల్ 31, రిషభ్ పంత్ ఒక పరుగుతో శనివారం నాటి ఆట మొదలుపెట్టి.. ఆది నుంచే దూకుడు ప్రదర్శించారు. కివీస్ బౌలర్లపై అటాక్ చేస్తూ ఇద్దరూ అర్ధ శతకాలు సాధించారు.గిల్కు టెస్టుల్లో ఏడో ఫిఫ్టీగిల్ 66 బంతుల్లో యాభై పరుగులు పూర్తి చేసుకోగా.. పంత్ 36 బంతుల్లో హాఫ్ సెంచరీ సాధించాడు. అయితే, ఇష్ సోధి బౌలింగ్లో పంత్(60) లెగ్ బిఫోర్ వికెట్గా వెనుదిరగగా.. భారత్ ఐదో వికెట్ కోల్పోయింది. అతడి స్థానంలో రవీంద్ర జడేజా క్రీజులోకి వచ్చాడు. 𝐒𝐡𝐚𝐚𝐧𝐝𝐚𝐫 𝐉𝐚𝐛𝐚𝐫𝐝𝐚𝐬𝐭 𝐙𝐢𝐧𝐝𝐚𝐛𝐚𝐝 🙌 #INDvNZ #IDFCFirstBankTestTrophy #JioCinemaSports #ShubmanGill pic.twitter.com/SujiHXhlOw— JioCinema (@JioCinema) November 2, 2024 ఇక శనివారం భోజన విరామ సమయానికి టీమిండియా 43 ఓవర్లలో ఐదు వికెట్ల నష్టానికి 195 పరుగులు చేసింది. శుబ్మన్ గిల్ 70, జడేజా 10 పరుగులతో ఆడుతున్నారు. కాగా కివీస్ తొలి ఇన్నింగ్స్ కంటే టీమిండియా ఇంకా 40 పరుగులు వెనుకబడి ఉంది. గిల్ సెంచరీ మిస్అయితే, లంచ్ తర్వాత గిల్ 90 పరుగుల వ్యక్తిగతస్కోరు వద్ద అవుయ్యాడు. అంతకంటే ముందు రవీంద్ర జడేజా(14), సర్ఫరాజ్ ఖాన్(0) వికెట్లను భారత్ కోల్పోయింది. 53.2 ఓవర్లలో ఎనిమిది వికెట్ల నష్టానికి టీమిండియా 227 పరుగులు చేసింది.టీమిండియా-న్యూజిలాండ్ మూడో టెస్టుప్లేయింగ్ ఎలెవన్ టీమిండియారోహిత్ శర్మ, యశస్వి జైస్వాల్, శుబ్మన్ గిల్, విరాట్ కోహ్లి, రిషభ్ పంత్, సర్ఫరాజ్ ఖాన్, రవీంద్ర జడేజా, వాషింగ్టన్ సుందర్, రవిచంద్రన్ అశ్విన్, ఆకాశ్దీప్, మహ్మద్ సిరాజ్న్యూజిలాండ్ టామ్ లాథమ్, డెవాన్ కాన్వే, విల్ యంగ్, రచిన్ రవీంద్ర, డారిల్ మిచెల్, టామ్ బ్లండెల్, గ్లెన్ ఫిలిప్స్, ఇష్ సోధి, మ్యాట్ హెన్రీ, అజాజ్ పటేల్, విలియమ్ ఓ రూర్కీ. చదవండి: IPL 2025: మన లీడర్.. మన కెప్టెన్.. రీటైన్ను సంపూర్ణంగా వాడుకుంది ఎవరు? -
ఆసక్తికరంగా భారత-న్యూజిలాండ్ల మూడో టెస్టు.. పడగొట్టి... ఆపై తడబడి!
వాంఖెడే మైదానంలో తొలి రోజు 84.4 ఓవర్లు పడ్డాయి. 82.5 ఓవర్ల వరకు భారత్దే పైచేయి... కానీ తర్వాతి 8 బంతుల వ్యవధిలో పరిస్థితి ఒక్కసారిగా మారిపోయింది. టీమిండియా అనూహ్యంగా 3 వికెట్లు చేజార్చుకొని వెనుకంజ వేసింది. అప్పటి వరకు చక్కగా ఆడిన యశస్వి జైస్వాల్తో పాటు టాప్ బ్యాటర్ విరాట్ కోహ్లి రనౌట్ ఇందులో ఉండగా, ఒక కీలక రివ్యూ కూడా కోల్పోవడంతో భారత్ నిరాశగా ఆటను ముగించింది. అంతకుముందు రవీంద్ర జడేజా, వాషింగ్టన్ సుందర్ ధాటికి 235 పరుగులకే పరిమితమై నిరాశ చెందిన న్యూజిలాండ్ ఆ తర్వాత 4 వికెట్లు కూడా పడగొట్టి పైచేయి సాధించింది. రెండో రోజు మన బ్యాటర్లు ఎంత వరకు స్కోరును తీసుకెళ్లి ఆధిక్యం అందించగలరనే అంశంపైనే భారత విజయావకాశాలు ఆధారపడి ఉంటాయి. ముంబై: భారత్, న్యూజిలాండ్ మధ్య మూడో టెస్టు మ్యాచ్ ఆసక్తికరంగా మొదలైంది. బౌలర్లు తొలి రోజు నేలకూల్చిన 14 వికెట్లు మ్యాచ్లో తర్వాతి రోజులు ఎలా సాగనున్నాయనే దానికి సంకేతంగా నిలిచింది. మ్యాచ్లో టాస్ గెలిచి ముందుగా బ్యాటింగ్ ఎంచుకున్న న్యూజిలాండ్ తమ తొలి ఇన్నింగ్స్లో 65.4 ఓవర్లలో 235 పరుగులకే ఆలౌటైంది. డరైల్ మిచెల్ (129 బంతుల్లో 82; 3 ఫోర్లు, 3 సిక్స్లు), విల్ యంగ్ (138 బంతుల్లో 71; 4 ఫోర్లు, 2 సిక్స్లు) అర్ధసెంచరీలు సాధించారు.మిగతా వారంతా విఫలమయ్యారు. భారత బౌలర్లలో రవీంద్ర జడేజా (5/65) ఐదు వికెట్లతో సత్తా చాటగా... వాషింగ్టన్ సుందర్ 4 వికెట్లు పడగొట్టాడు. అనంతరం భారత్ ఆట ముగిసే సమయానికి 19 ఓవర్లలో 4 వికెట్లు కోల్పోయి 86 పరుగులు చేసింది. శుబ్మన్ గిల్ (38 బంతుల్లో 31 బ్యాటింగ్; 2 ఫోర్లు, 1 సిక్స్), రిషభ్ పంత్ (1 బ్యాటింగ్) క్రీజులో ఉన్నారు. భారత్ మరో 149 పరుగులు వెనుకబడి ఉంది. తుది జట్టులో భారత్ ఒక మార్పు చేసింది. బుమ్రాకు విశ్రాంతినిచ్చి సిరాజ్ను ఆడించగా... న్యూజిలాండ్ రెండు మార్పులతో బరిలోకి దిగింది. గత మ్యాచ్ హీరో సాంట్నర్ పక్కటెముకల గాయంతో టెస్టుకు దూరం కాగా... అతని స్థానంలో సోధి వచ్చాడు. పేసర్ టీమ్ సౌతీకి బదులుగా హెన్రీని కివీస్ ఎంచుకుంది. భారీ భాగస్వామ్యం... కివీస్ ఇన్నింగ్స్ మూడు భిన్న దశలుగా సాగింది. ఫామ్లో ఉన్న కాన్వే (4) ఆరంభంలోనే వెనుదిరగ్గా... కెపె్టన్ టామ్ లాథమ్ (44 బంతుల్లో 28; 3 ఫోర్లు) కొన్ని చక్కటి షాట్లు ఆడాడు. అయితే లాథమ్తో పాటు రచిన్ రవీంద్ర (5)లను సుందర్ క్లీన్»ౌల్డ్ చేయడంతో 72/3 వద్ద కివీస్ కష్టాల్లో పడింది. ఈ దశలో యంగ్, మిచెల్ భాగస్వామ్యం జట్టును ఆదుకుంది. వీరిద్దరు తర్వాతి 25 ఓవర్ల పాటు భారత బౌలర్లను సమర్థంగా ఎదుర్కొంటూ 87 పరుగుల నాలుగో వికెట్ భాగస్వామ్యంతో స్కోరును 159/3 వరకు తీసుకెళ్లారు. అయితే ఇక్కడే ఆట మళ్లీ మలుపు తిరిగింది. జడేజా వేసిన ఈ ఓవర్లో యంగ్, బ్లన్డెల్ (0) వెనుదిరిగారు. ఆ తర్వాత వరుసగా మరో మూడు వికెట్లు కూడా అతని ఖాతాలోనే చేరాయి. సుందర్ మూడు ఓవర్లలో ఒక్కో సిక్సర్ చొప్పున బాది జోరు ప్రదర్శించిన మిచెల్ ఎట్టకేలకు సుందర్ బౌలింగ్లోనే పెవిలియన్ చేరగా... మరో మూడు బంతుల తర్వాత కివీస్ ఇన్నింగ్స్ ముగిసింది. కోహ్లి రనౌట్... రోహిత్ శర్మ (18) ఎప్పటిలాగే ధాటిగా మొదలు పెట్టినా, మరోసారి అతను తక్కువ స్కోరుకే పరిమితమయ్యాడు. అయితే యశస్వి జైస్వాల్ (52 బంతుల్లో 30; 4 ఫోర్లు), గిల్ కలిసి ఇన్నింగ్స్ను నడిపించారు. 6 పరుగుల వద్ద గిల్ ఇచ్చిన క్యాచ్ను కీపర్ బ్లన్డెల్ అందుకోలేకపోయాడు. వీరిద్దరి భాగస్వామ్యం 53 పరుగులకు చేరింది. మరో రెండు ఓవర్ల ఆట మాత్రమే మిగిలి ఉంది. ఈ సమయంలో అంతా మారిపోయింది. ఎజాజ్ బౌలింగ్లో అనవసరపు రివర్స్ స్వీప్నకు ప్రయత్నించి జైస్వాల్ బౌల్డ్ కాగా... నైట్ వాచ్మన్గా వచ్చిన సిరాజ్ (0) తర్వాతి బంతికే ఎల్బీగా అవుటయ్యాడు. అయితే దీనికి కూడా అతని ‘రివ్యూ’ తీసుకొని దానిని వృథా చేశాడు! భారత్కు మరో షాక్ చివరి ఓవర్లో తగిలింది. డిఫెన్స్ ఆడి రోజును ముగించాల్సిన సమయంలో కోహ్లి (4) సాహసం చేశాడు. రచిన్ బౌలింగ్లో మిడాన్ దిశగా ఆడిన అతను అతి విశ్వాసంతో సింగిల్కు ప్రయత్నించాడు. హెన్రీ డైరెక్ట్ త్రో వికెట్లను పడగొట్టడంతో నిరాశగా వెనుదిరిగాడు. స్కోరు వివరాలు న్యూజిలాండ్ తొలి ఇన్నింగ్స్: లాథమ్ (బి) సుందర్ 28; కాన్వే (ఎల్బీ) (బి) ఆకాశ్దీప్ 4; యంగ్ (సి) రోహిత్ (బి) జడేజా 71; రచిన్ (బి) సుందర్ 5; మిచెల్ (సి) రోహిత్ (బి) సుందర్ 82; బ్లన్డెల్ (బి) జడేజా 0; ఫిలిప్స్ (బి) జడేజా 17; సోధి (ఎల్బీ) (బి) జడేజా 7; హెన్రీ (బి) జడేజా 0; ఎజాజ్ (ఎల్బీ) (బి) సుందర్ 7; రూర్కే (నాటౌట్) 1; ఎక్స్ట్రాలు 13; మొత్తం (65.4 ఓవర్లలో ఆలౌట్) 235. వికెట్ల పతనం: 1–15, 2–59, 3–72, 4–159, 5–159, 6–187, 7–210, 8–210, 9–228, 10–235. బౌలింగ్: సిరాజ్ 6–0–16–0, ఆకాశ్దీప్ 5–0–22–1, అశ్విన్ 14–0–47–0, వాషింగ్టన్ సుందర్ 18.4–2– 81–4, జడేజా 22–1–65–5. భారత్ తొలి ఇన్నింగ్స్: జైస్వాల్ (బి) ఎజాజ్ 30; రోహిత్ (సి) లాథమ్ (బి) హెన్రీ 18; గిల్ (బ్యాటింగ్) 31; సిరాజ్ (ఎల్బీ) (బి) ఎజాజ్ 0; కోహ్లి (రనౌట్) 4; పంత్ (బ్యాటింగ్) 1; ఎక్స్ట్రాలు 2; మొత్తం (19 ఓవర్లలో 4 వికెట్లకు) 86. వికెట్ల పతనం: 1–25, 2–78, 3–78, 4–84. బౌలింగ్: హెన్రీ 5–1–15–1, రూర్కే 2–1–5–0, ఎజాజ్ 7–1–33–2, ఫిలిప్స్ 4–0–25–0, రచిన్ 1–0–8–0. -
జడేజా సూపర్ డెలివరీ.. కివీస్ బ్యాటర్ మైండ్ బ్లాంక్! వీడియో వైరల్
టీమిండియా స్టార్ క్రికెటర్ రవీంద్ర జడేజా నిలకడైన ఆట తీరుతో ఆకట్టుకుంటున్నాడు. న్యూజిలాండ్తో తొలి రెండు టెస్టుల్లో కలిపి ఆరు వికెట్లే తీసిన జడ్డూ.. మూడో టెస్టులో మాత్రం అద్భుత ప్రదర్శన కనబరుస్తున్నాడు. ముంబై మ్యాచ్లో కివీస్ బ్యాటర్లకు చుక్కలు చూపించిన ఈ స్పిన్ బౌలర్.. ఏకంగా ఐదు వికెట్లు కూల్చాడు.క్రీజులో పాతుకుపోయిన న్యూజిలాండ్ బ్యాటర్ విల్ యంగ్(71)ను అవుట్ చేసి భారత శిబిరంలో జోష్ నింపిన జడ్డూ.. టామ్ బ్లండెల్(0), గ్లెన్ ఫిలిప్స్(17)ల వికెట్లు కూడా తానే దక్కించుకున్నాడు. అదే విధంగా టెయిలెండర్లు ఇష్ సోధి(7), మ్యాట్ హెన్రీ(0)లను అవుట్ చేసి ఐదు వికెట్ల హాల్ను పూర్తి చేసుకున్నాడు.అయితే, వీరందరిలోకెల్లా బ్లండెల్ను జడేజా అవుట్ చేసిన తీరు హైలైట్గా నిలిచింది. శుక్రవారం నాటి తొలిరోజు ఆటలో భాగంగా కివీస్ ఇన్నింగ్స్లో 45వ ఓవర్ను జడ్డూ వేశాడు. ఆ ఓవర్లో రెండో బంతికి విల్ యంగ్ను పెవిలియన్కు పంపిన ఈ లెఫ్టార్మ్ స్పిన్నర్.. ఐదో బంతిని అద్భుత రీతిలో సంధించాడు.ఆ సమయంలో క్రీజులో ఉన్న బ్లండెల్ జడేజా సూపర్ డెలివరీకి క్లీన్బౌల్డ్ అయ్యాడు. సరైన లైన్ అండ్ లెంగ్త్తో జడ్డూ వేసిన బంతిని బ్యాక్ఫుట్తో డిఫెన్స్ చేసేందుకు ప్రయత్నించి బ్లండెల్ విఫలమయ్యాడు. రెప్పపాటులో బంతి స్టంప్ను ఎగురగొట్టడంతో బిక్కముఖం వేశాడు. నిజానికి బ్లండెల్ స్థానంలో ఏ బ్యాటర్ ఉన్నా ఇలాగే జరిగేది.. జడ్డూ వేసిన బంతి అలాంటిది మరి! ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. కాగా కివీస్తో బెంగళూరు, పుణెలలో జరిగిన టెస్టుల్లో జడ్డూ మూడేసి వికెట్లు తీశాడు. ఇక ఈ రెండు మ్యాచ్లలోనూ ఓటమిపాలైన టీమిండియా సిరీస్ను 0-2తో కోల్పోయింది. ముంబైలో జరుగుతున్న తాజా టెస్టులో గెలిస్తేనే క్లీన్స్వీప్ పరాభవం నుంచి తప్పించుకోవడంతో పాటు.. రోహిత్ సేనకు డబ్ల్యూటీసీ ఫైనల్ లైన్ ఈజీగా క్లియర్ అవుతుంది.ఇక ఈ మ్యాచ్లో టీమిండియా కివీస్ను తొలి ఇన్నింగ్స్లో 235 పరుగులకు కట్టడి చేసింది. తొలిరోజే న్యూజిలాండ్ను ఆలౌట్ చేసింది. భారత బౌలర్లలో స్పిన్ బౌలింగ్ ఆల్రౌండర్లు జడేజాకు ఐదు, వాషింగ్టన్ సుందర్కు నాలుగు వికెట్లు దక్కగా.. పేసర్ ఆకాశ్ దీప్ ఒక వికెట్ తన ఖాతాలో వేసుకున్నాడు.అయితే, బ్యాటింగ్ మొదలుపెట్టిన టీమిండియాకు శుభారంభం లభించలేదు. ఓపెనర్లు రోహిత్ శర్మ(18), యశస్వి జైస్వాల్(30) త్వరత్వరగా పెవిలియన్కు చేరగా.. నాలుగో స్థానంలో వచ్చిన పేసర్ మహ్మద్ సిరాజ్ డకౌట్ అయ్యాడు. ఇక విరాట్ కోహ్లి(4) రనౌట్గా వెనుదిరిగాడు. దీంతో 19 ఓవర్లలో 86 పరుగులు చేసిన టీమిండియా.. నాలుగు వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది.చదవండి: IND A vs AUS A: సెంచరీకి చేరువైన సాయి సుదర్శన్Jadeja stuns the Kiwis with a double strike 💥 Catch LIVE action from the 3rd #INDvNZ Test, on #JioCinema, #Sports18 and #ColorsCineplex!#IDFCFirstBankTestTrophy #JioCinemaSports pic.twitter.com/Gyy3vZgTz2— JioCinema (@JioCinema) November 1, 2024 -
టీమిండియా స్పిన్నర్ల ప్రతాపం.. తొలిరోజే కివీస్ ఆలౌట్
న్యూజిలాండ్తో మూడో టెస్టును టీమిండియా మెరుగ్గా ఆరంభించింది. ముంబైలో శుక్రవారం మొదలైన ఈ మ్యాచ్లో తొలిరోజే కివీస్ను ఆలౌట్ చేసింది. స్పిన్కు అనుకూలిస్తున్న వాంఖడే పిచ్పై రవీంద్ర జడేజా ఐదు వికెట్లతో చెలరేగగా.. వాషింగ్టన్ సుందర్ నాలుగు వికెట్లతో సత్తా చాటాడు.ప్రపంచ టెస్టు చాంపియన్షిప్(డబ్ల్యూటీసీ) 2023-25లో భాగంగా భారత జట్టు స్వదేశంలో న్యూజిలాండ్తో మూడు మ్యాచ్ల సిరీస్ ఆడుతోంది. అయితే, బెంగళూరులో జరిగిన తొలి టెస్టులో ఎనిమిది వికెట్ల తేడాతో ఓడిపోయిన రోహిత్ సేన.. పుణె మ్యాచ్లోనూ ఘోర పరాభవం పాలైంది. కివీస్ చేతిలో ఏకంగా 113 పరుగుల తేడాతో భారీ ఓటమిని చవిచూసింది. పన్నెండేళ్ల తర్వాత టెస్టు సిరీస్ కోల్పోయితద్వారా సొంతగడ్డపై పన్నెండేళ్ల తర్వాత టెస్టు సిరీస్ కోల్పోయిన తొలి భారత జట్టుగా నిలిచింది. ఈ క్రమంలో ముంబైలో జరుగుతున్న మూడో టెస్టు టీమిండియాకు కీలకంగా మారింది. డబ్ల్యూటీసీ ఫైనల్కు సాఫీగా చేరాలన్నా.. వైట్వాష్ గండం నుంచి తప్పించుకోవాలన్నా ఈ మ్యాచ్లో గెలవడం రోహిత్ సేనకు అత్యంత ముఖ్యం. లంచ్కు ముందు ఇలాఈ నేపథ్యంలో శుక్రవారం మొదలైన మ్యాచ్లో టాస్ ఓడిన టీమిండియా తొలుత బౌలింగ్ చేసింది. కివీస్ బ్యాటింగ్ మొదలుపెట్టిన కాసేపటికే ప్రమాదకర ఓపెనర్ డెవాన్ కాన్వే(4)ను అవుట్ చేసి పేసర్ ఆకాశ్ దీప్ శుభారంభం అందించగా.. స్పిన్ బౌలింగ్ ఆల్రౌండర్ వాషింగ్టన్ సుందర్ కెప్టెన్, ఓపెనర్ టామ్ లాథమ్(28), రచిన్ రవీంద్ర(5) రూపంలో బిగ్ వికెట్లు దక్కించుకున్నాడు.జడేజా విశ్వరూపంలంచ్ బ్రేక్కు ముందు వీరిద్దరు కలిసి మూడు వికెట్లు తీయగా.. భోజన విరామం సమయం తర్వాత మరో స్పిన్ బౌలింగ్ ఆల్రౌండర్ రవీంద్ర జడేజా విశ్వరూపం ప్రదర్శించాడు. విల్ యంగ్(71) రూపంలో తొలి వికెట్ దక్కించుకన్న జడ్డూ.. ఆ తర్వాత టామ్ బ్లండెల్(0)ను డకౌట్ చేశాడు. ఆ తర్వాత గ్లెన్ ఫిలిప్స్(17)ల పనిపట్టాడు.Jadeja stuns the Kiwis with a double strike 💥 Catch LIVE action from the 3rd #INDvNZ Test, on #JioCinema, #Sports18 and #ColorsCineplex!#IDFCFirstBankTestTrophy #JioCinemaSports pic.twitter.com/Gyy3vZgTz2— JioCinema (@JioCinema) November 1, 2024 అదే విధంగా ఇష్ సోధి(7), మ్యాట్ హెన్రీ(0) వికెట్లను కూడా జడ్డూ తన ఖాతాలో వేసుకున్నాడు. మరోవైపు.. వాషీ డారిల్ మిచెల్(82), అజాజ్ పటేల్(7)లను కూడా అవుట్ చేసి మొత్తంగా తన వికెట్ల సంఖ్యను నాలుగుకు పెంచుకున్నాడు. కివీస్ బ్యాటర్లలో విల్ యంగ్(71), డారిల్ మిచెల్(82) మినహా భారత స్పిన్నర్ల ప్రతాపం ముందు కివీస్ బ్యాటర్లంతా తలవంచారు. దీంతో 65.4 ఓవర్లలో న్యూజిలాండ్ 235 పరుగులు(తొలి ఇన్నింగ్స్) చేసి తొలిరోజే ఆలౌట్ అయింది. భారత బౌలర్లలో జడ్డూ ఐదు, వాషీ నాలుగు, ఆకాశ్ దీప్ ఒక వికెట్ దక్కించుకున్నారు.టీమిండియాకూ ఆదిలోనే ఎదురుదెబ్బఈ క్రమంలో బ్యాటింగ్కు దిగిన టీమిండియాకు ఆదిలోనే ఎదురుదెబ్బ తగిలింది. కివీస్ పేసర్ మ్యాట్ హెన్రీ బౌలింగ్లో భారత కెప్టెన్, ఓపెనర్ రోహిత్ శర్మ టామ్ లాథమ్కు క్యాచ్ ఇచ్చి అవుటయ్యాడు. దూకుడుగా ఆడిన రోహిత్ 18 బంతులు ఎదుర్కొని 18 పరుగులు చేశాడు.టీమిండియా వర్సెస్ న్యూజిలాండ్ మూడో టెస్టు(నవంబరు 1- 5)👉వేదిక: వాంఖడే స్టేడియం, ముంబై👉టాస్: న్యూజిలాండ్.. తొలుత బ్యాటింగ్👉న్యూజిలాండ్ తొలి ఇన్నింగ్స్ స్కోరు: 235 రన్స్.. ఆలౌట్.చదవండి: చరిత్రకెక్కిన జడేజా.. జహీర్ రికార్డు బ్రేక్.. అరుదైన జాబితాలో చోటు -
చరిత్రకెక్కిన జడేజా.. జహీర్ రికార్డు బ్రేక్.. అరుదైన జాబితాలో చోటు
న్యూజిలాండ్తో మూడో టెస్టు సందర్భంగా టీమిండియా క్రికెటర్ రవీంద్ర జడేజా అరుదైన రికార్డు సాధించాడు. భారత్ తరఫున అత్యధిక వికెట్లు తీసిన బౌలర్ల జాబితాలో చోటు సంపాదించాడు. ఈ క్రమంలో దిగ్గజ పేసర్ జహీర్ ఖాన్ను జడ్డూ అధిగమించాడు. కాగా ప్రపంచ టెస్టు చాంపియన్షిప్ 2023-25లో భాగంగా మూడు మ్యాచ్లు ఆడేందుకు కివీస్ జట్టు భారత పర్యటనకు వచ్చింది.ముంబై వేదికగా మూడో టెస్టు ఈ క్రమంలో ఇరుజట్ల మధ్య బెంగళూరు, పుణె వేదికగా జరిగిన తొలి రెండు టెస్టుల్లో ఆతిథ్య టీమిండియాను న్యూజిలాండ్ ఓడించింది. తద్వారా మరో మ్యాచ్ మిగిలి ఉండగానే సిరీస్ను 2-0తో కైవసం చేసుకుంది. ఈ నేపథ్యంలో ఇరుజట్ల మధ్య ముంబై వేదికగా శుక్రవారం నామమాత్రపు మూడో టెస్టు మొదలైంది.వాంఖడే మైదానంలో జరుగుతున్న ఈ మ్యాచ్లో గెలిచి వైట్వాష్ నుంచి తప్పించుకోవాలని రోహిత్ సేన పట్టుదలగా ఉంది. మరోవైపు.. సొంతగడ్డపై ఇప్పటికే భారత్ను ఓడించి చరిత్ర సృష్టించిన టామ్ లాథమ్ బృందం విజయాన్ని పరిపూర్ణం చేసుకోవాలని ఉవ్విళ్లూరుతోంది. ఈ క్రమంలో మూడో టెస్టులో టాస్ గెలిచిన న్యూజిలాండ్ తొలుత బ్యాటింగ్ ఎంచుకుంది.ఆకాశ్ దీప్ శుభారంభం.. అదరగొట్టిన వాషీస్పిన్కు అనుకూలిస్తున్న పిచ్పై భారత బౌలర్లు వాషింగ్టన్ సుందర్, రవీంద్ర జడేజా ప్రభావం చూపుతున్నారు. ఆట తొలిరోజు భోజన విరామ సమయానికి ముందు వాషీ.. కివీస్ కెప్టెన్, ఓపెనర్ టామ్ లాథమ్(28), మిడిలార్డర్ బ్యాటర్ రచిన్ రవీంద్ర(5) రూపంలో రెండు కీలక వికెట్లు తీశాడు. మరోవైపు.. పేసర్ ఆకాశ్ దీప్ డేంజరస్ ఓపెనర్ డెవాన్ కాన్వే(4)ను అవుట్ చేసి శుభారంభం అందించాడు.లంచ్ తర్వాత వికెట్ల వేట మొదలుపెట్టిన జడ్డూఈ క్రమంలో లంచ్ బ్రేక్కు ముందు న్యూజిలాండ్ మూడు వికెట్లు కోల్పోయి 92 పరుగులు చేసింది. అయితే, భోజన విరామం తర్వాత జడ్డూ తన బౌలింగ్ పదునుపెంచాడు. క్రీజులో పాతుకుపోయి భారత బౌలర్లను ఇబ్బంది పెడుతున్న విల్ యంగ్(71)ను తొలుత పెవిలియన్కు పంపిన జడేజా.. అనంతరం టామ్ బ్లండెల్(0)ను డకౌట్ చేశాడు. ఆ తర్వాత గ్లెన్ ఫిలిప్స్(17)ను అవుట్ చేశాడు. తద్వారా జడ్డూ టెస్టుల్లో 312 వికెట్లు పూర్తి చేసుకున్నాడు.టీ బ్రేక్ సమయానికి కివీస్స్కోరు ఎంతంటే?ఈ నేపథ్యంలో భారత్ తరఫున టెస్టుల్లో అత్యధిక వికెట్లు తీసిన బౌలర్ల జాబితాలో జహీర్ ఖాన్(311), ఇషాంత్ శర్మ(311)లను జడ్డూ అధిగమించాడు. వీరిద్దరి రికార్డును బ్రేక్ చేస్తూ టాప్-5లో చోటు సంపాదించాడు. ఇదిలా ఉంటే.. టీ బ్రేక్ సమయానికి న్యూజిలాండ్ ఆరు వికెట్ల నష్టానికి 192 పరుగులు చేసింది.టీమిండియా తరఫున టెస్టుల్లో అత్యధిక వికెట్లు తీసిన టాప్-5 బౌలర్లు1. అనిల్ కుంబ్లే(స్పిన్నర్)- 619 వికెట్లు2. రవిచంద్రన్ అశ్విన్(స్పిన్నర్)- 533 వికెట్లు3. కపిల్ దేవ్(పేస్ బౌలింగ్ ఆల్రౌండర్)- 434 వికెట్లు4. హర్భజన్ సింగ్(స్పిన్నర్)- 417 వికెట్లు5. రవీంద్ర జడేజా(స్పిన్నర్)- 312 వికెట్లు.చదవండి: IPL 2025 Retentions: జాక్పాట్ కొట్టిన ఆటగాళ్లు వీరే..! -
IPL 2025: సీఎస్కే సంచలన నిర్ణయం!
ఐపీఎల్-2025 మెగా వేలానికి ముందు చెన్నై సూపర్ కింగ్స్(సీఎస్కే) సంచలన నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. స్టార్ క్రికెటర్ రవీంద్ర జడేజాను వేలంలోకి విడిచిపెట్టేందుకు సిద్ధమైనట్లు సమాచారం. టీమిండియా వికెట్ కీపర్ బ్యాటర్ రిషభ్ పంత్ కోసం జడ్డూను రిలీజ్ చేయాలని నిశ్చయించినట్లు వార్తలు వినిపిస్తున్నాయి.ఆ ముగ్గురిని రిటైన్ చేసుకుని...కాగా తాము అట్టిపెట్టుకునే ఆటగాళ్ల జాబితాను సమర్పించేందుకు ఫ్రాంఛైజీలకు గురువారం వరకే గడువు ఉంది. ఈ నేపథ్యంలో కెప్టెన్ రుతురాజ్ గైక్వాడ్తో పాటు శ్రీలంక ఫాస్ట్ బౌలర్ మతీశ పతిరణలను రిటైన్ చేసుకోవాలని సీఎస్కే భావిస్తున్నట్లు సమాచారం. ఇక ఇప్పటికే అంతర్జాతీయ క్రికెట్కు దూరమైన దిగ్గజ సారథి మహేంద్ర సింగ్ ధోనిని అన్క్యాప్డ్ ప్లేయర్గా అట్టిపెట్టుకోనుందట.ధోని వారసుడి కోసంఅయితే, లెజెండరీ వికెట్ కీపర్ ధోనికి సరైన వారసుడిని ఎంపిక చేసే క్రమంలో జడేజా విషయంలో రిస్క్ తీసుకునేందుకు సీఎస్కే సిద్ధపడినట్లు తెలుస్తోంది. ఢిల్లీ క్యాపిటల్స్తో రిషభ్ పంత్ తెగదెంపులు చేసుకున్నాడన్న వార్తల నేపథ్యంలో.. అతడు వేలంలోకి రావడం ఖాయంగా కనిపిస్తోంది.ప్రైస్ ట్యాగ్ గనుక రూ. 20 కోట్లు దాటితే ఎలా?ఒకవేళ అదే జరిగితే పంత్ భారీ ధర పలకడం ఖాయం. అతడి ప్రైస్ ట్యాగ్ గనుక రూ. 20 కోట్లు దాటితే పరిస్థితి ఏమిటన్న ప్రశ్నల నేపథ్యంలో సీఎస్కే తన రిటెన్షన్ లిస్టు మార్పుపై దృష్టి పెట్టినట్లు తెలుస్తోంది. పంత్ కోసం భారీగా ఖర్చు పెట్టేందుకు సిద్ధమైన సీఎస్కే.. రవీంద్ర జడేజాను వేలంలోకి వదిలి.. రైట్ టు మ్యాచ్(RTM) కార్డు ద్వారా అతడిని మళ్లీ సొంతం చేసుకోవచ్చనే ఆలోచనలో ఉన్నట్లు సమాచారం.వరల్డ్ కప్ విన్నర్.. కానీకాగా జడ్డూ ఇటీవల టీ20 ప్రపంచకప్-2024 గెలిచిన భారత జట్టులో సభ్యుడు. అయితే, ఈ మెగా టోర్నీ తర్వాత అతడు అంతర్జాతీయ పొట్టి ఫార్మాట్కు వీడ్కోలు పలికాడు. అంతేకాదు ఇటీవలి కాలంలో అతడి టీ20 గణాంకాలు ముఖ్యంగా బ్యాటింగ్ చెప్పుకోదగ్గ స్థాయిలో లేదు. దీంతో జడ్డూను విడిచిపెట్టినా.. మళ్లీ ఆర్టీఎమ్ కార్డుతో కొనవచ్చని సీఎస్కే భావిస్తోందట.అంటే.. జడ్డూకి డిమాండ్ లేకపోతే.. వేరే ఫ్రాంఛైజీ అతడిని తక్కువ ధరకు కొన్నట్లయితే.. అంతే మొత్తం చెల్లించి అతడిని తిరిగి తాము సొంతం చేసుకునేందుకు ఆర్టీఎమ్ కార్డును వాడుకోనుందన్న మాట. అలా కాకుండా ఒకవేళ జడ్డూను రిటైన్ చేసుకుంటే అతడికి రూ. 18 కోట్ల మేర చెల్లించాల్సి ఉంటుంది.అందుకే రిలీజ్ చేయాలనే యోచనలోఅలా అయితే, వేలంలో పంత్ను కొనుక్కునేందుకు తగినంత సొమ్ము ఉండకపోవచ్చు. అందుకే పంత్ కోసం జడ్డూను రిలీజ్ చేయాలని సీఎస్కే నిర్ణయించినట్లు ఐపీఎల్ వర్గాలు పేర్కొంటున్నాయి. ఇక తమ రిటెన్షన్లో భాగంగా రుతుకు రూ. 18 కోట్లు, పతిరణకు రూ. 14 కోట్లు, ధోనికి రూ. 4 కోట్లు చెన్నై ఫ్రాంఛైజీ చెల్లించనుందట!! కెప్టెన్గా నియమించినా..కాగా జడ్డూకు సీఎస్కేతో సుదీర్ఘ అనుబంధం ఉంది. జట్టును చాంపియన్గా నిలపడంలో అతడి పాత్ర కీలకం. కాగా 2012లో జట్టులో చేరిన జడ్డూ.. తర్వాత గుజరాత్ లయన్స్కు ఆడాడు. అనంతరం మళ్లీ 2018లో చెన్నైతో జట్టు కట్టిన ఈ స్పిన్ బౌలింగ్ ఆల్రౌండర్ ఇప్పటికీ అదే టీమ్లో ఉన్నాడు. అయితే, 2022లో కెప్టెన్గా అవకాశం ఇచ్చినా సద్వినియోగం చేసుకోలేకపోయాడు. ఇక ఇప్పటి వరకు తన ఐపీఎల్ కెరీర్ మొత్తంలో జడ్డూ 240 మ్యాచ్లు ఆడి 2959 రన్స్ చేయడంతో పాటు 160 వికెట్లు తీశాడు.చదవండి: Aus A vs Ind A: రుతు, నితీశ్ డకౌట్.. అభిమన్యు, ఇషాన్ విఫలం -
IND VS NZ 2nd Test: ధోని తరహాలో రనౌట్ చేసిన జడ్డూ
భారత్, న్యూజిలాండ్ మధ్య జరుగుతున్న రెండో టెస్ట్లో ఓ ఆసక్తికర సన్నివేశం చోటు చేసుకుంది. మూడో రోజు ఆటలో రవీంద్ర జడేజా ఎంఎస్ ధోని తరహాలో ఓ రనౌట్ చేశాడు. జడేజా బౌలింగ్లో గ్లెన్ ఫిలిప్స్ రెండో పరుగు కోసం ప్రయత్నించగా ఫీల్డర్ వాషింగ్టన్ సుందర్ బంతిని నాన్ స్టయికర్ వైపు విసిరాడు. వికెట్ల వద్ద బాల్ను కలెక్ట్ చేసుకున్న జడేజా చూడకుండా బంతిని వికెట్లపైకి విసిరాడు. ఈ లోపు నాన్ స్ట్రయికర్ వైపు పరుగు తీస్తున్న విలియమ్ ఓరూర్కీ క్రీజ్ను చేరుకోలేకపోయాడు. జడేజా డౌట్ ఫుల్గా అప్పీల్ చేయగా.. రీప్లేలో అది ఔట్గా తేలింది. గతంలో ధోని చాలా సార్లు ఇలా ఫీల్డర్లు విసిరిన బంతిని చూడకుండానే వికెట్లపైకి నెట్టి రనౌట్స్ చేశాడు. జడ్డూ రనౌట్ చేసిన విధానాన్ని చూసిన నెటిజన్లు ధోని శిష్యుడివి అనిపించుకున్నావంటూ కామెంట్లు చేస్తున్నారు.The Thala effect in Ravindra Jadeja's run out. 😄pic.twitter.com/tBoXdr27O6— Mufaddal Vohra (@mufaddal_vohra) October 26, 2024కాగా, సెకెండ్ ఇన్నింగ్స్లో 255 పరుగులకు ఆలౌటైన న్యూజిలాండ్ టీమిండియా ముందు 359 పరుగుల లక్ష్యాన్ని ఉంచింది. న్యూజిలాండ్ ఇన్నింగ్స్లో (సెకెండ్) టామ్ లాథమ్ అర్ద సెంచరీతో (86) రాణించగా.. టామ్ బ్లండెల్ (41), గ్లెన్ ఫిలిప్స్ (48 నాటౌట్) ఓ మోస్తరు స్కోర్లు చేశారు. భారత బౌలర్లలో వాషింగ్టన్ సుందర్ 4, రవీంద్ర జడేజా 3, అశ్విన్ 2 వికెట్లు పడగొట్టారు.అంతకుముందు భారత్ తొలి ఇన్నింగ్స్లో 156 పరుగులకు ఆలౌటైంది. మిచెల్ సాంట్నర్ ఏడు వికెట్లు తీసి టీమిండియా పతనాన్ని శాశించాడు. గ్లెన్ ఫిలిప్స్ 2, సౌతీ ఓ వికెట్ పడగొట్టారు. భారత ఇన్నింగ్స్లో రవీంద్ర జడేజా (38) టాప్ స్కోరర్గా నిలిచాడు. యశస్వి, గిల్ చెరో 30 పరుగులు చేశారు.ఈ మ్యాచ్లో తొలుత బ్యాటింగ్ చేసిన న్యూజిలాండ్ తొలి ఇన్నింగ్స్లో 259 పరుగులకు ఆలౌటైంది. వాషింగ్టన్ సుందర్ ఏడు వికెట్లతో చెలరేగి కివీస్ ఇన్నింగ్స్ను కుప్పకూల్చాడు. అశ్విన్ మూడు వికెట్లు పడగొట్టాడు. కివీస్ ఇన్నింగ్స్లో కాన్వే (76), రచిన్ రవీంద్ర (65) అర్ద సెంచరీలతో రాణించారు. మూడు మ్యాచ్ల ఈ సిరీస్లో న్యూజిలాండ్ తొలి టెస్ట్లో నెగ్గిన విషయం తెలిసిందే. -
IPL 2025- CSK: ధోనికి రూ. 4 కోట్లు! వాళ్లిద్దరూ జట్టుతోనే!
ఐపీఎల్-2025 మెగా వేలానికి ఫ్రాంఛైజీలు సన్నద్ధమవుతున్నాయి. ఇందులో భాగంగా ఈనెల (అక్టోబరు) 31 నాటికి.. అట్టిపెట్టకునే ఆటగాళ్ల తుదిజాబితాను సిద్ధం చేసుకుంటున్నాయి. ఈ నేపథ్యంలో చెన్నై సూపర్ కింగ్స్(సీఎస్కే) రిటెన్షన్స్కు సంబంధించి ఆసక్తికర వార్త తెరమీదకు వచ్చింది.కాగా ఐపీఎల్ పాలక మండలి రిటెన్షన్ విధానంలో భాగంగా కొత్త నిబంధనలు తెచ్చిన విషయం తెలిసిందే. ఈసారి ఫ్రాంఛైజీలు గరిష్టంగా ఆరుగురు(ఆర్టీఎమ్) ఆటగాళ్లను అట్టిపెట్టుకునే అవకాశం ఉంది. ఇందులో రిటెన్షన్ స్లాబ్లో మొదటి ఆటగాడికిరూ. 18 కోట్లు, రెండో ప్లేయర్కు రూ. 14 కోట్లు, మూడో క్రికెటర్కు రూ. 18 కోట్లు, నాలుగో ఆటగాడికి రూ. 14 కోట్లు, ఐదో ఆటగాడికి రూ. 11 కోట్లు, ఆరో ఆటగాడికి రూ. 4 కోట్లు(అన్క్యాప్డ్) చెల్లించాల్సి ఉంటుంది.సీఎస్కే రిటైన్ చేసుకునేది వీరినే? ఎవరికి ఎన్ని కోట్లుఇక తాజా సమాచారం ప్రకారం సీఎస్కే తమ టాప్ ప్లేయర్ మహేంద్ర సింగ్ ధోని, కెప్టెన్ రుతురాజ్ గైక్వాడ్లతో పాటు రవీంద్ర జడేజా, శివం దూబే, మతీశ పతిరణలను రిటైన్ చేసుకోవాలని ఫిక్సయినట్లు తెలుస్తోంది. ఇందులో ధోనిని అన్క్యాప్డ్ కోటాలో ఎంపిక చేసుకుని రూ. 4 కోట్లు ఇచ్చేందుకు సిద్ధమైన ఫ్రాంఛైజీ.. రుతుతో పాటు జడ్డూకు రూ. 18 కోట్లు ఇవ్వనున్నట్లు తెలుస్తోంది.అంతేకాదు.. రుతురాజ్నే కెప్టెన్గా కొనసాగించాలని నిర్ణయించినట్లు వార్తలు వినిపిస్తున్నాయి. కాగా 2008లో ఐపీఎల్ ఆరంభమైన నాటి నుంచి ధోని చెన్నై ఫ్రాంఛైజీతోనే కొనసాగుతున్నాడు. జట్టును అత్యధికంగా ఐదుసార్లు చాంపియన్గా నిలిపి ఈ ఘనత సాధించిన రెండో కెప్టెన్గా రికార్డులకెక్కాడు. అయితే, గతేడాది సారథ్య బాధ్యతలను రుతురాజ్ గైక్వాడ్కు అప్పగించిన ధోని ఆటగాడిగా కొనసాగాడు.సీఎస్కే అంటే ధోనినిజానికి ధోని అంటే సీఎస్కే.. సీఎస్కే అంటే ధోని. ధోని బ్రాండ్ వల్లే చెన్నై ఫ్రాంఛైజీకి ఆదరణ పెరుగిందనేద కాదనలేని వాస్తవం. అంతేకాదు.. వేలం మొదలు కెప్టెన్సీ వరకు ధోని ఆజ్ఞ లేనిదే అక్కడ ఏ పని జరగదని సన్నిహిత వర్గాలు అంటాయి. మరి అలాంటి ధోని అన్క్యాప్డ్ ప్లేయర్గా ఎలా? అంటే.. బీసీసీఐ నిబంధన ప్రకారం అంతర్జాతీయ క్రికెట్కు వీడ్కోలు పలికిన భారత ఆటగాళ్లను ఫ్రాంఛైజీలో ఈ కోటాలో వేసుకోవచ్చు.PC: BCCIఇద్దరు శిష్యులుచెన్నైకి రుతుతో పాటు జడేజా కూడా ముఖ్యం కాబట్టి వాళ్లిద్దరికి రూ. 18 కోట్లు ఇవ్వాలని భావిస్తున్నట్లు టైమ్స్ ఆఫ్ ఇండియా నివేదిక పేర్కొంది. కాగా రుతురాజ 2019లో సీఎస్కేలో చేరాడు. 2020లో అరంగేట్రం చేసిన అతడు ఆ మరుసటి ఏడాదే ఆరెంజ్క్యాప్ హోల్డర్ అయ్యాడు. ఆసియా క్రీడలు-2023లో భారత ద్వితీయ శ్రేణి జట్టుకు సారథ్యం వహించి గోల్డ్ మెడల్ గెలిచిన తర్వాత.. ఈఏడాది సీఎస్కే పగ్గాలు చేపట్టాడు.ఇక రవీంద్ర జడేజాకు సీఎస్కేతో సుదీర్ఘ అనుబంధం ఉంది. 2022లో కెప్టెన్గానూ నియమితుడయ్యాడు. కానీ వరుస ఓటముల నేపథ్యంలో మధ్యలోనే కెప్టెన్సీ వదిలేశాడు. ఈ ఇద్దరికి వరుస అవకాశాలు ఇచ్చి జట్టులో కీలక సభ్యులుగా నిలబెట్టింది మాత్రం ధోనినే!చదవండి: Ind vs NZ: టీమిండియాలోకి చెన్నై చిన్నోడు.. బీసీసీఐ ప్రకటన -
Ind vs NZ: టీమిండియాలోకి చెన్నై చిన్నోడు.. బీసీసీఐ ప్రకటన
న్యూజిలాండ్తో మిగిలిన రెండు టెస్టులకు టీమిండియా క్రికెటర్ వాషింగ్టన్ సుందర్ అందుబాటులోకి వచ్చాడు. కివీస్తో పుణె, ముంబై మ్యాచ్లకు అతడిని ఎంపిక చేసినట్లు భారత క్రికెట్ నియంత్రణ మండలి(బీసీసీఐ) ఆదివారం ప్రకటన విడుదల చేసింది.ప్రపంచ టెస్టు చాంపియన్షిప్(డబ్ల్యూటీసీ) 2023-25లో భాగంగా రోహిత్ సేన స్వదేశంలో న్యూజిలాండ్తో మూడు మ్యాచ్లు ఆడుతోంది. ఈ క్రమంలో బెంగళూరులో జరిగిన తొలి టెస్టులో ఎనిమిది వికెట్ల తేడాతో పరాజయం పాలైంది. తొలి ఇన్నింగ్స్లో మరీ దారుణంగా 46 పరుగులకే ఆలౌట్ అయిన టీమిండియా.. రెండో ఇన్నింగ్స్లో భారీ స్కోరు(462) చేసినా ఫలితం లేకుండా పోయింది. ఈ క్రమంలో డబ్ల్యూటీసీ ఫైనల్ చేరాలంటే మిగిలిన రెండు టెస్టులు కీలకంగా మారాయి. ఈ నేపథ్యంలో బీసీసీఐ వాషింగ్టన్ సుందర్ను తిరిగి పిలిపించడం ఆసక్తికరంగా మారింది. బెంగళూరు టెస్టులో విఫలమైన రవీంద్ర జడేజా నేపథ్యంలో ఈ తమిళనాడు క్రికెటర్పై సెలక్టర్లు దృష్టి పెట్టినట్లు తెలుస్తోంది. భారీ సెంచరీతో మెరిసిన వాషీకాగా రంజీ ట్రోఫీ 2024-25లో భాగంగా తమిళనాడు తరఫున వాషింగ్టన్ సుందర్ ఢిల్లీతో మ్యాచ్ సందర్భంగా బరిలోకి దిగాడు. ఈ మ్యాచ్లో భారీ సెంచరీ(269 బంతుల్లో 152; 19 ఫోర్లు, ఒక సిక్సర్)తో సత్తా చాటాడు.తమిళనాడు తొలి ఇన్నింగ్స్లో భారీ స్కోరు(674/6 డిక్లేర్డ్) సాధించడంలో తన వంతు పాత్ర పోషించాడు. ఈ క్రమంలోనే అతడు మూడేళ్ల తర్వాత టెస్టులో రీ ఎంట్రీ ఇవ్వనున్నట్లు తెలుస్తోంది. కాగా వాషింగ్టన్ సుందర్ 2021లో చివరగా టెస్టు మ్యాచ్ ఆడాడు.‘పెద్దోడి’కి తోడుగా చిన్నోడు!ఇదిలా ఉంటే.. న్యూజిలాండ్తో తొలి టెస్టులో రవీంద్ర జడేజా తొలి ఇన్నింగ్స్లో డకౌట్ అయ్యాడు. రెండో ఇన్నింగ్స్లో ఐదు పరుగులకే వెనుదిరిగాడు. అయితే, ఈ మ్యాచ్లో మూడు వికెట్లు తీయగలిగాడు. ఇదిలా ఉంటే.. ఇప్పటికే కివీస్తో సిరీస్లో చెన్నై దిగ్గజ స్పిన్ ఆల్రౌండర్ రవిచంద్రన్ అశ్విన్ ఆడుతున్న విషయం తెలిసిందే. ఇప్పుడు ఈ ‘పెద్దోడి’కి చిన్నోడు జతకావడం విశేషం. కాగా టీమిండియా- న్యూజిలాండ్ మధ్య అక్టోబరు 24- 28 వరకు పుణె వేదికగా రెండో టెస్టు, నవంబరు 1-5 వరకు మూడో టెస్టు నిర్వహణకు షెడ్యూల్ ఖరారైంది.న్యూజిలాండ్తో రెండు, మూడో టెస్టులకు భారత జట్టురోహిత్ శర్మ (కెప్టెన్), జస్ప్రీత్ బుమ్రా (వైస్ కెప్టెన్), యశస్వి జైస్వాల్, శుబ్మన్ గిల్, విరాట్ కోహ్లి, కేఎల్ రాహుల్, సర్ఫరాజ్ ఖాన్, రిషబ్ పంత్ (వికెట్ కీపర్), ధృవ్ జురెల్ (వికెట్ కీపర్), రవిచంద్రన్ అశ్విన్, రవీంద్ర జడేజా, అక్షర్ పటేల్, కుల్దీప్ యాదవ్, మహ్మద్ సిరాజ్, ఆకాశ్ దీప్, వాషింగ్టన్ సుందర్.చదవండి: సర్ఫరాజ్ కాదు!.. మిడిలార్డర్లో అతడిని ఆడించాలి: మాజీ క్రికెటర్ 🚨 News 🚨Squad Update: Washington Sundar added to squad for the second and third Test#INDvNZ | @IDFCFIRSTBankDetails 🔽— BCCI (@BCCI) October 20, 2024 -
రాక్స్టార్ రవీంద్ర జడేజా
భారత క్రికెట్ జట్టులోకి తొలిసారి అడుగు పెట్టినప్పుడు రవీంద్ర జడేజా వయసు 21 ఏళ్లు. అతని ఆట మెరుగ్గానే ఉన్నా అతని వ్యవహారశైలిపై అందరికీ సందేహాలు ఉండేవి. ఐపీఎల్లో మంచి ప్రదర్శనతో గుర్తింపు తెచ్చుకొని జట్టులోకి వచ్చిన జడేజాలోని ‘యూత్’ లక్షణాలు టీమిండియా డ్రెస్సింగ్ రూమ్లో చాలా మందికి కొత్తగా అనిపించాయి. కానీ పదిహేనేళ్ల అంతర్జాతీయ కెరీర్ తర్వాత అతను భారత అత్యుత్తమ ఆల్రౌండర్లలో ఒకడిగా కనిపించసాగాడు. ‘రాక్స్టార్’ అనే ముద్దు పేరుతో మొదలైన అతని ప్రస్థానం టీమిండియా అద్భుత విజయాలకు చుక్కానిగా నిలిచింది. కెరీర్ ఆరంభంలో వన్డే, టి20 ఆటగాడిగానే ముద్ర పడినా కఠోర శ్రమ, పట్టుదలతో ఎరుపు బంతిపై పట్టు సాధించిన జడేజా ఇప్పుడు టెస్టు క్రికెట్లో కూడా అరుదైన మైలురాయిని అందుకున్నాడు. 92 ఏళ్ల చరిత్ర ఉన్న భారత టెస్టు క్రికెట్లో 300కు పైగా వికెట్లు తీసిన ఏడుగురు ఆటగాళ్లలో ఒకడిగా తన పేరును లిఖించుకున్నాడు. అంతేకాదు.. ప్రపంచవ్యాప్తంగా 3 వేల పరుగులు సాధించి, 300 వికెట్లు తీసిన 11 మందిలో ఒకడిగా ఉన్నాడు. ప్రతికూలతలను అధిగమించి..సెంచరీ లేదా హాఫ్ సెంచరీ సాధించినప్పుడు కత్తిసాము తరహాలో తన బ్యాట్ను తిప్పుతూ జడేజా చేసే విన్యాసం భారత అభిమానులందరికీ సుపరిచితమే. రాజపుత్రుల కుటుంబానికి చెందిన అతను తన సంబరాన్ని ఇలా ప్రదర్శిస్తూ ఉంటాడు. అయితే పేరుకు అలాంటి నేపథ్యం ఉన్నా జడేజా జీవితంలో ఎన్నో ఆటుపోట్లను ఎదుర్కొన్నాడు. అవి అతనిలో పోరాట పటిమను పెంచి, మానసికంగా దృఢంగా మార్చాయి. అతి సాధారణ కుటుంబం అతనిది. వాచ్మన్గా పనిచేసే తండ్రి తన కుమారుడు తొందరగా ఆర్మీలో ఒక సిపాయి ఉద్యోగంలో చేరితే చాలు.. ఆర్థికంగా గట్టెక్కుతామనే ఆలోచనతో ఉండేవాడు. కానీ జడేజా మాత్రం భిన్న మార్గాన్ని ఎంచుకున్నాడు. తనకెంతో ఇష్టమైన క్రికెట్లోనే ఏదైనా చేసి చూపిస్తాననే పట్టుదల కనబరచి తండ్రిని ఒప్పించగలిగాడు. అతనికి తల్లి కూడా మద్దతు పలికింది. అయితే ఆటలో జడేజా ఎదుగుతున్న సమయంలోనే ఒక ప్రమాదంలో తల్లి చనిపోయింది. అప్పుడు అతని వయసు 16 ఏళ్లు. ఆ బాధలో క్రికెట్కు గుడ్బై చెబుదామనుకున్నాడు. కానీ తండ్రి అండగా నిలవడంతో క్రికెట్పై మళ్లీ శ్రద్ధపెట్టాడు. దేశవాళీలో చెలరేగి..యూత్ క్రికెట్లో సౌరాష్ట్ర జట్టు తరఫున చెలరేగిన జడేజా ఆట అతనికి భారత అండర్–19 జట్టులో చోటు కల్పించింది. 2006లో రన్నరప్గా నిలిచిన జట్టులో భాగంగా ఉన్న జడేజా.. 2008లో విరాట్ కోహ్లీ నేతృత్వంలో టైటిల్ నెగ్గిన టీమ్లో కీలక సభ్యుడిగా సత్తా చాటాడు. ఆరు మ్యాచ్లలో అతను తీసిన 10 వికెట్లు జట్టుకు విజయాలను అందించాయి. ఫలితంగా 2008లో జరిగిన తొలి ఐపీఎల్లో ప్రతిభ గల వర్ధమాన ఆటగాడిగా రాజస్థాన్ రాయల్స్ టీమ్లో చోటు దక్కించుకున్నాడు. రాజస్థాన్ ఐపీఎల్ విజేతగా నిలవడంతో జడేజాకు కూడా మంచి గుర్తింపు దక్కింది. ఇక్కడే షేన్వార్న్ అతనికి రాక్స్టార్ అంటూ పేరు పెట్టాడు. అయితే ఉడుకు రక్తం ఉప్పొంగే 20 ఏళ్ల వయసులో సరైన మార్గనిర్దేశనం లేకుండా అతను చేసిన తప్పుతో వివాదానికి కేంద్రంగా నిలిచాడు. ఒక జట్టుతో కాంట్రాక్ట్లో ఉండగానే ఎక్కువ మొత్తం కోసం మరో జట్టుతో ఒప్పందం కుదుర్చుకునే ప్రయత్నం చేయడం బీసీసీఐకి ఆగ్రహం తెప్పించింది. దాంతో ఏడాది నిషేధం విధించడంతో 2009 ఐపీఎల్కు అతను దూరమయ్యాడు. ఐపీఎల్కు రెండు నెలల ముందే కేవలం ప్రతిభ కారణంగా భారత జట్టు తరఫున తొలి వన్డే, తొలి టి20 అవకాశం రావడం అతనికి కలిగిన ఊరట. అయితే ఆ నిషేధం వ్యక్తిగా కూడా అతను మెరుగుపడే అవకాశాన్నిచ్చింది. 2012 ఐపీఎల్లో చెన్నై సూపర్ కింగ్స్ జట్టుతో చేరడం జడేజా కెరీర్ను మలుపు తిప్పింది. ఎన్నో రికార్డులు సొంతం చేసుకున్నాడు. చెన్నై టీమ్ మూల స్తంభాల్లో ఒకడిగా నిలిచాడు. టీమ్ తరఫున మూడు టైటిల్స్ విజయాల్లో భాగంగా ఉన్నాడు. దశాబ్దంన్నర కాలంలో భారత్ తరఫున ఆడిన 197 వన్డేలు, 74 టి20 మ్యాచ్లు పరిమిత ఓవర్ల క్రికెట్లో అతని విలువను చూపించాయి. టెస్టుల్లో సూపర్ హీరోగా..వన్డేలు, టి20లతో పోలిస్తే టెస్టు క్రికెట్లో జడేజా సాధించిన ఘనతలు అసాధారణమైనవి. రంజీ ట్రోఫీలో ఏకంగా మూడు ట్రిపుల్ సెంచరీలు సాధించిన ఏకైక భారతీయుడిగా అతను రికార్డు నెలకొల్పాడు. ప్రపంచ క్రికెట్లో అతనికి ముందు మరో ఏడుగురు మాత్రమే ఇలాంటి ఫీట్ను సాధించారు. ఆ జోరులో 2012లో జడేజా భారత టెస్టు జట్టులోకి తొలిసారి ఎంపికయ్యాడు. ఈ పుష్కర కాలంలో జడేజా ఒంటి చేత్తో జట్టుకు అందించిన విజయాలు ఎన్నో. తన లెఫ్టార్మ్ స్పిన్తో ప్రత్యర్థి బ్యాటర్లను కట్టిపడేసి చకచకా వికెట్లు పడగొట్టడం.. లేదంటే లోయర్ ఆర్డర్లో తన బ్యాటింగ్తో కీలక పరుగులతో జట్టుకు భారీ స్కోరు అందించడం.. ఇలా ఏదో రూపంలో అతని భాగస్వామ్యం లేని టెస్టులు దాదాపుగా లేవంటే అతిశయోక్తి కాదు. జట్టులో మరో సహచరుడు, అగ్రశ్రేణి స్పిన్నర్గా అశ్విన్ను దాటి కూడా కొన్నిసార్లు ఏకైక స్పిన్నర్గా టీమ్లో అవకాశాన్ని దక్కించుకోగలిగాడంటే జడేజా సత్తాపై టీమ్ మేనేజ్మెంట్కున్న నమ్మకం ఎలాంటిదో అర్థం చేసుకోవచ్చు. ఆస్ట్రేలియాపై వరుసగా రెండు సిరీస్లలో 24, 25 చొప్పున, దక్షిణాఫ్రికాపై 23, ఇంగ్లండ్పై 26.. ఇలా సొంతగడ్డపై సిరీస్ ఏదైనా ప్రత్యర్థిని కుప్పకూల్చడం జడేజాకు మంచినీళ్లప్రాయంలా మారింది. అనిల్ కుంబ్లే (1993) తర్వాత ఐసీసీ టెస్టు బౌలింగ్ ర్యాంకింగ్స్లో నంబర్వన్గా తొలి భారత బౌలర్గా జడేజా గుర్తింపు తెచ్చుకున్నాడు.∙మొహమ్మద్ అబ్దుల్ హాది -
జడేజా మ్యాజిక్ డెలివరీ.. గ్లెన్ ఫిలిప్స్ మైండ్ బ్లాంక్(వీడియో)
బెంగళూరు వేదికగా భారత్తో జరుగుతున్న తొలి టెస్టులో న్యూజిలాండ్ దుమ్ములేపుతోంది. మొదటి ఇన్నింగ్స్లో కివీస్ 402 పరుగుల భారీ సాధించింది. ఫస్ట్ ఇన్నింగ్స్లో బ్లాక్ క్యాప్స్కు 356 పరుగుల ఆధిక్యం లభించింది. న్యూజిలాండ్ బ్యాటర్లలో స్టార్ ఆల్రౌండర్ రచిన్ రవీంద్ర(134) అద్బుతమైన సెంచరీతో చెలరేగగా.. కాన్వే(91), టిమ్ సౌథీ(65) ఆర్ధశతకాలు సాధించారు. భారత బౌలర్లలో జడేజా, కుల్దీప్ యాదవ్ తలా మూడు వికెట్లు పడగొట్టారు. వీరిద్దరితో పాటు సిరాజ్ రెండు, బుమ్రా, అశ్విన్ చెరో వికెట్ సాధించారు.జడ్డూ మ్యాజిక్..ఇక ఈ మ్యాచ్లో రవీంద్ర జడేజా సంచలన బంతితో మెరిశాడు. కివీస్ స్టార్ బ్యాటర్ గ్లెన్ ఫిలిప్స్ను జడ్డూ ఔట్ చేసిన తీరు ఇన్నింగ్స్ మొత్తానికే హైలెట్. జడేజా అద్భుతమైన బంతితో ఫిలిప్స్ను బోల్తా కొట్టించాడు. ఇన్నింగ్స్ 63వ ఓవర్లో మూడో బంతిని మిడిల్ స్టంప్ దిశగా లెంగ్త్ డెలివరీని జడ్డూ సంధించాడు. ఆ బంతిని ఫిలిప్స్ బ్యాక్ ఫుట్ నుండి డిఫెన్సివ్ షాట్ ఆడటానికి ప్రయత్నించాడు. కానీ బంతి అతడి బ్యాట్ను మిస్స్ అయ్యి స్టంప్స్ను గిరాటేసింది. అది చూసిన ఫిలిప్స్ ఒక్కసారిగా షాకయ్యాడు. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరలవుతోంది. Phillips' bright start has a dim end thanks to Ravindra Jadeja 👌#IDFCFirstBankTestTrophy #JioCinemaSports #INDvNZ pic.twitter.com/sjjrzLnGxX— JioCinema (@JioCinema) October 18, 2024 -
IND vs NZ: కివీస్ 402 ఆలౌట్.. భారీ ఆధిక్యం
టీమిండియాతో తొలి టెస్టులో న్యూజిలాండ్ భారీ స్కోరు సాధించింది. తొలి ఇన్నింగ్స్లో రోహిత్ సేన కంటే 356 పరుగుల ఆధిక్యంలో నిలిచింది. బెంగళూరు వేదికగా 180/3 ఓవర్నైట్ స్కోరుతో శుక్రవారం నాటి మూడో రోజు ఆట మొదలుపెట్టింది కివీస్.రచిన్ రవీంద్ర సెంచరీమిడిలార్డర్ బ్యాటర్ రచిన్ రవీంద్ర సెంచరీతో చెలరేగగా.. టెయిలెండర్ టిమ్ సౌతీ అతడికి సహకారం అందించాడు. రచిన్ 157 బంతులు ఎదుర్కొని 13 ఫోర్లు, 4 సిక్సర్ల సాయంతో 134 పరుగులు చేశాడు. అతడి కెరీర్లో ఇది రెండో టెస్టు సెంచరీ. మరోవైపు.. సౌతీ 73 బంతుల్లో 65 రన్స్తో ఆకట్టుకున్నాడు. మిగతా వాళ్లలో మూడో రోజు గ్లెన్ ఫిలిప్స్(14) ఒక్కడే డబుల్ డిజిట్ స్కోరు సాధించాడు.ఇక గురువారం ఓపెనర్ డెవాన్ కాన్వే 91 పరుగులతో అదరగొట్టిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో న్యూజిలాండ్ తమ తొలి ఇన్నింగ్స్లో 402 పరుగులకు ఆలౌట్ అయింది. భారత బౌలర్లలో స్పిన్నర్లు కుల్దీప్ యాదవ్, రవీంద్ర జడేజా మూడేసి వికెట్లు పడగొట్టగా.. అశ్విన్ ఒక వికెట్ తీశాడు. పేసర్లు జస్ప్రీత్ బుమ్రా, మహ్మద్ సిరాజ్ రెండు వికెట్లు తమ ఖాతాలో వేసుకున్నారు. కాగా రోహిత్ సేన 46 పరుగులకే కుప్పకూలిన విషయం తెలిసిందే. ఫలితంగా న్యూజిలాండ్కు 356 పరుగుల ఆధిక్యం లభించింది.టీమిండియా వర్సెస్ న్యూజిలాండ్👉తొలి టెస్టు: అక్టోబరు 16- అక్టోబరు 20👉వేదిక: ఎం. చిన్నస్వామి స్టేడియం, బెంగళూరు👉వర్షం వల్ల తొలిరోజు ఆట రద్దు👉రెండో రోజు పడిన టాస్👉టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న టీమిండియా👉టీమిండియా తొలి ఇన్నింగ్స్: 46 పరుగులకే ఆలౌట్👉న్యూజిలాండ్ తొలి ఇన్నింగ్స్: 402 ఆలౌట్.చదవండి: ‘కాస్తైనా సిగ్గుండాలి నీకు!: మండిపడ్డ టీమిండియా ఫ్యాన్స్ -
Ind vs Ban: అంచనాలు తలకిందులు చేసి.. ఫలితం తేల్చేశారు!
బంగ్లాదేశ్తో రెండో టెస్టులో టీమిండియా ఘన విజయం సాధించింది. ఏడు వికెట్ల తేడాతో పర్యాటక జట్టుపై జయభేరి మోగించింది. తద్వారా రెండు మ్యాచ్ల టెస్టు సిరీస్ను 2-0తో క్లీన్స్వీప్ చేసి.. ప్రపంచ టెస్టు చాంపియన్షిప్(డబ్ల్యూటీసీ) పాయింట్ల పట్టికలో అగ్రస్థానాన్ని మరింత పదిలం చేసుకుంది.కాన్పూర్లో వెంటాడిన వరణుడు డబ్ల్యూటీసీ 2023-25 సీజన్లో భాగంగా రోహిత్ సేన స్వదేశంలో బంగ్లాదేశ్తో రెండు టెస్టులు ఆడింది. చెన్నై మ్యాచ్లో 280 పరుగులతో బంగ్లాను మట్టికరిపించి శుభారంభం అందుకున్న టీమిండియాను.. కాన్పూర్లో వరణుడు వెంటాడాడు. వర్షం కారణంగా ఇక్కడి గ్రీన్ పార్క్ స్టేడియంలో తొలిరోజు కేవలం 35 ఓవర్ల ఆటే సాగగా.. రెండు, మూడో రోజు ఆట ఒక్క బంతి పడకుండానే రద్దైపోయింది.డ్రాగా ముగిసిపోతుందనే అభిప్రాయాలుఈ నేపథ్యంలో భారత్- బంగ్లా రెండో టెస్టు డ్రాగా ముగిసిపోతుందనే అభిప్రాయాలు వ్యక్తమయ్యాయి. అయితే, టీమిండియా మాత్రం అందరి అంచనాలు తలకిందులు చేస్తూ ‘బజ్బాల్’ క్రికెట్ను తలదన్నే ఫార్ములాతో అద్భుతం చేసింది. వర్షం లేకపోవడం.. మైదానం పొడిగా ఉండటంతో నాలుగో రోజును పూర్తిగా సద్వినియోగం చేసుకుంది.భారత బౌలర్ల విజృంభణబంగ్లాదేశ్ సోమవారం... తమ తొలి ఇన్నింగ్స్ స్కోరు 107/3ను మొదలుపెట్టగా.. ఆది నుంచే భారత బౌలర్లు విజృంభించారు. బంగ్లాను 233 పరుగులకే ఆలౌట్ చేశారు. భారత యువ పేసర్ ఆకాశ్ దీప్ బంగ్లా ఓపెనర్లను అవుట్ చేయగా.. పేస్ దళ నాయకుడు జస్ప్రీత్ బుమ్రా 3, మహ్మద్ సిరాజ్ రెండు వికెట్లు కూల్చారు. స్పిన్నర్లు రవిచంద్రన్ అశ్విన్ రెండు, రవీంద్ర జడేజా ఒక వికెట్ దక్కించుకున్నారు.‘బజ్బాల్’ క్రికెట్కే వణుకుపుట్టించే వేగంతోఇక ఆ తర్వాత బ్యాటింగ్కు దిగిన రోహిత్ సేన ఆకాశమే హద్దుగా బంగ్లా బౌలింగ్ను చితక్కొట్టింది. సమయం లేదు మిత్రమా అన్నట్లుగా.. ‘బజ్బాల్’ క్రికెట్కే వణుకుపుట్టించే వేగంతో 50, 100. 200 పరుగుల మైలురాళ్లను దాటింది. వచ్చిన ప్రతి బ్యాటరూ దూకుడుగా ఆడుతూ ప్రత్యర్థి జట్టు బౌలర్లపై ఒత్తిడి పెంచి వీలైనన్ని పరుగులు పిండుకున్నారు.ఈ క్రమంలో 34.4 ఓవర్లలోనే తొమ్మిది వికెట్ల నష్టానికి టీమిండియా 285 పరుగులు ఇన్నింగ్స్ డిక్లేర్ చేసింది. బంగ్లాదేశ్ మీద 52 పరుగుల ఆధిక్యం సంపాదించి. ఈ క్రమంలో బంగ్లా నాలుగో రోజే తమ రెండో ఇన్నింగ్స్ మొదలుపెట్టి సోమవారం నాటి ఆట పూర్తయ్యే సరికి రెండు వికెట్ల నష్టానికి 26 పరుగులు చేసింది.ఆలస్యానికి తావిస్తే మొదటికే మోసంఇక ఆఖరి రోజు ఆలస్యానికి తావిస్తే మొదటికే మోసం వస్తుందని భావించిన రోహిత్ సేన.. ఆది నుంచే వికెట్ల వేట మొదలుపెట్టింది. నైట్ వాచ్మన్ మొమినుల్ హక్(2) వికెట్ తీసి శుభారంభం అందించగా.. క్రీజులో పాతుకుపోయిన ఓపెనర్ షాద్మన్ ఇస్లాం(50)ను ఆకాశ్ దీప్ పెవిలియన్కు పంపాడు. ప్రమాదకారిగా మారే అవకాశం ఉన్న ముష్ఫికర్ రహీం(37)ను బుమ్రా అవుట్ చేశాడు.చకచకా పడగొట్టేశారుమొత్తంగా బుమ్రా, అశూ, జడ్డూ మూడేసి వికెట్లు కూల్చగా.. ఆకాశ్ దీప్ ఒక వికెట్ తన ఖాతాలో వేసుకున్నాడు. అంతా కలిసి రెండో ఇన్నింగ్స్లో బంగ్లాదేశ్ను 146 పరుగులకే కుప్పకూల్చారు. దీంతో టీమిండియా తొలి ఇన్నింగ్స్ మీద బంగ్లాదేశ్ ఆధిక్యం 94 పరుగులు కాగా.. రోహిత్ సేన విజయ లక్ష్యంగా 95 పరుగులుగా మారింది.ఫోర్తో విజయం ఖరారు చేసిన పంత్ఇక త్వరగా మ్యాచ్ ముగించేయాలని భావించిన టీమిండియా దూకుడుగానే ఛేజింగ్ మొదలుపెట్టింది. దీంతో రోహిత్ శర్మ 8 పరుగులకే నిష్క్రమించగా.. యశస్వి జైస్వాల్(51) మరోసారి ధనాధన్ ఇన్నింగ్స్తో అలరించాడు. శుబ్మన్ గిల్ 6 పరుగులకే పరిమితం కాగా.. కోహ్లి 29 పరుగులతో అజేయంగా నిలిచాడు. రిషభ్ పంత్ ఫోర్ బాది విజయ లాంఛనాన్ని పూర్తి చేశాడు. డ్రా అవుతుందని ఊహించిన ఈ మ్యాచ్లో టీమిండియా పక్కా ప్రణాళికతో గెలుపొందడం అభిమానులను ఖుషీ చేసింది. టీమిండియా వర్సెస్ బంగ్లాదేశ్ రెండో టెస్టువేదిక: గ్రీన్ పార్క్ స్టేడియం, కాన్పూర్టాస్: టీమిండియా.. బౌలింగ్బంగ్లాదేశ్ తొలి ఇన్నింగ్స్ : 233 పరుగులు ఆలౌట్టీమిండియా తొలి ఇన్నింగ్స్ : 285/9 డిక్లేర్డ్బంగ్లాదేశ్ రెండో ఇన్నింగ్స్ : 146 పరుగుల ఆలౌట్టీమిండియా రెండో ఇన్నింగ్స్: 98/3ఫలితం: ఏడు వికెట్ల తేడాతో రోహిత్ సేన విజయంచదవండి: సెహ్వాగ్ రికార్డు బ్రేక్ చేసిన జైస్వాల్.. Rishabh Pant hits the winning runs 💥He finishes off in style as #TeamIndia complete a 7-wicket win in Kanpur 👏👏Scorecard - https://t.co/JBVX2gyyPf#INDvBAN | @IDFCFIRSTBank pic.twitter.com/Nl2EdZS9VF— BCCI (@BCCI) October 1, 2024 -
జడేజా సరికొత్త చరిత్ర.. తొలి భారత క్రికెటర్గా
టీమిండియా ఆల్రౌండర్ రవీంద్ర జడేజా టెస్టుల్లో 300 వికెట్ల మైలు రాయిని అందుకున్నాడు. టెస్టు క్రికెట్లో ఈ ఘనత సాధించిన ఏడో భారత బౌలర్గా రవీంద్ర జడేజా నిలిచాడు. కాన్పూర్ వేదికగా బంగ్లాదేశ్తో జరుగుతున్న రెండో టెస్టులో ఖాలీల్ ఆహ్మద్ను ఔట్ చేసిన జడ్డూ ఈ రికార్డును తన ఖాతాలో వేసుకున్నాడు. ఈ జాబితాలో అతడి కంటే ముందు అనిల్ కుంబ్లే (619), అశ్విన్ (524), కపిల్ (434), హర్భజన్ (417), ఇషాంత్ శర్మ (311), జహీర్ ఖాన్ (311) ఉన్నారు.మరో అరుదైన రికార్డు.. ఈ మ్యాచ్లో జడేజా మరో అరుదైన రికార్డును తన పేరిట లిఖించుకున్నాడు. టెస్టు క్రికెట్లో 3,000 పరుగులతో పాటు 300 వికెట్లు అత్యంత వేగంగా సాధించిన భారత క్రికెటర్గా జడేజా రికార్డులకెక్కాడు. 78* టెస్టు మ్యాచ్లు ఆడిన జడేజా.. 3122 పరుగులతో పాటు 300 వికెట్లు పడగొట్టాడు.ఓవరాల్గా వరల్డ్ క్రికెట్లో ఈ ఘనత సాధించిన రెండో క్రికెటర్గా జడేజా నిలిచాడు. ఇక ఈ అరుదైన ఫీట్ సాధించిన జాబితాలో ఇంగ్లండ్ క్రికెట్ దిగ్గజం ఇయాన్ బోథమ్ పేరిట ఉంది. ఆయన కేవలం 72 మ్యాచ్ల్లోనే ఈ ఫీట్ను అందుకున్నాడు. చదవండి: IND vs BAN: టీమిండియా వరల్డ్ రికార్డు.. 147 ఏళ్ల క్రికెట్ చరిత్రలోనే -
జడేజా ప్రపంచ రికార్డు.. 147 ఏళ్ల చరిత్రలో ఇదే తొలిసారి
టీమిండియా స్టార్ ఆల్రౌండర్ రవీంద్ర జడేజా టెస్టు క్రికెట్లో అత్యంత అరుదైన ఘనత సాధించాడు. బంగ్లాదేశ్తో తొలి టెస్టు సందర్భంగా ప్రపంచ రికార్డును తన ఖాతాలో వేసుకున్నాడు. ఇక రెండో టెస్టులో మరొక వికెట్ తీస్తే చాలు.. మరో ఎలైట్ జాబితాలోనూ చోటు దక్కించుకుంటాడు.ప్రపంచ టెస్టు చాంపియన్షిప్ 2023-25 సీజన్లో భాగంగా టీమిండియా బంగ్లాదేశ్తో రెండు మ్యాచ్ల సిరీస్ ఆడుతోంది. ఈ క్రమంలో చెన్నైలో జరిగిన తొలి టెస్టులో రోహిత్ సేన.. నజ్ముల్ షాంటో బృందాన్ని 280 పరుగుల తేడాతో చిత్తు చేసింది. సమిష్టి ప్రదర్శనతో బంగ్లాదేశ్ను మట్టికరిపించింది.తన జట్టు టెస్టుల్లో గెలిచిన సందర్భాల్లోఇక ఈ మ్యాచ్లో భారత స్పిన్ బౌలింగ్ ఆల్రౌండర్ జడేజా.. 86 పరుగులు చేయడంతో పాటు.. ఐదు వికెట్లు పడగొట్టాడు. తద్వారా టీమిండియా విజయంలో తన వంతు పాత్ర పోషించి.. ఓ రేర్ ఫీట్ నమోదు చేశాడు. తన జట్టు టెస్టుల్లో గెలిచిన సందర్భాల్లో 2 వేలకు పైగా పరుగులు సాధించడంతో పాటు.. 200కు పైగా వికెట్లు తీసిన తొలి క్రికెటర్గా చరిత్రకెక్కాడు. 147 ఏళ్ల టెస్టు క్రికెట్ చరిత్రలో ఓ ఆటగాడు ఈ ఘనత సాధించడం ఇదే తొలిసారి.టీమిండియా గెలిచిన సందర్భాల్లో ఇప్పటి వరకు జడ్డూ 2003 రన్స్ చేశాడు. అంతేకాదు 218 వికెట్లు కూడా పడగొట్టాడు. ఈ జాబితాలో రవిచంద్రన్ అశ్విన్ (1943 రన్స్, 369 వికెట్లు) జడ్డూ తర్వాతి స్థానాన్ని ఆక్రమించాడు.ఇంకొక్క వికెట్ తీస్తే..కాన్పూర్ వేదికగా శుక్రవారం బంగ్లాదేశ్తో మొదలైన రెండో టెస్టులో టాస్ గెలిచిన టీమిండియా తొలుత బౌలింగ్ ఎంచుకుంది. ఈ మ్యాచ్లో రవీంద్ర జడేజా ఒక వికెట్ తీస్తే.. టెస్టుల్లో 300 వికెట్ల క్లబ్లో చేరతాడు. తద్వారా.. సంప్రదాయ క్రికెట్లో భారత్ తరఫున ఈ ఘనత సాధించిన మూడో బౌలర్గా నిలుస్తాడు. అంతేకాదు.. ఈ ఫీట్ నమోదు చేసిన టీమిండియా తొలి లెఫ్టార్మ్ స్పిన్నర్గానూ రికార్డు సాధిస్తాడు.టీ20లకు గుడ్బైకాగా 2012లో అంతర్జాతీయ క్రికెట్లో అడుగుపెట్టిన రవీంద్ర జడేజా.. ఇప్పటి వరకు 73 టెస్టులు, 197 వన్డేలు, 74 టీ20లు ఆడాడు. ఈ లెఫ్టాండర్ టెస్టులో 3122 పరుగులు, 299 వికెట్లు.. వన్డేల్లో 2756 రన్స్, 220 వికెట్లు, టీ20లలో 515 పరుగులు, 54 వికెట్లు తీశాడు. ఇక టీ20 ప్రపంచకప్-2024 ఆడిన భారత జట్టులో సభ్యుడైన 35 ఏళ్ల జడ్డూ.. ఈ టోర్నీలో టీమిండియా చాంపియన్గా నిలిచిన తర్వాత కెప్టెన్ రోహిత్ శర్మ, విరాట్ కోహ్లిలతో కలిసి అంతర్జాతీయ పొట్టి ఫార్మాట్కు వీడ్కోలు పలికాడు. వన్డే, టెస్టులు, ఫ్రాంఛైజీ క్రికెట్లో కొనసాగుతున్నాడు.చదవండి: IPL 2025: సీఎస్కేకు బై బై.. కేకేఆర్ మెంటార్గా వెస్టిండీస్ లెజెండ్ -
ఇలా అయితే కష్టం కోహ్లి!.. అసహనంగా వెళ్లిపోయిన బ్యాటర్
బంగ్లాదేశ్తో టీమిండియా రెండో టెస్టు నేపథ్యంలో క్రికెట్ ప్రేమికుల దృష్టి విరాట్ కోహ్లిపైనే కేంద్రీకృతమై ఉంది. ఈ స్టార్ ప్లేయర్ బ్యాట్ ఝులిపిస్తాడా? లేదంటే మరోసారి నిరాశనే మిగులుస్తాడా? అన్నది చర్చనీయాంశంగా మారింది. ఈ నేపథ్యంలో ప్రాక్టీస్ సెషన్లో కోహ్లి భారత బౌలర్లను ఎదుర్కోలేక ఇబ్బంది పడ్డాడన్న విషయం అభిమానుల్లో ఆందోళనకు కారణమైంది.తొలి టెస్టులో పూర్తిగా విఫలంసుమారు ఏడాదిన్నర విరామం తర్వాత.. బంగ్లాదేశ్తో తొలి మ్యాచ్ సందర్భంగా విరాట్ కోహ్లి సొంతగడ్డపై టెస్టు బరిలో దిగాడు. అయితే, చెన్నై వేదికగా జరిగిన ఈ మ్యాచ్లో రెండు ఇన్నింగ్స్లో వరుసగా 6, 17 పరుగులు మాత్రమే చేయగలిగాడు. తొలి ఇన్నింగ్స్లో బంగ్లా పేసర్ హసన్ మహమూద్ బౌలింగ్లో అవుటైన ఈ ఢిల్లీ బ్యాటర్.. రెండో ఇన్నింగ్స్లో స్పిన్నర్ మెహిదీ హసన్ మిరాజ్ చేతికి చిక్కాడు.ఈ మ్యాచ్లో టీమిండియా 280 పరుగుల తేడాతో బంగ్లాదేశ్ను ఓడించి కాబట్టి సరిపోయింది గానీ.. లేదంటే కోహ్లి వైఫల్యంపై విమర్శలు తారస్థాయికి చేరేవే! అయితే, ఫామ్ తాత్కాలికం, క్లాస్ శాశ్వతం అంటూ ఈ రన్మెషీన్కు మాజీ క్రికెటర్లు మద్దతుగా నిలుస్తున్నారు. రెండోటెస్టులో మునుపటి కోహ్లిని చూస్తామని జోస్యం చెబుతున్నారు.15 బంతుల్లో నాలుగుసార్లు అవుట్!ఈ నేపథ్యంలో నెట్స్లో కోహ్లి పూర్తిగా విఫలమయ్యాడనే వార్తలు తెరమీదకు వచ్చాయి. ఇండియన్ ఎక్స్ప్రెస్ అందించిన వివరాల ప్రకారం.. టీమిండియా ప్రధాన పేసర్ జస్ప్రీత్ బుమ్రా బౌలింగ్లో 15 బంతులు ఎదుర్కొన్న ఈ కుడిచేతి వాటం బ్యాటర్ నాలుగుసార్లు అవుటయ్యాడు. తను వేసిన నాలుగో బంతికే కోహ్లి వికెట్ల ముందు దొరికిపోవడంతో.. బుమ్రా.. ‘‘యూ ఆర్ ప్లంబ్(ఎల్బీడబ్ల్యూ)’’ అంటూ సెలబ్రేట్ చేసుకున్నాడు.ఆ తర్వాత రెండో బంతికే ఆఫ్ స్టంప్ పక్క దిశగా వెళ్తున్న బంతిని టచ్ చేసి.. వికెట్ పారేసుకున్నాడు. మరో రెండుసార్లు కూడా బుమ్రా బౌలింగ్లో ఇలాగే బంతిని తప్పుగా అంచనా వేసిమూల్యం చెల్లించిన కోహ్లి.. ఆ తర్వాత స్పిన్ త్రయం రవిచంద్రన్ అశ్విన్, రవీంద్ర జడేజా, అక్షర్ పటేల్లను ఎదుర్కొన్నాడు.జడ్డూ బౌలింగ్లో తడబడ్డ కోహ్లిఈ ముగ్గురిలో ముఖ్యంగా లెఫ్టార్మ్ స్పిన్నర్ జడ్డూ బౌలింగ్లో తడబడ్డ కోహ్లి.. అక్షర్ బౌలింగ్లో మరింత తేలిపోయాడు. దీంతో.. కోహ్లి అసహనంగా నెట్స్ను వీడి వెళ్లిపోయాడు. ఆ తర్వాత శుబ్మన్ గిల్ వచ్చి ప్రాక్టీస్ మొదలుపెట్టాడు.కాగా రెండో టెస్టుకు వేదికైన కాన్పూర్ పిచ్ స్పిన్నర్లకు ఎక్కువగా అనుకూలించే అవకాశం ఉంది. దీంతో బంగ్లా స్పిన్నర్లు షకీబ్ అల్ హసన్, మెహిదీ హసన్ మిరాజ్ వంటి వారిని కోహ్లి ఎలా ఎదుర్కోనున్నాడన్నది ఆసక్తికంరగా మారింది. భారత్- బంగ్లా మధ్య శుక్రవారం నుంచి ఆఖరిదైన రెండో టెస్టు మొదలుకానుంది.చదవండి: Ind vs Ban: అతడికి రెస్ట్.. టీమిండియాలోకి ఇషాన్ ఎంట్రీ! -
IND VS BAN 1st Test: జడేజా ఖాతాలో అరుదైన రికార్డు
టీమిండియా ఆల్రౌండర్ రవీంద్ర జడేజా టెస్ట్ల్లో ఓ అరుదైన రికార్డు నెలకొల్పాడు. బంగ్లాదేశ్తో జరిగిన తొలి టెస్ట్ మ్యాచ్ తొలి ఇన్నింగ్స్లో హాఫ్ సెంచరీ (86) చేసిన జడేజా.. మ్యాచ్ మొత్తంలో ఐదు వికెట్లు తీశాడు. ఇలా ఓ టెస్ట్ మ్యాచ్లో హాఫ్ సెంచరీ, ఐదు వికెట్లు తీయడం జడేజాకు ఇది 12వ సారి. భారత క్రికెటర్లలో ఈ ఘనతను ఇన్ని సార్లు ఎవ్వరూ సాధించలేదు. జడ్డూ తర్వాతి స్థానంలో అశ్విన్ (11) ఉన్నాడు. వీరిద్దరి తర్వాత కపిల్ దేవ్ (7), హర్భజన్ సింగ్ (6) ఉన్నారు. వీరి మినహా ఏ భారత క్రికెటర్ రెండు కంటే ఎక్కువ సార్లు ఈ ఘనత సాధించలేదు.చెన్నై టెస్ట్ విషయానికొస్తే.. ఈ మ్యాచ్లో టీమిండియా బంగ్లాదేశ్పై 280 పరుగుల తేడాతో గెలుపొందింది. ఫలితంగా రెండు మ్యాచ్ల సిరీస్లో 1-0 ఆధిక్యంలో వెళ్లింది. ఈ మ్యాచ్లో భారత్ అన్ని విభాగాల్లో సత్తా చాటి పర్యాటక జట్టుపై సంపూర్ణ ఆధిపత్యం చలాయింది. అశ్విన్ (113, 6/88), జడేజా (86, 2/19, 3/58) ఆల్రౌండ్ షోతో ఇరగదీయగా.. గిల్ (119 నాటౌట్), పంత్ (109) అదిరిపోయే శతకాలతో ఆకట్టుకున్నారు. తొలి ఇన్నింగ్స్లో సెంచరీ, సెకెండ్ ఇన్నింగ్స్లో ఆరు వికెట్లు తీసిన అశ్విన్ ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్గా నిలిచాడు.చదవండి: ఇరగదీస్తున్న ఆసియా దేశాలు.. ఒక్క పాక్ మినహా..! -
Ind vs Ban: రెండో రోజు ముగిసిన ఆట.. 308 పరుగుల ఆధిక్యంలో టీమిండియా
India vs Bangladesh, 1st Test Chennai Day 2 Updates:రెండో రోజు ముగిసిన ఆట.. 308 పరుగుల ఆధిక్యంలో టీమిండియాబంగ్లాతో తొలి టెస్ట్ మ్యాచ్ రెండో రోజు ఆట ముగిసింది. టీమిండియా సెకెండ్ ఇన్నింగ్స్లో మూడు వికెట్ల నష్టానికి 81 పరుగులు చేసింది. యశస్వి జైస్వాల్ (10), రోహిత్ శర్మ (5), విరాట్ కోహ్లి (17) ఔట్ కాగా.. శుభ్మన్ గిల్ (33), రిషబ్ పంత్ (12) క్రీజ్లో ఉన్నారు. బంగ్లా బౌలర్లలో తస్కిన్, నహిద్ రాణా, మెహిది హసన్ మీరజ్ తలో వికెట్ పడగొట్టారు.ప్రస్తుతం భారత్ 308 పరుగుల ఆధిక్యంలో (తొలి ఇన్నింగ్స్ ఆధిక్యంతో కలుపుకుని) కొనసాగుతుంది. ఈ మ్యాచ్లో బంగ్లాదేశ్ తొలి ఇన్నింగ్స్లో 149 పరుగులకు ఆలౌట్ కాగా.. భారత్కు 227 పరుగుల ఆధిక్యం లభించింది. దీనికి ముందు భారత్ తొలి ఇన్నింగ్స్లో 376 పరుగులకు ఆలౌటైంది. 19.2:మూడో వికెట్ కోల్పోయిన టీమిండియారెండో ఇన్నింగ్స్లో కోహ్లి(17) రూపంలో టీమిండియా మూడో వికెట్ కోల్పోయింది. మెహదీ హసన్ మిరాజ్ బౌలింగ్లో ఎల్బీడబ్ల్యూగా వెనుదిరిగాడు. పంత్ క్రీజులోకి వచ్చాడు. గిల్ 31 పరుగులతో ఆడుతున్నాడు. టీమిండియా స్కోరు: 67/3 (19.2) . బంగ్లాపై 294 పరుగుల ఆధిక్యం. రెండో వికెట్ కోల్పోయిన భారత్.. యశస్వి ఔట్6.4వ ఓవర్: 28 పరుగులకే భారత్ ఇద్దరు ఓపెనర్ల వికెట్లు కోల్పోయింది. రోహిత్ 5, యశస్వి జైస్వాల్ 10 పరుగులు చేసి ఔటయ్యారు. రోహిత్ను తస్కిన్.. జైస్వాల్ను నహిద్ రాణా పెవిలియన్కు పంపారు. తొలి వికెట్ కోల్పోయిన భారత్2.3: తస్కిన్ అహ్మద్ బౌలింగ్లో రోహిత్ జకీర్కు క్యాచ్ ఇచ్చి అవుటయ్యాడు. ఐదు పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద నిష్క్రమించాడు. గిల్ క్రీజులోకి వచ్చాడు. మూడు ఓవర్లు పూర్తయ్యే సరికి టీమిండియా స్కోరు: 16-1 . కాగా తొలి ఇన్నింగ్స్లోనూ రోహిత్ ఆరు పరుగులకే అవుటైన విషయం తెలిసిందే.149 పరుగులకు ఆలౌటైన బంగ్లాదేశ్47.1వ ఓవర్: భారత్తో తొలి టెస్ట్లో బంగ్లా తొలి ఇన్నింగ్స్ 149 పరుగుల వద్ద ముగిసింది. సిరాజ్ నహిద్ రాణాను క్లీన్ బౌల్డ్ చేసి బంగ్లా ఇన్నింగ్స్కు తెరదించాడు. మెహిది హసన్ మీరజ్ 27 పరుగులతో అజేయంగా నిలిచాడు. బంగ్లా ఇన్నింగ్స్లో నజ్ముల్ షాంటో (20), షకీబ్ అల్ హసన్ (32), లిట్టన్ దాస్ (22), తస్కిన్ అహ్మద్ (11), నహిద్ రాణా (11), మిరాజ్ రెండంకెల స్కోర్లు చేశారు. భారత బౌలర్లలో బుమ్రా 4, సిరాజ్, ఆకాశ్దీప్, జడేజా తలో రెండు వికెట్లు తీశారు. తొమ్మిదో వికెట్ కోల్పోయిన బంగ్లాదేశ్42.5వ ఓవర్: 130 పరుగుల వద్ద బంగ్లాదేశ్ తొమ్మిదో వికెట్ కోల్పోయింది. బుమ్రా అద్భుతమైన యార్కర్తో తస్కిన్ అహ్మద్ను (11) క్లీన్ బౌల్డ్ చేశాడు. ఎనిమిదో వికెట్ డౌన్.. టీ బ్రేక్ సమయానికి స్కోరెంతంటే?36.5: బుమ్రా బౌలింగ్లో హసన్ మహమూద్ కోహ్లికి క్యాచ్ ఇచ్చి పెవిలియన్ చేరాడు. 9 పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద ఈ వికెట్ల వీరుడు అవుటయ్యాడు. టీ బ్రేక్ సమయానికి బంగ్లాదేశ్ స్కోరు: 112/8 (36.5).ఏడో వికెట్ కోల్పోయిన బంగ్లాదేశ్30.3: షకీబ్ అల్ హసన్ రూపంలో బంగ్లాదేశ్ ఏడో వికెట్ కోల్పోయింది. జడేజా బౌలింగ్లో వికెట్ కీపర్ రిషభ్ పంత్కు క్యాచ్ ఇచ్చి షకీబ్ నిష్క్రమించాడు. మొత్తంగా 64 బంతులు ఎదుర్కొన్న ఈ ఆల్రౌండర్.. 5 ఫోర్ల సాయంతో 32 పరుగులు చేశాడు. హసన్ మహమూద్ క్రీజులోకి వచ్చాడు. బంగ్లా స్కోరు: 92/7 (30.5)ఆరో వికెట్ డౌన్.. లిట్టన్ దాస్ ఔట్లిట్టన్ దాస్ రూపంలో బంగ్లాదేశ్ ఆరో వికెట్ కోల్పోయింది. 22 పరుగులు చేసిన దాస్.. జడేజా బౌలింగ్లో భారీ షాట్కు ప్రయత్నించి ఔటయ్యాడు. 29 ఓవర్లకు బంగ్లాదేశ్ స్కోర్: 91/6. క్రీజులో షకీబ్(32), మెహదీ హసన్(0) ఉన్నారు.నిలకడగా ఆడుతున్న షకీబ్, లిట్టన్40 పరుగులకే 5 వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడిన బంగ్లాదేశ్ను స్టార్ ప్లేయర్లు షకీబ్ అల్హసన్(22), లిట్టన్ దాస్(18) ఆదుకునే ప్రయత్నం చేస్తున్నారు. 24 ఓవర్లు ముగిసే సరికి బంగ్లాదేశ్ 5 వికెట్ల నష్టానికి 79 పరుగులు చేసింది.కష్టాల్లో బంగ్లాదేశ్.. 40 పరుగులకే 5 వికెట్లుచెపాక్ టెస్టులో బంగ్లాదేశ్ తొలి ఇన్నింగ్స్లో 40 పరుగులకే 5 వికెట్లు కోల్పోయి పీకల్లోతు కష్టాల్లో పడింది. ముష్ఫికర్ రహీం రూపంలో బంగ్లాదేశ్ ఐదో వికెట్ కోల్పోయింది. 8 పరుగులు చేసిన రహీం.. బుమ్రా బౌలింగ్లో రాహుల్కు క్యాచ్ ఇచ్చి ఔటయ్యాడు. 14 ఓవర్లకు బంగ్లా స్కోర్: 44/5. క్రీజులో షకీబ్(8), లిట్టన్దాస్(0) పరుగులతో ఉన్నారు.కష్టాల్లో బంగ్లా.. నాలుగో వికెట్ డౌన్కెప్టెన్ శాంటో రూపంలో బంగ్లాదేశ్ నాలుగో వికెట్ కోల్పోయింది. 20 పరుగులు చేసిన శాంటో.. మహ్మద్ సిరాజ్ బౌలింగ్లో కోహ్లికి క్యాచ్ ఇచ్చి ఔటయ్యాడు. 12 ఓవర్లకు బంగ్లా స్కోర్: 40/4. క్రీజులో షకీబ్(4), ముష్పికర్ రహీం(8) పరుగులతో ఉన్నారు.ఆకాష్ ఆన్ ఫైర్.. భారత పేసర్ ఆకాష్ దీప్ నిప్పులు చేరుగుతున్నాడు. బంగ్లా ఇన్నింగ్స్ 9వ ఓవర్లో తొలి బంతికి జకీర్ హసన్ను క్లీన్ బౌల్డ్ చేసిన ఆకాష్.. రెండో బంతికి మోమినుల్ హక్ అదే తరహాలో ఔట్ చేశాడు. 9 ఓవర్లు ముగిసే సరికి బంగ్లా 3 వికెట్లు కోల్పోయి 26 పరుగులు చేసింది.బంగ్లా తొలి వికెట్ డౌన్.. తొలి ఇన్నింగ్స్ను ఆరంభించిన బంగ్లాదేశ్కు భారత పేసర్ జస్ప్రీత్ బుమ్రా ఆరంభంలోనే షాకిచ్చాడు. బంగ్లా ఓపెనర్ షాద్మన్ ఇస్లాం(2)ను బుమ్రా క్లీన్ బౌల్డ్ చేశాడు. 4 ఓవర్లకు బంగ్లా స్కోర్: 8/1. క్రీజులో జకీర్ హసన్(2), షాంటో(4) పరుగులతో ఉన్నారు.376 పరుగులకు భారత్ ఆలౌట్చెపాక్ వేదికగా బంగ్లాదేశ్తో జరుగుతున్న మొదటి టెస్టులో టీమిండియా తొలి ఇన్నింగ్స్ ముగిసింది. తమ తొలి ఇన్నింగ్స్లో భారత్ 376 పరుగులకు ఆలౌటైంది. 339/9 ఓవర్ నైట్ స్కోర్తో రెండో రోజు ఆటను ప్రారంభించిన టీమిండియా అదనంగా కేవలం 37 పరుగులు మాత్రమే తమ ఇన్నింగ్స్ను మగించింది.రెండో రోజు ఆటలో పేసర్ టాస్కిన్ ఆహ్మద్ 3 వికెట్ల పడగొట్టి దెబ్బతీశాడు. భారత బ్యాటర్లలో రవిచంద్రన్ అశ్విన్(113) టాప్ స్కోరర్గా నిలవగా.. రవీంద్ర జడేజా(86), జైశ్వాల్(56) రాణించారు. బంగ్లా బౌలర్లలో యువ సేసర్ హసన్ మహమూద్ 5 వికెట్లు సాధించగా.. టాస్కిన్ మూడు, మెహది హసన్, నహిద్ రానా తలా వికెట్ పడగొట్టారు.తొమ్మిదో వికెట్ డౌన్..అశ్విన్ ఔట్భారత్ తొలి ఇన్నింగ్స్ మగింపునకు చేరుకుంది. రవిచంద్రన్ అశ్విన్ రూపంలో టీమిండియా తొలి వికెట్ కోల్పోయింది. 113 పరుగులు చేసిన అశ్విన్.. టాస్కిన్ ఆహ్మద్ బౌలింగ్లో ఔటయ్యాడు. 91 ఓవ్లకు భారత్ స్కోర్ఎనిమిదో వికెట్ డౌన్.. ఆకాష్ దీప్ రూపంలో టీమిండియా ఎనిమిదో వికెట్ కోల్పోయింది. 17 పరుగులు చేసిన దీప్.. టాస్కిన్ ఆహ్మద్ బౌలింగ్లో ఔటయ్యాడు. 90 ఓవర్లకు భారత్ స్కోర్: 373/8ఏడో వికెట్ డౌన్.. జడేజా ఔట్339-6 ఓవర్ నైట్ స్కోర్తో రెండో రోజు ఆటను ప్రారంభించిన భారత్కు ఆదిలోనే బిగ్ షాక్ తగిలింది. టాస్కిన్ ఆహ్మద్ బౌలింగ్లో రవీంద్ర జడేజా(86) ఔటయ్యాడు. దీంతో 199 పరుగుల భారీ భాగస్వామ్యానికి తెరపడింది. క్రీజులోకి ఆకాష్ దీప్ వచ్చాడు.రెండో రోజు ఆట ఆరంభం..చెపాక్ వేదికగా భారత్-బంగ్లాదేశ్ తొలి టెస్టు రెండో రోజు ఆట ప్రారంభమైంది. మొదటి రోజు ఆటలో టీమిండియా 6 వికెట్ల నష్టానికి 339 పరుగులు చేసింది.క్రీజులో రవిచంద్రన్ అశ్విన్(102), రవీంద్ర జడేజా(86) పరుగులతో ఉన్నారు. రెండో రోజు బంగ్లా బౌలింగ్ ఎటాక్ను టాస్కిన్ ఆహ్మద్ ప్రారంభించాడు.తుదిజట్లు:టీమిండియారోహిత్ శర్మ(కెప్టెన్), యశస్వి జైస్వాల్, శుబ్మన్ గిల్, విరాట్ కోహ్లీ, కేఎల్ రాహుల్, రిషభ్ పంత్, రవీంద్ర జడేజా, రవిచంద్రన్ అశ్విన్, జస్ప్రీత్ బుమ్రా, ఆకాశ్ దీప్, మహ్మద్ సిరాజ్.బంగ్లాదేశ్షాద్మాన్ ఇస్లాం, జకీర్ హసన్, నజ్ముల్ హుస్సేన్ శాంటో(కెప్టెన్), మొమినుల్ హక్, ముష్ఫికర్ రహీం, షకీబ్ అల్ హసన్, లిటన్ దాస్(వికెట్ కీపర్), మెహిదీ హసన్ మిరాజ్, తస్కిన్ అహ్మద్, హసన్ మహమూద్, నహీద్ రాణా. -
అశ్విన్ అదరహో...
ఒకరికి అది ఓనమాలు నేర్చుకున్న సొంత మైదానం... మరొకరికి అక్కడి అభిమానులు ఆత్మీయతతో తమ సొంతవాడిగా మార్చుకున్న మైదానం...ఈ ఇద్దరూ జత కలిస్తే అక్కడ అద్భుతం జరగాల్సిందే. చెపాక్ మైదానంలో గురువారం సరిగ్గా అదే జరిగింది. సాధారణ పరిస్థితుల్లో అలవోకగా ఆడటం వేరు... 144/6 వద్ద కష్టాల్లో ఉన్న సమయంలో టీమ్ను రక్షించి పటిష్టమైన స్థితికి చేర్చడం వేరు. రవిచంద్రన్ అశ్విన్, రవీంద్ర జడేజా దానిని చేసి చూపించారు. బంగ్లా దేశ్ బౌలింగ్ ముందు అనూహ్యంగా టీమిండియా కుప్పకూలగా వీరిద్దరి భాగస్వామ్యం భారీ స్కోరుకు బాటలు వేసింది. ఉదయం పేస్కు అనుకూలించిన పిచ్పై బంగ్లా బౌలర్ హసన్ మహమూద్ ధాటికి ఒక దశలో 34/3 వద్ద నిలిచిన టీమ్ కోలుకొని తొలి రోజును ఘనంగా ముగించింది. అశ్విన్ ఆరో శతకంతో మెరవగా... జడేజా సెంచరీకి చేరువయ్యాడు. చెన్నై: బంగ్లాదేశ్తో తొలి టెస్టులో భారత జట్టుకు సరైన ఆరంభం లభించింది. టాస్ ఓడి ఆరంభంలో తడబడినా...చివరకు టీమిండియాదే పైచేయి అయింది. మ్యాచ్ మొదటి రోజు గురువారం ఆట ముగిసే సమయానికి భారత్ తమ తొలి ఇన్నింగ్స్లో 80 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 339 పరుగులు చేసింది. రవిచంద్రన్ అశ్విన్ (112 బంతుల్లో 102 నాటౌట్; 10 ఫోర్లు, 2 సిక్స్లు) సెంచరీ పూర్తి చేసుకోగా...రవీంద్ర జడేజా (117 బంతుల్లో 86 నాటౌట్; 10 ఫోర్లు, 2 సిక్స్లు) అతనికి అండగా నిలుస్తూ కీలక ఇన్నింగ్స్ ఆడాడు. వీరిద్దరు ఇప్పటికే ఏడో వికెట్కు అభేద్యంగా 195 పరుగులు జోడించారు. యశస్వి జైస్వాల్ (118 బంతుల్లో 56; 9 ఫోర్లు) కూడా కీలక ఇన్నింగ్స్ ఆడాడు. బంగ్లాదేశ్ బౌలర్లలో హసన్ మహమూద్ (4/58) భారత్ను దెబ్బ తీశాడు. రోహిత్, కోహ్లి విఫలం... చల్లటి వాతావరణం, కాస్త తేమను దృష్టిలో ఉంచుకొని బంగ్లా కెపె్టన్ నజ్ముల్ ఫీల్డింగ్ ఎంచుకున్నాడు. భారత గడ్డపై ప్రత్యర్థి కెపె్టన్ ఒకరు టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకోవడం ఏడేళ్లలో ఇదే మొదటిసారి. పాకిస్తాన్పై సిరీస్ గెలిపించిన తమ బౌలర్లను మరోసారి నమ్ముకుంటూ బంగ్లా ముగ్గురు పేసర్లతో బరిలోకి దిగింది. కేవలం 3 టెస్టుల అనుభవం ఉన్న పేసర్ హసన్ మహమూద్ వరుసగా మూడు ఓవర్లలో మూడు వికెట్లు తీసి తన కెప్టెన్ నమ్మకాన్ని నిలబెట్టాడు. తన మూడో ఓవర్లోనే అతను రోహిత్ శర్మ (6)ను పెవిలియన్ పంపించాడు. తన తర్వాతి ఓవర్లోనే శుబ్మన్ గిల్ (0)ను కూడా అతను అవుట్ చేశాడు. ఆ తర్వాత స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లి (6) కూడా ఎక్కువ సేపు నిలవలేదు. హసన్ బౌలింగ్లోనే డ్రైవ్ చేయబోయి కీపర్కు క్యాచ్ ఇవ్వగా... హసన్ 5–2–6–3 స్పెల్తో అదరగొట్టాడు. అయితో మరో ఎండ్లో యశస్వి పట్టుదలగా ఆడాడు. అతనికి రిషబ్ పంత్ (52 బంతుల్లో 39; 6 ఫోర్లు) నుంచి సహకారం లభించింది. వీరిద్దరు చక్కటి సమన్వయంతో బ్యాటింగ్ చేస్తూ నాలుగో వికెట్కు 62 పరుగులు జత చేశారు. అయితే లంచ్ తర్వాత పంత్ వికెట్ కూడా హసన్కే దక్కింది. 95 బంతుల్లో యశస్వి హాఫ్ సెంచరీ పూర్తయింది. భారత గడ్డపై వరుసగా ఆరు టెస్టుల్లో అతను కనీసం అర్ధ సెంచరీ సాధించడం విశేషం. అనంతరం ఒకే స్కోరు వద్ద యశస్వి, కేఎల్ రాహుల్ (16) వెనుదిరిగారు. భారీ భాగస్వామ్యం... స్కోరు 144/6గా ఉన్న స్థితిలో జట్టు ఇన్నింగ్స్ ముగిసేందుకు ఎంతో సమయం పట్టదనిపించింది. అయితే ఈ దశలో జడేజాకు అశ్విన్ జత కలిశాడు. అప్పటి నుంచి మ్యాచ్ స్వరూపం మారిపోయింది. ఆ తర్వాత 37.4 ఓవర్ల పాటు ఈ జోడీని విడదీయలేక బంగ్లా బౌలర్లు చేతులెత్తేశారు. గత తప్పిన బంతులతో వారు ఈ ద్వయం పాతుకుపోయేందుకు అవకాశం కల్పించారు. ఏ ఒక్క బౌలర్ కూడా ప్రభావం చూపలేకపోయాడు. సొంతగడ్డపై అశ్విన్ జోరుగా ఆడగా, జడేజా పరిస్థితులను బట్టి సహచరుడికి అండగా నిలిచాడు. డ్రైవ్, పంచ్, పుల్, స్లాగ్... ఇలా అశ్విన్ బ్యాటింగ్లో అన్ని షాట్లూ కనిపించాయి. ప్రేక్షకుల హర్షధ్వానాల మధ్య అతను కవర్స్, స్క్వేర్లెగ్ దిశగా పరుగులు రాబట్టాడు. వీరిద్దరు కుదురుకున్న తర్వాత పరుగులు అలవోకగా వచ్చాయి. నాహిద్ బౌలింగ్లో అశ్విన్ కొట్టిన ర్యాంప్ షాట్ బౌండరీ హైలైట్గా నిలిచింది. మరో ఆరు నిమిషాల్లో రోజు ముగుస్తుందనగా షకీబ్ బౌలింగ్లో మిడ్ వికెట్ దిశగా ఆడి సింగిల్ తీయడంతో 108 బంతుల్లో అశ్విన్ సెంచరీ పూర్తయింది. ఒక్క చివరి సెషన్లోనే భారత్ 32 ఓవర్లలో 163 పరుగులు సాధించగా... అశ్విన్, జడేజా వేగంగా ఓవర్కు 5.17 పరుగుల రన్రేట్తో పరుగులు తీయడం విశేషం. 6 టెస్టుల్లో అశ్విన్కు ఇది ఆరో సెంచరీ. వెస్టిండీస్పై నాలుగు సెంచరీలు సాధించిన అతను... 2021లో ఇదే చెన్నై మైదానంలో ఇంగ్లండ్పై మరో శతకం బాదాడు. ‘సొంత ప్రేక్షకుల మధ్య ఆడటం ఎప్పుడూ సంతోషాన్నిస్తుంది. నాకెంతో ఇష్టమైన మైదానమిది. ఇక్కడ ఆడిన గత టెస్టులాగే ఈ సారి సెంచరీ చేయడం ప్రత్యేకంగా అనిపిస్తోంది. ఇటీవలే టి20 టోర్నీ ఆడిన నేను బ్యాటింగ్పై బాగా దృష్టి పెట్టాను. ఇలాంటి పిచ్పై దూకుడుగా ఆడటం అవసరం. నేను అలసిపోయిన సమయంలో జడేజా అండగా నిలిచి ఉత్సాహపరిచాడు. రెండో రోజు కూడా ఆరంభంలో ఇక్కడ పేసర్లు ప్రభావం చూపిస్తారు. కానీ మ్యాచ్ సాగుతున్న కొద్దీ ఈ పిచ్ స్పిన్కు అనుకూలంగా మారుతుంది’ –రవిచంద్రన్ అశ్విన్ స్కోరు వివరాలుభారత్ తొలి ఇన్నింగ్స్: యశస్వి (సి) షాద్మన్ (బి) నాహిద్ 56; రోహిత్ (సి) నజు్మల్ (బి) హసన్ 6; గిల్ (సి) దాస్ (బి) హసన్ 0; కోహ్లి (సి) దాస్ (బి) హసన్ 6; పంత్ (సి) దాస్ (బి) హసన్ 39; రాహుల్ (సి) జాకీర్ (బి) మిరాజ్ 16; జడేజా (నాటౌట్) 86; అశ్విన్ (నాటౌట్) 102; ఎక్స్ట్రాలు 28; మొత్తం (80 ఓవర్లలో 6 వికెట్లకు) 339. వికెట్ల పతనం: 1–14, 2–28, 3–34, 4–96, 5–144, 6–144. బౌలింగ్: తస్కీన్ 15–1–47–0, హసన్ మహమూద్ 18–4–58–4, నాహిద్ రాణా 17–2–80–1, మెహదీ హసన్ మిరాజ్ 21–2–77–1, షకీబ్ 8–0–50–0, మోమినుల్ 1–0–4–0. -
దంచి కొట్టిన అశ్విన్, జడ్డూ.. తొలి రోజు భారత్దే (ఫోటోలు)
-
అశూ, జడ్డూ అదుర్స్.. తొలి రోజు మనదే
చెన్నై వేదికగా బంగ్లాదేశ్తో జరుగుతున్న తొలి టెస్టు మొదటి రోజు ఆటలో భారత్ పైచేయి సాధించింది. తొలి రోజు ఆట ముగిసే సమయానికి టీమిండియా తమ ఫస్ట్ ఇన్నింగ్స్లో 6 వికెట్ల నష్టానికి 339 పరుగులు చేసింది.టాపార్డర్ బ్యాటర్లు విఫలమైనప్పటకి ఆల్రౌండర్లు రవిచంద్రన్ అశ్విన్, రవీంద్ర జడేజా అద్భుత పోరాట పటిమ కనబరిచారు. కీలక వికెట్లు కోల్పోయి కష్టాల్లో సమయంలో వీరిద్దరూ తమ వీరోచిత ఇన్నింగ్స్లతో ఆదుకున్నారు. అప్పటివరకు నిప్పులు చేరిగిన బంగ్లా పేసర్లపై ఈ స్టార్ ఆల్రౌండర్లు ఎదురుదాడికి దిగారు. ఈ క్రమంలో వీరిద్దరూ ఏడో వికెట్కు 195 పరుగుల ఆజేయ భాగస్వామ్యం నెలకొల్పారు. ప్రస్తుతం క్రీజులో రవిచంద్రన్ అశ్విన్ (102 నాటౌట్; 112 బంతుల్లో 10×4, 2×6), రవీంద్ర జడేజా (86 నాటౌట్; 117 బంతుల్లో 10×4,2×6) ఉన్నారు. ఈ సీనియర్ క్రికెటర్లతో పాటు యశస్వీ జైశ్వాల్(56) హాఫ్ సెంచరీతో రాణించాడు.నిప్పులు చేరిగిన హసన్ మహమూద్..టాస్ ఓడి బ్యాటింగ్కు దిగిన టీమిండియాకు తొలి సెషన్లో బంగ్లా పేసర్ హసన్ మహమూద్ చుక్కలు చూపించాడు. ఆరంభంలోనే రోహిత్ శర్మ, కోహ్లి, గిల్ వికెట్లను పడగొట్టి భారత్ను కష్టాల్లోకి నెట్టాడు. ఆ తర్వాత రిషబ్ పంత్ను కూడా పెవిలియన్కు పంపాడు. ఓవరాల్గా తొలి ఇన్నింగ్స్లో ఇప్పటివరకు 18 ఓవర్లు బౌలింగ్ చేసిన హసన్.. 58 పరుగులిచ్చి 4 వికెట్లు సాధించాడు. -
చరిత్ర సృష్టించనున్న రవీంద్ర జడేజా
భారత్, బంగ్లాదేశ్ మధ్య తొలి టెస్ట్ మ్యాచ్ చెన్నై వేదికగా సెప్టెంబర్ 19 నుంచి ప్రారంభం కానున్న విషయం తెలిసిందే. ఈ మ్యాచ్లో టీమిండియా ఆటగాళ్లు విరాట్ కోహ్లి, రవీంద్ర జడేజా రెండు భారీ రికార్డులపై కన్నేశారు. ఈ మ్యాచ్లో కోహ్లి మరో 58 పరుగులు చేస్తే.. అంతర్జాతీయ క్రికెట్లో అత్యంత వేగంగా 27000 పరుగులు పూర్తి చేసుకున్న ఆటగాడిగా చరిత్ర సృష్టించనుండగా, జడేజా మరో 6 వికెట్లు తీస్తే.. టెస్ట్ల్లో భారత్ తరఫున 300 వికెట్లు తీసిన తొలి లెఫ్ట్ ఆర్మ్ స్పిన్నర్గా రికార్డుల్లోకెక్కుతాడు. ప్రస్తుతం విరాట్ ఖాతాలో 26942 పరుగులు (మూడు ఫార్మాట్లలో కలిపి).. జడ్డూ ఖాతాలో 294 టెస్ట్ వికెట్లు ఉన్నాయి. బంగ్లాతో మ్యాచ్లో కోహ్లి 152 పరుగులు సాధిస్తే.. టెస్ట్ల్లో 9000 పరుగుల మైలురాయిని చేరుకుంటాడు.జడ్డూ ఖాతాలో మరిన్ని రికార్డులు..బంగ్లాదేశ్తో జరిగే మ్యాచ్లో జడేజా మరో 6 వికెట్లు తీస్తే టెస్ట్ల్లో 300 వికెట్ల మైలురాయి తాకిన నాలుగో భారత స్పిన్నర్గా.. ఓవరాల్గా (పేసర్లతో కలుపుకుని) ఏడో భారత బౌలర్గా.. టెస్ట్ల్లో 300 వికెట్లతో పాటు 3000 పరుగులు పూర్తి చేసుకున్న మూడో భారత ఆల్రౌండర్గా.. ఓవరాల్గా 11వ ఆల్రౌండర్గా రికార్డుల్లోకెక్కుతాడు. స్పిన్నర్లలో అనిల్ కుంబ్లే(619), రవిచంద్రన్ అశ్విన్(516), హర్భజన్ సింగ్ (417).. పేసర్లలో కపిల్ దేవ్(434), జహీర్ ఖాన్(311), ఇషాంత్ శర్మ(311) జడ్డూ కంటే ముందు 300 వికెట్ల మైలురాయిని తాకారు. టెస్ట్ల్లో జడేజా కంటే ముందు కపిల్ దేవ్, అశ్విన్ 3000 పరుగులు, 300 వికెట్ల మార్కును తాకారు.తొలి టెస్ట్కు భారత జట్టు..రోహిత్ శర్మ (కెప్టెన్), యశస్వి జైస్వాల్, శుభ్మన్ గిల్, విరాట్ కోహ్లి, సర్ఫరాజ్ ఖాన్, రవిచంద్రన్ అశ్విన్, రవీంద్ర జడేజా, అక్షర్ పటేల్, కేఎల్ రాహుల్, ధృవ్ జురెల్, రిషబ్ పంత్, మొహమ్మద్ సిరాజ్, కుల్దీప్ యాదవ్, ఆకాశ్దీప్, యశ్ దయాల్, జస్ప్రీత్ బుమ్రాచదవండి: బంగ్లాదేశ్తో తొలి టెస్ట్.. తుది జట్టులో ఉండనున్న ముగ్గురు స్పిన్నర్లు వీరే..! -
బంగ్లాదేశ్తో తొలి టెస్ట్.. తుది జట్టులో ఉండనున్న ముగ్గురు స్పిన్నర్లు వీరే..!
భారత్, బంగ్లాదేశ్ మధ్య తొలి టెస్ట్ సెప్టెంబర్ 19 నుంచి చెన్నై వేదికగా ప్రారంభం కానున్న విషయం తెలిసిందే. ఈ మ్యాచ్ కోసం ఇరు జట్లు కఠోర సాధనలో నిమగ్నమై ఉన్నాయి. బంగ్లాదేశ్తో పోలిస్తే భారత్ ఇంకాస్త ఎక్కువగా శ్రమిస్తుంది. టీమిండియా టెస్ట్ క్రికెట్ ఆడి చాన్నాళ్లు కావడంతో ఈ ఫార్మాట్కు అలవాటు పడేందుకు చెమటోడుస్తుంది. సెప్టెంబర్ 13 నుంచే చెన్నైలో భారత శిక్షణా శిబిరం మొదలైంది. బ్యాటింగ్, బౌలింగ్, ఫీల్డింగ్ విభాగాల్లో భారత ఆటగాళ్లు లయను అందుకున్నారు. భారత ఆటగాళ్ల ప్రాక్టీస్కు సంబంధించిన ఫోటోలు, వీడియోలు సోషల్మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి.మ్యాచ్ ప్రారంభానికి మరో రెండు రోజులే ఉండటంతో భారత తుది జట్టు కూర్పుపై రకరకాల ఊహాగానాలు వస్తున్నాయి. తుది జట్టులో వారుండబోతున్నారు.. వీరుండబోతున్నారంటూ సోషల్మీడియాలో పుకార్లు షికార్లు చేస్తున్నాయి. భారత మేనేజ్మెంట్ నుంచి మాత్రం తుది జట్టు విషయమై ఇప్పటివరకు ఎలాంటి అధికారిక ప్రకటన వెలువడలేదు. అయితే పీటీఐ నుంచి వస్తున్న సమాచారం మేరకు బంగ్లాతో తొలి టెస్ట్లో భారత స్పిన్ విభాగం ఖరారైనట్లు తెలుస్తుంది. తుది జట్టులో రవిచంద్రన్ అశ్విన్, రవీంద్ర జడేజా, కుల్దీప్ యాదవ్ ఉండనున్నారని సమాచారం. అక్షర్ పటేల్ బెంచ్కే పరిమితం కానున్నట్లు తెలుస్తుంది.మరోవైపు బ్యాటింగ్ విభాగంలో ఓ బెర్త్ మినహా బెర్త్లు అన్నింటి విషయమై క్లారిటీ ఉంది. ఓపెనర్లుగా రోహిత్, జైస్వాల్, వన్డౌన్లో శుభ్మన్ గిల్, నాలుగో స్థానంలో విరాట్ బరిలోకి దిగడం దాదాపుగా ఖరారైంది. ఐదో స్థానం కోసం కేఎస్ రాహుల్, సర్ఫరాజ్ ఖాన్ పోటీ పడుతున్నప్పటికీ.. రాహుల్కు అవకాశం దక్కే ఛాన్స్ ఉంది. వికెట్ కీపర్ కోటాలో రిషబ్ పంత్ ఆడటం దాదాపుగా ఖాయమైంది. ఆతర్వాతి స్థానాల్లో జడేజా, అశ్విన్, కుల్దీప్ అనుకుంటే తొమ్మిది బెర్త్లు ఖరారైపోయినట్లే. ఇక మిగిలింది పేస్ విభాగం. ఈ కేటగిరీలో బుమ్రా స్థానం ఖరారు కాగా.. మరో పేసర్ కోటాలో అనుభవజ్ఞుడు సిరాజ్కు ఛాన్స్ ఇస్తారా లేక ఆకాశ్దీప్, యశ్ దయాల్లలో ఎవరో ఒకరివైపు మొగ్గు చూపుతారా అన్నది వేచి చూడాల్సి ఉంది.బంగ్లాతో తొలి టెస్ట్కు భారత తుది జట్టు (అంచనా)..రోహిత్ శర్మ (కెప్టెన్), యశస్వి జైస్వాల్, శుభ్మన్ గిల్, విరాట్ కోహ్లి, కేఎల్ రాహుల్, రిషబ్ పంత్, రవీంద్ర జడేజా, రవిచంద్రన్ అశ్విన్, కుల్దీప్ యాదవ్, జస్ప్రీత్ బుమ్రా, ఆకాశ్దీప్చదవండి: ముమ్మర సాధనలో... -
గణేశ్ లడ్డూల తయారీలో జడేజా భార్య
జామ్నగర్: దేశవ్యాప్తంగా గణేష్ ఉత్సవాలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. గణేష్ మండపాలలో భక్తుల రద్దీ నెలకొంది. గుజరాత్కు చెందిన బీజేపీ ఎమ్మెల్యే రివాబా జడేజా తన నియోజకవర్గం జామ్నగర్ నార్త్లోని గణేశుని మండపంలో లడ్డూలు తయారు చేస్తున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది.రివాబా జడేజా క్రికెటర్ రవీంద్ర జడేజా భార్య. ఆమె మీడియాతో మాట్లాడుతూ ‘దేశవ్యాప్తంగా గణేష్ మహోత్సవాలను వైభవంగా జరుపుకుంటున్నాం. మా గణేశుడికి 4,000 లడ్డూలు నైవేద్యంగా పెడుతున్నాం. లడ్డూలను 50 మందికి పైగా మహిళలు తయారు చేస్తున్నారు’ అని పేర్కొన్నారు. #WATCH | Gujarat | BJP MLA Rivaba Jadeja says, "Ganesh Mahotsav is being organised and celebrated across the country... Here, 4,000 Laddus are being offered to lord Ganesh and for it, more than 50 of our sisters are working. I extend my greetings to all on this occasion and I… https://t.co/TytG9H0ii0 pic.twitter.com/bgjmgrznCB— ANI (@ANI) September 14, 2024ఆల్రౌండర్ రవీంద్ర జడేజా 2024 టీ 20 ప్రపంచ కప్ తర్వాత రిటైర్మెంట్ ప్రకటించారు. రవీంద్ర జడేజా కూడా తన భార్యలాగే రాజకీయాల వైపు దృష్టి సారిస్తూ బీజేపీ సభ్యత్వం తీసుకున్నారు. రవీంద్ర గతంలో తన భార్య రివాబా కోసం ఎన్నికల ప్రచారం చేశారు. పలు రోడ్ షోలలో కూడా కనిపించారు. ఆయన భార్య రివాబా ఐదేళ్ల క్రితం బీజేపీలో చేరారు. 2022లో ఆమె జామ్నగర్ అసెంబ్లీ స్థానం నుంచి పోటీ చేసి విజయం సాధించారు.ఇది కూడా చదవండి: ఒకే ఈతలో 13 కుక్కపిల్లలు -
బీజేపీలో చేరిన టీమిండియా స్టార్ క్రికెటర్!
టీమిండియా స్టార్ క్రికెటర్ రవీంద్ర జడేజా రాజకీయాల్లో ప్రవేశించాడు. ఈ స్పిన్ బౌలింగ్ ఆల్రౌండర్ బీజేపీలో చేరాడు. జడేజా సతీమణి, బీజేపీ ఎమ్మెల్యే రివాబా సోలంకి ఈ విషయాన్ని వెల్లడించారు. జడ్డూ బీజేపీ సభ్యత్వాన్ని ధ్రువపరిచే ఫొటోలను ఆమె సోషల్ మీడియాలో షేర్ చేశారు.స్టార్ స్పిన్ బౌలింగ్ ఆల్రౌండర్కాగా దేశవాళీ క్రికెట్లో సౌరాష్ట్రకు ప్రాతినిథ్యం వహిస్తున్న రవీంద్ర జడేజా.. 2009లో అంతర్జాతీయ క్రికెట్లో అడుగుపెట్టాడు. స్పిన్ బౌలింగ్ ఆల్రౌండర్గా సత్తా చాటుతూ జట్టులో తన స్థానం సుస్థిరం చేసుకున్న జడ్డూ.. కీలక సభ్యుల్లో ఒకడిగా ఎదిగాడు. ఇప్పటి వరకు టీమిండియా తరఫున 72 టెస్టులు, 197 వన్డేలు, 74 టీ20 మ్యాచ్లు ఆడాడు జడేజా.తన కెరీర్లో ఇప్పటి వరకు అత్యధికంగా.. టెస్టుల్లో 3036 పరుగులు చేసిన జడ్డూ.. 294 వికెట్లు పడగొట్టాడు. ఇక లెఫ్టాండ్ బ్యాటర్ వన్డేల్లో 2756 రన్స్ స్కోరు చేయడంతో పాటు.. 220 వికెట్లు కూల్చాడు. అదే విధంగా ఈ లెప్టార్మ్ స్పిన్నర్ అంతర్జాతీయ టీ20 ఖాతాలో 515 పరుగులతో పాటు 54 వికెట్లు కూడా ఉన్నాయి. బీజేపీ సభ్యత్వంఇటీవల టీ20 ప్రపంచకప్-2024 గెలిచిన టీమిండియాలోనూ జడేజా సభ్యుడు. ఇక ఐపీఎల్లో చెన్నై సూపర్కింగ్స్కు సుదీర్ఘకాలంగా ప్రాతినిథ్యం వహిస్తున్నాడు ఈ గుజరాతీ క్రికెటర్.ఈ క్రమంలో లక్షలాది మంది అభిమానులను సంపాదించుకున్న జడేజా తాజాగా రాజకీయాల్లో ప్రవేశించాడు. సభ్యత్వాల నమోదు కార్యక్రమంలో భాగంగా పార్లమెంటరీ మెంబర్షిప్ తీసుకున్నాడు. ఇందుకు సంబంధించిన ఐడీ కార్డును జడేజా భార్య రివాబా ఎక్స్ ఖాతాలో షేర్ చేశారు. ఎమ్మెల్యేగా భార్యను గెలిపించుకునికాగా గుజరాత్లోని జామ్నగర్ నియోజకవర్గం నుంచి బీజేపీ తరఫున ఎమ్మెల్యే పోటీ చేసిన రివాబా విజయం సాధించారు. ఎన్నికల సమయంలో భార్య తరఫున ప్రచారం చేసిన జడ్డూ ఇప్పుడు ఆమె ప్రాతినిథ్యం వహిస్తున్న రాజకీయ పార్టీలో చేరాడు. అయితే, మంగళవారమే రివాబా ఈ ఫొటోలు పంచుకోగా.. తాజాగా ఈ విషయం హైలైట్ అయింది.🪷 #SadasyataAbhiyaan2024 pic.twitter.com/he0QhsimNK— Rivaba Ravindrasinh Jadeja (@Rivaba4BJP) September 2, 2024 -
నేను చూసిన బెస్ట్ క్రికెటర్ అతడే: టీమిండియా స్టార్
రవీంద్ర జడేజా అత్యంత ప్రతిభావంతుడైన క్రికెటర్ అని టీమిండియా స్పిన్ దిగ్గజం రవిచంద్రన్ అశ్విన్ ప్రశంసించాడు. జడ్డూ ఆటతీరు తనకెంతో ఇష్టమని తెలిపాడు. కలిసి పనిచేయడానికి ఆరంభంలో కాస్త తడబడ్డామని.. అయితే ప్రస్తుతం తమ మధ్య మంచి అనుబంధం ఏర్పడిందని అశూ అన్నాడు.సొంతగడ్డపై అశ్విన్కు తిరుగులేదన్న విషయం తెలిసిందే. స్పిన్కు అనుకూలించే ఉపఖండ పిచ్లపై టెస్టు సిరీస్లు ఉంటే.. అశూకు తప్పక తుదిజట్టులో చోటు దక్కుతుంది. అయితే, టీమిండియా విదేశీ పర్యటనలో ఉన్నపుడు మాత్రం పరిస్థితి ఇందుకు భిన్నంగా ఉంటుంది. అశూను కాదని స్పిన్ బౌలింగ్ ఆల్రౌండర్ రవీంద్ర జడేజాకు పెద్దపీట వేస్తారు సెలక్టర్లు.విదేశాల్లో ఎక్కువగా బౌన్సీ పిచ్లే ఉంటాయి కాబట్టి సహజంగానే ఫాస్ట్ బౌలర్లకు ప్రాధాన్యం ఉంటుంది. అలాంటి చోట స్పెషలిస్టు స్పిన్నర్ కంటే కూడా ఆల్రౌండర్ వైపే మేనేజ్మెంట్ మొగ్గుచూపుతుంది. ఫలితంగా అశూను వెనక్కినెట్టి జడ్డూ ఇప్పటికే ఎన్నో సిరీస్లలో భాగమయ్యాడు. ఈ నేపథ్యంలో.. తాజాగా ఓ ఇంటర్వ్యూకు హాజరైన అశ్విన్కు జడేజా గురించి ప్రశ్న ఎదురైంది.అసూయ, ద్వేషం లేవుజడ్డూపై అసూయ పడుతారా అన్న హోస్ట్ విమల్ కుమార్కు బదులిస్తూ.. ‘‘నాకు అవకాశం రాకపోవడంలో జడేజా తప్పేముంది? నాకు అతడిపై అసలు ఎలాంటి అసూయ, ద్వేషం లేవు. నా కోసం అతడిని జట్టు నుంచి తప్పించాలని.. నేనే మ్యాచ్లు ఆడాలని అస్సలు ఆలోచించను. ప్రతిఒక్కరు ఈర్ష్యను అధిగమిస్తేనే సంతోషంగా ముందుకు వెళ్లగలరునేను చూసిన మోస్ట్ టాలెంటెడ్ క్రికెటర్ జడేజా. అతడి ఆట సహజంగా ఉంటుంది. కలిసి ఆడిన తొలినాళ్లలో కాస్త ఇబ్బంది పడ్డ మాట వాస్తవమే. అయితే, ఇప్పుడు మా మధ్య ఆట పరంగా మంచి అనుబంధం, సమన్వయం ఉంది’’ అని అశ్విన్ చెప్పుకొచ్చాడు.కాగా టీమిండియా సెప్టెంబరు 19 నుంచి బంగ్లాదేశ్తో స్వదేశంలో సిరీస్ ఆడనుంది. ఈ సిరీస్లో అశ్విన్తో పాటు జడ్డూకూ చోటు దక్కే అవకాశం ఉంది. ఇక చెన్నై ఆఫ్ స్పిన్నర్ అశ్విన్ ఇప్పటి వరకు టీమిండియా తరఫున 100 టెస్టులు పూర్తి చేసుకుని 516 వికెట్లు పడగొట్టాడు. మరోవైపు.. సౌరాష్ట్ర స్టార్ జడ్డూ.. 72 టెస్టులు ఆడి 294 వికెట్లు తన ఖాతాలో వేసుకున్నాడు. -
Duleep Trophy: ఆ ముగ్గురు దూరం.. బీసీసీఐ ప్రకటన
టీమిండియా స్టార్ క్రికెటర్లు రవీంద్ర జడేజా, మహ్మద్ సిరాజ్, ఉమ్రాన్ మాలిక్ దులిప్ ట్రోఫీ- 2024 టోర్నీకి దూరమయ్యారు.ఈ విషయాన్ని ధ్రువీకరిస్తూ భారత క్రికెట్ నియంత్రణ మండలి(బీసీసీఐ) మంగళవారం అధికారిక ప్రకటన విడుదల చేసింది. హైదరాబాదీ పేసర్ సిరాజ్, కశ్మీరీ ఎక్స్ప్రెస్ ఉమ్రాన్ మాలిక్ అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నారని.. టోర్నీ మొదలయ్యే నాటికి వీరిద్దరు అందుబాటులో ఉండే పరిస్థితి లేదని తెలిపింది.సిరాజ్, ఉమ్రాన్ స్థానాల్లో వీరేఫిట్నెస్ కారణాల దృష్ట్యా సిరాజ్, ఉమ్రాన్ దులిప్ ట్రోఫీ తాజా ఎడిషన్ మొత్తానికి దూరం కానున్నట్లు పేర్కొంది. మరోవైపు.. స్పిన్ బౌలింగ్ ఆల్రౌండర్ రవీంద్ర జడేజాను టీమ్-బి నుంచి విడుదల చేస్తున్నట్లు బీసీసీఐ వెల్లడించింది. అయితే, ఇందుకు గల కారణం మాత్రం తెలపలేదు. ఇక టీమ్-బిలో భాగమైన సిరాజ్ దూరం కావడంతో.. అతడి స్థానంలో హర్యానా రైటార్మ్ పేసర్ నవదీప్ సైనీని ఎంపిక చేసినట్లు బీసీసీఐ పేర్కొంది.అదే విధంగా.. టీమ్-సిలో ఉమ్రాన్ మాలిక్ స్థానాన్ని పాండిచ్చేరి ఫాస్ట్ బౌలర్ గౌరవ్ యాదవ్తో భర్తీ చేసినట్లు తెలిపింది. అయితే, జడ్డూ రీప్లేస్మెంట్ను మాత్రం బీసీసీఐ ప్రకటించలేదు. ఇక టీమ్-బిలో ఉన్న ఆంధ్ర క్రికెటర్ నితీశ్ కుమార్ రెడ్డి సైతం పూర్తిస్థాయి ఫిట్నెస్ సాధిస్తేనే ఈ టోర్నీలో పాల్గొంటాడని తెలిపింది.కాగా నాలుగు రోజుల ఫార్మాట్లో జరిగే దులిప్ ట్రోఫీ 2024-25 ఎడిషన్ సెప్టెంబరు 5 నుంచి మొదలుకానుంది. ఆంధ్రప్రదేశ్లోని అనంతపూర్, బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియం ఈ మ్యాచ్లకు ఆతిథ్యం ఇవ్వనున్నాయి.దులిప్ ట్రోఫీ- 2024 రివైజ్డ్ టీమ్స్ఇండియా-ఏశుబ్మన్ గిల్ (కెప్టెన్), మయాంక్ అగర్వాల్, రియాన్ పరాగ్, ధ్రువ్ జురెల్ (వికెట్ కీపర్), కేఎల్ రాహుల్, తిలక్ వర్మ, శివమ్ దూబే, తనూష్ కొటియన్, కుల్దీప్ యాదవ్, ఆకాశ్ దీప్, ప్రసిద్ధ్ కృష్ణ, ఖలీల్ అహ్మద్, అవేశ్ ఖాన్, విద్వత్ కావేరప్ప, కుమార్ కుషాగ్రా, శస్వత్ రావత్.ఇండియా-బిఅభిమన్యు ఈశ్వరన్ (కెప్టెన్), యశస్వి జైస్వాల్, సర్ఫరాజ్ ఖాన్, రిషబ్ పంత్ (వికెట్ కీపర్), ముషీర్ ఖాన్, నితీశ్ కుమార్ రెడ్డి*, వాషింగ్టన్ సుందర్, నవదీప్ సైనీ, యశ్ దయాళ్, ముకేష్ కుమార్, రాహుల్ చహర్, ఆర్. సాయి కిషోర్, మోహిత్ అవస్థి, ఎన్ జగదీశన్ (వికెట్ కీపర్).ఇండియా-సిరుతురాజ్ గైక్వాడ్ (కెప్టెన్), సాయి సుదర్శన్, రజత్ పాటిదార్, అభిషేక్ పోరెల్ (వికెట్ కీపర్), సూర్యకుమార్ యాదవ్, బి ఇంద్రజిత్, హృతిక్ షోకీన్, మానవ్ సుతార్, గౌరవ్ యాదవ్, వైషక్ విజయ్కుమార్, అన్షుల్ ఖంబోజ్, హిమాన్షు చౌహాన్, మయాంక్ మార్కండే, ఆర్యన్ జుయాల్ (వికెట్ కీపర్), సందీప్ వారియర్.ఇండియా-డిశ్రేయస్ అయ్యర్(కెప్టెన్), అథర్వ తైడే, యశ్ దూబే, దేవదత్ పడిక్కల్, ఇషాన్ కిషన్(వికెట్ కీపర్), రికీ భుయ్, శరణ్ జైన్, అక్షర్ పటేల్, అర్ష్దీప్ సింగ్, ఆదిత్య థాకరే, హర్షిత్ రాణా, తుషార్ దేశ్పాండే, ఆకాశ్ సేన్గుప్తా, కేఎస్ భరత్(వికెట్ కీపర్), సౌరభ్ కుమార్.చదవండి: టీ20 వరల్డ్కప్ కోసం భారత జట్టు ప్రకటన -
ఉత్తమ స్పిన్నర్లలో ఒకడిని.. జట్టులో చోటివ్వండి: భారత బౌలర్
తనకు టెస్టుల్లో ఆడే అవకాశం ఇవ్వాలని టీమిండియా యువ ఆల్రౌండర్ ఆర్. సాయి కిశోర్ సెలక్టర్లకు విజ్ఞప్తి చేశాడు. భారత్లో ఉన్న ఉత్తమ స్పిన్నర్లలో తానూ ఒకడినని.. ఒక్క అవకాశం ఇస్తే తనను తాను నిరూపించుకుంటానని మేనేజ్మెంట్ను అభ్యర్థించాడు. తమిళనాడుకు చెందిన సాయి కిశోర్ ఆసియా క్రీడలు-2023 సందర్భంగా అంతర్జాతీయ క్రికెట్లో అడుగుపెట్టాడు.ఈ ప్రతిష్టాత్మక టోర్నీకి భారత క్రికెట్ నియంత్రణ మండలి తొలిసారి పంపిన క్రికెట్ జట్టులో భాగమైన ఈ లెఫ్టార్మ్ స్పిన్ బౌలర్.. మొత్తంగా మూడు టీ20లు ఆడి నాలుగు వికెట్లు పడగొట్టాడు. ఇక ఇండియన్ ప్రీమియర్ లీగ్లో గుజరాత్ టైటాన్స్కు ప్రాతినిథ్యం వహిస్తున్న సాయి కిశోర్.. ఈ ఏడాది పంజాబ్ కింగ్స్తో మ్యాచ్ సందర్భంగా అత్యుత్తమ గణాంకాలు(4/33) నమోదు చేశాడు.మెడకు తీవ్ర గాయంఅయితే, ఆ ఆనందం ఎక్కువకాలం నిలవలేదు. మ్యాచ్ల విరామ సమయంలో గోల్ఫ్ ఆడేందుకు వెళ్లిన సాయి కిశోర్.. మెడకు తీవ్రమైన గాయమైంది. ఫలితంగా ఐపీఎల్-2024 మిగిలిన మ్యాచ్లన్నింటికీ అతడు దూరం కావాల్సి వచ్చింది. ఈ క్రమంలో జాతీయ క్రికెట్ అకాడమీ(ఎన్సీఏ)లో పునరావాసం పొందిన సాయి.. ఈ ఏడాది జూలైలో తమిళనాడు ప్రీమియర్ లీగ్ సందర్భంగా తిరుప్పూర్ తమిళన్స్ తరఫున పునరాగమనం చేశాడు.తదుపరి దులిప్ ట్రోఫీ-2024లో సాయి భాగం కానున్నాడు. అభిమన్యు ఈశ్వరన్ సారథ్యంలోని టీమ్-బిలో ఆడనున్నాడు. ఈ నేపథ్యంలో ఇండియన్ ఎక్స్ప్రెస్తో మాట్లాడిన సాయి కిశోర్.. తీవ్రమైన గాయం నుంచి కోలుకోవడం వెనుక ఎన్సీఏ ఫిజియోల కృషి ఎంతగానో ఉందని తెలిపాడు. వారితో పాటు తన భార్య కూడా కంటికి రెప్పలా కాచుకుని తనను తిరిగి మామూలు స్థితికి తీసుకువచ్చిందన్నాడు.భయపడ్డాను‘‘మనం నడవాలన్నా.. నిద్రించాలన్నా.. దేనికైనా మెడనే ఉపయోగిస్తాం. మెడకు గాయమైన తర్వాత.. క్రికెట్ మాట పక్కనపెడితే.. నేనసలు తిరిగి సాధారణ జీవితం గడపుతానో లేదోనని భయపడ్డాను. ఆటకు దూరమైనా బాధను దిగమింగుకోవాలని నా మనసును సన్నద్ధం చేసుకున్నాను. అయితే, తులసి అన్న(తులసిరామ్ యువరాజ్, ఎన్సీఏలో ఫిజియో) నేను కోలుకోవడంలో ఎంతో తోడ్పాటునందించారు.నా వ్యక్తిగత మసాజర్, ట్రైనర్ హర్షా.. ఇలా అందరూ నాకు సహాయం అందించారు. గాయం వల్ల అసలు ఎక్కువ సేపు కూర్చునే వీలు కూడా ఉండేది కాదు. ప్రతి పనికీ ఇతరుల మీద ఆధారపడాల్సి వచ్చేది. నా భార్య సహకారం వల్లే ఇప్పుడిలా కోలుకోగలిగాను’’ అని సాయి కిశోర్ తెలిపాడు.ఒక్క ఛాన్స్ ఇవ్వండిఇక తనకు టెస్టుల్లో ఆడాలని ఉందన్న సాయి కిశోర్.. రవీంద్ర జడేజాతో కలిసి ఒక్క మ్యాచ్లో భాగమైనా సంతోషంగా ఉంటుందని పేర్కొన్నాడు. ‘‘దేశంలోని ఉత్తమ స్పిన్నర్లలో నేనూ ఒకడినని భావిస్తా. టెస్టుల్లో నన్ను ఆడించండి. అందుకు నేను సిద్ధంగా ఉన్నాను. జడేజాతో కలిసి ఆడటం నాకు ఇష్టం. అతడిని దగ్గరగా గమనిస్తూ.. తన నుంచి పాఠాలు నేర్చుకునే అవకాశం ఉంటుంది’’ అని సాయి కిశోర్ తన మనసులోని మాటను వ్యక్తపరిచాడు.చదవండి: తారలు దిగివచ్చే వేళ.. అనంతపురంలో దులీప్ ట్రోఫీ -
జడ్డూనే ముందుగా అడిగా.. నా నిర్ణయాల వల్లే ఇలా: జై షా
తమ కఠిన వైఖరి కారణంగానే టీమిండియా స్టార్లలో మార్పు వచ్చిందని భారత క్రికెట్ నియంత్రణ మండలి(బీసీసీఐ) కార్యదర్శి జై షా అన్నాడు. యువ క్రికెటర్లు శ్రేయస్ అయ్యర్, ఇషాన్ కిషన్ దేశవాళీ టోర్నీల్లో ఆడటమే ఇందుకు నిదర్శనమని పేర్కొన్నాడు. కేవలం వీరిద్దరిని దృష్టిలో పెట్టుకుని నిబంధనలు ప్రవేశపెట్టలేదని.. అందరి కంటే ముందుగా రవీంద్ర జడేజా విషయంలో తాను ఈ వైఖరి అవలంబించినట్లు తెలిపాడు.బోర్డు ఆదేశాలను లెక్కచేయలేదుసెంట్రల్ కాంట్రాక్టు ఉన్న భారత క్రికెటర్లు ఫిట్గా ఉండి, జాతీయ జట్టుకు దూరంగా ఉన్న సమయంలో కచ్చితంగా దేశవాళీ క్రికెట్ ఆడాలని బీసీసీఐ నిబంధనలు ప్రవేశపెట్టిన విషయం తెలిసిందే. అయితే, వికెట్ కీపర్ బ్యాటర్ ఇషాన్ కిషన్, మిడిలార్డర్ బ్యాటర్ శ్రేయస్ అయ్యర్ బోర్డు ఆదేశాలను లెక్కచేయలేదు. ఈ నేపథ్యంలో వీరిద్దరిని సెంట్రల్ కాంట్రాక్టు నుంచి తప్పిస్తూ బీసీసీఐ నిర్ణయం తీసుకుంది.క్రమశిక్షణా రాహిత్యానికి పాల్పడ్డారన్న కారణంగా ఈ మేరకు కఠిన చర్యలు చేపట్టింది. ఈ క్రమంలో పొరపాటు సరిచేసుకున్న శ్రేయస్ ఇప్పటికే రంజీల్లో ఆడి శ్రీలంకతో వన్డే సిరీస్ జట్టులో చోటు దక్కించుకోగా.. ఇషాన్ సైతం దులిప్ ట్రోఫీ-2024 బరిలో దిగేందుకు సిద్ధమయ్యాడు. ఈ విషయం గురించి జై షా స్పందిస్తూ... ‘‘రోహిత్ శర్మ, విరాట్ కోహ్లి మినహా మిగతా వాళ్లంతా దులిప్ ట్రోఫీ ఆడబోతున్నారు.నా కఠిన నిర్ణయాల వల్లే ఇలానేను కఠినమైన నిర్ణయాలు తీసుకున్నందు వల్లే ఇది సాధ్యమైంది. శ్రేయస్ అయ్యర్, ఇషాన్ కిషన్ కూడా ఈ టోర్నీలో భాగమయ్యారు. మేము స్ట్రిక్ట్గా ఉండాలనే నిర్ణయించుకున్నాం. నిజానికి రవీంద్ర జడేజా గాయం కారణంగా జట్టుకు దూరమైనపుడు.. నేను తనకి కాల్ చేశాను.కోలుకున్న తర్వాత ముందుగా దేశవాళీ క్రికెట్ ఆడాలని సూచించాను. జడేజా అందుకు తగ్గట్లుగా ముందుగా రంజీ మ్యాచ్ ఆడి ఆ తర్వాత టీమిండియాలోకి వచ్చాడు. ఆటగాళ్లు గాయపడటం సహజం. అయితే, గాయం కారణంగా జట్టుకు దూరమైన ఆటగాళ్లు తిరిగి ఫిట్నెస్ సాధించడంతో పాటు డొమెస్టిక్ క్రికెట్ ఆడితేనే జాతీయ జట్టుకు ఎంపిక చేస్తామని చెప్పాం’’ అని జై షా టైమ్స్ ఆఫ్ ఇండియాతో పేర్కొన్నాడు. సెప్టెంబరు 5 నుంచిఅయితే, కెప్టెన్ రోహిత్ శర్మ, స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లి మాత్రం ఇందుకు మినహాయింపు అని జై షా స్పష్టం చేశాడు. కాగా సెప్టెంబరు 5 నుంచి దేశవాళీ రెడ్బాల్ టోర్నీ దులిప్ ట్రోఫీ ఆరంభం కానుంది. స్వదేశంలో బంగ్లాదేశ్తో రెండు మ్యాచ్ల టెస్టు సిరీస్కు ముందుకు టీమిండియా స్టార్లు ఈ టోర్నమెంట్ బరిలో దిగనున్నారు. చదవండి: Ind vs Ban: టీమిండియాలో చోటు దక్కదని తెలుసు.. అయినా! -
ఆ ముగ్గురూ లేకపోవడం టీమిండియాకు నష్టం: సనత్ జయసూర్య
టీమిండియా స్టార్లు రోహిత్ శర్మ, విరాట్ కోహ్లిలపై శ్రీలంక క్రికెట్ జట్టు కొత్త కోచ్ సనత్ జయసూర్య ప్రశంసలు కురిపించాడు. ప్రపంచంలోని అత్యుత్తమ క్రికెటర్లలో ఈ ఇద్దరూ తప్పక ఉంటారని కొనియాడాడు. జట్టులో వీరులేని లోటు ఎవరూ పూడ్చలేరని అభిప్రాయపడ్డాడు. కాగా టీ20 ప్రపంచకప్-2024లో భారత్ చాంపియన్గా నిలిచిన విషయం తెలిసిందే.గుడ్బై చెప్పేశారుఫలితంగా కెప్టెన్గా రోహిత్ శర్మ ఖాతాలో ఐసీసీ టైటిల్ చేరగా.. వన్డే వరల్డ్కప్-2011 జట్టులో భాగమైన కోహ్లి మరోసారి ప్రపంచకప్ ట్రోఫీని ముద్దాడాడు. ఈ క్రమంలో 37 ఏళ్ల రోహిత్ శర్మ, 35 ఏళ్ల విరాట్ కోహ్లి ఈ మెగా టోర్నీ తర్వాత అంతర్జాతీయ టీ20 ఫార్మాట్కు రిటైర్మెంట్ ప్రకటించాడు.ఇక స్పిన్ బౌలింగ్ ఆల్రౌండర్ రవీంద్ర జడేజా కూడా ‘విరాహిత్’ ద్వయం బాటలోనే నడిచాడు. టీ20 వరల్డ్కప్-2024 సందర్భంగా సౌతాఫ్రికాతో ఫైనల్లో భాగంగా టీమిండియా తరఫున తన చివరి టీ20 మ్యాచ్ ఆడేశానని పేర్కొన్నాడు.ఆరోజే ఆరంభంఈ క్రమంలో రోహిత్, కోహ్లి, జడ్డూ లేకుండా టీమిండియా శ్రీలంకతో టీ20 సిరీస్కు సిద్ధమైంది. ఈ సిరీస్ ద్వారా హెడ్ కోచ్గా గౌతం గంభీర్, టీ20 పూర్తిస్థాయి కెప్టెన్గా సూర్యకుమార్ యాదవ్ ప్రస్థానం మొదలుకానుంది. కాగా శ్రీలంక- భారత్ జట్ల మధ్య జూలై 27న ఈ సిరీస్ ఆరంభానికి షెడ్యూల్ ఖరారైంది.ఆ ముగ్గురూ లేకపోవడం టీమిండియాకు నష్టంఈ నేపథ్యంలో శ్రీలంక జట్టు తాత్కాలిక కోచ్ సనత్ జయసూర్య మీడియాతో మాట్లాడాడు. రోహిత్, కోహ్లి, జడ్డూ టీమిండియా జట్టుతో లేకపోవడం తమకు అనుకూలిస్తుందని ఆశాభావం వ్యక్తం చేశాడు. ‘‘ప్రపంచంలోని అత్యుత్తమ ఆటగాళ్లలో రోహిత్ శర్మ, విరాట్ కోహ్లి ముందు వరుసలో ఉంటారు.వాళ్ల ప్రతిభాపాటవాలు, క్రికెట్ ఆడే తీరు అమోఘం. ఈ ఇద్దరితో పాటు జడేజా కూడా జట్టులో కీలక సభ్యుడే. అయితే, ప్రస్తుతం ఈ ముగ్గురు భారత టీ20 జట్టులో లేరు. వారి గైర్హాజరీ తప్పకుండా మాకు లాభిస్తుంది’’ అని సనత్ జయసూర్య పేర్కొన్నాడు.అప్పటిదాకా కోచ్గాకాగా శ్రీలంక క్రికెట్ జట్టు తాత్కాలిక కోచ్గా మాజీ కెప్టెన్ సనత్ జయసూర్యను నియమిస్తున్నట్లు లంక బోర్డు ఇటీవల ప్రకటించిన విషయం తెలిసిందే. సెప్టెంబరులో ఇంగ్లండ్ పర్యటన తర్వాత అతడి పదవీకాలం ముగుస్తుందని వెల్లడించింది. ఇక కోచ్గా సనత్ జయసూర్యకు ఇదే తొలి సిరీస్ కాగా.. టీమిండియా శిక్షకుడిగా గౌతం గంభీర్ రూపంలో అతడికి గట్టి సవాల్ ఎదురుకానుంది.కాగా శ్రీలంక పర్యటనలో భాగంగా టీమిండియా తొలుత మూడు టీ20.. అనంతరం మూడు వన్డే మ్యాచ్లు ఆడనుంది. ఇప్పటికే టీ20 జట్టుతో పాటు వన్డే జట్టులోనూ ఉన్న ఆటగాళ్లు లంకకు చేరుకోగా.. రోహిత్, కోహ్లి కొన్నాళ్ల తర్వాత వారితో కలవనున్నారు.చదవండి: టీమిండియా మ్యాచ్లన్నీ లాహోర్లోనే!.. నో చెప్పిన ఐసీసీ! -
‘రోహిత్, కోహ్లి నిర్ణయం అందరినీ ఆశ్చర్యపరిచింది’
టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ, స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లి, రవీంద్ర జడేజా రిటైర్మెంట్ ప్రకటన తమను ఆశ్చర్యపరిచిందని భారత జట్టు బౌలింగ్ మాజీ కోచ్ పారస్ మాంబ్రే అన్నాడు. వాళ్లు తమ నిర్ణయం గురించి ఒక్కసారి కూడా డ్రెసింగ్రూంలో చర్చించనేలేదని తెలిపాడు.ఏదేమైనా దశాబ్దకాలం పాటు జట్టుతో ఉన్న ఈ స్టార్ ప్లేయర్లు సరైన సమయంలో సరైన ప్రకటన చేశారని మాంబ్రే అభిప్రాయపడ్డాడు. కాగా టీ20 ప్రపంచకప్-2024లో టీమిండియా చాంపియన్గా అవతరించిన విషయం తెలిసిందే.అమెరికా- వెస్టిండీస్ సంయుక్తంగా ఆతిథ్యమిచ్చిన ఈ ఐసీసీ టోర్నీలో రోహిత్ సేన అద్భుత ఆట తీరుతో టైటిల్ సాధించింది. పదకొండేళ్ల సుదీర్ఘ నిరీక్షణ తర్వాత మరోసారి వరల్డ్కప్ ట్రోఫీని ముద్దాడింది.ఇక ఈ చిరస్మరణీయ విజయానంతరం కెప్టెన్ రోహిత్ శర్మ, విరాట్ కోహ్లి, ఆల్రౌండర్ రవీంద్ర జడేజా అంతర్జాతీయ టీ20లకు వీడ్కోలు పలుకుతున్నట్లు ప్రకటించారు. ఈ విషయం గురించి పారస్ మాంబ్రే తాజాగా గుర్తుచేసుకున్నాడు. హిందుస్తాన్ టైమ్స్తో ముచ్చటిస్తూ..‘‘అభిమానులే కాదు మేము కూడా వాళ్లు ఇలాంటి ప్రకటన చేస్తారని అస్సలు ఊహించలేదు. ఇలాంటి విషయాల గురించి జట్టులో ముందుగానే చర్చ రావడం సహజం. కానీ వీళ్లు మాత్రం ఎక్కడా విషయం బయటకు రానివ్వలేదు.బహుశా రాహుల్ ద్రవిడ్తో మాట్లాడి ఉంటారేమో గానీ.. మాకు మాత్రం తెలియదు. అందుకే ఫ్యాన్స్తో పాటు మేము కూడా ఆశ్చర్యపోయాం. అయితే, వాళ్ల కోణం నుంచి చూస్తే రిటైర్మెంట్కు ఇదే సరైన సమయం అని అనిపించింది.పదేళ్లకు పైగా జట్టుతో ఉన్నారు. 2011లో విరాట్ వరల్డ్కప్ గెలిచాడు. ఆ తర్వాత మళ్లీ ప్రపంచకప్ టైటిల్ సాధించలేదు. ఇందుకోసం కోహ్లి ఎంతగానో తపించిపోయాడు.ఎట్టకేలకు ఆ కల ఇప్పుడు నెరవేరింది. అతడి సుదీర్ఘ ప్రయాణం ఒకరకంగా పరిపూర్ణమైంది. ఇక ఈ ముగ్గురి ఆటగాళ్ల వయసు పరంగా చూసినా ఇది సరైన నిర్ణయమే. వారికి అపార అనుభవం, నైపుణ్యాలు ఉన్నాయి. కానీ.. హై నోట్లో కెరీర్ ముగించే అవకాశం మళ్లీ మళ్లీ రాకపోవచ్చు కదా!’’ అని పారస్ మాంబ్రే పేర్కొన్నాడు.కాగా టీ20 ప్రపంచకప్-2024లో టీమిండియా హెడ్ కోచ్గా రాహుల్ ద్రవిడ్ ఉండగా.. అతడి జట్టులో బ్యాటింగ్ కోచ్గా విక్రం రాథోడ్, బౌలింగ్ కోచ్గా పారస్ మాంబ్రే, ఫీల్డింగ్ కోచ్గా టి.దిలీప్ సేవలు అందించారు. ఈ టోర్నీ తర్వాత వీరందరి పదవీ కాలం ముగియగా.. కొత్త కోచ్ గౌతం గంభీర్ హయాంలో దిలీప్ రీఎంట్రీ(తాత్కాలికం) ఇచ్చాడు. -
జడేజాను ఎంపిక చేయకపోవడంపై వివరణ ఇచ్చిన అగార్కర్
శ్రీలంక పర్యటన కోసం ఎంపిక చేసిన భారత జట్లకు సంబంధించి అభిమానుల్లో నెలకొని ఉన్న పలు అనుమానాలను సెలెక్షన్ కమిటీ చైర్మన్ అజిత్ అగార్కర్ ఇవాళ (జులై 22) నివృత్తి చేశాడు. టీమిండియా కొత్త కోచ్ గౌతమ్ గంభీర్తో కలిసి ప్రెస్ మీట్ ఏర్పాటు చేసిన అగార్కర్.. లంక పర్యటన కోసం కొందరు ఆటగాళ్లను పరిగణలోకి తీసుకోకపోవడానికి గల కారణాలను వెల్లడించాడు. ఫిట్నెస్ కారణంగా హార్దిక్ పాండ్యాకు టీ20 కెప్టెన్సీ అప్పగించలేదని చెప్పిన అగార్కర్.. సీనియర్ ఆల్రౌండర్ రవీంద్ర జడేజాను వన్డే జట్టు నుంచి తప్పించలేదని వివరణ ఇచ్చాడు. వర్క్ లోడ్ మేనేజ్మెంట్లో భాగంగా జడ్డూకు విశ్రాంతి కల్పించినట్లు తెలిపాడు. ఒకవేళ అక్షర్తో పాటు జడేజాను కూడా ఎంపిక చేసినా.. తుది జట్టులో ఒక్కరికే అవకాశం దక్కుతుందని తెలిపాడు. టీమిండియా సమీప భవిష్యత్తులో చాలా టెస్ట్ మ్యాచ్లు ఆడాల్సి ఉండటం జడ్డూకు విశ్రాంతినివ్వడానికి మరో కారణమని అన్నాడు. వన్డేల్లో జడ్డూ ఇప్పటికీ కీలక ఆటగాడేనని వివరణ ఇచ్చాడు. అగార్కర్-గంభీర్ ప్రెస్ మీట్లో హార్దిక్, జడ్డూ అంశాలతో పాటు మరిన్ని ఆసక్తికర విషయాలు ప్రస్తావనకు వచ్చాయి.టీ20 వరల్డ్కప్ అనంతరం టీ20లకు రిటైర్మెంట్ ప్రకటించిన రోహిత్, కోహ్లిలకు 2027 వన్డే వరల్డ్కప్ ఆడగలే సత్తా ఉందని గంభీర్, అగార్కర్ అభిప్రాయపడ్డారు.కోహ్లితో తన మంచి సత్సంబంధాలు ఉన్నాయని గంభీర్ వివరణ ఇచ్చాడు.శుభ్మన్ గిల్ మూడు ఫార్మాట్ల ప్లేయర్ అని గంభీర్-అగార్కర్ ద్వయం అభిప్రాయపడింది.షమీ స్వదేశంలో బంగ్లాదేశ్తో జరిగే సిరీస్తో రీ ఎంట్రీ ఇస్తాడని గంభీర్-అగార్కర్ జోడీ ఆశాభావం వ్యక్తిం చేసింది.రుతురాజ్, అభిషేక్ శర్మలను ఎంపిక చేయకపోవడంపై స్పందిస్తూ.. బాగా ఆడినా కొన్ని సార్లు అందరికీ అవకాశం ఇవ్వలేమని అగార్కర్ తెలిపాడు.హార్దిక్ పాండ్యాకు కెప్టెన్సీ ఇవ్వకపోయినా ఇప్పటికీ అతను కీలక ఆటగాడని గంభీర్ అన్నాడు.కాగా, గంభీర్-అగార్కర్ ప్రెస్ మీట్ అనంతరం భారత బృందం శ్రీలంక పర్యటనకు బయల్దేరింది. శ్రీలంకతో టీ20 సిరీస్ జులై 27న మొదలవుతుంది. 27, 28, 30 తేదీల్లో మూడు టీ20లు జరుగనున్నాయి. అనంతరం ఆగస్ట్ 2, 4, 7 తేదీల్లో వన్డే సిరీస్ జరుగనుంది. -
గంభీర్ ఎంట్రీ.. రవీంద్ర జడేజా వన్డే కెరీర్ ముగిసినట్లేనా?
టీమిండియా స్టార్ ఆల్రౌండర్ రవీంద్ర జడేజా వన్డే కెరీర్ ముగిసినట్లేనా? అంటే ఔననే అంటున్నాయి క్రికెట్ వర్గాలు. ఇప్పటికే టీ20లకు విడ్కోలు పలికిన రవీంద్ర జడేజాను వన్డేలకు దూరంగా పెట్టాలని బీసీసీఐ సెలక్షన్ కమిటీ భావిస్తున్నట్లు తెలుస్తోంది.ఈ క్రమంలోనే శ్రీలంకతో వన్డే సిరీస్కు ఎంపిక భారత జట్టులో రవీంద్ర జడేజాకు సెలక్టర్లు చోటివ్వలేదు. గత దశాబ్ద కాలంగా భారత జట్టులో కీలక ప్లేయర్గా కొనసాగుతున్న జడేజాను సెలక్టర్లు లంక సిరీస్కు పక్కన పెట్టడం చర్చనీయాంశంగా మారింది.అయితే జట్టు భవిష్యత్ ప్రణాళికల దృష్ట్యా సెలక్టర్లు ఈ నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. అతడి స్ధానాన్ని వాషింగ్టన్ సుందర్, అక్షర్ పటేల్, శివమ్ దూబెలలో ఎవరో ఒకరితో భర్తీ చేయాలని సెలకర్టు భావిస్తున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే ఆల్ రౌండర్ల కోటాలో వాషింగ్టన్ సుందర్, అక్షర్ పటేల్, శివమ్ దూబేలకు శ్రీలంకతో వన్డే సిరీస్కు చోటు దక్కింది. అయితే ఇప్పటికే టీ20ల్లో భారత జట్టులో రెగ్యూలర్ సభ్యునిగా మారిన ఆల్రౌండర్ అక్షర్ పటేల్.. వన్డేల్లో కూడా జడ్డూ స్ధానాన్ని భర్తీ చేసే అవకాశాలు మెండుగా కన్పిస్తున్నాయి. దీంతో జడేజా ఇకపై టెస్టుల్లో మాత్రమే భారత జెర్సీలో కన్పించే ఛాన్స్ ఉంది. ఇదే విషయంపై బీసీసీఐ సీనియర్ అధికారి ఒకరు మాట్లాడుతూ.. జడ్డూ అద్బుతమైన ఆల్రౌండర్ అనడంలో ఎటువంటి సందేహం లేదు. ప్రదర్శన పరంగా కూడా అతడితో ఎలాంటి ఇబ్బంది లేదు. కానీ భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుని జట్టును నిర్మించే పనిలో మేనేజ్మెంట్ పడింది. ఈ క్రమంలోనే యువ ఆటగాళ్లకు ఛాన్స్ ఇవ్వాలని మేనేజ్మెంట్ భావిస్తోంది. టెస్టుల్లో మాత్రం జడ్డూ కొనసాగుతాడని పేర్కొన్నారు. కాగా జడేజా ఇటీవల కాలంలో చెప్పుకొదగ్గ ప్రదర్శన చేయలేకపోతున్నాడు. టీ20 వరల్డ్కప్లోనూ జడేజా విఫలమయ్యాడు. ఇక జడేజాను పక్కన పెట్టడంలో భారత కొత్త హెడ్కోచ్ గౌతం గంభీర్ హస్తం కూడా ఉన్నట్లు తెలుస్తోంది. అతడు యువ ఆటగాళ్లకు అవకాశాలివ్వడంపై ఎక్కువ దృష్టిపెట్టినట్లు పలు రిపోర్ట్లు పేర్కొంటున్నాయి. టీమిండియా తరపున ఇప్పటివరకు 197 వన్డేలాడిన జడ్డూ 2756 పరుగులు చేయడంతో పాటు 220 వికెట్లు పడగొట్టాడు.భారత టీ20 జట్టు: సూర్యకుమార్ యాదవ్ (కెప్టెన్), శుభ్మన్ గిల్ (వైస్ కెప్టెన్), యశస్వి జైస్వాల్, రిషబ్ పంత్, రింకూ సింగ్, సంజూ శాంసన్, హార్దిక్ పాండ్యా, శివమ్ దూబే, అక్షర్ పటేల్, వాషింగ్టన్ సుందర్, రవి బిష్ణోయ్, అర్ష్దీప్ సింగ్, ఖలీల్ అహ్మద్, మహ్మద్ సిరాజ్భారత వన్డే జట్టు: రోహిత్ శర్మ (కెప్టెన్), శుభ్మన్ గిల్ (వైస్ కెప్టెన్), విరాట్ కోహ్లి, కేఎల్ రాహుల్, శ్రేయస్ అయ్యర్, రిషబ్ పంత్, శివమ్ దూబే, కుల్దీప్ యాదవ్, మహ్మద్ సిరాజ్, వాషింగ్టన్ సుందర్, అర్ష్దీప్ సింగ్, రియాన్ పరాగ్, అక్షర్ పటేల్, ఖలీల్ అహ్మద్, హర్షిత్ రాణా. -
‘జడ్డూ వారసుడు’.. వాషింగ్టన్ సుందర్ రియాక్షన్ ఇదే
జింబాబ్వేతో టీ20 సిరీస్లో టీమిండియా యువ ఆల్రౌండర్ వాషింగ్టన్ సుందర్ నిలకడగా రాణిస్తున్నాడు. మొదటి మ్యాచ్లో 27 పరుగులు చేయడంతో పాటు.. కీలక సమయంలో రెండు వికెట్లు తీశాడు.ఆ మ్యాచ్ల్ భారత్ ఓడినా వాషీ మాత్రం ఆకట్టుకున్నాడు. ఇక రెండో టీ20లో టాపార్డర్ అదరగొట్టడంతో సుందర్కు బ్యాటింగ్ చేసే అవకాశమే రాలేదు. ఈ మ్యాచ్లో టీమిండియా 234 భారీ స్కోరు నెలకొల్పగా.. జింబాబ్వే 134 పరుగులకే కుప్పకూలింది.ఇందులో వాషింగ్టన్ సుందర్ కూడా తన వంతు పాత్ర పోషించాడు. జొనాథన్ కాంప్బెల్ వికెట్ దక్కించుకోవడంతో పాటు లోయర్ ఆర్డర్లో నిలదొక్కుకున్న ల్యూక్ జోంగ్వే ఇచ్చిన క్యాచ్ పట్టాడు.ఈ మ్యాచ్లో శుబ్మన్ గిల్ సేన 100 పరుగుల తేడాతో గెలుపొందింది. ఇక కీలకమైన మూడో టీ20లోనూ 23 పరుగుల తేడాతో జయభేరి మోగించింది. ఇందులో వాషింగ్టన్ సుందర్దే కీలక పాత్ర.హరారే వేదికగా బుధవారం నాటి మ్యాచ్లో టీమిండియా విధించిన 183 పరుగుల లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో జింబాబ్వే తడబడింది. భారత బౌలర్ల దెబ్బకు నిర్ణీత 20 ఓవర్లలో 159 పరుగులకే పరిమితమైంది.వాషింగ్టన్ సుందర్ అద్భుత బౌలింగ్(3/15)తో రాణించి టీమిండియాను గెలిపించాడు. తద్వారా ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు అందుకున్నాడు.ఈ నేపథ్యంలో విజయానంతరం వాషింగ్టన్ సుందర్ మాత్రం మాట్లాడుతూ.. దేశానికి ఆడటం తనకు ఎల్లప్పుడూ అద్భుతంగా అనిపిస్తుందని పేర్కొన్నాడు. తీవ్ర ఒత్తిడి నెలకొన్నా ప్రణాళికలను పక్కా అమలు చేసి గెలుపొందామని హర్షం వ్యక్తం చేశాడు.ఈ సందర్భంగా.. టీ20లలో స్పిన్ బౌలింగ్ ఆల్రౌండర్ రవీంద్ర జడేజా స్థానాన్ని భర్తీ చేసేందుకు సిద్ధంగా ఉన్నారా అంటూ వాషీకి ప్రశ్న ఎదురైంది. ఇందుకు బదులిస్తూ.. ‘‘జట్టు కోసం నేనేం చేయగలనో అన్నీ చేస్తాను.ప్రతీ మ్యాచ్ కోసం పూర్తి స్థాయిలో సన్నద్ధమవుతాను. ప్రతీసారి నా అత్యుత్తమ ప్రదర్శన ఇచ్చేందుకు కృషి చేస్తాను. ఆ విషయంలో మాత్రం అస్సలు రాజీ పడను’’ అని వాషింగ్టన్ సుందర్ పేర్కొన్నాడు. తనకు అప్పజెప్పిన బాధ్యతలను పూర్తి చేయడంపై మాత్ర దృష్టి సారిస్తానని స్పష్టం చేశాడు.కాగా చెన్నైకి చెందిన వాషింగ్టన్ సుందర్ 2021లో టీమిండియా తరఫున అరంగేట్రం చేశాడు. లెఫ్టాండ్ బ్యాటర్ అయిన వాషీ.. రైటార్మ్ ఆఫ్ బ్రేక్ స్పిన్నర్.ఇప్పటి వరకు అంతర్జాతీయ క్రికెట్లో 4 టెస్టులు, 19వన్డేలు, 46 టీ20లు ఆడి 265, 265, 134 పరుగులు చేశాడు. అదే విధంగా ఆయా ఫార్మాట్లలో ఆరు, 18, 40 వికెట్లు తీశాడు వాషింగ్టన్ సుందర్. కాగా టీ20 ప్రపంచకప్-2024 ముగిసిన తర్వాత రవీంద్ర జడేజా అంతర్జాతీయ టీ20లకు గుడ్బై చెప్పిన విషయం తెలిసిందే. -
పొట్టి ఫార్మాట్కు రిటైర్మెంట్ ప్రకటించిన మరో టీమిండియా స్టార్
టీమిండియా స్టార్ క్రికెటర్లు విరాట్ కోహ్లి, రోహిత్ శర్మ అంతర్జాతీయ టీ20 ఫార్మాట్కు రిటైర్మెంట్ ప్రకటించిన మరుసటి రోజే మరో టీమిండియా స్టార్ ఆటగాడు పొట్టి ఫార్మాట్కు వీడ్కోలు పలికాడు. భారత స్టార్ ఆల్రౌండర్ రవీంద్ర జడేజా టీ20 క్రికెట్ నుంచి వైదొలుగుతున్నట్లు ఇన్స్టా వేదికగా ప్రకటించాడు. జడ్డూ మిగతా ఫార్మాట్లలో (వన్డే, టెస్ట్) కొనసాగుతానని స్పష్టం చేశాడు. పొట్టి ప్రపంచకప్ గెలవడంతో తన కల నిజమైందని అన్నాడు. టీ20 కెరీర్లో వరల్డ్కప్ గెలవడం అత్యుత్తమమని తెలిపాడు. కెరీర్లో తనకు అండగా నిలిచిన వారందరికీ ధన్యవాదాలని పేర్కొన్నాడు. చివరిగా జై హింద్ అని రాసుకొచ్చాడు. 35 ఏళ్ల రవీంద్ర జడేజా అంతర్జాతీయ టీ20ల్లో 74 మ్యాచ్లు ఆడి 127.2 స్టయిక్రేట్తో 515 పరుగులు చేసి 54 వికెట్లు పడగొట్టాడు.కాగా, సౌతాఫ్రికాతో నిన్న జరిగిన టీ20 ప్రపంచకప్ 2024 ఫైనల్లో టీమిండియా విజేతగా నిలిచిన విషయం తెలిసిందే. పొట్టి ఫార్మాట్లో భారత్కు ఇది రెండో ప్రపంచకప్. 2007లో (అరంగేట్రం ఎడిషన్) ధోని సారథ్యంలో పొట్టి ప్రపంచకప్ గెలిచిన భారత్... తాజాగా రోహిత్ శర్మ నేతృత్వంలో రెండోసారి జగజ్జేతగా నిలిచింది. నిన్న జరిగిన ఫైనల్లో విరాట్ కోహ్లి టీమిండియా గెలుపులో కీలకపాత్ర పోషించాడు. టీమిండియా వరల్డ్కప్ గెలిచిన అనంతరం కోహ్లి, రోహిత్ అంతర్జాతీయ టీ20 కెరీర్కు గుడ్ బై చెప్పారు. -
ఇంగ్లండ్తో సెమీస్.. రవీంద్ర జడేజాపై వేటు! స్టార్ బ్యాటర్కు చోటు
టీ20 వరల్డ్కప్-2024 తుది అంకానికి చేరుకుంది. మంగళవారం జరిగిన బంగ్లాదేశ్-అఫ్గానిస్తాన్ మ్యాచ్తో సూపర్-8 దశ ముగిసింది. గ్రూప్ ఏ నుండి భారత్,అఫ్ఘానిస్థాన్ జట్లు సెమిస్ కు చేరగా..గ్రూప్ బినుండి సౌత్ ఆఫ్రికా, ఇంగ్లాండ్ జట్లు సెమిస్ కు చేరాయి.భారత కాలమానం ప్రకారం గురువారం(జూన్ 27) నుంచి నాకౌట్స్ దశ షూరూ కానుంది. తొలి సెమీఫైనల్లో అఫ్గానిస్తాన్- దక్షిణాఫ్రికా జట్లు అమీతుమీ తెల్చుకోగా.. రెండో సెమీఫైనల్లో భారత్- ఇంగ్లండ్ జట్లు తలపడనున్నాయి. తొలి సెమీఫైనల్ గురువారం ఉదయం 6:00 గంటలకు ప్రారంభం కాగా.. రెండో సెమీఫైనల్ రాత్రి 8:00 గంటలకు మొదలు కానుంది.ఇక సెకెండ్ సెమీఫైనల్ విషయానికి వస్తే.. డిఫెండింగ్ ఛాంపియన్స్ ఇంగ్లండ్ను ఎలాగైనా ఓడించి ఫైనల్లో అడుగుపెట్టాలని భారత్ భావిస్తోంది. ఇరు జట్లు బలబలాల పరంగా సమంగా ఉన్నాయి. కాబట్టి ఈ పోరులో ఎవరిది పైచేయి అని అభిమానులు ఆతృతగా ఎదురుచూస్తున్నారు. అయితే ఈ కీలక మ్యాచ్లో భారత జట్టు మెనెజ్మెంట్ తమ తుది జట్టులో ఒకే మార్పు చేయనున్నట్లు తెలుస్తోంది. బౌలింగ్, బ్యాటింగ్ లో పేలవ ప్రదర్శన కనబరుస్తున్న ఆల్రౌండర్ రవీంద్ర జడేజాపై వేటు వేయాలని మెనెజ్మెంట్ నిర్ణయించకున్నట్లు సమచారం. గయనా వికెట్కు బ్యాటింగ్కు అనుకూలించే అవకాశమున్నందన జడేజా స్థానంలో స్పెషలిస్ట్ బ్యాటర్ సంజు శాంసన్ ను జట్టులోకి తీసుకోనున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ఇప్పటికే జట్టులో అక్షర్ పటేల్, కుల్దీప్ యాదవ్ ఉండడంతో జడ్డూను పక్కన పెట్టాలని ఫిక్స్ అయినట్లు పలు రిపోర్ట్లు పేర్కొంటున్నాయి. ఇక ప్రధాన జట్టులో ఉన్న సంజూ శాంసన్ ఇప్పటివరకు ఈ మెగా టోర్నీలో ఒక్క మ్యాచ్ కూడా ఆడలేదు.భారత తుది జట్టు(అంచనా)రోహిత్ శర్మ (కెప్టెన్), విరాట్ కోహ్లీ, రిషబ్ పంత్ (వికెట్ కీపర్), సూర్యకుమార్ యాదవ్, శివమ్ దూబే, హార్దిక్ పాండ్యా, అక్షర్ పటేల్, రవీంద్ర జడేజా, అర్ష్దీప్ సింగ్, మహ్మద్ సిరాజ్, జస్ప్రీత్ బుమ్రాచదవండి: T20 WC: వారసుడిని ప్రకటించిన డేవిడ్ వార్నర్.. ఆసీస్ కొత్త ఓపెనర్ ఎవరంటే? -
బంగ్లాదేశ్తో మ్యాచ్.. టీమిండియాలోకి విధ్వంసకర ఓపెనర్!?
టీ20 వరల్డ్కప్-2024లో వరుస విజయాలతో దూసుకుపోతున్న టీమిండియా.. ఇప్పుడు మరో ఆసక్తికరపోరుకు సిద్దమైంది. ఈ మెగా టోర్నీ సూపర్-8లో భాగంగా అంటిగ్వా వేదికగా బంగ్లాదేశ్తో భారత్ తలపడనుంది. అఫ్గానిస్తాన్పై గెలిచి మంచి జోష్లో ఉన్న టీమిండియా అదే జోరును బంగ్లాపై కొనసాగించాలని భావిస్తోంది. ఈ మ్యాచ్లో ఎలాగైనా గెలిచి సెమీస్ బెర్త్ను ఖారారు చేసుకోవాలని రోహిత్ సేన వ్యూహాలు రచిస్తోంది. ఈ క్రమంలో బంగ్లాదేశ్తో జరిగే మ్యాచ్లో భారత తుది జట్టులో మార్పులు జరిగే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. తొలి సూపర్-8 మ్యాచ్లో విఫలమైన ఆల్రౌండర్లు రవీంద్ర జడేజా, శివమ్ దూబే వైపు జట్టు మెనెజ్మెంట్ వేటు వేయనున్నట్లు తెలుస్తోంది. అంటిగ్వా పిచ్ పేస్ బౌలర్లకు అనుకూలించే ఛాన్స్ ఉన్నందన జడ్డూ స్ధానంలో మహ్మద్ సిరాజ్ తిరిగి జట్టులోకి వచ్చే సూచనలు కన్పిస్తున్నాయి. అదే విధంగా యువ ఓపెనర్ యశస్వీ జైశ్వాల్కు బంగ్లాతో మ్యాచ్లో ఆడించాలని మెనెజ్మెంట్ నిర్ణయించుకున్నట్లు సమాచారం. ఒకవేళ జట్టులోకి జైశ్వాల్ వస్తే రోహిత్ శర్మతో కలిసి భారత ఇన్నింగ్స్ను ఆరంభించే అవకాశముంది. అప్పుడు విరాట్ కోహ్లి ఫస్ట్డౌన్లో రానునున్నాడు. ఒకవేళ దూబే స్ధానంలో మిడిలార్డర్ బ్యాటర్కు అవకాశమివ్వాలని మెనెజ్మెంట్ భావిస్తే సంజూ శాంసన్ జట్టులోకి వచ్చే ఛాన్స్ ఉంది.మనదే పై చేయి...కాగా టీ20ల్లో బంగ్లాదేశ్పై భారత్కు ఘనమైన రికార్డు ఉంది. భారత్ - బంగ్లాదేశ్ ఇప్పటి వరకు 13 టీ20ల్లో తలపడ్డాయి. ఒక్కసారి మాత్రమే బంగ్లా గెలవగా.. 12 మ్యాచ్ల్లో టీమిండియా విజయం సాధించింది.బంగ్లాదేశ్తో మ్యాచ్కు భారత తుది జట్టు(అంచనా): రోహిత్ శర్మ (కెప్టెన్), యశస్వి జైస్వాల్, విరాట్ కోహ్లి, రిషబ్ పంత్ (వికెట్ కీపర్), సూర్యకుమార్ యాదవ్, సంజు శాంసన్, హార్దిక్ పాండ్యా, అక్షర్ పటేల్, కుల్దీప్ యాదవ్, మహ్మద్ సిరాజ్, జస్ప్రీత్ బుమ్రా -
అమెరికాతో మ్యాచ్.. దూబేపై వేటు! శాంసన్కు ఛాన్స్
టీ20 వరల్డ్కప్-2024లో టీమిండియా మరో ఆసక్తికర పోరుకు సిద్దమైంది. ఈ మెగా టోర్నీలో వరుస విజయాలతో దూసుకుపోతున్న ఆతిథ్య అమెరికాతో బుధవారం న్యూయర్క్ వేదికగా భారత్ తలపడనుంది. ఇరు జట్లు కూడా తమ చివరి మ్యాచ్లో పాకిస్తాన్నే ఓడించడం గమనార్హం. ఆదివారం(జూన్ 9)స్కోరింగ్ థ్రిల్లర్లో పాకిస్తాన్పై భారత్ సంచలన విజయం సాధించగా.. అమెరికా సూపర్ ఓవర్లో పాకిస్తాన్ను చిత్తు చేసింది. కాగా పాక్పై గెలిచి మంచి జోష్లో ఉన్న టీమిండియా యూఎస్ఎపై కూడా అదే జోరును కొనసాగించాలని భావిస్తోంది. కానీ అమెరికా జట్టును ఏ మాత్రం తక్కువ అంచనా వేసినా భారత్ భారీ మూల్యం చెల్లించుకోక తప్పదు.ఈ క్రమంలో టీమిండియా మెనెజ్మెంట్ తమ తుది జట్టులో పలు మార్పులు చేయనున్నట్లు తెలుస్తోంది. ఈ మెగా ఈవెంట్లో తొలి రెండు మ్యాచ్ల్లో నిరాశపరిచిన ఆల్రౌండర్ శివమ్ దూబేపై వేటు వేయాలని మెన్జ్మెంట్ నిర్ణయించుకున్నట్లు సమాచారం. ఐపీఎల్లో అదరగొట్టి భారత వరల్డ్కప్ జట్టులో చోటు దక్కించుకున్న దూబే.. తన స్ధాయికి తగ్గ ప్రదర్శన చేయలేకపోతున్నాడు. బౌలింగ్, బ్యాటింగ్, ఫీల్డింగ్ అన్ని విభాగాల్లో దూబే నిరాశపరుస్తున్నాడు. ఈ క్రమంలో అతడి స్ధానంలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్కు ఛాన్స్ ఇవ్వాలని కెప్టెన్ రోహిత్ శర్మతో పాటు మెనెజ్మెంట్ భావిస్తున్నట్లు పలు రిపోర్ట్లు పేర్కొంటున్నాయి.మరోవైపు ఆల్రౌండర్ రవీంద్ర జడేజాకు కూడా విశ్రాంతి ఇవ్వనున్నట్లు తెలుస్తోంది. అతడి స్ధానంలో చైనామాన్ బౌలర్ కుల్దీప్ యాదవ్ తుది జట్టులోకి రానున్నట్లు వినికిడి. ఇప్పటివరకు జరిగిన ఈ రెండు మ్యాచ్ల్లోనూ జడేజా పెద్దగా ఆకట్టుకోలేకపోయాడు.భారత తుది జట్టు(అంచనా)రోహిత్ శర్మ (కెప్టెన్), విరాట్ కోహ్లీ, రిషబ్ పంత్ (వికెట్ కీపర్), సూర్యకుమార్ యాదవ్, సంజు శాంసన్, హార్దిక్ పాండ్యా, కుల్దీప్ యాదవ్, అక్షర్ పటేల్, జస్ప్రీత్ బుమ్రా, మహ్మద్ సిరాజ్, అర్ష్దీప్ సింగ్ -
MS Dhoni: అందుకే వాళ్లంటే నాకు, జడ్డూకు చిరాకు!
చెన్నై సూపర్ కింగ్స్ అభిమానులను ఉద్దేశించి ఆ జట్టు మాజీ ఆటగాడు అంబటి రాయుడు సంచలన వ్యాఖ్యలు చేశాడు. సీఎస్కే సూపర్ స్టార్ మహేంద్ర సింగ్ ధోని పట్ల వారి అభిమానం తనకు, రవీంద్ర జడేజాకు చిరాకు తెప్పించేందన్నాడు.ఐపీఎల్ చరిత్రలో అత్యంత విజయవంతమైన జట్లలో చెన్నై ఒకటి. దీనికి ముఖ్య కారణం టీమిండియా దిగ్గజ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోని అనడంలో అతిశయోక్తి లేదు. ఎంతో మంది యువ ఆటగాళ్లు అతడి సారథ్యంలో మెరికల్లా తయారై జాతీయ జట్ల తరఫున అదరగొడుతున్నారు.ఫిక్సింగ్ ఆరోపణల నేపథ్యంలో జట్టుపై నిషేధం పడినా.. తిరిగి సీఎస్కేను నిలబెట్టిన ఘనత ధోని సొంతం. రోహిత్ శర్మ(ముంబై ఇండియన్స్) తర్వాత రికార్డు స్థాయిలో ఐదుసార్లు ట్రోఫీ గెలిచిన కెప్టెన్గా ధోని మాత్రమే నిలవగలిగాడు.తదుపరి తన వారసుడిగా ఆల్రౌండర్ రవీంద్ర జడేజాకు పగ్గాలు అప్పగిస్తే.. ఒత్తిడి తట్టుకోలేక 2022 మధ్యలోనే బాధ్యతల నుంచి తప్పుకొన్నాడు. ఈ క్రమంలో 42 ఏళ్ల ధోని 2023లో టైటిల్ సాధించిన తర్వాత.. ఈ ఏడాది రుతురాజ్ గైక్వాడ్కు తన బాధ్యతలను బదిలీ చేశాడు.ఇక చాలా ఏళ్లుగా సీఎస్కే ముఖచిత్రమైన మిస్టర్ కూల్ ధోనికి ఉన్న అభిమాన గణం గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. తలా అని ముద్దుగా పిలుచుకునే తమ నాయకుడిని చూసేందుకు కేవలం చెన్నై ఫ్యాన్స్ మాత్రమే కాదు.. దేశంలో ఎక్కడున్నా అతడి అభిమానులు మ్యాచ్ చూసేందుకు మైదానానికి పోటెత్తుతారు.ఈ క్రమంలో అతడు త్వరగా బ్యాటింగ్కు రావాలంటూ కోరుకునే అభిమానులు బ్యాటింగ్ ఆర్డర్లో ముందున్న జడ్డూ లాంటి వాళ్లు త్వరగా అవుట్ కావాలంటూ గతంలో ప్లకార్డులు కూడా ప్రదర్శించారు. ఈ నేపథ్యంలో జడ్డూ వాళ్లపై అసహనం వ్యక్తం చేస్తూ విరుచుకుపడ్డాడు. దీంతో ఫ్యాన్స్ సైతం అతడికి ధీటుగానే బదులిచ్చారు.ఈ నేపథ్యంలో అంబటి రాయుడు తాజాగా స్టార్ స్పోర్ట్స్ షోలో మాట్లాడుతూ.. "మనం సిక్స్, ఫోర్ కొట్టినా ప్రేక్షకులు సైలెంట్గా ఉంటారు. జడేజాకు, నాకు ఈ విషయం విసుగు తెప్పించేది.నిజానికి సీఎస్కే ఫ్యాన్స్ ముందు జట్టుకు అభిమానులు కాదు.. వాళ్లు కేవలం ధోని అభిమానులు మాత్రమే. అందుకే జడ్డూకు కూడా చిరాకు వచ్చేది. కానీ అతడు మాత్రం ఏం చేయగలడు అని వ్యాఖ్యానించాడు. కాగా 2018 నుంచి 2023 వరకు సీఎస్కే ఆడిన అంబటి రాయుడు గతేడాది ఐపీఎల్కు వీడ్కోలు పలికాడు. ఇదిలా ఉంటే.. ఐపీఎల్-2024లో సీఎస్కే పదమూడింట ఏడు గెలిచి ప్లే ఆఫ్స్ రేసులో నిలిచింది. -
Obstructing field: జడ్డూ కావాలనే చేశాడా?.. సీఎస్కే కోచ్ స్పందన ఇదే!
రాజస్తాన్ రాయల్స్తో మ్యాచ్ సందర్భంగా చెన్నై సూపర్ కింగ్స్ ఆల్రౌండర్ రవీంద్ర జడేజా అపఖ్యాతి మూటగట్టుకున్నాడు. ఐపీఎల్ చరిత్రలో ‘అబ్స్ట్రక్టింగ్ ద ఫీల్డ్’గా అవుటైన మూడో బ్యాటర్గా చెత్త రికార్డు ఖాతాలో వేసుకున్నాడు.ఐపీఎల్-2024 నేపథ్యంలో చెపాక్ వేదికగా చెన్నై- రాజస్తాన్ ఆదివారం తలపడ్డాయి. టాస్ గెలిచిన రాజస్తాన్ తొలుత బ్యాటింగ్ చేసింది. నిర్ణీత 20 ఓవర్లలో ఐదు వికెట్లు నష్టపోయి కేవలం 141 పరుగులు చేసింది.ఈ క్రమంలో లక్ష్య ఛేదనకు దిగిన చెన్నై ఐదు వికెట్లు నష్టపోయి 18.2 ఓవర్లలోనే పని పూర్తి చేసింది. ఐదు వికెట్ల తేడాతో రాజస్తాన్ను ఓడించి ప్లే ఆఫ్స్ రేసులో నిలిచింది.‘అబ్స్ట్రక్టింగ్ ద ఫీల్డ్’ ఇదిలా ఉంటే.. సీఎస్కే ఇన్నింగ్స్లో ఆరోస్థానంలో బ్యాటింగ్కు దిగిన జడ్డూ పరుగుల తీసే క్రమంలో.. ఉద్దేశపూర్వకంగానే బంతిని అడ్డుకున్నట్లుగా తేలడంతో ‘అబ్స్ట్రక్టింగ్ ద ఫీల్డ్’ నిబంధన కింద అవుటయ్యాడు.అవేశ్ ఖాన్ వేసిన 16వ ఓవర్లో జడేజా లేని రెండో పరుగుకు పరుగెత్తాడు. మరో ఎండ్లో ఉన్న రుతురాజ్ గైక్వాడ్తో సమన్వయలోపం కారణంగా పరుగుకు ఆస్కారం లేకపోయినా క్రీజును వీడాడు. అయితే, వెంటనే ప్రమాదం పసిగట్టి వెనక్కి వచ్చేందుకు ప్రయత్నించగా.. రాజస్తాన్ వికెట్ కీపర్, కెప్టెన్ సంజూ శాంసన్ వికెట్లకు మీదకు వేసిన త్రోకు అడ్డుగా పరుగెత్తగా బంతి జడేజాకు తగిలింది.మైక్ హస్సీ స్పందనఈ నేపథ్యంలో రాయల్స్ ఆటగాళ్లు అప్పీల్ చేయగా ఫీల్డ్ అంపైర్లు టీవీ అంపైర్కు నివేదించారు. రిప్లేను పరిశీలించిన థర్డ్ అంపైర్ జడ్డూను ‘అబ్స్ట్రక్టింగ్ ద ఫీల్డ్’ రూల్ కింద అవుట్గా ప్రకటించాడు. ఈ విషయంపై చెన్నై సూపర్ కింగ్స్ బ్యాటింగ్ కోచ్ మైక్ హస్సీ స్పందించాడు.‘‘నేను మరీ అంత దగ్గరగా గమనించలేకపోయాను. అయితే, అతడు స్ట్రెయిట్గా పరిగెత్తేక్రమంలో యాంగిల్ను మార్చుకోకుండానే ముందుకు సాగాడు.ఇరువైపులా వాదనలు ఉంటాయి. అయితే, అంపైర్దే తుదినిర్ణయం. నా అభిప్రాయం ప్రకారం.. నిబంధనలకు అనుగుణంగా ఇది సరైన నిర్ణయమే’’ అని మైక్ హస్సీ స్పష్టం చేశాడు.చదవండి: ఆర్సీబీ విజయం: అనుష్క శర్మ సెలబ్రేషన్స్.. కోహ్లి రియాక్షన్ వైరల్ Jaldi wahan se hatna tha 🫨#TATAIPL #CSKvRR #IPLonJioCinema pic.twitter.com/Op4HOISTdV— JioCinema (@JioCinema) May 12, 2024 -
రవీంద్రజాలం... జడేజా ఆల్రౌండ్ షో
ధర్మశాల: ఐపీఎల్ టోరీ్నలో వరుసగా ఆరోసారి చెన్నై సూపర్ కింగ్స్ను ఓడించాలనుకున్న పంజాబ్ కింగ్స్ ఆశలను రవీంద్ర జడేజా వమ్ము చేశాడు. 2021 నుంచి పంజాబ్ కింగ్స్తో జరిగిన ఐదు మ్యాచ్ల్లోనూ ఓడిపోయిన డిఫెండింగ్ చాంపియన్ చెన్నై ఆరోసారి మాత్రం గెలుపు బావుటా ఎగురవేసింది. ధర్మశాలలో ఆదివారం జరిగిన ఈ మ్యాచ్లో చెన్నై 28 పరుగుల తేడాతో పంజాబ్ కింగ్స్పై గెలిచి గత బుధవారం పంజాబ్ చేతిలోనే ఎదురైన ఓటమికి బదులు తీర్చుకుంది. ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’ రవీంద్ర జడేజా ఆల్రౌండ్ ప్రదర్శనతో చెన్నై విజయంలో ముఖ్యపాత్ర పోషించాడు. ముందుగా జడేజా 26 బంతుల్లో 3 ఫోర్లు, 2 సిక్స్లతో 43 పరుగులు చేసి టాప్ స్కోరర్గా నిలిచాడు. అనంతరం బంతితోనూ మెరిసి 4 ఓవర్లలో 20 పరుగులిచ్చి 3 కీలక వికెట్లు పడగొట్టాడు. టాస్ గెలిచిన పంజాబ్ కెప్టెన్ స్యామ్ కరన్ ఫీల్డింగ్ ఎంచుకోగా... తొలుత బ్యాటింగ్కు దిగిన చెన్నై నిరీ్ణత 20 ఓవర్లలో 9 వికెట్లకు 167 పరుగులు సాధించింది. కెపె్టన్ రుతురాజ్ గైక్వాడ్ (21 బంతుల్లో 32; 4 ఫోర్లు, 1 సిక్స్), డరైల్ మిచెల్ (19 బంతుల్లో 30; 2 ఫోర్లు, 1 సిక్స్) దూకుడుగా ఆడి రెండో వికెట్కు 57 పరుగులు జోడించారు. అయితే ఇన్నింగ్స్ ఎనిమిదో ఓవర్లో రాహుల్ చహర్ వరుస బంతుల్లో రుతురాజ్, శివమ్ దూబే (0)లను అవుట్ చేయగా... మిచెల్ను హర్షల్ పటేల్ పెవిలియన్కు పంపించాడు. దాంతో చెన్నై 69/1 నుంచి 75/4తో కష్టాల్లో పడింది. ఈ దశలో ఇతర బ్యాటర్ల సహకారంతో జడేజా చెన్నైను ఆదుకున్నాడు. జడేజా కీలక ఇన్నింగ్స్తో చెన్నై స్కోరు 160 దాటింది. పంజాబ్ బౌలర్లలో రాహుల్ చహర్ (3/23), హర్షల్ పటేల్ (3/24) రాణించారు. 168 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన పంజాబ్ కింగ్స్ నిరీ్ణత 20 ఓవర్లలో 9 వికెట్లకు 139 పరుగులే చేసి ఓడిపోయింది. తుషార్ పాండే (2/35) ఇన్నింగ్స్ రెండో ఓవర్లో బెయిర్స్టో, రోసో లను అవుట్ చేసి పంజాబ్ను దెబ్బ కొట్టాడు. ఆ తర్వాత ప్రభ్సిమ్రన్, కరన్, అశుతోష్లను జడేజా... శశాంక్ను సాన్ట్నెర్ అవుట్ చేయడంతో పంజాబ్ గెలుపుపై ఆశలు వదులుకుంది. స్కోరు వివరాలు చెన్నై సూపర్ కింగ్స్ ఇన్నింగ్స్: రహానే (సి) రబడ (బి) అర్‡్షదీప్ 9; రుతురాజ్ (సి) జితేశ్ (బి) చహర్ 32; మిచెల్ (ఎల్బీడబ్ల్యూ) (బి) హర్షల్ 30; శివమ్ దూబే (సి) జితేశ్ (బి) చహర్ 0; మొయిన్ అలీ (సి) బెయిర్స్టో (బి) స్యామ్ కరన్ 17; జడేజా (సి) స్యామ్ కరన్ (బి) అర్‡్షదీప్ 43; సాన్ట్నెర్ (సి) స్యామ్ కరన్ (బి) చహర్ 11; శార్దుల్ (బి) హర్షల్ 17; ధోని (బి) హర్షల్ 0; తుషార్ (నాటౌట్) 0; గ్లీసన్ (నాటౌట్) 2; ఎక్స్ట్రాలు 6; మొత్తం (20 ఓవర్లలో 9 వికెట్లకు) 167. వికెట్ల పతనం: 1–12, 2–69, 3–69, 4–75, 5–101, 6–122, 7–150, 8–150, 9–164. బౌలింగ్: రబడ 3–0–24–0, అర్‡్షదీప్ 4–0–42–2, స్యామ్ కరన్ 4–0–34–1, హర్ప్రీత్ బ్రార్ 1–0–19–0, రాహుల్ చహర్ 4–0–23–3, హర్షల్ పటేల్ 4–0–24–3. పంజాబ్ కింగ్స్ ఇన్నింగ్స్: ప్రభ్సిమ్రన్ (సి) సబ్–సమీర్ రిజ్వీ (బి) జడేజా 30; బెయిర్స్టో (బి) తుషార్ 7; రోసో (బి) తుషార్ 0; శశాంక్ (సి) సిమర్జీత్ (బి) సాన్ట్నెర్ 27; స్యామ్ కరన్ (సి) సాన్ట్నెర్ (బి) జడేజా 7; జితేశ్ (సి) ధోని (బి) సిమర్జీత్ (బి) 0; అశుతోష్ శర్మ (సి) సిమర్జీత్ (బి) జడేజా 3; బ్రార్ (నాటౌట్) 17; హర్షల్ (సి) సబ్–సమీర్ రిజ్వీ (బి) సిమర్జీత్ 12; చహర్ (బి) శార్దుల్ 16; రబడ (నాటౌట్) 11; ఎక్స్ట్రాలు 9; మొత్తం (20 ఓవర్లలో 9 వికెట్లకు) 139. వికెట్ల పతనం: 1–9, 2–9, 3–62, 4–68, 5–69, 6–77, 7–78, 8–90, 9–117. బౌలింగ్: సాన్ట్నెర్ 3–0–10–1, తుషార్ దేశ్పాండే 4–0–35–2, గ్లీసన్ 4–0–41–0, జడేజా 4–0– 20–3, సిమర్జీత్ 3–0–16–2, శార్దుల్ 2–0–12–1. -
IPL 2024: చరిత్ర సృష్టించిన జడేజా.. ధోని రికార్డు బద్దలు
ఐపీఎల్-2024లో భాగంగా ధర్మశాల వేదికగా పంజాబ్ కింగ్స్తో జరిగిన మ్యాచ్లో 28 పరుగల తేడాతో చెన్నై సూపర్ కింగ్స్ విజయం సాధించింది. ఈ విజయంలో ఆల్రౌండర్ రవీంద్ర జడేజా కీలక పాత్ర పోషించాడు. తొలుత బ్యాటింగ్లో తొలుత బ్యాటింగ్లో 42 పరుగులతో అదరగొట్టిన జడ్డూ.. బౌలింగ్లో 3 వికెట్లు పడగొట్టాడు. తన అద్భుత ప్రదర్శనకు గాను జడ్డూకు మ్యాన్ ఆఫ్ది మ్యాచ్ అవార్డు వరిచింది.ఈ క్రమంలో జడేజా పలు అరుదైన ఘనతలను తన పేరిట లిఖించుకున్నాడు. ఐపీఎల్లో సీఎస్కే తరపున అత్యధిక సార్లు ప్లేయర్ ఆఫ్ది మ్యాచ్ అవార్డులు అందుకున్న ఆటగాడిగా జడ్డూ నిలిచాడు. జడేజా ఇప్పటివరకు ఈ క్యాష్రిచ్ లీగ్లో 16 సార్లు మ్యాన్ ఆఫ్ది అవార్డులను గెలుచుకున్నాడు.ఇంతకుముందు ఈ రికార్డు సీఎస్కే మాజీ కెప్టెన్ ఎంఎస్ ధోని(15) పేరిట ఉండేది. తాజా మ్యాచ్తో ధోని రికార్డును జడేజా బ్రేక్ చేశాడు. అదేవిధంగా మరో రికార్డును జడ్డూ తన ఖాతాలో వేసుకున్నాడు. ఐపీఎల్లో అత్యధిక సార్లు 40 పైగా పరుగులు, 3 వికెట్లు తీసిన ప్లేయర్గా యువరాజ్ సింగ్, షేన్ వాట్సన్ సరసన జడేజా చేరాడు. జడేజా ఇప్పటివరకు మూడు సార్లు 40 ప్లస్ స్కోర్, 3 వికెట్లు తీశాడు. యువీ, వాట్సన్ కూడా మూడు సార్లు ర్లు 40 ప్లస్ స్కోర్, 3 వికెట్లు తీశారు. -
జడేజా ఆల్రౌండ్ షో.. పంజాబ్ను చిత్తు చేసిన సీఎస్కే
ఐపీఎల్-2024 సీజన్లో చెన్నై సూపర్ కింగ్స్ తిరిగి పుంజుకుంది. ఈ మెగా ఈవెంట్లో భాగంగా ధర్మశాల వేదికగా పంజాబ్ కింగ్స్తో జరిగిన మ్యాచ్లో 28 పరుగుల తేడాతో సీఎస్కే ఘన విజయం సాధించింది. 168 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన పంజాబ్ కింగ్స్.. చెన్నై బౌలర్ల దాటికి 9 వికెట్లు కోల్పోయి కేవలం 139 పరుగులకే పరిమితమైంది. పంజాబ్ బ్యాటర్లలో ప్రభుసిమ్రాన్ సింగ్(30) పరుగులతో టాప్ స్కోరర్గా నిలిచాడు. మిగితా బ్యాటర్లంతా దారుణంగా విఫలయ్యారు. సీఎస్కే బౌలర్లలో రవీంద్ర జడేజా మూడు వికెట్లు పడగొట్టగా.. తుషార్ దేశ్పాండే, సిమ్రాజిత్ సింగ్ తలా రెండు వికెట్లు సాధించారు. అంతకముందు బ్యాటింగ్ చేసిన సీఎస్కే నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్లు కోల్పోయి 167 పరుగులు మాత్రమే చేసింది. బ్యాటింగ్లోనూ రవీంద్ర జడేజా సత్తాచాటాడు. 43 పరుగులతో టాప్ స్కోరర్గా నిలిచాడు. అతడితో పాటు కెప్టెన్ రుతురాజ్ గైక్వాడ్(32), డార్లీ మిచెల్(30) పరుగులు చేశారు. పంజాబ్ బౌలర్లలో హర్షల్ పటేల్, రాహుల్ చాహర్ తలా మూడు వికెట్లు పడగొట్టగా.. అర్ష్దీప్ సింగ్ రెండు, సామ్ కుర్రాన్ తలా వికెట్ సాధించారు. -
రాణించిన జడేజా.. పంజాబ్ కింగ్స్ టార్గెట్ ఎంతంటే?
ఐపీఎల్-2024లో భాగంగా ధర్మశాల వేదికగా పంజాబ్ కింగ్స్తో మ్యాచ్లో చెన్నై సూపర్ కింగ్స్ నామమాత్రపు స్కోరుకే పరిమితమైంది. టాస్ ఓడి తొలుత బ్యాటింగ్కు దిగిన సీఎస్కే నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్లు కోల్పోయి 167 పరుగులు మాత్రమే చేసింది. సీఎస్కే బ్యాటర్లలో రవీంద్ర జడేజా 43 పరుగులు చేయగా.. కెప్టెన్ రుతురాజ్ గైక్వాడ్(32), డార్లీ మిచెల్(30) పరుగులు చేశాడు. మరోవైపు పంజాబ్ బౌలర్లు అద్భుతమైన ప్రదర్శన కనబరిచారు. పంజాబ్ బౌలర్లలో హర్షల్ పటేల్, రాహుల్ చాహర్ తలా మూడు వికెట్లు పడగొట్టగా.. అర్ష్దీప్ సింగ్ రెండు, సామ్ కుర్రాన్ తలా వికెట్ సాధించారు. -
వారెవ్వా జడేజా.. క్రికెట్ చరిత్రలోనే సంచలన క్యాచ్! వీడియో వైరల్
ఐపీఎల్-2024లో భాగంగా ఏక్నా స్టేడియం వేదికగా లక్నో సూపర్ జెయింట్స్తో మ్యాచ్లో చెన్నై స్టార్ ఆల్రౌండర్ రవీంద్ర జడేజా స్టన్నింగ్ క్యాచ్ను అందుకున్నాడు. జడ్డూ అద్బుతమైన క్యాచ్తో లక్నో కెప్టెన్ కేఎల్ రాహుల్ను పెవిలియన్కు పంపాడు. లక్నో ఇన్నింగ్స్ 17వ ఓవర్ వేసిన మతీషా పతిరానా బౌలింగ్లో తొలి బంతిని రాహుల్ పాయింట్ దిశగా కట్ షాట్ ఆడాడు. షాట్ సరిగ్గా కనక్ట్ అయినప్పటికి పాయింట్లో ఫీల్డింగ్ చేస్తున్న జడేజా.. ఎడమవైపున్కు జంప్ చేస్తూ సింగిల్ హ్యాండ్తో స్టన్నింగ్ క్యాచ్ను అందుకున్నాడు. ఇది చూసిన రాహుల్తో పాటు స్టేడియంలో ఉన్న ప్రేక్షకులు మొత్తం ఒక్కసారిగా ఆశ్చర్యపోయారు. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరలవుతోంది. వారెవ్వా జడ్డూ సూపర్ మ్యాన్ అంటూ కామెంట్లు చేస్తున్నారు. కాగా ఈ మ్యాచ్లో 8 వికెట్ల తేడాతో సీఎస్కే ఘోర పరాజయాన్ని చవిచూసింది. తొలుత బ్యాటింగ్ చేసిన సీఎస్కే.. జడేజా(57), ధోని(28 నాటౌట్) రాణించడంతో నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 176 పరుగులు చేసింది. అనంతరం 177 పరుగుల లక్ష్యాన్ని లక్నో 19 ఓవర్లలో కేవలం రెండు వికెట్లు మాత్రమే కోల్పోయి చేధించింది. లక్నో బ్యాటర్లలో కెప్టెన్ కేఎల్ రాహుల్(53 బంతుల్లో 9 ఫోర్లు, 3 సిక్స్లు) కీలక ఇన్నింగ్స్ ఆడగా.. డికాక్(54) హాఫ్ సెంచరీతో రాణించాడు. సీఎస్కే బౌలర్లలో ముస్తఫిజుర్ రెహ్మన్, పతిరానా తలా వికెట్ సాధించారు. Ravi Shastri - "What a Catch, is that the Catch of IPL, WOW, that was Flying like a Trace of Bullet" Ravindra Jadeja took "One of the Greatest Catch of IPL 2024" 👏#CSKvLSG #CSKvsLSGpic.twitter.com/SQDFOz9Lmo — Richard Kettleborough (@RichKettle07) April 19, 2024 -
‘సూపర్’ పోరులో జెయింట్స్ పైచేయి
ఐపీఎల్ సీజన్లో వరుసగా రెండు ఓటముల తర్వాత లక్నో సూపర్ జెయింట్స్ కోలుకుంది. కట్టుదిట్టమైన బౌలింగ్తో చెన్నై సూపర్ కింగ్స్ను నిలువరించిన లక్నో ఆ తర్వాత ఎలాంటి తడబాటు లేకుండా లక్ష్యం చేరింది. ఛేదనలో కేఎల్ రాహుల్, డికాక్ కీలక పాత్ర పోషించగా... రెండు వరుస విజయాల తర్వాత చెన్నై తలవంచింది. లక్నో: సొంతగడ్డపై సమష్టి ప్రదర్శనతో లక్నో కీలక విజయాన్ని అందుకుంది. శుక్రవారం జరిగిన మ్యాచ్లో లక్నో 8 వికెట్ల తేడాతో ఐదుసార్లు చాంపియన్ చెన్నైపై ఘన విజయం సాధించింది. టాస్ ఓడి ముందుగా బ్యాటింగ్కు దిగిన చెన్నై 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 176 పరుగులు చేసింది. రవీంద్ర జడేజా (40 బంతుల్లో 57 నాటౌట్; 5 ఫోర్లు, 1 సిక్స్) అర్ధ సెంచరీ చేయగా... రహానే (24 బంతుల్లో 36; 5 ఫోర్లు, 1 సిక్స్), మొయిన్ అలీ (20 బంతుల్లో 30; 3 సిక్స్లు), ధోని (9 బంతుల్లో 28 నాటౌట్; 3 ఫోర్లు, 2 సిక్స్లు) రాణించారు. అనంతరం లక్నో 19 ఓవర్లలో 2 వికెట్లకు 180 పరుగులు సాధించి గెలిచింది. కెప్టెన్ కేఎల్ రాహుల్ (53 బంతుల్లో 82; 9 ఫోర్లు, 3 సిక్స్లు), క్వింటన్ డికాక్ (43 బంతుల్లో 54; 5 ఫోర్లు, 1 సిక్స్) తొలి వికెట్కు 90 బంతుల్లోనే 134 పరుగులు జోడించి విజయాన్ని సులువు చేశారు. ధోని మెరుపులు... ఓపెనర్ రచిన్ రవీంద్ర (0) టోర్నీలో తన వరుస వైఫల్యాలను కొనసాగించగా... మరో ఎండ్లో రహానే కొన్ని చక్కటి షాట్లు ఆడాడు. పవర్ప్లే ముగిసేసరికి చెన్నై 51 పరుగులు చేసింది. కెప్టెన్ రుతురాజ్ గైక్వాడ్ (17) ప్రభావం చూపలేకపోగా, నాలుగో స్థానంలో వచ్చిన జడేజా పరిస్థితిని చక్కదిద్దాడు. అయితే రహానేతో పాటు ఫామ్లో ఉన్న శివమ్ దూబే (3), సమీర్ రిజ్వీ (1)లను తక్కువ వ్యవధిలో అవుట్ చేసి లక్నో ఆధిక్యం ప్రదర్శించింది. ఈ సమయంలో కట్టుదిట్టమైన బౌలింగ్ కారణంగా చెన్నై బ్యాటర్లు పరుగులు చేయడంలో ఇబ్బంది పడ్డారు. ఒకదశలో వరుసగా 34 బంతుల పాటు బౌండరీనే రాలేదు! 16 ఓవర్లు ముగిసేసరికి స్కోరు 113/5. అయితే చివరి 4 ఓవర్లలో సూపర్ కింగ్స్ చెలరేగి 63 పరుగులు రాబట్టింది. మొహసిన్ ఓవర్లో సిక్సర్తో 34 బంతుల్లో జడేజా అర్ధ సెంచరీ పూర్తి చేసుకోగా... బిష్ణోయ్ వేసిన తర్వాతి ఓవర్లో అలీ వరుసగా 6, 6, 6 బాదడం విశేషం. అనంతరం 19వ ఓవర్లో 4, 6 కొట్టిన ధోని... ఆఖరి ఓవర్లో మరో 2 ఫోర్లు, సిక్స్తో చెలరేగాడు. ఏడో వికెట్కు ధోని, జడేజా 13 బంతుల్లో 35 పరుగులు జోడించారు. శతక భాగస్వామ్యం... ఛేదనను రాహుల్, డికాక్ ఘనంగా ఆరంభించారు. వీరిద్దరిని ఇబ్బంది పెట్టడంలో చెన్నై బౌలర్లంతా విఫలమయ్యారు. ఇద్దరూ ధాటిగా ఆడటంతో పవర్ప్లేలో 54 పరుగులు రాగా... 10.5 ఓవర్లు ముగిసేసరికి స్కోరు 9 ఫోర్లు, 4 సిక్సర్లతో 100 పరుగులు దాటింది. 31 పరుగుల స్కోరు వద్ద డికాక్ ఇచ్చిన క్యాచ్ను పతిరణ వదిలేయగా, 31 బంతుల్లో రాహుల్ అర్ధసెంచరీ పూర్తి చేసుకున్నాడు. ఆ తర్వాత 41 బంతుల్లో డికాక్ కూడా హాఫ్ సెంచరీ మార్క్ను అందుకున్నాడు. విజయానికి చేరువైన దశలో తక్కువ వ్యవధిలో వీరిద్దరు అవుటైనా... లక్ష్యం చేరేందుకు లక్నోకు ఇబ్బంది ఎదురు కాలేదు. స్కోరు వివరాలు చెన్నై సూపర్ కింగ్స్ ఇన్నింగ్స్: రహానే (బి) కృనాల్ 36; రచిన్ (బి) మొహసిన్ 0; రుతురాజ్ (సి) రాహుల్ (బి) యశ్ 17; జడేజా (నాటౌట్) 57; దూబే (సి) రాహుల్ (బి) స్టొయినిస్ 3; రిజ్వీ (స్టంప్డ్) రాహుల్ (బి) కృనాల్ 1; అలీ (సి) బదోని (బి) బిష్ణోయ్ 30; ధోని (నాటౌట్) 28; ఎక్స్ట్రాలు 4; మొత్తం (20 ఓవర్లలో 6 వికెట్లకు 176. వికెట్ల పతనం: 1–4, 2–33, 3–68, 4–87, 5–90, 6–141. బౌలింగ్: హెన్రీ 3–0–26–0, మొహసిన్ 4–0–37–1, యశ్ ఠాకూర్ 4–0–45–1, కృనాల్ పాండ్యా 3–0–16–2, రవి బిష్ణోయ్ 4–0–44–1, స్టొయినిస్ 2–0–7–1. లక్నో సూపర్ జెయింట్స్ ఇన్నింగ్స్: డికాక్ (సి) ధోని (బి) ముస్తఫిజుర్ 54; రాహుల్ (సి) జడేజా (బి) పతిరణ 82; పూరన్ (నాటౌట్) 23; స్టొయినిస్ (నాటౌట్) 8; ఎక్స్ట్రాలు 13; మొత్తం (19 ఓవర్లలో 2 వికెట్లకు) 180. వికెట్ల పతనం: 1–134, 2–161. బౌలింగ్: దీపక్ చహర్ 3–0–26–0, తుషార్ 4–0–42–0, ముస్తఫిజుర్ 4–0–43–1, జడేజా 3–0–32–0, పతిరణ 4–0–29–1, అలీ 1–0–5–0. ఐపీఎల్లో నేడు ఢిల్లీ X హైదరాబాద్ వేదిక: న్యూఢిల్లీ రాత్రి 7: 30 గంటల నుంచి స్టార్ స్పోర్ట్స్, జియో సినిమా యాప్లో ప్రత్యక్ష ప్రసారం -
చరిత్ర సృష్టించిన ధోని.. ఐపీఎల్ హిస్టరీలోనే తొలి క్రికెటర్గా
చెన్నై సూపర్ కింగ్స్ స్టార్ ఆటగాడు మహేంద్ర సింగ్ ధోని అరుదైన ఘనత సాధించాడు. ఐపీఎల్ చరిత్రలో చేజింగ్ సమయంలో అత్యధిక సార్లు నాటౌట్గా నిలిచిన బ్యాటర్గా ధోని రికార్డులకెక్కాడు. ఐపీఎల్-2024లో భాగంగా చెపాక్ వేదికగా కోల్కతా నైట్రైడర్స్తో జరిగిన మ్యాచ్లో లక్ష్య ఛేదనలో ధోని ఒక్క పరుగుతో ఆజేయంగా నిలిచాడు. తద్వారా ఈ అరుదైన రికార్డను మిస్టర్ కూల్ తన ఖాతాలో వేసుకున్నాడు. ఇప్పటివరకు ధోని ఛేజింగ్లో అత్యధికంగా 28 సార్లు అజేయంగా నిలిచాడు. ఇంతకుముందు ఈ రికార్డు సీఎస్కే స్టార్ ఆల్రౌండర్ రవీంద్ర జడేజా పేరిట ఉండేది. జడ్డూ 27 సార్లు అజేయంగా నిలిచాడు. తాజా మ్యాచ్తో జడేజా ఆల్టైమ్ రికార్డును ధోని బ్రేక్ చేశాడు. ధోని, జడేజా తర్వాత స్ధానాల్లో దినేష్ కార్తీక్(23), యూసుఫ్ పఠాన్ (22), డేవిడ్ మిల్లర్(22) ఉన్నారు. ఇక మ్యాచ్ విషయానికి వస్తే.. కేకేఆర్పై సీఎస్కే 7 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. చదవండి: IPL 2024 CSK VS KKR: సొంత అభిమానులనే ఆట పట్టించిన జడ్డూ -
IPL 2024: చరిత్రలో ఒకే ఒక్కడు.. రవీంద్ర జడేజా
ఇండియన్ ప్రీమియర్ లీగ్లో ఎవరికీ సాధ్యం కాని ఘనతను సీఎస్కే ఆల్రౌండర్ రవీంద్ర జడేజా సాధించాడు. 17 ఏళ్ల క్యాష్ రిచ్ లీగ్ చరిత్రలో 1000 పరుగులు సాధించి, 100 వికెట్లు పడగొట్టి, 100 క్యాచ్లు పట్టుకున్న తొలి ఆటగాడిగా చరిత్ర సృష్టించాడు. ఐపీఎల్ 2024లో భాగంగా కేకేఆర్తో నిన్న (ఏప్రిల్ 8) జరిగిన మ్యాచ్లో శ్రేయస్ అయ్యర్ క్యాచ్ పట్టడం ద్వారా జడ్డూ క్యాష్ రిచ్ లీగ్లో 100 క్యాచ్ల మైలురాయిని తాకాడు. 231 మ్యాచ్ల ఐపీఎల్ కెరీర్లో జడేజా 2776 పరుగులు చేసి 156 వికెట్లు పడగొట్టాడు. జడ్డూ ఖాతాలో రెండు అర్దసెంచరీలు, ఓ ఐదు వికెట్ల ఘనత ఉంది. కేకేఆర్తో మ్యాచ్లో శ్రేయస్ క్యాచ్తో పాటు ఫిలిప్ సాల్ట్ క్యాచ్ కూడా పట్టుకున్న జడేజా.. బౌలింగ్లో ఆకాశమే హద్దుగా చెలరేగి 4 ఓవర్లలో కేవలం 18 పరుగులు మాత్రమే ఇచ్చి 3 వికెట్లు పడగొట్టాడు. బౌలింగ్లో, ఫీల్డింగ్లో అద్భుత ప్రదర్శనలకు గాను జడేజాకు ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు లభించింది. ఐపీఎల్లో సీఎస్కే తరఫున జడేజాకు ఇది 15వ ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు. ఈ అవార్డుతో జడ్డూ సీఎస్కే తరఫున అత్యధిక ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డులు గెలుచుకున్న ఆటగాడిగా ధోని సరసన చేరాడు. ఐపీఎల్లో ధోని సైతం సీఎస్కే తరఫున 15 ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డులు గెలుచుకున్నాడు. కాగా, నిన్నటి మ్యాచ్లో కేకేఆర్పై సీఎస్కే 7 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. ఈ మ్యాచ్లో తొలుత బ్యాటింగ్ చేసిన కేకేఆర్.. రవీంద్ర జడేజా (4-0-18-3), తుషార్ దేశ్పాండే (4-0-33-3), ముస్తాఫిజుర్ (4-0-22-2), తీక్షణ (4-0-28-1) దెబ్బకు నిర్ణీత ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 137 పరుగులు మాత్రమే చేయగలిగింది. విధ్వంసకర వీరులున్న కేకేఆర్ ఈ మ్యాచ్లో తేలిపోయింది. సాల్ట్ (0), వెంకటేశ్ అయ్యర్ (3), రింకూ సింగ్ (9), రసెల్ (10) తస్సుమనిపించారు. నరైన్ (27), రఘువంశీ (24), శ్రేయస్ అయ్యర్ (34) నామమాత్రపు స్కోర్లు చేశారు. అనంతరం స్వల్ప లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన సీఎస్కేను రుతురాజ్ (67 నాటౌట్) కెప్టెన్సీ ఇన్నింగ్స్ ఆడి గెలిపించాడు. రచిన్ రవీంద్ర 15, డారిల్ మిచెల్ 25, శివమ్ దూబే 28 పరుగులు (18 బంతుల్లో ఫోర్, 3 సిక్సర్లు) చేసి ఔట్ కాగా.. ధోని ఒక్క పరుగు చేసి నాటౌట్గా మిగిలాడు. కేకేఆర్ బౌలర్లలో వైభవ్ అరోరా 2 వికెట్లు పడగొట్టగా.. నరైన్ ఓ వికెట్ దక్కించుకున్నాడు. ఈ గెలుపుతో సీఎస్కే మరో రెండు పాయింట్లు ఖాతాలో వేసుకుని పాయింట్ల పట్టికలో నాలుగో స్థానంలో నిలిచింది. సీజన్ తొలి ఓటమిని మూటగట్టుకున్న కేకేఆర్ రెండో స్థానంలో ఉంది. -
IPL 2024 CSK VS KKR: ధోని రికార్డు సమం చేసిన జడేజా
ఐపీఎల్ 2024లో భాగంగా చెన్నైలోని చెపాక్ స్టేడియం వేదికగా కేకేఆర్తో నిన్న (ఏప్రిల్ 8) జరిగిన మ్యాచ్లో చెన్నై సూపర్ కింగ్స్ 7 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. ఈ మ్యాచ్లో రవీంద్ర జడేజా అద్భుతంగా బౌలింగ్ (4-0-18-3) చేసి సీఎస్కేను గెలిపించాడు. తొలుత బ్యాటింగ్ చేసిన కేకేఆర్ జడ్డూ ధాటికి 137 పరుగులకే పరిమితం కాగా.. ఛేదనలో రుతురాజ్ కెప్టెన్సీ ఇన్నింగ్స్ (67 నాటౌట్) ఆడి జట్టును విజయతీరాలకు చేర్చాడు. Ravindra Jadeja - The Game Changer of CSK with ball. 🔥pic.twitter.com/HsyMhbDsTJ — Johns. (@CricCrazyJohns) April 8, 2024 బంతితో అద్భుతమైన ప్రదర్శనకు గాను జడేజా ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు గెలుచుకున్నాడు. ఐపీఎల్లో సీఎస్కే తరఫున జడేజాకు ఇది 15వ ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు. ఈ అవార్డుతో జడ్డూ సీఎస్కే తరఫున అత్యధిక ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డులు గెలుచుకున్న ఆటగాడిగా ధోని సరసన చేరాడు. ఐపీఎల్లో ధోని సైతం సీఎస్కే తరఫున 15 ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డులు గెలుచుకున్నాడు. సీఎస్కే తరఫున అత్యధిక ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డులు గెలుచుకున్న ఆటగాళ్ల జాబితాలో ధోని, జడ్డూల తర్వాత సురేశ్ రైనా (12), రుతురాజ్ గైక్వాడ్ (10), మైక్ హస్సీ (10) ఉన్నారు. కాగా, ఈ మ్యాచ్లో టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన కేకేఆర్.. రవీంద్ర జడేజా, తుషార్ దేశ్పాండే (4-0-33-3), ముస్తాఫిజుర్ (4-0-22-2), తీక్షణ (4-0-28-1) దెబ్బకు నిర్ణీత ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 137 పరుగులు మాత్రమే చేయగలిగింది. విధ్వంసకర వీరులున్న కేకేఆర్ ఈ మ్యాచ్లో తేలిపోయింది. సాల్ట్ (0), వెంకటేశ్ అయ్యర్ (3), రింకూ సింగ్ (9), రసెల్ (10) తస్సుమనిపించారు. నరైన్ (27), రఘువంశీ (24), శ్రేయస్ అయ్యర్ (34) నామమాత్రపు స్కోర్లు చేశారు. స్వల్ప లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన సీఎస్కేను రుతురాజ్ కెప్టెన్సీ ఇన్నింగ్స్ ఆడి గెలిపించాడు. రచిన్ రవీంద్ర 15, డారిల్ మిచెల్ 25, శివమ్ దూబే 28 పరుగులు (18 బంతుల్లో ఫోర్, 3 సిక్సర్లు) చేసి ఔట్ కాగా.. ధోని ఒక్క పరుగు చేసి నాటౌట్గా మిగిలాడు. కేకేఆర్ బౌలర్లలో వైభవ్ అరోరా 2 వికెట్లు పడగొట్టగా.. నరైన్ ఓ వికెట్ దక్కించుకున్నాడు. ఈ గెలుపుతో సీఎస్కే మరో రెండు పాయింట్లు ఖాతాలో వేసుకుని పాయింట్ల పట్టికలో నాలుగో స్థానంలో నిలిచింది. సీజన్ తొలి ఓటమిని మూటగట్టుకున్న కేకేఆర్ రెండో స్థానంలో ఉంది. -
IPL 2024: సొంత అభిమానులనే ఆట పట్టించిన జడ్డూ.. వైరల్ వీడియో
చెన్నైలోని చెపాక్ స్టేడియంలో కేకేఆర్తో నిన్న (ఏప్రిల్ 8) జరిగిన మ్యాచ్ సందర్భంగా ఓ ఆసక్తికర సన్నివేశం చోటు చేసుకుంది. సీఎస్కే స్టార్ ఆల్రౌండర్ రవీంద్ర జడేజా సొంత అభిమానులనే ఆటపట్టించాడు. సీఎస్కే లక్ష్యాన్ని ఛేదిస్తుండగా.. జడ్డూ ధోని కంటే ముందే బ్యాటింగ్కు దిగుతున్నట్లు ప్రాంక్ చేసి ఫ్యాన్స్ను టీజ్ చేశాడు. సీఎస్కే గెలుపు ఖరారైన దశలో శివమ్ దూబే ఔట్ కాగా.. ఆ దశలో ధోని బ్యాటింగ్కు దిగాల్సి ఉంది. అయితే జడ్డూ ధోని కంటే ముందే బరిలోకి దిగుతున్నట్లు నటించి అభిమానులను టీజ్ చేశాడు. కొంత దూరం వెళ్లి అభిమానులు కేకలు పెట్టడంతో జడ్డూ తిరిగి వెనక్కు వెళ్లిపోయాడు. అనంతరం ధోని బరిలోకి దిగి జట్టును విజయతీరాలకు చేర్చడంలో భాగమయ్యాడు. జడ్డూ సరదాగా చేసిన ఈ పని నవ్వులు పూయించింది. స్టేడియంలో ఉన్నవారంతా కాసేపు తనివితీరా నవ్వుకున్నారు. దీనికి సంబంధించిన వీడియో నెట్టింట హల్చల్ చేస్తుంది. Ravindra Jadeja teased the Chepauk crowd by coming ahead of MS Dhoni then going back. 🤣 - This is amazing!! ❤️👌 pic.twitter.com/KPp4FewM17 — Mufaddal Vohra (@mufaddal_vohra) April 9, 2024 ఇదిలా ఉంటే, నిన్నటి మ్యాచ్లో కేకేఆర్పై సీఎస్కే 7 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. ఈ మ్యాచ్లో తొలుత బ్యాటింగ్ చేసిన కేకేఆర్.. రవీంద్ర జడేజా (4-0-18-3), తుషార్ దేశ్పాండే (4-0-33-3), ముస్తాఫిజుర్ (4-0-22-2), తీక్షణ (4-0-28-1) దెబ్బకు నిర్ణీత ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 137 పరుగులు మాత్రమే చేయగలిగింది. విధ్వంసకర వీరులున్న కేకేఆర్ ఈ మ్యాచ్లో తేలిపోయింది. సాల్ట్ (0), వెంకటేశ్ అయ్యర్ (3), రింకూ సింగ్ (9), రసెల్ (10) తస్సుమనిపించారు. నరైన్ (27), రఘువంశీ (24), శ్రేయస్ అయ్యర్ (34) నామమాత్రపు స్కోర్లు చేశారు. We thought it was a Prank by Jadeja but it was a Prank from Thala to Fans. Look How all Teammates enjoying it 😂💛 pic.twitter.com/YrzQbP7WNV — 🎰 (@StanMSD) April 9, 2024 స్వల్ప లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన సీఎస్కేను రుతురాజ్ (67 నాటౌట్) కెప్టెన్సీ ఇన్నింగ్స్ ఆడి గెలిపించాడు. రచిన్ రవీంద్ర 15, డారిల్ మిచెల్ 25, శివమ్ దూబే 28 పరుగులు (18 బంతుల్లో ఫోర్, 3 సిక్సర్లు) చేసి ఔట్ కాగా.. ధోని ఒక్క పరుగు చేసి నాటౌట్గా మిగిలాడు. కేకేఆర్ బౌలర్లలో వైభవ్ అరోరా 2 వికెట్లు పడగొట్టగా.. నరైన్ ఓ వికెట్ దక్కించుకున్నాడు. -
IPL 2024: చెన్నై చెలరేగింది
చెన్నై: ఈ సీజన్లో భారీ స్కోర్లతో, హ్యాట్రిక్ విజయాలతో దూసుకెళ్తున్న కోల్కతా నైట్రైడర్స్పై చెన్నై సూపర్కింగ్స్ చెలరేగింది. సోమవారం జరిగిన ఐపీఎల్ మ్యాచ్లో చెన్నై ఆల్రౌండ్ షో ముందు నైట్రైడర్స్ చేతులెత్తేసింది. దీంతో సూపర్కింగ్స్ 7 వికెట్ల తేడాతో విజయం సాధించింది. ముందుగా బ్యాటింగ్కు దిగిన కోల్కతా నైట్రైడర్స్ నిరీ్ణత 20 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 137 పరుగులు చేసింది. కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ (33 బంతుల్లో 34; 3 ఫోర్లు) టాప్ స్కోరర్! సూపర్కింగ్స్ బౌలర్లు రవీంద్ర జడేజా (3/18), తుషార్ దేశ్పాండే (3/33), ముస్తఫిజుర్ (2/22) మూకుమ్మడిగా వికెట్లను పడేశారు. అనంతరం లక్ష్యఛేదనకు దిగిన చెన్నై 17.4 ఓవర్లలో 3 వికెట్లు కోల్పోయి 141 పరుగులు చేసి గెలిచింది. రుతురాజ్ గైక్వాడ్ (58 బంతుల్లో 67 నాటౌట్; 9 ఫోర్లు) రాణించగా, శివమ్ దూబే (18 బంతుల్లో 28; 1 ఫోర్, 3 సిక్స్లు) మెరిపించాడు. కోల్కతా విలవిల... నైట్రైడర్స్ ఇన్నింగ్స్ ఆరంభం నుంచి ఆఖరిదాకా కష్టాలతోనే సాగింది. తుషార్ ఇన్నింగ్స్ మొదటి ఓవర్ తొలి బంతికే ఫిల్ సాల్ట్ (0) డకౌటయ్యాడు. ఓపెనర్గా చెలరేగిపోతున్న సునీల్ నరైన్ (20 బంతుల్లో 27; 3 ఫోర్లు, 2 సిక్స్లు), రఘువంశీ (18 బంతుల్లో 24; 3 ఫోర్లు, 1 సిక్స్)తో కలిసి కాసేపు ధాటిగా ఆడారంతే! పవర్ప్లేలో జట్టు 56/1 స్కోరు చేసింది. ఇక్కడిదాకా బాగానే ఉన్నా... జడేజా బౌలింగ్కు దిగడంతో కోల్కతా కష్టాల పాలైంది. తన తొలి ఓవర్లో (ఇన్నింగ్స్ 7వ) వాళ్లిద్దర్నీ అవుట్ చేసిన జడేజా మరుసటి ఓవర్లో వెంకటేశ్ అయ్యర్ (3)ను పెవిలియన్ చేర్చాడు. 64 పరుగులకే 4 కీలక వికెట్లు కోల్పోయింది. రమణ్దీప్ (13) ఐదో వికెట్గా వెనుదిరిగాడు. శ్రేయస్ చేసిన ఆమాత్రం స్కోరుతో కష్టంగా వంద పరుగులు దాటింది. తర్వాత తుషార్ దెబ్బకు కోల్కతా కుదేలైంది. హిట్టర్లు రింకూ సింగ్ (9), రసెల్ (10)లను అవుట్ చేయడంతో స్కోరులో జోరుకు ఆస్కారమే లేకపోయింది. రుతురాజ్ అర్ధసెంచరీ సులువైన లక్ష్యం కావడంతో హిట్టింగ్ ఓపెనర్ రచిన్ రవీంద్ర (8 బంతుల్లో 15; 3 ఫోర్లు) ఆరంభంలోనే అవుటైనా చెన్నై దూకుడుకు ఢోకా లేకపోయింది. రుతురాజ్, మిచెల్ (19 బంతుల్లో 25; 1 ఫోర్, 1 సిక్స్)తో కలిసి ఇన్నింగ్స్ను సాఫీగా నడిపించారు. తొలి సగం (10) ఓవర్లలో 81/1 స్కోరు చేసింది. రుతురాజ్ 45 బంతుల్లో అర్ధసెంచరీ పూర్తి చేసుకోగా, మిచెల్ను అవుట్ చేయడం ద్వారా నరైన్ ఈ జోడీని విడగొట్టాడు. దీంతో రెండో వికెట్కు 70 పరుగుల భాగస్వామ్యం ముగిసింది. ఇంపాక్ట్ ప్లేయర్గా క్రీజులోకి వచ్చిన శివమ్ దూబే సిక్సర్లతో విరుచుకుపడ్డాడు. లక్ష్యానికి చేరువలో దూబే బౌల్డవగా లాంఛనాన్ని ధోని (1 నాటౌట్), రుతురాజ్ ముగించారు. స్కోరు వివరాలు కోల్కతా నైట్రైడర్స్ ఇన్నింగ్స్: సాల్ట్ (సి) జడేజా (బి) తుషార్ 0; నరైన్ (సి) తీక్షణ (బి) జడేజా 27; రఘువంశీ (ఎల్బీడబ్ల్యూ) (బి) జడేజా 24; శ్రేయస్ (సి) జడేజా (బి) ముస్తఫిజుర్ 34; వెంకటేశ్ (సి) మిచెల్ (బి) జడేజా 3; రమణ్దీప్ (బి) తీక్షణ 13; రింకూ (బి) తుషార్ 9; రసెల్ (సి) మిచెల్ (బి) తుషార్ 10; అనుకుల్ (నాటౌట్) 3; స్టార్క్ (సి) రవీంద్ర (బి) ముస్తఫిజుర్ 0; వైభవ్ నాటౌట్ 1; ఎక్స్ట్రాలు 13; మొత్తం (20 ఓవర్లలో 9 వికెట్లకు) 137. వికెట్ల పతనం: 1–0, 2–56, 3–60, 4–64, 5–85, 6–112, 7–127, 8–135, 9–135. బౌలింగ్ : తుషార్ 4–0–33–3, ముస్తఫిజుర్ 4–0 –22–2, శార్దుల్ 3–0–27–0, తీక్షణ 4–0–28–1, జడేజా 4–0–18–3, రచిన్ 1–0–4–0. చెన్నై సూపర్ కింగ్స్ ఇన్నింగ్స్: రచిన్ (సి) వరుణ్ (బి) వైభవ్ 15; రుతురాజ్ (నాటౌట్) 67; మిచెల్ (బి) నరైన్ 25; దూబే (బి) వైభవ్ 28; ధోని (నాటౌట్) 1; ఎక్స్ట్రాలు 5; మొత్తం (17.4 ఓవర్లలో 3 వికెట్లకు) 141. వికెట్ల పతనం: 1–27, 2–97, 3–135. బౌలింగ్: స్టార్క్ 3–0–29–0, వైభవ్ 4–0–28–2, అనుకుల్ 1.4–0– 18–0, నరైన్ 4–0–30–1, వరుణ్ చక్రవర్తి 4–0– 26–0, రసెల్ 1–0–8–0. -
IPL 2024: 'సెంచరీ' కొట్టిన రవీంద్ర జడేజా..
టీమిండియా స్టార్ ఆల్రౌండర్, చెన్నై సూపర్ కింగ్స్ ఆటగాడు రవీంద్ర జడేజా అరుదైన ఘనత సాధించాడు. ఐపీఎల్లో 100 క్యాచ్లు పట్టిన ఆటగాళ్ల క్లబ్లో జడ్డూ చేరాడు చేరాడు. ఈ మైలు రాయిని అందుకున్న ఐదో క్రికెటర్గా జడేజా నిలిచాడు. ఐపీఎల్-2024లో భాగంగా చెపాక్ వేదికగా కోల్కతా నైట్రైడర్స్తో మ్యాచ్లో రెండు క్యాచ్లు పట్టిన జడ్డూ.. ఈ అరుదైన ఫీట్ను తన ఖాతాలో వేసుకున్నాడు. ఈ జాబితాలో విరాట్ కోహ్లీ(110) టాప్లో ఉండగా.. సురేశ్ రైనా(109), రోహిత్ శర్మ(100), రవీంద్ర జడేజా(100), శిఖర్ ధావన్(98) తర్వాతి స్థానాల్లో కొనసాగుతున్నారు. ఇక మ్యాచ్ విషయానికి వస్తే.. కెకేఆర్పై 7 వికెట్ల తేడాతో సీఎస్కే ఘన విజయం సాధించింది. ఈ మ్యాచ్లో తొలుత బ్యాటింగ్ చేసిన కేకేఆర్ నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్లు కోల్పోయి కేవలం 137 పరుగులు మాత్రమే చేసింది. సీఎస్కే బౌలర్లలో రవీంద్ర జడేజా, తుషార్ దేశ్ పాండే తలా మూడు వికెట్లు పడగొట్టగా.. ముస్తఫిజుర్ రెహ్మన్ రెండు, థీక్షణ ఒక్క వికెట్సాధించారు. కేకేఆర్ బ్యాటర్లలో శ్రేయస్ అయ్యర్(34) పరుగులతో టాప్ స్కోరర్గా నిలిచాడు. అనంతరం 138 పరుగుల స్వల్ప లక్ష్యాన్ని సీఎస్కే 17. 4 ఓవర్లలో కేవలం 3 వికెట్లు మాత్రమే కోల్పోయి చేధించింది. చెన్నై బ్యాటర్లలో కెప్టెన్ రుతురాజ్ గైక్వాడ్ అద్భుతమైన ఇన్నింగ్స్ ఆడాడు. 58 బంతుల్లో 9 ఫోర్లతో 67 పరుగులతో ఆజేయంగా నిలిచాడు. అతడితో పాటు శివమ్ దూబే(28) మరోసారి అదరగొట్టాడు.కేకేఆర్ బౌలర్లలో వైభవ్ ఆరోరా రెండు వికెట్లు పడగొట్టగా.. నరైన్ ఒక్క వికెట్ సాధించాడు. Jadeja 𝙰̶𝚃̶ ON POINT 💛🔥#IPLonJioCinema #TATAIPL #CSKvKKR #IPLinTamil pic.twitter.com/Cppty7aGqX — JioCinema (@JioCinema) April 8, 2024 -
SRH: ధోని రావొద్దనే కమిన్స్ ‘కన్నింగ్’ ప్లాన్?!
సన్రైజర్స్ హైదరాబాద్ కెప్టెన్, ఆస్ట్రేలియా సారథి ప్యాట్ కమిన్స్ను ఉద్దేశించి టీమిండియా మాజీ క్రికెటర్ మహ్మద్ కైఫ్ సంచలన వ్యాఖ్యలు చేశాడు. చెన్నై సూపర్ కింగ్స్తో మ్యాచ్లో కమిన్స్ కెప్టెన్సీని ప్రస్తావిస్తూ.. టీ20 ప్రపంచకప్లోనూ ఇదే తరహాలో వ్యవహరిస్తావా అంటూ ప్రశ్నలు సంధించాడు. ఫలితంగా నెటిజన్ల నుంచి విమర్శలు ఎదుర్కొంటున్నాడు. ఇంతకీ ఏం జరిగిందంటే?!... ఐపీఎల్-2024లో భాగంగా సన్రైజర్స్ శుక్రవారం ఉప్పల్ వేదికగా సీఎస్కేతో తలపడింది. సొంతమైదానంలో టాస్ గెలిచి ప్రత్యర్థిని బ్యాటింగ్కు ఆహ్వానించింది. స్లో వికెట్ మీద రన్స్ రాబట్టేందుకు సీఎస్కే బ్యాటర్లు ఇబ్బంది పడగా.. పిచ్ పరిస్థితులను రైజర్స్ బౌలర్లు చక్కగా వినియోగించుకున్నారు. సీఎస్కేను 165 పరుగులకే కట్టడి చేయగలిగారు. శివం దూబే ఒక్కడు ధనాధన్ ఇన్నింగ్స్(24 బంతుల్లో 45) ఆడగా.. అతడిని కమిన్స్ తన బౌలింగ్లోనే అవుట్ చేశాడు. ఇదిలా ఉంటే.. దూబే స్థానంలో క్రీజులోకి వచ్చిన రవీంద్ర జడేజా పరుగులు తీయడానికి ఇబ్బంది పడ్డాడు. ఇక పందొమ్మిదో ఓవర్ నాలుగో బంతికి భువనేశ్వర్ కుమార్ బౌలింగ్లో జడ్డూ రనౌట్ కావాల్సింది. అయితే, ఆ ప్రమాదం నుంచి తప్పించుకునేందుకు యత్నించిన జడ్డూ.. ఉద్దేశపూర్వకంగానే బంతికి అడ్డు తగిలినట్లుగా కనిపించింది. దీంతో రైజర్స్ వికెట్ కీపర్ హెన్రిచ్ క్లాసెన్ అబ్స్ట్రకింగ్ ది ఫీల్డ్కు సిగ్నల్ ఇచ్చాడు. అయితే, కెప్టెన్ కమిన్స్ మాత్రం జడ్డూ విషయంలో అప్పీలు వెనక్కి తీసుకున్నాడు. ఫలితంగా జడ్డూకు లైఫ్ వచ్చింది. ఇక డారిల్ మిచెల్ స్థానంలో మైదానంలోకి వచ్చిన ధోని ఒక్క పరుగుతో అజేయంగా నిలిచాడు. var request = 'https://www.sakshi.com/knowwidget/kwstr_7522010156.json'; $.ajaxPrefilter( function (request) { if (request.crossDomain && jQuery.support.cors) { var http = (window.location.protocol === 'http:' ? 'http:' : 'https:'); request.url = http + '//cors-anywhere.herokuapp.com/' + request.url; } }); $.get( request,function (response){ if(response == ''){ $('#frameId').hide(); }else{ $('#frameId').show(); } }); ఇదిలా ఉంటే.. జడ్డూ విషయంలో కమిన్స్ వ్యవహారశైలిపై నెట్టింట పెద్ద ఎత్తు చర్చ జరుగుతోంది. ఈ నేపథ్యంలో మహ్మద్ కైఫ్ స్పందిస్తూ.. ‘‘జడేజా అబ్స్ట్రకింగ్ ది ఫీల్డ్ విషయంలో అప్పీలు వెనక్కి తీసుకున్న ప్యాట్ కమిన్స్కు రెండు ప్రశ్నలు.. పరుగులు తీయడానికి ఇబ్బంది పడుతున్న జడేజాను క్రీజులోనే ఉండనిచ్చి ధోనిని డ్రెసింగ్రూంకే పరిమితం చేసేందుకు పన్నిన వ్యూహమా? ఒకవేళ టీ20 ప్రపంచకప్లో విరాట్ కోహ్లి క్రీజులో ఉన్న సమయంలో కూడా ఇలాగే చేస్తాడా?’’ అని కమిన్స్ను ఉద్దేశించి ఎక్స్ వేదికగా పోస్ట్ పెట్టాడు. ధోనిని మైదానంలో అడుగుపెట్టకుండా అడ్డుకునేందుకు.. అతడు బ్యాట్ ఝులిపించకుండా ఉండేందుకు ఇలా చేశాడని కైఫ్ పరోక్షంగా కమిన్స్ను తప్పుబట్టాడు. అదే సమయంలో.. వరల్డ్కప్ లాంటి ఈవెంట్లలో కూడా ఇలాంటి వ్యూహాలు అమలు చేస్తావా అని ప్రశ్నించాడు. అయితే, కైఫ్ వ్యాఖ్యలపై నెటిజన్లు భిన్నంగా స్పందిస్తున్నారు. గెలుపు కోసం కెప్టెన్లు తమదైన వ్యూహాలు అమలు చేయడంలో తప్పు లేదు అని కొంతమంది అంటుండగా.. అసలు వరల్డ్కప్నకు దీనికి సంబంధం ఏమిటని ఇంకొందరు ప్రశ్నిస్తున్నారు. Two questions to Pat Cummins on withdrawing the obstructing the field appeal against Jadeja. Was it a tactical call to let a struggling Jadeja be the crease and keep Dhoni indoors? Would he have done the same if it was Virat Kohli at World T20? — Mohammad Kaif (@MohammadKaif) April 5, 2024 మరికొందరేమో.. ‘‘ఆస్ట్రేలియా టీ20 జట్టుకు కెప్టెన్ మార్ష్. కమిన్స్ కాదు. మీరు కావాలనే విరాట్ కోహ్లి పేరును ప్రస్తావించి హైలైట్ అవ్వాలని చూస్తున్నారు కదా’’అని సెటైర్లు వేస్తున్నారు. కాగా ఈ మ్యాచ్లో చెన్నైపై సన్రైజర్స్ ఆరు వికెట్ల తేడాతో విజయం సాధించిన విషయం తెలిసిందే. చదవండి: #Kavya Maran: పట్టపగ్గాల్లేని సంతోషం.. కావ్యా మారన్ పక్కన ఎవరీ అమ్మాయి? Obstructing or not? 🤔 Skipper Pat Cummins opts not to appeal 👏👏#SRHvCSK #IPLonJioCinema #TATAIPL pic.twitter.com/l85UXQEa4S — JioCinema (@JioCinema) April 5, 2024 Joy for the Orange Army 🧡 as they register their second home win of the season 👌👌@SunRisers climb to number 5⃣ on the Points Table 😎 Scorecard ▶️ https://t.co/O4Q3bQNgUP#TATAIPL | #SRHvCSK pic.twitter.com/QWS4n2Ih8D — IndianPremierLeague (@IPL) April 5, 2024 -
CSK: ఆ రెండు తప్పుల వల్లే ఓడిపోయాం: రుతురాజ్
సన్రైజర్స్ హైదరాబాద్తో మ్యాచ్లో మెరుగైన ఆరంభం అందుకున్నా .. దానిని నిలబెట్టుకోలేకపోయామని చెన్నై సూపర్ కింగ్స్ కెప్టెన్ రుతురాజ్ గైక్వాడ్ అన్నాడు. ఉప్పల్ పిచ్పై 170- 175 పరుగులు చేసి ఉంటే ఫలితం కాస్త వేరుగా ఉండేదని అభిప్రాయపడ్డాడు. ఏదేమైనా సన్రైజర్స్ ఆటగాళ్లు తెలివిగా బ్యాటింగ్ చేశారని కొనియాడాడు. కాగా ఐపీఎల్-2024లో సీఎస్కే తమ నాలుగో మ్యాచ్లో సన్రైజర్స్తో తలపడింది. హైదరాబాద్లో శుక్రవారం జరిగిన ఈ మ్యాచ్లో టాస్ గెలిచిన ఆతిథ్య జట్టు తొలుత బౌలింగ్ ఎంచుకుంది. ఓపెనర్లలో రచిన్ రవీంద్ర(12) మరోసారి తేలిపోగా.. రుతురాజ్ గైక్వాడ్(26) కాస్త మెరుగ్గా బ్యాటింగ్ చేశాడు. ఇక ఉప్పల్ పిచ్ స్లోగా ఉండటంతో రన్స్ తీయడానికి ఇబ్బంది పడ్డ రహానే 30 బంతులు ఎదుర్కొని 35 పరుగులు చేయగా.. శివం దూబే మాత్రం మెరుపులు(24 బంతుల్లో 45) మెరిపించాడు. స్పిన్నర్లను అటాక్ చేస్తూ పరుగులు రాబట్టాడు. 𝘿𝙪𝙗𝙚 𝘿𝙚𝙢𝙤𝙡𝙞𝙩𝙞𝙤𝙣 💥#SRHvCSK #TATAIPL #IPLonJioCinema pic.twitter.com/j2pCdp0VAF — JioCinema (@JioCinema) April 5, 2024 దీంతో స్పిన్నర్లను పక్కనపెట్టి పేసర్లను దించిన రైజర్స్ సారథి ప్యాట్ కమిన్స్ తన బౌలింగ్లో దూబేను అవుట్ చేశాడు. అనంతరం జడ్డూ(31- నాటౌట్), డారిల్ మిచెల్(13) కాసేపు బ్యాట్ ఝులిపించినా.. ఆఖరి ఐదు ఓవర్లలో సీఎస్కేకు కేవలం 38 పరుగులు మాత్రమే వచ్చాయి. ఫలితంగా నిర్ణీత 20 ఓవర్లలో ఐదు వికెట్ల నష్టానికి సీఎస్కే 165 పరుగులు చేసింది. అనంతరం సన్రైజర్స్ 18.1 ఓవర్లలోనే లక్ష్యాన్ని ఛేదించి విజయఢంకా మోగించింది. ఆరంభంలో ట్రవిస్ హెడ్ క్యాచ్ను మొయిన్ అలీ మిస్ చేయగా అతడికి లైఫ్ లభించింది. ఇక పవర్ ప్లేలో విధ్వంసరచన చేసిన అభిషేక్ శర్మ (12 బంతుల్లోనే 37 రన్స్)రైజర్స్ గెలుపులో కీలక పాత్ర పోషించాడు. Abhishek sambhavam 🔥🤩#SRHvCSK #IPLonJioCinema #TATAIPL pic.twitter.com/rkekTCQOve — JioCinema (@JioCinema) April 5, 2024 ఆ రెండు తప్పులే కొంపముంచాయి ఈ నేపథ్యంలో ఓటమిపై స్పందించిన సీఎస్కే కెప్టెన్ రుతురాజ్ గైక్వాడ్.. ‘‘ఈ పిచ్ చాలా స్లోగా ఉంది. వాళ్ల బౌలర్లు పరిస్థితులను చక్కగా ఉపయోగించుకుని మమ్మల్ని దెబ్బకొట్టారు. ఆరంభంలో మేము బాగానే ఆడాం. అయితే, తర్వాత వాళ్లు పైచేయి సాధించారు. ఇది నల్లరేగడి పిచ్.. నెమ్మదిగా ఉంటుందని ముందే అంచనా వేశాం. కానీ.. కానీ మ్యాచ్ సాగుతున్న కొద్దీ మరింత స్లో అయిపోయింది. పవర్ ప్లేలో మేము ధారాళంగా పరుగులు సమర్పించుకోవడం, ఓ క్యాచ్ మిస్ చేయడం తీవ్ర ప్రభావం చూపింది. అయినప్పటికీ ప్రత్యర్థిని 19వ ఓవర్ వరకు తీసుకువచ్చాం’’ అని పేర్కొన్నాడు. ఆఖరి వరకు లక్ష్యాన్ని కాపాడుకునేందుకు తాము పోరాడమని చెప్పుకొచ్చాడు. ఏదేమైనా పవర్ ప్లేలో రైజర్స్ను కట్టడి చేయకపోవడమే తమ ఓటమికి కారణం అని రుతురాజ్ గైక్వాడ్ అంగీకరించాడు. చదవండి: జడ్డూ అవుట్ కావాలి కదా? కమిన్స్ ఎందుకు వదిలేశాడు? వీడియో వైరల్ var request = 'https://www.sakshi.com/knowwidget/kwstr_7522010156.json'; $.ajaxPrefilter( function (request) { if (request.crossDomain && jQuery.support.cors) { var http = (window.location.protocol === 'http:' ? 'http:' : 'https:'); request.url = http + '//cors-anywhere.herokuapp.com/' + request.url; } }); $.get( request,function (response){ if(response == ''){ $('#frameId').hide(); }else{ $('#frameId').show(); } }); -
జడ్డూ అవుట్ కావాలి కదా? కమిన్స్ ఎందుకు వదిలేశాడు? వైరల్
IPL 2024- SRH Crush CSK By 6 Wickets: ఐపీఎల్-2024లో సొంతగడ్డపై సన్రైజర్స్ హైదరాబాద్ మరోసారి విజయ గర్జన చేసింది. డిఫెండింగ్ చాంపియన్ చెన్నై సూపర్ కింగ్స్ను మట్టికరిపించి ఉప్పల్లో జయభేరి మోగించింది. హోం గ్రౌండ్లో వరుసగా రెండో మ్యాచ్ గెలిచి పాయింట్ల పట్టికలో ఐదో స్థానానికి చేరుకుంది. హైదరాబాద్లో శుక్రవారం జరిగిన మ్యాచ్లో టాస్ గెలిచి తొలుత బౌలింగ్ చేసిన రైజర్స్.. సీఎస్కేను 165 పరుగులకు కట్టడి చేసింది. అనంతరం లక్ష్య ఛేదనకు దిగి పదకొండు బంతులు మిగిలి ఉండగానే పని పూర్తి చేసింది. ఆరు వికెట్ల తేడాతో సీఎస్కేపై విజయం సాధించింది. Joy for the Orange Army 🧡 as they register their second home win of the season 👌👌@SunRisers climb to number 5⃣ on the Points Table 😎 Scorecard ▶️ https://t.co/O4Q3bQNgUP#TATAIPL | #SRHvCSK pic.twitter.com/QWS4n2Ih8D — IndianPremierLeague (@IPL) April 5, 2024 ఇక ఈ మ్యాచ్ సందర్భంగా ఓ ఆసక్తికర ఘటన చోటు చేసుకుంది. ఉప్పల్ పిచ్పై పరుగులు రాబట్టేందుకు సీఎస్కే బ్యాటర్లు కష్టపడుతున్న వేళ ఆల్రౌండర్ రవీంద్ర జడేజా వేగంగా ఆడే ప్రయత్నం చేశాడు. మొత్తంగా 23 బంతులు ఎదుర్కొని 4 ఫోర్ల సాయంతో 31 పరుగులతో ఆఖరి వరకు అజేయంగా నిలిచాడు. నిజానికి 19వ ఓవర్ నాలుగో బంతికే జడ్డూ అవుట్ కావాల్సింది. సన్రైజర్స్ పేసర్ భువనేశ్వర్ కుమార్ బౌలింగ్లో షాట్కు యత్నించిన జడేజా విఫలమయ్యాడు. పరుగు కోసం క్రీజును వీడిన జడ్డూ.. భువీ చేతికి బంతి చిక్కడాన్ని గమనించి వెనక్కి వెళ్లే ప్రయత్నం చేశాడు. ఈ క్రమంలో రనౌట్ కాకుండా.. ఉద్దేశపూర్వకంగానే బంతికి అడ్డుతగిలినట్లు కనిపించింది. విషయాన్ని గమనించిన సన్రైజర్స్ వికెట్ కీపర్ హెన్రిచ్ క్లాసెన్ నిబంధనల ప్రకారం.. ‘‘అబ్స్ట్రకింగ్ ది ఫీల్డ్’’కు సిగ్నల్ ఇచ్చాడు. అంపైర్లు సైతం ఈ విషయం గురించి స్పష్టత కోసం థర్డ్ అంపైర్ను సంప్రదించేందుకు సిద్ధమయ్యారు. అయితే, అనూహ్యంగా సన్రైజర్స్ కెప్టెన్ ప్యాట్ కమిన్స్ జడేజా విషయంలో అప్పీలును వెనక్కి తీసుకున్నాడు. ఫలితంగా లైఫ్ పొందిన జడ్డూ ఆఖరి వరకు నాటౌట్గా నిలిచాడు. Obstructing or not? 🤔 Skipper Pat Cummins opts not to appeal 👏👏#SRHvCSK #IPLonJioCinema #TATAIPL pic.twitter.com/l85UXQEa4S — JioCinema (@JioCinema) April 5, 2024 ఈ క్రమంలో జడ్డూ ‘అబ్స్ట్రకింగ్ ది ఫీల్డ్’ వీడియో నెట్టింట వైరల్గా మారింది. ఈ నేపథ్యంలో ఆరెంజ్ ఆర్మీ ఫ్యాన్స్.. ప్యాట్ కమిన్స్ క్రీడాస్ఫూర్తి ప్రదర్శించాడంటూ ప్రశంసిస్తున్నారు. అయితే, మరికొంత మంది నెటిజన్లు మాత్రం ధోని ముందుగా బ్యాటింగ్కు రావడాన్ని అడ్డుకునేందుకే కమిన్స్.. జడ్డూ విషయంలో అప్పీలు వెనక్కి తీసుకున్నాడని అభిప్రాయపడుతున్నారు. అబ్స్ట్రకింగ్ ది ఫీల్డ్? ఫీల్డింగ్ చేస్తున్న జట్టుకు తన మాటలు లేదంటే చర్యల ద్వారా ఒక బ్యాటర్ ఉద్దేశపూర్వకంగా అడ్డుతగిలితే.. అబ్స్ట్రకింగ్ ది ఫీల్డ్ నిబంధన కింద అతడిని అవుట్గా ప్రకటిస్తారు. var request = 'https://www.sakshi.com/knowwidget/kwstr_7552012696.json'; $.ajaxPrefilter( function (request) { if (request.crossDomain && jQuery.support.cors) { var http = (window.location.protocol === 'http:' ? 'http:' : 'https:'); request.url = http + '//cors-anywhere.herokuapp.com/' + request.url; } }); $.get( request,function (response){ if(response == ''){ $('#frameId').hide(); }else{ $('#frameId').show(); } }); -
విధ్వంసకర వీరుడు.. ఐపీఎల్ చరిత్రలోనే రెండో ఆల్రౌండర్గా!
వెస్టిండీస్ ఆల్రౌండర్, కోల్కతా నైట్ రైడర్స్ స్టార్ ఆండ్రీ రసెల్ చరిత్ర సృష్టించాడు. రాయల్ చాలెంజర్స్ బెంగళూరుతో మ్యాచ్ సందర్భంగా ఐపీఎల్లో అరుదైన ఘనత సాధించాడు. ఆర్సీబీతో శుక్రవారం జరిగిన మ్యాచ్లో రసెల్ రెండు వికెట్లు తీశాడు. నాలుగు ఓవర్ల బౌలింగ్ కోటా పూర్తి చేసిన ఈ పేస్ ఆల్రౌండర్.. 40 పరుగులు ఇచ్చి.. కామెరాన్ గ్రీన్(33), రజత్ పాటిదార్(3) వికెట్లు దక్కించుకున్నాడు. ఇక లక్ష్య ఛేదనలో ఈ హార్డ్ హిట్టర్కు బ్యాటింగ్ చేసే అవకాశమే రాకుండా చేశారు కేకేఆర్ బ్యాటర్లు. ధనాధన్ ఇన్నింగ్స్తో 16.5 ఓవర్లలోనే టార్గెట్ను పూర్తి చేసి ఏడు వికెట్ల తేడాతో ఆర్సీబీపై కోల్కతా విజయానికి కారణమయ్యారు. ఇదిలా ఉంటే.. ఈ మ్యాచ్లో రెండు వికెట్లు తీసిన ఆండ్రీ రసెల్ ఐపీఎల్లో సరికొత్త ఫీట్ నమోదు చేశాడు. 𝐃𝐊 🤝𝐕𝐊 The @RCBTweets batters flourish with high octane maximums💥 Watch the match LIVE on @JioCinema and @StarSportsIndia 💻📱 Match Updates ▶️ https://t.co/CJLmcs7aNa #TATAIPL | #RCBvKKR pic.twitter.com/t112XqH29R — IndianPremierLeague (@IPL) March 29, 2024 లీగ్ చరిత్రలో 2 వేల పరుగులు పూర్తి చేసుకోవడంతో పాటు కనీసం వంద వికెట్లు తీసిన రెండో ఆల్రౌండర్గా చరిత్రకెక్కాడు. ఈ జాబితాలో చెన్నై సూపర్ కింగ్స్ స్పిన్ ఆల్రౌండర్, టీమిండియా స్టార్ రవీంద్ర జడేజా మొదటి స్థానంలో ఉన్నాడు. జడ్డూ ఇప్పటి వరకు 228 ఐపీఎల్ మ్యాచ్లలో కలిపి 2724 పరుగులు సాధించడంతో పాటు.. 152 వికెట్లు తీశాడు. ఇక రైటార్మ్ పేస్ బౌలర్ అయిన రసెల్ 114 మ్యాచ్లలో 2326 రన్స్ పూర్తి చేసుకుని 100 వికెట్లు తన ఖాతాలో వేసుకున్నాడు. కాగా 2012లో ఢిల్లీ డేర్డెవిల్స్(ప్రస్తుతం ఢిల్లీ క్యాపిటల్స్) తరఫున రసెల్ క్యాష్ రిచ్ లీగ్లో అరంగేట్రం చేశాడు. ఆ తర్వాత రెండేళ్లకు కేకేఆర్ శిబిరంలో చేరిన అతడు పదేళ్లుగా అదే ఫ్రాంఛైజీతో కొనసాగుతున్నాడు. ఇక ఐపీఎల్-2024లో కేకేఆర్ ఆరంభ మ్యాచ్లో సన్రైజర్స్ హైదరాబాద్తో తలపడిన విషయం తెలిసిందే. ఈ మ్యాచ్లో రసెల్ ఎనిమిదో స్థానంలో బ్యాటింగ్కు వచ్చి 25 బంతుల్లోనే 3 ఫోర్లు, 7 సిక్సర్ల సాయంతో 64 పరుగులు సాధించాడు. ఆఖరి వరకు అజేయంగా నిలిచి జట్టును గెలిపించాడు. ఆ మ్యాచ్లో రసెల్ రెండు వికెట్లు తీశాడు కూడా! నరైన్ @ 500 వెస్టిండీస్ ఆఫ్స్పిన్నర్ సునీల్ నరైన్ టి20 క్రికెట్లో అరుదైన మైలురాయిని అందుకున్నాడు. ఆర్సీబీతో మ్యాచ్తో అతను ఈ ఫార్మాట్లో అతను 500 మ్యాచ్లు పూర్తి చేసుకున్నాడు. ఈ ఘనత సాధించిన 4వ ఆటగాడిగా అతను నిలిచాడు. నరైన్కు ముందు పొలార్డ్ (660), డ్వేన్ బ్రేవో (573), షోయబ్ మలిక్ (542) అతనికంటే ముందు 500 మ్యాచ్లు ఆడారు. 35 ఏళ్ల నరైన్ ఈ సుదీర్ఘ కెరీర్లో ఏకంగా 17 టి20 జట్లకు ప్రాతినిధ్యం వహించి 537 వికెట్లు పడగొట్టాడు. వరల్డ్ కప్ సహా మొత్తం 10 టైటిల్స్ విజయాల్లో అతను భాగంగా ఉన్నాడు. ఐపీఎల్లో 2012నుంచి వరుసగా 13 సీజన్లుగా కోల్కతా నైట్రైడర్స్ తరఫున 164 మ్యాచ్లు ఆడాడు. బ్యాటింగ్లో కూడా ఓపెనర్గా, పించ్ హిట్టర్గా బరిలోకి దిగి కేకేఆర్ పలు విజయాల్లో అతను కీలక పాత్ర పోషించాడు. చదవండి: వాళ్లిద్దరికి ఆస్కార్ ఇవ్వాలి: టీమిండియా దిగ్గజం షాకింగ్ కామెంట్ -
కోహ్లిని ‘బెదిరించిన’ జడ్డూ.. ఆర్సీబీ స్టార్ రియాక్షన్ అదుర్స్!
ఐపీఎల్-2024 ఆరంభ మ్యాచ్ సందర్భంగా ఆసక్తికర ఘటన చోటుచేసుకుంది. చెన్నై సూపర్ కింగ్స్ ఆల్రౌండర్ రవీంద్ర జడేజా, రాయల్ చాలెంజర్స్ బెంగళూరు బ్యాటర్ విరాట్ కోహ్లి పరస్పరం టీజ్ చేసుకోవడం హైలైట్గా నిలిచింది. చెన్నైలోని చెపాక్ వేదికగా సీఎస్కే- ఆర్సీబీ మధ్య మ్యాచ్తో ఐపీఎల్ పదిహేడో ఎడిషన్కు తెరలేచిన విషయం తెలిసిందే. సొంతమైదానంలో బెంగళూరుపై ఆధిపత్యం చాటుకుంటూ డిఫెండింగ్ చాంపియన్ చెన్నై ఆరు వికెట్ల తేడాతో గెలుపొందింది. విజయంతో సీజన్ను ఆరంభించింది. ఇదిలా ఉంటే.. ఆర్సీబీతో మ్యాచ్ సందర్భంగా బౌలింగ్ చేసే క్రమంలో రవీంద్ర జడేజా కోహ్లిని ఆటపట్టించాడు. ఆర్సీబీ ఇన్నింగ్స్లో పదకొండో ఓవర్లో జడ్డూ.. కామెరాన్ గ్రీన్ను తన బౌలింగ్తో బెంబేలెత్తించాడు. అదే సమయంలో నాన్స్ట్రైకర్ ఎండ్లో ఉన్న కోహ్లి వద్దకు వెళ్లి.. బాల్ అతడి ముఖానికి దగ్గరగా తీసుకువెళ్లి రనౌట్ చేస్తానంటూ సరదాగా బెదిరించాడు. వెంటనే పొజిషన్లోకి వచ్చిన కోహ్లి.. ‘‘పాపం.. అతడిని కాస్త ఊపిరి పీల్చుకోనివ్వు’’ అంటూ కామెరాన్ గ్రీన్ను మరీ ఎక్కువ ఇబ్బంది పెట్టకు అంటూ జడ్డూకు బదులిచ్చాడు. వీరిద్దరి మధ్య జరిగిన ఈ సరదా సంఘటన అభిమానులను ఆకర్షిస్తోంది. కాగా అండర్-19 స్థాయి నుంచే కోహ్లి- జడ్డూ మధ్య స్నేహం ఉంది. ఇదిలా ఉంటే ఈ మ్యాచ్లో ఆర్సీబీ స్టార్ కోహ్లి 21 పరుగులకే పరిమితం కాగా.. సీఎస్కే కీలక ఆల్రౌండర్ జడేజా పొదుపుగా బౌలింగ్ చేయడంతో పాటు 25 పరుగులతో ఆఖరి వరకు అజేయంగా నిలిచి జట్టును గెలిపించాడు. చదవండి: #Kohli: ఇలాంటి ప్రవర్తన అస్సలు ఊహించలేదు.. నీకిది తగునా కోహ్లి? Shining on #CSK Debut ✨ Home Support 💛 Finishing touch 💪 Summing up @ChennaiIPL's opening win of the season with Shivam Dube & Debutant Rachin Ravindra 👌👌 - By @RajalArora #TATAIPL | #CSKvRCB pic.twitter.com/r65i4T0zb9 — IndianPremierLeague (@IPL) March 23, 2024 -
జడేజా స్పిన్ మయాజాలం.. 353 పరుగులకు ఇంగ్లండ్ ఆలౌట్
రాంఛీ వేదికగా భారత్తో జరుగుతున్న నాలుగో టెస్టులో ఇంగ్లండ్ తొలి ఇన్నింగ్స్ ముగిసింది. మొదటి ఇన్నింగ్స్లో ఇంగ్లీష్ జట్టు 353 పరుగులకు ఆలౌటైంది. 302/7 ఓవర్ నైట్ స్కోర్తో రెండో రోజు ఆటను ప్రారంభించిన స్టోక్స్ సేన అదనంగా 51 పరుగులు చేసి ఆలౌటైంది. భారత ఆల్ రౌండర్ రవీంద్ర జడేజా స్పిన్ మయాజాలంలో ఇంగ్లండ్ బ్యాటర్లు చిక్కుకున్నారు. ఆఖరి మూడు వికెట్లను కూడా జడ్డూనే పడగొట్టాడు. ఇంగ్లండ్ బ్యాటర్లలో జో రూట్(122 నాటౌట్) అద్భుత శతకంతో చెలరేగగా.. బెన్ ఫోక్స్(47), ఓలీ రాబిన్సన్(58) పరుగులతో రాణించారు. ఇక భారత బౌలర్లలో రవీంద్ర జడేజా 4 వికెట్లు పడగొట్టగా.. ఆకాష్ దీప్ 3, సిరాజ్ 2, అశ్విన్ ఒక్క వికెట్ సాధించారు. -
అరె బాబు.. నన్నేం చూస్తున్నావు.. రోహిత్ శర్మ ఆగ్రహం
India vs England, 4th Test: టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ మైదానంలో ఎంత కూల్గా ఉంటాడో.. తేడా వస్తే అంతే సీరియస్ అవుతాడు. కీలక సమయంలో ఆటగాళ్లు సరైన రీతిలో ఆడకపోతే ఫీల్డ్లోనే వాళ్లపై గట్టిగా అరవడానికి కూడా వెనుకాడడు హిట్మ్యాన్. ఇంగ్లండ్తో నాలుగో టెస్టు సందర్భంగా ఈ విషయం మరోసారి నిరూపితమైంది. రాంచి వేదికగా శుక్రవారం మొదలైన మ్యాచ్లో భారత పేసర్ మహ్మద్ సిరాజ్ తొలుత రోహిత్ శర్మ ఆగ్రహాన్ని చవిచూశాడు. ఓవైపు అరంగేట్ర పేసర్ ఆకాశ్ దీప్ చక్కగా వికెట్లు తీస్తుంటే.. సిరాజ్ మాత్రం అనుభవలేమి బౌలర్లా పేలవ ప్రదర్శన కనబరిచాడు. తొలి సెషన్లో భాగంగా వేసిన తొలి ఆరు ఓవర్లలోనే ఏకంగా 43 పరుగులు సమర్పించుకున్నాడు. దీంతో కెప్టెన్ సాబ్కు కోపమొచ్చింది. ఇక శుక్రవారం నాటి మ్యాచ్లో సిరాజ్ తర్వాత.. అదే స్థాయిలో రోహిత్ ఆగ్రహానికి గురైంది ఎవరైనా ఉన్నారంటే కెమెరామెన్. అవునండీ.. గంభీర వాతావరణం నెలకొని ఉన్న తరుణంలో కెమెరామెన్ చేసిన పని వల్ల రోహిత్ తీవ్ర అసహానికి లోనయ్యాడు. ఇంగ్లండ్ ఇన్నింగ్స్ 59.3వ ఓవర్లో వికెట్ కీపర్ బ్యాటర్ బెన్ ఫోక్స్ క్రీజులో ఉన్న సమయంలో ఆల్రౌండర్ రవీంద్ర జడేజా బౌలింగ్లో అవుట్ కోసం అప్పీలు చేశారు. అయితే, ఇందుకు సంబంధించిన బాల్ ట్రాకింగ్ కాకుండా.. ఆ సమయంలో రోహిత్ శర్మ రియాక్షన్పై దృష్టి సారించిన కెమెరామెన్.. బిగ్స్క్రీన్పై రోహిత్ రూపాన్ని ప్రదర్శించాడు. దీంతో సహనం కోల్పోయిన రోహిత్.. ‘‘ఏయ్ నన్నెందుకు చూపిస్తున్నావు? ఏంటిది?’’ అంటూ అసహనం వ్యక్తం చేశాడు. ఇందుకు సంబంధించిన ఫొటో నెట్టింట వైరల్గా మారింది. మరోవైపు.. ఈ రివ్యూను టీమిండియా కోల్పోవడంతో రోహిత్ కోపం రెట్టింపైంది. కాగా శుక్రవారం నాటి తొలి రోజు ఆట ముగిసే సరికి ఇంగ్లండ్ 90 ఓవర్లలో ఏడు వికెట్ల నష్టానికి 302 పరుగులు చేసింది. జో రూట్ 106, ఓలీ రాబిన్సన్ 31 పరుగులతో క్రీజులో ఉన్నారు. భారత బౌలర్లలో ఆకాశ్ దీప్ మూడు, సిరాజ్ రెండు, అశ్విన్, జడేజా ఒక్కో వికెట్ దక్కించుకున్నారు. A reverse swing masterclass ft. Siraj 🔥 The 🇮🇳 pacer sends Tom Hartley 𝙥𝙖𝙘𝙠𝙞𝙣𝙜! 🤩#IDFCFirstBankTestSeries #BazBowled #JioCinemaSports#INDvENG pic.twitter.com/qQFpOlX0xn — JioCinema (@JioCinema) February 23, 2024 చదవండి: Ind vs Eng: ‘బజ్బాల్ కాదు’.. జో రూట్ సరికొత్త చరిత్ర! ఒకే ఒక్కడు.. Captain Rohit Sharma is a pure entertainer 😄#INDvsENG #T20WorldCuppic.twitter.com/mo9Lp9T5Wt — Ajmul Cap (@AjmulCap2) February 23, 2024 Rohit Sharma's reaction to camera man to focus on DRS not on me🤣🤣#INDvsENG #Rohitsharma #AkashDeep #Siraj #Pope #CricketTwitter #JoeRoot pic.twitter.com/Ikv2wZ68d1 — Shahid wani (@shayu9682) February 23, 2024 -
జడేజా సూపర్ డెలివరీ.. స్టోక్స్కు మైండ్ బ్లాంక్! వీడియో వైరల్
రాంఛీ వేదికగా టీమిండియాతో జరుగుతున్న నాలుగో టెస్టులో ఇంగ్లండ్ కెప్టెన్ బెన్ స్టోక్స్ విఫలమయ్యాడు. తొలి ఇన్నింగ్స్లో కేవలం 3 పరుగులు మాత్రమే చేసి స్టోక్స్ ఔటయ్యాడు. భారత స్టార్ ఆల్రౌండర్ రవీంద్ర జడేజా అద్బుతమైన బంతితో స్టోక్సీని బోల్తా కొట్టించాడు. ఇంగ్లండ్ ఇన్నింగ్స్ 25వ ఓవర్ వేసిన జడేజా తొలి బంతిని గుడ్ లెంగ్త్ డెలివరీగా సంధించాడు. ఆ బంతిని స్టోక్సీ డిఫెన్స్ ఆడటానికి ప్రయత్నించాడు. అయితే బంతి తక్కువ ఎత్తులో బౌన్స్ అయ్యి స్టోక్స్ ఫ్రంట్ప్యాడ్ను తాకింది. వెంటనే ఎల్బీకి అప్పీల్ చేయగా.. అంపైర్ సైతం అంతే వేగంగా ఔట్ అంటూ వేలు పైకెత్తాడు. స్టోక్స్ కనీసం రివ్యూ కూడా తీసుకోకుండానే మైదానాన్ని వీడాడు. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్గా మారింది. కాగా తొలి ఇన్నింగ్స్లో 40 ఓవర్లకు ఇంగ్లండ్ 5 వికెట్ల నష్టానికి 149 పరుగులు చేసింది. భారత బౌలర్లలో అరంగేట్ర పేసర్ ఆకాష్ దీప్ 3 వికెట్లు పడగొట్టి ఆరంభంలోనే ఇంగ్లండ్ను దెబ్బతీశాడు. pic.twitter.com/nNAMrv788e — Sitaraman (@Sitaraman112971) February 23, 2024 -
దూసుకుపోతున్న రవీంద్ర జడేజా
టీమిండియా ఆటగాడు రవీంద్ర జడేజాఇటీవలికాలంలో పట్టపగ్గాల్లేకుండా దూసుకుపోతున్నాడు. ముఖ్యంగా టెస్ట్ ఫార్మాట్లో ఆకాశమే హద్దుగా చెలరేగిపోతున్నాడు. బౌలర్గానే కాకుండా బ్యాటర్గానూ అదరగొడుతున్నాడు. ఇంగ్లండ్తో ముగిసిన మూడో టెస్ట్లో ఆల్రౌండ్ షోతో ఇరగదీసిన జడ్డూ భాయ్.. టీమిండియా విజయంలో కీలకపాత్ర పోషించాడు. ఈ మ్యాచ్ తొలి ఇన్నింగ్స్లో బాధ్యతాయుతమైన సెంచరీతో కదంతొక్కిన జడ్డూ.. అనంతరం బంతితో విజృంభించాడు. ఇంగ్లండ్ తొలి ఇన్నింగ్స్లో రెండు వికెట్లు పడగొట్టిన జడేజా.. సెకెండ్ ఇన్నింగ్స్లో విశ్వరూపం ప్రదర్శించి ఐదు వికెట్లు పడగొట్టాడు. జడేజా ధాటికి ఇంగ్లండ్ సెకెండ్ ఇన్నింగ్స్లో 122 పరుగులకే కుప్పకూలి 434 పరుగులు భారీ తేడాతో ఓటమిపాలైంది. ప్రస్తుతం ఇంగ్లండ్తో జరుగుతున్న ఐదు మ్యాచ్ల టెస్ట్ సిరీస్లో రెండో టెస్ట్ మిస్ అయిన జడేజా తొలి మ్యాచ్లోనూ సత్తా చాటాడు. ఆ మ్యాచ్లోనూ అతను ఆల్రౌండ్ ప్రదర్శనతో అదరగొట్టాడు. బౌలింగ్ తొలి ఇన్నింగ్స్లో 3, రెండో ఇన్నింగ్స్లో 2 వికెట్లు పడగొట్టిన జడేజా.. బ్యాటింగ్ తొలి ఇన్నింగ్స్లో 87, సెకెండ్ ఇన్నింగ్స్లో 2 పరుగులు చేశాడు. టెస్ట్ల్లో పర్ఫెక్ట్ ఆల్రౌండర్గా రాటుదేలిన జడేజా.. వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్లో అత్యుత్తమ ఆల్రౌండర్గా గుర్తింపు తెచ్చుకున్నాడు. ఇందుకు అతని గణాంకాలే సాక్ష్యం. డబ్ల్యూటీసీలో ఇప్పటివరకు 29 మ్యాచ్లు ఆడిన జడేజా బ్యాటింగ్లో 49.95 సగటున 1520 పరుగులు చేసి బౌలింగ్లో 25.08 సగటున 95 వికెట్లు పడగొట్టాడు. ఇందులో నాలుగు ఐదు వికెట్ల ఘనతలు ఉన్నాయి. ఈ టోర్నీలో జడ్డూ మూడు సెంచరీలు, 10 అర్దసెంచరీలు బాదాడు. ప్రస్తుత డబ్ల్యూటీసీ సైకిల్ (2023-25) విషయానికొస్తే.. జడేజా ఇప్పటివరకు (ఇంగ్లండ్తో మూడో టెస్ట్) 5 మ్యాచ్లు ఆడి సెంచరీ, రెండు అర్దసెంచరీల సాయంతో 299 పరుగులు చేశాడు. బౌలింగ్లో ఓ ఐదు వికెట్ల ప్రదర్శనతో 19 వికెట్లు పడగొట్టాడు. ఇదిలా ఉంటే, స్వదేశంలో ఇంగ్లండ్తో జరుగుతున్న ఐదు మ్యాచ్ల టెస్ట్ సిరీస్లో టీమిండియా 2-1 ఆధిక్యంలో కొనసాగుతున్న విషయం తెలిసిందే. ఈ సిరీస్లో ఇంగ్లండ్ తొలి మ్యాచ్లో గెలవగా.. భారత్ వరుసగా రెండు, మూడు మ్యాచ్ల్లో విజయం సాధించింది. రాంచీ వేదికగా నాలుగో టెస్ట్ మ్యాచ్ ఫిబ్రవరి 23 నుంచి ప్రారంభంకానుంది. -
నా భార్యకు అంకితం.. జడ్డూ ఎందుకిలా చేశావు?
ఇంగ్లండ్తో మూడో టెస్టులో టీమిండియా ఆల్రౌండర్ రవీంద్ర జడేజా అదరగొట్టాడు. గాయం నుంచి కోలుకుని తిరిగి వచ్చి.. సొంత మైదానం ‘రాజ్కోట్’లో రాజులా తలెత్తుకున్నాడు. భారత జట్టు గెలుపులో కీలక పాత్ర పోషించి.. ‘‘ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు’’ అందుకున్నాడు. అనంతరం అవార్డును భార్య రివాబాకు అంకితమిస్తూ ఆమెపై ప్రేమను చాటుకున్నాడు జడ్డూ. కాగా రాజ్కోట్ టెస్టుకు ముందు జడ్డూ- రివాబాపై అతడి తండ్రి అనిరుద్ సిన్హ సంచలన ఆరోపణలు చేసిన విషయం తెలిసిందే. పెళ్లైన తర్వాత రవీంద్ర పూర్తిగా మారిపోయాడని.. కోడలి వల్లే తమకు దూరమయ్యాడని ఆవేదన వ్యక్తం చేశాడు. రివాబా రాకతో కుటుంబం విఛ్చిన్నమైపోయిందని.. కనీసం తన మనవరాలిని ఒక్కసారి కూడా చూడనివ్వలేదని వాపోయాడు. తాను కష్టపడి కుమారుడిని క్రికెటర్ను చేశానని పేర్కొన్న అనిరుద్ సిన్హ.. రవీంద్ర సంపాదనపై అతడి భార్య, అత్తమామల పెత్తనం ఎక్కువైపోయిందని ఆరోపించాడు. అయితే, ఇందుకు సోషల్ మీడియా వేదికగా బదులిచ్చిన రవీంద్ర జడేజా.. తన భార్య, బీజేపీ ఎమ్మెల్యే అయిన రివాబాపై బురద జల్లేందుకే ఇలాంటి పెయిడ్ ఇంటర్వ్యూలు అని మండిపడ్డాడు. ఈ నేపథ్యంలో తాజాగా తన అవార్డును భార్యకు ఇలా అంకితమివ్వడం విశేషం. జడ్డూ ఎందుకిలా చేశావు? తద్వారా సతీమణిపై తనకున్న ప్రేమను జడ్డూ మరోసారి చాటుకున్నాడని అభిమానులు అభిప్రాయపడుతుండగా.. మరికొందరు నెటిజన్లు మాత్రం.. ‘‘జడ్డూ చేష్టలు అతడి తండ్రిని మరింత బాధపెట్టేవిగా.. రెచ్చగొట్టేవిగా ఉన్నాయి. నిజానికి అతడు క్రికెటర్గా ఎదగడంలో తండ్రి, సోదరిది కీలక పాత్ర తనే గతంలో చెప్పాడు’’ అని కామెంట్లు చేస్తున్నారు. కాగా హైదరాబాద్ టెస్టులో బ్యాటింగ్తో ఆకట్టుకున్న రవీంద్ర జడేజా గాయపడ్డాడు. ఈ క్రమంలో వైజాగ్లో రెండో మ్యాచ్కు దూరమైన అతడు.. మూడో టెస్టుతో తిరిగి వచ్చాడు. శతకం(112) బాదడంతో పాటు మొత్తంగా ఏడు వికెట్లు తీసి ఇంగ్లండ్పై టీమిండియా చారిత్రాత్మక విజయంలో భాగమయ్యాడు.