India vs West Indies
-
టీమిండియా సరికొత్త చరిత్ర.. వన్డేల్లో అత్యధిక స్కోరు
ఐర్లాండ్తో మూడో వన్డేలో భారత మహిళా క్రికెట్ జట్టు అదరగొట్టింది. ఓపెనర్లు ప్రతికా రావల్, స్మృతి మంధాన విధ్వంసానికి తోడు వికెట్ కీపర్ బ్యాటర్ రిచా ఘోష్ కూడా రాణించడంతో భారీ స్కోరు సాధించింది. నిర్ణీత యాభై ఓవర్లలో కేవలం ఐదు వికెట్లు నష్టపోయిన స్మృతి సేన ఏకంగా 435 పరుగులు సాధించింది. నాటి రికార్డు బ్రేక్తద్వారా అంతర్జాతీయ క్రికెట్లో టీమిండియా తరఫున వన్డేల్లో అత్యధిక స్కోరు(Highest ODI total) సాధించిన భారత జట్టుగా నిలిచింది. అంతకు ముందు ఈ రికార్డు భారత పురుషుల క్రికెట్ జట్టు పేరిట ఉండేది. ఇండోర్ వేదికగా 2011లో వెస్టిండీస్తో జరిగిన వన్డేలో టీమిండియా ఐదు వికెట్ల నష్టానికి 418 పరుగులు సాధించింది. తాజాగా స్మృతి సేన ఆ రికార్డును బద్దలు కొట్టి.. ఈ మేర సరికొత్త రికార్డు సృష్టించింది. అంతేకాదు మరెన్నో రికార్డులు సొంతం చేసుకుంది.ఐసీసీ చాంపియన్షిప్లో భాగంగా సొంతగడ్డపై భారత మహిళా క్రికెట్ జట్టు ఐర్లాండ్(India Women Vs Ireland Women)తో తలపడుతోంది. రెగ్యులర్ కెప్టెన్ హర్మన్ప్రీత్ కౌర్ గైర్హాజరీ నేపథ్యంలో స్టార్ ఓపెనర్ స్మృతి మంధాన తాత్కాలిక సారథిగా బాధ్యతలు నిర్వహిస్తోంది. ఇదిలా ఉంటే.. రాజ్కోట్ వేదికగా మూడు మ్యాచ్ల వన్డే సిరీస్లో భాగంగా ఇప్పటికే రెండు గెలిచిన భారత్.. సిరీస్ను 2-0తో గెలిచింది. ఈ క్రమంలో ఇరుజట్ల మధ్య బుధవారం నామమాత్రపు మూడో వన్డేలోనూ స్మృతి సేన ఆధిపత్యం కనబరిచింది. ఓపెనర్ల ధనాధన్ శతకాలుటాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ చేసిన భారత్కు ఓపెనర్లు స్మృతి, ప్రతికా రావల్(Pratika Rawal) శతక్కొట్టి అదిరిపోయే ఆరంభం అందించారు. స్మృతి 80 బంతుల్లో 12 ఫోర్లు, 7 సిక్సర్లు బాది 135 పరుగులు సాధించగా.. ప్రతికా భారీ సెంచరీతో దుమ్ములేపింది. మొత్తంగా 129 బంతులు ఎదుర్కొని ఇరవై ఫోర్లు, ఒక సిక్స్ సాయంతో ఏకంగా 154 పరుగులు రాబట్టింది.హాఫ్ సెంచరీతో మెరిసిన రిచాఇక వన్డౌన్ బ్యాటర్ రిచా ఘోష్ సైతం అర్ధ శతకంతో చెలరేగింది. 42 బంతులు ఆడిన ఈ వికెట్ కీపర్ బ్యాటర్.. 10 ఫోర్లు, ఒక సిక్సర్ సాయంతో 59 పరుగులు సాధించింది. మిగతా వాళ్లలో తేజల్ హెసాబ్నిస్(25 బంతుల్లో 28) ఫర్వాలేదనిపించగా.. హర్లీన్ డియోల్ 15 రన్స్ చేసింది. జెమీమా రోడ్రిగెస్ 4, దీప్తి శర్మ 11 పరుగులతో ఆఖరి వరకు నాటౌట్గా నిలిచారు. ఈ క్రమంలో నిర్ణీత 50 ఓవర్లలో టీమిండియా రికార్డు స్థాయిలో 435 పరుగులు స్కోరు చేసింది. ఐరిష్ బౌలర్లలో ఓర్లా ప్రెండెర్గాస్ట్కు రెండు వికెట్లు దక్కగా.. అర్లెనీ కెల్లీ, ఫ్రెయా సార్జెంట్, జార్జియానా డెంప్సీ తలా ఒక వికెట్ తమ ఖాతాలో వేసుకున్నారు.ఐర్లాండ్తో మూడో వన్డే సందర్భంగా స్మృతి సేన సాధించిన రికార్డులువుమెన్స్ వన్డే ఇన్నింగ్స్లో అత్యధిక బౌండరీలు బాదిన జట్లలో మూడో స్థానం1. న్యూజిలాండ్ వర్సెస్ ఐర్లాండ్- 2018- డబ్లిన్- 712. న్యూజిలాండ్ వర్సెస్ ఐర్లాండ్- 2018- డబ్లిన్- 593. ఇండియా వర్సెస్ ఐర్లాండ్- 2025- రాజ్కోట్- 57వుమెన్స్ వన్డేల్లో 400కిపైగా స్కోర్లు సాధించిన జట్లలో నాలుగో స్థానం1. న్యూజిలాండ్ వర్సెస్ ఐర్లాండ్- 2018- డబ్లిన్- 491/42. న్యూజిలాండ్ వర్సెస్ పాకిస్తాన్- 1997- క్రైస్ట్చర్చ్- 455/53. న్యూజిలాండ్ వర్సెస్ ఐర్లాండ్- 2018- డబ్లిన్- 440/34. ఇండియా వర్సెస్ ఐర్లాండ్- 2025- రాజ్కోట్- 435/5.చదవండి: అతడు లేకుంటే.. బోర్డర్-గావస్కర్ ట్రోఫీ మనమే గెలిచేవాళ్లం: అశ్విన్ -
వాళ్లంతా గ్రేట్.. కోచ్ చెప్పినట్లే చేశాం.. కానీ: భారత కెప్టెన్
భారత మహిళల క్రికెట్ జట్టు అద్భుత విజయం సాధించింది. వెస్టిండీస్(India Women vs West Indies Women)తో మూడో వన్డేలోనూ గెలుపొంది.. సిరీస్ను 3-0తో క్లీన్స్వీప్ చేసింది. ఈ నేపథ్యంలో భారత జట్టు కెప్టెన్ హర్మన్ప్రీత్ కౌర్ స్పందిస్తూ.. సహచర ఆటగాళ్లపై ప్రశంసలు కురిపించింది. సమిష్టి ప్రదర్శనతోనే విజయం సాధ్యమైందని పేర్కొంది.రెండు సిరీస్లు భారత్వేకాగా మూడు టీ20, మూడు వన్డేల సిరీస్లు ఆడేందుకు వెస్టిండీస్ మహిళా జట్టు భారత్ వచ్చింది. తొలుత నవీ ముంబై వేదికగా జరిగిన పొట్టి సిరీస్లో హర్మన్ సేన.. హేలీ మాథ్యూస్ బృందంపై 2-1తో నెగ్గింది. అనంతరం వడోదర వేదికగా జరిగిన వన్డే సిరీస్లో.. మరో మ్యాచ్ మిగిలి ఉండగానే సిరీస్ను కైవసం చేసుకుంది.చెలరేగిన రేణుక.. దీప్తి విశ్వరూపంఈ క్రమంలో ఇరుజట్ల మధ్య శుక్రవారం నామమాత్రపు మూడో వన్డే జరిగింది. టాస్ గెలిచిన వెస్టిండీస్ తొలుత బ్యాటింగ్ ఎంచుకుంది. అయితే, భారత బౌలర్ల ధాటికి విండీస్ బ్యాటింగ్ ఆర్డర్ కుప్పకూలింది. పేసర్ రేణుకా ఠాకూర్ సింగ్(Renuka Thakur Singh) నాలుగు వికెట్లతో చెలరేగగా.. స్పిన్నర్ దీప్తి శర్మ(Deepti Sharma) ఆరు వికెట్లతో దుమ్ములేపింది.వెస్టిండీస్ బ్యాటర్లలో వికెట్ కీపర్ షెమానే కాంప్బెల్(46), చినెల్లె హెన్రీ(61), అలియా అలెనె(21) మాత్రమే రాణించారు. మిగతా వాళ్లంతా చేతులెత్తేయడంతో వెస్టిండీస్ 38.5 ఓవర్లలో కేవలం 162 పరుగులకే ఆలౌట్ అయింది.ఆరంభంలో తడబడ్డా.. ఆ తర్వాత మెరుపు బ్యాటింగ్తో ఇక స్వల్ప లక్ష్యంతోనే బరిలోకి దిగినప్పటికీ టీమిండియాకు శుభారంభం లభించలేదు. ఫామ్లో ఉన్న ఓపెనర్ స్మృతి మంధాన 4 పరుగులకే నిష్క్రమించగా.. మరో ఓపెనర్ ప్రతికా రావల్(18) నిరాశపరిచింది. వన్డౌన్లో వచ్చిన హర్లీన్ డియోల్(1) కూడా విఫలమైంది.ఇలా టాపార్డర్ కుదేలైన వేళ.. నాలుగో స్థానంలో వచ్చిన కెప్టెన్ హర్మన్ప్రీత్ కౌర్ ధనాధన్ దంచికొట్టింది. మొత్తంగా 22 బంతులు ఎదుర్కొని 7 ఫోర్ల సాయంతో 32 పరుగులు చేసింది. అదే విధంగా.. జెమీమా రోడ్రిగ్స్(29), దీప్తి శర్మ(39 నాటౌట్) రాణించారు. ఇక ఆఖర్లో రిచా ఘోష్ మెరుపులు మెరిపించింది. కేవలం 11 బంతుల్లోనే 23 పరుగులు చేసి.. జట్టును విజయతీరాలకు చేర్చింది.𝐑𝐢𝐜𝐡𝐚 𝐆𝐡𝐨𝐬𝐡 𝐟𝐢𝐧𝐢𝐬𝐡𝐞𝐬 𝐢𝐭 𝐨𝐟𝐟 𝐢𝐧 𝐬𝐭𝐲𝐥𝐞 🔥#TeamIndia win the 3rd ODI by 5 wickets & cleansweep the series 3-0 🙌🙌Scorecard ▶️ https://t.co/3gyGzj5fNU#INDvWI | @IDFCFIRSTBank | @13richaghosh pic.twitter.com/XIAUChwJJ2— BCCI Women (@BCCIWomen) December 27, 2024 ఆ ముగ్గురూ గ్రేట్ఈ క్రమంలో 28.2 ఓవర్లలోనే టార్గెట్ ఛేదించిన భారత్.. ఐదు వికెట్ల తేడాతో జయభేరి మోగించింది. దీప్తి శర్మకు ‘ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్’, రేణుకా సింగ్కు ‘ప్లేయర్ ఆఫ్ ది సిరీస్’ అవార్డులు దక్కాయి. ఈ నేపథ్యంలో కెప్టెన్ హర్మన్ప్రీత్ కౌర్ మాట్లాడుతూ.. ‘‘రేణుక అద్బుతంగా బౌలింగ్ చేసింది. మానసికంగా మనం ఎంత బలంగా ఉన్నామో ఇలాంటి ప్రదర్శన ద్వారా తెలుస్తుంది.ఇక దీప్తి శర్మ, జెమీమా బాగా బ్యాటింగ్ చేశారు. ఆఖర్లో రిచా అద్భుతమైన ఫినిషింగ్ టచ్ ఇచ్చింది. అంతా కలిసి కట్టుగా ఉంటే.. ఇలాంటి సానుకూల ఫలితాలు వస్తాయి. జట్టులోని ప్రతి ఒక్కరికీ విజయంలో భాగం ఉంది.అయితే, ఒక్క తప్పు లేకుండా వంద శాతం ఫలితాలు కావాలని మా ఫీల్డింగ్ కోచ్ పదే పదే చెప్తారు. కానీ.. ఈరోజు ఒకటీ రెండుసార్లు మేము విఫలమయ్యాం. వచ్చే ఏడాది ఈ తప్పులను పునరావృతం కానివ్వము’’ అని పేర్కొంది.చదవండి: విశ్రాంతి కాదు.. నిర్దాక్షిణ్యంగా అతడిపై వేటు వేయండి.. అప్పుడైనా..: టీమిండియా దిగ్గజం 𝙏𝙝𝙖𝙩 𝙬𝙞𝙣𝙣𝙞𝙣𝙜 𝙛𝙚𝙚𝙡𝙞𝙣𝙜! 🤩 Captain @ImHarmanpreet receives the @IDFCFIRSTBank Trophy 🏆#TeamIndia win the ODI series 3-0 💪 pic.twitter.com/glblLcPBc7— BCCI Women (@BCCIWomen) December 27, 2024 -
భారత్తో సిరీస్.. వెస్టిండీస్ జట్టు ప్రకటన.. స్టార్ ఆల్రౌండర్ దూరం
భారత్తో పరిమిత ఓవర్ల క్రికెట్ సిరీస్లకు వెస్టిండీస్ క్రికెట్ బోర్డు తమ మహిళా జట్టును ప్రకటించింది. హేలీ మాథ్యూస్ సారథ్యంలో 15 మంది సభ్యులతో కూడిన టీమ్ వివరాలను గురువారం వెల్లడించింది. కాగా భారత్- వెస్టిండీస్ మహిళా జట్ల మధ్య మూడు టీ20, మూడు వన్డేల సిరీస్లకు షెడ్యూల్ ఖరారైంది.డిసెంబరు 15న టీ20తో మొదలునవీ ముంబై వేదికగా డిసెంబరు 15న టీ20తో మొదలుకానున్న విండీస్ ఇండియా టూర్.. డిసెంబరు 27న మూడో వన్డేతో ముగియనుంది. పొట్టి సిరీస్కు నవీ ముంబై వేదికకాగా... బరోడా వన్డే సిరీస్కు ఆతిథ్యం ఇవ్వనుంది. ఈ నేపథ్యంలో గురువారం ప్రకటించిన విండీస్ జట్టులో స్టార్ ఆల్రౌండర్ స్టెఫానీ టేలర్ పేరు మిస్ అయింది.మహిళల టీ20 ప్రపంచకప్ -2024 సందర్భంగా స్టెఫానీ మోకాలికి గాయమైంది. ఆ తర్వాత మళ్లీ ఆమె మైదానంలో దిగలేదు.ఇప్పుడు ఇండియా టూర్కు కూడా స్టెఫానీ దూరమైంది. మరోవైపు.. మాజీ కెప్టెన్ డియాండ్ర డాటిన్ దాదాపు రెండేళ్ల తర్వాత వన్డే క్రికెట్లో పునరాగమనం చేయనుంది. ఇదిలా ఉంటే.. టీ20 వరల్డ్కప్ తాజా ఎడిషన్లో విండీస్ సెమీస్ చేరగా.. భారత జట్టు లీగ్ దశలోనే వెనుదిరిగింది.భారత్తో టీ20, వన్డే సిరీస్లకు వెస్టిండీస్ మహిళా జట్టుహేలీ మాథ్యూస్ (కెప్టెన్), షెమైన్ కాంప్బెల్ (వైస్ కెప్టెన్), ఆలియా అల్లీన్, షమీలియా కాన్నెల్, నెరిస్సా క్రాఫ్టన్, డియాండ్రా డాటిన్, అఫీ ఫ్లెచర్, షబికా గజ్నాబి, చినెల్ హెన్రీ, జైదా జేమ్స్, కియానా జోసెఫ్, మాండీ మంగ్రూ, అష్మిని మునిసర్, కరిష్మా రాంహారక్, రషదా విలియమ్స్ .భారత్ వర్సెస్ వెస్టిండీస్ షెడ్యూల్టీ20 సిరీస్👉మొదటి టీ20- డిసెంబరు 15- ఆదివారం- రాత్రి ఏడు గంటలకు- నవీ ముంబై👉రెండో టీ20- డిసెంబరు 17- మంగళవారం- రాత్రి ఏడు గంటలకు- నవీ ముంబై👉మూడో టీ20- డిసెంబరు 19- గురువారం- రాత్రి ఏడు గంటలకు- నవీ ముంబైవన్డే సిరీస్👉తొలి వన్డే- డిసెంబరు 22- ఆదివారం- మధ్యాహ్నం ఒకటిన్నర గంటలకు- బరోడా👉రెండో వన్డే- డిసెంబరు 24- మంగళవారం- మధ్యాహ్నం ఒకటిన్నర గంటలకు- బరోడా👉మూడో వన్డే- డిసెంబరు 27- శుక్రవారం- ఉదయం తొమ్మిదిన్నర గంటలకు- బరోడా. -
అందుకు నువ్వే కారణమవుతావని కోహ్లితో చెప్పాను: భజ్జీ
ఆధునిక తరంలో అసాధారణ ప్రతిభతో ఉన్నత శిఖరాలకు చేరుకున్న అతికొద్ది మంది క్రికెటర్లలో విరాట్ కోహ్లి ముందు వరుసలో ఉంటాడు. అంతర్జాతీయ క్రికెట్లో సమకాలీన ఆటగాళ్లకు ఎవరికీ సాధ్యం కాని రీతిలో ఎనభై శతకాలు సాధించిన ఘనత ఈ రన్మెషీన్ సొంతం. టీమిండియా దిగ్గజం, వంద సెంచరీల ధీరుడు సచిన్ టెండుల్కర్ రికార్డును సమం చేయగల సత్తా ఉన్న ఏకైక బ్యాటర్.అయితే, కెరీర్ ఆరంభంలో అసలు తను జట్టులో స్థానం సుస్థిరం చేసుకోగలనా? లేదా అన్న సందిగ్దంలో కొట్టుమిట్టాడట కోహ్లి. భారత స్పిన్ దిగ్గజం హర్భజన్ సింగ్ ఈ విషయాన్ని వెల్లడించాడు. నిరాశలో కూరుకుపోయిన కోహ్లికి తాను చెప్పిన మాటలను తాజాగా గుర్తుచేసుకున్నాడు.తీవ్ర నిరాశకు లోనయ్యాడు‘‘కోహ్లి గురించి చెప్పాలంటే.. ముఖ్యంగా టెస్టుల్లో అతడి ప్రయాణాన్ని ముందుగా తెలుసుకోవాలి. అప్పుడు మేము వెస్టిండీస్ పర్యటనలో ఉన్నాము. ఫిడెల్ ఎడ్వర్డ్స్ తన బౌలింగ్తో కోహ్లిని చాలా ఇబ్బంది పెట్టాడు. ప్రతిసారి అతడే తన వికెట్ తీసుకున్నాడు. దీంతో కోహ్లి సహజంగానే తీవ్ర నిరాశకు లోనయ్యాడు.ఆత్మన్యూనతభావంతో కుంగిపోయాడు. అప్పుడు తను నా దగ్గరికి వచ్చి.. ‘నేను బాగానే ఆడుతున్నానా?’ అని అడిగాడు. నేను వెంటనే అందుకు బదులిస్తూ.. ‘ఒకవేళ టెస్టు క్రికెట్లో గనుక నువ్వు 10 వేల పరుగులు చేయకపోతే.. అందుకు నిన్ను నువ్వే నిందించుకోవాల్సి వస్తుంది’ అని చెప్పాను. అది కేవలం నీ తప్పే అవుతుందని చెప్పాను‘నీకు ఆ సత్తా ఉంది. అయినప్పటికీ నువ్వు ఆ మైలురాయి చేరుకోలేకపోయావంటే అందుకు కేవలం నువ్వే కారణం అవుతావు అని గుర్తుపెట్టుకొమ్మని కోహ్లితో అన్నాను’’’ అంటూ భజ్జీ నాటి జ్ఞాపకాలను నెమరువేసుకున్నాడు. ఆత్మవిశ్వాసంతో ఒక్కోమెట్టు ఎక్కుతూ కోహ్లి తారస్థాయికి చేరుకున్నాడని హర్షం వ్యక్తం చేశాడు.ప్రపంచ క్రికెట్లో తనకంటూ ప్రత్యేక గు ర్తింపుఇక ఫిట్నెస్, డైట్ విషయంలోనూ కోహ్లికి శ్రద్ధ ఎక్కువని.. అందుకే తను గుంపులో గోవిందలా కాకుండా ప్రపంచ క్రికెట్లో తనకంటూ ప్రత్యేక గుర్తింపు సాధించాడని భజ్జీ తెలిపాడు. కోహ్లి చాలా మొండివాడని.. అనుకున్న పని పూర్తి చేసేంతవరకు పట్టువదలడని పేర్కొన్నాడు. భారత క్రికెట్పై కోహ్లి చెరగని ముద్ర వేశాడంటూ భజ్జీ ప్రశంసలు కురిపించాడు. తరువార్ కోహ్లి పాడ్కాస్ట్లో మాట్లాడుతూ ఈ మేరకు వ్యాఖ్యలు చేశాడు. కాగా 2011లో వెస్టిండీస్తో మ్యాచ్ ద్వారా కోహ్లి టెస్టుల్లో అడుగుపెట్టాడు. రెండు ఇన్నింగ్స్లో కలిపి కేవలం 19 పరుగులే చేసి నిరాశపరిచాడు. అయితే, ఆ తర్వాత అంచెలంచెలుగా ఎదిగిన కోహ్లి ప్రస్తుతం 8848 పరుగులతో కొనసాగుతున్నాడు. ఇందులో 29 సెంచరీలు ఉన్నాయి.చదవండి: Pak vs Ban: ఆలస్యమైతే అవుటే!.. భయంతో పాక్ క్రికెటర్ పరుగులు -
అతడు కెప్టెన్ నమ్మకాన్ని కోల్పోయాడు.. అందుకే ఇలా!
టీమిండియాలోకి ఎంత ‘వేగం’గా దూసుకువచ్చాడో.. అంతే త్వరగా జట్టుకు దూరమయ్యాడు కశ్మీర్ ఎక్స్ప్రెస్ ఉమ్రాన్ మాలిక్. ఐపీఎల్లో సన్రైజర్స్ హైదరాబాద్ నెట్ బౌలర్గా ఎంట్రీ ఇచ్చిన ఈ పేసర్.. ఆ తర్వాత జట్టులో కీలక సభ్యుడిగా ఎదిగాడు.అత్యంత వేగంగా బంతులు విసురుతూ టీమిండియా సెలక్టర్ల దృష్టిని ఆకర్షించిన ఉమ్రాన్ మాలిక్.. 2022లో అంతర్జాతీయ క్రికెట్లో అరంగేట్రం చేశాడు. ఐర్లాండ్ పర్యటనలో భాగంగా టీ20లలో ఎంట్రీ ఇచ్చాడు.అనంతరం వన్డేల్లోనూ అడుగుపెట్టాడు ఈ స్పీడ్గన్. అయితే, నిలకడలేమి ప్రదర్శన కారణంగా మేనేజ్మెంట్ నమ్మకం పోగొట్టుకున్న ఉమ్రాన్ మాలిక్.. ఏడాది కాలంగా జట్టుకు దూరమయ్యాడు. చివరగా గతేడాది వెస్టిండీస్తో వన్డే మ్యాచ్లో ఆడాడు.ఈ నేపథ్యంలో టీమిండియా బౌలింగ్ మాజీ కోచ్ పారస్ మాంబ్రే ఉమ్రాన్ మాలిక్ గురించి కీలక వ్యాఖ్యలు చేశాడు. అతడు కెప్టెన్ నమ్మకాన్ని పోగొట్టుకున్నాడని.. అందుకే జట్టుకు దూరమైపోయాడని పేర్కొన్నాడు.కెప్టెన్ నమ్మకాన్ని కోల్పోయాడు‘‘మనలోని ప్రతిభకు ఎప్పటికప్పుడు మెరుగులు దిద్దుకోవాలి. ఓ బౌలర్ ఎక్స్ప్రెస్ పేస్ కలిగి ఉండటం అరుదైన అంశం. అతడి శక్తిసామర్థ్యాలకు నిదర్శనం.అతడు గంటకు 145- 148 కిలోమీటర్ల వేగంతో బౌలింగ్ చేసినపుడు.. అంతకంటే వేగంగా బంతులు విసరగలడని భావించాం. కానీ అలా జరుగలేదు.కానీ తన బౌలింగ్లోని పేస్ మాత్రమే తన బలం. అంతేగానీ బౌల్ చేసేటపుడు లైన్ అండ్ లెంగ్త్ విషయంలో జాగ్రత్త అవసరం. ముఖ్యంగా టీ20లలో పూర్తి కంట్రోల్ ఉండాలి.అందులో విఫలమైతే కచ్చితంగా కష్టాలు మొదలవుతాయి. బ్యాటర్ బాల్ను బాదుతూ ఉంటే.. చూస్తూ ఉండటం తప్ప ఏమీ చేయలేం. అలాంటపుడు కెప్టెన్ నమ్మకాన్ని కోల్పోవడం ఖాయం.రంజీలు ఆడమని పంపించాంఅతడికి బౌలింగ్పై పూర్తి నియంత్రణ రావాలనే ఉద్దేశంతోనే రంజీలు ఆడమని పంపించాం. తీవ్రమైన ఒత్తిడి నెలకొన్న సమయంలోనూ కచ్చితంగా నైపుణ్యాలు ప్రదర్శించగలగాలి’’ అని పారస్ మాంబ్రే ఇండియన్ ఎక్స్ప్రెస్తో వ్యాఖ్యానించాడు.కాగా ఉమ్రాన్ మాలిక్ టీమిండియా తరఫున ఇప్పటి వరకు ఎనిమిది టీ20లు, పది వన్డేలు ఆడి.. ఆయా ఫార్మాట్లలో 13, 11 వికెట్లు తీశాడు. -
నేను 22 ఏళ్లు ఎదురుచూశా.. నువ్వు ఆ మాత్రం వెయిట్ చేయలేవా?
సచిన్ టెండుల్కర్.. ఇరవై నాలుగేళ్ల సుదీర్ఘ కెరీర్లో అరుదైన ఘనతలెన్నో సాధించి క్రికెట్ దేవుడిగా నేటికీ నీరాజనాలు అందుకుంటున్నాడు. నభూతో న భవిష్యతి అన్న రీతిలో అంతర్జాతీయ క్రికెట్లో ఏకంగా వంద సెంచరీలు సాధించి శిఖరాగ్రాన నిలిచాడు. అయితే, సచిన్ వ్యక్తిగతంగా లెక్కకు మిక్కిలి రికార్డులు కొల్లగొట్టినా ఒక్కటంటే ఒక్క వరల్డ్కప్ ట్రోఫీని ముద్దాడటానికి 22 ఏళ్లు నిరీక్షించాల్సి వచ్చింది. తాను భాగమైన భారత జట్టు 2011లో వన్డే ప్రపంచకప్ గెలవడంతో సచిన్ టెండుల్కర్ చిరకాల కల నెరవేరింది. ఈ విషయాన్ని ప్రస్తావిస్తూ సచిన్ టెండుల్కర్ అప్పట్లో తనలో స్ఫూర్తిని నింపాడంటూ తాజాగా గుర్తుచేసుకున్నాడు.. నాటి అరంగేట్ర, ‘యువ’ బౌలర్. ‘‘ఆరోజు మేము వాంఖడే స్టేడియంలో మ్యాచ్ ఆడుతున్నాం. వికెట్ ఫ్లాట్గా ఉంది. వెస్టిండీస్ స్కోరు అప్పటి బహుశా 500/4 అనుకుంటా. నాలో.. వికెట్ తీయలేకపోతున్నాననే అసహనం పెరిగిపోతోంది. అప్పటికి నా వయసు 21 ఏళ్లు. ఇరవై ఒక్క ఓవర్ల పాటు వికెట్ తీయలేకపోవడం అదే మొదటిసారి. ఆ సమయంలో సచిన్ టెండుల్కర్ మిడాఫ్లో తన ఫీల్డింగ్ పొజిషన్లో నిలబడి ఉన్నాడు. నన్ను చూసి... ‘ఏమైంది అలా ఉన్నావు? ఎందుకంత నిరాశ?’ అని అడిగాడు. అందుకు బదులిస్తూ.. ‘పాజజీ.. నా బౌలింగ్లో ఇప్పటివరకు 21 ఓవర్లు అయినా వికెట్ తీయకపోవడం ఇదే తొలిసారి తెలుసా?.. అలాంటిది అరంగేట్రంలో ఇలా జరుగుతుందని అనుకోలేదు’ అని వాపోయాను. అప్పుడు వెంటనే.. ఓవర్ మధ్యలోనే.. నన్ను తన దగ్గరికి రమ్మని పిలిచి.. ‘నీకు తెలుసా.. నేను తొలి వరల్డ్కప్ అందుకోవడానికి 22 ఏళ్ల పాటు ఎదురుచూశాను. మరి నువ్వు నీ తొలి వికెట్ కోసం కనీసం 21 ఓవర్లపాటు వెయిట్ చేయలేవా? అంతగా నిరాశపడొద్దు. గతంలో ఏం జరిగిందన్నది అప్రస్తుతం. ఇప్పుడు ఏం చేయగలవో ఆలోచించు’ అన్నాడు. అవును.. కదా పాజీ చెప్పింది నిజమే కదా అనిపించింది. ఆ మరుసటి బంతికే నేను డారెన్ బ్రావో(166)ను అవుట్ చేసి తొలి వికెట్ అందుకున్నా. ఆ తర్వాత కార్ల్టన్, డారెన్ సామీ వికెట్లు తీశాను. నా అరంగేట్రం అలా ప్రత్యేకంగా మారిపోయింది’’ అని హర్షం వ్యక్తం చేశాడు. ఈ మేరకు.. బీసీసీఐ ఇంటర్వ్యూలో తన మనసులోని భావాలు పంచుకుంటూ.. మన ఆలోచనా విధానాన్ని, అంతకు ముందున్న పరిస్థితులను మార్చడానికి ఒక్క మాట చాలని తనకు ఆరోజు తెలిసిందన్నాడు. సచిన్ టెండుల్కర్ చెప్పిన ఆ స్పూర్తిదాయక మాటలు ఎప్పటికీ గుర్తుపెట్టుకుంటానని పేర్కొన్నాడు. ఇంతకీ ఆ బౌలర్ పేరు చెప్పలేదు కదూ! వరుణ్ ఆరోన్.. జంషెడ్పూర్కు చెందిన 34 ఏళ్ల రైటార్మ్ పేసర్. 2011లో టీమిండియా తరఫున అంతర్జాతీయ క్రికెట్లో అడుగుపెట్టాడు. 9 టెస్టులు, 9 వన్డేలు ఆడి.. ఆయా ఫార్మాట్లలో 18, 11 వికెట్లు తీశాడు. చదవండి: IPL 2024: అరంగేట్రంలో అదరగొట్టేందుకు!.. అందరి కళ్లు అతడిపైనే.. -
వరల్డ్కప్ జట్టులో ఉంటాడనుకుంటే.. కనీసం ఆ జట్టులో కూడా పనికిరాడా?!
It seemed like he could be in the World Cup team: టీమిండియా సెలక్టర్ల నిర్ణయాలను అర్థం చేసుకోవడం కష్టమని భారత మాజీ క్రికెటర్ ఆకాశ్ చోప్రా అన్నాడు. ప్రపంచకప్-2024 జట్టులో ఉంటాడనుకున్న ఆటగాడిని అకస్మాత్తుగా ఎందుకు పక్కనపెట్టారని ప్రశ్నించాడు. ఒకప్పుడు ప్రతి సిరీస్కు ఎంపికైన ఆ ప్లేయర్కు ఇప్పుడు కనీసం భారత్-‘ఏ’ జట్టులో కూడా చోటు దక్కకపోవడం ఏమిటని వాపోయాడు. నెట్బౌలర్ నుంచి టీమిండియా స్థాయికి ఐపీఎల్ ద్వారా వెలుగులోకి వచ్చిన ప్రతిభావంతుల్లో జమ్మూ కశ్మీర్ ఎక్స్ప్రెస్ ఉమ్రాన్ మాలిక్ ఒకడు. సన్రైజర్స్ హైదరాబాద్ జట్టులో నెట్ బౌలర్గా మొదలైన అతడి ప్రయాణం.. టీమిండియాకు ఎంపిక అయ్యే స్థాయికి చేరుకుంది. ఐర్లాండ్ పర్యటనలో భాగంగా 2022లో భారత్ తరఫున అంతర్జాతీయ క్రికెట్లో అడుగుపెట్టాడు ఈ రైటార్మ్ ఫాస్ట్బౌలర్. అదే ఏడాది వన్డేల్లోనూ ఎంట్రీ ఇచ్చాడు. తన పదునైన, వేగవంతమైన డెలివరీలతో బ్యాటర్లను తిప్పలు పెట్టడంలో ఉమ్రాన్ మాలిక్ దిట్ట. ఈ క్రమంలో టీమిండియా టీ20 జట్టులో కీలక సభ్యుల్లో ఒకడిగా మారాడు ఈ ఫాస్ట్బౌలర్. అయితే, ఐపీఎల్-2023లో పేలవ ప్రదర్శన తర్వాత ఒక్కసారిగా ఉమ్రాన్ మాలిక్ రాత తలకిందులైంది. వాళ్లిద్దరికి మాత్రం ఛాన్స్లు ఫామ్లేమితో సతమతమవుతున్న అతడికి వెస్టిండీస్ టూర్ రూపంలో టీమిండియా మేనేజ్మెంట్ అవకాశం ఇచ్చినా దానిని సద్వినియోగం చేసుకోలేకపోయాడు. కరేబియన్ దీవుల్లో ఆడిన రెండు వన్డేల్లో ధారాళంగా పరుగులు ఇచ్చుకుని జట్టులో తన స్థానాన్ని ప్రశ్నార్థకంగా మార్చుకున్నాడు ఉమ్రాన్. అయితే, ఉమ్రాన్ మాలిక్ మాదిరే అర్ష్దీప్ సింగ్, అవేశ్ ఖాన్లు కూడా వైఫల్యం చెందినా బీసీసీఐ సెలక్టర్లు వారికి అవకాశాలు ఇస్తున్నారు. తాజాగా అఫ్గనిస్తాన్తో టీ20 సిరీస్కు ఎంపిక చేసిన జట్టులోనూ ఉమ్రాన్కు స్థానం దక్కకపోగా.. వీరిద్దరు మాత్రం చోటు దక్కించుకోవడం విశేషం. మొన్నటిదాకా ఎక్కడ చూసినా అతడే ఈ నేపథ్యంలో కామెంటేటర్ ఆకాశ్ చోప్రా మాట్లాడుతూ... ‘‘కొంతకాలం క్రితం ఎక్కడ చూసినా ఉమ్రాన్ మాలికే కనబడ్డాడు. అతడిని వెస్టిండీస్ పర్యటనకు తీసుకువెళ్లారు. ఒకానొక సందర్భంలో అతడు వరల్డ్కప్ జట్టులో చోటు దక్కించుకోవడం ఖాయమని అందరూ భావించారు. కానీ.. ఇటీవల వరుస సిరీస్లలో అతడికి మొండిచేయే చూపారు. కనీసం ఇండియా-ఏ జట్టుకు కూడా అతడిని ఎంపిక చేయలేదు. మూడు నెలల కాలంలోనే అంత పెద్ద మార్పులేం జరిగిపోయాయి. టీమిండియాలో అడుగుపెట్టి.. కొన్ని అవకాశాలు అందిపుచ్చుకున్న తర్వాత.. అకస్మాత్తుగా అతడు కనిపించకుండా పోయాడు. అసలు ఉమ్రాన్ మాలిక్ ఎక్కడున్నాడో కూడా ఎవరికీ తెలియడం లేదు. ఇలా ఎందుకు జరుగుతోంది? అతడి విషయంలో అసలు ఏం జరుగుతోంది? ఎందుకు ఇలా జరుగుతోంది అన్న విషయాలను మనం తెలుసుకోవాలి’’ అని పేర్కొన్నాడు. ఉమ్రాన్ మాలిక్కు తగినన్ని అవకాశాలు ఇవ్వాలని ఆకాశ్ చోప్రా ఈ సందర్భంగా మేనేజ్మెంట్కు సూచించాడు. కాగా గతేడాది ఫిబ్రవరిలో న్యూజిలాండ్తో టీ20లో ఉమ్రాన్ మాలిక్ తన అత్యుత్తమ గణాంకాలు (2/9- 2.1 ఓవర్లలో) నమోదు చేశాడు. మొత్తంగా తన అంతర్జాతీయ కెరీర్లో ఇప్పటి వరకు ఆడిన 10 వన్డేల్లో 13, 8 టీ20లలో 11 వికెట్లు తీశాడు ఉమ్రాన్ మాలిక్. చదవండి: Ind Vs Afg: అఫ్గన్తో టీమిండియా సిరీస్: షెడ్యూల్, జట్లు, లైవ్ స్ట్రీమింగ్.. పూర్తి వివరాలు -
IPL 2023: నేనొక ఇడియట్.. సెంచరీ తర్వాత అలా మాట్లాడినందుకు: బ్రూక్
IPL 2023- SRH- Harry Brook: భారత క్రికెట్ అభిమానుల గురించి తాను అలా మాట్లాడకపోవాల్సిందంటూ ఇంగ్లండ్ యువ బ్యాటర్ హ్యారీ బ్రూక్ పశ్చాత్తాపం వ్యక్తం చేశాడు. ఐపీఎల్-2023లో సెంచరీ చేసిన సందర్భంగా తాను చేసిన వ్యాఖ్యల వల్ల మనశ్శాంతి లేకుండా పోయిందని గత జ్ఞాపకాలు గుర్తు చేసుకున్నాడు. ఏదేమైనా సోషల్ మీడియాకు కొంతకాలం దూరంగా ఉన్న తర్వాతే తన మానసిక స్థితి మెరుగుపడిందని చెప్పుకొచ్చాడు. కాగా ఐపీఎల్-2022 వేలంలో సన్రైజర్స్ హైదరాబాద్ ఫ్రాంఛైజీ 13.25 కోట్ల రూపాయాల భారీ మొత్తానికి హ్యారీ బ్రూక్ను కొనుగోలు చేసిన విషయం తెలిసిందే. అయితే, 24 ఏళ్ల ఈ మిడిలార్డర్ బ్యాటర్ పెద్దగా ప్రభావం చూపలేకపోయాడు. నోళ్లు మూయించానంటూ ఘాటు వ్యాఖ్యలు వరుస వైఫల్యాలతో విమర్శలు మూటగట్టుకున్నాడు. సోషల్ మీడియాలో భారీ ఎత్తున ట్రోలింగ్ ఎదుర్కొన్నాడు. ఈ నేపథ్యంలో కోల్కతా నైట్రైడర్స్తో మ్యాచ్లో శతకం బాదిన తర్వాత.. తనను ట్రోల్ చేసిన వాళ్ల నోళ్లు మూయించాను అంటూ బ్రూక్ ఘాటు వ్యాఖ్యలు చేశాడు. పశ్చాత్తాపంతో ఈ విషయం గురించి తాజాగా బీబీసీ ఇంటర్వ్యూలో గుర్తుచేసుకున్న హ్యారీ బ్రూక్.. ‘‘అప్పుడు నేను ఓ ఇడియట్లా ప్రవర్తించాను. ఇంటర్వ్యూలో అలాంటి పిచ్చి మాటలు మాట్లాడకుండా ఉండాల్సింది. ఆ తర్వాత దాని గురించి పశ్చాత్తాపపడ్డాను. హోటల్ గదిలో కూర్చుని సోషల్ మీడియా అకౌంట్లు ఓపెన్ చేయగానే.. చూడకూడని కామెంట్లు ఎన్నో చూశాను. అప్పటి నుంచి నెట్టింటికి కొంతకాలం పాటు దూరం కావాలని నిర్ణయించుకున్నాను. భారీ మొత్తానికి న్యాయం చేయలేక నెగిటివిటీ గురించి పట్టించుకోకుండా.. కేవలం ఆట మీదే దృష్టిసారించాను. తద్వారా నా మానసిక ఆరోగ్యం మరింత మెరుగైంది’’ అని తెలిపాడు. కాగా ఐపీఎల్-2023 కోసం సన్రైజర్స్ తనపై వెచ్చించిన భారీ మొత్తానికి హ్యారీ బ్రూక్ న్యాయం చేయలేకపోయాడు. ఆడిన 11 ఇన్నింగ్స్లో కేవలం 190 పరుగులు మాత్రమే చేసి నిరాశపరిచాడు. ఈ క్రమంలో ఎస్ఆర్హెచ్ ఐపీఎల్-2024 వేలానికి ముందు బ్రూక్ను రిలీజ్ చేసింది. ప్రస్తుతం అతడు వెస్టిండీస్తో వన్డే సిరీస్లో బిజీగా ఉన్నాడు. విండీస్తో తొలి మ్యాచ్లో అతడు 71 పరుగులతో టాప్ స్కోరర్గా నిలిచాడు. కానీ ఈ మ్యాచ్లో ఇంగ్లండ్ విండీస్ చేతిలో ఓటమిపాలైంది. చదవండి: సెంచరీతో చెలరేగిన సంజూ శాంసన్.. సెలక్టర్లకు స్ట్రాంగ్ మెసేజ్! -
WTC: టీమిండియాను ‘వెనక్కి’నెట్టిన బంగ్లాదేశ్! టాప్లో పాకిస్తాన్..
ICC World Test Championship 2023 - 2025: ప్రపంచ టెస్టు చాంపియన్షిప్ పాయింట్ల పట్టికలో బంగ్లాదేశ్ టాప్-2లోకి దూసుకువచ్చింది. న్యూజిలాండ్తో తొలి టెస్టులో 150 పరుగుల తేడాతో గెలిచిన బంగ్లాదేశ్ టీమిండియాను వెనక్కి నెట్టి రెండో స్థానాన్ని ఆక్రమించింది. కాగా బంగ్లాదేశ్ స్వదేశంలో న్యూజిలాండ్తో రెండు మ్యాచ్ల టెస్టు సిరీస్ ఆడుతోంది. ఇందులో భాగంగా శనివారం ముగిసిన మొదటి మ్యాచ్లో కివీస్ను చిత్తు చిత్తుగా ఓడించింది. సొంతగడ్డపై బంగ్లాదేశ్.. న్యూజిలాండ్పై విజయం సాధించడం ఇదే మొదటిసారి. చారిత్మక విజయంతో బంగ్లాదేశ్ ఇక బంగ్లాదేశ్ టెస్టు జట్టు కెప్టెన్గా నజ్ముల్ షాంటో తొలి ప్రయత్నంలోనే చారిత్రాత్మక విజయం అందించి ప్రశంసలు అందుకుంటున్నాడు. కాగా ప్రస్తుతం ప్రపంచ టెస్టు చాంపియన్షిప్(డబ్ల్యూటీసీ) 2023- 25 సీజన్ నడుస్తోంది. అగ్రస్థానం ఇంకా పాకిస్తాన్దే తాజా సైకిల్లో భాగంగా పాకిస్తాన్ ఆడిన రెండు మ్యాచ్లలో రెండూ గెలిచి పాయింట్ల పట్టికలో అగ్రస్థానంలో కొనసాగుతోంది. జూలైలో శ్రీలంక పర్యటనలో భాగంగా రెండు టెస్టుల్లో ఆతిథ్య జట్టును ఓడించి 24 పాయింట్లతో టాప్లో ఉంది. మరోవైపు.. జూలైలో వెస్టిండీస్లో పర్యటించిన టీమిండియా రెండింట ఒక మ్యాచ్ గెలిచి.. మరొకటి డ్రా చేసుకున్న విషయం తెలిసిందే. దీంతో 16 పాయింట్లతో రెండో స్థానం(66.67 శాతం)లో ఉండేది. అయితే, తాజాగా న్యూజిలాండ్పై గెలుపుతో విజయశాతం(100 శాతం) విషయంలో మెరుగ్గా ఉన్న బంగ్లా ఇప్పుడు టీమిండియాను వెనక్కినెట్టింది. PC: ICC మూడో స్థానానికి పడిపోయిన టీమిండియా ఈక్రమంలో రోహిత్ సేన ప్రస్తుతం మూడో స్థానానికి పడిపోయింది. ఇక ఈ జాబితాలో ఆస్ట్రేలియా 18 పాయింట్లు(విజయశాతం 30)తో నాలుగు, వెస్టిండీస్ 4 పాయింట్లు(16.67 శాతం)తో ఐదో స్థానంలో ఉన్నాయి. ఇక ఇంగ్లండ్ కేవలం 9 పాయింట్లు సాధించి ఆరో స్థానంలో ఉండగా.. శ్రీలంక, న్యూజిలాండ్, సౌతాఫ్రికా తదితర జట్టు ఇంకా తాజా సైకిల్లో పాయింట్ల ఖాతా తెరవనే లేదు. రెండుసార్లు చేదు అనుభవమే కాగా డబ్ల్యూటీసీ నిబంధనల ప్రకారం మ్యాచ్ గెలిస్తే 12, డ్రా చేసుకుంటే 4 పాయింట్లు వస్తాయి. ఇక సీజన్ ముగిసే నాటికి పాయింట్ల పట్టికలో టాప్-2లో ఉన్న జట్లు ఫైనల్కు అర్హత సాధిస్తాయి. ఈ ట్రోఫీని తొలుత న్యూజిలాండ్, తర్వాత ఆస్ట్రేలియా గెలుచుకున్నాయి. ఈ రెండు పర్యాయాలు ఫైనల్ వరకు చేరిన టీమిండియాకు ఆఖరి పోరులో ఓటమి తప్పలేదు. చదవండి: టీమిండియా హెడ్కోచ్ అయితేనేం! కుమారుల కోసం అలా.. -
టీమిండియాతో మ్యాచ్.. వెస్టిండీస్కు షాకిచ్చిన ఐసీసీ!
India tour of West Indies, 2023 Test Series: వెస్టిండీస్ క్రికెట్ బోర్డుకు అంతర్జాతీయ క్రికెట్ మండలి షాకిచ్చింది. ఇటీవల టీమిండియా- విండీస్ టెస్టు కోసం విండ్సర్ పార్కులో తయారు చేసిన పిచ్కు సగటు కంటే తక్కువ రేటింగ్ ఇచ్చింది. కాగా రెండు టెస్టులు, మూడు వన్డేలు, ఐదు టీ20లు ఆడేందుకు భారత జట్ట జూలై- ఆగష్టులో కరేబియన్ దీవిలో పర్యటించిన విషయం తెలిసిందే. స్పిన్నర్ల విజృంభణతో విండీస్ కుదేలు ఈ క్రమంలో ఇరు జట్ల మధ్య జూలై 12న డొమినికాలోని రొసోవ్ వేదికగా తొలి టెస్టు ఆరంభమైంది. ఈ మ్యాచ్లో టాస్ గెలిచి ఆతిథ్య వెస్టిండీస్ తొలుత బ్యాటింగ్ ఎంచుకోగా.. భారత స్పిన్నర్లు ఆకాశమే హద్దుగా చెలరేగారు. స్పిన్నర్లు రవిచంద్రన్ అశ్విన్ 5, రవీంద్ర జడేజా 3 వికెట్లతో విండీస్ బ్యాటింగ్ పతనాన్ని శాసించారు. దీంతో తొలి ఇన్నింగ్స్లో 150 పరుగులకే వెస్టిండీస్ ఆలౌటైంది. ఈ క్రమంలో బ్యాటింగ్కు దిగిన టీమిండియా 5 వికెట్ల నష్టానికి 421 పరుగుల వద్ద ఇన్నింగ్స్ డిక్లేర్ చేసింది. తదుపరి లక్ష్య ఛేదనకు దిగిన కరేబియన్ జట్టు 130 పరుగులకే కుప్పకూలింది. ఫలితంగా ఇన్నింగ్స్ 141 పరుగుల భారీ తేడాతో ఓడింది. ఇక రెండో ఇన్నింగ్స్లో అశ్విన్కు ఏడు, జడ్డూకు రెండు వికెట్లు దక్కాయి. చెత్త పిచ్ అంటూ విమర్శలు ఈ నేపథ్యంలో టర్నింగ్ పిచ్పై తీవ్రస్థాయిలో విమర్శలు వచ్చాయి. మూడు రోజుల్లోనే మ్యాచ్ ముగియడంతో చెత్త పిచ్ అంటూ కామెంట్లు వినిపించాయి. ఈ క్రమంలో ఐసీసీ తాజాగా.. విండ్సర్ పిచ్కు బిలో ఆవరేజ్ రేటింగ్తో విండీస్ బోర్డును పనిష్ చేసింది. దీంతో వెస్టిండీస్ ఖాతాలో ఒక డిమెరిట్ పాయింట్ చేరింది. అయితే, ఈ విషయంపై బోర్డు అప్పీలు వెళ్లే అవకాశం ఉంది. ఆ పిచ్కు రేటింగ్ ఇలా ఇదిలా ఉంటే.. టీమిండియా- వెస్టిండీస్ మధ్య రెండో టెస్టుకు వేదికైన.. జమైకాలోని క్వీన్స్ పార్క్ ఓవల్కు ఆవరేజ్ రేటింగ్ ఇచ్చింది. ఇక వర్షం కారణంగా ఈ మ్యాచ్ డ్రా కావడంతో భారత జట్టు 1-0తో సిరీస్ను గెలిచిన విషయం తెలిసిందే. కాగా.. వన్డే సిరీస్ను 2-1తో గెలిచిన టీమిండియా.. టీ20 సిరీస్లో మాత్రం 3-2 తేడాతో ఓటమిని మూటగట్టుకుంది. చదవండి: పాక్ను ఓడించాలంటే అతడిపై వేటు పడాల్సిందే! లేదంటే.. -
సత్తా చాటిన శుబ్మన్, కుల్దీప్.. కెరీర్లోనే బెస్ట్ ర్యాంక్
ఐసీసీ టీ20 ర్యాకింగ్స్లో టీమిండియా యువ ఓపెనర్ శుబ్మన్ గిల్ సత్తాచాటాడు. తన టీ20 కెరీర్లో ఉత్తమ ర్యాంక్ను గిల్ సాధించాడు. తాజాగా ఐసీసీ ప్రకటించిన బ్యాటింగ్ ర్యాంకింగ్స్లో గిల్ 43 స్ధానాలు ఎగబాకి 25వ స్ధానానికి చేరుకున్నాడు. వెస్టిండీస్తో జరిగిన నాలుగో టీ20లో గిల్ అద్బుతమైన హాఫ్ సెంచరీతో చెలరేగిన సంగతి తెలిసిందే. ఈ మ్యాచ్లో గిల్ 77 పరుగులు సాధించాడు. ఈ అద్బుత ఇన్నింగ్స్ ఫలితంగా గిల్ తన ర్యాంక్ను మెరుగుపరుచుకున్నాడు. మరోవైపు నాలుగో టీ20లో ప్లేయర్ ఆఫ్ది మ్యాచ్గా నిలిచిన యువ సంచలనం యశస్వీ జైశ్వాల్ ఏకంగా 1000 స్ధానాలు ఎగబాకి 88వ ర్యాంక్కు చేరుకున్నాడు. ఈ మ్యాచ్లో జైశ్వాల్ 84 పరుగులు చేసి ఆజేయంగా నిలిచాడు. ఇక వెస్టిండీస్తో టీ20 సిరీస్లో అద్బతప్రదర్శన కనబరిచిన టీమిండియా స్టార్ సూర్యకుమార్ యాదవ్ 907 రేటింగ్ పాయింట్లతో అగ్రస్ధానంలో కొనసాగుతున్నాడు. సెకెండ్ ర్యాంక్లో పాకిస్తాన్ ఆటగాడు మహ్మద్ రిజ్వాన్(811) ఉన్నాడు. బౌలర్ల విషయానికి వస్తే.. భారత లెఫ్ట్ ఆర్మ్ స్పిన్నర్ కుల్దీప్ యాదవ్ ఏకంగా 23 స్థానాలు మెరుగుపర్చుకుని 28వ ప్లేస్కు చేరుకున్నాడు. చదవండి: IND vs WI: ఐర్లాండ్తో తొలి టీ20.. సంజూ శాంసన్పై వేటు! సిక్సర్ల కింగ్ ఎంట్రీ -
దేశంలో ఒకే ఒక్క హార్దిక్ పాండ్యా ఉన్నాడు.. కానీ: భారత మాజీ క్రికెటర్
Hardik Pandya underwhelming all-round performances: టీమిండియా ‘స్టార్’ ఆల్రౌండర్ హార్దిక్ పాండ్యా ఆట తీరుపై భారత మాజీ ఓపెనర్ ఆకాశ్ చోప్రా పెదవి విరిచాడు. ఇటీవలి కాలంలో వన్డేల్లో అతడి ప్రదర్శన ఆశించదగ్గ రీతిలో లేదని విమర్శించాడు. వన్డే ప్రపంచకప్-2023 వంటి మెగా ఈవెంట్కు ముందు కీలక ఆటగాడు ఇలా విఫలం కావడం ఆందోళనకు గురిచేసే అంశం అన్నాడు. తాత్కాలిక కెప్టెన్గా కాగా రెగ్యులర్ కెప్టెన్ రోహిత్ శర్మ గైర్హాజరీలో పరిమిత ఓవర్ల క్రికెట్లో హార్దిక్ పాండ్యా భారత జట్టును ముందుకు నడిపిస్తున్న విషయం తెలిసిందే. ఇటీవల ముగిసిన వెస్టిండీస్ పర్యటనలో భాగంగా ఆఖరి రెండు వన్డేలు, ఐదు మ్యాచ్ల టీ20 సిరీస్కు పాండ్యా తాత్కాలిక కెప్టెన్గా వ్యవహరించాడు. ఆటగాడిగా, కెప్టెన్గా విఫలం అయితే, ఆల్రౌండర్గా.. కెప్టెన్గానూ ఏమాత్రం ఆకట్టుకోలేకపోయాడు. మూడు మ్యాచ్ల వన్డే సిరీస్ను టీమిండియా 2-1తో గెలిచినప్పటికీ.. పాండ్యా సారథ్యంలో టీ20 సిరీస్లో మాత్రం విండీస్ చేతిలో 3-2తో పరాభవం పాలైంది. ఈ నేపథ్యంలో హార్దిక్ పాండ్యాపై తీవ్ర స్థాయిలో విమర్శలు వెల్లువెత్తాయి. ఇక వెస్టిండీస్ టూర్ తర్వాత హార్దిక్ ఆసియా వన్డే కప్-2023 టోర్నీలోనే మళ్లీ మైదానంలో అడుగుపెట్టనున్నాడు. అటుపై భారత్ వేదికగా ప్రపంచకప్ రూపంలో మరో మెగా ఈవెంట్ జరుగనున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఆకాశ్ చోప్రా తన యట్యూబ్ చానెల్ వేదికగా హార్దిక్ను ఉద్దేశించి కీలక వ్యాఖ్యలు చేశాడు. ఒకే ఒక్క హార్దిక్ పాండ్యా ఉన్నాడు.. కానీ ‘‘దేశంలో ఒకే ఒక్క హార్దిక్ పాండ్యా ఉన్నాడు. గంటకు 140 కిలోమీటర్ల వేగంతో బౌలింగ్ చేయడంతో పాటు లోయర్ ఆర్డర్లో ఫినిషర్గా అదరగొట్టగలిగిన వాడు. బౌలింగ్.. బ్యాటింగ్.. అదో ప్యాకేజ్! అయితే.. హార్దిక్ ఈ రెండింటిలోనూ ఇంకా మెరుగ్గా రాణించగలడు. నిజానికి వెస్టిండీస్తో రెండో వన్డేలో టీమిండియా ఓడినపుడు అందరూ యువ ఆటగాళ్ల గురించే మాట్లాడారు. కానీ పాండ్యా గురించి ఇంతవరకు పెద్దగా చర్చించడమే లేదు. వాస్తవానికి హార్దిక్ పాండ్యా వంటి కీలక ఆటగాడిపైనే ఎక్కువ ఫోకస్ ఉండాలి. గత 10 వన్డేల్లో అతడి ప్రదర్శన చెప్పుకోదగినదిగా లేదు. స్ట్రైక్రేటు గురించి కూడా మాట్లాడాలి వెస్టిండీస్తో మూడో వన్డేలో 52 బంతుల్లో 70 పరుగులు చేశాడు. కానీ ఆ ఇన్నింగ్స్ ఎంత పేలవంగా ఆరంభమైందో తెలిసిందే! అయితే, ఆఖర్లో మాత్రం బ్యాట్ ఝులిపించాడు. ఇక మరో మ్యాచ్లో 12 బంతుల్లో 14 పరుగులు.. కేవలం రెండు ఇన్నింగ్స్లో మాత్రమే అతడు ఎదుర్కొన్న బంతుల కంటే పరుగులు ఎక్కువగా ఉన్నాయి. ఫినిషర్గానే కీలక పాత్ర వాస్తవానికి హార్దిక్ పాండ్యా ఫినిషర్ పాత్ర పోషించాలి. కాబట్టి స్ట్రైక్రేటు గురించి చర్చించక తప్పదు. అతడు నాలుగో స్థానంలో బ్యాటింగ్ చేయాల్సిన అవసరం లేదు. ఫినిషర్గా తన నుంచి మంచి ఇన్నింగ్స్ ఆశిస్తున్నా’’ అని ఆకాశ్ చోప్రా తన అభిప్రాయాలు పంచుకున్నాడు. కాగా గత 10 వన్డే ఇన్నింగ్స్లో హార్దిక్ పాండ్యా 97.22 స్ట్రైక్రేటుతో 280 పరుగులు చేయగలిగాడు. గత నాలుగేళ్లుగా 100కు స్ట్రైక్రేటు మెయింటెన్ చేస్తున్న అతడి ప్రస్తుత గణాంకాలు ఆశించిన రీతిలో లేవన్నది వాస్తవం. ఇదిలా ఉంటే... ఆగష్టు 30 నుంచి పాకిస్తాన్, శ్రీలంక వేదికగా ఆసియా కప్ టోర్నీ ఆరంభం కానుంది. చదవండి: టీమిండియాతో సిరీస్ నాటికి వచ్చేస్తా.. వరల్డ్కప్ తర్వాత కెప్టెన్ అతడే! -
అలా అనుకుంటే సంజూను తీసిపడేయండి.. అతడికి ఛాన్స్ ఇవ్వండి!
వెస్టిండీస్తో టీ20 సిరీస్లో విఫలమైన టీమిండియా వికెట్ కీపర్ సంజూ శాంసన్పై సర్వాత్ర విమర్శల వర్షం కురుస్తోంది. అతడిని జట్టు నుంచి తొలగించాలని చాలా మంది డిమాండ్ చేస్తున్నారు. కాగా కరేబియన్ పర్యటనలో సంజూ తీవ్ర నిరాశపరిచాడు. వన్డే సిరీస్లో ఒక హాఫ్ సెంచరీతో కాస్త పర్వాలేదనపించిన శాంసన్.. టీ20లో మాత్రం పూర్తిగా తేలిపోయాడు. ఈ సిరీస్లో మూడు మ్యాచ్లు ఆడిన శాంసన్.. 32 పరుగులు మాత్రమే చేశాడు. అతడి ఇన్నింగ్స్లలో 13 పరుగులు అత్యధిక స్కోర్గా ఉండటం గమానార్హం. ఈ నేపథ్యంలో జట్టు మెన్జ్మెంట్ను ఉద్దేశించి భారత మాజీ ఆటగాడు అభిషేక్ నాయర్ కీలక వాఖ్యలు చేశాడు. శాంసన్ను లోయార్డర్లో బ్యాటింగ్ పంపడాన్ని అభిషేక్ నాయర్ తప్పుబట్టాడు. కాగా సాధారణంగా ఐపీఎల్లో సంజూ 3 లేదా 4 స్థానాల్లో బ్యాటింగ్కు వచ్చేవాడు. "సంజూ శాంసన్ని సేవలను ఉపయోగించుకోవాలనుకుంటే అతడికి మూడో స్ధానంలో బ్యాటింగ్ చేసే అవకాశం ఇవ్వండి. అతడు ఆ బ్యాటింగ్ పొజిషన్కు బాగా అలవాటు పడ్డాడు. అతడు ఆ స్ధానంలో బ్యాటింగ్కు వచ్చి అద్భుతమైన ఇన్నింగ్స్లు ఆడాడు కూడా. మిడిల్ ఓవర్లలో స్పిన్నర్లను ఎటాక్ చేసే సత్తా సంజూకు ఉంది. ఆ స్ధానంలో అతడిని పంపకపోతే పూర్తిగా జట్టులోనే ఛాన్స్ ఇవ్వవద్దు. సంజూని ఐదు లేదా ఆరో స్ధానంలో ఆడించాలనుకుంటే, అతడికి బదలుగా రింకూ సింగ్కు అవకాశం ఇవ్వండని జియో సినిమాతో నాయర్ అన్నాడు. చదవండి: ODI WC 2023: ఇంగ్లండ్ కెప్టెన్ బెన్ స్టోక్స్ సంచలన నిర్ణయం.. ! -
సంజూను ప్లాన్ చేసి ఔట్ చేశాం.. సూర్యను కూడా! చాలా సంతోషంగా ఉంది
టీమిండియా వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ మరోసారి తీవ్ర నిరాశపరిచాడు. వెస్టిండీస్ టూర్కు భారత జట్టులో చోటు దక్కించుకున్న శాంసన్.. తనకు వచ్చిన అవకాశాలను సద్వినియోగం చేసుకోలేకపోయాడు. విండీస్తో వన్డే సిరీస్లో ఒక హాఫ్ సెంచరీ సాధించిన ఈ కేరళ బ్యాటర్.. టీ20 సిరీస్లో మాత్రం పూర్తిగా తెలిపోయాడు. నిర్ణయాత్మక ఐదో టీ20లో కీలక సమయంలో బ్యాటింగ్కు వచ్చిన సంజూ.. 9 బంతుల్లో 13 పరుగులు చేసి రొమారియో షెఫార్డ్ బౌలింగ్లో పెవిలియన్కు చేరాడు. ఓవరాల్గా ఈ సిరీస్లో మూడు మ్యాచ్లు ఆడిన శాంసన్.. 32 పరుగులు మాత్రమే చేశాడు. ఇక ఫైనల్ టీ20లో పక్కా ప్రాణాళికతో శాంసన్ను ఔట్ చేసినట్లు విండీస్ పేసర్ రొమారియో షెఫార్డ్ తెలిపాడు. పోస్ట్ మ్యాచ్ ప్రేజేంటేషన్లో షెఫార్డ్ మాట్లాడుతూ.. "గత రెండు నెలలగా మేము గడ్డు పరిస్ధితులను ఎదుర్కొంటున్నాము. ఇటువంటి సమయంలో భారత్ వంటి జట్టును ఓడించి సిరీస్ సొంతం చేసుకోవడం చాలా సంతోషంగా ఉంది.ఆఖరి టీ20లో అద్భుతంగా ఆడిన నికోలస్ పూరన్, బ్రాడన్ కింగ్లకు ధన్యవాదాలు. నా బౌలింగ్ స్ట్రైల్ను కూడా నేను మార్చుకున్నాను. సరైన ప్రదేశాల్లో బౌలింగ్ చేసి బ్యాటర్లకు ఇబ్బంది పెట్టాను. ముఖ్యంగా సంజూ శాంసన్, సూర్యకుమార్ యాదవ్ను ఔట్చేయడానికి ముందుగానే ప్రణాళికలు సిద్దం చేశాం. సంజూకు వికెట్ల దగ్గర బౌలింగ్ చేసి పెవిలియన్కు పంపాలనుకున్నాను. అదేవిధంగా సూర్యకు లాంగాన్ దిశగా షాట్ ఆడించి ఔట్ చేయడమే మా టార్గెట్. అందులో మేము విజయం సాధించామని పేర్కొన్నాడు. కాగా శాసంన్ షెఫార్డ్ బౌలింగ్లో ఔట్ కాగా.. సూర్య హోల్డర్ బౌలింగ్లో పెవిలియన్కు చేరాడు. చదవండి: ODI WC 2023: ఇంగ్లండ్ కెప్టెన్ బెన్ స్టోక్స్ సంచలన నిర్ణయం.. ! -
క్రిస్ గేల్ రికార్డును బద్దలు కొట్టిన సూర్యకుమార్ యాదవ్
విండీస్తో నిన్న (ఆగస్ట్ 14) జరిగిన నిర్ణయాత్మక ఐదో టీ20లో టీమిండియా హార్డ్ హిట్టర్ సూర్యకుమార్ యాదవ్ ఓ అరుదైన రికార్డు సాధించాడు. 50 ఇన్నింగ్స్ల తర్వాత అత్యధిక సిక్సర్లు బాదిన ఆటగాళ్ల జాబితాలో రెండో స్థానానికి ఎగబాకాడు. ఈ మ్యాచ్లో 3 సిక్సర్లు బాదిన సూర్యకుమార్.. యూనివర్సల్ బాస్ క్రిస్ గేల్ను అధిగమించాడు. 50 టీ20 ఇన్నింగ్స్ల తర్వాత స్కై ఖాతాలో 104 సిక్సర్లు ఉండగా.. గేల్ పేరిట 103 సిక్సర్లు ఉన్నాయి. ఈ జాబితాలో విండీస్ ఆటగాడు ఎవిన్ లెవిస్ 111 సిక్సర్లతో అగ్రస్థానంలో ఉన్నాడు. లెవిస్, స్కై, గేల్ల తర్వాత కివీస్ కొలిన్ మున్రో (92), ఆరోన్ ఫించ్ (79) నాలుగు, ఐదు స్థానాల్లో ఉన్నారు. 50 ఇన్నింగ్స్ల తర్వాత అత్యధిక పరుగులు చేసిన ఆటగాళ్ల జాబితాలోనూ స్కై నాలుగో స్థానంలో ఉన్నాడు. విండీస్తో ఐదో టీ20లో 45 బంతుల్లో 4 ఫోర్లు, 3 సిక్సర్ల సాయంతో 61 పరుగులు చేసిన సూర్యకుమార్.. 50 ఇన్నింగ్స్ల అనంతరం 1841 పరుగులు చేసి ఈ విభాగంలో విరాట్ కోహ్లి (1943), బాబర్ ఆజమ్ (1942), మహ్మద్ రిజ్వాన్ (1888) తర్వాతి స్థానంలో ఉన్నాడు. ఈ జాబితాలో స్కై తర్వాత కేఎల్ రాహుల్ (1751) ఐదో స్థానంలో ఉన్నాడు. మ్యాచ్ విషయానికొస్తే.. బ్యాటింగ్కు స్వర్గధామమైన ఫ్లోరిడా పిచ్పై బ్యాటర్ల నిర్లక్ష్యం, పసలేని బౌలింగ్ కారణంగా భారత్ ఐదో టీ20లో ఘోర పరాజయాన్ని ఎదుర్కొంది. ఈ మ్యాచ్లో తొలుత బ్యాటింగ్ చేసిన భారత్.. తిలక్ వర్మ (18 బంతుల్లో 27; 3 ఫోర్లు, 2 సిక్స్లు), సూర్యకుమార్ (45 బంతుల్లో 61; 4 ఫోర్లు, 3 సిక్సర్లు) మెరుపు ఇన్నింగ్స్ల సాయంతో నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 165 పరుగులు చేసింది. ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’ రొమారియో షెఫర్డ్ (4/31) భారత్ జోరుకు అడ్డుకట్ట వేశాడు. తర్వాత లక్ష్యఛేదనకు దిగిన వెస్టిండీస్ 18 ఓవర్లలో 2 వికెట్లు కోల్పోయి 171 పరుగులు చేసి గెలిచింది. బ్రాండన్ కింగ్ (55 బంతుల్లో 85 నాటౌట్; 5 ఫోర్లు, 6 సిక్స్లు), నికోలస్ పూరన్ (35 బంతుల్లో 47; 1 ఫోర్, 4 సిక్సర్లు) చెలరేగారు. ఫలితంగా భారత్ మ్యాచ్తో పాటు సిరీస్ను (2-3) కూడా కోల్పోయింది. ఈ పర్యటనలో టెస్టు, వన్డే సిరీస్లను సొంతం చేసుకున్న భారత్.. టీ20 సిరీస్ను తృటిలో చేజార్చుకుంది. -
IND VS WI 5th T20: చెత్త రికార్డు మూటగట్టుకున్న చహల్
టీమిండియాతో నిన్న (ఆగస్ట్ 13) జరిగిన నిర్ణయాత్మక ఐదో టీ20లో విండీస్ 8 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించిన విషయం తెలిసిందే. ఈ గెలుపుతో విండీస్ 5 మ్యాచ్ల సిరీస్ను 3-2 తేడాతో కైవసం చేసుకుంది. ఈ మ్యాచ్లో టీమిండియా అన్ని విభాగాల్లో దారుణంగా విఫలమై మ్యాచ్తో పాటు సిరీస్ను విండీస్కు అప్పగించింది. బ్యాటింగ్లో సూర్యకుమార్ (61) మినహా అందరూ చేతులెత్తేయగా.. బౌలింగ్లో కుల్దీప్ యాదవ్ (4-0-18-0) మినహా భారత బౌలర్ల ప్రదర్శన అత్యంత దారుణంగా ఉండింది. కెప్టెన్ హార్దిక్ పాండ్యా ఓవరాక్షన్ బౌలింగ్తో 3 ఓవర్లలో 32 పరుగులు సమర్పించుకోగా.. అర్షదీప్ 2 ఓవర్లలో 20 పరుగులు సమర్పించుకున్నాడు. మ్యాచ్ మొత్తంలో అత్యంత పేలవమైన ప్రదర్శన కనబర్చిన ఘనత టీమిండియా స్టార్ స్పిన్నర్ యుజ్వేంద్ర చహల్కు దక్కింది. ఈ మ్యాచ్లో 4 ఓవర్లు వేసిన చహల్ ఏకంగా 51 పరుగులు సమర్పించుకున్నాడు. ఇందులో ప్రత్యర్ధులు 5 సిక్సర్లు బాదారు. ఈ చెత్త గణాంకాలు నమోదు చేసే క్రమంలో చహల్ ఓ చెత్త రికార్డును మూటగట్టుకున్నాడు. అంతర్జాతీయ క్రికెట్లో అత్యధిక సిక్సర్లు బాధించుకున్న బౌలర్గా న్యూజిలాండ్ స్పిన్నర్ ఐష్ సోధి సరసన చేరాడు. సోధి తన అంతర్జాతీయ టీ20 కెరీర్లో 129 సిక్సర్లు సమర్పించుకోగా.. చహల్ ఈ మ్యాచ్లో అతని రికార్డును సమం చేశాడు. ఈ విభాగంలో సోధి, చహల్ తర్వాత ఆదిల్ రషీద్ (119) ఉన్నాడు. ఇక మ్యాచ్ విషయానికొస్తే.. బ్యాటింగ్కు స్వర్గధామమైన పిచ్పై బ్యాటర్ల నిర్లక్ష్యం, పసలేని బౌలింగ్ కారణంగా భారత్ ఘోర పరాజయాన్ని ఎదుర్కొంది. ఈ మ్యాచ్లో తొలుత బ్యాటింగ్ చేసిన భారత్.. తిలక్ వర్మ (18 బంతుల్లో 27; 3 ఫోర్లు, 2 సిక్స్లు), సూర్యకుమార్ (45 బంతుల్లో 61; 4 ఫోర్లు, 3 సిక్సర్లు) మెరుపు ఇన్నింగ్స్లతో చెలరేగడంతో నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 165 పరుగులు చేసింది. ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’ రొమారియో షెఫర్డ్ (4/31) భారత్ జోరుకు అడ్డుకట్ట వేశాడు. లక్ష్యఛేదనలో వెస్టిండీస్ 18 ఓవర్లలో 2 వికెట్లు కోల్పోయి 171 పరుగులు చేసి గెలిచింది. బ్రాండన్ కింగ్ (55 బంతుల్లో 85 నాటౌట్; 5 ఫోర్లు, 6 సిక్స్లు), నికోలస్ పూరన్ (35 బంతుల్లో 47; 1 ఫోర్, 4 సిక్సర్లు) చెలరేగారు. ఈ పర్యటనలో టెస్టు, వన్డే సిరీస్లను సొంతం చేసుకున్న భారత్.. టీ20 సిరీస్ను కోల్పోయింది. -
‘టీమిండియా విజయం నల్లేరు మీద నడకే’! మరీ అధ్వాన్నంగా..
West Indies vs India, 5th T20I: ‘‘టీ20 వరల్డ్కప్-2022 టోర్నీలో క్వాలిఫయర్స్లోనే ఇంటిముఖం పట్టిన జట్టు.. వన్డే వరల్డ్కప్-2023కి అర్హత సాధించని ‘బలహీన జట్టు’... ఇలాంటి టీమ్పై పటిష్ట టీమిండియా సునాయాసంగా గెలుస్తుంది.. టెస్టు, వన్డే, టీ20 సిరీస్లను క్లీన్స్వీప్ చేయడం నల్లేరు మీద నడకలాంటిదే!.. టీమిండియా వెస్టిండీస్ పర్యటనకు వెళ్లేముందు వ్యక్తమైన అభిప్రాయాలు. వన్డేల్లో గట్టెక్కారు.. కానీ.. స్కాట్లాండ్ వంటి పసికూనల చేతిలో ఓటమిపాలైన విండీస్.. భారత జట్టుతో సై అంటే సై అంది. టెస్టు సిరీస్లో 1-0తో ఓడినా.. వన్డేల్లో గట్టిపోటీనిచ్చింది. 50 ఓవర్ల సిరీస్లో 2-1తో టీమిండియా గట్టెక్కగా.. టీ20లలో మాత్రం కరేబియన్ జట్టు సత్తా చాటింది. కెప్టెన్ రోహిత్ శర్మ, స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లి వంటి మేటి ఆటగాళ్లు లేని టీమిండియాపై సునాయాసంగా సిరీస్ గెలిచింది. కోలుకోలేని షాక్ హార్దిక్ పాండ్యా సేనకు సవాళ్ల మీద సవాళ్లు విసురుతూ.. నిర్ణయాత్మక ఐదో టీ20లో గెలిచి ఏకంగా సిరీస్ను 3-2తో కైవసం చేసుకుంది. యువ జట్టుతో ప్రయోగాలు చేస్తూ.. తమకు తిరుగులేదనుకున్న భారత జట్టుకు కోలుకోలేని షాకిచ్చింది. ఇక ఐదు మ్యాచ్ల టీ20 సిరీస్ను విండీస్కు అర్పించుకుని విమర్శల పాలవుతున్న టీమిండియా చెత్త రికార్డులు మూటగట్టుకుని ఫ్యాన్స్ ఆగ్రహానికి గురవుతోంది. అమెరికాలో ఆదివారం నాటి ఫ్లోరిడా మ్యాచ్లో 8 వికెట్ల తేడాతో వెస్టిండీస్ చేతిలో ఓటమి సందర్భంగా భారత జట్టు నమోదు చేసిన చెత్త రికార్డులివే! 1. గత 25 నెలల్లో టీమిండియా టీ20 సిరీస్ కోల్పోవడం ఇదే మొదటిసారి. 2. వెస్టిండీస్తో ద్వైపాక్షిక సిరీస్లలో గత 17 ఏళ్లలో టీమిండియా ఓటమి పాలవడం ఇదే తొలిసారి. 3. పొట్టి ఫార్మాట్లో ఇప్పటివరకు ఒక టీ20 సిరీస్లో మూడు మ్యాచ్లలో ఓడిపోయిన సందర్భాలే లేవు. కానీ టీమిండియా చరిత్రలో తొలిసారి వెస్టిండీస్పై తొలిసారి ఈ చెత్త ఫీట్ నమోదైంది. చదవండి: Ind Vs WI: హార్దిక్ సేనపై మాజీ పేసర్ ఘాటు వ్యాఖ్యలు.. కెప్టెన్ వెర్రిమొహం వేస్తున్నాడు! వాళ్లేమో అలా! Catch the extended highlights from the 5th T20I T20I only on FanCode 👉 https://t.co/6EDO1Ijfiw . .#INDvWI #INDvWIAdFreeonFanCode pic.twitter.com/lHj2sAbLsn — FanCode (@FanCode) August 13, 2023 -
అసలు గెలవాలన్న కసి లేనేలేదు.. కెప్టెన్ వెర్రిమొహం వేస్తున్నాడు! ఇకనైనా..
West Indies vs India, 5th T20I: టీమిండియా మాజీ క్రికెటర్ వెంకటేశ్ ప్రసాద్ హార్దిక్ సేనపై విమర్శలు సంధించాడు. వెస్టిండీస్తో ఐదో టీ20లో గెలవాలన్న కసి భారత జట్టులో ఏమాత్రం కనిపించలేదని ఘాటు వ్యాఖ్యలు చేశాడు. ఆటగాళ్లలో ఏకాగ్రత లోపించిందని.. గుడ్డిగా ముందుకు వెళ్తే ఇలాంటి పరాభవాలే ఎదురవుతాయని అభిప్రాయపడ్డాడు. కాగా విండీస్ పర్యటనలో 1-0తో టెస్టు సిరీస్ గెలిచిన టీమిండియా.. వన్డే సిరీస్ను 2-1తో కైవసం చేసుకుంది. అయితే, టీ20 సిరీస్లో మాత్రం అనూహ్య రీతిలో ఘోర ఓటమిపాలైంది. 3-2తో ఆతిథ్య జట్టుకు సిరీస్ సమర్పించుకుంది. అమెరికాలో ఫ్లోరిడాలో ఐదో టీ20లో సమిష్టి వైఫల్యంతో విమర్శలు మూటగట్టుకోంది. వాళ్లు మినహా.. మిగతా వాళ్లంతా భారత బ్యాటర్లలో సూర్యకుమార్ యాదవ్(61) అర్ధ శతకంతో రాణించగా.. తిలక్ వర్మ 27 పరుగులు చేయగలిగాడు. మిగతా బ్యాటర్లలో ఒక్కరు కూడా కనీసం 20 పరుగులు మార్కు అందుకోలేదు. దీంతో టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ ఎంచుకున్న టీమిండియా నిర్ణీత 20 ఓవర్లలో తొమ్మిది వికెట్ల నష్టానికి 165 పరుగులు చేసింది. దంచికొట్టారు లక్ష్య ఛేదనలో విండీస్ ఓపెనర్ బ్రాండన్ కింగ్(85- నాటౌట్), వన్డౌన్ బ్యాటర్ నికోలస్ పూరన్(47)కు తోడు షాయీ హోప్(22- నాటౌట్) దంచికొట్టారు. దీంతో 18 ఓవర్లలోనే టార్గెట్ను ఊదేసిన వెస్టిండీస్ 8 వికెట్ల తేడాతో గెలుపొంది టీమిండియాపై చేయి సాధించింది. పాండ్యా పూర్తిగా విఫలం ఇక ఆదివారం నాటి ఈ మ్యాచ్లో హార్దిక్ పాండ్యా బ్యాట్, బంతితోనూ విఫలమయ్యాడు. 18 బంతుల్లో 14 పరుగులు మాత్రమే చేసిన ఈ పేస్ ఆల్రౌండర్.. మూడు ఓవర్లలో ఏకంగా 32 పరుగులు సమర్పించుకున్నాడు. అదే విధంగా కెప్టెన్గానూ సరైన నిర్ణయాలు తీసుకోలేకపోయాడు. ఎనిమిది మందితో బౌలింగ్ బ్రాండన్- పూరన్ జోడీని విడగొట్టడానికి పదే పదే బౌలర్లను మార్చాడు. యువ బ్యాటర్లు తిలక్ వర్మ, యశస్వి జైశ్వాల్తో కలిపి మొత్తంగా ఎనిమిది మంది ఈ మ్యాచ్లో బౌలింగ్ చేశారు. అర్ష్దీప్తో పాటు తిలక్ ఒక వికెట్ తీయగలిగాడు. ఈ నేపథ్యంలో భారత మాజీ పేసర్ వెంకటేశ్ ప్రసాద్ ట్విటర్ వేదికగా హార్దిక్ పాండ్యా, జట్టుపై విమర్శలు గుప్పించాడు. ‘‘టీమిండియా కచ్చితగా తన నైపుణ్యాలను మరింత మెరుగుపరచుకోవాలి. అసలు గెలవాలన్న తపన వారిలో కనబడలేదు. గుడ్డిగా వెళ్లొద్దు కెప్టెన్ అయితే ఎప్పుడూ వెర్రిమొహం వేస్తున్నాడు. నిజానికి బౌలర్లు బ్యాటింగ్ చేయలేరు. బ్యాటర్లు బౌలింగ్ చేయలేరు కదా! కానీ.. మనకు ఓ ప్లేయర్ ఇష్టమైనంత మాత్రాన గుడ్డిగా వాళ్లతో ప్రయోగాలు చేస్తే ఎలా? జట్టు దీర్ఘకాలిక ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకుని ఆటగాళ్ల సేవలను వినియోగించుకోవాలి’’ అంటూ తనదైన శైలిలో చురకలు అంటించాడు. ప్రస్తుతం పరిమిత ఓవర్ల క్రికెట్లో టీమిండియా అత్యంత సాధారణ జట్టులా కనిపిస్తోందని అభిప్రాయపడ్డాడు. గత టీ20 వరల్డ్కప్ టోర్నీకి అర్హత సాధించని జట్టు చేతిలో కూడా ఓటమి పాలయ్యారని విమర్శించాడు. గతంలో బంగ్లాదేశ్కు వన్డే సిరీస్ను కోల్పోయారు కూడా! కాబట్టి.. సిల్లీ కామెంట్లు చేసే బదులు ఆటపై దృష్టిపెడితే బాగుంటుందని హార్దిక్ పాండ్యాకు చురకలు వేశాడు. ఇప్పటికైనా భ్రమల్లోంచి బయటకు రావాలని సెటైర్లు వేశాడు. చదవండి: IND VS WI 5th T20: విండీస్ గెలిచినా.. పూరన్కు కమిలిపోయింది..! India needs to improve their skillset. Their is a hunger & intensity deficiency & often the captain looked clueless. Bowler’s can’t bat, batsmen can’t bowl. It’s important to not look for yes men and be blinded because someone is your favourite player but look at the larger good — Venkatesh Prasad (@venkateshprasad) August 13, 2023 Catch the extended highlights from the 5th T20I T20I only on FanCode 👉 https://t.co/6EDO1Ijfiw . .#INDvWI #INDvWIAdFreeonFanCode pic.twitter.com/lHj2sAbLsn — FanCode (@FanCode) August 13, 2023 -
IND VS WI 5th T20: విండీస్ గెలిచినా.. పూరన్కు కమిలిపోయింది..!
5 మ్యాచ్ల టీ20 సిరీస్లో భాగంగా టీమిండియాతో నిన్న (ఆగస్ట్ 13) జరిగిన నిర్ణయాత్మక ఐదో మ్యాచ్లో విండీస్ 8 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. తద్వారా 3-2 తేడాతో సిరీస్ను కైవసం చేసుకుంది. టీమిండియాపై దాదాపు 17 ఏళ్ల తర్వాత లభించిన విజయం (సిరీస్) కావడంతో విండీస్ ఆటగాళ్ల ఆనందానికి అవధుల్లేకుండా పోయాయి. ఈ విక్టరీని విండీస్ ప్లేయర్లు గ్రాండ్గా సెలబ్రేట్ చేసుకున్నారు. ఇటీవలి కాలంలో విండీస్కు ఈ స్థాయి విజయం దక్కడంతో ఆ దేశ మాజీలు సైతం రోవ్మన్ సేనపై ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. ముఖ్యంగా ప్లేయర్ ఆఫ్ సిరీస్గా నిలిచిన నికోలస్ పూరన్ను ఆకాశానికెత్తుతున్నారు. ఈ సిరీస్లో పూరన్ 141.94 స్ట్రయిక్ రేట్తో 176 పరుగులు చేసి తన జట్టు సాధించిన విజయాల్లో ప్రధాన పాత్ర పోషించాడు. The after effects 😂 thank you brandon king and arsdeep. pic.twitter.com/7jOHS46NSr — NickyP (@nicholas_47) August 14, 2023 అయితే ఇంత చేసి తన జట్టుకు చిరస్మరణీయ సిరీస్ విజయాన్ని అందించిన పూరన్కు మాత్రం శారీరక ప్రశాంతత లభించలేదు. ఐదో టీ20 సందర్భంగా పూరన్ సహచరుడు బ్రాండన్ కింగ్, ప్రత్యర్ధి అర్షదీప్ సింగ్ ధాటికి గాయాలపాలయ్యాడు. నాన్ స్ట్రయికర్ ఎండ్లో ఉండగా కింగ్ కొట్టిన ఓ షాట్ నేరుగా వచ్చి పూరన్ ఎడమ చేతిని బలంగా తాకగా.. అతని చేయి విరిగినంత పనైయ్యింది. అప్పటికప్పుడు ఆ నొప్పి తెలియలేదు కానీ, మ్యాచ్ అనంతరం పరిశీలించగా.. గాయమైన భాగం పూర్తిగా కమిలిపోయి, బంతి అచ్చు కనిపించింది. పూరన్ ఇదే మ్యాచ్లో అర్షదీప్ బౌలింగ్లోనూ గాయపడ్డాడు. కింగ్ దెబ్బ మరువక ముందే అర్షదీప్ వేసిన ఓ వేగవంతమైన బంతి నేరుగా వచ్చి పూరన్ కడుపుపై బలంగా తాకింది. ఆ క్షణం పూరన్ నొప్పితో విలవిలలాడిపోయాడు. అయితే వెంటనే తేరుకుని తిరిగి బ్యాటింగ్ను కొనసాగించాడు. అయితే ఈ దెబ్బను సైతం మ్యాచ్ అనంతరం పరిశీలించగా.. గాయమైన ప్రాంతం పూర్తిగా కమిలిపోయి ఉండి, బంతి అచ్చు స్పష్టంగా కనిపించింది. ఈ దెబ్బలకు సంబంధించిన ఫోటోను పూరన్ మ్యాచ్ అనంతరం సోషల్మీడియాలో పోస్ట్ చేసి కింగ్, అర్షదీప్లను థ్యాంక్స్ చెప్పాడు. అనంతర ప్రభావాలు.. కింగ్, అర్షదీప్లను ధన్యవాదాలు అంటూ ఈ పోస్ట్కు క్యాప్షన్ జోడించాడు. ఈ ఫోటో ప్రస్తుతం నెట్టింట వైరలవుతుంది. Six or nothing for Nicholas Pooran 🔥 A power-packed start for the Calypso batter 👊#WIvIND #SabJawaabMilenge #JioCinema pic.twitter.com/DLKUNzRUZr — JioCinema (@JioCinema) August 13, 2023 ఇదిలా ఉంటే, ఈ గాయాలు తగిలిన అనంతరం కూడా పూరన్ తన బ్యాటింగ్ను కొనసాగించి, తన జట్టుకు చిరస్మరణీయ విజయాన్ని అందించాడు. కింగ్తో అతను రెండో వికెట్కు 107 పరుగుల భాగస్వామ్యాన్ని జోడించి తన జట్టు గెలుపుకు గట్టి పునాది వేశాడు. ఈ ఇన్నింగ్స్లో పూరన్ 35 బంతులు ఎదుర్కొని బౌండరీ, 4 సిక్సర్ల సాయంతో 47 పరుగులు చేశాడు, 85 పరుగులతో అజేయంగా నిలిచిన కింగ్.. షాయ్ హోప్ (22) సహకారంతో విండీస్ను విజయతీరాలకు చేర్చాడు. ఈ మ్యాచ్లో తొలుత బ్యాటింగ్ చేసిన భారత్ నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 165 పరుగులు చేయగా.. విండీస్ మరో 2 ఓవర్లు మిగిలుండగానే విజయతీరాలకు చేరింది. Whatever he touches turns to gold 👌🔥 Tilak Varma 👊 can't do no wrong as he picks up the big wicket of Nicholas Pooran ☝️ #WIvIND #SabJawaabMilenge #JioCinema pic.twitter.com/5lFHAP4lml — JioCinema (@JioCinema) August 13, 2023 -
క్రికెట్ చరిత్రలోనే సూపర్ క్యాచ్.. తిలక్ వర్మ మైండ్ బ్లాక్! వీడియో వైరల్
ఫ్లోరిడా వేదికగా టీమిండియాతో జరిగిన ఐదో టీ20లో వెస్టిండీస్ ఆటగాడు రోస్టన్ ఛేజ్ సంచలన క్యాచ్తో మెరిశాడు. దూకుడుగా ఆడుతున్న తిలక్ వర్మను రిటర్న్ క్యాచ్తో ఛేజ్ పెవిలియన్కు పంపాడు. తన క్యాచ్తో మ్యాచ్ స్వరూపాన్నే ఛేజ్ మార్చేశాడు. టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న భారత్ అదిలోనే ఓపెనర్లు శుబ్మన్ గిల్, యశస్వీ జైశ్వాల్ వికెట్లను కోల్పోయింది. ఈ క్రమంలో సూర్యకుమార్ యాదవ్, తిలక్ వర్మ భారత ఇన్నింగ్స్ను చక్కదిద్దే ప్రయత్నం చేశారు. ఇన్నింగ్స్ ఆరో ఓవర్ వేసిన జోషఫ్ బౌలింగ్లో తిలక్ వర్మ.. ఏకంగా 19 పరుగులు రాబట్టి స్కోర్ బోర్డును పరుగులు పెట్టించాడు. దీంతో తిలక్ను అడ్డుకునేందుకు విండీస్ కెప్టెన్ స్పిన్నర్ ఛేజ్ను తీసుకువచ్చాడు. అస్సలు ఊహించలేదు.. అయితే రోవ్మన్ పావెల్ నమ్మకాన్ని ఛేజ్ వమ్ము చేయలేదు. తన వేసిన తొలి ఓవర్లోనే సంచలన ఫామ్లో ఉన్న తిలక్ను పెవిలియన్కు పంపాడు. 7 ఓవర్ వేసిన ఛేజ్ బౌలింగ్లో ఐదో బంతిని వర్మ లాంగ్ఆఫ్ దిశగా ఫ్లిక్ చేశాడు. ఈ క్రమంలో ఛేజ్ అద్భుతంగా డైవ్చేస్తూ రిటర్న్ క్యాచ్ అందుకున్నాడు. అయితే అది బంప్బాల్ అని అంతా అనుకున్నారు. కానీ ఇక్కడే అస్సలు ట్విస్ట్ చోటుచేసుకుంది. బెన్ఫిట్ ఆఫ్ డౌట్ కింద ఫీల్డ్ అంపైర్లు థర్డ్ అంపైర్కు రిఫర్ చేశారు. అయితే రిప్లేలో బంతి బ్యాట్కు తాకి నేరుగా ఛేజ్ చేతికి వెళ్లి నట్లు తేలింది. దీంతో 27 పరుగులు చేసిన తిలక్ వర్మ నిరాశతో మైదానాన్ని వీడాడాడు. ఛేజ్ క్యాచ్కు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్గా మారింది. ఈ వీడియో చూసిన అభిమానులు క్రికెట్ చరిత్రలోనే అత్యుత్తమ క్యాచ్ అంటూ కామెంట్లు చేస్తున్నారు. కాగా ఈ సిరీస్ను 3-2 తేడాతో టీమిండియా సొంతం చేసుకుంది. చదవండి: #Hardik Pandya: ఇంత చెత్త కెప్టెన్ను ఇప్పటివరకు చూడలేదు.. ఇతడా టీమిండియా ఫ్యూచర్? Roston Chase that was an absolutely fantastic catch! pic.twitter.com/tfa7X55Ttm — Q Sports Sport Reporter🇹🇹 (@yannickatnite) August 13, 2023 -
మా ఓటమికి కారణమదే.. ఆ విషయంలో మేము ఇంకా మెరుగుపడాలి: ద్రవిడ్
టీ20 క్రికెట్లో నెం1గా ఉన్న టీమిండియాకు వెస్టిండీస్ భారీ షాకిచ్చింది. స్వదేశంలో భారత్తో జరిగిన ఐదు మ్యాచ్ల టీ20 సిరీస్ను 3-2తో విండీస్ సొంతం చేసుకుంది. ఫ్లోరిడా వేదికగా ఆఖరి టీ20లో 8 వికెట్ల తేడాతో భారత్ను ఓడించిన వెస్టిండీస్.. ఆరేళ్ల తర్వాత టీ20 సిరీస్ను కైవసం చేసుకుంది. ఇక సిరీస్ ఓటమిపై మ్యాచ్ అనంతరం టీమిండియా హెడ్కోచ్ రాహుల్ ద్రవిడ్ విలేకరుల సమావేశంలో మాట్లాడాడు. బ్యాటింగ్ వైఫల్యం కారణంగానే సిరీస్ను కోల్పోయామని ద్రవిడ్ తెలిపాడు. "తొలుత టెస్టు, వన్డే సిరీస్లో మా జట్టు అత్యుత్తమ ప్రదర్శన కనబరిచింది. అదే విధంగా టీ20 సిరీస్లో కూడా మేము తొలి రెండు మ్యాచ్లు ఓడిపోయాం. అయినప్పటికీ మేము అద్భుతమైన కమ్బ్యాక్ ఇచ్చి సిరీస్ను సమం చేశాం. కానీ ఆఖరి మ్యాచ్లో ఓడి సిరీస్ను కోల్పోయాం. ఈ సిరీస్లో తొలి రెండు మ్యాచ్లు, ఐదో టీ20లో మేము కొన్ని తప్పులు చేశాం. ఈ మూడు మ్యాచ్ల్లో కూడా బ్యాటింగ్ బాగా చేయలేదు. అయితే జట్టు మొత్తం యువ ఆటగాళ్లతో కూడి ఉన్నది. కాబట్టి కొన్నిసార్లు మనం ఆశించిన ఫలితాలు రాకపోవచ్చు. ఈ సిరీస్లో యువ ఆటగాళ్లకు ఛాన్స్లు ఇవ్వాలని నిర్ణయించకున్నాం. అదేవిధంగా సరికొత్త కాంబనేషన్స్ను కూడా ప్రయత్నించాం. ఈ విషయంలో అయితే కొంతమెరకు మేము విజయం సాధించాం. జైశ్వాల్, తిలక్ వంటి యువ ఆటగాళ్లు తమ సత్తాచాటారు. నాలుగో టీ20లో జైశ్వాల్ తన టాలెంట్ చూపించాడు. తిలక్ కూడా బ్యాటింగ్, ఫీల్డింగ్తో అదరగొట్టాడు. అయితే విండీస్ పర్యటనలో మాకు కొన్ని పాజిటివ్ అంశాలతో పాటు ప్రతికూల విషయాలు ఉన్నాయి. భవిష్యత్తులో మేము ఈ విషయాల్లో మెరుగవ్వాలన్నది ఈ కరేబియన్ టూర్లో తెలుసుకున్నాం. ముఖ్యంగా మా బ్యాటింగ్ డెప్త్ను ఇంకా పెంచుకోవాలి. బౌలింగ్ అయితే మరి అంత బలహీనంగా లేదు. మాకు ముందు ఇంకా చాలా సవాళ్లు ఎదురుకానున్నాయి. అందుకు తగట్టు సిద్దం కావడమే మా పని అని" పోస్ట్మ్యాచ్ ప్రేజేంటేషన్లో ద్రవిడ్ పేర్కొన్నాడు. చదవండి: Ind vs WI: కొరకరాని కొయ్య.. తిలక్ వర్మ నుంచి ఇది ఊహించలేదు! వీడియో వైరల్ -
Ind Vs WI: టీమిండియాను అవమానించిన విండీస్ హిట్టర్! నోర్ముయ్..
West Indies vs India, 5th T20I - Nicholas Pooran: వెస్టిండీస్ విధ్వంసకర బ్యాటర్ నికోలస్ పూరన్ టీమిండియాతో టీ20 సిరీస్లో అదరగొట్టాడు. మేజర్ క్రికెట్ లీగ్-2023 ఫామ్ను కొనసాగిస్తూ.. ‘ప్లేయర్ ఆఫ్ ది సిరీస్’ అవార్డు అందుకున్నాడు. ఐదు మ్యాచ్ల సిరీస్లో నిక్కీ వరుసగా 41, 67(ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్), 20, 1, 47 పరుగులు సాధించాడు. పాండ్యా బౌలింగ్లో.. ముఖ్యంగా నిర్ణయాత్మకమైన ఐదో టీ20లో ఓపెనర్ బ్రాండన్ కింగ్(85- నాటౌట్)తో కలిసి విండీస్ను గెలుపుబాట పట్టించడంలో కీలకంగా వ్యవహరించాడు. 35 బంతుల్లో 47 పరుగులు చేశాడు. ఈ వన్డౌన్ బ్యాటర్ ఇన్నింగ్స్లో ఒక ఫోర్, నాలుగు సిక్సర్లు ఉన్నాయి. ఇందులో రెండు సిక్స్లు టీమిండియా కెప్టెన్ హార్దిక్ పాండ్యా బౌలింగ్లో బాదినవే! చాలెంజ్కు ప్రతీకారంగా అయితే, ఆట తీరుతో ఆకట్టుకున్న నికోలస్ పూరన్.. హార్దిక్ పాండ్యాకు మించిన ఆటిట్యూడ్తో టీమిండియా అభిమానుల ఆగ్రహానికి గురవుతున్నాడు. ఇంతకీ ఏం జరిగిందంటే.. మూడో టీ20 ముగిసిన తర్వాత హార్దిక్.. ‘‘నిక్కీ నా బౌలింగ్ను టార్గెట్ చేస్తాడేమో! మరేం పర్లేదు.. నాకిలాంటివి ఇష్టమే. అతడు నా మాటలు విని నన్ను లక్ష్యంగా చేసుకున్నా.. ఆఖర్లో నాకు వికెట్ సమర్పించుకోవాల్సిందే!’’ అని చాలెంజ్ విసిరాడు. నోరు మూసుకోండి అయితే, ఐదో టీ20లో ఇది బ్యాక్ఫైర్ అయింది. పాండ్యా బౌలింగ్లోనే పూరన్ మంచి షాట్లు ఆడాడు. కానీ.. తిలక్ వర్మ బౌలింగ్లో పాండ్యాకు క్యాచ్ ఇచ్చి అవుటయ్యాడు. ఇదిలా ఉంటే.. అమెరికాలోని ఫ్లోరిడాలో జరిగిన ఈ మ్యాచ్లో 8 వికెట్ల తేడాతో గెలుపొందిన వెస్టిండీస్ 3-2తో సిరీస్ కైవసం చేసుకుంది. విజయానంతరం వెంటనే విండీస్కు బయల్దేరిన నికోలస్ పూరన్ షేర్ చేసిన రీల్ టీమిండియా ఫ్యాన్స్ కోపానికి కారణమైంది. అకీల్ హొసేన్తో కలిసి.. ‘‘నోరు మూసుకోవాలి’’ అన్నట్లు అభినయించాడు. అక్కడ చూపించు నీ సత్తా ‘‘ఒకవేళ దీని గురించి మీకు తెలిస్తే.. తెలుసనే అనుకోండి’’ అని క్యాప్షన్ జతచేశాడు. దీంతో నిక్కీ హార్దిక్నే టార్గెట్ చేశాడని.. భారత జట్టును కూడా అవమానించే విధంగా వ్యవహరించాడంటూ ఫ్యాన్స్ ఫైర్ అవుతున్నారు. మేజర్ ఈవెంట్లో నీ సత్తా చూపించు.. అప్పుడు నమ్ముతాం గొప్ప బ్యాటర్వి అని ట్రోల్ చేస్తున్నారు. చదవండి: నాకు మాటలు కూడా రావడం లేదు.. క్రెడిట్ వాళ్లకే! అతడు హీరో: విండీస్ కెప్టెన్ Whatever he touches turns to gold 👌🔥 Tilak Varma 👊 can't do no wrong as he picks up the big wicket of Nicholas Pooran ☝️ #WIvIND #SabJawaabMilenge #JioCinema pic.twitter.com/5lFHAP4lml — JioCinema (@JioCinema) August 13, 2023 View this post on Instagram A post shared by Nicholas Pooran (@nicholaspooran) -
Ind vs WI: కొరకరాని కొయ్య.. తిలక్ వర్మ నుంచి ఇది ఊహించలేదు! వీడియో
West Indies vs India, 5th T20I: వెస్టిండీస్తో టీ20 సిరీస్ ఓడిపోయి ఘోర పరాభవం మూటగట్టుకుంది టీమిండియా. పసికూనలతో పోటీ పడి ఐసీసీ మెగా ఈవెంట్లకు అర్హత సాధించలేక చతికిలపడ్డ విండీస్ చేతిలో ఓటమిపాలైంది. అయితే, ఈ పర్యటన ద్వారా యశస్వి జైశ్వాల్, తిలక్ వర్మ రూపంలో ఇద్దరు యువ బ్యాటర్లు అద్భుత ప్రదర్శనతో క్రీడావర్గాల్లో చర్చనీయాంశమయ్యారు. అరంగేట్రంలో అదరగొట్టి కేవలం ఐపీఎల్కు మాత్రమే తమ ఆట పరిమితం కాదని.. అంతర్జాతీయ క్రికెట్లోనూ సత్తా చాటగలమని నిరూపించారు. అరంగేట్ర మ్యాచ్లోనే విలువైన ఇన్నింగ్స్ ఆడి సెలక్టర్ల నమ్మకాన్ని నిలబెట్టారు. టెస్టులో సెంచరీతో యశస్వి మెరవగా.. తిలక్ తొలి టీ20లోనే టాప్ స్కోరర్గా నిలిచాడు. బౌలింగ్ కూడా.. ఇక వెస్టిండీస్తో నాలుగో టీ20కి ముందు భవిష్యత్తులో వీరిద్దరితో బౌలింగ్ కూడా చేయిస్తామంటూ టీమిండియా బౌలింగ్ కోచ్ పారస్ మాంబ్రే పేర్కొన్న విషయం తెలిసిందే. నైపుణ్యాలకు పదును పెడితే కచ్చితంగా బౌలర్లుగా కూడా రాణించలగరని విశ్వాసం వ్యక్తం చేశాడు. తొలి వికెట్గా బిగ్ హిట్టర్ అందుకు తగ్గట్లుగానే తిలక్ వర్మ ఐదో టీ20లో 2 ఓవర్లు బౌలింగ్ చేశాడు. 17 పరుగులు ఇచ్చి ఒక వికెట్ తీశాడు. నికోలస్ పూరన్ వంటి బిగ్ హిట్టర్ వికెట్ను తన ఖాతాలో వేసుకున్నాడు. బ్రాండన్ కింగ్తో మెరుగైన భాగస్వామ్యం నెలకొల్పి కొరకరాని కొయ్యగా మారిన పూరన్ ఆట కట్టించాడు. 35 బంతుల్లో 47 పరుగులతో జోరు మీదున్న అతడిని బోల్తా కొట్టించాడు. వెస్టిండీస్ ఇన్నింగ్స్ 13.2 ఓవర్లో తిలక్ సంధించిన బంతిని తప్పుగా అంచనా వేసిన పూరన్.. స్విచ్ హిట్కు యత్నించి స్లిప్లో ఫీల్డింగ్ చేస్తున్న కెప్టెన్ హార్దిక్ పాండ్యాకు క్యాచ్ ఇచ్చాడు. అయితే, విండీస్ రివ్యూకు వెళ్లగా థర్డ్ అంపైర్ అవుటివ్వడంతో పూరన్ పెవిలియన్ చేరాడు. ప్లేయర్ ఆఫ్ ది సిరీస్ నికోలస్ పూరన్ రూపంలో తిలక్ వర్మ తన తొలి అంతర్జాతీయ వికెట్ దక్కించుకున్నాడు. బ్యాట్ ఝులిపించి.. బౌలింగ్లోనూ ఇందుకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్గా మారింది. కాగా అమెరికాలోని ఫ్లోరిడా వేదికగా ఆదివారం నాటి మ్యాచ్లో టీమిండియా 8 వికెట్ల తేడాతో ఓడిపోయిన విషయం తెలిసిందే. దీంతో ఆతిథ్య కరేబియన్ జట్టు 3-2తో సిరీస్ను కైవసం చేసుకుంది. ఇక విండీస్తో ఐదు మ్యాచ్ల సిరీస్లో తిలక్ తొలి మూడు టీ20లలో వరుసగా 39,51,49 పరుగులు సాధించాడు. నాలుగో టీ20లో బ్యాటింగ్ చేసే అవకాశం రాలేదు. ఇక ఆఖరిదైన ఐదో టీ20లో ఈ హైదరాబాదీ 27 పరుగులు చేయగలిగాడు. చదవండి: ఓవరాక్షన్ చేస్తే అలానే ఉంటుంది.. హార్దిక్ను ఉతికారేసిన పూరన్! వీడియో వైరల్ Whatever he touches turns to gold 👌🔥 Tilak Varma 👊 can't do no wrong as he picks up the big wicket of Nicholas Pooran ☝️ #WIvIND #SabJawaabMilenge #JioCinema pic.twitter.com/5lFHAP4lml — JioCinema (@JioCinema) August 13, 2023 -
ఓవరాక్షన్ చేస్తే అలానే ఉంటుంది.. హార్దిక్ను ఉతికారేసిన పూరన్! వీడియో వైరల్
టీమిండియాపై టెస్టు, వన్డే సిరీస్ల ఓటమికి వెస్టిండీస్ ప్రతీకారం తీర్చుకుంది. ఫ్లోరిడా వేదికగా భారత్తో జరిగిన ఐదో టీ20లో 8 వికెట్ల తేడాతో విండీస్ ఘన విజయం సాధించింది. తద్వారా ఐదు మ్యాచ్ల టీ20 సిరీస్ను 3-2 తేడాతో కరేబియన్ జట్టు కైవసం చేసుకుంది. 6 ఏళ్ల తర్వాత భారత్పై విండీస్కు ఇదే తొలి టీ20 సిరీస్ విజయం కావడం గమానార్హం. విండీస్ విజయంలో పేసర్ షెఫార్డ్, బ్యాటర్లు కింగ్, పూరన్ కీలక పాత్ర పోషించారు. హార్దిక్కు చుక్కలు చూపించిన పూరన్.. ఇక టీమిండియా కెప్టెన్ హార్దిక్ పాండ్యాపై విండీస్ విధ్వంసకర ఆటగాడు నికోలస్ పూరన్ బదులు తీర్చుకున్నాడు. నాలుగో టీ20కు ముందు హార్దిక్ పాండ్యా.. పూరన్కు ఓ సవాలు విసిరాడు. "పూరన్ కొడితే నా బౌలింగ్లోనే కొట్టాలి. మా ప్లాన్స్ మాకు ఉన్నాయి. నాకు ఇటువంటి పోటీ అంటే చాలా ఇష్టం. నా మాటలు పూరన్ విని నాలుగో టీ20లో నన్ను టార్గెట్ చేస్తాడని" మూడో టీ20 అనంతరం హార్దిక్ చెప్పుకొచ్చాడు. ఈ క్రమంలో నాలుగో టీ20లో పూరన్కు బ్యాటింగ్ చేసే అవకాశం వచ్చినప్పటికీ.. కేవలం ఒక్క పరుగు మాత్రమే చేసి పెవిలియన్కు చేరాడు. దీంతో హార్దిక్ బౌలింగ్ను ఎదుర్కొనే ఛాన్స్ పూరన్కు రాలేదు. కానీ నిర్ణయాత్మక ఐదో టీ20లో మాత్రం హార్దిక్ బౌలింగ్ ఆడే అవకాశం నిక్కీకి వచ్చింది. ఈ క్రమంలో హార్దిక్కు పూరన్ చుక్కలు చూపించి తన ప్రతీకారాన్ని తీర్చుకున్నాడు. పూరన్ వచ్చిరాగానే మూడు సిక్సర్లతో విరుచుకుపడ్డాడు. అందులో రెండు సిక్సర్లు హార్దిక్ ఓవర్లో కొట్టినివే. విండీస్ ఇన్నింగ్స్ మూడో ఓవర్ వేసిన హార్దిక్ బౌలింగ్లో ఆఖరి రెండు బంతులను పూరన్ సిక్సర్లగా మలిచాడు. ఈ మ్యాచ్లో హార్దిక్ బ్యాటింగ్, బౌలింగ్ పరంగా దారుణంగా విఫలమయ్యాడు. తొలుత బ్యాటింగ్లో 18 బంతులు ఆడి 14 పరుగులు చేసిన పాండ్యా.. అనంతరం బౌలింగ్లో అయితే ఘోరప్రదర్శన కనబరిచాడు. 3 ఓవర్లు వేసి 32 పరుగులు సమర్పించుకున్నాడు. చదవండి: నాకు మాటలు కూడా రావడం లేదు.. క్రెడిట్ వాళ్లకే! అతడు హీరో: విండీస్ కెప్టెన్ In 3rd T20I - Hardik pandya Gave an Overconfident Statement about Nicholas pooran. In 5th T20I - Nicholas Pooran Smashed him all over the park for 6 and 4. This is what I don't like About Hardik Pandya! pic.twitter.com/7XL2X97rn8 — ᴘʀᴀᴛʜᴍᴇsʜ⁴⁵ (@45Fan_Prathmesh) August 13, 2023 Six or nothing for Nicholas Pooran 🔥 A power-packed start for the Calypso batter 👊#WIvIND #SabJawaabMilenge #JioCinema pic.twitter.com/DLKUNzRUZr — JioCinema (@JioCinema) August 13, 2023 -
నాకు మాటలు కూడా రావడం లేదు.. క్రెడిట్ వాళ్లకే! అతడు హీరో: విండీస్ కెప్టెన్
స్వదేశంలో టీమిండియాతో టెస్టు, వన్డే సిరీస్లను కోల్పోయిన వెస్టిండీస్.. టీ20 సిరీస్ను తమ ఖాతాలో వేసుకుంది. ఫ్లోరిడా వేదికగా టీమిండియాతో జరిగిన నిర్ణయాత్మక ఐదో టీ20లో 8 వికెట్ల తేడాతో విండీస్ ఘన విజయం సాధించింది. తద్వారా ఐదు మ్యాచ్ల సిరీస్ను 3-2 తేడాతో కరేబియన్ జట్టు సొంతం చేసుకుంది. 6 ఏళ్ల తర్వాత భారత్పై విండీస్కు ఇదే తొలి టీ20 సిరీస్ విజయం కావడం గమానార్హం. విండీస్ చివరగా 2017లో టీమిండియాపై టీ20 సిరీస్ను సొంతం చేసుకుంది. ఇక చారిత్రత్మక సిరీస్ విజయంపై మ్యాచ్ అనంతరం వెస్టిండీస్ కెప్టెన్ రోవ్మన్ పావెల్ స్పందించాడు. "టీ20 సిరీస్ను సొంతం చేసుకోవడం చాలా సంతోషంగా ఉంది. ఈ సమయంలో ఏమి మాట్లాడాలో కూడా తెలియడం లేదు. ఆఖరి మ్యాచ్లో విజయం సాధించడానికి చాలా కష్టపడ్డాం. మ్యాచ్కు ముందు రోజు సాయంత్రం మేము ఓ మీటింగ్ పెట్టుకున్నాం. కరేబియన్ ప్రజలు మన నుంచి గెలుపు ఆశిస్తున్నారని మా బాయ్స్కు చెప్పా. మేము విజయం సాధించడంలో కోచింగ్ స్టాప్ది కీలక పాత్ర. మేము వరుసగా రెండు మ్యాచ్ల్లో ఓటమి చెందడంతో కాస్త నిరాశ చెందాము. కానీ మా కోచింగ్ స్టాప్ మాత్రం మాకు మద్దతుగా నిలిచారు. ఈ సిరీస్లో మా జట్టు నుంచి చాలా మంది ఆటగాళ్లు వ్యక్తిగత ప్రదర్శనతో అకట్టుకున్నారు. జట్టులో ఎవరో ఒకరు రాణించినా కొన్ని సందర్భాల్లో మేలు జరుగుతుంది. ముఖ్యంగా నికోలస్ పూరన్ ఈ సిరీస్లో మాకు కీలక విజయాలు అందించాడు. అతడు మా జట్టులో ముఖ్యమైన ఆటగాడు. పవర్ఫుల్ బ్యాటింగ్ లైనప్ ఉన్న మా బౌలర్లకు క్రెడిట్ ఇవ్వాలనకుంటున్నాను. అదే విధంగా మాకు సపోర్ట్గా నిలిచిన విండీస్ క్రికెట్కు, అభిమానులకు ధన్యవాదాలు" అంటూ పోస్ట్మ్యాచ్ ప్రేజేంటేషన్లో పావెల్ పేర్కొన్నాడు. చదవండి: #Hardik Pandya: ఇంత చెత్త కెప్టెన్ను ఇప్పటివరకు చూడలేదు.. ఇతడా టీమిండియా ఫ్యూచర్? Drought broken 👏 The West Indies claim T20I series bragging rights over India in Florida! More from #WIvIND 👇https://t.co/dvEJ9cwGIw — ICC (@ICC) August 14, 2023 -
చరిత్ర సృష్టించిన తిలక్ వర్మ.. రెండో భారత ఆటగాడిగా
టీమిండియా యువ సంచలనం తిలక్ వర్మ అరుదైన ఘనత సాధించాడు. అంతర్జాతీయ టీ20ల్లో మొదటి ఐదు మ్యాచ్ల తర్వాత అత్యధిక పరుగులు చేసిన రెండో భారత ఆటగాడిగా తిలక్ వర్మ రికార్డులకెక్కాడు. ఫ్లోరిడా వేదికగా వెస్టిండీస్తో జరిగిన ఐదో టీ20లో 27 పరుగులు చేసిన తిలక్.. ఈ అరుదైన ఘనతను తన పేరిట లిఖించుకున్నాడు. తిలక్ వర్మ తన ఐదు టీ20 మ్యాచ్ల్లో 173 పరుగులు సాధించాడు. ఈ క్రమంలో మరో భారత ఆటగాడు దీపక్ హుడా(172)ను వర్మ అధిగమించాడు. ఇక అరుదైన ఘనత సాధించిన జాబితాలో భారత స్టార్ ఆటగాడు కేఎల్ రాహుల్(179) అగ్రస్ధానంలో ఉన్నాడు. ఇక విండీస్ టీ20 సిరీస్తో అంతర్జాతీయ క్రికెట్లో అడుగుపెట్టిన 20 ఏళ్ల తిలక్ వర్మ.. ఈ సిరీస్ అసాంతం అద్బుతమైన ప్రదర్శన కనబరిచాడు. ఈ సిరీస్లో ఐదు మ్యాచ్లు ఆడిన వర్మ.. 173 పరుగులు చేశాడు. ఇక మ్యాచ్ విషయానికి వస్తే.. విండీస్ చేతిలో 8 వికెట్ల తేడాతో భారత్ ఓటమి పాలైంది. దీంతో ఐదు మ్యాచ్ల సిరీస్ను 3-2తో భారత్ కోల్పోయింది. 2016 తర్వాత ఓ ద్వైపాక్షిక టీ20 సిరీస్లో విండీస్ చేతిలో భారత్ ఓడిపోవడం ఇదే తొలిసారి. ఇక విండీస్ పర్యటన ముగియడంతో భారత్ ఐర్లాండ్కు వెళ్లనుంది. ఈ పర్యటనలో భాగంగా అతిథ్య ఐరీష్తో మూడు మ్యాచ్ల టీ20 సిరీస్లో భారత్ తలపడనుంది. డబ్లిన్ వేదికగా ఆగస్టు 18న జరగనున్న తొలి టీ20తో ఈ సిరీస్ ప్రారంభం కానుంది. చదవండి: ఓడిపోవడం మంచిదే.. మా బాయ్స్ అద్భుతం! చాలా సంతోషంగా ఉన్నా: హార్దిక్ -
ఇంత చెత్త కెప్టెన్ను ఇప్పటివరకు చూడలేదు.. ఇతడా టీమిండియా ఫ్యూచర్?
కరేబియన్ పర్యటనను భారత జట్టు నిరాశతో ముగించింది. ఫ్లోరిడా వేదికగా వెస్టిండీస్తో జరిగిన నిర్ణాయత్మక ఐదో టీ20లో 8 వికెట్ల తేడాతో టీమిండియా ఓటమి పాలైంది. దీంతో ఐదు మ్యాచ్ల టీ20 సిరీస్ను 3-2తో విండీస్కు అప్పగించేసింది. 2016 తర్వాత ఓ ద్వైపాక్షిక టీ20 సిరీస్లో విండీస్ చేతిలో భారత్ ఓడిపోవడం ఇదే తొలిసారి. ఈ మ్యాచ్లో బ్యాటింగ్, బౌలింగ్లో హార్దిక్ సేన విఫలమైంది. బ్యాటింగ్ అనుకూలించే పిచ్పై సూర్యకుమార్, తిలక్ మినహా మిగితాందరూ తేలిపోయారు. తొలుత బ్యాటింగ్ చేసిన భారత్ నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 165 పరుగులు చేసింది. భారత బ్యాటర్లలో సూర్యకుమార్ యాదవ్ మరోసారి అద్భుత ఇన్నింగ్స్ ఆడాడు. 45 బంతుల్లో 4 ఫోర్లు, 3 సిక్సర్లతో 61 పరుగులు చేశాడు. అతడితో పాటు తిలక్ వర్మ(27) పరుగులతో రాణించాడు. ఇక బౌలింగ్లో అయితే భారత జట్టు దారుణ ప్రదర్శన కనబరిచారు. విండీస్ బ్యాటర్లు ఓపెనర్ బ్రాండన్ కింగ్(85 నాటౌట్), నికోలస్ పూరన్(47) టీమిండియా బౌలర్లను ఊచకోత కోశారు. భారత బౌలర్లు కేవలం రెండు వికెట్లు మాత్రమే పడగొట్టారు. లక్ష్య ఛేదనలో వెస్టిండీస్ 18 ఓవర్లలో 2 వికెట్లు కోల్పోయి 171 పరుగులు చేసి గెలిచింది. హార్దిక్ చెత్త కెప్టెన్సీ.. ఇక విండీస్పై సిరీస్ కోల్పోవడాన్ని భారత అభిమానులు జీర్ణించుకోలేకపోతున్నారు. టీమిండియా కెప్టెన్ హార్దిక్ పాండ్యాపై తీవ్ర విమర్శలు వర్షం కురిపిస్తున్నారు. హార్దిక్ చెత్త కెప్టెన్సీ వల్లే భారత్ ఓడిపోయిందని సోషల్ మీడియాలో పోస్టులు చేస్తున్నారు. ఈ మ్యాచ్లో హార్దిక్ సైతం దారుణ ప్రదర్శన కనబరిచాడు. India have lost their first T20i series in 25 months. pic.twitter.com/YFhQ8qGuPq — Mufaddal Vohra (@mufaddal_vohra) August 13, 2023 తొలుత బ్యాటింగ్లో 18 బంతులు ఆడి 14 పరుగులు చేసిన పాండ్యా.. అనంతరం బౌలింగ్లో అయితే ఘోరంగా విఫలమయ్యాడు. 3 ఓవర్లు వేసి 32 పరుగులు సమర్పించుకున్నాడు. ఈ క్రమంలో కెప్టెన్గా ఇదేనా నీ ఆట? అంటూ ప్రశ్నల వర్షం కురిపిస్తున్నారు. మరికొంత మంది ఇంత చెత్త కెప్టెన్ను ఇప్పటివరకు చూడలేదంటూ కామెంట్లు చేస్తున్నారు. చదవండి: ఓడిపోవడం మంచిదే.. మా బాయ్స్ అద్భుతం! చాలా సంతోషంగా ఉన్నా: హార్దిక్ Hardik Pandya 🤬🤬#IndvsWI pic.twitter.com/Szxd83kwSo — Sachin Tripathi (@sachintrilko95) August 13, 2023 -
బాబూ సంజూ నీ పని అయిపోయింది.. ఇక ఐపీఎల్లో ఆడుకోవడమే!
వెస్టిండీస్తో టీ20 సిరీస్లో టీమిండియా వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ తీవ్ర నిరాశపరిచాడు. తనకు వచ్చిన అవకాశాలను అందిపుచ్చుకోవడంలో శాంసన్ విఫలమయ్యాడు. ఈ సిరీస్లో భాగంగా విండీస్తో జరిగిన కీలక ఐదో టీ20లో కూడా శాంసన్ పేలవ ప్రదర్శన కనబరిచాడు. కీలక సమయంలో బ్యాటింగ్ వచ్చిన సంజూ.. 9 బంతుల్లో 13 పరుగులు చేసి పెవిలియన్కు చేరాడు. ఓవరాల్గా ఈ సిరీస్లో మూడు మ్యాచ్లు ఆడిన శాంసన్.. 32 పరుగులు మాత్రమే చేసశాడు. అంతకుముందు వన్డే సిరీస్లో కూడా ఒక హాఫ్సెంచరీ మినహా పెద్దగా అకట్టుకోలేకపోయాడు. ఎప్పటి నుంచో జట్టులో ఛాన్స్ కోసం ఎదురుచూస్తున్న సంజూ.. ఇటువంటి ప్రదర్శన చేయడం అభిమానులు జీర్ణించుకోలేకపోతున్నారు. ఇక సంజూ అంతర్జాతీయ కెరీర్ ముగిసినట్లేనని, ఐపీఎల్లో ఆడుకోవడమేనని నెటిజన్లు సెటైర్లు వేస్తున్నారు. Thankyou sanju samson 🙏 pic.twitter.com/SOFhyRWGNr — Arun Singh (@ArunTuThikHoGya) August 13, 2023 కాగా ఐపీఎల్లో 3800పైగా పరుగులు చేసిన సంజూ.. అంతర్జాతీయ టీ20ల్లో మాత్రం పెద్దగా రాణించలేకపోతున్నాడు. ఇప్పటివరకు తన కెరీర్లో 19 టీ20 మ్యాచ్లు ఆడిన శాంసన్ 18.62 సగటుతో కేవలం 333 పరుగులు మాత్రమే చేశాడు. అతడి ఇన్నింగ్స్లలో ఒకే ఒక హాఫ్ సెంచరీ ఉంది. ఈ క్రమంలో అతడికి ఆసియాకప్, వన్డే ప్రపంచకప్కు భారత జట్టులో చోటు దక్కే అవకాశం లేదు. ఇక ఆఖరి టీ20లో ఓటమి పాలైన టీమిండియా 3-2 తేడాతో సిరీస్ కోల్పోయింది. చదవండి: ఓడిపోవడం మంచిదే.. మా బాయ్స్ అద్భుతం! చాలా సంతోషంగా ఉన్నా: హార్దిక్ Samson in T20I (So far) 19, 6, 8, 2, 23, 15, 10, 27, 7, 0, 39, 18, 77, 30*, 15, 5, 12, 7, 13 Average : 18.50 should he get more chances in this format?? #SanjuSamson #INDvsWI pic.twitter.com/dr9kZLsQD6 — hitman Hargun godara (@GodaraHargun) August 13, 2023 -
ఓడిపోవడం మంచిదే.. మా బాయ్స్ అద్భుతం! చాలా సంతోషంగా ఉన్నా: హార్దిక్
వెస్టిండీస్ గడ్డపై టెస్టు, వన్డే సిరీస్లను సొంతం చేసుకున్న టీమిండియా.. టీ20 సిరీస్ మాత్రం ప్రత్యర్ధి జట్టుకు అప్పగించేసింది. ఫ్లోరిడా వేదికగా విండీస్తో జరిగిన సిరీస్ డిసైడర్ ఐదో టీ20లో 8 వికెట్ల తేడాతో టీమిండియా ఓడిపోయింది. దీంతో ఐదు మ్యాచ్ల సిరీస్ను 3-2తో భారత్ కోల్పోయింది. తొలుత బ్యాటింగ్ చేసిన టీమిండియా.. నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 165 పరుగులు చేసింది. భారత బ్యాటర్లలో సూర్యకుమార్ యాదవ్ మరోసారి అద్భుత ఇన్నింగ్స్ ఆడాడు. 45 బంతుల్లో 4 ఫోర్లు, 3 సిక్సర్లతో 61 పరుగులు చేశాడు. అతడితో పాటు తిలక్ వర్మ (18 బంతుల్లో 27; 3 ఫోర్లు, 2 సిక్స్లు) కాసేపు మెరుపులు మెరిపించాడు. విండీస్ బౌలర్లలో రొమారియో షెఫర్డ్ 4 వికెట్లు పడగొట్టి భారత్ను దెబ్బతీశాడు. అనంతరం లక్ష్యఛేదనకు దిగిన వెస్టిండీస్ 18 ఓవర్లలో 2 వికెట్లు కోల్పోయి 171 పరుగులు చేసి గెలిచింది. విండీస్ బ్యాటర్లలో ఓపెనర్ బ్రాండన్ కింగ్ (55 బంతుల్లో 85 నాటౌట్; 5 ఫోర్లు, 6 సిక్స్లు), నికోలస్ పూరన్ (35 బంతుల్లో 47; 1 ఫోర్, 4 సిక్సర్లు) చెలరేగారు. భారత బౌలర్లలో అర్ష్దీప్ సింగ్, తిలక్ వర్మ తలా వికెట్ మాత్రమే సాధించారు. ఇక ఈ సిరీస్ ఓటమిపై మ్యాచ్ అనంతరం టీమిండియా కెప్టెన్ హార్దిక్ పాండ్యా స్పందించాడు. ఈ ఓటమి నుంచి చాలా విషయాలు నేర్చుకున్నామని హార్దిక్ తెలిపాడు. "మేము మొదట్లో వికెట్లు కోల్పోయినప్పటికీ.. సూర్య, తిలక్ ఇన్నింగ్స్ను చక్కదిద్దారు. నేను బ్యాటింగ్కు వచ్చే అంతవరకు అంతా బాగానే ఉంది. ఆ తర్వాత మేము మా రిథమ్ను కోల్పోయాము. స్కోరు వేగాన్ని పెంచడంలో విఫలమయ్యాం. అక్కడ పరిస్థితిని సరిగ్గా ఉపయోగించుకోలేకపోయాము. రాబోయే సిరీస్ల్లో మేము మరింత మెరుగ్గా రాణించేందుకు ప్రయత్నిస్తాము. ఇక ఈ ఓటమి గురించి పెద్దగా ఆలోచించాల్సిన అవసరం లేదు. ఒక్కోసారి ఓడిపోవడం కూడా మంచిదవుతుంది. ఎందుకంటే ఈ సిరీస్లో మాకు చాలా పాజిటివ్ అంశాలు ఉన్నాయి. మేము ఈ సిరీస్ నుంచి చాలా విషయాలు నేర్చుకున్నాం. యువ ఆటగాళ్ల టాలెంట్ను గుర్తించడానికి మాకు చాలా ఉపయోగపడింది. ఈ సిరీస్లో మా బాయ్స్ ప్రదర్శన బాగానే ఉంది. మా బాయ్స్ తమ సత్తా ఎంటో చూపించారు. వారి ప్రదర్శన పట్ల నాకు చాలా సంతోషంగా ఉంది. ప్రతీ ఒక్క ఆటగాడు కొత్తగా ట్రై చేశారు. మ్యాచ్ను వీక్షించడానికి వచ్చిన ప్రతీ ఒక్కరికి ధన్యవాదాలు . వచ్చే ఏడాది టీ20 ప్రపంచకప్ కూడా ఇక్కడే జరగనుంది. అప్పుడు మరింత మంది అభిమానులు రావడం ఖాయమని" పోస్ట్ మ్యాచ్ ప్రేజేంటేషన్లో హార్దిక్ పేర్కొన్నాడు. చదవండి: IND vs WI: ఐదో టీ20లో టీమిండియా ఓటమి.. సిరీస్ సమర్పయామి -
IND VS WI 5th T20: టాస్ గెలిచిన టీమిండియా.. అదే జట్టుతో బరిలోకి..!
5 మ్యాచ్ల సిరీస్లో భాగంగా ఫ్లోరిడా వేదికగా విండీస్తో ఇవాళ (ఆగస్ట్ 13) జరుగుతున్న నిర్ణయాత్మక ఐదో టీ20లో టీమిండియా టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకుంది. సిరీస్లో తొలి రెండు మ్యాచ్లు ఓడిపోయి 0-2తో వెనుకపడిన భారత్.. ఆతర్వాత అనూహ్యంగా పుంజుకుని మూడు, నాలుగు మ్యాచ్లు గెలిచి 2-2తో సిరీస్లో సమంగా నిలిచింది. చివరిదైన ఈ మ్యాచ్లో గెలిచిన జట్టు సిరీస్ను కైవసం చేసుకుంటుంది. నాలుగో మ్యాచ్లో బరిలోకి దిగిన జట్టునే టీమిండియా యధాతథంగా కొనసాగించగా.. విండీస్ ఓ మార్పు చేసింది. ఒబెద్ మెక్కాయ్ స్థానంలో అల్జరీ జోసఫ్ బరిలోకి దిగాడు. వెస్టిండీస్ (ప్లేయింగ్ XI): కైల్ మేయర్స్, బ్రాండన్ కింగ్, షాయ్ హోప్, నికోలస్ పూరన్, షిమ్రాన్ హెట్మెయర్, రోవ్మన్ పావెల్ (సి), జేసన్ హోల్డర్, రోస్టన్ ఛేజ్, రొమారియో షెపర్డ్, అకీల్ హోసేన్, అల్జరీ జోసెఫ్ భారత్ (ప్లేయింగ్ XI): శుభమన్ గిల్, యశస్వి జైస్వాల్, సూర్యకుమార్ యాదవ్, తిలక్ వర్మ, హార్దిక్ పాండ్యా(c), సంజు శాంసన్, అక్షర్ పటేల్, కుల్దీప్ యాదవ్, యుజ్వేంద్ర చాహల్, అర్ష్దీప్ సింగ్, ముఖేష్ కుమార్ -
'హర్దిక్ భాయ్కు చాలా థాంక్స్.. అతడితో కలిసి ఆడటం చాలా సంతోషం'
యశస్వీ జైశ్వాల్.. భారత క్రికెట్లో యువ సంచలనం. వెస్టిండీస్తో జరిగిన తొలి టెస్టుతో అంతర్జాతీయ క్రికెట్లో అడుగుపెట్టాడు ఈ 21 ఏళ్ల ముంబైకర్. అరంగేట్ర టెస్టులోనే అద్బుత సెంచరీతో క్రికెట్ ప్రపంచానికి తన పేరును పరిచయం చేసుకున్నాడు. సాంప్రాదాయ క్రికెట్లో తన అగమనాన్ని ఘనంగా చాటుకున్న యశస్వీ.. ఇప్పుడు టీ20ల్లో కూడా తన మార్క్ను చూపించాడు. గయానా వేదికగా వెస్టిండీస్తో జరిగిన మూడు టీ20తో డెబ్యూ చేసిన జైశ్వాల్.. కేవలం ఒక్క పరుగు మాత్రమే చేసి నిరాశపరిచాడు. దీంతో అతడికి నాలుగో టీ20లో చోటు దక్కదని, మళ్లీ ఇషాన్ కిషన్ను తీసుకువస్తారని అంతా భావించారు. కానీ కెప్టెన్ హార్దిక్ పాండ్యా మాత్రం అతడిపై నమ్మకం ఉంచి ఫ్లోరిడా వేదికగా జరిగిన నాలుగో టీ20లో కూడా అవకాశం ఇచ్చాడు. హార్దిక్ నమ్మకాన్ని జైశ్వాల్ వమ్ము చేయలేదు. ఈ మ్యాచ్లో ఆకాశమే హద్దుగా చెలరేగిపోయాడు. 51 బంతుల్లో 11 ఫొర్లు, 3 సిక్స్లతో 84 పరుగులు చేసి ఆజేయంగా నిలిచాడు. గిల్తో కలిసి తొలి వికెట్కు 165 పరుగుల భారీ భాగస్వామ్యం నెలకొల్పాడు. ఆఖరి వరకు క్రీజులో నిలిచి భారత జట్టును విజయతీరాలకు చేర్చాడు. కాగా అతడి అద్భుత ప్రదర్శనకు గాను మ్యాన్ ఆఫ్ది మ్యాచ్ అవార్డు దక్కింది. ఇక మ్యాచ్ అనంతరం తన ప్రదర్శనపై యశస్వీ జైశ్వాల్ కీలక వాఖ్యలు చేశాడు. "టీ20 ఫార్మాట్లో ఆడటం అంత సులభం కాదు. కానీ అంతర్జాతీయ వేదికపై సత్తాచాటడంచాలా సంతోషంగా ఉంది. నన్ను నేను నిరూపించుకోవడానికి ఇది మంచి అవకాశంగా భావించాను. ముఖ్యంగా నాకు ఎంతో మద్దతుగా నిలిచిన సపోర్ట్ స్టాప్, హార్దిక్ భాయ్కి ధన్యవాదాలు చెప్పాలనుకుంటున్నాను. తొలి మ్యాచ్లో విఫలమైనా నాపై చాలా నమ్మకం ఉంచారు. అది నాపై చాలా ప్రభావం చూపుతుంది. జట్టుకు ఏం కావాలో చూసి.. దానికి తగ్గట్లు ఆడేందుకు ఎల్లప్పుడూ ప్రయత్నిస్తాను. అదే సమయంలో నన్ను నేను ప్రూవ్ చేసుకోనేందుకు కూడా ప్రయత్నిస్తాను. వికెట్ను అర్ధం చేసుకుని త్వరగా పరుగులు సాధించడానికి ట్రై చేస్తాను. పవర్ప్లేలో జట్టుకు మంచి ఆరంభం ఇవ్వడమే నా టార్గెట్. ఇక నేను ఐపీఎల్లో హోల్డర్, మెకాయ్ బౌలింగ్ను చాలా సార్లు ఎదుర్కొన్నాను. అది ఈ మ్యాచ్లో నాకు ఉపయోగపడింది. అదే విధంగా గిల్తో కలిసి భాగస్వామ్యం నెలకొల్పడం చాలా సంతోషంగా ఉంది. గిల్ చాలా బాగా ఆడాడు. అతడు స్ట్రైక్ రోటాట్ చేసిన విధానం అద్భుతం. ఇక ఆఖరిగా నాకు మద్దతుగా నిలిచిన ప్రతీఒక్కరికి ధన్యవాదాలు" అంటూ పోస్ట్ మ్యాచ్ ప్రేజేంటేషన్లో జైశ్వాల్ పేర్కొన్నాడు. Yashasvi Jaiswal 🗣️on his 1st T20I 5️⃣0️⃣. Here's the full press conference. Listen in 👇.@Wowmomo4u #WIvIND #YashasviJaiswal pic.twitter.com/G2XZgJvdPn — RevSportz (@RevSportz) August 13, 2023 చదవండి: IND vs WI: వెస్టిండీస్తో ఐదో టీ20.. కీలక ఆటగాడిపై వేటు! స్పీడ్ స్టార్కు ఛాన్స్ -
వెస్టిండీస్తో ఐదో టీ20.. కీలక ఆటగాడిపై వేటు! స్పీడ్ స్టార్కు ఛాన్స్
వెస్టిండీస్తో టీ20 సిరీస్లో రెండు వరుస విజయాలతో ఊపుందుకున్న టీమిండియా.. మరో కీలక పోరుకు సిద్దమైంది. ఫోరిడా వేదికగా శనివారం జరిగిన నాలుగో టీ20లో విండీస్ను భారత్ చిత్తు చేయడంతో సిరీస్ 2-2 సమమైంది. ఈ క్రమంలో ఇదే వేదికలో ఆదివారం జరగనున్న సిరీస్ డిసైడర్ ఐదో టీ20లో భారత్-విండీస్ జట్లు అమీతుమీ తెల్చుకోనున్నాయి. ఈ మ్యాచ్లో ఎలాగైనా గెలిచి సిరీస్ను సొంతం చేసుకోవాలని భారత జట్టు భావిస్తోంది. మరోవైపు కరేబియన్లు ఈ మ్యాచ్లో గెలిచి కనీసం టీ20 సిరీస్నైనా తమ ఖాతాలో వేసుకోవాలని వ్యూహాలు రచిస్తోంది. ఈ మ్యాచ్ భారత కాలమానం ప్రకారం ఆదివారం రాత్రి 8:00 గంటలకు ప్రారంభం కానుంది. చాహల్పై వేటు.. ఇక ఈ మ్యాచ్లో టీమిండియా ఒకే మార్పుతో బరిలోకి దిగే అవకాశం ఉంది. స్పిన్నర్ యుజువేంద్ర చాహల్ స్ధానంలో యువ పేసర్ ఉమ్రాన్ మాలిక్ను తీసుకోనున్నట్లు తెలుస్తోంది. ఈ సిరీస్లో ఇప్పటి వరకు మాలిక్కు తుది జట్టులో చోటు దక్కలేదు. అదే విధంగా ఫ్లోరిడా పిచ్ పేసర్లకు కాస్త అనుకూస్తుంది కాబట్టి ఉమ్రాన్కు ఛాన్స్ ఇవ్వనున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. మరోవైపు విండీస్ కూడా ఒకే ఒక మార్పుతో ఆడనున్నట్లు సమాచారం. నాలుగో టీ20లో విఫలమైన ఓడియన్ స్మిత్ స్ధానంలో అల్జారీ జోసఫ్ను తిరిగి తీసుకురావాలని విండీస్ జట్టు మెనెజ్మెంట్ యోచిస్తున్నట్లు పలు నివేదికలు వెల్లడించాయి. వెస్టిండీస్ జట్టు (అంచనా): బ్రాండన్ కింగ్, కైల్ మేయర్స్, జాన్సన్ చార్లెస్, నికోలస్ పూరన్, రావ్మెన్ పావెల్ (కెప్టెన్), షిమ్రాన్ హెట్మెయర్, రొమేరియో షెఫర్డ్, జేసన్ హోల్డర్, అకీల్ హొస్సేన్, అల్జారీ జోసెఫ్, ఓబెడ్ మెకాయ్ భారత జట్టు (అంచనా): యశస్వి జైస్వాల్, శుభ్మన్ గిల్, సూర్యకుమార్ యాదవ్, తిలక్ వర్మ, హార్దిక్ పాండ్యా (కెప్టెన్), సంజూ శాంసన్, అక్షర్ పటేల్, అర్షదీప్ సింగ్, ఉమ్రాన్ మాలిక్, ముఖేష్ కుమార్, కుల్దీప్ యాదవ్ చదవండి: ఇదే నేను ఆశించా.. చాలా సంతోషంగా ఉంది! వారిద్దరూ అద్భుతం: హార్దిక్ -
ఐపీఎల్లోనే ఆడుతాడు.. పనికిరాడన్నారు!నోళ్లు మూయించాడుగా!
వెస్టిండీస్తో టీ20 సిరీస్లో టీమిండియా యువ ఓపెనర్ శుబ్మన్ గిల్ ఎట్టకేలకు తన పవర్ ఎంటొ చూపించాడు. ఫ్లోరిడా వేదికగా విండీస్తో జరిగిన నాలుగో టీ20లో గిల్ ఆకాశమే హద్దుగా చెలరేగిపోయాడు. ప్రత్యర్ధి బౌలర్లను ఊచకోత కోశాడు. 179 పరుగుల లక్ష్య ఛేదనలో మరోఓపెనర్ యశస్వీ జైశ్వాల్తో కలిసి స్కోర్బోర్డును పరుగులు పెట్టించాడు. జైశ్వాల్తో కలిసి తొలి వికెట్కు 165 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పాడు. ఓవరాల్గా 47 బంతులు ఎదుర్కొన్న 3 ఫోర్లు, 5 సిక్స్లతో 77 పరుగులు చేశాడు. ఈ మ్యాచ్లో 9 వికెట్ల తేడాతో భారత్ ఘనవిజయం సాధించింది. గిల్తో పాటు జైశ్వాల్(84) కూడా అద్బుత ఇన్నింగ్స్ ఆడాడు. జైశ్వాల్కు మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు దక్కింది. అప్పుడు అలా.. ఇప్పుడు ఇలా కాగా ఈ సిరీస్లో తొలి మూడు మ్యాచ్ల్లో గిల్ తీవ్రనిరాశపరిచాడు. కేవలం 19 పరుగులు మాత్రమే చేసి తీవ్ర విమర్శలు పాలైయ్యాడు. "ఐపీఎల్లో మాత్రమే ఆడుతాడని, అహ్మదాబాద్ పిచ్ను తాయారు చేయండి అంటూ" నెటిజన్లు దారుణంగా ట్రోలు చేశారు. The Shubman Gill JAB is back! 🔥 📷: Jio Cinema#ShubmanGill #YashasviJaiswal #WIvIND #SportsKeeda pic.twitter.com/7IC6G950Jk — Sportskeeda (@Sportskeeda) August 12, 2023 అయితే అప్పుడు విమర్శించిన వాళ్లే ఇప్పుడు ప్రశంసిస్తున్నారు. గిల్ ఈజ్ బ్యాక్.. ఎక్కడైనా బౌలర్లకు చుక్కలే అంటూ సోషల్ మీడియాలో పోస్టులు చేస్తున్నారు. ఇక భారత్ విండీస్ మధ్య సిరీస్ డిసైడర్ ఇదే వేదికలో ఆదివారం జరగనుంది. చదవండి: ఇదే నేను ఆశించా.. చాలా సంతోషంగా ఉంది! వారిద్దరూ అద్భుతం: హార్దిక్ Such a eye pleasing shot by Shubman Gill 😍🎇#INDvsWI #WIvIND #ShubmanGill pic.twitter.com/eToF5Y19uv — Shadev Thakur (@shadevrana0061) August 12, 2023 -
ఇదే నేను ఆశించా.. వారిద్దరూ అద్భుతం! ఆఖరి మ్యాచ్లో కూడా: హార్దిక్
రెండు సార్లు టీ20 ప్రపంచకప్ ఛాంపియన్ వెస్టిండీస్కు.. టీమిండియా తమ బ్యాటింగ్ పవర్ చూపించింది. ఫ్లోరిడా వేదికగా విండీస్తో జరిగిన నాలుగో టీ20లో 9 వికెట్ల తేడాతో టీమిండియా ఘనవిజయం సాధించింది. 179 పరుగుల భారీ లక్ష్యాన్ని భారత జట్టు అలోవకగా ఛేదించింది. భారత విజయంలో ఓపెనర్లు శుబ్మన్ గిల్, యశస్వీ జైశ్వాల్ కీలక పాత్ర పోషించారు. లక్ష్య ఛేదనలో వీరిద్దరూ తొలి వికెట్కు 165 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పారు. యశస్వీ జైశ్వాల్(84 నాటౌట్), శుబ్మన్ గిల్(77) పరుగులతో అద్భుత ఇన్నింగ్స్ ఆడారు. అంతకుముందు బ్యాటింగ్ చేసిన విండీస్ 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 178 పరుగులు చేసింది. విండీస్ బ్యాటర్లలో షిమ్రాన్ హెట్మైర్(61), షై హోప్(45) పరుగులతో రాణించారు. . భారత బౌలర్లలో అర్ష్దీప్ సింగ్ మూడు వికెట్లు, కుల్దీప్ యాదవ్ రెండు, ముఖేష్ కుమార్, చాహల్ తలా వికెట్ సాధించారు. ఇక అద్భుత విజయంపై మ్యాచ్ అనంతరం టీమిండియా కెప్టెన్ హార్దిక్ పాండ్యా స్పందిచాడు. వారిద్దరూ అద్భుతం.. "ఫోరిడాలో ఎక్కువ మంది భారత అభిమానులు మాకు సపోర్ట్ చేయడానికి స్టేడియంకు వచ్చారు. మేము వికెట్ తీసినా, బౌండరీలు బాదినా వారు చప్పట్లు కొట్టి మాకు మద్దతుగా నిలిచారు. మేము కూడా వారికి పూర్తిస్ధాయిలో క్రికెట్ మజాను అందించాము. ఇక ఈమ్యాచ్లో గిల్-జైశ్వాల్ ఆడిన విధానం గురించి ఎంత చెప్పుకున్న తక్కువే. వారిద్దరికి అద్భుతమైన బ్యాటింగ్ స్కిల్స్ ఉన్నాయి. వారు మ్యాచ్ ఫినిష్ చేసిన విధానం నన్నో ఎంతోగానో అకట్టుకుంది. ముఖ్యంగా జైశ్వాల్.. టీ20ల్లో కూడా తన ఎంట్రీని ఘనంగా చాటుకున్నాడు. ఇప్పటికే ఐపీఎల్లో అతడి టాలెంట్ ఎంటో చూశాం. ఇక ఈ మ్యాచ్లో గెలిచి సిరీస్ను సమం చేయడం చాలా సంతోషంగా ఉంది. మ్యాచ్ గెలవాలంటే మేము ఒక యూనిట్గా రాణించాలని నేను పదేపదే చెబుతున్నా. బ్యాటింగ్ యూనిట్ బౌలర్లకు సపోర్ట్గా ఉండాలి. ఎందుకంటే బౌలర్లు నిజమైన మ్యాచ్ విన్నర్లు. వారు ఒక రెండు వికెట్లు పడగొడితే చాలు మ్యాచ్ స్వరూపమే మారిపోతుంది. ఒక కెప్టెన్గా మా బాయ్స్ నుంచి ఇటువంటి ప్రదర్శనే నేను ఆశిస్తాను. కెప్టెన్గా నా ఆలోచనకే తగ్గట్టే నేను ముందకు వెళ్లాలి అనుకుంటా. తొలి రెండు మ్యాచ్ల్లో ఓడిపోయి కాస్త నిరాశ చెందాము. ఎందుకంటే తొలి మ్యాచ్ను చిన్నచిన్న తప్పిదాల వల్ల కోల్పోయాము. కానీ మేము ఆడిన చివరి రెండు మ్యాచ్ల్లో అద్భుతమైన ప్రదర్శన కనబరిచాం. ఈ రెండు మ్యాచ్ల విజయాలు మాకు చాలా కాన్ఫిడెన్స్ కలిగించాయి. ఆఖరి మ్యాచ్లో కూడా ఇదే దూకుడు కనబరిచి సిరీస్ను సొంతం చేసుకోవాలని అనుకుంటున్నామని పోస్ట్ మ్యాచ్ ప్రేజేంటేషన్లో హార్దిక్ పేర్కొన్నాడు. చదవండి: IND vs WI: చరిత్ర సృష్టించిన జైశ్వాల్-గిల్ జోడీ.. ఐదేళ్ల తర్వాత! -
చరిత్ర సృష్టించిన జైశ్వాల్-గిల్ జోడీ.. ఐదేళ్ల తర్వాత!
ఫ్లోరిడా వేదికగా వెస్టిండీస్తో జరిగిన నాలుగో టీ20లో 9 వికెట్ల తేడాతో టీమిండియా ఘన విజయం సాధించింది. దీంతో ఐదు మ్యాచ్ల సిరీస్ను టీమిండియా 2-2తో సమం చేసింది. తొలుత టాస్ గెలిచి బ్యాటింగ్ చేసిన విండీస్ 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 178 పరుగులు చేసింది. షిమ్రాన్ హెట్మైర్ (39 బంతుల్లో 61; 3 ఫోర్లు, 4 సిక్స్లు), షై హోప్ (29 బంతుల్లో 45; 3 ఫోర్లు, 2 సిక్స్లు) ధాటిగా ఆడారు. భారత బౌలర్లలో అర్ష్దీప్ సింగ్ మూడు వికెట్లు, కుల్దీప్ యాదవ్ రెండు, ముఖేష్ కుమార్, చాహల్ తలా వికెట్ సాధించారు. ఓపెనర్ల విధ్వంసం.. 179 పరుగుల భారీ భారీ లక్ష్యాన్ని టీమిండియా కేవలం 17 ఓవర్లలోనే ఊదిపడేసింది. లక్ష్య ఛేదనలో భారత యువ ఓపెనర్లు శుబ్మన్ గిల్, యశస్వీ జైశ్వాల్ అద్భుతమైన ఇన్నింగ్స్లు ఆడారు. విండీస్ బౌలర్లకు చుక్కలు చూపించారు. వీరిద్దరూ తొలి వికెట్కు 165 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పారు. యశస్వి జైస్వాల్ (51 బంతుల్లో 84 నాటౌట్; 11 ఫోర్లు, 3 సిక్స్లు), శుబ్మన్ గిల్ (47 బంతుల్లో 77; 3 ఫోర్లు, 5 సిక్స్లు) అదరగొట్టారు. రోహిత్-రాహుల్ రికార్డు సమం.. ఈ మ్యాచ్లో దుమ్మురేపిన జైశ్వాల్, గిల్ ఓ అరుదైన రికార్డును తన పేరిట లిఖించుకున్నాడు. టీ20ల్లో భారత తరపున రెండో అత్యధిక భాగస్వామ్యం నెలకొల్పిన జంటగా గిల్, జైశ్వాల్ నిలిచారు. ఈ క్రమంలో రోహిత్ శర్మ-రాహుల్ రికార్డును ఈ యువ జోడీ సమం చేసింది. 2017లో ఓ టీ20 మ్యాచ్లో శ్రీలంకపై రోహిత్-రాహుల్ కూడా 165 పరుగుల భాగస్వామే నెలకొల్పారు. ఇక అరుదైన ఘనత సాధించిన జాబితాలో దీపక్ హుడా-సంజూ శాంసన్ జోడి అగ్రస్ధానంలో ఉంది. 2022లో ఐర్లాండ్పై హడా, సంజూ ఏకంగా 176 పరుగుల భాగస్వామ్యాన్ని నమోదు చేశారు. చదవండి: IND vs WI: చెలరేగిన ఓపెనర్లు.. నాలుగో టీ20లో భారత్ ఘన విజయం "ʙᴀᴛᴛɪɴɢ, ᴛᴜ ʙᴀʜᴏᴛ ᴄʜᴀɴɢᴇ ʜᴏɢᴀʏɪ ʜᴀɪ."#WIvIND #INDvWIAdFreeonFanCode pic.twitter.com/FWm8rjacYN — FanCode (@FanCode) August 12, 2023 -
వెస్టిండీస్తో నాలుగో టీ20.. తొమ్మిది వికెట్ల తేడాతో టీమిండియా గెలుపు
West Indies vs India, 4th T20: వెస్టిండీస్తో నాలుగో టీ20లో టీమిండియా ఘన విజయం సాధించింది . శుభమాన్ గిల్ , యశస్వీ జైస్వాల్ల అద్భుత బ్యాటింగ్ ప్రదర్శనతో టీమిండియా వెస్టిండీస్ పై సునాయాసంగా విజయం సాధించింది. టీమిండియాతో నాలుగో టీ20లో వెస్టిండీస్ మంచి స్కోరు నమోదు చేసింది. నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 178 పరుగులు చేసింది. షిమ్రన్ హెట్మెయిర్ 61 పరుగులతో టాప్ స్కోరర్గా నిలిచాడు. కాగా అమెరికాలోని ఫ్లోరిడాలో హార్దిక్ సేన.. రోవ్మన్ పావెల్ బృందం నాలుగో టీ20 మ్యాచ్లో తలపడుతున్నాయి. టాస్ గెలిచిన కరేబియన్ జట్టు తొలుత బ్యాటింగ్ ఎంచుకుంది. అర్ష్దీప్ సింగ్ ఆరంభంలోనే ఓపెనర్లు కైల్ మేయర్స్(17), బ్రాండన్ కింగ్(18)లను పెవిలియన్కు పంపాడు. వన్డౌన్ బ్యాటర్ షాయీ హోప్(45) జట్టును ఆదుకునే ప్రయత్నం చేయగా.. నికోలస్ పూరన్(1), రోవ్మన్ పావెల్(1)లను ఒకే ఓవర్లో కుల్దీప్ యాదవ్ అవుట్ చేశాడు. హోప్నకు తోడైన షిమ్రన్ హెట్మెయిర్(61) అర్ధ శతకంతో అండగా నిలిచాడు. వీరిద్దరి అద్భుత బ్యాటింగ్తో 8 వికెట్ల నష్టానికి 178 పరుగులు చేసింది వెస్టిండీస్. భారత బౌలర్లలో అర్ష్దీప్ సింగ్కు మూడు, కుల్దీప్నకు రెండు, చహల్, ముకేశ్ కుమార్, అక్షర్ పటేల్ ఒక్కో వికెట్ తమ ఖాతాలో వేసుకున్నారు. ఇదిలా ఉంటే.. ఐదు మ్యాచ్ల టీ20 సిరీస్లో కరేబియన్ జట్టు ఇప్పటికే 2-1తో ఆధిక్యంలో ఉంది. ఒకవేళ ఈ మ్యాచ్లో గనుక తేడా జరిగితే టీమిండియాకు ఘోర పరాభవం తప్పదు. అయితే, బ్యాటింగ్ పిచ్పై 179 పరుగుల టార్గెట్ టీమిండియాకు పెద్ద సవాలు కాబోదని అభిమానులు ధీమాగా ఉన్నారు. Arshdeep loves making these mini comebacks!#WIvIND #INDvWIAdFreeonFanCode pic.twitter.com/ksPeRQB4c2 — FanCode (@FanCode) August 12, 2023 -
Ind Vs WI: అదరగొట్టిన అర్ష్దీప్! ఒకే ఓవర్లో కుల్దీప్.. వీడియోలు వైరల్
West Indies vs India, 4th T20I: అమెరికాలోని ఫ్లోరిడా వేదికగా నాలుగో టీ20 ఆరంభంలోనే టీమిండియా యువ పేసర్ అర్ష్దీప్ సింగ్ వెస్టిండీస్కు షాకిచ్చాడు. టాస్ గెలిచి దూకుడుగా బ్యాటింగ్ మొదలెట్టిన కరేబియన్లకు రెండో ఓవర్లోనే తన పేస్ పదును రుచి చూపించాడు.7 బంతుల్లో 17 పరుగులతో జోరు మీదున్న ఓపెనర్ కైల్ మేయర్స్ను పెవిలియన్కు పంపాడు. ఓపెనర్ల పని పట్టి గంటకు 135 కిలోమీటర్ల వేగంతో దూసుకొచ్చిన బంతిని తప్పుగా అంచనా వేసిన మేయర్స్ వికెట్ కీపర్ క్యాచ్గా వెనుదిరిగాడు. ఇక ఈ మ్యాచ్లో రెండో వికెట్ను కూడా తన ఖాతాలోనే వేసుకున్నాడు అర్ష్దీప్. ఆరో ఓవర్ నాలుగో బంతికి మరో ఓపెనర్ బ్రాండన్ కింగ్(18)ను అవుట్ చేశాడు. Arshdeep loves making these mini comebacks!#WIvIND #INDvWIAdFreeonFanCode pic.twitter.com/ksPeRQB4c2 — FanCode (@FanCode) August 12, 2023 ఒకే ఓవర్లో రెండు వికెట్లు ఇదిలా ఉంటే.. టీమిండియా చైనామన్ స్పిన్నర్ కుల్దీప్ యాదవ్ సైతం అద్భుత బౌలింగ్తో అదరగొట్టాడు. ఒకే ఓవర్లో బిగ్ హిట్టర్లు నికోలస్ పూరన్(1), రోవ్మన్ పావెల్(1)ను పెవిలియన్కు పంపాడు. ఏడో ఓవర్ ఆరంభంలోనే గూగ్లీతో పూరన్ను బోల్తా కొట్టించగా.. సూర్యకుమార్ యాదవ్ బంతిని ఒడిసిపట్టడంలో ఎటువంటి జాప్యం చేయలేదు. Two wickets in the 1st over of the spell! Chahal in 1st T20I Kuldeep today 💪#WIvIND #INDvWIAdFreeonFanCode pic.twitter.com/Vos81nSMbx — FanCode (@FanCode) August 12, 2023 వైరల్ వీడియోలు దీంతో వెస్టిండీస్ మూడో వికెట్ కోల్పోయింది. అయితే, మూడు బంతుల వ్యవధిలోనే కరేబియన్ జట్టు కెప్టెన్ పావెల్ ఇచ్చిన క్యాచ్ను శుబ్మన్ గిల్ అందుకోవడంతో కుల్దీప్ ఖాతాలో రెండో వికెట్ చేరింది. ఇలా ఆదిలోనే వెస్టిండీస్ను దెబ్బ కొట్టిన టీమిండియా బౌలర్లు అర్ష్దీప్, కుల్దీప్ యాదవ్ల బౌలింగ్ విన్యాసాలకు సంబంధించిన వీడియోలు నెట్టింట వైరల్గా మారాయి. ఇక ఇప్పటికే ఐదు టీ20 మ్యాచ్ల సిరీస్లో వెస్టిండీస్ 2-1తో ఆధిక్యంలో ఉండగా.. ఫ్లోరిడాలో గెలిచి 2-2తో సమం చేయాలని హార్దిక్ సేన పట్టుదలగా ఉంది. తుది జట్లు టీమిండియా: యశస్వి జైశ్వాల్, శుబ్మన్ గిల్, సూర్యకుమార్ యాదవ్, తిలక్ వర్మ, హార్దిక్ పాండ్యా(కెప్టెన్), సంజూ శాంసన్( వికెట్ కీపర్), అక్షర్ పటేల్, కుల్దీప్ యాదవ్, అర్ష్దీప్ సింగ్, యుజ్వేంద్ర చాహల్, ముకేష్ కుమార్. వెస్టిండీస్ బ్రాండన్ కింగ్, కైల్ మేయర్స్, షాయ్ హోప్, నికోలస్ పూరన్(వికెట్ కీపర్), రోవ్మన్ పావెల్(కెప్టెన్), షిమ్రన్ హెట్మైర్, జేసన్ హోల్డర్, రొమారియో షెపర్డ్, ఒడియన్ స్మిత్, అకీల్ హోసిన్, ఒబెడ్ మెకాయ్. -
విండీస్తో టీమిండియా కీలక పోరు.. వెస్టిండీస్ స్కోరు ఎంతంటే!
India tour of West Indies, 2023 - West Indies vs India, 4th T20I: టీమిండియాతో నాలుగో టీ20లో వెస్టిండీస్ నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 178 పరుగులు చేసింది. టీమిండియా బౌలర్లలో అర్ష్దీప్ సింగ్కు 3, కుల్దీప్ యాదవ్కు రెండు, అక్షర్ పటేల్, యజువేంద్ర చహల్, ముకేశ్ కుమార్కు ఒక్కో వికెట్ దక్కాయి. 19.2: అర్ష్దీప్ మరోసారి అర్ష్దీప్ బౌలింగ్లో హెట్మైర్ అవుట్. 61 పరుగులు వ్యక్తిగత స్కోరు వద్ద నిష్క్రమించిన హిట్టర్. విండీస్ స్కోరు 171/8 (19.3) ఏడో వికెట్ కోల్పోయిన వెస్టిండీస్ 15.3: ముకేశ్ కుమార్ బౌలింగ్లో బౌల్డ్ అయిన జేసన్ హోల్డర్. స్కోరు: 132-7 14.2: అక్షర్ పటేల్కు తొలి వికెట్ షెపర్డ్(9) రూపంలో వెస్టిండీస్ ఆరో వికెట్ కోల్పోయింది. అక్షర్ పటేల్ బౌలింగ్లో షెపర్డ్ ఇచ్చిన క్యాచ్ను సంజూ ఒడిసిపట్టాడు. స్కోరు: 119/6 (14.3) ఐదో వికెట్ కోల్పోయిన వెస్టిండీస్ 12.5: టీమిండియా స్పిన్నర్ యజువేంద్ర చహల్ వెస్టిండీస్కు షాకిచ్చాడు. అర్ధ శతకం దిశగా వెళ్తున్న షాయీ హోప్[45(29)]ను పెవిలియన్కు పంపాడు. 109/5 (13.3) 12 ఓవర్లలో విండీస్ స్కోరు: 102/4 నిలకడగా ఆడుతున్న షాయీ హోప్(43), హెట్మెయిర్(22) 10 ఓవర్లలో వెస్టిండీస్ స్కోరు: 79/4 6.5: మళ్లీ దెబ్బేసిన కుల్దీప్ టీమిండియా చైనామన్ స్పిన్నర్ కుల్దీప్ యాదవ్ తన ఖాతాలో రెండో వికెట్ జమచేసుకున్నాడు. ఏడో ఓవర్ మొదటి బంతికి పూరన్ను అవుట్ చేసిన ఈ స్టార్ స్పిన్నర్.. ఐదో బంతికి విండీస్ సారథి పావెల్(1)ను అవుట్ చేశాడు. స్కోరు: 57-4(7) 6.1: మూడో వికెట్ కోల్పోయిన విండీస్ కుల్దీప్ యాదవ్ వెస్టిండీస్కు భారీ షాకిచ్చాడు. బిగ్ హిట్టర్ నికోలస్ పూరన్(1)ను పెవిలియన్కు పంపాడు. విండీస్ స్కోరు: 55/3 (6.1) 5.4: విండీస్ను దెబ్బకొట్టిన అర్ష్దీప్ బ్రాండన్ కింగ్[18(16)] రూపంలో రెండో వికెట్ కోల్పోయిన వెస్టిండీస్. 5 ఓవర్లలో వెస్టిండీస్ స్కోరు: 48-1 1.4: తొలి వికెట్ కోల్పోయిన విండీస్ అర్ష్దీప్ బౌలింగ్లో మేయర్స్ [17(7)] అవుట్. కింగ్, షాయీ హోప్ క్రీజులో ఉన్నారు. Arshdeep loves making these mini comebacks!#WIvIND #INDvWIAdFreeonFanCode pic.twitter.com/ksPeRQB4c2 — FanCode (@FanCode) August 12, 2023 టాస్ గెలిచిన వెస్టిండీస్ వెస్టిండీస్ మరో కీలక మ్యాచ్కు టీమిండియా సిద్ధమైంది. ఇరు జట్ల మధ్య శనివారం నాటి నాలుగో టీ20కి అమెరికాలోని ఫ్లోరిడా వేదికైంది. రీజినల్ పార్క్ స్టేడియంలో హార్దిక్ సేన.. రోవ్మన్ పావెల్ బృందంతో తలపడేందుకు సిద్ధమైంది. టాస్ గెలిచిన విండీస్ తొలుత బ్యాటింగ్ ఎంచుకుంది. ఈ మ్యాచ్లో భారత్ గత మ్యాచ్లో ఆడిన జట్టునే కొనసాగించగా.. వెస్టిండీస్ మూడు మార్పులతో బరిలోకి దిగింది. కాగా ఫ్లోరిడా పిచ్ బ్యాటింగ్కు బాగా అనుకూలంగా ఉంటుంది. ఇప్పటి వరకు ఇక్కడ జరిగిన 13 టి20 మ్యాచ్లలో 11 సార్లు ముందుగా బ్యాటింగ్ చేసిన జట్టే గెలవడం గమనార్హం. ఇదిలా ఉంటే.. ఐదు మ్యాచ్ల సిరీస్లో ఆతిథ్య విండీస్ ఇప్పటికే 2-1తో ఆధిక్యంలో ఉన్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో నాలుగో టీ20లో విజయం సాధిస్తేనే భారత జట్టు సిరీస్ సాధించే దిశగా అడుగులు వేసే అవకాశం ఉంటుంది. ఇదిలా ఉంటే.. వెస్టిండీస్తో రెండు మ్యాచ్ల టెస్టు సిరీస్ను 1-0తో కైవసం చేసుకున్న టీమిండియా.. మూడు మ్యాచ్ల వన్డే సిరీస్ను 2-1తో గెలుచుకుంది. తుది జట్లు టీమిండియా: యశస్వి జైశ్వాల్, శుబ్మన్ గిల్, సూర్యకుమార్ యాదవ్, తిలక్ వర్మ, హార్దిక్ పాండ్యా(కెప్టెన్), సంజూ శాంసన్( వికెట్ కీపర్), అక్షర్ పటేల్, కుల్దీప్ యాదవ్, అర్ష్దీప్ సింగ్, యుజ్వేంద్ర చాహల్, ముకేష్ కుమార్. వెస్టిండీస్ బ్రాండన్ కింగ్, కైల్ మేయర్స్, షాయ్ హోప్, నికోలస్ పూరన్(వికెట్ కీపర్), రోవ్మన్ పావెల్(కెప్టెన్), షిమ్రన్ హెట్మైర్, జేసన్ హోల్డర్, రొమారియో షెపర్డ్, ఒడియన్ స్మిత్, అకీల్ హోసిన్, ఒబెడ్ మెకాయ్. చదవండి: టీమిండియాతో మ్యాచ్.. మనకు ఎవరూ సపోర్ట్ చేయరు: షాదాబ్ ఖాన్ -
Ind Vs WI: భారీ రికార్డుపై కన్నేసిన చహల్.. అదే జరిగితే
West Indies vs India, 4th T20I: వెస్టిండీస్తో నాలుగో టీ20 నేపథ్యంలో టీమిండియా స్టార్ స్పిన్నర్ యజువేంద్ర చహల్ భారీ రికార్డుపై కన్నేశాడు. అంతర్జాతీయ టీ20లలో అత్యంత అరుదైన ఫీట్ ముంగిట నిలిచాడు. కాగా 2016లో టీమిండియా తరఫున అరంగేట్రం చేసిన ఈ లెగ్బ్రేక్ స్పిన్నర్.. అదే ఏడాది జింబాబ్వేతో మ్యాచ్తో టీ20లలో అడుగుపెట్టాడు. హరారే స్పోర్ట్స్ వేదికగా జరిగిన మ్యాచ్లో 4 ఓవర్లు బౌలింగ్ చేసి ఏకంగా 38 పరుగులు సమర్పించుకుని ఒక వికెట్ పడగొట్టాడు. తొలి మ్యాచ్లో పర్వాలేదనిపించిన చహల్.. అంచెలంచెలుగా ఎదుగుతూ టీమిండియా కీలక స్పిన్నర్లలో ఒకడిగా మారాడు. పరిమిత ఓవర్ల క్రికెట్లో తనదైన ముద్ర వేయగలిగాడు. ఊరిస్తున్న భారీ రికార్డు టీమిండియాతో పాటు ఐపీఎల్లోనూ అదరగొడుతున్న ఈ హర్యానా బౌలర్.. పొట్టి ఫార్మాట్లో సత్తా చాటుతున్నాడు. క్యాష్ రిచ్ లీగ్ తాజా ఎడిషన్లో 14 మ్యాచ్లలో 21 వికెట్లు పడగొట్టాడు. అత్యధిక వికెట్ల వీరుల జాబితాలో ఐదో స్థానంలో నిలిచాడు. ప్రస్తుతం వెస్టిండీస్తో టీ20 సిరీస్లో బిజీగా ఉన్న యజువేంద్ర చహల్ను భారీ రికార్డు ఊరిస్తోంది. సెంచరీ వికెట్ల క్లబ్లో చేరేందుకు అంతర్జాతీయ టీ20 క్రికెట్లో చహల్ ఇప్పటి వరకు 95 వికెట్లు పడగొట్టాడు. మరో ఐదు వికెట్లు సాధిస్తే.. సెంచరీ వికెట్ల క్లబ్లో అతడు చేరతాడు. అదే జరిగితే ఈ ఘనత సాధించిన మొట్టమొదటి టీమిండియా బౌలర్గా చరిత్రకెక్కుతాడు. అదే విధంగా ఓవరాల్గా ఈ ఫీట్ నమోదు చేసిన ఎనిమిదో బౌలర్గా నిలుస్తాడు. పిచ్ సంగతి అలా.. మరి చహల్ ఎలా? కాగా ఐదు మ్యాచ్ల టీ20 సిరీస్లో వెస్టిండీస్ ఇప్పటికే 2-1తో ముందంజలో ఉంది. ఈ నేపథ్యంలో అమెరికాలోని ఫ్లోరిడా వేదికగా శనివారం నాటి నాలుగో మ్యాచ్ టీమిండియాకు కీలకంగా మారింది. అయితే, బ్యాటర్లకు స్వర్గధామమైన, పేసర్లకు కాస్త అనుకూలమైన ఫ్లోరిడా పిచ్పై చహల్ ఎలాంటి మ్యాజిక్ చేస్తాడో చూడాలి! ఇక విండీస్తో మూడు మ్యాచ్లలో కలిపి చహల్ ఇప్పటి వరకు నాలుగు వికెట్లు పడగొట్టాడు. ఇదిలా ఉంటే.. భారత్, విండీస్ మధ్య ఈ మైదానంలో 6 టి20లు జరగ్గా, భారత్ నాలుగింటిలో గెలిచి ఒక మ్యాచ్లో ఓడింది. మరో మ్యాచ్లో ఫలితం రాలేదు. గత రెండు మ్యాచ్లలో భారత్ 191, 188 స్కోర్లు చేసింది. ఇప్పటి వరకు అంతర్జాతీయ టీ20లలో 100కు పైగా వికెట్లు సాధించిన బౌలర్లు వీరే షకీబల్ హసన్- బంగ్లాదేశ్-140 టిమ్ సౌథీ- న్యూజిలాండ్- 134 రషీద్ ఖాన్- అఫ్గనిస్తాన్- 130 ఇష్ సోధి- న్యూజిలాండ్-118 లసిత్ మలింగ- శ్రీలంక- 107 షాదాబ్ ఖాన్- పాకిస్తాన్- 104 ముస్తాఫిజుర్ రహమాన్- బంగ్లాదేశ్- 103. చదవండి: తిలక్, యశస్వి బౌలింగ్ చేస్తారు.. ఇకపై: టీమిండియా కోచ్ కీలక వ్యాఖ్యలు -
తిలక్, యశస్వి బౌలింగ్ చేస్తారు.. ఇకపై: టీమిండియా కోచ్ కీలక వ్యాఖ్యలు
Paras Mhambrey Comments: రానున్న మ్యాచ్లలో యువ బ్యాటర్లు తిలక్ వర్మ, యశస్వి జైశ్వాల్లతో బౌలింగ్ చేయిస్తామని టీమిండియా బౌలింగ్ కోచ్ పారస్ మాంబ్రే అన్నాడు. బ్యాట్తో రాణించడంతో పాటు బౌలింగ్ చేయగల సత్తా కూడా వారిలో ఉందంటూ ప్రశంసించాడు. త్వరలోనే తిలక్, యశస్వి బంతితో మైదానంలో దిగడం చూస్తారంటూ కీలక వ్యాఖ్యలు చేశాడు. అరంగేట్రంలో అదరగొట్టారు కాగా వెస్టిండీస్ గడ్డపై అంతర్జాతీయ మ్యాచ్లలో అడుగుపెట్టారు యశస్వి జైశ్వాల్, తిలక్ వర్మ. టెస్టు సిరీస్తో యశూ అరంగేట్రం చేస్తే.. హైదరాబాదీ స్టార్ టీ20లతో ఎంట్రీ ఇచ్చాడు. ముంబై బ్యాటర్ సెంచరీతో టెస్టులను ఆరంభిస్తే.. తిలక్ అరంగేట్ర మ్యాచ్లోనే టాప్ స్కోరర్గా నిలిచాడు. ఇలా ఈ ఇద్దరు లెఫ్టాండర్లు కెరీర్ ఆరంభంలోనే తమదైన ముద్ర వేస్తూ ముందుకు సాగుతున్నారు. ఇండియన్ ప్రీమియర్ లీగ్తో వెలుగులోకి వచ్చిన యశస్వి, తిలక్లు ప్రస్తుతం వెస్టిండీస్తో టీ20 సిరీస్తో బిజీగా ఉన్నారు. ఇదిలా ఉంటే.. ఇప్పటికే 2-1తో ఐదు మ్యాచ్ల సిరీస్లో వెనుకపడ్డ హార్దిక్ సేనకు నాలుగో మ్యాచ్ కీలకంగా మారింది. ఫ్లోరిడాలో శనివారం జరిగే టీ20లో గెలిస్తేనే టీమిండియా సిరీస్ ఆశలు సజీవంగా ఉంటాయి. ఈ నేపథ్యంలో మ్యాచ్కు ముందు విలేకరులతో మాట్లాడిన పారస్ మాంబ్రే.. తిలక్ వర్మ, యశస్వి జైశ్వాల్ గురించి చేసిన వ్యాఖ్యలు ఆసక్తికరంగా మారాయి. కనీసం ఒక్క ఓవర్ అయినా వేస్తారు ‘‘అన్ని విభాగాల్లో రాణించగల నైపుణ్యాలు గల ఆటగాళ్లు అందుబాటులో ఉంటే బాగుంటుంది. తిలక్, యశస్వి అండర్ 19 క్రికెట్ ఆడేటపుడు బౌలింగ్ చేయడం నేను చూశాను. నాణ్యమైన బౌలర్లుగా ఎదగగల సత్తా వారిలో ఉంది. బ్యాటింగ్తో పాటు బౌలింగ్పై కూడా దృష్టి సారిస్తే కచ్చితంగా రాణిస్తారు. ఇలాంటి ఆప్షన్లు ఉన్నపుడు సహజంగానే జట్టుకు ఉపయోగకరంగా ఉంటుంది. వాళ్లపై మేము కూడా ఫోకస్ చేస్తున్నాం. త్వరలోనే టీమిండియా తరఫున తిలక్, యశస్వి బౌలింగ్ చేయడం చూస్తారు. కనీసం ఒక్క ఓవర్ అయినా వేస్తారు’’అని పారస్ మాంబ్రే పేర్కొన్నాడు. ఎన్ని వికెట్లు తీశారంటే కాగా తిలక్ వర్మ ఫస్ట్క్లాస్ క్రికెట్లో 9 మ్యాచ్లలో మూడు వికెట్లు తీయగా.. 25 లిస్ట్-ఏ మ్యాచ్లు ఆడి 8 వికెట్లు పడగొట్టాడు. ఇక యశస్వి లిస్ట్- ఏ క్రికెట్లో 32 మ్యాచ్లు ఆడి ఏడు వికెట్లు తన ఖాతాలో వేసుకున్నాడు. ఫస్ట్క్లాస్ క్రికెట్లో ఒక్క వికెట్ కూడా తీయలేదు. చదవండి: Ind vs WI: ఇంతకంటే మంచి పిచ్ మీకెక్కడా దొరకదు.. ఇక్కడైనా ఆడండి! -
Ind vs WI: ఇంతకంటే మంచి పిచ్ మీకెక్కడా దొరకదు.. ఇక్కడైనా ఆడండి!
West Indies vs India, 4th T20I: వెస్టిండీస్తో నాలుగో టీ20 నేపథ్యంలో టీమిండియా మాజీ క్రికెటర్ వసీం జాఫర్ భారత ఆటగాళ్ల గురించి కీలక వ్యాఖ్యలు చేశాడు. ఫామ్లేమితో సతమతమవుతున్న బ్యాటర్లు తిరిగి పుంజుకోవడానికి ఫ్లోరిడా కంటే మంచి పిచ్ దొరకదని అభిప్రాయపడ్డాడు. కనీసం ఇప్పుడైనా వచ్చిన అవకాశాలను సద్వినియోగం చేసుకుని మంచి స్కోర్లు నమోదు చేయాలని విజ్ఞప్తి చేశాడు. ఫ్లోరిడాలో టీమిండియాకు కీలక మ్యాచ్ కాగా విండీస్తో ఐదు మ్యాచ్ల టీ20 సిరీస్లో తొలి రెండింటిలో ఓటమిపాలైన టీమిండియా.. మూడో మ్యాచ్లో విజయంతో సిరీస్ ఆశలను సజీవంగా ఉంచుకుంది. ఈ క్రమంలో ఇరు జట్ల మధ్య కీలకమైన నాలుగో టీ20 శనివారం జరుగనుంది. అమెరికాలోని ఫ్లోరిడా వేదికగా హార్దిక్ సేన రోవ్మన్ పావెల్ బృందంతో తలపడనుంది. ఇక్కడైనా ఫామ్లోకి రండి బ్యాటర్లకు ఫ్లోరిడా పిచ్ అనుకూలంగా ఉండనున్న నేపథ్యంలో వసీం జాఫర్ ఈఎస్పీఎన్క్రిక్ఇన్ఫోతో మాట్లాడుతూ.. ‘‘సంజూ శాంసన్ రాణించాల్సి ఉంది. హై స్కోరింగ్కు ఆస్కారం ఉన్న గ్రౌండ్ను భారత బ్యాటర్లు కచ్చితంగా సద్వినియోగం చేసుకోవాలి. సంజూ ఒక్కడే కాదు సంజూతో పాటు.. శుబ్మన్ గిల్, జైశ్వాల్లకు కూడా ఈ మాటలు వర్తిస్తాయి. ఫామ్లేని ఆటగాళ్లు తిరిగి రిథమ్లోకి రావడానికి ఇలాంటి పిచ్లను ఉపయోగించుకోవాలి’’ అని చెప్పుకొచ్చాడు. ఈ సందర్భంగా వెస్టిండీస్ కెప్టెన్ రోవ్మన్ పావెల్పై ప్రశంసలు కురిపించాడు. సారథ్య బాధ్యతలు చక్కగా నిర్వర్తిస్తున్నాడని పేర్కొన్నాడు. కాగా తాజా సిరీస్లో వెస్టిండీస్తో ఇప్పటి వరకు ఆడిన మూడు టీ20లలో ఓపెనర్ శుబ్మన్ గిల్ 3, 7, 6 పరుగులతో దారుణంగా విఫలమయ్యాడు. ఇక సంజూ రెండు టీ20లలో వరుసగా 12, 7 పరుగులు చేశాడు. చదవండి: టీమిండియాను భ్రష్టు పట్టిస్తున్నారు.. వీళ్ల కంటే పాక్ నయం: మాజీ క్రికెటర్ ఓవరాక్షన్ -
ఇష్టమైనంత మాత్రాన హార్దిక్ .. ధోని అవ్వాల్సిన అవసరం లేదు! ఇక ఆపేయండి
వెస్టిండీస్తో టీ20 సిరీస్లో టీమిండియా సారథిగా స్టార్ ఆల్రౌండర్ హార్దిక్ పాండ్యా వ్యవహరిస్తున్న సంగతి తెలిసిందే. అయితే ఈ సిరీస్లో భాగంగా గయానా వేదికగా జరిగిన మూడో టీ20 అనంతరం భారత కెప్టెన్ హార్దిక్ పాండ్యా తీవ్ర విమర్శలు ఎదుర్కొన్నాడు. టీమిండియా యువ సంచలనం తిలక్ వర్మ హాఫ్ సెంచరీ (49 నాటౌట్) చేయనీవ్వకుండా హార్దిక్ మ్యాచ్ ఫినిష్ చేయడమే ఇందుకు కారణం. తిలక్ వర్మ తన హాఫ్ సెంచరీకి కేవలం ఒక్క పరుగు దూరంలో ఉన్నాడని తెలిసి కూడా.. హార్దిక్ సిక్స్ కొట్టి మ్యాచ్ ముగించడం సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున చర్చ నడిచింది. కెప్టెన్గా పనికిరాడని, స్వార్థపరుడని హార్దిక్ను దారుణంగా ట్రోలు చేశారు. అయితే విషయంలో హార్దిక్ తీరును కొంతమంది తప్పుబడతుంటే, మరి కొంతమంది మద్దతుగా నిలుస్తున్నారు. ప్రముఖ వ్యాఖ్యాత హర్షా భోగ్లే, దక్షిణాఫ్రికా దిగ్గజం ఏబీడీ డివిలియర్స్ వంటి వారు హార్దిక్కు సపోర్ట్గా నిలిచారు. టీ20ల్లో హాఫ్ సెంచరీ అనేది పెద్ద ల్యాండ్ మార్క్ కాదని అన్నాడు. ఈ విషయంపై ఇంత పెద్ద చర్చ అనవసరమని హర్షా భోగ్లే అభిప్రాయపడ్డాడు. దీనిపై ఏబీ డివిలియర్స్ స్పందిస్తూ.. థ్యాంక్యూ.. థ్యాంక్యూ.. థ్యాంక్యూ. అంతిమంగా ఒకరు నోరు విప్పారు అంటూ ట్వీట్ చేశాడు. ఇక తాజాగా ఇదే విషయంపై భారత మాజీ క్రికెటర్ ఆకాష్ చోప్రా మరోసారి తన అభిప్రాయాలను పంచుకున్నాడు. "దీనిపై హార్దిక్ చాలా విమర్శలు ఎదుర్కొన్నాడు. దారుణంగా ట్రోలు చేయబడ్డాడు.అయితే కొంతమంది మధ్యలో టీ20 క్రికెట్లో మైలురాళ్ల గురించి మాట్లాడుతున్నారు. అస్సలు అది అవసరం లేని చర్చ. రికార్డులకంటే యువ ఆటగాడిలో స్పూర్తి నింపడం మన బాధ్యత. నాకు బాగా గుర్తుంది. 2014 టీ20 ప్రపంచకప్లో ధోనికి ఇదో పరిస్ధితి ఎదురైంది. ఆ మ్యాచ్లో విరాట్ కోహ్లి సూపర్ ఇన్నింగ్స్తో అవతలి ఎండ్లో ఉన్నాడు. అయితే ధోని మాత్రం విరాట్ను హీరోను చేయాలని భావించాడు. అందుకే అతడికి మ్యాచ్ ఫినిష్ చేసే అవకాశం వచ్చినప్పటికీ..ఫార్వర్డ్ డిఫెన్సివ్ షాట్ కోహ్లికి స్ట్రైక్ ఇచ్చాడు. కోహ్లి మ్యాచ్ ఫినిష్ చేశాడు. ధోనినే తనకు ఆదర్శమని హార్దిక్ చాలా సందర్బాల్లో చెప్పాడు. ఇష్టమైనంత మాత్రాన హార్దిక్ .. ధోని అవ్వల్సిన అవసరం లేదు . ఎందుకు ఈ అనవసర చర్చలు అపేయండి అంటూ తన యూట్యూబ్ ఛానల్లో చోప్రా పేర్కొన్నాడు. కాగా మూడో టీ20 అనంతరం కూడా హార్దిక్ను ఉద్దేశించి చోప్రా కీలక వాఖ్యలు చేశాడు. తిలక్ వర్మకు తన హాఫ్ సెంచరీని పూర్తి చేసే అవకాశం హార్దిక్ ఇచ్చి ఉంటే బాగుండేదని చోప్రా అభిప్రాయపడ్డాడు. చదవండి: Asia Cup 2023: ఆసియాకప్కు బంగ్లా జట్టు ప్రకటన.. యువ సంచలనం ఎంట్రీ! స్టార్ ఆటగాడిపై వేటు -
'అతడొక సంచలనం.. కచ్చితంగా ప్రపంచ క్రికెట్ను ఏలుతాడు'
టీమిండియా యువ పేసర్ ఉమ్రాన్ మాలిక్పై వెస్టిండీస్ దిగ్గజం బ్రియాన్ లారా ప్రశంసల వర్షం కురిపించాడు. భవిష్యత్తులో ప్రపంచక్రికెట్ను ఉమ్రాన్ మాలిక్ శాసిస్తాడని లారా కొనియాడాడు. కాగా ఐపీఎల్లో సన్రైజర్స్ హైదరాబాద్కు మాలిక్ ప్రాతినిథ్యం వహిస్తున్న సంగతి తెలిసిందే. అదే విధంగా గత రెండు సీజన్లగా ఎస్ఆర్హెచ్ కోచింగ్ స్టాప్లో లారా కూడా భాగంగా ఉన్నాడు. ఈ క్రమంలో అతడి స్కిల్స్ను లారా దగ్గర నుంచి చూశాడు. మాలిక్ ప్రస్తుతం విండీస్ పర్యటనలో ఉన్నాడు. విండీస్తో తొలి రెండు వన్డేల్లో తుది జట్టులో చోటు దక్కించుకున్న మాలిక్ తన స్ధాయికి తగ్గట్టు ప్రదర్శన చేయలేకపోయాడు. కనీసం ఒక్క వికెట్ కూడా సాధించలేకపోయాడు. దీంతో టీ20 సిరీస్లో తొలి మూడు మ్యాచ్ల్లో కూడా చోటు దక్కలేదు. శనివారం ఫ్లోరిడా వేదికగా జరిగే నాలుగో టీ20లో ఉమ్రాన్కు చోటు దక్కే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో లారా తన యూట్యూబ్ ఛానల్లో మాట్లాడుతూ.. "ఉమ్రాన్ ఒక పేస్ బౌలింగ్ సంచలనం. కానీ పేస్ బౌలింగ్ ఏ మాత్రం బ్యాటర్లను ఇబ్బంది పెట్టదనే విషయాన్ని మాలిక్ వీలైనంత త్వరగా నేర్చుకోవాలి. ఫాస్ట్ బౌలర్లు బంతితో అద్బుతాలు చేసే విధంగా ఉండాలి. అతడు ఇంకా తన బౌలింగ్ స్కిల్స్ను పెంచుకోవాలి. అయితే ఉమ్రాన్కు ఇప్పుడు కేవలం 23 ఏళ్ల మాత్రమే. ఇంకా అతడికి చాలా భవిష్యత్తు ఉంది. వసీం అక్రమ్, మాల్కోలమ్ మార్షల్, మిచెల్ హోల్డింగ్ లాంటి దిగ్గజాలు పేస్తో పాటు కొన్ని ట్రిక్స్తో బ్యాటర్లను ఇబ్బంది పెట్టేవారు. ఉమ్రాన్ మాలిక్ ఐపీఎల్లో డేల్ స్టెయిన్తో కలిసి పనిచేశాడు. కాబట్టి అతడి నుంచి చాలా విషయాలు నేర్చుకుని ఉంటాడని అనుకుంటున్నా. కానీ కచ్చితంగా భవిష్యత్తులో ఉమ్రాన్ వరల్డ్క్రికెట్ను ఏలుతాడని" జోస్యం చెప్పాడు. చదవండి: సెంచరీతో చెలరేగిన పుజారా.. భారత సెలక్టర్లకు వార్నింగ్! వీడియో వైరల్ -
ఐర్లాండ్తో టీ20 సిరీస్.. హెడ్కోచ్ లేకుండానే! టీమిండియా ఎలా మరి?
జస్ప్రీత్ బుమ్రా సారధ్యంలోని యువ భారత జట్టు ఐర్లాండ్ పర్యటనకు సిద్దమవుతోంది. ఈ టూర్లో భాగంగా అతిథ్య ఐర్లాండ్తో మూడు మ్యాచ్ల టీ20 సిరీస్లో టీమిండియా తలపడనుంది. ఈ సిరీస్ కోసం భారత జట్టు రెండు బ్యాచ్లగా ఐర్లాండ్కు చేరుకోనుంది. మంగళవారం(ఆగస్టు 15)న జస్ప్రీత్ బుమ్రా, రుత్రాజ్ గైక్వాడ్తో కూడిన బృందం మొదటి బ్యాచ్గా ఐర్లాండ్కు పయనం కానుంది. మరోవైపు విండీస్తో టీ20 సిరీస్లో భాగంగా ఉన్న తిలక్ వర్మ, జైశ్వాల్, సంజూ శాంసన్ నేరుగా యూఎస్ నుంచి ఐర్లాండ్కు బయలదేరునున్నారు. ఆగస్టు 18న డబ్లిన్ వేదికగా జరగనున్న తొలి టీ20తో ఈ సిరీస్ ప్రారంభం కానుంది. హెడ్కోచ్ లేకుండానే.. ఇక ఐర్లాండ్ పర్యటనకు హెడ్కోచ్ లేకుండా భారత జట్టు వెళ్లనున్నట్లు తెలుస్తోంది. వెస్టిండీస్ టూర్ తర్వాత రెగ్యులర్ హెడ్ కోచ్ రాహుల్ ద్రవిడ్తో పాటు ఇతర కోచింగ్ స్టాప్కు బీసీసీఐ విశ్రాంతి ఇవ్వాలని నిర్ణయించుకుంది. ఈ క్రమంలో ఐర్లాండ్ టూర్కు టీమిండియా హెడ్కోచ్గా ఏన్సీఏ ఛీప్ వీవీయస్ లక్ష్మణ్ వ్యవహరించనున్నట్లు వార్తలు వినిపించాయి. గతంలో చాలాసార్లు ద్రవిడ్ గైర్హజరీలో ఈ హైదరాబాదీనే భారత జట్టు కోచ్గా పనిచేశాడు. కానీ ఈ సారి మాత్రం ఐరీష్ టూర్కు లక్ష్మణ్ కూడా వెళ్లడం లేదు. క్రిక్బజ్ రిపోర్టు ప్రకారం.. ఇండియా-ఏ జట్టు కోచ్లు సితాన్షు కోటక్ , సాయిరాజ్ బహుతులే నేతృత్వంలో భారత్ ఈ సిరీస్ ఆడనుంది. ఐర్లాండ్ సిరీస్కు భారత జట్టు: జస్ప్రీత్ బుమ్రా (కెప్టెన్), రుతురాజ్ గైక్వాడ్ , యశస్వి జైస్వాల్, తిలక్ వర్మ, రింకూ సింగ్, సంజు శాంసన్, జితేష్ శర్మ, శివమ్ దూబే, వాషింగ్టన్ సుందర్, షాబాజ్ అహ్మద్, రవి బిష్ణోయ్, ప్రసిద్ధ్ కృష్ణ, అర్ష్దీప్ సింగ్ , ముఖేష్ కుమార్, అవేష్ ఖాన్ చదవండి: The Hundred 2023: సన్రైజర్స్ ఆటగాడు ఊచకోత.. కేవలం 22 బంతుల్లోనే! -
మరో విజయంపై టీమిండియా గురి.. ఫ్లోరిడాలో నాలుగో టీ20
లాడర్హిల్ (ఫ్లోరిడా): భారత్, వెస్టిండీస్ సమరం అమెరికా గడ్డకు చేరింది. సిరీస్ను సమం చేసే లక్ష్యంతో భారత్ బరిలోకి దిగుతుండగా... గత మ్యాచ్లో ఓటమి పాలైన తర్వాత ఇక్కడైనా సిరీస్ అందుకోవాలని వెస్టిండీస్ భావిస్తోంది. ఈ నేపథ్యంలో నేడు జరిగే నాలుగో టి20 మ్యాచ్లో ఇరు జట్లు తలపడనున్నాయి. ఈ టూర్లో ఇప్పటి వరకు జరిగిన అన్ని మ్యాచ్లతో పోలిస్తే అమెరికాలోని ఈ రీజినల్ పార్క్ స్టేడియం బ్యాటింగ్కు బాగా అనుకూలించే మైదానం. గతంలోనూ ఇక్కడ భారీ స్కోర్లే నమోదయ్యాయి కాబట్టి సిరీస్లోని చివరి రెండు టి20ల్లో బ్యాటర్ల నుంచి మెరుపు ప్రదర్శనలు ఆశించవచ్చు. అయితే శనివారం రోజున వర్ష సూచన ఉంది. మ్యాచ్కు వాన అంతరాయం కలిగించవచ్చు. ఇక్కడ జరిగిన 13 టి20ల్లో 11 సార్లు ముందుగా బ్యాటింగ్ చేసిన జట్టే గెలిచింది. అదే జట్టుతో... గత మ్యాచ్లో ఏకపక్ష విజయం సాధించిన భారత జట్టు మార్పుల్లేకుండానే బరిలోకి దిగే అవకాశం ఉంది. తన సత్తా చాటేందుకు యశస్వి జైస్వాల్కు ఇది మరో అవకాశం. అయితే రెండో ఓపెనర్ శుబ్మన్ గిల్ మూడు మ్యాచుల్లోనూ ‘సింగిల్ డిజిట్’ స్కోరుకే పరిమితమయ్యాడు. ఇక్కడైనా అతను ఫామ్ను అందుకుంటాడా చూడాలి. ఈ ఫార్మాట్లో తాను ఎంత ప్రమాదకరమైన ఆటగాడో సూర్యకుమార్ నిరూపించాడు. అయితే ఇప్పుడు అందరి దృష్టీ హైదరాబాదీ బ్యాటర్ తిలక్ వర్మపై నిలిచింది. సిరీస్లో అన్ని మ్యాచ్లలో సత్తా చాటిన అతనిపై అన్ని వైపుల నుంచి ప్రశంసలతో పాటు వన్డేల్లోనూ తీసుకోవాలనే సూచనలు వస్తున్న నేపథ్యంలో తిలక్ తన జోరును కొనసాగించాల్సి ఉంది. సంజు సామ్సన్కు కూడా ఇది చావోరేవోలాంటి మ్యాచ్. ఇక్కడా అవకాశం వృథా చేస్తే మున్ముందు కష్టమే. బౌలింగ్లో పేసర్లు ముకేశ్, అర్ష్ దీప్ అంతంత మాత్రమే ప్రభావం చూపిస్తుండగా... చహల్, కుల్దీప్ తమ స్పిన్తో ప్రత్యర్థిని కట్టిపడేస్తున్నారు. వీరు మరోసారి చెలరేగితే విండీస్కు కష్టాలు తప్పవు. హెట్మైర్ రాణిస్తాడా... విండీస్ జట్టులో పూరన్, హెట్మైర్లు టి20 ఫార్మాట్లో స్టార్లుగా గుర్తింపు తెచ్చుకున్నాడు. పూరన్ తనపై ఉన్న అంచనాలను నిలబెట్టుకోగా, హెట్మైర్ ఇప్పటి వరకు ప్రభావం చూపలేకపోయాడు. ఈసారైనా అతను దూకుడుగా ఆడాలని మేనేజ్మెంట్ కోరుకుంటోంది. కెపె్టన్ పావెల్ ఫామ్లోకి సానుకూలాంశం కాగా... మేయర్స్, చార్లెస్ కనీస ప్రదర్శన కూడా ఇవ్వడం లేదు. ఓపెనర్ కింగ్ కూడా శుభారంభం అందించాల్సి ఉంది. చార్లెస్ స్థానంలో వన్డే కెప్టెన్ షై హోప్ను ఆడించే అవకాశం ఉంది. ఫిట్గా ఉంటే చేజ్ స్థానంలో హోల్డర్ తిరిగొస్తాడు. నెమ్మదైన పిచ్లపై మెరుగైన రీతిలో రాణించిన విండీస్ పేసర్లు జోసెఫ్, మెకాయ్, షెఫర్డ్ ఈ పిచ్పై భారత బ్యాటర్లను ఎలా నిలువరిస్తారనేది చూడాలి. అన్ని విధాలుగా ఆకట్టుకున్న స్పిన్నర్ అకీల్ హొసీన్పై కూడా టీమ్ ఆధారపడుతోంది. -
వెస్టిండీస్తో నాలుగో టీ20.. గిల్పై వేటు! విధ్వంసకర ఆటగాడికి మరో ఛాన్స్
వెస్టిండీస్తో మూడో టీ20లో అద్భుత విజయం సాధించిన టీమిండియా.. ఇప్పుడు మరో కీలక పోరుకు సిద్దమైంది. ఫ్లోరిడా వేదికగా శనివారం విండీస్తో జరగనున్న నాలుగో టీ20లో భారత్ తాడోపేడో తెల్చుకోనుంది. ఈ మ్యాచ్లో గెలిచి సిరీస్ను సమం చేయాలని హార్దిక్ సేన భావిస్తోంది. నాలుగో టీ20లో టీమిండియా పలు మార్పులతో బరిలోకి దిగనున్నట్లు తెలుస్తోంది. వరుసగా మూడు మ్యాచ్ల్లో విఫలమైన శుబ్మన్ గిల్పై వేటు వేయాలని జట్టు మెనెజ్మెంట్ నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. అతడి స్ధానంలో ఇషాన్ కిషన్ను తిరిగి మళ్లీ జట్టులోకి తీసుకురావాలని కెప్టెన్ హార్ధిక్ పాండ్యా, కోచ్ రాహుల్ ద్రవిడ్ యోచిస్తున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ఈ సిరీస్లో మూడు మ్యాచ్లు ఆడిన గిల్ కేవలం 19 పరుగులు మాత్రమే చేశాడు. ఇక నాలుగో టీ20 జరిగే ఫ్లోరిడా మైదానం ఫాస్ట్బౌలర్లకు కాస్త అనుకూలంగా ఉంటుంది. ఈ క్రమంలో అదనపు పేసర్తో టీమిండియా ఆడనున్నట్లు తెలుస్తోంది. స్పిన్నర్ యజువేంద్ర చాహల్ స్ధానంలో పేసర్ అవేష్ ఖాన్కు తుది జట్టులొ ఛాన్స్ ఇవ్వనున్నట్లు పలు రిపోర్టులు పేర్కొంటున్నాయి. అదేవిధంగా అరంగేట్ర మ్యాచ్లో విఫలమైన యువ ఓపెనర్ యశస్వీ జైశ్వాల్ను కొనసాగించే ఛాన్స్ ఉంది. పిచ్ రిపోర్డు ఫ్లోరిడాలోని సెంట్రల్ బ్రోవార్డ్ రీజినల్ పార్క్ మైదానం బ్యాటర్లకు స్వర్గదామం. స్పిన్నర్లకు కాకుండా పేసర్లకు ఈ వికెట్ కాస్త అనుకూలంగా ఉంటుంది. ఈ ఏడాది ఇదే వేదికలో మేజర్ లీగ్ క్రికెట్ టోర్నీలో భాగంగా జరిగిన మ్యాచ్ల్లో భారీ స్కోర్లు నమోదయ్యాయి. ఇప్పటివరకు ఈ వేదికపై 14 మ్యాచ్లు జరగ్గా.. తొలుత బ్యాటింగ్ చేసిన జట్లు 11 సందర్భాల్లో విజయం సాధించాయి. ఈ నేపధ్యంలో టాస్ గెలిచిన జట్టు తొలుత బ్యాటింగ్ ఎంచుకునే ఛాన్స్ ఉంది. భారత తుది జట్టు(అంచనా) ఇషాన్ కిషన్ ,యశస్వి జైస్వాల్, సూర్యకుమార్ యాదవ్, తిలక్ వర్మ, హార్దిక్ పాండ్యా (కెప్టెన్), సంజు శాంసన్ (వికెట్ కీపర్), అక్సర్ పటేల్, కుల్దీప్ యాదవ్, అర్ష్దీప్ సింగ్, యుజ్వేంద్ర చాహల్, ముఖేష్ కుమార్ చదవండి: Rohit- Virat: నేను, కోహ్లి అందుకే ఆడటం లేదు.. అయినా జడ్డూ గురించి ఎందుకు అడగరు: రోహిత్ -
తిలక్ హాఫ్ సెంచరీని అడ్డుకున్న హార్ధిక్.. కొట్టిపారేసిన హర్షా, ఏకీభవించిన ఏబీడీ
విండీస్తో మూడో టీ20లో టీమిండియా యంగ్ గన్ తిలక్ వర్మ హాఫ్ సెంచరీ (49 నాటౌట్) చేయకుండా కెప్టెన్ హార్ధిక్ పాండ్యా అడ్డుకున్నాడని (తిలక్ హాఫ్ సెంచరీకి పరుగు దూరంలో ఉన్నాడని తెలిసి కూడా హార్దిక్ సిక్స్ కొట్టి మ్యాచ్ ముగించాడు) సోషల్మీడియాలో పెద్ద రాద్దాంతం జరిగిన విషయం తెలిసిందే. ఈ విషయంలో హార్దిక్ను తప్పుబడుతూ చాలామంది అభిమానులు అసంతృప్తిని వ్యక్తం చేశారు. కొందరు భారత మాజీలు సైతం ఈ విషయంలో అభిమానులతో ఏకీభవించారు. AB de Villiers concurs with Harsha Bhogle's perspective on Tilak Varma falling short of his half-century in the third T20I. pic.twitter.com/gGNuKR2DNI — CricTracker (@Cricketracker) August 10, 2023 తాజాగా ఇదే విషయంపై ప్రముఖ వ్యాఖ్యాత హర్షా భోగ్లే కూడా స్పందించాడు. తిలక్ విషయంలో ఫ్యాన్స్ అభిప్రాయాన్ని అతను కొట్టిపారేశాడు. టీ20ల్లో హాఫ్ సెంచరీ అనేది పెద్ద ల్యాండ్ మార్క్ కాదని అన్నాడు. ఈ విషయంపై ఇంత పెద్ద చర్చ అనవసరమని అభిప్రాయపడ్డాడు. టీ20ల్లో సెంచరీ మినహా ఏదీ ల్యాండ్ మార్క్ కాదని తెలిపాడు. అసలు క్రికెట్ లాంటి టీమ్ గేమ్లో ల్యాండ్ మార్క్ల వ్యామోహం ఉండకూడదని అన్నాడు. టీ20ల్లో హాఫ్ సెంచరీలు పరిగణలోకి తీసుకోవాలని అనుకోనని తెలిపాడు. ఈ ఫార్మాట్లో ఎంత వేగంగా పరుగులు చేశామనేది ముఖ్యమని పేర్కొన్నాడు. తిలక్ హాఫ్ సెంచరీ మిస్ అయిన విషయంలో హర్షా అభిప్రాయంతో దిగ్గజ క్రికెటర్ ఏబీ డివిలియర్స్ ఏకీభవించాడు. థ్యాంక్యూ.. థ్యాంక్యూ.. థ్యాంక్యూ. అంతిమంగా ఒకరు నోరు విప్పారు అంటూ హర్షాను సమర్ధిస్తూ ట్వీట్ చేశాడు. -
తన ఆరాధ్య క్రికెటర్ అడుగుజాడల్లో తిలక్ వర్మ.. అచ్చుగుద్దినట్లు ఒకేలా..!
టీమిండియా యంగ్ గన్ తిలక్ వర్మ.. తన ఆరాధ్య క్రికెటర్ సురేశ్ రైనా అడుగు జాడల్లో నడుస్తున్నాడు. బ్యాటింగ్ స్టయిల్, షాట్లు ఆడే విధానం, అటాకింగ్ శైలి.. ఇలా ప్రతి విషయంలో తిలక్, రైనాను ఫాలో అవుతున్నాడు. రైనా కెరీర్ ఆరంభం ఎలా సాగిందో, తిలక్ కెరీర్ కూడా అచ్చుగుద్దినట్లు అలాగే సాగుతుంది. ఈ ఇద్దరి గణాంకాలు మక్కీ టు మక్కీ అన్నట్లుగా ఉన్నాయి. ఈ గణాంకాలను చూస్తే ఔరా అనక తప్పదు. ఈ గణాంకాలు చూసిన వారు రైనా జిరాక్స్ కాపీగా తిలక్ వచ్చాడని అంటున్నారు. రైనా, తిలక్ల మధ్య పోలికలపై ఓ లుక్కేద్దాం.. ఈ ఇద్దరు లెఫ్ట్ హ్యాండ్ బ్యాటర్లు మిడిలార్డర్లో అటాకింగ్ గేమ్ ఆడటానికి ఇష్టపడతారు, ఓ రకంగా చెప్పాలంటే అలా చేసి సక్సెస్ కూడా అయ్యారు. రైనా, తిలక్ ఇద్దరూ 20 ఏళ్ల వయసులోనే భారత్ తరఫున టీ20 అరంగేట్రం చేశారు. ఈ ఇద్దరూ టీ20 డెబ్యూ మ్యాచ్లో రెండు క్యాచ్లు అందుకున్నారు. ఈ ఇద్దరూ తమతమ కెరీర్లలో నాలుగో స్థానంలో బ్యాటింగ్కు దిగి 49 పరుగులతో అజేయంగా నిలిచారు. ఈ ఇద్దరి టీ20 కెరీర్లలో తొలి ఫిఫ్టి సాధించిన మ్యాచ్ల్లో టీమిండియా ఓటమిపాలైంది. రైనా, తిలక్ ఇద్దరూ తమ తొలి రెండు ఐపీఎల్ సీజన్లలో 350 ప్లస్ పరుగులు చేశారు. ఐపీఎల్ చరిత్రలో రైనా, తిలక్లు మాత్రమే ప్లే ఆఫ్స్లో 300 ప్లస్ స్ట్రయిక్రేట్ (40 ప్లస్ స్కోర్ చేసిన సందర్భాల్లో) కలిగి ఉన్నారు. -
తిరిగింది చాలు.. ఇక ఆటపై దృష్టి పెట్టు! అసలే వరల్డ్కప్..
Ravindra Jadeja Photos: టీమిండియా స్టార్ ఆల్రౌండర్ రవీంద్ర జడేజా అమెరికాలో ఎంజాయ్ చేస్తున్నాడు. వెస్టిండీస్తో వన్డే సిరీస్ అనంతరం జడ్డూ యూఎస్ఏలో వాలిపోయాడు. విండీస్ పర్యటన తర్వాత దొరికిన విరామ సమయాన్ని తనకు నచ్చిన చోటల్లా విహరిస్తూ సెలవులను పూర్తిగా ఆస్వాదిస్తున్నాడు. ఇందుకు సంబంధించిన ఫొటోలు, వీడియోలు సోషల్ మీడియాలో షేర్ చేస్తూ అభిమానులకు ఎప్పటికపుడు అప్డేట్లు అందిస్తున్నాడు. ఈ క్రమంలో తాజాగా న్యూయార్క్ టైమ్స్ స్వ్కేర్ వద్ద ఉన్న ఫొటోలు పంచుకున్న జడ్డూ.. ‘‘ఈ వెలుగులు ఎప్పటికీ ఇలాగే ఉండిపోతాయి’’ అంటూ క్యాప్షన్ జతచేశాడు. నిమిషాల్లోనే ఈ ఫొటోలకు లక్షల్లో లైకులు వచ్చాయి. అయితే, కొంతమంది నెటిజన్లు మాత్రం.. ‘‘తిరిగింది చాలు.. కాస్త ఆట మీదకు దృష్టి మళ్లించు.. ప్రాక్టీస్ మొదలుపెట్టు’’ అంటూ రవీంద్ర జడేజాను ట్రోల్ చేస్తున్నారు. బౌండరీ బాది చెన్నై సూపర్ కింగ్స్ను విజేతగా నిలిపిన మాదిరిగానే.. వరల్డ్కప్ టోర్నీలోనూ రాణించాలని ఆకాంక్షిస్తున్నారు. కాగా ఆసియా కప్-2022 సందర్భంగా గాయపడ్డ జడ్డూ దాదాపు ఐదు నెలల తర్వాత పునరాగమనం చేశాడు. రీ ఎంట్రీలో అద్భుత ఆట తీరుతో ఆకట్టుకుంటూ రోజురోజుకీ అభిమానుల సంఖ్య పెంచుకుంటున్నాడీ స్పిన్ ఆల్రౌండర్. ఇక ఇటీవల వెస్టిండీస్తో టెస్టు సిరీస్లో వరుసగా 37(నాటౌట్), 61 పరుగులు సాధించిన రవీంద్ర జడేజా.. మొత్తంగా ఏడు వికెట్లు పడగొట్టాడు. ఇక మూడు మ్యాచ్ల వన్డే సిరీస్లో మూడు వికెట్లు తన ఖాతాలో వేసుకున్న జడ్డూ.. మొత్తం 34 పరుగులు సాధించాడు. కాగా ఆగష్టు 30న మొదలుకానున్న ఆసియా వన్డే కప్-2023తో జడేజా మళ్లీ మైదానంలో దిగే అవకాశం ఉంది. ఇదిలా ఉంటే.. ఈ ఏడాది జాతీయ డోపింగ్ నిరోధక సంస్థ అత్యధికంగా మూడుసార్లు రవీంద్ర జడేజా నుంచి శాంపిల్స్ సేకరించినట్లు వెల్లడించిన విషయం తెలిసిందే. జనవరి- మే మధ్య డోపింగ్ పరీక్షలు నిర్వహించినట్లు నాడా తెలిపింది. చదవండి: ఆసీస్ యువ పేసర్ సంచలనం.. 20 బంతుల్లో 1 పరుగు.. 3 వికెట్లు! వీడియో View this post on Instagram A post shared by Ravindrasinh jadeja (@royalnavghan) -
హార్దిక్ స్వార్థం! దారుణంగా ట్రోల్ చేసిన ఇర్ఫాన్ పఠాన్.. ట్వీట్ వైరల్
West Indies vs India, 3rd T20I: వెస్టిండీస్తో మూడో టీ20లో టీమిండియా విజయం నేపథ్యంలో మాజీ ఆల్రౌండర్ ఇర్ఫాన్ పఠాన్ చేసిన ట్వీట్ నెట్టింట వైరల్గా మారింది. పరోక్షంగా హార్దిక్ పాండ్యాను ఉద్దేశించే పఠాన్ ఇలా ఘాటు వ్యాఖ్యలు చేశాడంటూ అభిమానులు చర్చించుకున్నాడు. పనిలో పనిగా.. ఓవరాక్షన్ పాండ్యాకు మంచి కౌంటర్ ఇచ్చావంటూ ఇర్ఫాన్ పఠాన్ను ప్రశంసిస్తున్నారు. పరాజయాల నుంచి తేరుకుని విండీస్ పర్యటనలో భాగంగా హార్దిక్ సేనకు తొలి రెండు టీ20లలో పరాభవం ఎదురైన విషయం తెలిసిందే. ట్రినిడాడ్లో 4 పరుగుల స్వల్ప తేడాతో వెస్టిండీస్ చేతిలో ఓడిన టీమిండియా.. గయనా మ్యాచ్లో 2 వికెట్ల తేడాతో పరాజయం పాలైంది. అదే వేదికపై జరిగిన కీలక మ్యాచ్లో మాత్రం సత్తా చాటింది. ఐదు మ్యాచ్ల సిరీస్ గెలుపు ఆశలు సజీవంగా ఉంచుకోవాలంటే తప్పక గెలవాల్సిన మ్యాచ్లో పాండ్యా బృందం 7 వికెట్ల తేడాతో జయకేతనం ఎగురవేసింది. మంగళవారం నాటి మ్యాచ్లో టాస్ ఓడి తొలుత బౌలింగ్ చేసిన భారత జట్టు.. కరేబియన్లను 159 పరుగులకు కట్టడి చేసింది. సూర్య, తిలక్ కష్టపడి.. అయితే, లక్ష్య ఛేదనలో ఆరంభంలోనే తడబాటుకు లోనైంది. అరంగేట్ర ఓపెనర్ యశస్వి జైశ్వాల్ ఒక్క పరుగుకే పెవిలియన్ చేరగా.. శుబ్మన్ గిల్(6) సైతం పూర్తిగా నిరాశపరిచాడు. ఈ క్రమంలో వన్డౌన్ బ్యాటర్ సూర్యకుమార్ యాదవ్(83) జట్టును ఆదుకునే బాధ్యతనెత్తికెత్తుకున్నాడు. యువ సంచలనం తిలక్ వర్మ(49- నాటౌట్) అద్బుతంగా ఆడుతూ అతడికి అండగా నిలిచాడు. వీరిద్దరు కలిసి కష్టాల్లో ఉన్న జట్టును గట్టెక్కించి విజయానికి చేరువ చేయగా.. సూర్య అవుటైన తర్వాత క్రీజులోకి వచ్చిన హార్దిక్ పాండ్యా(20- నాటౌట్) సిక్సర్ బాది లాంఛనం పూర్తి చేశాడు. పాపం తిలక్ వర్మ.. అయితే, అప్పటికి తిలక్ వర్మ 49 పరుగుల వద్ద ఉన్నాడు. ఇంకా పదమూడు బంతులు మిగిలే ఉన్నాయి. ఇలాంటి సమయంలో సూర్యకు అండగా నిలిచి.. క్లిష్ట సమయంలో అద్భుత ఇన్నింగ్స్ ఆడిన తిలక్కు హార్దిక్ స్టైక్ ఇచ్చి ఉంటే బాగుండేది. అదే జరిగితే ఈ హైదరాబాదీ స్టార్ కెరీర్ ఆరంభంలోనే వరుసగా రెండు అర్ధ శతకాలు బాదిన బ్యాటర్గా నిలిచేవాడు. కానీ.. హార్దిక్ ఇలా మ్యాచ్ పూర్తి చేయడం అభిమానులతో పాటు టీమిండియా మాజీ క్రికెటర్ ఆకాశ్ చోప్రా వంటి వాళ్లకు కూడా రుచించలేదు. టీమిండియా అభిమానులైతే.. ‘‘ఇంత స్వార్థం పనికిరాదు. కోహ్లి విషయంలో ధోని ఏం చేశాడో గుర్తుందా?’’ అంటూ సోషల్ మీడియాలో పాండ్యాను ఏకిపారేస్తున్నారు. మీరు కష్టపడండి.. నేను మాత్రం ఈ క్రమంలో ఇర్ఫాన్ పఠాన్ ట్వీట్ మరింత ఆసక్తికరంగా మారింది. ‘‘కష్టంగా ఉన్న పని మీరు చేయండి.. సులభంగా ఉన్న పని నేను చూసుకుంటా. ఇలాంటివి వినీ వినీ..’’ అంటూ తన వ్యాఖ్యలను అసంపూర్తిగా వదిలేశాడు. దీంతో.. ఇర్ఫాన్.. హార్దిక్ను ఉద్దేశించే ఈ వ్యాఖ్యలు చేశాడని ఫ్యాన్స్ కామెంట్లు చేస్తున్నారు. సిరీస్ ఆరంభం నుంచి కెప్టెన్గా ఓవరాక్షన్ చేస్తున్న పాండ్యా.. ఇప్పుడిలా స్వార్థంగా ప్రవర్తించడం ఎవరికీ నచ్చడం లేదంటూ చురకలు అంటిస్తున్నారు. చదవండి: ఇంతలో ఎంత మార్పు.. ఐపీఎల్లో పులిలా, దేశానికి ఆడేప్పుడు పిల్లిలా..! Mushkil kaam aap karo, Asaan kaam mein Kar leta hoo. Suna suna Sa lagta hai… — Irfan Pathan (@IrfanPathan) August 9, 2023 -
ఇంతలో ఎంత మార్పు.. ఐపీఎల్లో పులిలా, దేశానికి ఆడేప్పుడు పిల్లిలా..!
భారత అభిమానులచే భవిష్యత్తు సూపర్ స్టార్గా, జూనియర్ విరాట్ కోహ్లిగా, మరో పరుగుల యంత్రంగా కీర్తించబడిన టీమిండియా యువ ఓపెనర్ శుభ్మన్ గిల్, నెలలు తిరగకుండగానే ఏ నోళ్లతో అయితే కీర్తించబడ్డాడో అదే నోళ్లతో దూషించబడుతున్నాడు. ఐపీఎల్ 2023లో ఆకాశమే హద్దుగా చెలరేగి, ఏకంగా 3 సెంచరీలు బాది పరుగుల వరద (17 మ్యాచ్ల్లో 3 సెంచరీలు, 4 హాఫ్ సెంచరీల సాయంతో 890 పరుగులు) పారించిన గిల్.. అంతర్జాతీయ స్థాయిలో దేశం కోసం ఆడాల్సి వచ్చే సరికి వరుస వైఫల్యాల బాట పట్టి తేలిపోతున్నాడు. ఇదే భారత అభిమానులను ఆగ్రహానికి గురి చేస్తుంది. దీంతో వారు పట్టలేని కోపంతో గిల్పై దూషణల పర్వానికి దిగుతున్నారు. పొగిడిన నోళ్లతోనే దుర్భాషలాడుతున్నారు. ఏమాత్రం ములాజా లేకుండా జట్టు నుండి తీసిపారేయాలని డిమాండ్ చేస్తున్నారు. దేశం తరఫున ఆడేప్పుడు అత్యుత్తమ ప్రదర్శన కనబర్చకపోతే మహామహులకే తప్పలేదు, ఇతనెంత అంటూ ఘాటైన కామెంట్లు చేస్తున్నారు. గిల్ను త్వరలో జరుగనున్న ఆసియా కప్, వన్డే వరల్డ్కప్లకు కూడా ఎంపిక చేయొద్దని సూచిస్తున్నారు. ఐపీఎల్ ఇచ్చిన సక్సెస్తో విర్రవీగుతున్నాడు, కొద్ది రోజులు పక్కకు కూర్చోబెడితే టీమిండియాలో స్థానం విలువ తెలిసొస్తుందని అంటున్నారు. ప్రస్తుతం భారత రిజర్వ బెంచ్ కూడా బలంగా ఉంది, గిల్కు ప్రత్యామ్నాయంగా రుతురాజ్ను ఎంపిక చేయాలని సూచిస్తున్నారు. ఐపీఎల్-2023 తర్వాత గిల్ గణాంకాలను చూపిస్తూ సోషల్మీడియా వేదికగా ఏకి పారేస్తున్నారు. కాగా, గిల్పై అభిమానుల ఆగ్రహానికి నిజంగానే అర్ధం ఉంది. ఐపీఎల్ 2023లో అత్యధిక పరుగులు చేసిన ఆటగాడిగా నిలిచిన గిల్.. నాటి నుంచి నిన్న విండీస్తో మూడో టీ20 వరకు టీమిండియా తరఫున 11 మ్యాచ్లు ఆడి కేవలం 218 పరుగులు మాత్రమే చేశాడు. ఇందులో ఒకే ఒక్క అర్ధ సెంచరీ ఉంది. ఐపీఎల్ తర్వాత డబ్ల్యూటీసీ ఫైనల్లో రెండు ఇన్నింగ్స్ల్లో 31 పరుగులు (13, 18) చేసిన గిల్.. ప్రస్తుత విండీస్ పర్యటనలో తొలి టెస్ట్లో 6, రెండో టెస్ట్లో 39 పరుగులు (10, 29 నాటౌట్), తొలి వన్డేలో 7, రెండో వన్డేలో 34, మూడో వన్డేలో 85 పరుగులు, తొలి టీ20లో 3, రెండో టీ20లో 7, మూడో టీ20లో 6 పరుగులు చేశాడు. గిల్ చేసిన ఈ స్కోర్లు చూసే పొగిడిన నోళ్లు దూషిస్తున్నాయి. స్టార్ ఆటగాడైన గిల్ వరుసగా ఇన్ని మ్యాచ్ల్లో విఫలం కావడాన్ని అభిమానులు జీర్ణించుకోలేకపోతున్నారు. అందుకే అతనిపై భారీ స్థాయిలో దుమ్మెత్తిపోస్తున్నారు. గిల్ సరిగా ఆడకపోవడం టీమిండియాపై ప్రభావం చూపుతుందని, పసికూన విండీస్ చేతిలో వరుస పరాజయాలే ఇందుకు నిదర్శనమని అంటున్నారు. మొత్తంగా ఐపీఎల్ ఆడినప్పుడు గిల్లో కనిపించిన కసి, దేశం కొరకు ఆడుతున్నప్పుడు కనిపించడం లేదని మండిపడుతున్నారు. -
కుల్దీప్ యాదవ్ సరికొత్త చరిత్ర.. తొలి భారత బౌలర్గా!
కరేబియన్ గడ్డపై టీమిండియా వెటరన్ కుల్దీప్ యాదవ్ మరోసారి తన స్పిన్ మయాజాలాన్ని ప్రదర్శించాడు. గయానా వేదికగా వెస్టిండీస్తో జరిగిన మూడో టీ20లో ప్రత్యర్ది బ్యాటర్లకు చుక్కలు చూపించాడు. తన నాలుగు ఓవర్ల కోటాలో 28 పరుగులిచ్చి 3 వికెట్లు సాధించాడు. ఇక ఈ మ్యాచ్లో అద్బుతమైన ప్రదర్శరన కనబరిచిన కుల్దీప్ యాదవ్ పలు అరుదైన రికార్డులు తన పేరిట లిఖించుకున్నాడు. కాగా ఈ మ్యాచ్లో టీమిండియా 7 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. దీంతో సిరీస్ అధిక్యాన్ని 1-2కు భారత్ తగ్గించింది. కుల్దీప్ సాధించిన రికార్డులు ఇవే.. అంతర్జాతీయ టీ20ల్లో అత్యంత వేగంగా 50 వికెట్ల మార్క్ను అందుకున్న భారత బౌలర్గా రికార్డులకెక్కాడు. 30 మ్యాచ్ల్లో కుల్దీప్ ఈ ఫీట్ సాధించాడు. అంతకముందు ఈ రికార్డు యజువేంద్ర చహల్ పేరిట ఉండేది. చాహల్ 34 మ్యాచ్ల్లో ఈ ఘనతను సాధించాడు. తాజా మ్యాచ్తో చాహల్ రికార్డును కుల్దీప్ బ్రేక్ చేశాడు. అదే విధంగా టీ20ల్లో వెస్టిండీస్పై అత్యధిక వికెట్లు పడగొట్టిన భారత బౌలర్గా కుల్దీప్ నిలిచాడు. విండీస్పై ఇప్పటివరకు 7 మ్యాచ్లు ఆడిన కుల్దీప్.. 15 వికెట్లు పడగొట్టాడు. ఈ క్రమంలో వెటరన్ పేపసర్ భువనేశ్వర్ కుమార్ రికార్డును యాదవ్ బ్రేక్ చేశాడు. భువీ 18 మ్యాచ్ల్లో 15 వికెట్లు పడగొట్టాడు. చదవండి: Yashasvi Jaiswal: ఇషాన్ను కాదని నిన్ను ఆడిస్తే ఏం చేశావు? అప్పుడు సెంచరీ.. ఇప్పుడు రెండు సున్నాలు తగ్గాయంతే! ఫ్యాన్స్ ఫైర్ Charles ☝️ Nicholas Pooran ☝️ Brandon King ☝️ Kuldeep Yadav's sensational outing against the Windies! 🔥#KuldeepYadav #WIvsIND #Cricket pic.twitter.com/2jRC1Fs2Re — OneCricket (@OneCricketApp) August 8, 2023 -
ఇషాన్ను కాదని నిన్ను ఆడించారు.. కానీ నువ్విలా! అస్సలు ఊహించలేదు!
Yashasvi Jaiswal fails on T20I debut: భారీ అంచనాల నడుమ అంతర్జాతీయ టీ20లలో అరంగేట్రం చేసిన టీమిండియా యువ సంచలనం యశస్వి జైశ్వాల్ పూర్తిగా విఫలమయ్యాడు. టెస్టుల్లో అదరగొట్టిన ఈ ముంబై బ్యాటర్.. తనకు కలిసొచ్చిన పొట్టి ఫార్మాట్లో అదరగొడతాడనుకున్న అభిమానులకు నిరాశే మిగిల్చాడు. వెస్టిండీస్తో టీమిండియా మూడో టీ20 సందర్భంగా యశస్వి జైశ్వాల్ ఇంటర్నేషనల్ టీ20లలో అడుగుపెట్టిన విషయం తెలిసిందే. టీమిండియా ఓపెనర్గా శుబ్మన్ గిల్తో కలిసి బరిలోకి దిగిన ఈ లెఫ్టాండర్ రెండు బంతులు ఎదుర్కొని కేవలం ఒకే ఒక్క పరుగు చేశాడు. టెస్టుల్లో అదరగొట్టి విండీస్ పేసర్ ఒబెడ్ మెకాయ్ బౌలింగ్లో అల్జారీ జోసెఫ్నకు క్యాచ్ ఇచ్చి పెవిలియన్ చేరాడు. కాగా వెస్టిండీస్తో టెస్టు సందర్భంగా యశస్వి అంతర్జాతీయ క్రికెట్లో అడుగుపెట్టిన విషయం తెలిసిందే. అరంగేట్ర మ్యాచ్లోనే సెంచరీతో అదరగొట్టాడు ఈ కుర్ర బ్యాటర్. కెప్టెన్ రోహిత్ శర్మకు ఓపెనింగ్ జోడీగా బరిలోకి దిగి తొలి టెస్టులో 171, రెండో టెస్టులో వరుసగా 57, 38 పరుగులతో రాణించాడు. అరుదైన రికార్డులెన్నింటినో తన ఖాతాలో వేసుకుని సంచలనం సృష్టించాడు. ఐపీఎల్లో సెంచరీ ఇదిలా ఉంటే.. ఐపీఎల్లో యశస్వి జైశ్వాల్ రాజస్తాన్ రాయల్స్కు ప్రాతినిథ్యం వహిస్తున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో తాజా ఎడిషన్లో ఓ సెంచరీ(124) చేసిన యశూ.. 14 ఇన్నింగ్స్ ఆడి 625 పరుగులు సాధించాడు. ఇలా క్యాష్ రిచ్ లీగ్లో అదరగొట్టడంతో పాటు.. తొలి టెస్టులోనే సెంచరీ సాధించిన యశస్వి.. టీ20 అరంగేట్రంపై సహజంగానే అభిమానులు గంపెడాశలు పెట్టుకున్నారు. కానీ అతడు విఫలం కావడం జీర్ణించుకోలేకపోతున్నారు. ఈ క్రమంలో కొంతమంది నెటిజన్లయితే యశస్విని విపరీతంగా ట్రోల్ చేస్తున్నారు. ఇషాన్ను కాదని ‘‘ఇషాన్ కిషన్(6, 27) సరిగ్గా ఆడటం లేదని నీకు ఛాన్స్ ఇస్తే.. నువ్వు పొడిచిందేమిటి? ఐపీఎల్లో ఆడతావు కానీ.. దేశం కోసం ఆడవా? ఇదే రిపీట్ అయితే.. మళ్లీ వెనక్కి వెళ్లిపోవాల్సిందే!’’ అంటూ మీమ్స్ షేర్ చేస్తూ వ్యంగ్యాస్త్రాలు సంధిస్తున్నారు. అయితే, ఫ్యాన్స్ మాత్రం.. ‘‘సచిన్ టెండుల్కర్ అంతటి దిగ్గజమే తొలి మ్యాచ్లో విఫలమయ్యాడు. ఆటలో ఇవన్నీ సహజం. యశస్వి తిరిగి పుంజుకుంటాడు. తానేంటో నిరూపించుకుంటాడు’’ అని అండగా నిలుస్తున్నారు. కాగా వెస్టిండీస్తో తొలి రెండు టీ20లలో పరాజయం పాలైన టీమిండియా.. మూడో టీ20లో గెలుపు సాధించింది. తద్వారా ఐదు మ్యాచ్ల సిరీస్లో ఆతిథ్య జట్టు ఆధిక్యాన్ని 2-1కు తగ్గించగలిగింది. చదవండి: మా కెప్టెన్ గట్టిగానే వార్నింగ్ ఇచ్చాడు.. అదే నా మెదడును తొలిచేసింది! అందుకే.. చరిత్ర సృష్టించిన సూర్యకుమార్.. ప్రపంచంలోనే రెండో ఆటగాడిగా! -
రన్రేట్ అవసరం లేదు.. హార్దిక్ చేసింది ముమ్మాటికీ తప్పే!
వెస్టిండీస్తో మూడో టీ20లో టీమిండియా అద్భుత విజయం సాధించినప్పటికీ.. కెప్టెన్ హార్దిక్ పాండ్యా మాత్రం తీవ్ర విమర్శలు ఎదుర్కరొంటున్నాడు. యువ సంచలనం తిలక్ వర్మను హాఫ్ సెంచరీ చేయనీవ్వకుండా హార్దిక్ మ్యాచ్ ఫినిష్ చేయడమే ఇందుకు కారణం. తిలక్ వర్మ తన హాఫ్ సెంచరీకి కేవలం ఒక్క పరుగు దూరంలో ఉన్నాడని తెలిసి కూడా.. హార్దిక్ సిక్స్ కొట్టి మ్యాచ్ ముగించడం పట్ల ఫ్యాన్స్ ఆసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ఇదే విషయంపై టీమిండియా మాజీ క్రికెటర్ ఆకాష్ చోప్రా స్పందించాడు. తిలక్ వర్మకు తన హాఫ్ సెంచరీని పూర్తి చేసే అవకాశం హార్దిక్ ఇచ్చి ఉంటే బాగుండేదని ఆకాష్ చోప్రా అభిప్రాయపడ్డాడు. కాగా ఈ మ్యాచ్లో 37 బంతుల్లో 49 పరుగులు చేసిన తిలక్ వర్మ.. తన హాఫ్ సెంచరీ మార్క్కు కేవలం ఒక్క రన్ దూరంలో ఉండిపోయాడు. తిలక్ వర్మ ఒక అద్భుతం. అతడు బ్యాటింగ్ స్టైల్, దూకుడు నన్ను ఎంతో అకట్టుకుంది. తొలి మూడు ఇన్నింగ్స్లో 30కి పైగా పరుగులు చేసిన రెండో భారత ఆటగాడు కూడా. తన రెండో మ్యాచ్లో హాఫ్ సెంచరీ సాధించాడు. అదే విధంగా మూడో మ్యాచ్లో కూడా దగ్గరకు వచ్చాడు. కానీ దురదృష్టవశాత్తూ తన రెండో ఫిప్టీ మార్క్ను అందుకోలేకపోయాడు. సూర్య ఔటైన వెంటనే హార్దిక్ బ్యాటింగ్కు వచ్చాడు. నాటౌట్ ఉండి మ్యాచ్ను ఫినిష్ చేయాలని తిలక్కు హార్దిక్ చెప్పాడు. అటువంటి అప్పుడు హార్దిక్ ఎందుకు పెద్ద షాట్లకు ప్రయాత్నించాడో నాకు అర్ధం కావడం లేదు. అక్కడ నెట్రన్ రేట్ కూడా అవసరం లేదు. 13 బంతుల్లో 2 పరుగులు అవసరం. అటువంటి సమయంలో సిక్స్ కొట్టి మ్యాచ్ను ఫినిష్ చేశాడు. నావరకు అయితే సింగిల్ తీసి తిలక్కు హార్దిక్ ఇవ్వాల్సింది. అయితే వ్యక్తిగత మైలురాళ్ల గురించి పట్టించుకోకూడదని హార్దిక్ అలా చేశాడమో" అని తన యూట్యూబ్ ఛానల్లో ఆకాష్ చోప్రా పేర్కొన్నాడు. చదవండి: IND Vs WI 3rd T20I: మరీ ఇంత స్వార్ధమా.. ధోనిని చూసి నేర్చుకో! ఏంటి హార్దిక్ ఇది? పాపం తిలక్ వర్మ -
మా కెప్టెన్ గట్టిగానే వార్నింగ్ ఇచ్చాడు.. అదే నా మెదడును తొలిచేసింది! అందుకే..
West Indies vs India, 3rd T20I- Suryakumar Yadav Comments: ‘‘పవర్ ప్లేలోనే బ్యాటింగ్కు వెళ్లాల్సి వచ్చింది. చావోరేవో తేల్చుకోవాల్సిన పరిస్థితి. నా నుంచి మేనేజ్మెంట్ ఏం ఆశిస్తుందో నాకు తెలుసు. కాబట్టి పని పూర్తి చేయాలని భావించా. తిలక్, నేను మెరుగైన భాగస్వామ్యం నమోదు చేశాం. మా బ్యాటింగ్ ఎలా సాగుతుందో పరస్పర అవగాహన ఉంది. సమన్వయంతో ముందుకు సాగిపోయాం. ఇద్దరం మెరుగ్గా బ్యాటింగ్ చేస్తూ ఉండటం నాలో ఆత్మవిశ్వాసాన్ని పెంచింది. తిలక్ అద్భుత ఇన్నింగ్స్ ఆడాడు. మరో ఎండ్లో దంచికొడుతూ నాకు మద్దతుగా నిలిచాడు. నా మెదడును తొలిచేసింది నిజానికి.. ఇప్పటి వరకు టీమిండియా వరుసగా మూడు టీ20లలో ఓడిపోయిన దాఖలాలు లేవు. ఇదే విషయం నా మెదడును తొలిచివేస్తూ ఉంది. ఎలాగైనా గెలవాలనే పట్టుదలతో ఉన్నాం. జట్టుతో సమావేశమైన సమయంలో మా కెప్టెన్ అందరికీ గట్టిగానే చెప్పాడు. ఎవరో ఒక్కరు అదరగొట్టినా మ్యాచ్ గెలుస్తామన్నాడు. ఆ ఒక్కడిని నేనే కావడం సంతోషంగా ఉంది’’ అని టీమిండియా టీ20 స్టార్ సూర్యకుమార్ యాదవ్ హర్షం వ్యక్తం చేశాడు. వెస్టిండీస్తో మూడో టీ20లో విజయం సంతోషాన్నిచ్చిందని పేర్కొన్నాడు. విండీస్ను కట్టడి చేసి కాగా కరేబియన్ దీవి పర్యటనలో భాగంగా తొలి రెండు టీ20లలో భారత జట్టు ఓటమిపాలైన విషయం తెలిసిందే. ఈ క్రమంలో ఐదు మ్యాచ్ల సిరీస్లో భాగంగా ఇరు జట్ల మధ్య మంగళవారం మూడో మ్యాచ్ జరిగింది. గయానా మ్యాచ్లో టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ చేసిన వెస్టిండీస్ నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 159 పరుగులు చేసింది. భారత బౌలర్లలో స్పిన్నర్లు కుల్దీప్ యాదవ్ మూడు, అక్షర్ పటేల్ ఒక వికెట్ తీయగా.. యువ పేసర్ ముకేశ్ కుమార్ ఒక వికెట్ తన ఖాతాలో వేసుకున్నాడు. ఆకాశమే హద్దుగా సూర్య.. అండగా తిలక్ ఇక లక్ష్య ఛేదనకు దిగిన టీమిండియాకు అరంగేట్ర ఓపెనర్ యశస్వి జైశ్వాల్(1), శుబ్మన్ గిల్(6)ల పేలవ ప్రదర్శనతో ఆదిలోనే షాక్ తగిలింది. ఈ క్రమంలో పవర్ ప్లేలో బ్యాటింగ్కు దిగిన వన్డౌన్ బ్యాటర్ సూర్యకుమార్ యాదవ్ సంచలన ఇన్నింగ్స్ ఆడాడు. హార్దిక్ సిక్సర్తో.. 44 బంతుల్లో 10 ఫోర్లు, 4 సిక్సర్ల సాయంతో 83 పరుగులు సాధించాడు. అతడికి తోడుగా యువ సంచలనం తిలక్ వర్మ 49(నాటౌట్) రాణించాడు. అల్జారీ జోసెఫ్ బౌలింగ్లో సూర్య బ్రాండ్నకు క్యాచ్ ఇచ్చి వెనుదిరగ్గా.. క్రీజులోకి వచ్చిన కెప్టెన్ హార్దిక్ 15 బంతుల్లో 20 పరుగులతో అజేయంగా నిలిచాడు. పద్దెనిమిదో ఓవర్ ఐదో బంతికి సిక్సర్ బాది జట్టును గెలుపుతీరాలకు చేర్చాడు. దీంతో టీ20లో హ్యాట్రిక్ ఓటముల గండం నుంచి టీమిండియా తప్పించుకుంది. తుపాన్ ఇన్నింగ్స్తో చెలరేగిన నంబర్1 టీ20 స్టార్ సూర్య ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు అందుకున్నాడు. ఈ నేపథ్యంలో విజయంపై స్పందిస్తూ కెప్టెన్ మాటలు గుర్తుచేసుకున్న ‘స్కై’ ఈ మేరకు వ్యాఖ్యలు చేశాడు. చదవండి: మరీ ఇంత స్వార్ధమా.. ధోనిని చూసి నేర్చుకో! ఏంటి హార్దిక్ ఇది? గంభీర్ రికార్డు బద్దలు కొట్టిన తిలక్ వర్మ.. అరుదైన ఘనత.. నంబర్ 1తో! Form is temporary. Surya is permanent! .#INDvsWI #INDvWIAdFreeonFanCode pic.twitter.com/QRdE8Eg8BQ — FanCode (@FanCode) August 8, 2023 -
అరెరె! జస్ట్ 94 పరుగులతో మిస్.. అక్కడ ఆడి ఉంటేనా!
వెస్టిండీస్తో టీ20 సిరీస్లో టీమిండియా ఓపెనర్ శుబ్మన్ గిల్ ఆటతీరు మారలేదు. వరుసగా మూడో మ్యాచ్లో విఫలమయ్యాడు. గయానా వేదికగా విండీస్తో జరిగిన మూడో టీ20లో కేవలం 6 పరుగులు మాత్రమే చేసి నిరాశపరిచాడు. అల్జారీ జోషఫ్ బౌలింగ్లో చెత్త షాట్కు ప్రయత్నించి తన వికెట్ను గిల్ కోల్పోయాడు. ఇక ఐపీఎల్-2023లో అదరగొట్టిన గిల్.. ఆ తర్వాత అంతర్జాతీయ మ్యాచ్ల్లో తన స్ధాయికి తగ్గట్టు ప్రదర్శన చేయడంలో విఫలమవుతున్నాడు. ఈ ఏడాది ఐపీఎల్లో 890 పరుగులతో గిల్ ఆరెంజ్ క్యాప్ హోల్డర్గా నిలిచిన సంగతి తెలిసిందే. కానీ ఐపీఎల్ తర్వాత ఓవరాల్గా 10 ఇన్నింగ్స్లు ఆడిన గిల్.. ఎనిమిదింట్లో తీవ్ర నిరాశపరిచాడు. ఈ క్రమంలో వరుసగా విఫలమవుతున్న గిల్పై టీమిండియా అభిమానులు మండిపడుతున్నారు. "గిల్ ఆడాలంటే అర్జెంటుగా అహ్మదాబాద్ పిచ్ను తయారు చేయండి" అంటూ దారుణంగా ట్రోలు చేస్తున్నారు. ఓ యూజర్ స్పందిస్తూ.. "జస్ట్ 94 పరుగుల తేడాతో సెంచరీ కోల్పోయాడంటూ" సెటైర్ వేశాడు. ఇక మ్యాచ్ విషయానికి వస్తే.. కీలమైన మూడో టీ20 గెలిచి సిరీస్ రేసులో టీమిండియా నిలిచింది. ఈ మ్యాచ్లో విండీప్ను 7 వికెట్ల తేడాతో భారత్ చిత్తు చేసింది. భారత విజయంలో సూర్యకుమార్ యాదవ్(44 బంతుల్లో 83) కీలక పాత్ర పోషించాడు. చదవండి: చాలా సంతోషంగా ఉంది.. మా సత్తా చూపించాం! అతడు మరోసారి: హార్దిక్ Mental and Physical fatigue clearly showing on Shubhman Gill — Samip Rajguru (@samiprajguru) August 8, 2023 Shubman Gill since IPL 2023 has been a disaster, 8 failures in 10 innings 🤦♂️ — Sushant Mehta (@SushantNMehta) August 8, 2023 Gill departs for 6 as poor form continues. . .#INDvsWI #INDvWIAdFreeonFanCode pic.twitter.com/y5KSqq7TUu — FanCode (@FanCode) August 8, 2023 -
గంభీర్ రికార్డు బద్దలు కొట్టిన తిలక్ వర్మ.. అరుదైన ఘనత.. నంబర్ 1తో!
West Indies vs India, 3rd T20I: టీమిండియా యువ సంచలనం తిలక్ వర్మ వెస్టిండీస్తో మూడో టీ20లోనూ అదరగొట్టాడు. నాలుగోస్థానంలో బ్యాటింగ్ చేసిన ఈ లెఫ్టాండర్ 37 బంతుల్లో 4 ఫోర్లు, ఒక సిక్సర్ సాయంతో 49 పరుగులతో అజేయంగా నిలిచాడు. కెరీర్లో రెండో అర్ధ శతకం నమోదు చేసే అవకాశం తృటిలో చేజారినా.. భారత జట్టు గెలుపులో కీలక పాత్ర పోషించి తనదైన ముద్ర వేయగలిగాడు. గంభీర్ రికార్డు బద్దలు అంతేకాదు.. తన అద్భుత ఇన్నింగ్స్తో ఈ హైదరాబాదీ అరుదైన రికార్డు సాధించాడు. టీ20 ఫార్మాట్లో టీమిండియా తరఫున తొలి మూడు ఇన్నింగ్స్లో అత్యధిక పరుగులు సాధించిన రెండో బ్యాటర్గా చరిత్రకెక్కాడు. ఈ క్రమంలో భారత మాజీ ఓపెనర్ గౌతం గంభీర్ను అధిగమించి.. నంబర్ 1 టీ20 స్టార్ సూర్యకుమార్ యాదవ్తో సంయుక్తంగా రెండో స్థానంలో నిలిచాడు. సూర్య సంచలనం.. తొలి గెలుపు ఈ జాబితాలో 172 పరుగులతో దీపక్ హుడా అగ్రస్థానంలో కొనసాగుతున్నాడు. కాగా వెస్టిండీస్తో తొలి రెండు టీ20లలో ఓటమిపాలైన హార్దిక్ పాండ్యా సేన.. మూడో మ్యాచ్లో ఘన విజయం సాధించింది. సూర్యకుమార్ సంచలన ఇన్నింగ్స్(44 బంతుల్లో 83 పరుగులు)కు తోడు తిలక్ వర్మ, హార్దిక్ పాండ్యా(20- నాటౌట్) రాణించడంతో ఈ సిరీస్లో తొలి గెలుపు నమోదు చేసింది. పాపం ఒక్క పరుగుకే గయానాలో విండీస్పై ఏడు వికెట్ల తేడాతో గెలుపొంది ఐదు మ్యాచ్ల సిరీస్లో ఆతిథ్య జట్టు ఆధిక్యాన్ని 2-1కు తగ్గించి.. ట్రోఫీ గెలవాలనే పట్టుదలతో ముందుకు సాగుతోంది. ఇదిలా ఉంటే.. ఈ మ్యాచ్తో అంతర్జాతీయ టీ20లలో అరంగేట్రం చేసిన యువ బ్యాటర్ యశస్వి జైశ్వాల్ పూర్తిగా విఫలమయ్యాడు. విండీస్పై సెంచరీతో టెస్టుల్లో అరంగేట్రం చేసిన అతడు.. టీ20 ఫార్మాట్ను మాత్రం ఒక్క పరుగుతో ఆరంభించాడు. కాగా హార్దిక్ సిక్సర్తో జట్టును విజయ లాంఛనం పూర్తిచేయగా.. మరో ఎండ్లో ఉన్న తిలక్ 49 పరుగుల వద్దే నిలిచిపోయాడు. అంతర్జాతీయ టీ20లలో తొలి మూడు ఇన్నింగ్స్లో అత్యధిక పరుగులు సాధించిన బ్యాటర్లు వీరే.. 1. దీపక్ హుడా- 172 పరుగులు (21,47, 104) 2. సూర్యకుమార్ యాదవ్, తిలక్ వర్మ- 139 పరుగులు 2. గౌతం గంభీర్- 109 పరుగులు(0, 51, 58) మరో రికార్డు కూడా.. నంబర్ 1తో కలిసి వెస్టిండీస్తో ఆడిన మూడు టీ20 మ్యాచ్లలో హైదరాబాదీ స్టార్ తిలక్ వర్మ చేసిన పరుగులు వరుసగా 39, 51, 49. మొత్తంగా 139 పరుగులు సాధించిన ఈ యువ ఆటగాడు.. తొలి మూడు ఇన్నింగ్స్లో 30కి పైగా పరుగులు చేసి.. సూర్యకుమార్ తర్వాత ఈ ఘనత సాధించిన రెండో భారత బ్యాటర్గా నిలిచాడు. చదవండి: మరీ ఇంత స్వార్ధమా.. ధోనిని చూసి నేర్చుకో! ఏంటి హార్దిక్ ఇది? చాలా సంతోషంగా ఉంది.. మా సత్తా చూపించాం! అతడు మరోసారి: హార్దిక్ Mast win in a must win!#INDvsWI #INDvWIAdFreeonFanCode pic.twitter.com/NQsoXEU3W6 — FanCode (@FanCode) August 8, 2023 Form is temporary. Surya is permanent! .#INDvsWI #INDvWIAdFreeonFanCode pic.twitter.com/QRdE8Eg8BQ — FanCode (@FanCode) August 8, 2023 -
WI vs IND 3rd T20 Match Photos: మూడో టీ20లో భారత ఘన విజయం (ఫొటోలు)
-
చరిత్ర సృష్టించిన సూర్యకుమార్.. ప్రపంచంలోనే రెండో ఆటగాడిగా!
టీమిండియా విధ్వంసకర ఆటగాడు సూర్యకుమార్ యాదవ్ ఎట్టకేలకు తన ప్రతాపాన్ని చూపించాడు. గయానా వేదికగా వెస్టిండీస్తో జరిగిన మూడో టీ20లో ఆకాశమే హద్దుగా చెలరేగిపోయాడు. ప్రత్యర్ధి బౌలర్లను మిస్టర్ 360 ఊచకోత కోశాడు. ఈ క్రమంలో కేవలం 23 బంతుల్లోనే తన హాఫ్ సెంచరీ మార్క్ను అందుకున్నాడు. ఓవరాల్గా ఈ మ్యాచ్లో 44 బంతులు ఎదుర్కొన్న సూర్య.. 10 ఫోర్లు, 4 సిక్స్లతో 83 పరుగులు చేశాడు. సూర్య సంచలన ఇన్నింగ్స్ ఫలితంగా కీలకమైన మూడో టీ20లో 7 వికెట్ల తేడాతో భారత్ విజయం సాధించింది. సూర్య అరుదైన ఫీట్.. ఇక ఈ మ్యాచ్లో సూర్యకుమార్ యాదవ్ పలు అరుదైన రికార్డులను తన పేరిట లిఖించుకున్నాడు. అంతర్జాతీయ టీ20ల్లో సూర్య 100 సిక్స్ల మైలు రాయిని అందుకున్నాడు. భారత ఇన్నింగ్స్ 10 ఓవర్ వేసిన షెఫెర్డ్ బౌలింగ్లో తన వందో సిక్స్ను సూర్య బాదాడు. ఈ క్రమంలో టీ20ల్లో అత్యంత వేగంగా 100 సిక్స్లు కొట్టిన రెండో ఆటగాడిగా సూర్య రికార్డులకెక్కాడు. స్కై తన 49వ ఇన్నింగ్స్లో ఈ ఘనత అందుకున్నాడు. ఈ అరుదైన ఫీట్ సాధించిన జాబితాలో విండీస్ ఆటగాడు ఎవిన్ లూయిస్ తొలి స్ధానంలో ఉన్నాడు. లూయిస్ 42 ఇన్నింగ్స్లలోనే తన 100 సిక్స్లను పూర్తి చేశాడు. అదే విధంగా టీ20ల్లో 100 సిక్స్ల మైలు రాయిని అందుకున్న మూడో భారత బ్యాటర్గా సూర్యకుమార్ నిలిచాడు. ఈ జాబితాలో సూర్యకంటే ముందు టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ, స్టార్ ఆటగాడు విరాట్ కోహ్లి ఉన్నారు. చదవండి: చాలా సంతోషంగా ఉంది.. మా సత్తా చూపించాం! అతడు మరోసారి: హార్దిక్ -
మరీ ఇంత స్వార్ధమా.. ధోనిని చూసి నేర్చుకో! ఏంటి హార్దిక్ ఇది?
టీమిండియా యువ సంచలనం తిలక్ వర్మ మరో సారి సత్తాచాటాడు. గయానా వేదికగా వెస్టిండీస్తో జరిగిన మూడో టీ20లో తిలక్ కీలక ఇన్నింగ్స్ ఆడాడు. 160 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన టీమిండియా 33 పరుగులకే రెండు వికెట్లు కోల్పోయింది. ఈ సమయంలో క్రీజులోకి వచ్చిన హైదరాబాదీ.. సూర్యకుమార్తో కలిసి 83 పరుగుల కీలక భాగస్వామ్యాన్ని నెలకొల్పాడు. ఎదుర్కొన్న తొలి రెండు బంతులను బౌండరీలుగా మలిచి తన ఇన్నింగ్స్ను ఘనంగా ప్రారంభించాడు. ఇక అద్భుత ప్రదర్శన కనబరిచిన తిలక్ వర్మ.. అయితే తృటిలో తన రెండో హాఫ్ సెంచరీ అవకాశాన్ని కోల్పోయాడు. 37 బంతులు ఎదుర్కొన్న తిలక్ వర్మ 4 ఫోర్లు, 1 సిక్స్తో 49 పరుగులు చేసి ఆజేయంగా నిలిచాడు. ఆఖరిలో కెప్టెన్ హార్దిక్ పాండ్యా సిక్స్ కొట్టి జట్టును విజయతీరాలకు చేర్చాడు. అయితే తిలక్ తన హాఫ్ సెంచరీ మార్క్ను అందుకోపోవడానికి టీమిండియా కెప్టెన్ హార్దిక్ పాండ్యానే కారణమని పలువరు అగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఏం జరిగిందంటే.. భారత్ విజయానికి 2 పరుగులు మాత్రమే అవసరమైన నేపథ్యంలో హార్దిక్ పాండ్యాకు స్ట్రైక్ వెళ్లింది. ఆ ఓవర్లో ఇంకా రెండు బంతులు మిగిలిండడంతో హార్దిక్ సింగిల్ తీసి తిలక్ వర్మకు స్ట్రైక్ ఇస్తాడని అంతా భావించారు. దీంతో తిలక్ తన హాఫ్ సెంచరీని పూర్తిచేసుకుంటాడని కామెంటేటర్లు సైతం చెప్పుకొచ్చారు. కానీ హార్దిక్ పాండ్యా మాత్రం ఎవరూ ఊహించని విధంగా సిక్స్ కొట్టి మ్యాచ్ను ఫినిష్ చేశాడు. దీంతో తిలక్ 49 పరుగులతో నాన్స్ట్రైక్లో ఉండిపోవాల్సి వచ్చింది. ధోనిని చూసి నేర్చుకో.. ఇక హార్దిక్ సిక్స్తో మ్యాచ్ ఫినిష్ చేయడాన్ని నెటిజన్లు తప్పుబడుతున్నారు. హార్దిక్ చాలా స్వార్థపరుడని, నాయకత్వ లక్షణాలు అతడికి లేవంటూ దారుణంగా ట్రోలు చేస్తున్నారు. మరి కొంత మంది ధోనిని చూసి నేర్చుకోవాలి అంటూ కామెంట్లు చేస్తున్నారు. కాగా గతంలో సందర్భాల్లో ధోని.. నాన్స్ట్రైక్లో ఉన్న బాట్లర్లు ఏదైనా మైలురాయికి దగ్గరగా ఉన్నప్పుడు ఢిఫెన్స్ ఆడి వారికి స్ట్రైక్ వచ్చేలా చేసేవాడు. 2014 టీ20 ప్రపంచకప్లో భాగంగా దక్షిణాఫ్రికాతో జరిగిన సెమీఫైనల్లో.. భారత విజయానికి ఆఖరి 7 బంతుల్లో ఒక్క పరుగు కావాలి. 19 ఓవర్ ఆఖరి బంతికి స్ట్రైక్లో ఉన్న ధోని మ్యాచ్ ఫినిష్ చేస్తాడని అంతా భావించారు. కానీ ధోని విన్నింగ్ షాట్ కొట్టకుండా ఢిపెన్స్ ఆడి కోహ్లికి స్ట్రైక్ ఇచ్చి అందరి మనసులను గెలుచుకున్నాడు. ఆ తర్వాతి ఓవర్ మొదటి బంతికే కోహ్లి ఫోర్ బాది మ్యాచ్ను ఫినిష్ చేశాడు. ఈ మ్యాచ్లో కోహ్లి 72 పరుగులతో కీలక ఇన్నింగ్స్ ఆడాడు. చదవండి: చాలా సంతోషంగా ఉంది.. మా సత్తా చూపించాం! అతడు మరోసారి: హార్దిక్ Most Punchable Face Right now! Hardik Pandya is the most SELFISH Player i have ever seen! Oh Tilak 💔 pic.twitter.com/abNhCAP73a — ᴘʀᴀᴛʜᴍᴇsʜ⁴⁵ (@45Fan_Prathmesh) August 8, 2023 Most hated 6 by #HardikPandya #INDvsWI #TilakVarma #BCCI pic.twitter.com/U7WVQrN4xC — Lexicopedia (@lexicopedia1) August 8, 2023 When MS Dhoni let Virat Kohli lay the finishing touch 📹 Revisit the sweet gesture by captain Dhoni from the 2014 T20 World Cup semi-final against South Africa 🇮🇳 pic.twitter.com/EKcWsCh9r1 — ICC (@ICC) December 23, 2020 -
చాలా సంతోషంగా ఉంది.. మా సత్తా చూపించాం! అతడు మరోసారి: హార్దిక్
గయానా వేదికగా వెస్టిండీస్తో జరిగిన కీలక మూడో టీ20లో 7 వికెట్ల తేడాతో టీమిండియా ఘన విజయం సాధించింది. దీంతో సిరీస్ గెలిచే అవకాశాలను భారత జట్టు సజీవంగా నిలుపుకుంది. ఈ మ్యాచ్లో ఆల్రౌండ్ షోతో అదరగొట్టింది. ముందుగా చక్కటి బౌలింగ్తో వెస్టిండీస్ను కట్టడి చేసిన భారత్.. ఆ తర్వాత సునాయాసంగా లక్ష్యాన్ని అందుకుంది. టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న వెస్టిండీస్ 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 159 పరుగులు చేసింది. విండీస్ బ్యాటర్లలో బ్రెండన్ కింగ్(42), రావ్మన్ పావెల్(40 నాటౌట్) కీలక ఇన్నింగ్స్లు ఆడారు. భారత బౌలర్లలో కుల్దీప్ యాదవ్ 3 వికెట్లు పడగొట్టాడు. సూర్య ప్రతాపం.. ఇక 160 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన టీమిండియాకు ఓపెనర్లు శుభారంభాన్ని అందించలేకపోయారు. అరంగేట్ర ఆటగాడు యశస్వి జైస్వాల్ (1) ప్రభావం చూపలేకపోగా గిల్ (6) నిరాశపరిచాడు. ఆ తర్వాత క్రీజులోకి వచ్చిన సూర్య ఆకాశమే హద్దుగా చెలరేగిపోయాడు. విండీస్ బౌలర్లను ఊచకోత కోశాడు. కేవలం 44 బంతుల్లో 10 ఫోర్లు, 4 సిక్సర్లతో 83 పరుగులు చేశాడు. అతడితో పాటు యువ బ్యాటర్ తిలక్ వర్మ మరోసారి కీలక ఇన్నింగ్స్ ఆడాడు. 37 బంతుల్లో 49 పరుగులు చేసి ఆజేయంగా నిలిచాడు. 17.5 ఓవర్లలో 3 వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని హార్దిక్ సేన ఛేదించింది. దీంతో సిరీస్ అధిక్యాన్ని 1-2 భారత్ తగ్గించింది. కీలక మ్యాచ్లో విజయం సాధించడం చాలా సంతోషంగా ఉంది. ఆఖరి మూడు మ్యాచ్లు మాకు చాలా ముఖ్యమని బాయ్స్కు ముందే చెప్పాను. వరుసగా రెండు ఓటములు మా జట్టుపై ఎటువంటి ప్రభావం చూపలేదు. అలా అని మా ప్రణాళికలు కూడా మేము మార్చుకోలేదు. తప్పక గెలవాల్సిన మ్యాచ్లలో మేము ఎలా ఆడాతామన్నది చూపించాం. పూరన్ కాస్త ఆలస్యంగా బ్యాటింగ్ రావడం మాకు చాలా సహాయపడింది. ఎందుకంటే మా పేసర్లను డెత్ బౌలింగ్ వరకు ఉంచగల్గాను. పూరన్ క్రీజులో లేకపోవడంతో అక్షర్ కూడా తన నాలుగు ఓవర్ల కోటాను పూర్తి చేశాడు. పూరన్కు వ్యతేరేకంగా మేము పక్కా ప్రణాళికతో బరిలోకి దిగాం. అతడు క్రీజులో ఉన్నప్పుడు నేనే బౌలింగ్ చేయాలని నిర్ఱయించుకున్నాం. కాబట్టి నిక్కీ(పూరన్) హిట్టింగ్ చేయలాంటే నా బౌలింగ్లోనే చేయాలి. ఇటువంటి పోటీని నేను ఆనందిస్తాను. ఈ మాటలు పూరన్ వింటాడని నాకు తెలుసు. బహుశా నాలుగో టీ20లో నన్ను టార్గెట్ చేయవచ్చు. ఈ మ్యాచ్లో మేము ఏడుగురు బ్యాటర్లతో బరిలోకి దిగాలని నిర్ణయించుకున్నాము. బ్యాటర్లు కలిసికట్టుగా రాణిస్తే ఎనిమిదో నంబర్లో ఎవరున్న అవసరం లేదు. సూర్య మరోసారి తనంటో చూపించాడు. సూర్యకుమార్ లాంటి ఆటగాడు జట్టులో వుంటే ఇతరలకు ఆదర్శంగా నిలుస్తాడు. ఇక తిలక్ కూడా సూపర్ ఇన్నింగ్స్ ఆడాడు. సూర్యతో కలిసి కీలక భాగస్వామ్యం నెలకొల్పాడని హార్దిక్ పోస్ట్ ప్రేజేంటేషన్లో పేర్కొన్నాడు. చదవండి: IND vs WI: సూర్య సంచలన ఇన్నింగ్స్.. మూడో టీ20లో భారత ఘన విజయం -
IND VS WI 3rd T20: టాస్ ఓడిన టీమిండియా, యశస్వి జైస్వాల్ అరంగేట్రం
5 మ్యాచ్ల సిరీస్లో భాగంగా గయానా వేదికగా విండీస్తో ఇవాళ (ఆగస్ట్ 8) జరుగుతున్న మూడో టీ20లో వెస్టిండీస్ టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకుంది. సిరీస్లో తొలి రెండు మ్యాచ్లు ఓడి 0-2తో వెనుకపడిన భారత్.. ఈ మ్యాచ్లో ఎలాగైనా గెలిచి సిరీస్ ఆశలను సజీవంగా నిలుపుకోవాలని భావిస్తుంది. ఈ మ్యాచ్లో భారత్ రెండు మార్పులతో బరిలోకి దిగుతుంది. ఇషాన్ కిషన్ స్థానంలో అరంగేట్రం ఆటగాడు యశస్వి జైస్వాల్ జట్టులోకి రాగా.. రవి బిష్ణోయ్ స్థానంలో కుల్దీప్ యాదవ్ జట్టులో చేరాడు. మరోవైపు విండీస్ కూడా ఓ మార్పుతో బరిలోకి దిగనుంది. తొలి రెండు మ్యాచ్ల్లో ఆడిన జేసన్ హోల్డర్ స్థానంలో రోస్టన్ ఛేజ్ బరిలోకి దిగనున్నాడు. వెస్టిండీస్ (ప్లేయింగ్ XI): కైల్ మేయర్స్, బ్రాండన్ కింగ్, జాన్సన్ చార్లెస్ (w), నికోలస్ పూరన్, షిమ్రాన్ హెట్మెయర్, రోవ్మన్ పావెల్ (సి), రోస్టన్ ఛేజ్, రొమారియో షెపర్డ్, అకీల్ హోసేన్, అల్జారీ జోసెఫ్, ఒబెడ్ మెక్కాయ్ భారత్ (ప్లేయింగ్ XI): శుభమన్ గిల్, యశస్వి జైస్వాల్, సూర్యకుమార్ యాదవ్, తిలక్ వర్మ, హార్దిక్ పాండ్యా(c), సంజు శాంసన్, అక్షర్ పటేల్, కుల్దీప్ యాదవ్, యుజ్వేంద్ర చాహల్, అర్ష్దీప్ సింగ్, ముఖేష్ కుమార్ -
ఇప్పుడు కాకపోతే ఇంకెప్పుడు? ఇషాన్, సంజూలను దాటి అతడు దూసుకొస్తాడు!
West Indies vs India, 3rd T20I: వచ్చిన అవకాశాలను సద్వినియోగం చేసుకోకపోతే.. తర్వాత బాధపడాల్సి వస్తుందని టీమిండియా మాజీ ఓపెనర్ ఆకాశ్ చోప్రా అన్నాడు. సంజూ శాంసన్.. ఇప్పటికైనా లోపాలు సరిచేసుకుని జాగ్రత్తపడకపోతే జితేశ్ శర్మ వంటి వికెట్ కీపర్ బ్యాటర్లు అతడి స్థానాన్ని ఆక్రమించే అవకాశం ఉందని హెచ్చరించాడు. కాగా దేశవాళీ క్రికెట్, ఐపీఎల్లో అదరగొడుతున్న కేరళ బ్యాటర్ సంజూ శాంసన్ టీమిండియా తరఫున మాత్రం ప్రభావం చూపలేకపోతున్నాడు. అడపాదడపా వచ్చిన అవకాశాలను కూడా సద్వినియోగం చేసుకోవడంలో విఫలమవుతున్నాడు. సంజూకు అన్యాయం జరిగిందంటూ బీసీసీఐ సెలక్టర్లను ఏకిపారేసిన అభిమానులను పూర్తిగా నిరాశపరుస్తున్నాడు. చాలా రోజుల తర్వాత సంజూ భారత జట్టుకు ఎంపికైన విషయం తెలిసిందే. వెస్టిండీస్తో వన్డే, టీ20 సిరీస్ల నేపథ్యంలో సెలక్టర్లు అతడికి జట్టులో చోటిచ్చారు. ఈ క్రమంలో సంజూకు తొలి వన్డేలో ఆడే అవకాశం రాకపోగా.. తదుపరి మ్యాచ్లో 9 పరుగులకే పెవిలియన్ చేరాడు. అయితే, ఆఖరి, నిర్ణయాత్మక వన్డేలో మిగతా బ్యాటర్లు కూడా చెలరేగిన పిచ్పై 51 పరుగులతో ఫర్వాలేదనిపించాడు. కానీ.. పొట్టి ఫార్మాట్కు వచ్చే సరికి మళ్లీ పాత కథే పునరావృతమైంది. తొలి టీ20లో 12 పరుగులకే పెవిలియన్ చేరిన సంజూ శాంసన్.. రెండో మ్యాచ్లో 7 రన్స్ మాత్రమే చేయగలిగాడు. ఈ నేపథ్యంలో ఆకాశ్ చోప్రా.. సంజూను ఉద్దేశించి కీలక వ్యాఖ్యలు చేశాడు. ‘‘సంజూ శాంసన్.. నీకిచ్చిన అవకాశాలను అనవసరంగా వృథా చేసుకోకు. మళ్లీ విఫలమయ్యావంటే తర్వాత చాలా బాధపడాల్సి ఉంటుంది. ఇషాన్ కిషన్తో మాత్రమే పోటీ అనుకోవద్దు.. ఇషాన్ ఎక్కువా.. సంజూ తక్కువా అని కాదు. వీరిద్దరిని దాటి జితేశ్ శర్మ కూడా రేసులోకి వచ్చే అవకాశం ఉంది’’ అని ఆకాశ్ చోప్రా సంజూకు వార్నింగ్ ఇచ్చాడు. కాగా వెస్టిండీస్తో ఐదు మ్యాచ్ల సిరీస్లో భాగంగా టీమిండియా ఇప్పటికే తొలి రెండు టీ20లలో ఓటమిపాలైంది. ఈ క్రమంలో గయానా వేదికగా సాగనున్న మూడో టీ20లో విజయం సాధిస్తేనే హార్దిక్ సేన సిరీస్ను కాపాడుకోగలిగే స్థితిలో ఉంటుంది. ఈ నేపథ్యంలో తుదిజట్టు కూర్పు ఎలా ఉండబోతుందన్న అంశం ఆసక్తికరంగా మారింది. ఈ మ్యాచ్లో సంజూపై వేటు పడే అవకాశాలే ఎక్కువగా కనిపిస్తున్నాయి. చదవండి: వెస్టిండీస్తో మూడో టీ20.. కిషన్పై వేటు! యువ సంచలనం ఎంట్రీ -
నేను ప్రామిస్ చేశా.. నా హాఫ్ సెంచరీ ఆమెకే అంకితం: తిలక్ వర్మ
వెస్టిండీస్తో టీ20 సిరీస్లో టీమిండియా యువ సంచలనం తిలక్ వర్మ దుమ్మురేపుతున్నాడు. తన అరంగేట్ర మ్యాచ్లో 39 పరుగులతో కీలక ఇన్నింగ్స్ ఆడిన ఈ హైదరాబాదీ.. రెండో టీ20లో అద్భుతమైన హాఫ్ సెంచరీతో చెలరేగాడు. 41 బంతులు ఎదుర్కొన్న తిలక్ వర్మ 5 ఫోర్లు, 1 సిక్స్ సాయంతో 51 పరుగులు చేశాడు. ఈ భారత్ ఓటమిపాలైనప్పటికీ.. తిలక్ మాత్రం అందరిని తన ఆటతీరుతో మంత్రముగ్దులను చేశాడు. అంతర్జాతీయ కెరీర్లో తిలక్ వర్మకు ఇదే తొలి హాఫ్ సెంచరీ కావడం విశేషం. ఇక తిలక్ వర్మ తన హాఫ్ సెంచరీ సెలబ్రేషన్స్ వెరైటీగా జరపుకున్నాడు. మొదటి బ్యాట్ పైకెత్తి, రెండు బొటనవేళ్లను డ్రెసింగ్ రూమ్వైపు చూపిస్తూ చిన్న పిల్లాడిలా తన తొలి హాఫ్ సెంచరీ సెలబ్రేషన్స్ చేసుకున్నాడు. ఈ సెలబ్రేషన్స్ గత కారణాన్ని మ్యాచ్ అనంతరం తిలక్ వర్మ వెల్లడించాడు. నా హాఫ్ సెంచరీ ఆమెకే అంకితం.. తన అంతర్జాతీయ కెరీర్లో చేసిన తొలి హాఫ్ సెంచరీని టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ గారాల పట్టి సమైరా(సామీ)కి అంకితమిస్తున్నట్లు వర్మ తెలిపాడు. పోస్ట్ మ్యాచ్ ప్రేజేంటేషన్లో తిలక్ మాట్లాడుతూ.. నా తొలి హాఫ్ సెంచరీని రోహిత్ భాయ్ ముద్దుల కూతురు సామీకి అంకితమిస్తున్నా. నేను సామీతో చాలా క్లోజ్గా ఉంటాను. నా కెరీర్లో నేను చేసే తొలి సెంచరీ అయినా.. తొలి హాఫ్ సెంచరీ అయినా తనకే అంకితమిస్తానని ప్రామిస్ చేశా. అందుకే ఈ సెలబ్రేషన్స్. మేమిద్దరం కూడా ఫన్నీగా ఈ విధంగానే ఆడుకుంటమని పేర్కొన్నాడు. చదవండి: ODI WC 2023: ఆసీస్ ప్రపంచకప్ జట్టులో టాక్సీ డ్రైవర్ కొడుకు.. ఎవరీ తన్వీర్ సంగా? భారత్తో ఏంటి సంబంధం? 𝐖𝐚𝐭𝐜𝐡𝐢𝐧𝐠 𝐨𝐧 🔁 😍 Tilak's solid Maiden International FIFTY 👏#OneFamily #WIvIND @TilakV9 pic.twitter.com/D1qBZhJJyl — Mumbai Indians (@mipaltan) August 6, 2023 -
వెస్టిండీస్తో మూడో టీ20.. కిషన్పై వేటు! యువ సంచలనం ఎంట్రీ
గయానా వేదికగా వెస్టిండీస్తో కీలక పోరుకు టీమిండియా సిద్దమైంది. మంగళవారం విండీస్తో జరగనున్న మూడో టీ20లో భారత్ అమీతుమీ తెల్చుకోనుంది. ఈ మ్యాచ్లో టీమిండియా ఓటమి పాలైతే సిరీస్ను కోల్పోతుంది. ఎందుకంటే ఐదు మ్యాచ్ల సిరీస్లో విండీస్ ఇప్పటికే 2-0 అధిక్యంలో ఉంది. దీంతో ఈ కీలక మ్యాచ్లో సరైన కాంబనేషన్తో బరిలోకి దిగాలని భారత జట్టు భావిస్తోంది. ఈ నేపథ్యంలో ఇషాన్ కిషన్ను పక్కన పెట్టి, యువ ఓపెనర్ యశస్వీ జైశ్వాల్కు అవకాశం ఇవ్వాలని భారత జట్టు మెనెజ్మెంట్ యోచిస్తున్నట్లు సమాచారం. అదే విధంగా తొలి రెండు టీ20ల్లో విఫలమైన సంజూ శాంసన్కు మరో అవకాశం ఇవ్వనున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ఈ క్రమంలో సంజూ వికెట్ కీపింగ్ బాధ్యతలు చెపట్టే అవకాశం ఉంది. ఇక బౌలింగ్ విషయానికి వస్తే.. గత మ్యాచ్కు గాయం కారణంగా దూరమైన వెటరన్ స్పిన్నర్ కుల్దీప్ యాదవ్ పూర్తి ఫిట్నెస్ సాధించినట్లు తెలుస్తోంది. కుల్దీప్ జట్టులోకి వస్తే మరో స్పిన్నర్ బిష్ణోయ్ బెంచ్కే పరిమితమవ్వల్సి వస్తుంది. ఇక తొలి రెండు మ్యాచ్ల్లో పెద్దగా అకట్టుకోపోయిన ముఖేష్ కుమార్ను పక్కన పెట్టనున్నట్లు తెలుస్తోంది. అతడి స్ధానంలో యువ పేసర్ ఉమ్రాన్ మాలిక్ను అవకాశం ఇవ్వాలని హార్దిక్ పాండ్యా, కోచ్ రాహుల్ ద్రవిడ్ భావిస్తున్నట్లు క్రికెట్ వర్గాలు వెల్లడించాయి. మరోవైపు రెండు మ్యాచ్లు గెలిచిన ఉత్సాహంతో వెస్టిండీస్ సిరీస్పై కన్నేసింది. మూడో టీ20లో ఎటువంటి మార్పులు లేకుండా విండీస్ బరిలోకి దిగే అవకాశం ఉంది. ఇక విండీస్ విధ్వంసకర ఆటగాడు నికోలస్ పూరన్ను భారత బౌలర్లు ఎంతవరకు అడ్డుకుంటారో వేచి చూడాలి. ఈ మ్యాచ్ భారత కాలమానం ప్రకారం రాత్రి 8:00 గంటలకు ప్రారంభం కానుంది. తుది జట్లు(అంచనా) భారత్: యశస్వి జైస్వాల్, శుభమన్ గిల్, సూర్యకుమార్ యాదవ్, తిలక్ వర్మ, సంజు శాంసన్, హార్దిక్ పాండ్యా (కెప్టెన్), అక్షర్ పటేల్, యుజ్వేంద్ర చాహల్, అర్ష్దీప్ సింగ్, ఉమ్రాన్ మాలిక్, కుల్దీప్ యాదవ్ విండీస్: కైల్ మేయర్స్, బ్రాండన్ కింగ్, జాన్సన్ చార్లెస్, నికోలస్ పూరన్ (వికెట్ కీపర్), షిమ్రాన్ హెట్మెయర్, రోవ్మాన్ పావెల్ (కెప్టెన్), జాసన్ హోల్డర్, రొమారియో షెపర్డ్, అకేల్ హోసేన్, అల్జారీ జోసెఫ్, ఒబెడ్ మెక్కాయ్ చదవండి: Global T20 Canada: ఇదెక్కడి అవార్డురా బాబు?.. మ్యాన్ ఆఫ్ ది సిరీస్గా అర ఎకరం భూమి -
నికోలస్ పూరన్కు బిగ్షాకిచ్చిన ఐసీసీ.. భారీ జరిమానా! ఎందుకంటే?
గయానా వేదికగా టీమిండియాతో జరిగిన రెండో టీ20లో 2 వికెట్ల తేడాతో వెస్టిండీస్ విజయం సాధించిన సంగతి తెలిసిందే. విండీస్ విజయంలో కీలక పాత్ర పోషించిన వికెట్ కీపర్ బ్యాటర్ నికోలస్ పూరన్కు ఐసీసీ బిగ్షాకిచ్చింది. అంపైరింగ్ నిర్ణయాలను వ్యతిరేకించినందుకు పూరన్కు మ్యాచ్ ఫీజులో 15 శాతం ఐసీసీ కోత విధించింది. లెవెల్-1 ఐసీసీ ప్రవర్తనా నియమావళిని ఉల్లంఘించినందుకు పూరన్కు ఫైన్ విధించారు ఏం జరిగిందంటే? విండీస్ ఇన్నింగ్స్ 4 ఓవర్ వేసిన అర్ష్దీప్ సింగ్ బౌలింగ్లో నాలుగో బంతిని కైల్మైర్స్ లెగ్సైడ్ ఆడేందుకు ప్రయత్నించాడు. అయితే బంతి బ్యాట్కు మిస్స్ అయ్యి అతడి ప్యాడ్కు తాకింది. వెంటనే ఎల్బీకి అప్పీల్ చేయగా ఫీల్డ్ అంపైర్ ఔటని వేలు పైకెత్తాడు. వెంటనే మైర్స్ నాన్స్ట్రైక్లో ఉన్న పూరన్తో చర్చించి రివ్యూకు వెళ్లాడు. రివ్యూలో ఫలితం అంపైర్కాల్ తేలింది. దీంతో మైర్స్ పెవిలియన్కు వెళ్లక తప్పలేదు. ఈ క్రమంలో పూరన్ ఫీల్డ్ అంపైర్ నిర్ణయంపై అసంతృప్తి వ్యక్తం చేశాడు. "మీరు ఔట్ ఇవ్వకపోయి ఉంటే అది కచ్చితంగా నాటౌట్" అంటూ బహిరంగంగా విమర్శించాడు. ఈనేపథ్యంలోనే ఫీల్డ్ అంపైర్లు ఫిర్యాదుతో మ్యాచ్ రిఫరీ పూరన్పై చర్యలు తీసుకున్నాడు. కాగా పూరన్ కూడా తన తప్పును అంగీకరించాడు. ఇక ఇరు జట్ల మధ్య మూడో టీ20 గయనా వేదికగా ఆగస్టు 8న జరగనుంది. చదవండి:ODI WC 2023: 12 ఏళ్ల తర్వాత మళ్లీ.. ప్రపంచకప్లో విజయం మాదే: రోహిత్ శర్మ -
IND VS WI: ఇచ్చిన అవకాశాలు చాలు.. వాళ్లను వెంటనే తీసిపారేయండి..!
అతి సాధారణ జట్టైన విండీస్ చేతిలో టీమిండియా వరుసగా రెండు మ్యాచ్ల్లో (టీ20లు) ఓటమిపాలైన నేపథ్యంలో కొందరు ఆటగాళ్లపై, ముఖ్యంగా వరల్డ్ క్లాస్ ప్లేయర్లుగా చెప్పుకునే నలుగురు బ్యాటర్లపై (ఇషాన్ కిషన్, శుభ్మన్ గిల్, సూర్యకుమార్, సంజూ శాంసన్) భారత అభిమానులు చాలా ఆగ్రహంగా ఉన్నారు. కనీసం వరల్డ్కప్కు కూడా క్వాలిఫై కాలేని జట్టు చేతిలో ఓడిపోవడాన్ని జీర్ణించుకోలేకపోతున్న ఫ్యాన్స్.. రెండు మ్యాచ్ల్లో ఓటమికి కారణమైన ఆ నలుగురితో పాటు చెత్త వ్యూహాలు రచించిన కెప్టెన్ హార్ధిక్ పాండ్యాపై తీవ్రస్థాయిలో మండిపడుతున్నారు. సోషల్మీడియా వేదికగా వీరిని ఏకీ పారేస్తున్నారు. ఇచ్చిన అవకాశాలు చాలు.. వెంటనే వాళ్లను జట్టు నుంచి తీసిపారేయండని ధ్వజమెత్తుతున్నారు. ఆ నలుగురు, హార్ధిక్ పాండ్యా కలిసి పటిష్టమైన భారత జట్టును సిరీస్ కోల్పోయే ప్రమాద స్థితికి తీసుకువచ్చారని తూర్పారబెడుతున్నారు. రోహిత్, కోహ్లి, పంత్, రాహుల్, శ్రేయస్ వస్తే కాని, టీమిండియా బ్యాటింగ్ మళ్లీ గాడిలో పడదని, ఇలాగే ప్రయోగాల పేరు చెప్పి ఉన సమయాన్ని వృధా చేసుకుంటే, త్వరలో జరుగనున్న ఆసియా కప్లో ఆ తర్వాత జరుగనున్న వన్డే వరల్డ్కప్లో భంగపాటు తప్పదని హెచ్చరిస్తున్నారు. శాంసన్, సూర్యకుమార్లకు మరో అవకాశం ఇచ్చినా పర్వాలేదు కాని, టీ20ల్లో వరుసగా విఫలమవుతున్న ఇషాన్ కిషన్, శుభ్మన్ గిల్లను మాత్రం వెంటనే తప్పించమని పెద్ద ఎత్తున డిమాండ్ చేస్తున్నారు. ప్రస్తుతం విండీస్లో ఉన్న భారత శిబిరంలో వీరికి ప్రత్యామ్నాయం లేకపోతే, కనీసం బౌలర్లకైనా అవకాశాలు ఇవ్వండని సూచిస్తున్నారు. టీమిండియా సిరీస్ కోల్పోయినా పర్వాలేదు కాని, మూడో వన్డే నుంచి వాళ్లను పక్కకు కూర్చోపెట్టండని అంటున్నారు. అంతర్జాతీయ టీ20ల్లో ఇషాన్, గిల్ల ట్రాక్ రికార్డు చూపించి మరీ వారిని ట్రోల్ చేస్తున్నారు. సొంత అభిమానులే ఇషాన్, గిల్లపై ఇంతలా రియాక్ట్ అవ్వడానికి కారణాలు లేకపోలేదు. ఐపీఎల్లో ఆడినట్లు దేశం తరఫున ఆడకపోవడం, ఏదో జాలీ ట్రిప్కు వెళ్లినట్లు ఫోటోలకు పోజులిస్తూ బీచ్ల్లో షికార్లు కొట్టడం, నిర్లక్ష్యంగా షాట్లు ఆడి వికెట్లు సమర్పించుకోవడం, అన్నిటి కంటే ఎక్కువగా భారత్ సిరీస్ కోల్పోతుందేమోనన్న బాధ అభిమానులను ఈ స్థాయిలో రియాక్ట్ అయ్యేలా చేసింది. కాగా, విండీస్తో 5 మ్యాచ్ల సిరీస్లో టీమిండియా ప్రస్తుతం 0-2తో వెనుకపడి ఉన్న విషయం తెలిసిందే. -
నికోలస్ పూరన్ ఊచకోత.. టీమిండియాపై సరికొత్త చరిత్ర!
టీమిండియాతో టీ20 సిరీస్లో వెస్టిండీస్ వరుసగా రెండో విజయం నమోదు చేసింది. గయానా వేదికగా భారత్తో జరిగిన రెండో వన్డేలో ఆల్రౌండ్ ప్రదర్శన కనబరిచిన విండీస్.. 2 వికెట్ల తేడాతో విజయం సాధించింది. ఈ విజయంలో ఆ జట్టు ఆటగాడు నికోలస్ పూరన్ కీలక పాత్ర పోషించాడు. 153 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన విండీస్ తొలి ఓవర్లోనే రెండు కీలక వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది. ఈ సమయంలో క్రీజులోకి వచ్చిన పూరన్ భారత బౌలర్లపై ఎదురుదాడికి దిగాడు. బౌండరీలు వర్షం కురిపించాడు. ముఖ్యంగా 6వ ఓవర్ వేసిన రవి బిష్ణోయ్ బౌలింగ్లో 3 ఫోర్లు, 1 సిక్స్ సాయంతో ఏకంగా 18 పరుగులు రాబాట్టాడు. ఓవరాల్గా ఈ మ్యాచ్లో 40 బంతులు ఎదుర్కొన్న పూరన్.. 4 సిక్స్లు, 6 ఫోర్లు సాయంతో 67 పరుగులు చేశాడు. ఇక అద్భుత ఇన్నింగ్స్ ఆడిన పూరన్ పలు అరుదైన రికార్డులను తన పేరిట లిఖించుకున్నాడు. పూరన్ సాధించిన రికార్డులు ఇవే.. ►టీమిండియాపై టీ20ల్లో అత్యధిక పరుగులు చేసిన ఆటగాడిగా పూరన్ నిలిచాడు. ఇప్పటివరకు భారత్పై 524 పరుగులు చేశాడు. అంతకుముందు ఈ రికార్డు ఆస్ట్రేలియా మాజీ కెప్టెన్ ఆరోన్ ఫించ్(500) పేరిట ఉండేది. తాజా మ్యాచ్తో ఫింఛ్ రికార్డును పూరన్ బ్రేక్ చేశాడు. ►అదే విధంగా భారత్పై అత్యధిక 50 ప్లస్ స్కోర్లు సాధించిన మొదటి క్రికెటర్గా పూరన్ రికార్డులకెక్కాడు. ఇప్పటివరకు టీమిండియాపై 5 సార్లు 50 ప్లస్ స్కోర్లు చేశాడు. అంతకుముందు ఈ రికార్డు జోస్బట్లర్, మున్రో, డికాక్ పేరిట ఉండేది. వీరిముగ్గురు 4 సార్లు 50 ప్లస్ స్కోర్లు సాధించారు. చదవండి: World Cup 2023: ప్రపంచకప్కు ఆస్ట్రేలియా జట్టు ప్రకటన.. స్టార్ ఆటగాడిపై వేటు! యువ ఆటగాళ్లు ఎంట్రీ That's a Nicholas-ty Blow!#StreamingLiveOnFanCode #WIvIND pic.twitter.com/e9mZvCF4JU — FanCode (@FanCode) August 3, 2023 -
ఛాన్స్లు ఇవ్వరంటారు.. ఇస్తే ఇలా ఆడుతావా? ఏంటి సంజూ ఇది?
టీమిండియా వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ తనకు వచ్చిన అవకాశాలను సద్వినియోగ పరుచుకోలేకపోతున్నాడు. వెస్టిండీస్తో జరగుతున్న టీ20 సిరీస్లో సంజూ తన స్ధాయికి తగ్గ ప్రదర్శన చేయలేకపోతున్నాడు. విండీస్తో తొలి టీ20లో 12 పరుగులు చేసి విఫలమైన శాంసన్.. ఇప్పుడు రెండో టీ20లో కూడా అదే ఆటతీరును కనబరిచాడు. ఈ మ్యాచ్లో 7 పరుగులు చేసిన సంజూ.. అకిల్ హోస్సేన్ బౌలింగ్లో అనవసర షాట్కు ప్రయత్నించి పెవిలియన్కు చేరాడు. కీలక సమయంలో క్రీజులోకి వచ్చి విఫలమైన శాంసన్పై సర్వాత్ర విమర్శల వర్షం కురుస్తోంది. భారత జట్టులో చోటు కోసం యువ ఆటగాళ్ల నుంచి తీవ్ర పోటీ ఉన్న సమయంలో శాంసన్ ఇటువంటి పేలవ ప్రదర్శన చేయడం సరికాదని పలువరు అభిప్రాయపడుతున్నారు. సంజూ ఇదే ఆట తీరును కనబరిస్తే జట్టులో చోటు కష్టమే అంటూ నెటిజన్లు సోషల్ మీడియాలో పోస్టులు చేస్తున్నారు. చదవండి: అస్సలు ఊహించలేదు.. అతడే మా కొంపముంచాడు! కొంచెం బాధ్యతగా ఆడాలి: హార్దిక్ కాగా మరి కొంతమంది "జట్టులో చోటు ఇవ్వడం లేదని బీసీసీఐను ట్రోలు చేశారు.. ఛాన్స్ ఇస్తే ఏమి చేశాడంటూ" కామెంట్లు పెడుతున్నారు. కాగా ఐపీఎల్లో 3800పైగా పరుగులు చేసిన సంజూ.. అంతర్జాతీయ టీ20ల్లో మాత్రం పెద్దగా రాణించలేకపోతున్నాడు. ఇప్పటివరకు తన కెరీర్లో 19 టీ20 మ్యాచ్లు ఆడిన శాంసన్ 18.62 సగటుతో కేవలం 320 పరుగులు మాత్రమే చేశాడు. అతడి ఇన్నింగ్స్లలో ఒకే ఒక హాఫ్ సెంచరీ ఉంది. టీ20ల్లొ శాంసన్ ఫామ్ ఎలా ఉందో.. అతడి గణాంకాలు చూస్తే మనకు తెలుస్తోంది. కాగా రెండో టీ20లో 2వికెట్ల తేడాతో టీమిండియా ఓటమి పాలైంది. చదవండి: World Cup 2023: ప్రపంచకప్కు ఆస్ట్రేలియా జట్టు ప్రకటన.. స్టార్ ఆటగాడిపై వేటు! యువ ఆటగాళ్లు ఎంట్రీ -
ఏంటి బ్రో ఆట మర్చిపోయావా..? ఐపీఎల్లోనే ఆడుతాడు! అక్కడ పనికిరాడు
వెస్టిండీస్తో టీ20 సిరీస్లో టీమిండియా యువ ఓపెనర్ శుబ్మన్ గిల్ తన పేలవ ప్రదర్శనను కొనసాగిస్తున్నాడు. తొలి టీ20లో దారుణంగా విఫలమైన గిల్.. రెండో టీ20లో కూడా అదే తీరును కనబరిచాడు. గయానా వేదికగా విండీస్తో జరిగిన రెండో టీ20లో 9 బంతులు ఎదుర్కొన్న గిల్ కేవలం 7 పరుగులు మాత్రమే చేసి నిరాశపరిచాడు. ఇన్నింగ్స్ మొదటి బంతి నుంచే విండీస్ బౌలర్లను ఎదుర్కొండానికి శుబ్మన్ కష్టపడ్డాడు. ఈ క్రమంలో మొదటి 6 బంతుల్లో కేవలం ఒక్క పరుగులు చేశాడు. అయితే భారత ఇన్సింగ్స్ మూడో ఓవర్ వేసిన అల్జారీ జోషఫ్ బౌలింగ్లో గిల్ సిక్స్ బాది తన బౌండరీ ఖాతాను తెరిచాడు. కానీ ఆ తర్వాతి బంతికే మరో భారీ షాట్కు ప్రయత్నించి తన వికెట్ను కోల్పోయాడు. ఇక రెండు మ్యాచ్ల్లో విఫలమైన గిల్ను నెటిజన్లు దారుణంగా ట్రోలు చేస్తున్నారు. అతడి స్ధానంలో యువ ఓపెనర్ యశస్వీ జైశ్వాల్కు అవకాశం ఇచ్చి ఉంటే బాగుండేదని కామెంట్లు చేస్తున్నారు. గిల్ ఐపీఎల్లో తప్ప ఇంకా ఆడడని, భారత పిచ్లపై మాత్రమే బ్యాటింగ్ చేయగలడని నెటిజన్లు సోషల్ మీడియాలో పోస్టులు చేస్తున్నారు. ఇక ఈ మ్యాచ్లో రెండు వికెట్ల తేడాతో భారత్ ఓటమి పాలైంది. దీంతో విండీస్ ఐదు మ్యాచ్ల సిరీస్ 2-0 ఆధిక్యంలోకి దూసుకెళ్లింది. ఇరు జట్ల మధ్య మూడో టీ20 మంగళవారం ఫ్లోరిడా వేదికగా జరగనుంది. చదవండి: IND vs WI: చరిత్ర సృష్టించిన టీమిండియా కెప్టెన్.. తొలి భారత క్రికెటర్గా! 6(11), 10(12) in Tests...7(16) in 1st ODI and now 3(9) in 1st T20 & 7(9) in 2nd T20.....what a memorable Test this Generational talent guy having 🔥🔥 Shubhman Gill what a performer❤️🔥🙌 #WIvIND pic.twitter.com/OJXSu6dZc8 — TukTuk Academy (@TukTuk_Academy) August 6, 2023 Agar Ruturaj Gaikwad 2 match me fail ho jata to usko turant drop karke Dravid Yashasvi Jaiswal ko khila deta But This shameless Dravid won't drop Ishan Kishan and Shubman Gill despite failing continuously.. #SackDravid #INDvsWI pic.twitter.com/Qh79F16QXv — Sir Anthoni Sir (@SirAnthoniSir) August 6, 2023 -
చరిత్ర సృష్టించిన టీమిండియా కెప్టెన్.. తొలి భారత క్రికెటర్గా!
టీ20 క్రికెట్లో టీమిండియా కెప్టెన్ హార్దిక్ పాండ్యా అరుదైన ఘనత సాధించాడు. టీ20ల్లో 4000 పరుగులతో పాటు 150 వికెట్లు సాధించిన తొలి భారత క్రికెటర్గా హార్దిక్ చరిత్ర సృష్టించాడు. గయానా వేదికగా వెస్టిండీస్తో జరిగిన రెండో టీ20లో బ్రాండన్ కింగ్ను ఔట్ చేసిన హార్దిక్.. ఈ అరుదైన రికార్డును తన పేరిట లిఖించుకున్నాడు. టీ20 క్రికెట్లో ఇప్పటివరకు హార్దిక్ ఇప్పటివరకు 4391 పరుగులతో పాటు 152 వికెట్లు పడగొట్టాడు. కాగా టీ20ల్లో హార్దిక్ తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నాడు. 2015 ముంబై ఇండియన్స్ తరపున ఐపీఎల్ అరంగేట్రం చేసిన హార్దిక్.. ఇప్పుడు గుజరాత్ టైటాన్స్ సారధిగా వ్యవహరిస్తున్నాడు. తన ఐపీఎల్ కెరీర్లో ఇప్పటివరకు 123 మ్యాచ్లు ఆడిన పాండ్యా, 30.38 సగటుతో 2309 పరుగులు చేశాడు. అదే విధంగా 2016లో ఎంస్ ధోని సారధ్యంలో అంతర్జాతీయ క్రికెట్లోకి హార్దిక్ అడుగుపెట్టాడు. అనంతరం భారత జట్టులో కీలక ఆటగాడిగా ఈ గుజరాత్ ఆటగాడిగా కొనసాగుతున్నాడు. వరుసగా రెండో ఓటమి.. కరేబియన్ పర్యటనలో టీమిండియా మరో ఓటమి చవిచూసింది. గయానా వేదికగా విండీస్తో జరిగిన రెండో టీ20లో రెండు వికెట్ల తేడాతో భారత్ ఓటమి పాలైంది. తొలుత బ్యాటింగ్ చేసిన టీమిండియా నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 152 పరుగులు మాత్రమే చేసింది. తిలక్ వర్మ 41 బంతుల్లో 5 ఫోర్లు ఒక సిక్స్తో 51 పరుగులు చేశాడు. ఓపెనర్ ఇషాన్ కిషన్(27), కెప్టెన్ హార్దిక్ పాండ్యా(24) పర్వాలేదనిపించారు. మిగతా బ్యాటర్లు శుబ్మన్ గిల్, సూర్యకుమార్ యాదవ్, సంజు శాంసన్, అక్షర్ పటేల్ దారుణంగా విఫలం అయ్యారు. విండీస్ బౌలర్లలో అకిల్ హోసీన్, అల్జారి జోసెఫ్, షెఫర్డ్ తలా 2 వికెట్లు పడగొట్టారు. అనంతరం 153 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన విండీస్ 18.5 ఓవర్లలో 8 వికెట్లు కోల్పోయి ఛేదించింది. విండీస్ బ్యాటర్లలో నికోలస్ పూరన్ (40 బంతుల్లో 67; 6 ఫోర్లు, 4 సిక్సర్లు) టాప్ స్కోరర్గా నిలిచాడు. భారత బౌలర్లలో హార్దిక్ పాండ్యా మూడు వికెట్లు, చహల్ రెండు, అర్ష్దీప్, ముఖేష్ కుమార్ తలా వికెట్ సాధించారు. చదవండి: #Sarfaraz Khan: కశ్మీర్ యువతిని పెళ్లాడిన ముంబై క్రికెటర్.. ఫోటోలు, వీడియోలు వైరల్! -
'అస్సలు ఊహించలేదు.. అతడే మా కొంపముంచాడు! కొంచెం బాధ్యతగా ఆడాలి'
కరేబియన్ గడ్డపై టీమిండియాకు మరో షాక్ తగిలింది. గయనా వేదికగా స్టిండీస్తో జరిగిన రెండో టీ20లో కూడా భారత్ ఓటమి పాలైంది. ఈ మ్యాచ్లో 2 వికెట్ల తేడాతో టీమిండియా పరాజయం చవి చూసింది. దీంతో ఐదు మ్యాచ్ల సిరీస్లో 2-0 అధిక్యంలోకి అతిథ్య విండీస్ దూసుకువెళ్లింది. టాస్ గెలిచిన భారత్ ముందుగా 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 152 పరుగులు చేసింది. భారత బ్యాటర్లలో తిలక్ వర్మ(51) టాప్ స్కోరర్గా నిలిచాడు. విండీస్ బౌలర్లలో అకిల్ హోసీన్, అల్జారి జోసెఫ్, షెఫర్డ్ తలా 2 వికెట్లు పడగొట్టారు. అనంతరం 153 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన విండీస్ 18.5 ఓవర్లలో 8 వికెట్లు కోల్పోయి ఛేదించింది. విండీస్ బ్యాటర్లలో నికోలస్ పూరన్ (40 బంతుల్లో 67; 6 ఫోర్లు, 4 సిక్సర్లు) సంచలన ఇన్నింగ్స్ ఆడాడు. భారత బౌలర్లలో హార్దిక్ పాండ్యా మూడు వికెట్లు, చహల్ రెండు, అర్ష్దీప్, ముఖేష్ కుమార్ తలా వికెట్ సాధించారు. ఇక వరుసగా రెండో ఓటమిపై మ్యాచ్ అనంతరం టీమిండియా కెప్టెన్ హార్దిక్ పాండ్యా స్పందిచాడు. తమ ఓటమికి కారణం బ్యాటింగ్ వైఫల్యమేనని హార్దిక్ చెప్పుకొచ్చాడు. కొంచెం బాధ్యత తీసుకోవాలి "ఈ మ్యాచ్లో మా స్ధాయికి తగ్గట్టు బ్యాటింగ్ ప్రదర్శన చేయలేకపోయాం. మేము ఇంతకన్న బాగా బ్యాటింగ్ చేయగలము. ఈ పిచ్పై 160 పైగా పరుగులు చేసి ఉంటే కచ్చితంగా పోటీ ఇచ్చే వాళ్లం. మాకు బౌలింగ్లో అద్భుతమైన ఆరంభం వచ్చింది. 2 పరుగులకే రెండు వికెట్లు పడగొట్టి విండీస్పై ఒత్తిడి పెంచాము. కానీ పూరన్ మాత్రం అద్భుతమైన ఇన్నింగ్స్ ఆడాడు. అతడు మా నుంచి మ్యాచ్ లాగేసుకున్నాడు. ఇది మేము అస్సలు ఊహించలేదు. స్పిన్నర్లను రోటాట్ చేయడం చాలా కష్టం. పూరన్ స్పిన్నర్లనే టార్గెట్ చేశాడు. మేము ఈ మ్యాచ్లో 7 మంది బ్యాటర్లతో బరిలోకి దిగాము. ప్రతీ ఒక్కరూ బాధ్యతగా ఆడాలి. అప్పుడే మనం విజయం సాధించగలం. మేము తదుపరి మ్యాచ్లో సరైన బ్యాలెన్స్తో బరిలోకి దిగుతాం. ఇక తిలక్ వర్మ గురించి ఎంత చెప్పిన తక్కువే. నాలుగో స్ధానంలో బ్యాటింగ్ వచ్చి అద్భుతమైన ఇన్నింగ్స్లు ఆడుతున్నాడు. తిలక్కు ఇది రెండో అతర్జాతీయ మ్యాచ్గా నాకు అనిపించలేదు. అతడి బ్యాటింగ్ చూస్తే ఏదో వందో మ్యాచ్ ఆడుతున్నట్లు అనిపించింది పోస్ట్ మ్యాచ్ ప్రేజేంటేషన్లో హార్దిక్ పాండ్యా పేర్కొన్నాడు. చదవండి: IND vs WI: చరిత్ర సృష్టించిన తిలక్ వర్మ.. రెండో భారత ఆటగాడిగా! పంత్ రికార్డు బద్దలు -
చరిత్ర సృష్టించిన తిలక్ వర్మ.. రెండో భారత ఆటగాడిగా! పంత్ రికార్డు బద్దలు
టీమిండియా యువ ఆటగాడు తిలక్ వర్మ తన అద్భుతమైన ఫామ్ను కొనసాగిస్తున్నాడు. ఈ క్రమంలో అంతర్జాతీయ క్రికెట్లో తొలి హాఫ్ సెంచరీ సాధించాడు. వెస్టిండీస్తో జరిగిన తొలి టీ20లో దుమ్ము రేపిన తిలక్.. గయనా వేదికగా జరిగిన రెండో టీ20లో కూడా అదే తరహా ప్రదర్శన చేశాడు. ఈ మ్యాచ్లో 41 బంతులు ఎదుర్కొన్న తిలక్ వర్మ 5 ఫోర్లు, 1 సిక్స్ సాయంతో 51 పరుగులు చేశాడు ఇక హాఫ్ సెంచరీతో అదరగొట్టిన తిలక్ వర్మ ఓ అరుదైన రికార్డును తన పేరిట లిఖించుకున్నాడు. అంతర్జాతీయ టీ20ల్లో అతి తక్కువ వయస్సులో హాఫ్ సెంచరీ రెండో భారత ఆటగాడిగా తిలక్ వర్మ రికార్డులకెక్కాడు. వర్మ ఈ ఘనతను కేవలం 20 ఏళ్ల 271 రోజుల వయస్సులో అందుకున్నాడు. ఈ క్రమంలో టీమిండియా వికెట్ కీపర్ రిషబ్ పంత్ను తిలక్ అధిగమించాడు. పంత్ 21 ఏళ్ల 38 రోజుల వయస్సులో ఈ రికార్డును సాధించాడు. ఇక ఓవరాల్గా ఈ అరుదైన ఫీట్ సాధించిన జాబితాలో టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ తొలి స్ధానంలో ఉన్నాడు. రోహిత్ ఈ అరుదైన ఘనతను 20 ఏళ్ల 143 రోజుల వయస్సులో నమోదు చేశాడు. ఇక మ్యాచ్ విషయానికి వస్తే.. ఐదు మ్యాచ్ల టీ20ల సిరీస్లో టీమిండియా వరుసగా రెండో ఓటమి చవి చూసింది. గయనా వేదికగా విండీస్తో జరిగిన రెండో టీ20లో 2 వికెట్ల తేడాతో భారత్ ఓటమి పాలైంది. టాస్ గెలిచిన భారత్ ముందుగా 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 152 పరుగులు చేసింది. భారత బ్యాటర్లలో తిలక్ వర్మ(51) టాప్ స్కోరర్గా నిలిచాడు. విండీస్ బౌలర్లలో అకిల్ హోసీన్, అల్జారి జోసెఫ్, షెఫర్డ్ తలా 2 వికెట్లు పడగొట్టారు. అనంతరం లక్ష్యఛేదనకు దిగిన వెస్టిండీస్ 18.5 ఓవర్లలో 8 వికెట్లు కోల్పోయి 155 పరుగులు చేసి గెలిచింది. విండీస్ బ్యాటర్లలో ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’ నికోలస్ పూరన్ (40 బంతుల్లో 67; 6 ఫోర్లు, 4 సిక్సర్లు) అద్భుతమైన ఇన్నింగ్స్ ఆడాడు. భారత బౌలర్లలో కెప్టెన్ హార్దిక్ పాండ్యా మూడు వికెట్లు, చహల్ రెండు వికెట్లు పడగొట్టినప్పటికి జట్టును మాత్రం గెలిపించలేకపోయారు. చదవండి: గ్రీన్ సిగ్నల్.. ప్రపంచకప్ కోసం భారత్కు పాక్ Maiden half-century for Tilak Varma in the second match of his T20I career! 🔥 A promising talent for India👏#TilakVarma #TeamIndia #CricketTwitter pic.twitter.com/osLF2BMUwO — OneCricket (@OneCricketApp) August 6, 2023 -
విండీస్తో రెండో టీ20.. టాస్ గెలిచిన టీమిండియా, ఒక్క మార్పు
5 మ్యాచ్ల సిరీస్లో భాగంగా గయానా వేదికగా విండీస్తో ఇవాళ (ఆగస్ట్ 6) జరుగుతున్న రెండో టీ20లో టీమిండియా టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకుంది. సిరీస్లో తొలి టీ20 ఓడి 0-1తో వెనుకపడిన భారత్.. ఈ మ్యాచ్లో ఓ మార్పుతో బరిలోకి దిగుతుంది. తొలి టీ20 ఆడిన కుల్దీప్ యాదవ్ స్థానంలో రవి బిష్ణోయ్ బరిలోకి దిగనున్నాడు. మరోవైపు విండీస్ తొలి మ్యాచ్ ఆడిన జట్టునే యధాతథంగా కొనసాగించింది. వెస్టిండీస్ (ప్లేయింగ్ XI): కైల్ మేయర్స్, బ్రాండన్ కింగ్, జాన్సన్ చార్లెస్ (w), నికోలస్ పూరన్, షిమ్రాన్ హెట్మెయర్, రోవ్మన్ పావెల్ (సి), జాసన్ హోల్డర్, రొమారియో షెపర్డ్, అకేల్ హోసేన్, అల్జారీ జోసెఫ్, ఒబెడ్ మెక్కాయ్ భారత్ (ప్లేయింగ్ XI): శుభమన్ గిల్, ఇషాన్ కిషన్(w), సూర్యకుమార్ యాదవ్, తిలక్ వర్మ, హార్దిక్ పాండ్యా(c), సంజు శాంసన్, అక్షర్ పటేల్, రవి బిష్ణోయ్, యుజ్వేంద్ర చాహల్, అర్ష్దీప్ సింగ్, ముఖేష్ కుమార్ -
భారీ రికార్డుపై కన్నేసిన సూర్యకుమార్.. మూడేస్తే రోహిత్, విరాట్ సరసన చోటు
విండీస్తో ఇవాళ (ఆగస్ట్ 6) జరుగనున్న రెండో టీ20కి ముందు టీమిండియా చిచ్చరపిడుగు, వరల్డ్ టీ20 నంబన్ వన్ బ్యాటర్ సూర్యకుమార్ యాదవ్ను ఓ భారీ రికార్డు ఊరిస్తుంది. నేటి మ్యాచ్లో స్కై మరో 3 సిక్సర్లు బాదితే, దిగ్గజ బ్యాటర్లు రోహిత్ శర్మ (182), విరాట్ కోహ్లిల (117) సరసన చేరతాడు. రోహిత్, కోహ్లిలు ఇద్దరూ అంతర్జాతీయ టీ20ల్లో 100 అంత కంటే ఎక్కువ సిక్సర్లు బాదిన భారత బ్యాటర్లుగా రికార్డుల్లో నిలువగా.. స్కై ఈ జాబితాలో చేరేందుకు మరో మూడు సిక్సర్ల దూరంలో ఉన్నాడు. 49 అంతర్జాతీయ టీ20ల్లో స్కై ఇప్పటివరకు 97 సిక్సర్లు బాది, ఈ జాబితాలో నాలుగో స్థానంలో ఉండగా.. 72 మ్యాచ్ల్లో 99 సిక్సర్లు బాదిన కేఎల్ రాహుల్ మూడో ప్లేస్లో నిలిచాడు. అంతర్జాతీయ టీ20ల్లో ఇప్పటివరకు 12 మంది 100 సిక్సర్లు బాదగా.. వారిలో రోహిత్ అగ్రస్థానంలో, కోహ్లి ఏడో ప్లేస్లో ఉన్నారు. రోహిత్ తర్వాత మార్టిన్ గప్తిల్ (173), ఆరోన్ ఫించ్ (125), క్రిస్ గేల్ (124), పాల్ స్టిర్లింగ్ (123), ఇయాన్ మోర్గాన్ (120), జోస్ బట్లర్ (113), ఎవిన్ లూయిస్ (111), కొలిన్ మున్రో (107), మ్యాక్స్వెల్ (106), డేవిడ్ మిల్లర్ (106), డేవిడ్ వార్నర్ (105) ఉన్నారు. కాగా, అంతర్జాతీయ టీ20 కెరీర్ను సిక్సర్తోనే ప్రారంభించిన సూర్యకుమార్.. అతి తక్కువ కాలంలో పలు టీ20 రికార్డులు తన ఖాతాలో వేసుకోవడంతో పాటు అతి తక్కువ వ్యవధిలో వరల్డ్ నంబర్ వన్ టీ20 బ్యాటర్గానూ ఎదిగాడు. టీ20 కెరీర్లో 47 ఇన్నింగ్స్లు ఆడిన స్కై.. 174.1 స్ట్రయిక్రేట్తో 3 సెంచరీలు, 13 అర్ధసెంచరీల సాయంతో 45.8 సగటున 1696 పరుగులు చేశాడు. స్కై ఖాతాలో 97 సిక్సర్లతో పాటు 152 బౌండరీలు ఉన్నాయి. ఇదిలా ఉంటే, విండీస్తో 5 మ్యాచ్ల టీ20 సిరీస్లో టీమిండియా తొలి మ్యాచ్లో ఓటమిపాలైన విషయం తెలిసిందే. ఆ మ్యాచ్లో భారత్ 4 పరుగుల స్వల్ప తేడాతో ఓటమిపాలైంది. ట్రినిడాడ్ వేదికగా జరిగిన ఆ మ్యాచ్లో తొలుత బ్యాటింగ్ చేసిన విండీస్ నిర్ణీత ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 149 పరుగులు చేయగా.. ఛేదనలో తడబడిన భారత్ 145 పరుగులకే పరిమితమైంది. విండీస్ ఇన్నింగ్స్లో పూరన్ (41), కెప్టెన్ రోవ్మన్ పావెల్ (48) రాణించగా.. భారత్ ఇన్నింగ్స్లో తిలక్ వర్మ (39) ఒక్కడే పర్వాలేదనిపించాడు. భారత బౌలర్లు అర్ష్దీప్ సింగ్, చహల్ తలో 2 వికెట్లు, హార్దిక్, కుల్దీప్ చెరో వికెట్ పడగొట్టగా.. విండీస్ బౌలర్లు జేసన్ హోల్డర్, ఓబెద్ మెక్కాయ్, రొమారియో షెపర్డ్ తలో 2 వికెట్లు, అకీల్ హొసేన్ ఓ వికెట్ దక్కించుకున్నారు. -
కిషన్ టీ20లకు పనికిరాడు.. ఆ యువ ఆటగాడికి ఛాన్స్ ఇవ్వండి!
గయానా వేదికగా ఆదివారం వెస్టిండీస్తో జరగనున్న రెండో టీ20లో అమీతుమీ తెల్చుకోవడానికి టీమిండియా సిద్దమైంది. ఈ మ్యాచ్లో గెలిచి తొలి మ్యాచ్ ఓటమికి బదులు తీర్చుకోవాలని హార్దిక్ సేన భావిస్తోంది. మరోవైపు తొలి టీ20లో విజయం సాధించి మంచి జోష్ మీద ఉన్న విండీస్ మాత్రం.. అదే జోరును కనబరిచి తమ అధిక్యాన్ని పెంచుకోవాలని యోచిస్తోంది. ఈ మ్యాచ్లో భారత జట్టు పలు మార్పులతో బరిలోకి దిగే ఛాన్స్ ఉంది. ఇక రెండో టీ20 నేపథ్యంలో టీమిండియా మాజీ ఓపెనర్ వసీం జాఫర్ ఆసక్తికర వాఖ్యలు చేశాడు. రెండో టీ20కు ఇషాన్ కిషన్ స్ధానంలో యువ ఆటగాడు యశస్వీ జైశ్వాల్కు అవకాశం ఇవ్వాలని జాఫర్ సూచించాడు. కాగా విండీస్తో టీ20 సిరీస్లో అదరగొట్టిన కిషన్.. ట్రినిడాడ్ వేదికగా జరిగిన మొదటి టీ20లో మాత్రం నిరాశపరిచాడు. అయితే ఈ సిరీస్ మాత్రమే కాకుండా టీ20ల్లో అంత మంచి రికార్డు కిషన్కు లేదు. ఇప్పటివరకు 28 టీ20 మ్యాచ్లు ఆడిన కిషన్.. 25 కంటే తక్కువ సగటుతో 659 పరుగులు చేశాడు. "విండీస్తో రెండో టీ20లో యశస్వి జైస్వాల్ని చూడాలనుకుంటున్నాను. అతడు ఓపెనర్గా బరిలోకి దిగాలి. ఇషాన్ కిషన్ స్ధానంలో జైశ్వాల్ ఛాన్స్ ఇస్తే బాగుంటుంది. ఎందుకంటే కిషన్ టీ20ల్లో పేలవ ఫామ్ను కనబరుస్తున్నాడు. గత 15 ఇన్నింగ్స్లలో అతడు 40 పరుగులు కూడా చేయలేదు. స్ట్రైక్ రేట్ కూడా చాలా తక్కువగా ఉంది. కాబట్టి అతడిని పక్కన పెడితే మంచింది. అయితే అతడు వన్డేల్లో మంచి ఫామ్లో ఉన్నాడు. కానీ టీ20 అనేది భిన్నమైన ఫార్మాట్. అతడు ఐపీఎల్లో కూడా అంతగా రాణించలేకపోయాడు. జైశ్వాల్ మాత్రం ఈ ఏడాది ఐపీఎల్లో దుమ్మురేపాడు. అందుకే అతడు కచ్చితంగా టీ20 జట్టులో ఉండాలి" అని జాఫర్ క్రిక్ ఇన్ఫోకు ఇచ్చిన ఇంటర్వ్యూలో జాఫర్ పేర్కొన్నాడు. చదవండి: #Alex Steele: 83 ఏళ్ల వయస్సులో వికెట్ కీపింగ్.. ఆక్సిజన్ సిలిండర్ పట్టుకుని మరి! వీడియో వైరల్ -
రోహిత్, విరాట్లకు రెండు వారాల సెలవు! ఆగష్టు 23 నుంచి అక్కడే!
Rohit Sharma & Virat Kohli: టీమిండియా స్టార్లు విరాట్ కోహ్లి, రోహిత్ శర్మ రెండు వారాల పాటు సెలవుల్లో గడుపనున్నారు. ఆటకు విరామమిచ్చి విశ్రాంతి తీసుకోనున్నారు. ఆ తర్వాత జాతీయ క్రికెట్ అకాడమీకి చేరుకుని వారం రోజుల పాటు శిక్షణా శిబిరంలో పాల్గొననున్నారు. కాగా వెస్టిండీస్ పర్యటనలో టెస్టు సిరీస్లో కెప్టెన్ రోహిత్ సహా కోహ్లి అదరగొట్టిన విషయం తెలిసిందే. టెస్టుల్లో అదరగొట్టారు డొమినికా మ్యాచ్లో ఓపెనర్ రోహిత్ శర్మ సెంచరీ(103) సాధించగా.. కోహ్లి 76 పరుగులు చేశాడు. ఇక ట్రినిడాడ్ టెస్టులో రోహిత్ మొత్తంగా 137 పరుగులు చేయగా.. కోహ్లి శతకం(121)తో మెరిశాడు. ఇక మూడు వన్డేల సిరీస్లో హిట్మ్యాన్ తొలి మ్యాచ్లో ఏడో స్థానంలో బరిలోకి దిగి 12 పరుగులతో అజేయంగా నిలిచాడు. రోహిత్ విజయ లాంఛనం పూర్తి చేయడంతో కోహ్లికి బ్యాటింగ్ చేయాల్సిన అవసరమే రాలేదు. ఇక రెండో వన్డే నుంచి కూడా యువ ఆటగాళ్లకు అవకాశాలు ఇచ్చే క్రమంలో మేనేజ్మెంట్ రోహిత్- కోహ్లిలకు పూర్తిగా విశ్రాంతినిచ్చింది. ఇక ఈ ఇద్దరు స్టార్లు లేకుండానే యువ జట్టు సిరీస్ను 2-1తో గెలిచింది. ఐర్లాండ్కు యువ జట్టు ఈ నేపథ్యంలో వన్డే సిరీస్ ముగిసిన తర్వాత ‘విరాహిత్’ ద్వయం స్వదేశానికి తిరిగి వచ్చారు. ఇదిలా ఉంటే.. వెస్టిండీస్ పర్యటన ముగిసిన తర్వాత టీమిండియా ఐర్లాండ్కు వెళ్లనుంది. ఆగష్టు 18-23 మధ్య మూడు మ్యాచ్ల టీ20 సిరీస్ ఆడనుంది. దాదాపు ఏడాది తర్వాత రీఎంట్రీ ఇస్తున్న జస్ప్రీత్ బుమ్రా సారథ్యంలో యువ జట్టు అక్కడికి వెళ్లనుంది. ఆగష్టు 23న అక్కడికి ఆ తర్వాత మళ్లీ భారత ప్రధాన ఆటగాళ్లు మైదానంలో దిగేది ఆసియా వన్డే కప్-2023 టోర్నీలోనే! ఈ నేపథ్యంలో మరో పదిహేను రోజుల పాటు విరాట్, రోహిత్లకు సెలవులు లభించాయి. అయితే, ఆగష్టు 30 నుంచే ఆసియా కప్ ఈవెంట్ ఆరంభం కానున్న తరుణంలో ఈనెల 23నే వాళ్లిద్దరు ఎన్సీఏకు చేరుకోనున్నారు. ఈ విషయం గురించి బీసీసీఐ అధికారి మాట్లాడుతూ.. ‘‘రోహిత్, విరాట్ ఆగష్టు 23న ఎన్సీఏలో రిపోర్టు చేయనున్నారు. అక్కడ ఆగష్టు 24- 29 వరకు క్యాంపులో గడుపనున్నారు’’ అని తెలిపినట్లు ఇన్సైడ్స్పోర్ట్ వెల్లడించింది. ఇదిలా ఉంటే.. వెస్టిండీస్తో తొలి టీ20లో ఓడింది హార్దిక్ సేన. ఇరు జట్ల మధ్య ఐదు మ్యాచ్ల సిరీస్లో భాగంగా.. ఆదివారం గయానాలో రెండో టీ20 జరుగనుంది. చదవండి: గిల్, జైశ్వాల్, కిషన్ కాదు.. అతడే టీమిండియా ఫ్యూచర్ స్టార్! -
గిల్, జైశ్వాల్, కిషన్ కాదు.. అతడే టీమిండియా ఫ్యూచర్ స్టార్!
టీమిండియా యువ ఆటగాడు తిలక్ వర్మ అరంగేట్ర మ్యాచ్లోనే అదరగొట్టిన సంగతి తెలిసిందే. విండీస్తో జరిగిన తొలి మ్యాచ్తో అంతర్జాతీయ క్రికెట్లోకి అడుగుపెట్టిన ఈ హైదరాబాదీ.. ప్రత్యర్ధి బౌలర్లకు చుక్కలు చూపించాడు. కేవలం 22 బంతుల్లో 3సిక్స్లు, 2 ఫోర్లు సాయంతో 39 పరుగులు చేసి పెవిలియన్కు చేరాడు. ఇంటర్ననేషనల్ క్రికెట్లో అతడు ఎదుర్కొన్న తొలి మూడు బంతుల్లో రెండింటిని సిక్సర్లగా మలిచాడు. ఈ మ్యాచ్లో భారత ఓటమి పాలైనప్పటికీ తిలక్ వర్మ మాత్రం తన ఆటతీరుతో అందరిని అకట్టుకున్నాడు. ఇక డెబ్యూ మ్యాచ్లోనే సంచలన ఇన్నింగ్స్ ఆడిన తిలక్ వర్మపై భారత మాజీ పేసర్ ఆర్పీ సింగ్ ప్రశంసల వర్షం కురిపించాడు. తిలక్ వర్మ అద్భుతమైన ఇన్నింగ్స్ ఆడాడు. అతడు కచ్చితంగా భవిష్యత్తులో భారత జట్టుకు కీలక ఆటగాడిగా మారుతాడు. ప్రస్తుతం భారత జట్టులో లెఫ్ట్హ్యాండర్లు తక్కువగా ఉన్నారు. జట్టు మెనెజ్మెంట్ కూడా ఎడమచేతి వాటం బ్యాటర్ల కోసం వెతుకుతోంది. ఇటువంటి సమయంలో తిలక్ వర్మ వంటి అణిముత్యం దొరికాడు. సిక్స్తో తన అరంగేట్రాన్ని చాటుకున్న తిలక్ బ్యాటింగ్ స్టైల్ నన్ను ఎంతోగానే అకట్టుకుంది. అతడు ఎక్స్ట్రా కవర్ దిశగా కొట్టిన సిక్స్ మాత్రం అద్భుతమని ఆర్పీ సింగ్ పేర్కొన్నాడు. కాగా ఆర్పీ సింగ్ యువ ఆటగాళ్లు శుబ్మన్ గిల్, కిషన్, జైశ్వాల్ను కాకుండా తిలక్ను టీమిండియా ఫ్యూచర్ స్టార్గా పేర్కొనడం గమానార్హం. చదవండి: IND vs WI: 'ఒకే మ్యాచ్లో 1000 కొట్టినా.. జట్టులో చోటుకు గ్యారంటీ లేదు' -
'ఒకే మ్యాచ్లో 1000 కొట్టినా.. జట్టులో చోటుకు గ్యారంటీ లేదు'
వెస్టిండీస్తో జరిగిన వన్డే సిరీస్లో టీమిండియా యువ ఓపెనర్ ఇషాన్ కిషన్ అద్భుతమైన ప్రదర్శన కనబరిచిన సంగతి తెలిసిందే. ఈ సిరీస్లో మూడు వన్డేల్లోనూ వరుసగా హాఫ్ సెంచరీలు బాది 184 పరుగులతో టాప్ స్కోరర్గా నిలిచాడు. ఆసియాకప్-2023, వన్డే ప్రపంచకప్ వంటి మెగా టోర్నీలకు ముందు కిషన్ మంచి ఫామ్లో ఉండడం భారత జట్టుకు కలిసొచ్చే ఆంశం. అయితే రెగ్యూలర్ వికెట్ కీపర్ రిషబ్ పంత్ అందుబాటులో లేడు కాబట్టి కిషన్కు వరుస అవకాశాలు లభిస్తున్నాయి. అదే విధంగా వరల్డ్కప్కు ముందు ఆటగాళ్లను పరీక్షించాలనే ఉద్దేశ్యంతో కిషన్కు ప్రస్తుతం విండీస్ సిరీస్లో ఓపెనర్గా అవకాశం ఇచ్చారు. కిషన్ అద్భుతంగా ఆడుతున్నప్పటికీ జట్టులో మాత్రం చోటు అనుమానంగానే ఉంది. రోహిత్, కెఎల్ రాహల్ అందుబాటులోకి వస్తే అతడికి జట్టులో చోటు కష్టమే. ఈ నేపథ్యంలో పాకిస్తాన్ మాజీ కెప్టెన్ సల్మాన్ బట్ కిషన్ను ఉద్దేశించి ఆసక్తికర వాఖ్యలు చేశాడు. ఇషాన్ కిషన్ పట్ల భారత జట్టు వ్యవహరిస్తున్న తీరు గందరగోళంగా ఉంది. అతడిని ప్రయోగాలకు ఎందుకు బలిచేస్తుందో నాకు అర్ధం కావడం లేదు. భారత జట్టు మెనెజ్మెంట్ తీసుకుంటున్న నిర్ణయాలు నన్ను ఆశ్చర్యానికి గురిచేస్తోంది. ఎందుకంటే తను డబుల్ సెంచరీ కొట్టిన తర్వాత కూడా తుది జట్టులో చోటు దక్కించుకోలేకపోయాడు. అతడు కేవలం సెకెండ్ ఆప్షనే అని భారత జట్టు మెనెజ్మెంట్ అంగీకరించాలి. అతడు ఒకే ఇన్నింగ్స్లో 1000 పరుగులు చేసినా రెండో ఆప్షన్గానే ఉంటాడు. అందులో ఎటువంటి సందేహం లేదు. ఇలా చేయడం వల్ల ఆటగాడి ఆత్మవిశ్వాసం పూర్తిగా దెబ్బ తింటుంది. ఆటగాడి శ్రమకు తగ్గ ఫలితం దక్కాలి. అంతే తప్ప సెకెండ్ ఆప్షన్గా భావించకూడదు" అని బట్ తన యూట్యూబ్ ఛానల్లో పేర్కొన్నాడు. చదవండి: #Riyan Parag: నేను అవన్నీ పట్టించుకోను.. చూయింగ్ గమ్ నమిలితే తప్పు! అది నా ఇష్టం -
Ind vs WI: ఒక్క మ్యాచ్ ఓడితే ఏమైంది? వాళ్లు తలచుకుంటే...
India tour of West Indies, 2023 - T20 Series: ‘‘ఒక్క మ్యాచ్లో ఓడిపోయినంత మాత్రాన ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. ఎందుకంటే.. ఇది ఐదు మ్యాచ్ల సిరీస్. టీ20 ఫార్మాట్ అంటేనే అలా ఉంటుంది. నిమిషాల వ్యవధిలో అంతా తారుమారవుతుంది. తప్పక గెలుస్తామనుకున్న మ్యాచ్ కూడా ఓడిపోయే సందర్భాలు ఉంటాయి. విండీస్తో తొలి టీ20 కూడా అలాంటిదే! విజయానికి చేరువగా వచ్చి కొద్దిలో మిస్ అయ్యాం. అలాంటి పరిస్థితుల్లో ఎవరైనా ఇంతకంటే గొప్పగా ఏమీ చేయలేరు’’ అని టీమిండియా మాజీ ఓపెనర్ ఆకాశ్ చోప్రా అన్నాడు. వెస్టిండీస్తో రెండో టీ20లో హార్దిక్ సేన పుంజుకునే అవకాశాలు మెండుగా ఉన్నాయని అభిప్రాయపడ్డాడు. బ్యాటర్లు మరింత బాధ్యతాయుతంగా ఆడితే అంతా సర్దుకుంటుందని చెప్పుకొచ్చాడు. ఐదు మ్యాచ్ల సిరీస్లో తృటిలో చేజారిన మ్యాచ్ గురించి పెద్దగా ఆందోళన చెందాల్సిన అవసరం లేదని పేర్కొన్నాడు. కాగా వెస్టిండీస్ పర్యటనలో భాగంగా టీమిండియా తొలి టీ20లో 4 పరుగుల స్వల్ప తేడాతో ఓడిపోయిన విషయం తెలిసిందే. అరంగేట్ర బ్యాటర్ తిలక్ వర్మ(39) మిగతా బ్యాటర్లు విఫలం కావడంతో లక్ష్య ఛేదనలో హార్దిక్ సేన తడబడింది. సూర్యకుమార్ యాదవ్ వంటి నంబర్ 1 టీ20 బ్యాటర్ జట్టులో ఉన్నప్పటికీ 150 పరుగుల టార్గెట్ ఛేజ్ చేయలేక చతికిలపడింది. ఫలితంగా గురువారం నాటి మ్యాచ్లో ఆతిథ్య కరేబియన్ జట్టు చేతిలో ఓటమి తప్పలేదు. ఈ క్రమంలో ఆదివారం గయానా వేదికగా జరుగనున్న రెండో టీ20లో భారత జట్టు సత్తా చాటాలని పట్టుదలగా ఉంది. ఈ నేపథ్యంలో జియో సినిమా షోలో మాట్లాడిన ఆకాశ్ చోప్రా.. పిచ్ స్వభావంపైనే అంతా ఆధారపడి ఉంటుందని పేర్కొన్నాడు. టీమిండియా బ్యాటర్లు స్థాయికి తగ్గట్లు రాణిస్తే.. విండీస్ను ఓడించడం కష్టమేమీ కాదన్నాడు. ఇదిలా ఉంటే.. విండీస్ పర్యటనలో టెస్టు సిరీస్ను 1-0తో గెలిచిన భారత జట్టు.. వన్డే సిరీస్ను 2-1తో కైవసం చేసుకున్న విషయం తెలిసిందే. చదవండి: వారణాసి అమ్మాయి.. వెస్టిండీస్ క్రికెటర్ భార్య! భోజ్పురీలో మాట్లాడగలదు.. ఇంకా! విండీస్తో రెండో టీ20.. శుబ్మన్ గిల్పై వేటు! విధ్వంసకర ఓపెనర్ ఎంట్రీ