Top Stories
ప్రధాన వార్తలు
![YSRCP President YS Jagan letter to PM Narendra Modi](/sites/default/files/styles/webp/public/article_images/2024/07/19/Jagan-Sir_2-final.jpg.webp?itok=e-aEkGhu)
ఏపీలో ఆటవిక పాలన.. ప్రధాని మోదీకి వైఎస్ జగన్ లేఖ
సాక్షి, అమరావతి: వివక్ష లేకుండా ప్రజా ప్రయోజనాల పరిరక్షణ కోసం వినియోగించాల్సిన అధికార యంత్రాంగాన్ని టీడీపీ నేతృత్వంలోని కూటమి ప్రభుత్వం రాజకీయమయం చేసిందని వైఎస్సార్సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రధాని నరేంద్ర మోదీకి నివేదించారు. హత్యలు, దాడులు, అకృత్యాలను ప్రోత్సహించే లక్ష్యంతో ప్రభుత్వ యంత్రాంగాన్ని పూర్తి స్థాయిలో రాజకీయమయం చేసిందన్నారు. ఆంధ్రప్రదేశ్లో ఏకంగా దాదాపు 27 మంది ఐఏఎస్లు, 24 మంది ఐపీఎస్ అధికారులకు పోస్టింగ్లు ఇవ్వకుండా చేశారంటే సీఎం చంద్రబాబు లక్ష్యాలు, ఉద్దేశాలు కళ్ల ముందే కనిపిస్తున్నాయని తెలిపారు. ఈ మేరకు గురువారం రాత్రి ప్రధాని మోదీకి వైఎస్ జగన్ లేఖ రాశారు. ‘‘కొత్త ప్రభుత్వం ఏర్పాటైనప్పటి నుంచి ఏపీలో 31 మంది హత్యకు గురయ్యారు. 300 మందిపై హత్యాయత్నాలు జరిగాయి. టీడీపీ నేతల వేధింపులు భరించలేక 35 మంది ఆత్మహత్యలకు పాల్పడ్డారు. 560 చోట్ల ప్రైవేట్ ఆస్తులు, 490 చోట్ల ప్రభుత్వ ఆస్తులను ధ్వంసం చేశారు. టీడీపీ నేతల అరాచకాలను భరించలేక దాదాపు 2,700 కుటుంబాలు గ్రామాలను విడిచి వెళ్లిపోయాయి. ఇవికాకుండా 1,050కి పైగా దౌర్జన్యాలు, దాడుల ఘటనలు జరిగాయి’’ అని పేర్కొన్నారు. ఇవన్నీ యాథృచ్ఛికంగా జరిగినవి కాదని, వైఎస్సార్ సీపీని అణగదొక్కడమే లక్ష్యంగా ఒక పథకం ప్రకారం దుర్మార్గాలని స్పష్టం చేశారు. రాజకీయాల్లో వైఎస్సార్సీపీ తరఫున ఎవరూ ఉండకూడదన్న ఏకైక లక్ష్యంతో ఇవన్నీ చేస్తున్నారని.. ఆమేరకు ప్రభుత్వంలో ఉన్నవారు కింది స్థాయివరకూ అధికారులకు సంకేతాలు పంపారని తెలిపారు. ఒక మంత్రి రెడ్బుక్ పేరిట ఏకంగా హోర్డింగులు పెట్టి నేరుగా దాడులు చేయాలని శ్రేణులకు చెప్పకనే చెప్పారన్నారు. వాటిని అడ్డుకోవద్దని అధికారులకు సంకేతాలు ఇవ్వడంతో టీడీపీ గూండాలు ఎక్కడికక్కడ రెచ్చిపోయి దారుణాలకు పాల్పడుతున్నారని వివరించారు. మొత్తంగా చూస్తే రాష్ట్రంలో శాంతి భద్రతలు కుప్పకూలిపోయాయని, తక్షణం శాంతిస్థాపన జరగాల్సిన అవసరం ఉందని స్పష్టం చేశారు. ఎన్నికల తర్వాత జరిగిన ఘటనలపై కేంద్ర ప్రభుత్వ ఏజెన్సీలతో విచారణ జరపాలని విన్నవించారు. టీడీపీ నేతృత్వంలోని కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి సాగించిన దురాగతాలను నివేదించేందుకు వీలైన రోజు అపాయిమెంట్ ఇవ్వాలని ప్రధాని మోదీకి విజ్ఞప్తి చేశారు. లేఖలో ప్రధానాంశాలు ఇవీ.. శాంతి భద్రతలు క్షీణించాయి.. వ్యవస్థలు కుప్పకూలాయి.. ⇒ ఏపీలో శాంతి భద్రతలు పూర్తిగా క్షీణించాయి. రాజ్యాంగ వ్యవస్థలు కూప్పకూలిపోయాయి. యంత్రాంగం నిస్తేజంగా మారిపోయింది. ప్రజల మాన, ప్రాణాలకు రక్షణ లేకుండా పోయింది. అధికార పార్టీకి చెందిన నాయకులు, కార్యకర్తలు స్వైరవిహారం చేస్తున్నారు. రాష్ట్రంలో అత్యంత భయానక వాతావరణం నెలకొంది. అత్యంత అనాగరిక ఘటనలు జరుగుతున్నాయి. అమానవీయ, అమానుషంగా ఘటనలు జరుగుతున్నాయి. ⇒ ఎన్నికల ఫలితాలు వెలువడింది మొదలు తమకు ఓటు వేయని వారిని లక్ష్యంగా చేసుకుని దాడులు చేస్తున్నారు. వైఎస్సార్సీపీ కార్యకర్తలపై దాడులు చేయడమే కాకుండా వారి ఆస్తులకు తీవ్ర నష్టం కలిగిస్తున్నారు. అధికారాన్ని అండగా పెట్టుకుని యథేచ్ఛగా చెలరేగిపోతున్నారు. వైఎస్సార్సీపీ అభ్యర్థుల ఇళ్లపై, నాయకుల ఇళ్లపై, వారి వ్యాపార సంస్థలను లక్ష్యంగా చేసుకుని దాడులు చేస్తున్నారు. కొన్ని చోట్ల ఎలాంటి నోటీసులు ఇవ్వకుండానే ఇళ్లను కూల్చివేశారు. రోడ్డుపక్కనే చిన్న చిన్న దుకాణాలు ఏర్పాటు చేసుకుని పొట్ట పోసుకుంటున్న వారిపై ఉపాధిని దెబ్బకొట్టారు. రాజకీయ కారణాలతో వారి దుకాణాలను జేసీబీలతో కూల్చేశారు. రాష్ట్రవ్యాప్తంగా ఇలాంటి ఘటనలు కోకొల్లలు. ⇒ వైఎస్సార్సీపీ నేతలు, కార్యకర్తలు, ఆస్తులపై దాడులు, దౌర్జన్యాలకు పాల్పడటమే కాకుండా ప్రభుత్వ ఆస్తులకు తీవ్ర నష్టం చేకూర్చారు. అధికార వికేంద్రీకరణలో భాగంగా గ్రామస్థాయిలోనే ప్రజలకు అత్యంత చేరువగా సేవలందిస్తున్న గ్రామ సచివాలయాలు, ఆర్బీకేలు, విలేజ్ క్లినిక్స్నూ విడిచిపెట్టలేదు. కేవలం వైఎస్సార్సీపీ ప్రభుత్వం ఈ వ్యవస్థలను తెచ్చిందనే ఏకైక కారణంతో వాటిని ధ్వంసం చేశారు. ⇒ అన్నిటినీ మించి వైఎస్సార్సీపీ నాయకులు, కార్యకర్తల ప్రాణాలకు రక్షణ లేకుండా పోయింది. గత బుధవారం రోజు పల్నాడు జిల్లా వినుకొండలో వైఎస్సార్సీపీ కార్యకర్త రషీద్ను నడిరోడ్డుపై దారుణంగా హత్య చేశారు. అందరూ చూస్తుండగానే ఈ ఘటన జరిగింది. ఈ దారుణ హత్య రాష్ట్ర ప్రజానీకాన్ని తీవ్ర కలవరపాటుకు గురి చేసింది. కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత రాష్ట్రంలో ఇలాంటివి పలు ఘటనలు జరిగాయి. అల్లరిమూకలు పట్టపగలే నడిరోడ్డుమీద కత్తులతో స్వైరవిహారం చేస్తూ మనుషుల ప్రాణాలు తీస్తున్న ఘటనలు సర్వ సాధారణం అయిపోయాయి. ఎంపీకే రక్షణ లేని పరిస్థితి.. వైఎస్సార్సీపీ తరఫున పార్లమెంట్కు, శాసనసభకు ఎన్నికైన వారు, ఆయా స్థానాల్లో పోటీచేసిన అభ్యర్థులకు రక్షణ లేకుండా పోయింది. తాజాగా గురువారం చిత్తూరు జిల్లా పుంగనూరులో మాజీ ఎంపీ రెడ్డప్ప నివాసానికి వెళ్లిన మా పార్టీ లోక్సభపక్ష నాయకుడు, ఎంపీ మిథున్రెడ్డిపై టీడీపీ మూకలు హత్యాయత్నానికి పాల్పడ్డాయి. పోలీసుల సమక్షంలోనే ఈ దాడి జరిగింది. ఒక ఎంపీకి కూడా రక్షణ కల్పించలేని పరిస్థితి రాష్ట్రంలో నెలకొంది. రెడ్బుక్ రాజ్యాంగానికి వదిలేశారు.. ⇒ రాష్ట్రంలో ప్రజాస్వామ్య ప్రభుత్వ ఆనవాళ్లు కనిపించడంలేదు. రాజ్యాంగం, చట్టం లేదు. పోలీసు వ్యవస్థ పని చేయడం లేదు. కూటమి అధికారంలోకి వచ్చిన దగ్గరినుంచి రాష్ట్రాన్ని రెడ్బుక్ రాజ్యాంగానికి వదిలేశారు. గూండాలకు, ఉన్మాదులకు, మహిళలపై అఘాయిత్యాలు చేసేవారికి, చిన్నారులపై దారుణాలకు ఒడిగట్టేవారికి రాష్ట్రాన్ని అప్పగించేశారు. ⇒ గత ఐదేళ్లలో ఆంధ్రప్రదేశ్ అంటే ఉత్తమ విద్య, నాణ్యమైన వైద్యం, రైతుకు భరోసా, అక్కచెల్లెమ్మలకు సాధికారిత, పటిష్ట లా అండ్ ఆర్డర్, సుస్థిర, సమగ్ర అభివృద్ధికి నిలయమని పేరు పొందితే ఇవాళ ఏపీ అంటే హత్యలు, అత్యాచారాలు, రాజకీయ కక్షపూరిత దాడులు, విధ్వంసాలకు చిరునామాగా మారిపోయింది. రాష్ట్రంలో అరాచకాలు మినహా పరిపాలన కనిపించడం లేదు.
![Heavy Rains: Red Alert For Coastal Districts](/sites/default/files/styles/webp/public/article_images/2024/07/19/Heavy-Rains.jpg.webp?itok=LPyEdUgZ)
AP: భారీ వర్షాలు.. కోస్తా జిల్లాలకు రెడ్ అలర్ట్
సాక్షి, విశాఖపట్నం: కోస్తా జిల్లాలకు రెడ్ అలర్ట్ను వాతావరణ శాఖ జారీ చేసింది. బంగాళాఖాతంలో సుస్పష్టమైన అల్పపీడనంగా మారింది. ఉత్తర కోస్తాలో ఎడతెరిపి లేకుండా వర్షాలు కురుస్తున్నాయి. రాష్ట్రంలో వాగులు పొంగి పొర్లుతున్నాయి. ప్రమాదస్థాయిలో న ఏలూరు జిల్లా వేలేరుపాడు జలాశయం ప్రవహిస్తుంది.రాష్ట్రంలో పలుచోట్ల ఆనకట్టలు దెబ్బ తింటున్నాయి. పలు ప్రాంతాల్లో ప్రజలు వరద నీటిలో చిక్కుకుపోయారు. వారిని స్థానికులు, అధికారులు రక్షించి, సురక్షిత ప్రాంతాలకు తీసుకువస్తున్నారు. ఎన్టీఆర్ జిల్లాలోని కట్టలేరు, వైరా ఏరు, మున్నేరు ఉధృతంగా ప్రవహిస్తున్నాయి. గుంటూరు జిల్లాలోలోనూ మూడు రోజులుగా వర్షాలు కురుస్తున్నాయి. తెనాలి మండలంలో 28.4 మి.మీ వర్షపాతం నమోదైంది.తూర్పుగోదావరి జిల్లాలో ఎడతెరిపి లేకుండా వర్షం కురుస్తోంది. రాజమండ్రితో పాటు పలుచోట్ల లోతట్టు ప్రాంతాలు జలమయం అయ్యాయి. గోదావరిలోకి వరదనీరు భారీగా వచ్చి చేరుతోంది. ఏజెన్సీలో కొండవాగులు పొంగిపొర్లుతున్నాయి. ధవళేశ్వరం కాటన్ బ్యారేజ్ వద్దకు భారీగా వరద నీరు చేరుతోంది. ఎగువ నుంచి మూడున్నర లక్షల క్యూసెక్కుల నీరు రావడంతో డెల్టా కాలువలకు నాలుగు వేల క్యూసెక్కులు సరఫరా చేసి మిగిలిన నీరు సముద్రంలోకి విడుదల చేస్తున్నారు. బ్యారేజ్ 175 గేట్లను ఒక మీటర్ మేర ఎత్తి నీటిని విడుదల చేస్తున్నారు బ్యారేజ్ ఇరిగేషన్ అధికారులు.లోతట్టు ప్రాంతాల ప్రజలు సురక్షిత ప్రాంతాలకు తరలి వెళ్తున్నారు. శ్రీకాకుళం, విజయనగరం, విశాఖ, పార్వతీపురం మన్యం, అల్లూరిసీతారామరాజు, కాకినాడ, ఏలూరు, కృష్ణ, గుంటూరు, బాపట్ల, నంద్యాల జిల్లాల్లో భారీ నుంచి అతిభారీ వర్షాలు.. కొన్ని చోట్ల అత్యంత భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు వెల్లడించారు. తీరం వెంబడి అత్యధికంగా గంటకు 65 కిమీ వేగంతో గాలులు వీస్తాయని.. వేటకు వెళ్లరాదని మత్స్యకారులకు అధికారులు హెచ్చరికలు జారీ చేశారు.
![Fans support Hardik Pandya on worst day of his life](/sites/default/files/styles/webp/public/article_images/2024/07/19/hardhik_0.jpg.webp?itok=-8WBx2ru)
#Hardhikpandya: అయ్యో హార్దిక్.. నీకే ఎందుకిలా! నీకు మేము ఉన్నాము
టీమిండియా స్టార్ ఆల్రౌండర్ హార్దిక్ పాండ్యా గడ్డు కాలాన్ని ఎదుర్కొంటున్నాడు. అటు వ్యక్తిగత జీవితంలోనూ, ఇటు ప్రొఫెషనల్గాను హార్దిక్ గట్టి ఎదురు దెబ్బలు తగులుతున్నాయి. రోహిత్ శర్మ అంతర్జాతీయ టీ20లకు విడ్కోలు పలకడంతో భారత తదుపురి టీ20 కెప్టెన్ హార్దిక్ పాండ్యానే అంతా భావించారు.కానీ బీసీసీఐ మాత్రం పాండ్యాకు ఊహించని షాకిచ్చింది. బీసీసీఐ సెలక్షన్ కమిటీ టీమిండియా టీ20 కెప్టెన్గా పాండ్యాను కాదని స్టార్ క్రికెటర్ సూర్యకుమార్ యాదవ్ను నియమించింది. శ్రీలంకతో టీ20 సిరీస్కు భారత జట్టు ఎంపిక సందర్భంగా బీసీసీఐ సెలక్షన్ కమిటీ ఈ నిర్ణయం తీసుకుంది.అయితే శ్రీలంక పర్యటనకు జట్టు ప్రకటించిన కొద్ది సేపటికే హార్దిక్ మరో బాంబు పేల్చాడు. గత కొన్ని నెలలగా తమ వైవాహిక జీవితానికి సంబంధించి వస్తున్న రూమర్స్ను హార్దిక్ పాండ్యా, అతడి భార్య నటాషా స్టాంకోవిచ్ నిజం చేశారు. హార్దిక్ పాండ్య- నటాషా తామిద్దరూ విడిపోతున్నట్లు ఉమ్మడి ప్రకటన ద్వారా తెలియజేశారు. "మా 4 ఏళ్ల వైవాహిక బంధానికి ముగింపు పలకాలని నిర్ణయించుకున్నాము. మేము కలిసిండేందుకు అన్ని విధాల ప్రయత్నం చేశాము. కానీ విడిపోవడమే ఉత్తమమని మేమిద్దరం భావించాము. పరస్పర గౌరవం, ఆనందంతో కలిసి ఒక కుటంబంగా ఎదిగిన తర్వాత విడిపోవడం నిజంగా కష్టమే. కానీ ఈ కఠినమైన నిర్ణయం తీసుకొక తప్పట్లలేదు. మా ఇద్దరి జీవితాల్లోనూ అగస్త్య భాగంగా ఉంటాడు. అగస్త్యకు కో పెరెంట్గా మేము కొనసాగుతాం. అతని ఆనందం కోసం మేం ఏమైనా చేస్తాం. ఈ క్లిష్టమైన సమయంలో మాకు మీ మద్దతు కావాలి. మా గోప్యతను అర్థం చేసుకుంటారని భావిస్తున్నాం’’ అని ప్రకటనలో హార్దిక్, నటాషా పేర్కొన్నారు. అయితే ఈ క్టిష్టసమయంలో హార్దిక్కు అభిమానులు మద్దతుగా నిలుస్తున్నారు. కమాన్ హార్దిక్.. నీకు మేము ఉన్నాము అంటూ సోషల్ మీడియాలో పోస్ట్లు చేస్తున్నారు. మరి కొందరు అయ్యో హార్దిక్.. నీకేందుకు ఇన్ని కష్టాలు అంటూ కామెంట్లు చేస్తున్నారు.కాగా ఐపీఎల్-2024 సమయంలోనూ పాండ్యా దారుణమైన విమర్శలు ఎదుర్కొన్నాడు. ముంబై ఇండియన్స్ కెప్టెన్సీ బాధ్యతలు చేపట్టిన పాండ్యా అటు సారథిగా, ఇటు ఆటగాడిగా విఫలయ్యాడు. దీంతో పాండ్యాను దారుణంగా ట్రోలు చేశారు. అయితే టీ20 వరల్డ్కప్-2024లో పాండ్యా దుమ్ములేపడంతో ఒక్కసారిగా హీరో అయిపోయాడు. తిట్టిన నోళ్లే అతడిని ప్రశించాయి. Stay strong 🥺💔 #HardikPandya pic.twitter.com/aByDFMkRqH— rj facts (@rj_rr1) July 18, 2024
![Infosys will adhere to local hiring regulations CEO Salil Parekh](/sites/default/files/styles/webp/public/article_images/2024/07/19/infosys_0.jpg.webp?itok=GS6b4Hjw)
అందరూ భయపడుతుంటే.. ఇన్ఫోసిస్ మాత్రం ఓకే..
ప్రైవేటు సంస్థల్లో స్థానికులకు రిజర్వేషన్లు కల్పిస్తూ కర్ణాటక ప్రభుత్వం తీసుకొచ్చిన బిల్లు కంపెనీల్లో ప్రకంపనలు సృష్టిస్తోంది. దీని గురించి అన్ని కంపెనీలు భయోందోళన చెందుతుంటే ఐటీ దిగ్గజం ఇన్ఫోసిస్ మాత్రం తమకు ఓకే అంటోంది.ప్రైవేట్ సంస్థల్లో స్థానిక నియామకాలకు రాష్ట్ర ప్రతిపాదిత రిజర్వేషన్లకు ప్రతిస్పందనగా కర్ణాటక ఏ కొత్త నిబంధనలు, మార్గదర్శకాలను ప్రవేశపెట్టినా తమ కంపెనీ పాటిస్తుందని ఇన్ఫోసిస్ సీఈవో సలీల్ పరేఖ్ తెలిపారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల నిబంధనలకు అనుగుణంగా పనిచేస్తామని పరేఖ్ స్పష్టం చేశారు. ఎలాంటి నిబంధనలు, మార్గదర్శకాలు వచ్చినా మద్దతిస్తాం.పరిశ్రమలు, కర్మాగారాలు, ఇతర సంస్థలలో స్థానిక అభ్యర్థులకు రిజర్వేషన్ కల్పించే కర్ణాటక రాష్ట్ర ఉపాధి బిల్లు, 2024 ను ఆ రాష్ట్ర మంత్రివర్గం ఈ వారం ప్రారంభంలో ఆమోదించింది. ఏ పరిశ్రమ, కర్మాగారం లేదా ఇతర సంస్థలు అయినా మేనేజ్ మెంట్ కేటగిరీల్లో 50 శాతం, నాన్ మేనేజ్ మెంట్ కేటగిరీల్లో 70 శాతం స్థానిక అభ్యర్థులను నియమించాలని ఈ బిల్లు నిర్దేశిస్తోంది.ఈ బిల్లు గురువారం శాసనసభలో ప్రవేశపెట్టాల్సి ఉంది. అయితే వ్యాపార ప్రముఖులు, టెక్నాలజీ రంగ ప్రముఖుల నుంచి తీవ్ర విమర్శలు రావడంతో దీన్ని నిలిపివేశారు. ఈ ఆంక్షల వల్ల స్థానిక నైపుణ్యం కలిగిన ప్రతిభావంతుల కొరత ఏర్పడితే కంపెనీలు తరలిపోతాయని నేషనల్ అసోసియేషన్ ఆఫ్ సాఫ్ట్ వేర్ అండ్ సర్వీస్ కంపెనీస్ (నాస్కామ్) హెచ్చరించింది.ఫోన్ పే సీఈఓ సమీర్ నిగమ్ ఈ ప్రతిపాదనను సోషల్ మీడియాలో ‘షేమ్’ అంటూ తీవ్రంగా తప్పుపట్టారు. ప్రతిపాదిత కోటాను 'ఫాసిస్టు', 'స్వల్పదృష్టి'గా అభివర్ణిస్తూ పరిశ్రమ పెద్దలు కూడా ఈ కోటాపై తీవ్రంగా స్పందించారు. ఇన్ఫోసిస్ మాజీ చీఫ్ ఫైనాన్షియల్ ఆఫీసర్ టీవీ మోహన్ దాస్ పాయ్ ఈ బిల్లును తిరోగమనంగా అభివర్ణించారు. బయోకాన్ మేనేజింగ్ డైరెక్టర్ కిరణ్ మజుందార్ షా, అసోచామ్ కర్ణాటక కో-చైర్మన్ ఆర్కే మిశ్రా వ్యతిరేక స్వరం వినిపించారు.
![35 people committed suicide due to harassment by TDP mobs](/sites/default/files/styles/webp/public/article_images/2024/07/19/nara.jpg.webp?itok=q0hgm6x9)
‘నారా’రూప రాక్షసం.. యథేచ్ఛగా నరమేధం!
మధ్య యుగాల్లో గజినీలు, ఘోరీలు దండెత్తి సృష్టించిన మారణహోమాన్ని రాష్ట్రంలో చంద్రబాబు రాక్షసపాలన గుర్తుకు తెస్తోంది. ఆధునిక కాలంలో యూదు జాతి మొత్తాన్ని తుదముట్టించాలని జర్మన్ నాజీ నియంత హిట్లర్ చేసిన ఘోరకలిని తలపిస్తూ ఎన్నికల ఫలితాలు వెలువడిన నాటి నుంచి ఆంధ్రప్రదేశ్లో పచ్చమూక మరణమృదంగం మోగిస్తోంది. ‘నారా’సుర పాలన విశృంఖలత్వం సృష్టిస్తోంది. అధికారబలం ఉన్నవాడిదే అరాచకం... అన్న అడవినీతిని తలపిస్తూ యథేచ్చగా నరమేధం సాగిస్తోంది. హత్యలతో రాష్ట్రం అట్టుడికిపోతోంది. ప్రజాప్రతినిధుల నుంచి సామాన్యుల ప్రాణాలకు రక్షణ లేకుండాపోయింది. ప్రభుత్వ ఆస్తుల విధ్వంసకాండ కొనసాగుతోంది. ప్రైవేటు ఆస్తుల ధ్వంస రచన అడ్డూ అదుపు లేకుండా సాగుతోంది. పచ్చ ముఠాలు సభ్యులు రాష్ట్రంపై తెగబడి ఆస్తులు ధ్వంసం చేస్తున్నారు. ఇళ్లను ముట్టడిస్తున్నారు. దివంగత సీఎం వైఎస్ రాజశేఖరరెడ్డి విగ్రహాలను నేలమట్టం చేస్తున్నారు. వైఎస్సార్సీపీ కార్యాలయాలపై దండెత్తుతున్నారు. సచివాలయాలు, ఆర్బీకేలు, తాగునీటి ట్యాంకులు వంటి ప్రభుత్వ ఆస్తులను కూలగొడుతున్నారు. టీడీపీ అధికార మదానికి పోలీసు శాఖ దాసోహమైంది. ప్రభుత్వ ప్రేరేపిత దాడులు కావడంతో చేష్టలుడిగి చూస్తోంది. ఒక్క మాటలో చెప్పాలంటే రాష్ట్రంలో రాజ్యాంగ వ్యవస్థలు కుప్పకూలుతున్నాయి. గోడు వెళ్లబోసుకునేందుకు ఏ వ్యవస్థా అందుబాటులో లేకుండా పోయింది. చంద్రబాబు ప్రభుత్వం రాష్ట్రంలో రాజ్యాంగ ధర్మాన్ని కాలరాస్తోంది. టీడీపీ రెడ్బుక్ రాజ్యాంగ అరాచకమే రాజ్యమేలుతోంది. – సాక్షి, అమరావతి నేడువరుసగా మూడుసార్లు ఎంపీగా ఎన్నికైన పెద్దిరెడ్డి మిథున్రెడ్డిని గురువారం ఆయన సొంత నియోజకవర్గంలోనే హత్య చేసేందుకు టీడీపీ గూండాలు బరితెగించారు. పక్కా పన్నాగంతో కత్తులు, రాళ్లు చేతబట్టి మాటు వేశారు. మూకుమ్మడిగా దాడిచేశారు. టీడీపీ రౌడీమూకలను వారించబోయిన మాజీ ఎంపీ రెడ్డప్పను బూతులు తిడుతూ దాడికి తెగబడ్డారు. ఆంధ్రప్రదేశ్లో ఓ ఎంపీ ప్రాణాలకే రక్షణలేని పరిస్థితి. నిన్నపల్నాడు జిల్లా వినుకొండలో నడిరోడ్డుపై వైఎస్సార్సీపీ కార్యకర్త రషీద్పై టీడీపీ గూండా జిలానీ కత్తితో విచక్షణారహితంగా దాడి చేశాడు. రెండు చేతులు తెగనరికాడు. అనంతరం కత్తితో మెడ నరికి పాశవికంగా హత్య చేశాడు. ఆంధ్రప్రదేశ్లో ఓ సామాన్యుడికి ప్రాణాలకు ఏమాత్రం రక్షణ లేదనడానికి తాజా తార్కాణం ఈ దురాగతం. కక్ష కట్టి కత్తివేటు... హత్యలు31 హత్యాయత్నాలు 300టీడీపీ కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత 40 రోజుల్లోనే రాష్ట్రవ్యాప్తంగా 31 మంది దారుణ హత్యకు గురయ్యారు. కర్నూలు జిల్లా ఆదోని మండలం నాగనాథహళ్లిలో మాల గుండమ్మ అనే దళిత మహిళను ఆమె పొలంలోనే టీడీపీ నేత రాఘవేంద్రారెడ్డి, ఆయన కుమారుడు శ్రీధర్రెడ్డి దారుణంగా ట్రాక్టర్తో తొక్కించి చంపేశారు. రాష్ట్ర హోం మంత్రి వంగలపూడి అనిత ప్రాతినిధ్యం వహిస్తున్న అనకాపల్లి జిల్లా రాంబిల్లి మండలం కొప్పుగొండువానిపాలెంలో సురేష్ అనే ఉన్మాది 9వ తరగతి చదువుతున్న బాలికను కత్తితో పొడిచి హత్యచేశాడు. అదేవిధంగా హిందూపురం నియోజకవర్గం గోళపురం గ్రామంలో వైఎస్సార్సీపీ నేత సతీష్... విజయనగరం జిల్లా సీతానగరం మండలం పెద్ద భోగిలే హడ్కో కాలనీలో గుజ్జల హేమంత్... శ్రీకాకుళం రెల్లివీధికి చెందిన నల్లపిల్లి గౌరీశంకర్.. శ్రీకాకుళం జిల్లా సోంపేట మండలం కొర్లాం జాతీయ రహదారి సమీపంలోని ఓ దాబాలో రాంబాబు అనే వ్యక్తి...అనంతపురం జిల్లా కోమటికుంట్ల గ్రామంలో వైఎస్సార్సీపీ కార్యకర్త ఎరికలయ్య.. విశాఖపట్నంలోని అగనంపూడిలో కిరణ్ అనే యువకుడు... బాపట్ల జిల్లా చీరాలలో ఓ వ్యాపారి... ఒంగోలులో ఓ యువకుడు... పల్నాడు జిల్లా వెల్దుర్తి మండలం మిట్టపల్లెలో హనిమిరెడ్డి, దాచేపల్లిలో గుమ్మడి నాగిరెడ్డి... ఇలా 40 రోజుల్లో 31 మంది హత్యకు గురయ్యారు. శ్రీకాకుళం జిల్లాలో అత్యధికంగా ఐదు హత్యలు జరిగాయి. మరో 300 మందిపై హత్యాయత్నాలు జరిగాయి.భరించలేక.. బలవన్మరణాలు ఆత్మహత్యలు 35 వైఎస్సార్సీపీ నాయకులు, కార్యకర్తలపై మాత్రమే కాదు... చిరు వ్యాపారులు, చిన్నాచితక ఉద్యోగులు, సామాన్యులపై సైతం టీడీపీ నేతలు తమ ప్రతాపం చూపుతున్నారు. ‘ఇక మా ప్రభుత్వం వచ్చింది.. మీరు తప్పుకోండి..’ అంటూ బెదిరిస్తున్నారు. తమకు ఎదురు చెబితే తప్పుడు కేసులు పెట్టి కుళ్ల»ొడిపిస్తామని హెచ్చరిస్తున్నారు. దీంతో ఉపాధి కోల్పోతామని... పరువు పోతుందనే భయంతో తీవ్ర ఆవేదనకు గురై ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు. టీడీపీ నేతలు ఉద్యోగానికి రాజీనామా చేయాలని బెదిరించడంతో చిలకలూరిపేట నియోజకవర్గంలో ఉపాధి హామీ పథకం ఫీల్డ్ అసిస్టెంట్ జడ ఆనంద్ పురుగులమందు తాగి చనిపోయాడు. పోలీసుల వేధింపులతో పల్నాడు జిల్లా సత్తెనపల్లి నియోజకవర్గం రెంటపాళ్ల ఉప సర్పంచ్ కోరుకుంట్ల నాగమల్లేశ్వరరావు ఆత్మహత్య చేసుకున్నారు. ఇలా 40 రోజుల్లో రాష్ట్రవ్యాప్తంగా 35మంది ఆత్మహత్యలు చేసుకున్నారు. టీడీపీ నేతల వేధింపుల కారణంగా అత్యధికంగా వైఎస్సార్ జిల్లాలో 16 మంది ఆత్మహత్యలు చేసుకున్నారు. ఇక శ్రీకాకుళం జిల్లాలో 11 మంది బలవన్మరణాలకు పాల్పడ్డారు.చిన్నారులనేకనికరం లేకుండా.. లైంగిక దాడులు20టీడీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత రాష్ట్రంలో లైంగికదాడులుఘోరంగా జరుగుతున్నాయి. చిన్నారులు అనే కనికరం కూడా లేకుండా ఉన్మాదులు చెలరేగిపోతున్నారు. కేవలం 40 రోజుల్లోనే 20 మందిపైలైంగికదాడులు జరిగాయి. వారిలో నలుగురిని దుండగులు చంపేశారు. చీరాలలో జూన్ 21వ తేదీన ఓ చేనేత కుటుంబానికి చెందిన యువతి బహిర్భూమికి వెళ్లగా, ఆమెపై దుండగులు అత్యాచారం చేసి హతమార్చారు. నంద్యాల జిల్లా ముచ్చుమర్రిలో పది రోజుల కిందట ఎనిమిదేళ్ల గిరిజన బాలికను దుండగులు అపహరించి అత్యాచారానికి పాల్పడ్డారు. ఆ బాలిక ఆచూకీ ఇంతవరకు తెలియలేదు. అనంతపురం జిల్లా అరకటివేములలో టీడీపీ కార్యకర్త రవితేజ ఓ బాలికను జూన్ 24న అపహరించి తాడిపత్రి మార్కెట్ యార్డ్ వద్ద ఉన్న వాహనంలోకి తీసుకువెళ్లి తన స్నేహితుడు నాగేంద్రతో కలిసిలైంగికదాడికి పాల్పడ్డారు. ఇలా వయసుతో సంబంధం లేకుండా 20 మందిపై లైంగిక దాడులు జరిగాయి.అదేవిధంగా శ్రీకాకుళం జిల్లా ఎచ్చెర్ల మండలం నవభారత్ జంక్షన్లో జూన్ 17న ఓ మహిళపై దాడి చేసి ఒళ్లంతా కారం చల్లి ఆటోలోకి బలవంతంగా ఎక్కించి శ్రీకాకుళం పట్టణంలోకి తీసుకువెళ్లి నడివీధిలో వివస్త్రను చేసి ఊరేగించారు. అనకాపల్లి జిల్లా దర్మసాగరంలో టీడీపీ వర్గీయులు కుమారి అనే మహిళ ఇంటికి వెళ్లి ఆమెను వివస్త్రను చేసి కొట్టారు. ఇవన్నీ అధికారిక లెక్కలు. కానీ ఫిర్యాదులు చేసేందుకు పలువురు బాధితులు వెనుకంజ వేస్తున్నారు. బాధితులు అందరూ ఫిర్యాదులు చేస్తే కేసుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉంది.
![Priyadarshi Darling Movie Review And Rating Telugu](/sites/default/files/styles/webp/public/article_images/2024/07/19/Priyadarshi-Darling-Movie-Review.jpg.webp?itok=xJei0u_Z)
'డార్లింగ్' సినిమా రివ్యూ
కమెడియన్గా ఇండస్ట్రీలోకి వచ్చి 'మల్లేశం', 'బలగం' సినిమాలతో హీరోగా గుర్తింపు తెచ్చుకున్న నటుడు ప్రియదర్శి. ఇతడు హీరోగా నటించిన లేటెస్ట్ మూవీ 'డార్లింగ్'. గత కొన్నిరోజులుగా ప్రమోషన్స్ గట్టిగానే చేసిన ఈ మూవీ ఇప్పుడు థియేటర్లలోకి వచ్చేసింది. మరి ఇది ఎలా ఉంది? హిట్ కొట్టిందా లేదా అనేది ఇప్పుడు రివ్యూలో చూద్దాం.కథేంటి?రాఘవ్ (ప్రియదర్శి).. పెళ్లి చేసుకుని భార్యని హనీమూన్కి పారిస్ తీసుకెళ్లాలనే ధ్యేయంతో పెరిగి పెద్దవుతాడు. తల్లిదండ్రులు చూపించిన నందిని(అనన్య నాగళ్ల)తో పెళ్లికి రెడీ అవుతాడు. కానీ ఈమె, ప్రేమించిన వాడితో వెళ్లిపోతుంది. పెళ్లి పెటాకులైందని రాఘవ్ ఆత్మహత్య చేసుకోవాలనుకుంటాడు. సరిగ్గా అక్కడ ఆనంది (నభా నటేష్) కలుస్తుంది. పరిచయమైన ఆరు గంటల్లోనే రాఘవ్ ఈమెని పెళ్లి చేసుకుంటాడు. ఇంతకీ ఆనంది ఎవరు? ఆమె ఒక్కో టైంలో ఒక్కోలా ఎందుకు ప్రవర్తిస్తుంది అనేదే మిగతా స్టోరీ.ఎలా ఉందంటే?ఒకే మనిషి ఒక్కో సమయంలో ఒక్కోలా ప్రవర్తించడం.. దీన్నే ఇంగ్లీష్లో స్ప్లిట్ పర్సనాలిటీ అంటారు. గతంలో 'అపరిచితుడు' మూవీని ఇదే కాన్సెప్ట్తో తీశారు. కాకపోతే అది పూర్తిగా ఎమోషనల్ వేలో సాగుతుంది. ఒకవేళ ఇలాంటి స్ప్లిట్ పర్సనాలిటీ అమ్మాయికి ఉందని తెలిస్తే ఏమైందనేదే 'డార్లింగ్' సినిమా.ట్రైలర్, ప్రచార చిత్రాలు చూస్తే ఈ మూవీ కథేంటనేది తెలిసిపోతుంది. ఇందులో పెద్దగా దాపరికాలు లేవు. ఫస్టాప్ అంతా హీరో... పెళ్లి ధ్యేయమన్నట్లు పెరిగి పెద్దవడం, పెళ్లి నిశ్చయమైన తర్వాత అమ్మాయి మరో వ్యక్తితో లేచిపోవడం, సూసైడ్ చేసుకోవాలనుకోవడం, ఊహించని పరిస్థితుల్లో ఊరు పేరు తెలియని ఓ అమ్మాయిని పెళ్లి చేసుకోవడం.. మధ్యమధ్యలో కామెడీ.. ఇలా సరదాగా సాగిపోతుంది. ఇంటర్వెల్కి పర్వాలేదనిపించే ట్విస్ట్.సెకండాఫ్లో భార్యకు ఎందుకు స్ప్లిట్ పర్సనాలిటీ ఉందని తెలుసుకోవడానికి భర్త చేసే ప్రయత్నాలు, మొదట్లో కామెడీ కామెడీగా ఉండే సినిమా.. చివర్లో ఎమోషనల్గా ఎందుకు ఎండ్ కావాల్సి వచ్చిందనేది మూవీ చూసి తెలుసుకోవాలి. స్టోరీ పరంగా ఇది మంచి లైనే. కానీ డైరెక్టర్ చాలాసార్లు తడబడ్డాడు. స్ప్లిట్ పర్సనాలిటీ అని ఫస్టాప్ అంతా నవ్వించాడు. ఇంటర్వెల్కే కథని ముగించిన ఫీలింగ్ తెప్పించాడు.అక్కడే చిన్న ట్విస్ట్ ఇచ్చి హీరోయిన్కి మల్టీపుల్ స్ప్లిట్ పర్సనాలిటీ ఉందని చెప్పి, మరోసారి ఇదే కాన్సెప్ట్పై నవ్వించాలనుకున్నాడు. కానీ సెకండాఫ్లో ఇది సరిగా వర్కౌట్ కాలేదు. స్టోరీ అంతా ఒకే పాయింట్ దగ్గర తిరిగిన ఫీలింగ్ వస్తుంది. కానీ క్లైమాక్స్కి వచ్చేసరికి కొన్ని ఎమోషనల్ సీన్లు పడటంతో మరీ సూపర్ కాకపోయినా పర్లేదు అనిపించే సినిమా చూశాంలే అనే అభిప్రాయంతో థియేటర్ బయటకు వస్తాం.హీరోయిన్ పాత్రలో చాలా వేరియేషన్స్ ఉన్నాయి. కానీ అవన్నీ ప్రేక్షకుడికి ఎక్కవు, నచ్చవు. ఆమె కంటే ప్రియదర్శి కామెడీ, ఎమోషన్ అంతో ఇంతో కనెక్ట్ అయ్యేలా ఉంటుంది. దర్శకుడు ఏం చెప్పాలనుకున్నాడన్నది వదిలేస్తే.. సీన్లు సీన్లుగా చూస్తే మాత్రం కొన్ని చోట్ల బాగానే పేలాయి. ఎవరెలా చేశారు?'డార్లింగ్' స్టోరీని హీరోయిన్ బేస్డ్గా రాసుకున్నారు. కానీ నభా నటేష్ని ఆ పాత్ర కోసం తీసుకుని పొరపాటు చేశారు! ఎందుకంటే ఈమె పాత్రతో ప్రేక్షకులు అస్సలు కనెక్ట్ కాలేకపోతారు. కొన్ని సీన్లలో పర్లేదనిపిస్తుంది కానీ కొన్నిచోట్ల విసిగిస్తుంది. హీరోగా చేసిన ప్రియదర్శి.. తనకు అలవాటైన కామెడీ ప్లస్ ఎమోషనల్ సన్నివేశాల్లో ఆకట్టుకున్నాడు. ఓ పాటలో డ్యాన్స్ కూడా చేశాడు. హీరో తండ్రిగా చేసిన మురళీధర్ గౌడ్, మామగా చేసిన రఘబాబు, పిన్నిగా చేసిన నటి బాగా నటించారు. బ్రహ్మానందం, సుహాస్, నిహారిక లాంటి స్టార్స్ అతిథి పాత్రలు చేశారు. కాకపోతే పెద్దగా వర్కౌట్ కాలేదు.టెక్నికల్ టీమ్ 'డార్లింగ్' కోసం బాగానే కష్టపడ్డారు. పాటలు పెద్దగా గుర్తుండవు. బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ అక్కడక్కడ బాగుంది. సినిమాటోగ్రఫీ గుడ్. నిర్మాణ విలువలు రిచ్గా ఉన్నాయి. కొత్త డైరెక్టర్ అశ్విన్ రామ్.. స్క్రిప్ట్ని ఇంకాస్త బెటర్గా రాసుకుని ఉండాల్సింది. అలానే 2 గంటల 41 నిమిషాల నిడివి ఎక్కువైపోయింది. 15-20 నిమిషాలు తగ్గించి, సెకాండాఫ్ కాస్త ట్రిమ్ చేసుంటే సినిమా ఎంటర్ టైనింగ్గా ఉండేది. జస్ట్ ఫన్ కోసమే థియేటర్కి వెళ్లాలనుకునే ప్రేక్షకులకు 'డార్లింగ్' మంచి ఆప్షన్.రేటింగ్: 2.75-చందు డొంకాన, సాక్షి వెబ్ డెస్క్
![CM Revanth Reddy started the loan waiver scheme](/sites/default/files/styles/webp/public/article_images/2024/07/19/06_5.jpg.webp?itok=cufnOWS8)
మాటకు కట్టుబడి మాఫీ
సాక్షి, హైదరాబాద్: ఎన్నికలకు ముందు రైతులకు ఇచ్చిన మాట నిలబెట్టుకుంటూ ఏకకాలంలో రుణమాఫీ చేస్తున్నట్లు ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి చెప్పారు. రాష్ట్ర వ్యాప్తంగా తొలి విడతలో 11.50 లక్షల మంది రైతుల ఖాతాల్లో రూ.6,098 కోట్ల నగదు జమ చేసినట్లు తెలిపారు. కాంగ్రెస్ మాటే శిలాశాసనమని మరోసారి రుజువైందని అన్నారు. రైతుల రుణ మాఫీ పథకంలో భాగంగా గురువారం సచివాలయంలో తొలి విడతగా రూ. లక్ష వరకు మాఫీ కార్యక్రమాన్ని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వర్రావుతో కలిసి ఆయన లాంఛనంగా ప్రారంభించారు. అనంతరం రాష్ట్ర వ్యాప్తంగా రైతు వేదికల వద్ద ఉన్న రైతులతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ఆయన మాట్లాడారు. ఇది మరపురాని రోజు ‘నాడు కరీంనగర్లో సోనియాగాంధీ మాట ఇచ్చారు. అనంతరం పార్టీకి తీరని నష్టం జరుగుతుందని తెలిసినా, మాట తప్పని, మడమ తిప్పని నాయకురాలిగా, రాష్ట్ర ప్రజలు శాశ్వతంగా గుర్తుపెట్టుకునేలా ప్రత్యేక తెలంగాణ రాష్ట్రాన్ని ఇచ్చారు. గత పాలకులు రైతు రుణమాఫీ చేస్తామని చెప్పి రెండుసార్లు మాట తప్పారు. మొదటి ఐదేళ్లలో కేసీఆర్ రూ.16 వేల కోట్ల రుణమాఫీ చేస్తామని చెప్పి రూ.12 వేల కోట్లు మాత్రమే ఇచ్చారు. రెండోసారి ప్రభుత్వంలో రూ.12 వేల కోట్లు మాఫీ చేస్తానని చెప్పి కేవలం రూ.9 వేల కోట్లు మాత్రమే చేశారు. రైతులు ఆత్మహత్య చేసుకునే పరిస్థితి ఉన్నా కేసీఆర్ ప్రజలకిచ్చిన మాటను పూర్తిస్థాయిలో నెరవేర్చలేదు. ఈ నేపథ్యంలో 2022 మే 6న వరంగల్లో లక్షలాది మంది రైతుల సమక్షంలో రాహుల్గాంధీ రైతు డిక్లరేషన్ ప్రకటించారు. రుణమాఫీ చేస్తామన్నారు. 2023 సెపె్టంబర్ 17న తుక్కుగూడాలో సోనియాగాంధీ ఆరు గ్యారెంటీలను ప్రకటించారు. రూ.2 లక్షల వరకు రుణమాఫీ చేస్తామని మాట ఇచ్చారు. వారిచ్చిన మాట ప్రకారమే నేడు సచివాలయంలో కూర్చొని ధైర్యంగా తెలంగాణ రైతుల ఖాతాల్లో రూ.6,098 కోట్లను జమ చేస్తున్నాం. నా 16 ఏళ్ల రాజకీయ ప్రయాణంలో ఇది మరుపురాని రోజు. రుణమాఫీ చేసే భాగ్యం నాకు కలిగింది. కేసీఆర్ కటాఫ్ పెట్టిన తేదీ మరునాటి నుంచే రుణమాఫీ అమలు చేస్తున్నాం. తెలంగాణ రాష్ట్ర కలను సాకారం చేసిన సోనియాగాంధీ పుట్టిన రోజు డిసెంబర్ 9ని రుణమాఫీ కటాఫ్గా పెట్టాం. ఏ అవాంతరాలు లేకుండా రుణమాఫీ పూర్తి చేస్తాం. ముందుగా ఈ రోజు రూ.లక్ష వరకు రుణ విముక్తి కల్పించాం. రూ.లక్ష నుంచి రూ. లక్షన్నర రుణం ఉన్న రైతులకు త్వరలోనే రుణ విముక్తి కలుగుతుంది. ఆగస్టు నెల పూర్తి కాకముందే రూ.31 వేల కోట్ల రుణమాఫీ చేసి తీరతాం. ఇది దేశ చరిత్రలోనే తొలిసారి..’అని సీఎం అన్నారు. రేషన్కార్డు ప్రాతిపదిక కాదు ‘కొంతమంది రైతు రుణమాఫీకి రేషన్కార్డు తప్పనిసరిగా ఉండాలనే అపోహ çసృష్టిస్తున్నారు. రైతు రుణమాఫీకి రేషన్ కార్డు ప్రాతిపదిక కాదు. పాస్ బుక్నే కొలబద్ద. దొంగలు చెప్పే దొంగ మాటలు నమ్మొద్దు. రుణాలు తీసుకున్న దాదాపు 6.36 లక్షల మందికి రేషన్ కార్డులు లేవు. అందుకే పాసుబుక్ ఆధారంగా రుణమాఫీ చేస్తున్నాం. ప్రతి రైతు రుణమాఫీకి కావాల్సిన చర్యలు చేపడుతున్నాం. సమస్యలు తలెత్తితే బ్యాంకు అధికారులను సంప్రదించాలి. బ్యాంకు అధికారులు కూడా రైతులకు అవగాహన కల్పించాలి. వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల స్వయంగా రైతు. ఆర్థిక మంత్రిగా భట్టి విక్రమార్క రుణమాఫీకి ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ప్రయత్నం చేశారు..’అని రేవంత్ చెప్పారు. త్వరలో వరంగల్లో రాహుల్గాందీతో సభ ‘గత ప్రభుత్వంలో ఉద్యోగులకు జీతాలు కూడా సరిగా ఇవ్వలేదు. మా ప్రభుత్వం ఒకటో తారీఖున జీతాలు ఇస్తోంది. అధికారంలోకి వచ్చిన ఏడు నెలల్లోనే సంక్షేమ కార్యక్రమాలకు రూ.29 వేల కోట్లు ఖర్చు చేశాం. గత ప్రభుత్వ అప్పులకు మిత్తీగా ప్రతి నెలా రూ.7 వేల కోట్లు చెల్లిస్తున్నాం. జీతాలు, పింఛన్ల కోసం రూ.5 వేల కోట్లు కేటాయిస్తున్నాం. ఇబ్బందులు ఉన్నా సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నాం. వ్యవసాయం దండగ కాదు.. పండుగ అని నిరూపించాం. రైతు రుణమాఫీలో దేశానికి తెలంగాణ మోడల్గా ఉండబోతుంది. 8 నెలల్లో రుణమాఫీ హామీని నెరవేర్చి దేశంలోనే తలెత్తుకునేలా ఉన్నాం. సవాల్ చేసిన ఆయనను రాజీనామా చేయమని మేం అడగం. ఇప్పటికైనా గాంధీ కుటుంబం మాట ఇస్తే తప్పదని వారు గుర్తు పెట్టుకోవాలి. రైతు రుణమాఫీ సందర్భంగా రాహుల్గాంధీని ఆహా్వనించి వరంగల్లో బహిరంగ సభ నిర్వహిస్తాం. త్వరలో మంత్రివర్గ సహచరులతో కలిసి ఢిల్లీ వెళ్లి ఆయన్ను ఆహ్వానిస్తాం..’అని ముఖ్యమంత్రి తెలిపారు. రాష్ట్ర రైతులకు పెద్ద పండుగ: భట్టి రాష్ట్రంలో ఒకేసారి రూ.2 లక్షల రుణమాఫీ చేస్తున్న తెలంగాణ వైపు దేశం మొత్తం ఆశ్చర్యంగా చూస్తోందని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క అన్నారు. దేశంలోని ఏ రాష్ట్రంలో కూడా ఒకేసారి రూ.2 లక్షల రుణమాఫీ చేసిన చరిత్ర లేదని పేర్కొన్నారు. రాష్ట్రవ్యాప్తంగా రైతులకు ఇది పెద్ద పండుగ అని అన్నారు. ఎన్నికల్లో ఇచ్చిన 6 గ్యారంటీల్లో ఐదు గ్యారంటీలు ఇప్పటికే అమలు చేయడంతో పాటు ఈ రోజు రైతు రుణమాఫీ అమలు చేస్తూ కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన మాట నిలబెట్టుకుందని అన్నారు. ధనిక రాష్ట్రాన్ని అప్పుల రాష్ట్రంగా మార్చి రూ.7 లక్షల కోట్ల అప్పుతో తమకు అప్పజెప్పినప్పటికీ రూపాయి రూపాయి పోగేసి రుణమాఫీ అమలు చేసి చూపిస్తున్నామని చెప్పారు. కాగా రైతు రుణమాఫీ పురస్కరించుకుని ఏఐసీసీ అధ్యక్షుడు మల్లిఖార్జున ఖర్గే, పార్టీ అగ్రనేతలు సోనియాగాంధీ, రాహుల్ గాం«దీకి ధన్యవాదాలు తెలుపుతు సమావేశంలో తీర్మానం చేశారు. కార్యక్రమం చివర్లో కొందరు రైతులకు రుణమాఫీ చెక్కులు సీఎం పంపిణీ చేశారు.
![Anti-quota protests turn violent In Bangladesh](/sites/default/files/styles/webp/public/article_images/2024/07/19/bangladesh.jpg.webp?itok=luD4h4fA)
బంగ్లాదేశ్లో రిజర్వేషన్ల హింస.. మరో 18 మంది మృతి
ఢాకా: ప్రభుత్వ ఉద్యోగాల రిజర్వేషన్ల కోటాలో సంస్కరణలను కోరుతూ బంగ్లాదేశ్లో కొనసాగుతున్న ఆందోళనలు మరింత హింసాత్మకంగా మారాయి. గురువారం దేశవ్యాప్తంగా జరిగిన ఆందోళనల్లో మరో 18 మంది చనిపోగా 2,500 మంది వరకు గాయపడ్డారు. దీంతో, ఈ ఆందోళనల మృతుల సంఖ్య 25కు చేరింది. గురువారం ఆందోళనకారులు ఢాకాలో ప్రభుత్వ టీవీ కార్యాలయం ముందుభాగాన్ని ధ్వంసం చేశారు. పార్కు చేసిన వాహనాల్ని తగులబెట్టారు. దీంతో, ఉద్యోగులతోపాటు జర్నలిస్టులు లోపలే చిక్కుబడిపోయారు. ఢాకాతోపాటు ఇతర నగరాల్లో ఉన్న వర్సిటీల్లో వారం రోజులుగా జరుగుతున్న ఆందోళనలు గురువారం కూడా కొనసాగాయి. ఆందోళనకారులు భద్రతా సిబ్బంది, అధికార పార్టీ అనుకూలురతో బాహాబాహీగా తలపడ్డారు. ఘర్షణల్లో 18 మంది చనిపోగా 2,500 మందికి పైగా గాయపడినట్లు డెయిలీ స్టార్ పత్రిక తెలిపింది. ఢాకాలోనే 9 మంది చనిపోయినట్లు పేర్కొంది. దాంతో రైళ్లతో పాటు మొబైల్ ఇంటర్నెట్ సేవలను నిలిపేశారు.
![Daily Horoscope July 19-07-2024](/sites/default/files/styles/webp/public/article_images/2024/07/19/Daily-Horoscope-July-19-07-.jpg.webp?itok=TQQLD_CO)
Telugu Horoscope: ఈ రాశివారి శ్రమ ఫలిస్తుంది
శ్రీ క్రోధి నామ సంవత్సరం, దక్షిణాయనం, గ్రీష్మ ఋతువు, ఆషాఢ మాసం, తిథి: శు.త్రయోదశి సా.6.01 వరకు, తదుపరి చతుర్దశి, నక్షత్రం: మూల రా.2.31 వరకు, తదుపరి çపూర్వాషాఢ, వర్జ్యం: ఉ.10.16 నుండి 11.54 వరకు, తదుపరి రా.12.53 నుండి 2.31 వరకు, దుర్ముహూర్తం: ఉ.8.12 నుండి 9.04 వరకు, తదుపరి రా.10.59, నుండి 11.43 వరకు, అమృతఘడియలు: రా.8.01 నుండి 9.36 వరకు. మేషం: బంధువర్గం నుంచి ఒత్తిడులు. అనుకోని ప్రయాణాలు. కుటుంబంలో సమస్యలు. అనారోగ్యం. విద్యార్థులకు నిరుత్సాహం. వృత్తి, వ్యాపారాలు కొంత ఇబ్బంది కలిగిస్తాయి.వృషభం: మిత్రుల నుంచి ఒత్తిడులు. ఖర్చులు పెరుగుతాయి. శ్రమాధిక్యం. పుణ్యక్షేత్రాలు సందర్శిస్తారు. ఉద్యోగయత్నాలలో అవాంతరాలు. పనులు వాయిదా. వృత్తి, వ్యాపారాలలో ఆటంకాలు.మిథునం: కొత్త మిత్రులు పరిచయం. సభలు, సమావేశాలలో పాల్గొంటారు. పాతబాకీలు వసూలవుతాయి. పరిస్థితులు అనుకూలిస్తాయి. ధార్మిక చింతన. వృత్తి, వ్యాపారాలు ఉత్సాహవంతంగా సాగుతాయి.కర్కాటకం: నూతన ఉద్యోగాలు దక్కుతాయి. సేవాకార్యక్రమాలలో పాల్గొంటారు. ప్రముఖుల పరిచయం. సంఘంలో గౌరవప్రతిష్ఠలు పొందుతారు. వ్యాపారాలు, ఉద్యోగాలలో లక్ష్యాలు సాధిస్తారు.సింహం: పనులలో స్వల్ప ఆటంకాలు. వృథా ఖర్చులు. ఆకస్మిక ప్రయాణాలు. బంధుమిత్రుల నుంచి ఒత్తిడులు. అంచనాలలో పొరపాట్లు. ఆరోగ్యం మందగిస్తుంది. వృత్తి, వ్యాపారాలు మందకొడిగా సాగుతాయి.కన్య: శ్రమాధిక్యం. కొన్ని కార్యక్రమాలు వాయిదా వేస్తారు. దైవదర్శనాలు. ఆలోచనలు స్థిరంగా ఉండవు. సోదరులతో కలహాలు. మానసిక అశాంతి. వ్యాపారాలు, ఉద్యోగాలలో గందరగోళం.తుల: వ్యవహారాలలో విజయం. శుభవార్తలు. ఆకస్మిక ధనలాభం. ప్రముఖుల నుంచి కీలక సమాచారం. ఉద్యోగలాభం. పరిచయాలు పెరుగుతాయి. వ్యాపార, ఉద్యోగాలలో అనుకూలత.వృశ్చికం: కొన్ని కార్యక్రమాలు వాయిదా వేస్తారు. ఆకస్మిక ప్రయాణాలు. కుటుంబంలో సమస్యలు. అనారోగ్యం. బంధువులతో విభేదాలు. వృత్తి, వ్యాపారాలు సామాన్యంగా ఉంటాయి.ధనుస్సు: కొత్త విషయాలు తెలుసుకుంటారు. పరిస్థితులు అనుకూలిస్తాయి. సంఘంలో గౌరవం. కష్టానికి ఫలితం పొందుతారు. వాహనయోగం. భూవివాదాల పరిష్కారం. వ్యాపార, ఉద్యోగాలలో ప్రోత్సాహం.మకరం: పనుల్లో అవరోధాలు. ఆలోచనలు స్థిరంగా ఉండవు. బాధ్యతలు పెరుగుతాయి. బంధువులతో విభేదాలు. ప్రయాణాలు వాయిదా వేస్తారు. వృత్తి, వ్యాపారాలు నిరాశ కలిగిస్తాయి.కుంభం: పరిచయాలు పెరుగుతాయి. ఆస్తి వివాదాలు తీరతాయి. వాహనయోగం. ఆలయ దర్శనాలు.. చర్చలు సఫలం. చిన్ననాటి మిత్రుల కలయిక. వ్యాపార, ఉద్యోగాలలో నూతనోత్సాహం.మీనం: శ్రమ ఫలిస్తుంది. ఉద్యోగయత్నాలు సానుకూలం. కొన్ని బాకీలు వసూలవుతాయి. కీలక సమాచారం. విద్యార్థులకు శుభవర్తమానాలు. వృత్తి, వ్యాపారాలలో ఉత్సాహం.
![If You Are Preparing For Neet Again Heres Why You Should Choose Aakashs Repeaterxii Passed Courses](/sites/default/files/styles/webp/public/article_images/2024/06/20/Untitled-2_9.jpg.webp?itok=Yu3M0cnh)
మీరు మళ్లీ NEET లేదా JEE కోసం సిద్ధమవుతున్నట్లయితే, మీరు ఆకాష్ రిపీటర్/XII Passed కోర్సులను ఎందుకు ఎంచుకోవాలి?
NEET/JEE కోసం సన్నద్ధం కావడానికి ఒక సంవత్సరాన్ని వెచ్చించడం అనేది ఏడాది పొడవునా నిబద్ధత కలిగి మరియు మెడిసిన్ లేదా ఇంజినీరింగ్లో కెరీర్పై మీ కలను కొనసాగించడం పట్ల మీకు మక్కువ ఉంటే ఖచ్చితంగా విలువైనది. ఈ పరీక్షలు ఛేదించడానికి చాలా కఠినంగా ఉంటాయని ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. దీనికి హాజరైన లక్షలాది మంది విద్యార్థులలో మొదటి ప్రయత్నంలోనే కొంత మంది మాత్రమే విజయం సాధిస్తారు. ప్రత్యామ్నాయ కెరీర్ ఎంపికల కోసం వెతకని వారు లేదా తమకు పెద్దగా నచ్చని కాలేజీలలో స్థిరపడని వారు. అయినప్పటికీ, ఒక సంవత్సరం పునరావృతం చేయడానికి మరియు మళ్లీ సిద్ధం కావడానికి వెనుకాడని వారు కూడా చాలా మంది ఉన్నారు.మీరు మీ మొదటి ప్రయత్నంలో NEETని ఛేదించనట్లయితే మరియు మళ్లీ సిద్ధం కావాలని ఆలోచిస్తున్నట్లయితే, మీరు తాజాగా ప్రారంభించి సరైన మార్గ నిర్దేశం చేయడంలో సహాయపడే ఆకాష్ రిపీటర్/XII పాస్ కోర్సులను మీరు తీవ్రంగా పరిగణించాలి.NEET/ JEE 2025 కోసం మీరు ఆకాష్ రిపీటర్/ XII Passed కోర్సును ఎంచుకోవడానికి కారణాలు● ఆకాష్ రిపీటర్ కోర్సులు మీ స్కోర్ను మెరుగుపరచడంలో మీకు సహాయపడటానికి రూపొందించబడ్డాయి మరియు తద్వారా మీ కలల కళాశాలకు ఎంపికయ్యే అవకాశాలను పెంచుతాయిసూర్యాంశ్ K ఆర్యన్ ఆకాష్లో NEET రిపీటర్ క్లాస్రూమ్ విద్యార్థి, అతను NEET 2023లో తన 2వ ప్రయత్నంలో తన స్కోర్లలో గణనీయమైన మెరుగుదలను నమోదు చేసుకున్నాడు మరియు NEET 2022 (592 స్కోర్)లో తన మొదటి ప్రయత్నం కంటే 705 స్కోర్ సాధించగలిగాడు మరియు ప్రస్తుతం AIIMS భోపాల్లో చదువుతున్నాడు. అంజలి కథ కూడా అలాంటిదే. NEET 2022లో 622 స్కోర్ చేసిన తర్వాత, అంజలి ఆకాష్ NEET రిపీటర్ క్లాస్రూమ్ ప్రోగ్రామ్లో చేరింది మరియు 706 స్కోర్ చేయగలిగింది మరియు NEET 2023లో అండమాన్ & నికోబార్ దీవుల టాపర్గా నిలిచింది. అంజలి ప్రస్తుతం MAMC, ఢిల్లీలో చదువుతోంది. ఆకాష్లోని రిపీటర్ సక్సెస్ స్టోరీలు ప్రోగ్రామ్ యొక్క దృఢత్వం మరియు తీవ్రతను తెలియజేస్తాయి, ఇది తమ కలలను సాధించుకోవడానికి తమ విలువైన సమయాన్ని వెచ్చించే విద్యార్థులకు ఆఫర్లో ఉత్తమమైన వాటి కంటే తక్కువ ఏమీ కాకుండా లభించేలా చేస్తుంది.● ఉత్తమ అధ్యాపకులతో అత్యుత్తమ ఫలితాలను అందించడం ద్వారా ఆకాష్ యొక్క 35 ఏళ్ల వారసత్వం నుండి ప్రయోజనం పొందండిఆకాష్ దానితో పాటు, దేశంలోని అత్యుత్తమ అధ్యాపకులలో ఒకరి ద్వారా ఫోకస్డ్ మరియు రిజల్ట్-ఓరియెంటెడ్ టెస్ట్ ప్రిపరేషన్ను అందించే 35 సంవత్సరాల శక్తివంతమైన చరిత్ర కలిగినదిగా పిలవబడింది.. ఆకాష్లోని ఉపాధ్యాయులు అధిక అర్హతలు మరియు అనుభవజ్ఞులు మాత్రమే కాకుండా కోచింగ్ మెథడాలజీలు మరియు విద్యార్థుల మారుతున్న విద్యా అవసరాలకు అనుగుణంగా వారికి సహాయపడే నైపుణ్యాలలో బాగా శిక్షణ పొందారు. ఆకాష్ రిపీటర్/ XII ఉత్తీర్ణత సాధించిన కోర్సులతో, రిపీటర్ విద్యార్థులకు శిక్షణ ఇవ్వడం మరియు వారి ప్రత్యేక అవసరాలు మరియు సామర్థ్యాలను అర్థం చేసుకోవడంలో నైపుణ్యం కలిగిన అత్యుత్తమ అధ్యాపకుల దగ్గర మీరు నేర్చుకుంటారు, తద్వారా వారి ఎంపిక అవకాశాలను మెరుగుపరుస్తారు.● నిపుణులచే రూపొందించబడిన అధిక నాణ్యత అధ్యయన సామగ్రిఆకాష్లోని ప్రతి అధ్యయన వనరు అన్ని అంశాల సమగ్ర విశ్లేషణను అందించడానికి రూపొందించబడింది, విద్యార్థులు NEET మరియు/లేదా JEEలో పరీక్షించిన కాన్సెప్ట్లపై పూర్తి అవగాహన కలిగి ఉండేలా చూసుకుంటారు. విద్యార్థులు కష్టమైన పాఠాలను సులభంగా గ్రహించడంలో సహాయపడేందుకు వివిధ రకాల అభ్యాస ప్రశ్నలు, ఉదాహరణలు మరియు దృష్టాంతాలను చేర్చడానికి మా నిపుణులు స్టడీ మెటీరియల్ను జాగ్రత్తగా డిజైన్ చేస్తారు.అంతేకాకుండా, తాజా పరీక్షల ట్రెండ్లు మరియు ప్యాటర్న్లకు అనుగుణంగా మా స్టడీ మెటీరియల్ కఠినమైన సమీక్ష మరియు అప్డేట్లను కలిగియున్నది. విద్యార్థులు తమ పరీక్షా సన్నాహక ప్రయాణంలో ముందుకు సాగడానికి అత్యంత సందర్భోచితమైన మరియు నవీనమైన కంటెంట్పై అవగాహణ కలిగి ఉండేలా ఇది దోహదపడుతుంది.● పూర్తి అభ్యాసం కోసం కఠినమైన పరీక్షలు మరియు మూల్యాంకన షెడ్యూల్ఆకాష్లో విద్యార్థులు తమ సన్నద్ధత సమయంలో వారి బలహీనమైన ప్రాంతాలలో గణనీయమైన మెరుగుదలను ప్రదర్శించడంలో సహాయపడే నిర్దిష్టమైన పరీక్ష షెడ్యూల్ను అనుసరిస్తారు. ప్రస్తుతం భోపాల్లోని AIIMSలో ఉన్న ఆకాష్లోని రిపీటర్ క్లాస్రూమ్ విద్యార్థి సూర్యాంశ్ మాటల్లో, “నేను ప్రతిరోజూ ఒక పరీక్ష రాశాను”, పరీక్షలు నా బలమైన మరియు బలహీనమైన ప్రాంతాలను గుర్తించడంలో నాకు సహాయపడాయి.● గరిష్టంగా 90% మొత్తం స్కాలర్షిప్ పొందండిమీ కల కోసం సిద్ధపడడం మరియు అది కూడా రెండవసారి, ఖచ్చింగా సవాలుగా ఉంటుంది, ముఖ్యంగా ఆర్థికంగా. మేము, ఆకాష్ వద్ద, ఆకాష్ ఇన్స్టంట్ అడ్మిషన్ కమ్ స్కాలర్షిప్ టెస్ట్ (iACST)తో మీ కలను సాకారం చేయడానికి మీకు అవకాశాన్ని అందిస్తున్నాము. iACST మీకు 90% మొత్తం స్కాలర్షిప్ను గెలుచుకోవడానికి మరియు ఆకాష్ యొక్క రిపీటర్/ XII ఉత్తీర్ణత సాధించిన కోర్సులతో మీ కెరీర్ లక్ష్యాలను సాధించడానికి తక్షణ అవకాశాన్ని మీకు అందిస్తుంది.మీరు 2025లో NEET లేదా JEEలో మరోసారి మీ అదృష్టం పరీక్షించుకోవాలనుక్నుట్లయితే , మెడిసిన్/ఇంజినీరింగ్లో మీ కలల కెరీర్కు ఒక అడుగు దగ్గరగా తీసుకెళ్లగల సరైన మెంటర్ని మీరు ఎంచుకున్నారని నిర్ధారించుకోండి. ఆకాష్ రిపీటర్ కోర్సుల్లో అడ్మిషన్లు ప్రారంభమయ్యాయి. ఈరోజే నమోదు చేసుకోండి మరియు మొత్తం 90% స్కాలర్షిప్ పొందండి.ఇక్కడ క్లిక్ చేయండి
కస్టడీ పొడిగింపు.. ఆగస్టు 1 దాకా జైల్లోనే దర్శన్, పవిత్ర..
వాకింగ్ చేస్తే మోకాళ్లు అరిగిపోతాయా?
నష్టాల్లోకి చేరుకున్న స్టాక్మార్కెట్ సూచీలు
TG: షాకింగ్ ఘటన.. పసుపు లోడు లారీ హైజాక్
ఓలీ పోప్ సూపర్ సెంచరీ.. 416 పరుగులకు ఇంగ్లండ్ ఆలౌట్
హార్దిక్ పాండ్యాకు బిగ్ షాకిచ్చిన బీసీసీఐ.. కారణమిదే?
'ద బర్త్ డే బాయ్' మూవీ రివ్యూ
గతేడాదితో పోలిస్తే 34.5 శాతం పెరిగిన యూజర్లు
ఇజ్రాయెల్పై డ్రోన్ దాడి.. భారీ పేలుడు
వినుకొండ బయలుదేరిన వైఎస్ జగన్
పరిపాలన మరీ ఇంత అధ్వానమా?
TG: షాకింగ్ ఘటన.. పసుపు లోడు లారీ హైజాక్
ఓలీ పోప్ సూపర్ సెంచరీ.. 416 పరుగులకు ఇంగ్లండ్ ఆలౌట్
హార్దిక్ పాండ్యాకు బిగ్ షాకిచ్చిన బీసీసీఐ.. కారణమిదే?
వినుకొండ బయలుదేరిన వైఎస్ జగన్
కస్టడీ పొడిగింపు.. ఆగస్టు 1 దాకా జైల్లోనే దర్శన్, పవిత్ర..
నష్టాల్లోకి చేరుకున్న స్టాక్మార్కెట్ సూచీలు
'ద బర్త్ డే బాయ్' మూవీ రివ్యూ
గతేడాదితో పోలిస్తే 34.5 శాతం పెరిగిన యూజర్లు
భారత్లో రూ. 500 కోట్ల పెట్టుబడులు : తోషిబా గ్రూప్
కస్టడీ పొడిగింపు.. ఆగస్టు 1 దాకా జైల్లోనే దర్శన్, పవిత్ర..
వాకింగ్ చేస్తే మోకాళ్లు అరిగిపోతాయా?
నష్టాల్లోకి చేరుకున్న స్టాక్మార్కెట్ సూచీలు
TG: షాకింగ్ ఘటన.. పసుపు లోడు లారీ హైజాక్
ఓలీ పోప్ సూపర్ సెంచరీ.. 416 పరుగులకు ఇంగ్లండ్ ఆలౌట్
హార్దిక్ పాండ్యాకు బిగ్ షాకిచ్చిన బీసీసీఐ.. కారణమిదే?
'ద బర్త్ డే బాయ్' మూవీ రివ్యూ
గతేడాదితో పోలిస్తే 34.5 శాతం పెరిగిన యూజర్లు
ఇజ్రాయెల్పై డ్రోన్ దాడి.. భారీ పేలుడు
వినుకొండ బయలుదేరిన వైఎస్ జగన్
పరిపాలన మరీ ఇంత అధ్వానమా?
TG: షాకింగ్ ఘటన.. పసుపు లోడు లారీ హైజాక్
ఓలీ పోప్ సూపర్ సెంచరీ.. 416 పరుగులకు ఇంగ్లండ్ ఆలౌట్
హార్దిక్ పాండ్యాకు బిగ్ షాకిచ్చిన బీసీసీఐ.. కారణమిదే?
వినుకొండ బయలుదేరిన వైఎస్ జగన్
కస్టడీ పొడిగింపు.. ఆగస్టు 1 దాకా జైల్లోనే దర్శన్, పవిత్ర..
నష్టాల్లోకి చేరుకున్న స్టాక్మార్కెట్ సూచీలు
'ద బర్త్ డే బాయ్' మూవీ రివ్యూ
గతేడాదితో పోలిస్తే 34.5 శాతం పెరిగిన యూజర్లు
భారత్లో రూ. 500 కోట్ల పెట్టుబడులు : తోషిబా గ్రూప్
సినిమా
![This Friday OTT Release Movies In Telugu [July 19th 2024]](/sites/default/files/styles/webp/public/article_images/2024/07/18/ott.jpg02.jpg.webp?itok=A-VzDN9S)
ఈ శుక్రవారం ఓటీటీల్లో 16 సినిమాలు రిలీజ్.. అవి ఏంటంటే?
మరో వీకెండ్ వచ్చేసింది. ఇందులో భాగంగానే శుక్రవారం పలు సినిమాలు థియేటర్లలో రిలీజ్ అవుతున్నప్పటికీ ప్రియదర్శి 'డార్లింగ్' మూవీపై మాత్రం కాస్త హైప్ ఉంది. మరోవైపు ఓటీటీలో మాత్రం ఈ శుక్రవారం ఏకంగా 16 కొత్త మూవీస్-వెబ్ సిరీసులు స్ట్రీమింగ్ కాబోతున్నాయి. ఓవరాల్గా చూసుకుంటే ఈ వీకెండ్లో 27 మూవీస్ ప్లస్ సిరీసులు అలరించనున్నాయి. ఇంతకీ ఏ సినిమా ఏ ఓటీటీలో ఉందనేది ఇప్పుడు చూసేద్దాం.(ఇదీ చదవండి: సైలెంట్గా ఓటీటీలోకి వచ్చిన డిఫరెంట్ తెలుగు సినిమా)ఈ శుక్రవారం ఓటీటీల్లోకి వచ్చే మూవీస్ జాబితా (జూలై 19)నెట్ఫ్లిక్స్ఆడు జీవితం - తెలుగు డబ్బింగ్ మూవీఫైండ్ మీ ఫాలింగ్ - ఇంగ్లీష్ మూవీస్కై వాకర్స్: ఏ లవ్ స్టోరీ - ఇంగ్లీష్ చిత్రంస్వీట్ హోమ్ సీజన్ 3 - కొరియన్ సిరీస్కోబ్లా కాయ్ సీజన్ 6 పార్ట్ 1 - ఇంగ్లీష్ సిరీస్ (స్ట్రీమింగ్)మాస్టర్ ఆఫ్ ద హౌస్ - థాయ్ సిరీస్ (స్ట్రీమింగ్ అవుతోంది)త్రిభువన్ మిశ్రా సీఏ టాపర్ - హిందీ సిరీస్ (ఆల్రెడీ స్ట్రీమింగ్)కోబ్రా కోయ్ సీజన్ 6 పార్ట్ 1 - ఇంగ్లీష్ సిరీస్ (స్ట్రీమింగ్)మాస్టర్ ఆఫ్ ద హౌస్ - థాయ్ సిరీస్ (ఆల్రెడీ స్ట్రీమింగ్)పసుత్రి గాజే - ఇండోనేసియన్ సినిమా (స్ట్రీమింగ్)ఆహాద అకాలీ - తమిళ సినిమాబూమర్ అంకుల్ - తెలుగు డబ్బింగ్ మూవీ (జూలై 20)హాట్స్టార్నాగేంద్రన్స్ హనీమూన్ - తెలుగు డబ్బింగ్ సిరీస్యంగ్ ఉమెన్ అండ్ ద సీ - ఇంగ్లీష్ సినిమాజీ5బహిష్కరణ - తెలుగు వెబ్ సిరీస్బర్జాక్ - హిందీ సిరీస్అమెజాన్ ప్రైమ్బెట్టీ లా ఫీ - స్పానిష్ సిరీస్మ్యూజిక్ షాప్ మూర్తి - తెలుగు సినిమా (స్ట్రీమింగ్)అన్ ఇంటరప్టెడ్ టాప్ క్లాస్ టెన్నిస్ - ఇంగ్లీష్ సిరీస్ (ఆల్రెడీ స్ట్రీమింగ్)జియో సినిమాఐఎస్ఎస్ - ఇంగ్లీష్ మూవీమిస్టర్ బిగ్ స్టఫ్ - ఇంగ్లీష్ సిరీస్ (స్ట్రీమింగ్ అవుతోంది)ఆపిల్ ప్లస్ టీవీలేడీ ఇన్ ద లేక్ - ఇంగ్లీష్ సిరీస్హోయ్ చోయ్ టీవీధర్మజుద్దా - బెంగాలీ సినిమాబుక్ మై షోద డీప్ డార్క్ - ఫ్రెంచ్ సినిమాద వాచర్స్ - ఇంగ్లీష్ మూవీలయన్స్ గేట్ ప్లేఅర్కాడియన్ - ఇంగ్లీష్ మూవీడిస్కవరీ ప్లస్ద బ్లాక్ విడోవర్ - ఇంగ్లీష్ సిరీస్ (స్ట్రీమింగ్)(ఇదీ చదవండి: రెండో పెళ్లికి రెడీ అయిన స్టార్ హీరో హృతిక్ రోషన్.. హింట్ ఇచ్చేశాడా?)
![Varun Sandesh VIRAAJI Movie Trailer Out Now](/sites/default/files/styles/webp/public/article_images/2024/07/18/varun.jpg.webp?itok=yBUSp4Q9)
ఆత్మలతో మాట్లాడే వరుణ్ సందేశ్.. ట్రైలర్తోనే భయపెట్టేశాడు!
వరుణ్ సందేశ్ హీరోగా నటిస్తోన్న తాజా చిత్రం 'విరాజి'. ఇటీవలే నింద సినిమాతో అలరించారు. ఈ మూవీని హారర్ జోనర్లో ఆద్యాంత్ హర్ష డైరెక్షన్లో తెరకెక్కిస్తున్నారు. ఈ చిత్రంలో వరుణ్ డిఫరెంట్ లుక్లో కనిపించనున్నారు. తాజాగా ఈ మూవీ ట్రైలర్ మేకర్స్ రిలీజ్ చేశారు. ప్రముఖ దర్శకుడు శ్రీకాంత్ అడ్డాల చేతుల మీదుగా ట్రైలర్ విడుదల చేశారు. ఎం3 మీడియా బ్యానర్లో మహేంద్ర నాథ్ కూండ్ల నిర్మించారు.విరాజి మూవీ కోసం వరుణ్ సందేశ్ తన లుక్ను పూర్తిగా మార్చేశాడు. తాజాగా రిలీజైన ట్రైలర్ చూస్తే ఆత్మలే ప్రధాన కథాంశంగా తెరకెక్కించినట్లు తెలుస్తోంది. ఇందులో వరుణ్ సందేశ్ ఒక డ్రగ్ అడిక్ట్గా కనిపించనున్నారు. 1970లో నిర్మించిన ఓ మెంటల్ ఆస్పత్రిలో జరిగిన సంఘటనల ఆధారంగా రూపొందించినట్లు అర్థమవుతోంది. ట్రైలర్తోనే ఆడియన్స్ను భయపెడుతోన్న ఈ చిత్రం త్వరలోనే థియేటర్లలో సందడి చేయనుంది. ఈ మూవీ ఆగస్టు 2న విడుదల చేయనున్నట్లు మేకర్స్ ప్రకటించారు. కాగా.. ఈ చిత్రంలో రఘు కారుమంచి, ప్రమోదిని, బలగం జయరామ్, వైవా రాఘవ, ఫణి ఆచార్య, అపర్ణాదేవి, ప్రసాద్ బెహరా ప్రధాన పాత్రలో నటించారు. View this post on Instagram A post shared by Varun Sandesh (@itsvarunsandesh)
![Getup Srinu Latest Movie Streaming On This Ott Platform Details Inside](/sites/default/files/styles/webp/public/article_images/2024/07/18/rajuyadav.jpg.webp?itok=qYyxtamU)
ఓటీటీకి టాలీవుడ్ కమెడియన్ సినిమా.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే?
కమెడియన్ గెటప్ శీను, అంకితా కారత్ జంటగా నటించిన చిత్రం ‘రాజు యాదవ్. మే 24న థియేటర్లలోకి వచ్చిన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద మిక్స్డ్ టాక్ను సొంతం చేసుకుంది. ఈ చిత్రానికి కృష్ణమాచారి దర్శకత్వం వహించారు. తాజాగా ఈ సినిమా ఓటీటీకి వచ్చేందుకు సిద్ధమైంది. రెండు నెలల్లోపే ఓటీటీల్లో సందడి చేయనుంది. ఈ విషయాన్ని ప్రముఖ ఓటీటీ సంస్థ ఆహా వెల్లడించింది.ఈనెల 24 నుంచి ఆహాలో స్ట్రీమింగ్ కానున్నట్లు ట్వీట్ చేసింది. ఈ మేరకు గెటప్ శ్రీనుతో ఓ స్పెషల్ వీడియోను పోస్ట్ చేసింది.రాజు యాదవ్ కథేంటంటే..'రాజు యాదవ్' విషయానికొస్తే.. రాజు యాదవ్ ముఖానికి క్రికెట్ బాల్ తగలడంతో ఆపరేషన్ చేస్తారు. అది ఫెయిలవుతుంది. దీంతో ఫేస్ నవ్వుతున్నట్లే ఉండిపోతుంది. కొన్నాళ్లకు స్వీటీ (అంకితా కారత్) అనే అమ్మాయిని చూసి ఇష్టపడతాడు. ఆమెకి హైదరాబాద్లో జాబ్ రావడంతో రాజు యాదవ్ కూడా అక్కడికెళ్లి క్యాబ్ డ్రైవర్గా మారతాడు. ఆ తర్వాత అమ్మాయి.. ఇతగాడికి కొన్ని షాకులిస్తుంది. చివరకు ఏమైందనేదే కథ. థియేటర్లలో చూడని వారు.. ఎంచక్కా ఓటీటీలో చూసి ఎంజాయ్ చేయండి.Raju yadav manodu, mee aha lo vasthunnadu!😎Yaadh maravakurri...ee month 24th na vasthundu🕺🏻The Crazy Entertainer #RajuYadav premieres July 24th only on aha!@getupsrinu3 @RocketRaghava @mirchihemant @iamankitakharat @actorchakrapani @PawonRamesh @PrashanthUttar1 pic.twitter.com/3ANM2lU4XF— ahavideoin (@ahavideoIN) July 18, 2024
![Bollywood Avtress Urvashi Rautela Leaks Audio Clip Of Conversation With Manager](/sites/default/files/styles/webp/public/article_images/2024/07/18/u_0.jpg.webp?itok=dhweUDyZ)
హీరోయిన్ ఆడియో క్లిప్ లీక్.. మండిపడుతున్న నెటిజన్స్!
బాలీవుడ్ భామ ఊర్వశి రౌతేలా గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. టాలీవుడ్లో వాల్తేరు వీరయ్య, ఏజెంట్ చిత్రాల్లో ప్రత్యేక సాంగ్స్లో మెరిసింది. ప్రస్తుతం బాలకృష్ణ నటిస్తున్న ఎన్బీకే 109లోనూ కనిపించనుంది. అంతేకాకుండా బ్లాక్ రోజ్ అనే మరో తెలుగు సినిమా కూడా ఆమె చేస్తోంది. అయితే తాజాగా బాలీవుడ్లో ఆమెజేఎన్యూ: జహంగీర్ నేషనల్ యూనివర్సిటీ చిత్రంలో నటిస్తోంది.అయితే తాజాగా ఊర్వశి రౌతేలా తన మేనేజర్తో మాట్లాడుతున్న కాల్ ఆడియో నెట్టింట వైరల్గా మారింది. తన మేనేజర్తో ఇటీవల బాత్రూమ్ వీడియో లీక్ కావడంపై ఆమె మాట్లాడింది. అసలు ఈ వీడియో బయటకు ఎలా వచ్చింది? ఆ వీడియో మీరు చూశారా? అని ఊర్వశి రౌతేలా ప్రశ్నించింది. దీనిపై మేనేజర్ స్పందిస్తూ.. మన టీమ్ సోషల్ మీడియా నుంచి ఆ వీడియో డిలీట్ చేయడానికి ప్రయత్నిస్తుందని చెబుతారు. అసలు ఇదంతా ఎలా జరిగిందని అసహనం వ్యక్తం చేస్తుంది. అయితే ఈ కాల్ రికార్డ్ సైతం నెట్టింట లీక్ కావడంతో నెటిజన్స్ మండిపడుతున్నారు. వీడియోతో పాటు కాల్ రికార్డింగ్ కూడా బయటకు రావడంతో మరింత హాట్ టాపిక్గా మారింది.అయితే ఇదంతా ఊర్వశి రౌతేలా పబ్లిషిటీ స్టంట్ అంటూ నెటిజన్స్ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ చీప్గా పబ్లిషిటీ స్టంట్స్ చేస్తారా అంటూ నిలదీస్తున్నారు. త్వరలోనే జేఎన్యూ మూవీ రిలీజ్ ఉండడంతో ఇదంతా ప్రమోషన్లలో భాగమేనని భావిస్తున్నారు. అయితే ఆడియో లీక్ కావడంపై ఊర్వశి రౌతేలా ఇంకా స్పందించలేదు. View this post on Instagram A post shared by Viral Bhayani (@viralbhayani)
క్రీడలు
![Hardik Pandya Divorce Announcement](/sites/default/files/styles/webp/public/article_images/2024/07/19/HardikPandya.jpg.webp?itok=TjnOAcr-)
నటాషాతో హార్దిక్ పాండ్యా విడాకులు... స్టార్ ప్లేయర్ అధికారిక ప్రకటన
న్యూఢిల్లీ: భారత ఆల్రౌండర్ హార్దిక్ పాండ్యా తన వ్యక్తిగత జీవితానికి సంబంధించి కీలక విషయాన్ని వెల్లడించాడు. తన భార్య నటాషా స్టన్కోవిచ్తో వివాహ బంధం ముగిసినట్లు అతను అధికారికంగా ప్రకటించాడు. తామిద్దరం పరస్పర అంగీకారంతో విడాకులు తీసుకున్నట్లు పాండ్యా పేర్కొన్నాడు. వీరిద్దరికి 2020లో వివాహం కాగా...అగస్త్య అనే నాలుగేళ్ల కొడుకు ఉన్నాడు. సెర్బియాకు చెందిన స్టన్కోవిచ్ మోడలింగ్, సినిమాల్లో నటిస్తూ ముంబైలో స్థిరపడిన సమయంలో పాండ్యాతో పరిచయం ప్రేమగా మారి పెళ్లి వరకు వెళ్లింది. గత కొంత కాలంగా పాండ్యా, స్టన్కోవిచ్ మధ్య విభేదాల గురించి వార్తలు వస్తూనే ఉన్నాయి. అయితే ఇద్దరూ దీనిపై ఎప్పుడూ స్పందించలేదు. మరోవైపు విడాకుల తర్వాత కూడా కొడుకుతో మాత్రం తల్లిదండ్రులుగా తమ ఇద్దరి బంధం కొనసాగుతుందని, అతని కోసం అన్ని బాధ్యతలు తీసుకుంటామని పాండ్యా స్పష్టం చేశాడు.
![India vs Pakistan match in Asia Cup womens today](/sites/default/files/styles/webp/public/article_images/2024/07/19/wmns.jpg.webp?itok=MLyDAlIf)
భారత్-పాక్ మ్యాచ్ నేడే..
దంబుల్లా: మహిళల ఆసియా కప్ క్రికెట్ టోర్నమెంట్లో భారత్కు ఘనమైన రికార్డు ఉంది. వన్డే ఫార్మాట్లో నాలుగు సార్లు టోర్నీ జరగ్గా... ప్రతీ సారి విజేతగా భారత్ నిలిచింది. టి20 ఫార్మాట్లో నాలుగుసార్లు టోర్నీ నిర్వహిస్తే ఒక్కసారి మినహా మూడు సార్లు భారతే చాంపియన్. ఒక్క 2018లో మాత్రమే ఫైనల్లో భారత్ను ఓడించి బంగ్లాదేశ్ ట్రోఫీ అందుకుంది. ఈ నేపథ్యంలో హర్మన్ప్రీత్ కౌర్ నాయకత్వంలోని భారత జట్టు మరోసారి ఫేవరెట్ ఆసియా కప్ టి20 టోర్నీలో బరిలోకి దిగుతోంది. నేటి నుంచి జరిగే ఈ పోరులో పాకిస్తాన్, శ్రీలంక, బంగ్లాదేశ్లతో పాటు అసోసియేట్ టీమ్లు యూఏఈ, నేపాల్, థాయ్లాండ్, మలేసియా కూడా తమ అదృష్టాన్ని పరీక్షించుకునేందుకు సిద్ధమయ్యాయి. ఎనిమిది జట్లను రెండు గ్రూప్లుగా విభజించారు. లీగ్ దశ అనంతరం టాప్–2 టీమ్లు సెమీస్ చేరతాయి. ఈ నెల 28న ఫైనల్ నిర్వహిస్తారు. శుక్రవారం భారత్ తమ తొలి మ్యాచ్లో పాకిస్తాన్ను ఎదుర్కొంటోంది. ఇరు జట్ల మధ్య ఇప్పటి వరకు 14 మ్యాచ్లు జరిగాయి. భారత్ 11 గెలిచి, 3 మాత్రమే ఓడింది. టోర్నీలో భాగంగా ఈ నెల 21 యూఏఈతో, 23న నేపాల్తో భారత్ తలపడుతుంది. ఫామ్లో ఉన్న హర్మన్ బృందం ఇటీవల సొంతగడ్డపై దక్షిణాఫ్రికాతో జరిగిన టి20 సిరీస్ను 1–1తో సమంగా ముగించగా... అంతకుముందు బంగ్లాదేశ్ను 5–0తో చిత్తు చేసింది.
![Anirudh and Arjun duo defeated the top seed pair](/sites/default/files/styles/webp/public/article_images/2024/07/19/anirudh.jpg.webp?itok=6UyRpRkk)
టాప్ సీడ్ జోడీని ఓడించిన అనిరుధ్–అర్జున్ ద్వయం
హాల్ ఆఫ్ ఫేమ్ ఓపెన్ ఏటీపీ–250 టెన్నిస్ టోర్నీలో హైదరాబాద్ ప్లేయర్ అనిరుధ్ చంద్రశేఖర్ పురుషుల డబుల్స్లో క్వార్టర్ ఫైనల్లోకి దూసుకెళ్లాడు. అమెరికాలో జరుగుతున్న ఈ టోర్నీ తొలి రౌండ్ మ్యాచ్లో అనిరుద్–అర్జున్ ఖడే (భారత్) ద్వయం 6–3, 3–6, 10–7తో టాప్ సీడ్, 28వ ర్యాంక్ జోడీ లామోన్స్ –విత్రో (అమెరికా)ను బోల్తా కొట్టించింది. ప్రస్తుతం అనిరుధ్ 128వ ర్యాంక్లో, అర్జున్ 111వ ర్యాంక్లో ఉన్నారు.
![Ruturaj Gaikwad, Abhishek Sharma Not Selected For Sri Lanka Series](/sites/default/files/styles/webp/public/article_images/2024/07/18/sww.jpg.webp?itok=2Q1jjaHd)
రుతురాజ్, అభిషేక్లకు మొండిచెయ్యి.. వన్డేల్లో సంజూను నో ఛాన్స్
త్వరలో శ్రీలంకతో జరుగబోయే పరిమిత ఓవర్ల సిరీస్ల కోసం భారత జట్లను ఇవాళ (జులై 18) ప్రకటించారు. వన్డే జట్టుకు రోహిత్ శర్మ కెప్టెన్గా కొనసాగనుండగా.. టీ20 జట్టు నూతన కెప్టెన్గా సూర్యకుమార్ యాదవ్ ఎంపికయ్యాడు.ఇరు జట్లకు వైస్ కెప్టెన్గా శుభ్మన్ గిల్ వ్యవహరించనుండగా.. రిషబ్ పంత్, రియాన్ పరాగ్, శుభ్మన్ గిల్, మహ్మద్ సిరాజ్, వాషింగ్టన్ సుందర్, శివమ్ దూబే, అర్షదీప్ సింగ్, అక్షర్ పటేల్, ఖలీల్ అహ్మద్ రెండు జట్లలో చోటు దక్కించుకున్నారు.వన్డే జట్టుకు హర్షిత్ రాణా కొత్తగా ఎంపిక కాగా.. కేఎల్ రాహుల్, శ్రేయస్ అయ్యర్ వన్డేల్లోకి రీఎంట్రీ ఇచ్చారు. టీ20 వరల్డ్కప్ అనంతరం పొట్టి ఫార్మాట్కు వీడ్కోలు పలికిన రోహిత్, కోహ్లి వన్డేల్లో కొనసాగనుండగా.. హార్దిక్ పాండ్యాకు వన్డే జట్టులో చోటు దక్కలేదు.రుతురాజ్, అభిషేక్లకు మొండిచెయ్యి.. వన్డేల్లో సంజూను నో ఛాన్స్తాజాగా జింబాబ్వేతో జరిగిన టీ20 సిరీస్లో సెంచరీతో మెరిసిన అభిషేక్ శర్మ.. గత ఏడు టీ20 ఇన్నింగ్స్ల్లో 70కి పైగా సగటుతో పరుగులు చేసిన రుతురాజ్ గైక్వాడ్ రెండు జట్లలో (టీ20, వన్డే) చోటు దక్కించుకోలేకపోయారు. టీ20ల్లో ఫస్ట్ ఛాయిస్ ఓపెనర్లుగా శుభ్మన్ గిల్, యశస్వి జైస్వాల్ ఎంపికయ్యారు. తానాడిన చివరి వన్డేలో (సౌతాఫ్రికా) సెంచరీ చేసిన సంజూ శాంసన్ వన్డే జట్టులో చోటు దక్కించుకోలేకపోయాడు.కాగా, టీమిండియా.. మూడు మ్యాచ్ల టీ20, వన్డే సిరీస్ల కోసం శ్రీలంకలో పర్యటించనుంది. ఈ పర్యటనలో తొలుత టీ20 సిరీస్ జరుగనుంది. ఈ నెల 27, 28, 30 తేదీల్లో మూడు టీ20లు జరుగనున్నాయి. అనంతరం ఆగస్ట్ 2, 4, 7 తేదీల్లో మూడు వన్డేలు జరుగుతాయి. టీ20 సిరీస్ మొత్తం పల్లెకెలెలో.. వన్డే సిరీస్ కొలొంబోలో జరుగనుంది.భారత టీ20 జట్టు: సూర్యకుమార్ యాదవ్ (కెప్టెన్), శుభ్మన్ గిల్ (వైస్ కెప్టెన్), యశస్వి జైస్వాల్, రిషబ్ పంత్, రింకూ సింగ్, సంజూ శాంసన్, హార్దిక్ పాండ్యా, శివమ్ దూబే, అక్షర్ పటేల్, వాషింగ్టన్ సుందర్, రవి బిష్ణోయ్, అర్ష్దీప్ సింగ్, ఖలీల్ అహ్మద్, మహ్మద్ సిరాజ్భారత వన్డే జట్టు: రోహిత్ శర్మ (కెప్టెన్), శుభ్మన్ గిల్ (వైస్ కెప్టెన్), విరాట్ కోహ్లి, కేఎల్ రాహుల్, శ్రేయస్ అయ్యర్, రిషబ్ పంత్, శివమ్ దూబే, కుల్దీప్ యాదవ్, మహ్మద్ సిరాజ్, వాషింగ్టన్ సుందర్, అర్ష్దీప్ సింగ్, రియాన్ పరాగ్, అక్షర్ పటేల్, ఖలీల్ అహ్మద్, హర్షిత్ రాణా.
బిజినెస్
![MSME sector eyes double loan limit under MUDRA to Rs 20 lakh](/sites/default/files/styles/webp/public/article_images/2024/07/19/MUDRA-LOANS.jpg.webp?itok=KHNWSV9v)
ముద్రా రుణాల పరిమితి రెట్టింపు చేయాలి
రాబోయే బడ్జెట్లో ముద్రా యోజన కింద ఇచ్చే రుణాల పరిమితిని రెట్టింపు చేయాలని, రూ. 10 లక్షల నుంచి రూ. 20 లక్షలకు పెంచాలని చిన్న, మధ్య తరహా సంస్థలు (ఎంఎస్ఎంఈ) కేంద్రాన్ని కోరుతున్నాయి. అలాగే అన్సెక్యూర్డ్ రుణాలకు రుణ హామీ కవరేజీని రూ. 2 కోట్ల నుంచి రూ. 5 కోట్లకు పెంచాలని ఆశిస్తున్నాయి. అటు అంతర్జాతీయంగా తమ ఉత్పత్తులను విక్రయించుకోవడానికి తగు మద్దతు కూడా కలి్పంచాలని కోరుకుంటున్నాయి. ఎంఎస్ఎంఈల వృద్ధికి ఊతమిచ్చేలా ప్రభుత్వం తన ఎజెండాను కొనసాగించే అవకాశం ఉందని బడ్జెట్పై నెలకొన్న అంచనాలను అర్క ఫిన్క్యాప్ చీఫ్ బిజినెస్ ఆఫీసర్ నవీన్ సైనీ తెలిపారు. ముద్రా రుణాల పరిమితిని పెంచడం తదితర అంశాలతో ఎంఎస్ఎంఈలకు మరిన్ని ఆర్థిక వనరులు అందుబాటులోకి రాగలవని, వాటి ఎదుగుదలతో పాటు ఎకానమీ వృద్ధికి కూడా దోహదపడగలవని వివరించారు. రియల్టీ ఆశలు.. బడ్జెట్పై రియల్ ఎస్టేట్ రంగానికి చాలా ఆశలు ఉన్నట్లు క్రిసుమి కార్పొరేషన్ ఎండీ మోహిత్ జైన్ తెలిపారు. ప్రత్యక్ష పన్ను వసూళ్లు రికార్డు స్థాయికి చేరడంలో వేతన జీవులు కీలక పాత్ర పోషిస్తున్న నేపథ్యంలో గృహ రుణాలపై చెల్లించే అసలు, వడ్డీపై పన్ను మినహాయింపు పరిమితిని పెంచాల్సిన అవసరం ఉందని ఆయన చెప్పారు. గత కొన్నాళ్లుగా ప్రాపరీ్టల విలువ భారీగా పెరిగినందున గృహ రుణ వడ్డీపై పన్ను రిబేటును ప్రస్తుతమున్న రూ. 2 లక్షల నుంచి రూ. 5 లక్షలకు పెంచాలని పేర్కొన్నారు. మరోవైపు స్టార్టప్ల కోసం పన్నుల విధానాన్ని సరళతరం చేస్తే అంకుర సంస్థలకు ఊరట లభించగలదని సీఆర్ఐబీ సహ వ్యవస్థాపకుడు సన్నీ గర్గ్ తెలిపారు. ఏంజెల్ ట్యాక్స్ను తొలగించడం లేదా క్రమబదీ్ధకరించడమో చేస్తే దేశీయంగా నిధుల లభ్యత మెరుగుపడుతుందని, ప్రారంభ దశలోని అంకుర సంస్థలకు ఫండింగ్పరమైన వెసులుబాటు లభించగలదని పేర్కొన్నారు. – సాక్షి, బిజినెస్ డెస్క్
![Infosys Q1 net profit rises 7. 1percent to Rs 6,368 crore hikes FY25 growth](/sites/default/files/styles/webp/public/article_images/2024/07/19/INFOSYS-CEO-PAREKH-CFO-JAYE.jpg.webp?itok=fz5VK8qI)
ఇన్ఫోసిస్.. గుడ్
న్యూఢిల్లీ: సాఫ్ట్వేర్ సేవల దిగ్గజం ఇన్ఫోసిస్ ప్రస్తుత ఆర్థిక సంవత్సరం(2024–25) తొలి త్రైమాసికంలో ఆసక్తికర ఫలితాలు ప్రకటించింది. కన్సాలిడేటెడ్ ప్రాతిపదికన ఏప్రిల్–జూన్(క్యూ1)లో నికర లాభం 7 శాతం పుంజుకుని రూ. 6,368 కోట్లను తాకింది. గతేడాది(2023–24) ఇదే కాలంలో రూ. 5,945 కోట్లు ఆర్జించింది. అయితే త్రైమాసిక(క్యూ4)వారీగా చూస్తే నికర లాభం రూ. 7,969 కోట్ల నుంచి 20 శాతం క్షీణించింది. మొత్తం ఆదాయం 3.6 శాతం మెరుగుపడి రూ. 39,315 కోట్లకు చేరింది. గత క్యూ1లో రూ. 37,933 కోట్ల టర్నోవర్ సాధించింది. ప్రస్తుత ఆరి్థక సంవత్సరాన్ని ప్రోత్సాహకరంగా ప్రారంభించిననట్లు ఇన్ఫోసిస్ సీఈవో సలీల్ పరేఖ్ పేర్కొన్నారు. మెరుగైన మార్జిన్లు, భారీ డీల్స్, రికార్డ్ నగదు ఆర్జనను సాధించినట్లు తెలియజేశారు. ఈ షేరు బీఎస్ఈలో 2% ఎగసి రూ. 1,759 వద్ద ముగిసింది. 3–4 శాతం వృద్ధి తాజా త్రైమాసికంలో ఇన్ఫోసిస్ నిర్వహణ లాభ మార్జిన్లు 0.3 శాతం బలపడి 21.1 శాతంగా నమోదయ్యాయి. పూర్తి ఏడాదికి 20–22 శాతం మార్జిన్లు సాధించగలమని అంచనా వేస్తోంది. పూర్తి ఏడాదికి ఆదాయంలో నిలకడైన కరెన్సీ ప్రాతిపదికన 3–4 శాతం వృద్ధిని సాధించగలమని కంపెనీ తాజాగా అంచనా వేసింది. గతంలో విడుదల చేసిన 1–3 శాతం వృద్ధి అంచనాల (గైడెన్స్)ను ఎగువముఖంగా సవరించింది. ఇతర విశేషాలు → క్యూ1లో కంపెనీ చరిత్రలోనే అత్యధికంగా రూ. 9,155 కోట్ల ఫ్రీ క్యాష్ ఫ్లో సాధించింది. ఇది 59 శాతం వృద్ధి. → ఈ ఏడాది సాధించగల వృద్ధి ఆధారంగా 15,000 నుంచి 20,000మంది వరకూ ఫ్రెషర్స్కు ఉపాధి కలి్పంచే వీలున్నట్లు ఇన్ఫోసిస్ సీఎఫ్వో జయేష్ ఎస్. తెలియజేశారు. → క్యూ1లో కంపెనీ చరిత్రలోనే అత్యధికంగా 4.1 బిలియన్ డాలర్ల విలువైన 34 భారీ డీల్స్ను కుదుర్చుకుంది. ఇవి 78 శాతం అధికంకాగా.. వీటిలో కొత్త కాంట్రాక్టుల వాటా 58 శాతం. → ఉద్యోగుల సంఖ్య 6 శాతం తగ్గి 3,15,332కు పరిమితమైంది. గతేడాది క్యూ1లో మొత్తం సిబ్బంది సంఖ్య 3,36,294కాగా.. జనవరి–మార్చి(క్యూ4)లో 3,17,240గా నమోదైంది. → స్వచ్ఛంద ఉద్యోగ వలసల(అట్రిషన్) రేటు 12.7 శాతంగా నమోదైంది. గత క్యూ1లో ఇది 17.3 శాతంకాగా.. క్యూ4లో 12.6 శాతంగా నమోదైంది.
![FASTag Rule Update Get Ready To Pay Double Toll Fee](/sites/default/files/styles/webp/public/article_images/2024/07/18/FASTag.jpg.webp?itok=8nlfatrS)
ఎన్హెచ్ఏఐ కొత్త రూల్.. ఇలా చేస్తే రెట్టింపు టోల్ ఫీజు
టోల్ గేట్స్ వద్ద వేచి ఉండాల్సిన సమయాన్ని తగ్గించడానికి నేషనల్ హైవేస్ అథారిటీ ఆఫ్ ఇండియా (NHAI) ఫాస్ట్ట్యాగ్ ప్రవేశపెట్టింది. ఈ ఫాస్ట్ట్యాగ్ విధానం అమలులోకి వచ్చిన తరువాత టోల్ గేట్స్ వద్ద వేచి ఉండాల్సిన సమయం బాగా తగ్గింది. అయితే కొంతమంది వాహనదారులు ఫాస్ట్ట్యాగ్ను విండ్ స్క్రీన్ మీద కాకుండా.. ఇతర ప్రదేశాల్లో అంటించి టోల్ ప్లాజాల వద్ద అనవసర ఆలస్యాలకు కారణమవుతున్నారు. దీనిని దృష్టిలో ఉంచుకుని ఎన్హెచ్ఏఐ కొత్త మార్గదర్శకాలను ప్రవేశపెట్టింది.ఎన్హెచ్ఏఐ కొత్త మార్గదర్శకాల ప్రకారం.. వెహికల్ విండ్స్క్రీన్ మీద కాకుండా ఫాస్ట్ట్యాగ్ను ఇతర ప్రదేశాలలో అంటిస్తే అలాంటి వారి నుంచి డబుల్ టోల్ ఫీజు వసూలు చేయనున్నట్లు సమాచారం. కాబట్టి తప్పకుండా వాహనదారులు ఫాస్ట్ట్యాగ్ను విండ్స్క్రీన్పై అంటించాలి.కొందరు వాహనదారులు విండ్స్క్రీన్ మీద ఫాస్ట్ట్యాగ్ను అంటించకపోవడం వల్ల టోల్ ప్లాజాలో అనవసరమైన ఆలస్యానికి కారణమవుతున్నారు. కాబట్టి ఇకపై అలా చేసేవారు రెట్టింపు టోల్ ఫీజును చెల్లించాల్సి ఉంటుంది. ఈ విషయాన్ని వాహన వినియోగదారులు తప్పకుండా గుర్తుంచుకోవాల్సి ఉంటుంది.విండ్స్క్రీన్ మీద ఫాస్ట్ట్యాగ్ను అంటిస్తే టోల్ ప్లాజాలో తొందరగా ట్రాన్సక్షన్ జరుగుతుంది. అప్పుడు గేట్ వేంగంగా ఓపెన్ అవుతుంది. అప్పుడు వెనుక వచ్చే వాహనదారులు కూడా వేగంగా ముందుకు వెళ్ళవచ్చు. అలా కాకూండా ఫాస్ట్ట్యాగ్ అడ్డదిడ్డంగా, ఎక్కడపడితే అక్కడ అంటిస్తే వారికి మాత్రమే కాకుండా.. వెనుక వచ్చే ప్రయాణికులకు ఇబ్బంది కలుగుతుంది.
![BSNL Gains Subscribers After Tariff Hikes](/sites/default/files/styles/webp/public/article_images/2024/07/18/bsnl-network.jpg.webp?itok=t7wlV03Z)
రీఛార్జ్ ప్లాన్స్ ఎఫెక్ట్.. ఇప్పుడు అందరి చూపు దానివైపే..
ఇటీవల జియో, ఎయిర్టెల్, వోడాఫోన్ ఐడియా వంటి టెలికాం దిగ్గజాలు రీఛార్జ్ ప్లాన్స్ ధరలను భారీగా పెంచాయి. పెరిగిన రీఛార్జ్ ప్లాన్స్ అన్నీ కూడా యూజర్లను ఒక్కసారిగా ఆందోళనకు గురి చేసింది. ఈ తరుణంలో యూజర్ల చూపు గవర్నమెంట్ టెలికాం సంస్థ భారత్ సంచార్ నిగమ్ లిమిటెడ్ (బీఎస్ఎన్ఎల్) వైపు పడింది.రీఛార్జ్ ప్లాన్స్ ధరలు పెరగడంతో బీఎస్ఎన్ఎల్ నెట్వర్క్కు మారుతున్న యూజర్ల సంఖ్య భారీగా పెరుగుతున్నట్లు సమాచారం. దీనికి కారణం ఇతర టెలికాం సంస్థలతో పోలిస్తే బీఎస్ఎన్ఎల్ చార్జీలు తక్కువగా ఉండటమే. డేటా కోసం కాకుండా.. కేవలం కాల్స్ కోసం మాత్రమే ఉపయోగించేవారు బీఎస్ఎన్ఎల్ నెట్వర్క్ తీసుకోవడానికి ఆసక్తి చూపుతున్నారు.2024 జులై 3, 4 తేదీల నుంచి జియో, ఎయిర్టెల్, వొడాఫోన్ ఐడియాల టారిఫ్ ధరలు 15 శాతం నుంచి 20 శాతం పెరిగాయి. ధరలు పెరిగిన వారం రోజుల్లో సుమారు 2.5 లక్షల మంది బీఎస్ఎన్ఎల్కు మొబైల్ నంబర్ పోర్టబిలిటీ ద్వారా మారినట్లు తెలుస్తోంది. మరో 25 లక్షల మంది కొత్త బీఎస్ఎన్ఎల్ కనెక్షన్లు తీసుకున్నట్లు సమాచారం.
ఫ్యామిలీ
![surprising health benefits of green chilli](/sites/default/files/styles/webp/public/article_images/2024/07/18/greenchillies-Healthbenefits.jpg.webp?itok=U4Jpogcd)
పచ్చిమిర్చితో బోలెడు ఆరోగ్యప్రయోజనాలు : కొవ్వును కరిగిస్తుంది కూడా
మన వంటకాల్లో పచ్చిమిర్చి లేదా గ్రీన్ చిల్లీ లేనిదే పని జరగదు. అయితే పచ్చి మిర్చితో కేవలం గూబ గుయ్యిమనే కారం, వంటకు రుచి వస్తుంది అనుకుంటే పొరపాటే. పచ్చిమిర్చితో బోలెడు లాభాలు ఉంటాయంటున్నారు నిపుణులు. రోజూ ఉపయోగిస్తే అనేక అనారోగ్య సమస్యలకు పరిష్కారం చూపుతుందట. అవేంటో ఈ కథనంలో చూసేద్దామా! ఆరోగ్యానికి అద్భుతాలు చేసే పోషకాలతో నిండి ఉంటాయి పచ్చి మిరపకాయలు కేవలం 100 గ్రాముల పచ్చిమిర్చిలో 109.1 మిల్లీ గ్రాముల విటమిన్ సీ ఉంటుంది. అంటే రోజులో మనకు కావాల్సిన దానికంటే ఎక్కువే. పొటాషియం కూడా లభిస్తుంది. పచ్చిమర్చి జీవక్రియను మెరుగుపరుస్తుంది. అంటువ్యాధులతో పోరాడుతుంది. వీటిల్లోని బయోయాక్టివ్ రసాయనం ‘క్యాప్సైసిన్’ గుండె ఆరోగ్యానికి చాలా మేలు చేస్తుంది. క్యాప్సైసిన్ అధిక రక్తపోటు , కొలెస్ట్రాల్ స్థాయిలను తగ్గిస్తుంది. మెరుగైన రక్త ప్రసరణను ప్రోత్సహిస్తుంది. రక్తం గడ్డకట్టడాన్ని నిరోధించవచ్చు, తద్వారా గుండెపోటు స్ట్రోక్స్ ప్రమాదాన్ని తగ్గిస్తుంది.గట్ హెల్త్కు మంచిది క్యాప్సైసిన్ గ్యాస్ట్రిక్ జ్యూస్ ఉత్పత్తిని ప్రేరేపించి జీర్ణ ఆరోగ్యానికి సహజ నివారణగా చేస్తుంది.బరువు తగ్గడంలో గేమ్-ఛేంజర్లా పనిచేస్తుంది. క్యాప్సైసిన్ జీవక్రియను వేగవంతంచేసి కేలరీల బర్న్ను ప్రోత్సహిస్తుంది.విటమిన్ సీ, బీటా-కెరోటిన్తో నిండిన పచ్చి మిరపకాయ యాంటీఆక్సిడెంట్-రిచ్ ప్రొఫైల్, ఇది ఫ్రీ రాడికల్స్తో పోరాడుతుంది. కేన్సర్కు వ్యతిరేకంగా పనిచేస్తుంది. జలుబు , ఫ్లూ నుండి ఉపశమనం కలిగిస్తుందిసహజమైన 'ఫీల్-గుడ్' కెమికల్ పచ్చిమిర్చి. క్యాప్సైసిన్ ఎండార్ఫిన్ల విడుదలను ప్రేరేపిస్తుంది. ఒత్తిడిని తగ్గిస్తుంది. అధిక విటమిన్ సి మానసిక స్థితిని నియంత్రించే సెరోటోనిన్ వంటి న్యూరోట్రాన్స్మిటర్లను సంశ్లేషణ చేయడంలో కీలక పాత్ర పోషిస్తుంది.బీటా-కెరోటిన్ శరీరంలో విటమిన్ ఏ గా మార్చి కంటి ఆరోగ్యాన్ని ప్రోత్సహిస్తుందివయస్సు-సంబంధిత కంటిశుక్లం ప్రమాదాన్ని తగ్గిస్తుంది.పచ్చి మిరపకాయల్లో యాంటీమైక్రోబయల్,యాంటీ ఇన్ఫ్లమేటరీ లక్షణాలు వివిధ చర్మ వ్యాధుల నివారణలో ప్రభావవంతంగా చేస్తాయి. క్యాప్సైసిన్ మొటిమలను కలిగించే బ్యాక్టీరియాను తగ్గిస్తుంది. చర్మానికి సహజ మెరుపునిస్తుంది.రక్తంలో చక్కెర స్థాయిలను నియంత్రిస్తుంది. మధుమేహం లేదా ప్రీ-డయాబెటిస్ ఉన్న వ్యక్తులు, పచ్చి మిరపకాయలను భోజనంలో చేర్చుకోవడం వల్ల రక్తంలో చక్కెర స్థాయిని సమతుల్యమవుతుంది.పచ్చి మిరపకాయలు విటమిన్ సితో నిండి ఉంటాయి.కనుక వి ఇనుము గ్రహించడంలో కీలక పాత్ర పోషిస్తాయి.
![Chilukuri Santhamma Cheering For Usha Chilukuri Vances Victory](/sites/default/files/styles/webp/public/article_images/2024/07/18/Chilukuri-Santhamma.jpg.webp?itok=vxs_FqOd)
ఉషా చిలుకూరి..ఏయూ ప్రొఫెసర్ శాంతమ్మ మనవరాలే..!
అమెరికా ఉపాధ్యక్ష పదవికి రిపబ్లిక్ పార్టీ అభ్యర్థిగా జేడీ వాన్స్ పేరు నామినేట్ అవ్వడంతో ఒక్కసారిగా ఆయన భార్య ఉషా చిలుకూరి పేరు మారుమోగిపోయింది. ఆయన భార్య మన తెలుగింటి అమ్మాయి కావడంతో వాన్స్ తెలుగింటి అల్లుడంటూ ఒక్కసారిగా వార్తలు గుప్పుమన్నాయి. ఒక్కసారిగా భారత మూలాలు ఉన్న ఉషా చిలుకూరి పేరు ప్రాధ్యాన్యత సంతరించుకుంది. పైగా ఆమె భర్త విజయ కోసం భారత్లో ఒక్కసారిగా ఆమె కుటుంబ బలం పెరిగిపోయింది.ఎందుకంటే తెలుగు రాష్టంలో మన అమ్మాయి భర్త పలాన వాళ్లు అంటూ ఆరాలు మొదయ్యిపోయాయి. ఇక ఉషా చిలుకూరికి విశాఖపట్నంలో బంధువులున్నారు. తొమ్మిది పదుల వయసులోనూ ప్రొఫెసర్గా పాఠాలు చెబుతూ ఉత్సాహంగా ఉండే శాంతమ్మ మనవరాలే ఈ ఉష. శాంతమ్మ భర్త చిలుకూరి సుబ్రహ్మణ్యశాస్త్రి. తెలుగు ప్రొఫెసర్గా పనిచేసిన ఆయన కొన్నేళ్ల క్రితం మరణించారు. సుబ్రహ్మణ్యశాస్త్రి సోదరుడు రామశాస్త్రి. ఈయన కుమారుడు రాధాకృష్ణ సంతానమే ఈ ఉష. ఉష భర్త జేడీ వాన్స్ను అమెరికా ఉపాధ్యక్ష అభ్యర్థిగా ఎంపిక చేయడంపై శాంతమ్మ సంతోషం వ్యక్తం చేశారు. ఉష తల్లిదండ్రులు ఎప్పుడో అమెరికాలో స్థిరపడ్డారని, ఆమె అక్కడే పుట్టి పెరగడంతో పరిచయం తక్కువేనన్నారు. వాన్స్ అభ్యర్థిత్వం, మా బంధుత్వం గురించి తెలిశాక పలువురు ఫోన్లో అభినందనలు తెలిపారని చెప్పారు. చెన్నైలో వైద్యురాలిగా ఉన్న ఉష మేనత్త శారద.. వాన్స్, ఉషల వివాహానికి హాజరైనట్లు గుర్తు చేసుకున్నారు. ‘మా బంధువులు అమెరికాలో వివిధ సంస్థల్లో ఉన్నత స్థానాల్లో పనిచేస్తున్నారు. ఉష దంపతులు ఈ స్థాయికి వెళ్లారని తెలియగానే సంతోషంగా, గర్వంగా అనిపించింది. అమెరికా ఉపాధ్యక్షుడి భార్య అయితే ఎక్కువ, లేకపోతే తక్కువ అని కాకుండా నా ఆశీస్సులు వారికి ఎప్పుడూ ఉంటాయి’ అని శాంతమ్మ వివరించారు.ఇక శాతమ్మ ఇంత వయసులోనూ ఓ ప్రైవేటు యూనివర్సిటీలో ఫిజిక్స్ అధ్యాపకురాలిగా పనిచేస్తునే ఉండటం విశేషం. అంతేగాదు ఆమె ఇంటిని కూడా వివేకానంద మెడికల్ ట్రస్ట్కు విరాళంగా ఇచ్చింది. అది ప్రస్తుతం క్లినిక్గా పనిచేస్తుంది. త్వరలో దాన్ని కూడా ఆస్పత్రిగా మార్చనున్నారు. ఆమె 1945లో మహారాజా విక్రమ్ దేవ్ వర్మ నుంచి భౌతికశాస్త్రంలో గోల్డ్ మెడల్ను గెలుచుకుంది. ఆమె అప్పుడు మద్రాసు రాష్ట్రంలోని ఏవీఎన్ కళాశాలలో ఇంటర్మీడియట్ విధ్యార్థిని. ఇక ఆమె బాల్యం దగ్గర కొచ్చేటప్పటికీ..1929 మార్చి 8న మచిలీపట్నంలో జన్మించారు. ఐదు నెలల వయసులోనే తండ్రిని కోల్పోయింది. ఆమె తండ్రి తరఫు మేనమామ వద్ద పెరిగారు. భౌతిక శాస్త్రం ఆమె ఇష్టమైన సబ్జెక్ట్. ఆమె ఏడు దశాబ్దాలుగా ఫిజిక్స్ బోధిస్తూ యువతకు స్ఫూర్తినిస్తుంది. ఆమె 1989లో 60 ఏళ్ల వయసులో పదవీవిరమణ చేశారు. ఆ తర్వాత పరిశోధన వైపు దృష్టిసారించి మళ్లీ ఆంధ్రాయూనివర్సిటీలో గౌరవ అధ్యాపకురాలిగా చేరి ఆరేళ్లు పనిచేశారు. అలా ఆమె తనకు తొమ్మిదపదుల వయసు వచ్చిన బోధనా వృత్తిని మాత్రం వదలలేదు. అంతేగాదు తన తల్లి జాకమ్మ 104 ఏళ్ల వరకు జీవించారని చెబుతారు శాంతమ్మ. "ఆరోగ్యం మన మనస్సులో సంపద మన హృదయంలో" ఉంటుందని చెబుతుంటారామె. తాను తన చివరి శ్వాస వరకు బోధిస్తూనే ఉంటానని ఆత్మవిశ్వాసంగా చెబుతున్నారు శాంతమ్మ. (చదవండి: సాహో... ప్రొఫెసర్ శాంతమ్మ!)(చదవండి: యూకే తొలి మహిళా ఆర్థిక మంత్రిగా రాచెల్ రీవ్స్ ..బడ్జెట్ బాధ్యత ఆమెదే..!)
![BITS Pilani Dropout youtuber earns rs 35 Lakh Last Month Ashneer Grover shocking Reaction](/sites/default/files/styles/webp/public/article_images/2024/07/18/Ishan%20Sharma-35lakhs.jpg.webp?itok=folsUIyS)
నెలకు రూ. 35 లక్షలేంటి బ్రో! దిగ్గజాల షాకింగ్ రియాక్షన్
బిట్స్ పిలానీ డ్రాప్అవుట్, 20యేళ్ల యూట్యూబర్ ఇషాన్ శర్మ సంపాదన బిజినెస్ దిగ్గజాలను సైతం దిగ్భ్రాంతికి గురిచేసింది 2024లో బిజినెస్ ఎలా స్టార్ట్ చేయాలి ‘లీక్డ్’ పేరుతో నిర్వహించిన పోడ్కాస్ట్లో ఇషాన్ కొన్ని ఆసక్తికర విషయాలను పంచకున్నారు. దీనికి సంబంధించిన చిన్న క్లిప్ ఎక్స్లో వైరల్గా మారింది.విషయం ఏమిటంటే 2024లో వ్యాపారం ఎలా ప్రారంభించాలి అనే అంశంపై భారత్పే ఫౌండర్ అష్నీర్ గ్రోవర్, ఆఫ్బిజినెస్ సహ వ్యవస్థాపకుడు సీఈవో, ఆక్సిజో ఫైనాన్షియల్ సర్వీసెస్ కో ఫౌండర్ ఆసిష్ మోహపాత్ర, సార్థక్ అహుజా, ఇంకా నౌకరీ డాట్కాంకు చెందిన ఇన్ఫో ఎడ్జ్ వ్యవస్థాపకుడు సంజీవ్ బిఖ్చందానీలతో షార్క్ ట్యాంక్ సీజన్1 పోడ్కాస్ట్లో భాగంగా ముచ్చటించాడు. ఈసందర్భంగా తాను గత నెలలో రూ. 35 లక్షలు సంపాదించానని, తాను వ్యాపారంలోకి ఇదే పెద్ద సమస్యగా మారిందంటూ వెల్లడించాడు. దీంతో ఒక్కసారిగా దిగ్భ్రాంతికి లోను కావడం అష్నీర్ గ్రోవర్ వంతైంది. ఈ వయస్సులో అద్భుతం ప్రశంసనీయం అటూ ఇషాన్శర్మపై పొగడ్తలు కురిపించాడు. "నెలకు రూ. 35 లక్షలు సంపాదిస్తావా? అంటూ ఆశ్చర్యపోయాడు. అందేకాదు ‘బాబూ నువ్వు ఇక్కడ కూచోవాలి, అక్కడ కాదు (ఇంటర్వ్యూ చేసే ప్లేస్)’’ అంటూ చమత్కరించాడు. అటు నెటిజన్లుపై అతనిపై ప్రశంసలు కురిపించారు.Shocking Reaction of Ashneer Grover and Sanjeev Bikchandani After Knowing Ishaan Makes Over ₹35 Lakhs a MonthThis is Excellent, Commendable at His Age pic.twitter.com/BCmO60Vgl9— Ravisutanjani (@Ravisutanjani) July 17, 2024 ‘‘ఇది చూసిన కుర్రాళ్లకు తామేమీ సాధించలేదనే ఆందోళన (ఫోమో) పట్టుకుంటుంది. నాకు 23 ఏళ్లు, నయాపైసా సంపాదన లేదు, నాన్న మీదే అధారపడుతున్నా... కానీ ఏదో ఒకరోజు ఇతనికి పోటీగా సంపాదిస్తా అని ఒకరు, ఇది చూసే దాకా నా రోజు చాలా బాగుంది. నెలకు 35 లక్షల రూపాయలు సింపుల్ మనీ అంటాడేంటి భయ్యా అని మరొక నెటిజన్ వ్యాఖ్యానించాడు.
![Bhumi Pednekars Impressive Weight Loss Journey: Lost 32 Kgs In 4 Months](/sites/default/files/styles/webp/public/article_images/2024/07/18/bhumi.jpg.webp?itok=8vNWY5aV)
స్లిమ్గా మారిన భూమి పడ్నేకర్!.. జస్ట్ నాలుగు నెలల్లో ఏకంగా..!
బాలీవుడ్ నటి భూమి పెడ్నేకర్ ఎంత లావుగా ఉండేదో అందరకీ తెలిసిందే. ఆమె తన తొలి చిత్రం దమ్ లగా కే హైషా కోసం 32 కిలోలు పెరిగి ట్రోలింగ్కి గురయ్యింది. ఆ మూవీలో ఆమె అధిక బరువుతో ఉండే భార్య పాత్రను పోషించింది. అయితే ఆమె సినిమా షూటింగ్ అయిపోయిన వెంటనే బరువు తగ్గే ఫిట్నెస్ ప్రయాణంపై దృష్టిసారించింది. అయితే అనేహ్యంగా జస్ట్ 4 నెలల్లోనే మంచిగా బరువు తగ్గి అందర్నీ ఆశ్చర్యపరిచింది. అంతేగాదు అందుకు తనకు ఉపకరించిన డైట్ ప్లాన్లు, ఫిట్నెస్ చిట్కాలను కూడా చెప్పుకొచ్చింది. అవేంటంటే..భూమి ఫడ్నేకర్ ఆరోగ్యకరమైన రీతిలో బరువు తగ్గే క్రమాన్ని ఎంచుకుంది. తనకు ఇష్టమైన ఆహారాన్ని త్యాగం చేయలేదట. నచ్చినవన్నీ మితంగా తీసుకుంటూ ఉండేది. ప్రధానంగా ఇంట్లో వండిన ఆహారానికే ప్రాధాన్యత ఇచ్చినట్లు తెలిపింది. ఎక్కువగా గుడ్లు, మిస్సీ రోటీ, ఉప్మా, పోహా, గ్రిల్డ్ చికెన్, మల్టీ-గ్రెయిన్ రోటీలు, రాజ్గిరా వంటి ఫుడ్స్ తీసుకునేది. ఉదయ స్కిమ్డ్ పాల తోపాటు ముసేలి తీసుకున్నట్లు చెప్పుకొచ్చింది. మధ్యాహ్న భోజనంలో పప్పుతో కూడిన ఆహారం తప్పక తీసుకున్నట్లు పేర్కొంది. ఇక సాయంత్రం స్నాక్స్, కప్పు గ్రీన్ టీ తోపాటు పండ్లు ఉండాల్సిందే. అలాగే బాదం, వాల్నట్లను తినేందుకు ఇష్టపడేది. రాత్రి 8.30 గంటలకు డిన్నర్ చేయడానికి ఇష్టపడేది. అయితే భోజనంలో కాల్చిన చేపలు, చికెన్, పనీర్, టోపు, ఉడికించిన కూరగాయలను తీసుకున్నట్లు వివరించింది భూమి. వర్కౌట్లు..భూమి హై ఇంటెన్సిటీ కసరత్తుల జోలికి పోలేదు. కానీ పరిగెత్తడం, ఫంక్షనల్ శిక్షణ, స్విమ్మింగ్, డ్యాన్స్, ఏరోబిక్స్, వంటి వ్యాయామాలు చేసింది. బరువు తగ్గిన తర్వాత కూడా ఫిట్గా ఉండేలా కార్డియో, వెయిట్ లిఫ్టింగ్, పైలేట్స్, స్ట్రెచింగ్లను వంటివి చేస్తూనే ఉంది. అయితే షుగర్కి మాత్రం దూరంగానే ఉంది. తొందరగా బరువు తగ్గేలా అన్ని రకాల స్వీట్స్కి దూరంగా ఉన్నట్లు తెలిపింది భూమి. అలాగే రాత్రిపూట పిండిపదార్థాలు తీసుకోవడం తగ్గించింది. ఇక ప్రతిరోజూ కనీసం ఆరు నుంచి ఏడు లీటర్ల నీటిని కచ్చితంగా తాగేది. ఈ విధమైన డైట్ ప్లాన్ల తోపాటు మంచి ఆహారపు అలవాట్లతో అభిమానులే గుర్తుపట్లలేనంత స్లిమ్గా అందంగా మారిపోయింది భూమి. (చదవండి: ముత్యాలతో చేసిన చీరలో షానాయ కపూర్..! ఏకంగా 'లక్ష'..!)
ఫొటోలు
International View all
![title](/sites/default/files/article_images/2024/07/19/telaviv.jpg)
ఇజ్రాయెల్పై డ్రోన్ దాడి.. భారీ పేలుడు
టెల్ అవీవ్: ఇజ్రాయెల్లో శుక్రవారం(జులై 19) తెల్లవారుజామున
![title](/sites/default/files/article_images/2024/07/19/meloni.jpg)
ఇటలీ ప్రధాని పొడవుపై కామెంట్స్.. జర్నలిస్టుకు జరిమానా
రోమ్: ఇటలీలో మహిళా జర్నలిస్టు గిలియా కోర్టిస్కు కోర్టు రూ.
![title](/sites/default/files/article_images/2024/07/19/deniel.jpg)
జాహ్నవిపై అనుచిత వ్యాఖ్యలు..ఆ పోలీసు తొలగింపు
న్యూయార్క్/సియాటెల్: అమెరికాలోని సియాటెల్లో గతేడాది తెలుగ
![title](/sites/default/files/article_images/2024/07/19/bangladesh.jpg)
బంగ్లాదేశ్లో రిజర్వేషన్ల హింస.. మరో 18 మంది మృతి
ఢాకా: ప్రభుత్వ ఉద్యోగాల రిజర్వేషన్ల కోటాలో సంస్కరణలను కోరుతూ
![title](/sites/default/files/article_images/2024/07/19/18072024153-BIDEN.jpg)
బైడెన్కు కరోనా
మిల్వాకీ: ఓవైపు అమెరికా అధ్యక్ష ఎన్నికలు శరవేగంగా సమీపిస్తున
National View all
![title](/sites/default/files/article_images/2024/07/19/roadaccident.jpg)
యూపీ, రాజస్థాన్లో ఘోర రోడ్డు ప్రమాదాలు
లక్నో/జైపూర్: యూపీ, రాజస్థాన్లలో గురువారం అర్ధరాత్రి
![title](/sites/default/files/article_images/2024/07/19/puri.jpg)
భండార్ నుంచి స్ట్రాంగ్ రూంకు
పురీ: పురీ జగన్నాథుని ఆలయంలోని అమూల్య వస్తువులు, ఆభరణాల తరలి
![title](/sites/default/files/article_images/2024/07/19/mohan.jpg)
దేవుడు, విశ్వరూపి... ఆ తర్వాతేమిటి?
గుమ్లా (జార్ఖండ్): లోక్సభ ఎన్నికల అనంతరం బీజేపీపై తరచూ సున
![title](/sites/default/files/article_images/2024/07/19/SUPREME.jpg)
Supreme Court: సెంటర్లవారీగా ఫలితాలు
సాక్షి, న్యూఢిల్లీ: పరీక్ష కేంద్రాలు, నగరాల వారీగా నీట్–యూజ
![title](/sites/default/files/article_images/2024/07/18/FASTag.jpg)
ఎన్హెచ్ఏఐ కొత్త రూల్.. ఇలా చేస్తే రెట్టింపు టోల్ ఫీజు
టోల్ గేట్స్ వద్ద వేచి ఉండాల్సిన సమయాన్ని తగ్గించడానికి నేషనల్ హైవేస్ అథారిటీ ఆఫ్ ఇండియా (NHAI) ఫాస్ట్ట్యాగ్ ప్రవేశపెట్
NRI View all
![title](/sites/default/files/article_images/2024/07/18/NRI2.jpg)
డాక్టర్ వైఎస్సార్ ఫౌండేషన్ అమెరికా ఆధ్వర్యంలో వైఎస్సార్ జయంతి వేడుకలు
న్యూ జెర్సీ: డాక్టర్ వై.ఎస్.రాజశేఖరరెడ్డి ఫౌండేషన్ అమెరికా
![title](/sites/default/files/article_images/2024/07/18/Australia_telugustudents.jpg)
ఆస్ట్రేలియాలో తెలుగు విద్యార్థులు దుర్మరణం, స్నేహితుడిని కాపాడబోయి
ఆస్ట్రేలియాలోని క్వీన్స్లాండ్లో విషాదం చోటు చేసుకుంది.
![title](/sites/default/files/article_images/2024/07/18/NRI1.jpg)
న్యూజెర్సీలో వైఎస్సార్ జయంతి వేడుకలు
ట్రెంటన్: దివంగత ముఖ్యమంత్రి, మహానేత వైఎస్ రాజశేఖరరెడ్డి 75వ జయంతి వేడుకలు అమెరికాలోని
![title](/sites/default/files/article_images/2024/07/15/intel01.jpg)
విదేశీ వర్కర్ల భద్రతకు మరిన్ని కఠిన నిర్ణయాలు
కెనడా ప్రభుత్వం తమ దేశంలో పనిచేసే విదేశీ వర్కర్ల రక్షణకు చర్యలు తీసుకుంటుంది.
![title](/sites/default/files/article_images/2024/07/13/labour.jpg)
ఇటలీలో బానిసత్వం!.. 33 మంది భారతీయ కార్మికుల విముక్తి
రోమ్: భారతీయ వ్యవసాయ కార్మికులను బానిస వ్యవస్థ నుంచి కాపాడి
క్రైమ్
![35 people committed suicide due to harassment by TDP mobs](/sites/default/files/styles/webp/public/article_images/2024/07/19/nara.jpg.webp?itok=q0hgm6x9)
‘నారా’రూప రాక్షసం.. యథేచ్ఛగా నరమేధం!
మధ్య యుగాల్లో గజినీలు, ఘోరీలు దండెత్తి సృష్టించిన మారణహోమాన్ని రాష్ట్రంలో చంద్రబాబు రాక్షసపాలన గుర్తుకు తెస్తోంది. ఆధునిక కాలంలో యూదు జాతి మొత్తాన్ని తుదముట్టించాలని జర్మన్ నాజీ నియంత హిట్లర్ చేసిన ఘోరకలిని తలపిస్తూ ఎన్నికల ఫలితాలు వెలువడిన నాటి నుంచి ఆంధ్రప్రదేశ్లో పచ్చమూక మరణమృదంగం మోగిస్తోంది. ‘నారా’సుర పాలన విశృంఖలత్వం సృష్టిస్తోంది. అధికారబలం ఉన్నవాడిదే అరాచకం... అన్న అడవినీతిని తలపిస్తూ యథేచ్చగా నరమేధం సాగిస్తోంది. హత్యలతో రాష్ట్రం అట్టుడికిపోతోంది. ప్రజాప్రతినిధుల నుంచి సామాన్యుల ప్రాణాలకు రక్షణ లేకుండాపోయింది. ప్రభుత్వ ఆస్తుల విధ్వంసకాండ కొనసాగుతోంది. ప్రైవేటు ఆస్తుల ధ్వంస రచన అడ్డూ అదుపు లేకుండా సాగుతోంది. పచ్చ ముఠాలు సభ్యులు రాష్ట్రంపై తెగబడి ఆస్తులు ధ్వంసం చేస్తున్నారు. ఇళ్లను ముట్టడిస్తున్నారు. దివంగత సీఎం వైఎస్ రాజశేఖరరెడ్డి విగ్రహాలను నేలమట్టం చేస్తున్నారు. వైఎస్సార్సీపీ కార్యాలయాలపై దండెత్తుతున్నారు. సచివాలయాలు, ఆర్బీకేలు, తాగునీటి ట్యాంకులు వంటి ప్రభుత్వ ఆస్తులను కూలగొడుతున్నారు. టీడీపీ అధికార మదానికి పోలీసు శాఖ దాసోహమైంది. ప్రభుత్వ ప్రేరేపిత దాడులు కావడంతో చేష్టలుడిగి చూస్తోంది. ఒక్క మాటలో చెప్పాలంటే రాష్ట్రంలో రాజ్యాంగ వ్యవస్థలు కుప్పకూలుతున్నాయి. గోడు వెళ్లబోసుకునేందుకు ఏ వ్యవస్థా అందుబాటులో లేకుండా పోయింది. చంద్రబాబు ప్రభుత్వం రాష్ట్రంలో రాజ్యాంగ ధర్మాన్ని కాలరాస్తోంది. టీడీపీ రెడ్బుక్ రాజ్యాంగ అరాచకమే రాజ్యమేలుతోంది. – సాక్షి, అమరావతి నేడువరుసగా మూడుసార్లు ఎంపీగా ఎన్నికైన పెద్దిరెడ్డి మిథున్రెడ్డిని గురువారం ఆయన సొంత నియోజకవర్గంలోనే హత్య చేసేందుకు టీడీపీ గూండాలు బరితెగించారు. పక్కా పన్నాగంతో కత్తులు, రాళ్లు చేతబట్టి మాటు వేశారు. మూకుమ్మడిగా దాడిచేశారు. టీడీపీ రౌడీమూకలను వారించబోయిన మాజీ ఎంపీ రెడ్డప్పను బూతులు తిడుతూ దాడికి తెగబడ్డారు. ఆంధ్రప్రదేశ్లో ఓ ఎంపీ ప్రాణాలకే రక్షణలేని పరిస్థితి. నిన్నపల్నాడు జిల్లా వినుకొండలో నడిరోడ్డుపై వైఎస్సార్సీపీ కార్యకర్త రషీద్పై టీడీపీ గూండా జిలానీ కత్తితో విచక్షణారహితంగా దాడి చేశాడు. రెండు చేతులు తెగనరికాడు. అనంతరం కత్తితో మెడ నరికి పాశవికంగా హత్య చేశాడు. ఆంధ్రప్రదేశ్లో ఓ సామాన్యుడికి ప్రాణాలకు ఏమాత్రం రక్షణ లేదనడానికి తాజా తార్కాణం ఈ దురాగతం. కక్ష కట్టి కత్తివేటు... హత్యలు31 హత్యాయత్నాలు 300టీడీపీ కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత 40 రోజుల్లోనే రాష్ట్రవ్యాప్తంగా 31 మంది దారుణ హత్యకు గురయ్యారు. కర్నూలు జిల్లా ఆదోని మండలం నాగనాథహళ్లిలో మాల గుండమ్మ అనే దళిత మహిళను ఆమె పొలంలోనే టీడీపీ నేత రాఘవేంద్రారెడ్డి, ఆయన కుమారుడు శ్రీధర్రెడ్డి దారుణంగా ట్రాక్టర్తో తొక్కించి చంపేశారు. రాష్ట్ర హోం మంత్రి వంగలపూడి అనిత ప్రాతినిధ్యం వహిస్తున్న అనకాపల్లి జిల్లా రాంబిల్లి మండలం కొప్పుగొండువానిపాలెంలో సురేష్ అనే ఉన్మాది 9వ తరగతి చదువుతున్న బాలికను కత్తితో పొడిచి హత్యచేశాడు. అదేవిధంగా హిందూపురం నియోజకవర్గం గోళపురం గ్రామంలో వైఎస్సార్సీపీ నేత సతీష్... విజయనగరం జిల్లా సీతానగరం మండలం పెద్ద భోగిలే హడ్కో కాలనీలో గుజ్జల హేమంత్... శ్రీకాకుళం రెల్లివీధికి చెందిన నల్లపిల్లి గౌరీశంకర్.. శ్రీకాకుళం జిల్లా సోంపేట మండలం కొర్లాం జాతీయ రహదారి సమీపంలోని ఓ దాబాలో రాంబాబు అనే వ్యక్తి...అనంతపురం జిల్లా కోమటికుంట్ల గ్రామంలో వైఎస్సార్సీపీ కార్యకర్త ఎరికలయ్య.. విశాఖపట్నంలోని అగనంపూడిలో కిరణ్ అనే యువకుడు... బాపట్ల జిల్లా చీరాలలో ఓ వ్యాపారి... ఒంగోలులో ఓ యువకుడు... పల్నాడు జిల్లా వెల్దుర్తి మండలం మిట్టపల్లెలో హనిమిరెడ్డి, దాచేపల్లిలో గుమ్మడి నాగిరెడ్డి... ఇలా 40 రోజుల్లో 31 మంది హత్యకు గురయ్యారు. శ్రీకాకుళం జిల్లాలో అత్యధికంగా ఐదు హత్యలు జరిగాయి. మరో 300 మందిపై హత్యాయత్నాలు జరిగాయి.భరించలేక.. బలవన్మరణాలు ఆత్మహత్యలు 35 వైఎస్సార్సీపీ నాయకులు, కార్యకర్తలపై మాత్రమే కాదు... చిరు వ్యాపారులు, చిన్నాచితక ఉద్యోగులు, సామాన్యులపై సైతం టీడీపీ నేతలు తమ ప్రతాపం చూపుతున్నారు. ‘ఇక మా ప్రభుత్వం వచ్చింది.. మీరు తప్పుకోండి..’ అంటూ బెదిరిస్తున్నారు. తమకు ఎదురు చెబితే తప్పుడు కేసులు పెట్టి కుళ్ల»ొడిపిస్తామని హెచ్చరిస్తున్నారు. దీంతో ఉపాధి కోల్పోతామని... పరువు పోతుందనే భయంతో తీవ్ర ఆవేదనకు గురై ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు. టీడీపీ నేతలు ఉద్యోగానికి రాజీనామా చేయాలని బెదిరించడంతో చిలకలూరిపేట నియోజకవర్గంలో ఉపాధి హామీ పథకం ఫీల్డ్ అసిస్టెంట్ జడ ఆనంద్ పురుగులమందు తాగి చనిపోయాడు. పోలీసుల వేధింపులతో పల్నాడు జిల్లా సత్తెనపల్లి నియోజకవర్గం రెంటపాళ్ల ఉప సర్పంచ్ కోరుకుంట్ల నాగమల్లేశ్వరరావు ఆత్మహత్య చేసుకున్నారు. ఇలా 40 రోజుల్లో రాష్ట్రవ్యాప్తంగా 35మంది ఆత్మహత్యలు చేసుకున్నారు. టీడీపీ నేతల వేధింపుల కారణంగా అత్యధికంగా వైఎస్సార్ జిల్లాలో 16 మంది ఆత్మహత్యలు చేసుకున్నారు. ఇక శ్రీకాకుళం జిల్లాలో 11 మంది బలవన్మరణాలకు పాల్పడ్డారు.చిన్నారులనేకనికరం లేకుండా.. లైంగిక దాడులు20టీడీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత రాష్ట్రంలో లైంగికదాడులుఘోరంగా జరుగుతున్నాయి. చిన్నారులు అనే కనికరం కూడా లేకుండా ఉన్మాదులు చెలరేగిపోతున్నారు. కేవలం 40 రోజుల్లోనే 20 మందిపైలైంగికదాడులు జరిగాయి. వారిలో నలుగురిని దుండగులు చంపేశారు. చీరాలలో జూన్ 21వ తేదీన ఓ చేనేత కుటుంబానికి చెందిన యువతి బహిర్భూమికి వెళ్లగా, ఆమెపై దుండగులు అత్యాచారం చేసి హతమార్చారు. నంద్యాల జిల్లా ముచ్చుమర్రిలో పది రోజుల కిందట ఎనిమిదేళ్ల గిరిజన బాలికను దుండగులు అపహరించి అత్యాచారానికి పాల్పడ్డారు. ఆ బాలిక ఆచూకీ ఇంతవరకు తెలియలేదు. అనంతపురం జిల్లా అరకటివేములలో టీడీపీ కార్యకర్త రవితేజ ఓ బాలికను జూన్ 24న అపహరించి తాడిపత్రి మార్కెట్ యార్డ్ వద్ద ఉన్న వాహనంలోకి తీసుకువెళ్లి తన స్నేహితుడు నాగేంద్రతో కలిసిలైంగికదాడికి పాల్పడ్డారు. ఇలా వయసుతో సంబంధం లేకుండా 20 మందిపై లైంగిక దాడులు జరిగాయి.అదేవిధంగా శ్రీకాకుళం జిల్లా ఎచ్చెర్ల మండలం నవభారత్ జంక్షన్లో జూన్ 17న ఓ మహిళపై దాడి చేసి ఒళ్లంతా కారం చల్లి ఆటోలోకి బలవంతంగా ఎక్కించి శ్రీకాకుళం పట్టణంలోకి తీసుకువెళ్లి నడివీధిలో వివస్త్రను చేసి ఊరేగించారు. అనకాపల్లి జిల్లా దర్మసాగరంలో టీడీపీ వర్గీయులు కుమారి అనే మహిళ ఇంటికి వెళ్లి ఆమెను వివస్త్రను చేసి కొట్టారు. ఇవన్నీ అధికారిక లెక్కలు. కానీ ఫిర్యాదులు చేసేందుకు పలువురు బాధితులు వెనుకంజ వేస్తున్నారు. బాధితులు అందరూ ఫిర్యాదులు చేస్తే కేసుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉంది.
![Unknown Person Attack On Women At Tirupati](/sites/default/files/styles/webp/public/article_images/2024/07/18/sp.jpg.webp?itok=C-0hjDYE)
తిరుపతిలో దారుణం.. మాస్క్ పెట్టుకుని ఇంట్లోకి చొరబడి..
సాక్షి, తిరుపతి: ఏపీలో కూటమి ప్రభుత్వంలో దారుణాలు కొనసాగుతూనే ఉన్నాయి. తాజాగా తిరుపతిలో దారుణ హత్య జరిగింది. ముఖానికి మాస్క్ వేసుకుని ఓ వ్యక్తి మహిళలను హత్యచేసి పారిపోయాడు. ఈ క్రమంలో అడొచ్చిన మహిళ మనువరాలిపై దాడికి పాల్పడ్డాడు.ఈ ఘటన తిరుపతి ఎస్పీ సుబ్బారాయుడు తెలిపిన వివరాల ప్రకారం..‘తిరుపతిలోని రాయల్ నగర్లో హత్య జరిగిన ప్రాంతాన్ని పరిశీలించాము. జయలక్ష్మీ(67) అనే వృద్దురాలిని దుండగుడు హత్య చేశాడు. నిందితుడు ముఖానికి మాస్క్ వేసుకుని ఇంట్లోకి చొరబడ్డాడు. అనంతరం, ఆమెను చంపి పారిపోయే క్రమంలో మృతురాలి మనుమరాలు నియతి(14) గొంతుపై కత్తితో దాడికి పాల్పడ్డాడు. ఆ తర్వాత ఆమె కోడలు సురక్షపై కూడా దాడి చేశాడు.ఇక, ఈ హత్యకు సంబంధించి కొన్ని క్లూస్ దొరికాయి. సీసీ కెమెరాల్లో నిందితుడి ఆచూకీలు లభించాయి. ఈ దాడి నగలను దోచుకోవడానికి దాడి జరగలేదు. త్వరలోనే ఈ కేసు మిస్టరీని చేధిస్తాము. వీలైనంత తొందరగానే నిందితుడిని పట్టుకుంటాము’ అని తెలిపారు.
![Sensational Elements In The Remand Report Of The Narsingi Drugs Case](/sites/default/files/styles/webp/public/article_images/2024/07/18/Narsingi-Drugs-Case.jpg.webp?itok=XFX2XLhO)
నార్సింగి డ్రగ్స్ కేసు.. రిమాండ్ రిపోర్ట్లో సంచలనాలు
సాక్షి, హైదరాబాద్: నార్సింగ్ డ్రగ్స్ కేసు రిమాండ్ రిపోర్ట్లో సంచలన అంశాలు వెలుగులోకి వచ్చాయి. ఈ కేసులో మొత్తం 20 మంది నిందితులు కాగా, వారిలో ఏడుగురు పెడ్లర్లు, 13 మంది కన్యుమర్లు.. ఏ 10గా రకుల్ ప్రీత్ సింగ్ సోదరుడు అమన్ ప్రీత్ సింగ్ను పోలీసులు చేర్చారు.నైజీరియా-ఢిల్లీ-హైదరాబాద్-ఏపీ లోని పలు ప్రాంతాలకు డ్రగ్స్ను చేరవేస్తున్నారు. ఎబుకా, బ్లెస్సింగ్, ఫ్రాంక్లిన్, అజీజ్, గౌతం, వరుణ్ ద్వారా డ్రగ్స్ సరఫరా చేస్తున్నారు. వరుణ్, గౌతం, షరీఫ్ ద్వారా తెలుగు రాష్ట్రాల్లో డ్రగ్స్ దందా సాగుతోంది. పెడ్లర్లను ఆర్థికంగా ఆదుకుంటున్న నైజీరియన్లు.. వారికి కావాల్సిన డబ్బును అరేంజ్ చేసి డ్రగ్ సరఫరాకు ప్రోత్సహిస్తున్నారు. డ్రగ్స్ సరఫరాకు కింగ్పిన్గా నైజీరియాకు చెందిన ఎబుకాగా పోలీసులు పేర్కొన్నారు. ఎబుకా నుండి బ్లెస్సింగ్ అనే మరో నైజీరియన్ ద్వారా ఇండియాలోని రాష్ట్రాలకు డ్రగ్స్ సరఫరా చేస్తున్నారు. ఇప్పటి వరకు 20 సార్లు హైదరాబాద్లో డ్రగ్స్ సప్లై చేసినట్టు బ్లెస్సింగ్ అంగీకరించాడు. గౌతమ్ అనే డ్రగ్ పెడ్లర్ ద్వారా రాజమండ్రి, హైదరాబాద్, ప్రకాశం జిల్లాకు డ్రగ్స్ చేరుతున్నాయి.9 నెలల్లో 10 లక్షల రూపాయలను కమిషన్ రూపంలో డ్రగ్ పేడ్లర్ గౌతంకు నైజీరియన్ ముట్టచెప్పాడు. బండ్లగూడలో ఉన్న లుంబిని కమ్యూనికేషన్స్ ద్వారా డబ్బులు చెల్లించారు. వరుణ్ నుండి రకుల్ ప్రీత్ సింగ్ సోదరుడు అమన్కు డ్రగ్స్ సరఫరా చేస్తున్నారు.ఫిలింనగర్, జూబ్లీహిల్స్, బంజారాహిల్స్, పంజాగుట్ట, గచ్చిబౌలిలోని కస్టమర్లకు డ్రగ్స్ సప్లై చేస్తున్నారు. తన స్నేహితురాలి పేరును తన పేరుగా బ్లెస్సింగ్ మార్చుకుంది. తండ్రి బస్సు డ్రైవర్ కావడంతో ఆర్థిక సమస్యలు కారణంగా ఇంటర్ వరకు చదువుకున్నాడు. 2017లో ఫేస్ బుక్లో బ్లెస్సింగ్ అనే మహిళతో పరిచయం అయ్యింది. బెంగుళూరు వచ్చి బ్లెస్సింగ్ అనే స్నేహితురాలి బట్టల దుకాణంలో ఒనుహా పని చేశాడు.
![woman commits suicide in karimnagar](/sites/default/files/styles/webp/public/article_images/2024/07/18/6588_1.jpg.webp?itok=DsKfP498)
అమ్మా.. ఎంత పనిచేశావు..!
మేడిపల్లి: ‘అమ్మా.. మమ్మల్ని ముద్దుగా పెంచావు. ఎంత అల్లరి చేసినా ఓపికగా భరించా వు.. అందరితో ఆడుకుంటుంటే మురిసిపోయావు. మేమే నీ లోకం.. మేమే నీ సర్వస్వం అ న్నట్లు మెదిలావు.. అంతలోనే మమ్మల్ని అనాథలను చేసి వెళ్లిపోయావా అమ్మా.. ఇక మాకు దిక్కెవరు.. మమ్మల్ని ఎవరు లా లిస్తారు.. ఎవరు బుజ్జగించి బువ్వ తినిపిస్తారు అ మ్మా.. అనే రీతిలో ఆ చిన్నారులు తల్లి మృతదేహం వద్ద కనిపించిన తీరు కంటతడి పెట్టించింది. క్షణికావేశంలో ఆ తల్లి తీసుకున్న నిర్ణయం అటు పుట్టింట్లో.. ఇటు మెట్టింట్లో తీరని శోకాన్ని మిగిలి్చంది. ఈ విషాధ ఘటన భీమారం మండలంలోని కమ్మరిపేటలో చోటుచేసుకుంది. కోరుట్ల మండలం పైడిమడుగు గ్రామానికి చెందిన పాక లక్ష్మి, రాజం కూతురు శ్రావణిని కమ్మరిపేట గ్రామానికి చెందిన తిపిరి నరేశ్కిచ్చి ఐదేళ్ల క్రితం వివాహం చేశారు. వారికి ఇద్దరు కుమారులు శ్రాహన్స్(4), రుద్రాన్స్ (ఏడాది) ఉన్నారు. నరేశ్ తనకున్న పొలంలో వ్యవసాయం చేస్తున్నాడు. శ్రావణి బీడీలు చుడుతోంది. ఉన్నంతలో హాయిగా ఉంటున్నారు. ఈ క్రమంలో శ్రాహన్స్కు ఐదు రోజులుగా జ్వరం వస్తోంది. అతడిని ఆస్పత్రికి తీసుకెళ్లాలని నరేశ్ శ్రావణికి చెబుతున్నాడు. తానే తీసుకెళ్లాలంటే ఎలా అని మందలించాడు. దీంతో మనస్తాపానికి గురైన శ్రావణి మంగళవారం ఇంట్లోకి వెళ్లి క్రిమిసంహారక మందు తాగింది. గమనించిన కుటుంబ సభ్యులు వెంటనే ఆమెను జగిత్యాల ఆస్పత్రికి.. అక్కడి నుంచి కరీంనగర్కు తరలించారు. అక్కడి వైద్యులు ప్రయత్నించినా ఫలితం కనిపించలేదు. చికిత్స పొందుతూ బుధవారం మృతిచెందింది. ఆమె మృతదేహాన్ని గ్రామానికి తీసుకురాగా గ్రామస్తులు పెద్ద ఎత్తున తరలివచ్చారు. ‘ఎంత పనిచేశావు బిడ్డా.. నీ పిల్లలు పసిమొగ్గలని గుర్తుకురాలేదా.. ఆ యముడే మదిలో నుంచి జ్ఞాపకాలు తీసేసాడా.. అంటూ గుండెలవిసేలా రోదించారు. విగతజీవిగా మారిన భార్య మృతదేహాన్ని చూస్తూ భర్త నరేశ్.. అమ్మకు ఏమైంది నాన్న అంటూ నాలుగేళ్ల కొడుకు.. ఏం జరుగుతుందో తెలియక బోసిపోయిన ముఖంతో ఏడాది కుమారుడు.. మీ అమ్మ ఇకరాదు బిడ్డా అని ఎలా చెప్పాలో తెలియక బరువెక్కిన హృదయంతో దిక్కులు పిక్కటెల్లేలా రోదించారు శ్రావణి తల్లిదండ్రులు. అప్పటి వరకు అందరితో కలివిడిగా ఉన్న శ్రావణి క్షణికావేశంలో తీసుకున్న నిర్ణయం తన ఇద్దరు పిల్లలతోపాటు కుటుంబ సభ్యులకు కడుపుకోతను మిగిలి్చంది. పెద్ద కుమారుడితో శ్రావణికి తలకొరివి పెట్టించారు. కేసు దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై శ్యాంరాజ్ తెలిపారు.
వీడియోలు
![Peddavagu Project Broken Due To Heavy Flood](/sites/default/files/styles/webp/public/article_images/2024/07/19/24.png.webp?itok=oe9f812K)
![Peddavagu Project Broken Due To Heavy Flood](/sites/default/files/styles/webp/public/article_images/2024/07/19/24.png.webp?itok=oe9f812K)
పెద్దవాగు ప్రాజెక్టుకు భారీ గండి
![KSR Special Debate Over Vinukonda Rashid Incident](/sites/default/files/styles/webp/public/article_images/2024/07/19/23.png.webp?itok=PQcsIUem)
![KSR Special Debate Over Vinukonda Rashid Incident](/sites/default/files/styles/webp/public/article_images/2024/07/19/23.png.webp?itok=PQcsIUem)
వినుకొండ హంతకుడికి టీడీపీ కీలక పదవి ?
![Analyst Vijay Babu On Nara Lokesh Red Book Politics](/sites/default/files/styles/webp/public/article_images/2024/07/19/22.png.webp?itok=uOi8kq3r)
![Analyst Vijay Babu On Nara Lokesh Red Book Politics](/sites/default/files/styles/webp/public/article_images/2024/07/19/22.png.webp?itok=uOi8kq3r)
ఏపీలో పార్లమెంట్ సభ్యులపై దాడులు.. మోదీ తక్షణం స్పందించండి
![Vinukonda Rashid Mother Emotional Abour Her Son](/sites/default/files/styles/webp/public/article_images/2024/07/19/20.png.webp?itok=VM5R-bQs)
![Vinukonda Rashid Mother Emotional Abour Her Son](/sites/default/files/styles/webp/public/article_images/2024/07/19/20.png.webp?itok=VM5R-bQs)
బరువెక్కిన గుండెతో వినుకొండ రషీద్ తల్లి
![School Bus Stuck In Floods Due To Heavy Rain](/sites/default/files/styles/webp/public/article_images/2024/07/19/16.png.webp?itok=qFLot0Z2)
![School Bus Stuck In Floods Due To Heavy Rain](/sites/default/files/styles/webp/public/article_images/2024/07/19/16.png.webp?itok=qFLot0Z2)
భారీ వర్షాలు.. వరదలో చిక్కుకున్న స్కూల్ బస్సు
![Kasu Mahesh Reddy Strong Counter To Chandrababu](/sites/default/files/styles/webp/public/article_images/2024/07/19/15.png.webp?itok=K4j1fhwH)
![Kasu Mahesh Reddy Strong Counter To Chandrababu](/sites/default/files/styles/webp/public/article_images/2024/07/19/15.png.webp?itok=K4j1fhwH)
టీడీపీ అరాచకాలు.. 30 రోజుల పాలన ఇదేనా చంద్రబాబు..
![Koramutla Srinivasulu Warning To TDP Leaders](/sites/default/files/styles/webp/public/article_images/2024/07/19/14.png.webp?itok=R121TRwr)
![Koramutla Srinivasulu Warning To TDP Leaders](/sites/default/files/styles/webp/public/article_images/2024/07/19/14.png.webp?itok=R121TRwr)
టీడీపీ నేతలకు కొరముట్ల శ్రీనివాసులు వార్నింగ్
![Kakani Govardhan Reddy React On Muchumarri Girl Incident](/sites/default/files/styles/webp/public/article_images/2024/07/19/13.png.webp?itok=Q1vA9Dy0)
![Kakani Govardhan Reddy React On Muchumarri Girl Incident](/sites/default/files/styles/webp/public/article_images/2024/07/19/13.png.webp?itok=Q1vA9Dy0)
ఆడపిల్లల జోలికి వస్తే భయపడేలా చేస్తామన్న పవన్.. ఇప్పుడు ఎక్కడున్నావ్
![YSRCP MP Tanuja Rani Comments Chandrababu](/sites/default/files/styles/webp/public/article_images/2024/07/19/12.png.webp?itok=LMeeCZ6K)
![YSRCP MP Tanuja Rani Comments Chandrababu](/sites/default/files/styles/webp/public/article_images/2024/07/19/12.png.webp?itok=LMeeCZ6K)
చంద్రబాబుపై ఎంపీ తనూజ రాణి ఫైర్
![Jakkampudi Raja Reaction On TDP Attacks In MP Mithun Reddy](/sites/default/files/styles/webp/public/article_images/2024/07/19/11.png.webp?itok=9qJqsneu)
![Jakkampudi Raja Reaction On TDP Attacks In MP Mithun Reddy](/sites/default/files/styles/webp/public/article_images/2024/07/19/11.png.webp?itok=9qJqsneu)
టీడీపీ నేతలపై జక్కంపూడి రాజా ఫైర్
న్యూస్ పాడ్కాస్ట్
![Audio](themes/custom/sakshi/assets/images/audio.png)
ఆంధ్రప్రదేశ్లో హింసాత్మక విధానాలను వీడాలని సీఎం చంద్రబాబుకు వైఎస్సార్సీపీ అధ్యక్షులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి హెచ్చరిక.. ఇంకా ఇతర అప్డేట్స్
![Audio](themes/custom/sakshi/assets/images/audio.png)
ఈరోజు సాయంత్రంకల్లా లక్ష రూపాయల వరకు రుణమాఫీ. తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ప్రకటన.. ఇంకా ఇతర అప్డేట్స్
![Audio](themes/custom/sakshi/assets/images/audio.png)
విద్యుత్తు కమిషన్కు మరో న్యాయమూర్తిని నియమించండి. తెలంగాణ ప్రభుత్వానికి సుప్రీంకోర్టు ఆదేశం.. ఇంకా ఇతర అప్డేట్స్
![Audio](themes/custom/sakshi/assets/images/audio.png)
నాలుగోసారి యూరోకప్ విజేతగా నిలిచిన స్పెయిన్ ఫుట్బాల్ జట్టు.. ఇంకా ఇతర అప్డేట్స్
![Audio](themes/custom/sakshi/assets/images/audio.png)
46 ఏళ్ల తర్వాత తెరుచుకున్న పూరీ జగన్నాథ ఆలయ వజ్రాభరణాల నిధి గది. మొదటిరోజు గది పరిశీలన. త్వరలో వజ్రాభరణాల లెక్కింపు మొదలు.. ఇంకా ఇతర అప్డేట్స్
![Audio](themes/custom/sakshi/assets/images/audio.png)
ఆంధ్రప్రదేశ్లో ఇసుక మాయ... పేరుకు మాత్రమే ఉచితం.. యథేచ్ఛగా దోపిడీ చేస్తున్న అధికార తెలుగుదేశం పార్టీ నాయకులు.. ఇంకా ఇతర అప్డేట్స్
![Audio](themes/custom/sakshi/assets/images/audio.png)
అమెరికాలో మానవ అక్రమ రవాణా కేసులో నలుగురు తెలుగు యువతీ యువకుల అరెస్టు.. ఇంకా ఇతర అప్డేట్స్
![Audio](themes/custom/sakshi/assets/images/audio.png)
మాస్కోలో మోదీ. నేడు పుతిన్తో ప్రధాని మోదీ విస్తృతస్థాయి చర్చలు.. ఇంకా ఇతర అప్డేట్స్
![Audio](themes/custom/sakshi/assets/images/audio.png)
వైఎస్ రాజశేఖరరెడ్డి మహోన్నత నాయకుడు... ఆయన లేరని ప్రతిరోజూ విచారిస్తూనే ఉన్నాం... సందేశం విడుదల చేసిన కాంగ్రెస్ పార్టీ అగ్రనేత సోనియా గాంధీశ.. ఇంకా ఇతర అప్డేట్స్
![Audio](themes/custom/sakshi/assets/images/audio.png)
వైఎస్సార్సీపీ కార్యకర్తలపై దాడులు వెంటనే ఆపండి.. పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డి డిమాండ్.. టీడీపీ నాయకుల దాడిలో గాయపడిన వేంపల్లె అజయ్కుమార్రెడ్డికి పరామర్శ.. ఇంకా ఇతర అప్డేట్స్