Jos Buttler
-
శ్రేయస్ కాదు!.. అతడే ‘ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్: అశ్విన్
పంజాబ్ కింగ్స్ పేసర్ విజయ్కుమార్ వైశాఖ్ (Vijaykumar Vyshak)పై టీమిండియా స్పిన్ దిగ్గజం రవిచంద్రన్ అశ్విన్ (Ravichandran Ashwin) ప్రశంసలు కురిపించాడు. ఆఖరి ఐదు ఓవర్ల ఆటలో అద్భుతం చేసి జట్టును గెలిపించాడని కొనియాడాడు. గుజరాత్ టైటాన్స్ (GT)- పంజాబ్ కింగ్స్ (PBKS) మ్యాచ్కు సంబంధించి.. తన దృష్టిలో వైశాఖ్ అత్యంత విలువైన ఆటగాడని పేర్కొన్నాడు.శ్రేయస్ అయ్యర్ తుపాన్ ఇన్నింగ్స్ఐపీఎల్-2025లో భాగంగా గుజరాత్- పంజాబ్ మంగళవారం తలపడిన విషయం తెలిసిందే. అహ్మదాబాద్లోని నరేంద్ర మోదీ స్టేడియం వేదికగా జరిగిన టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన పంజాబ్ దుమ్ములేపింది. ఓపెనర్ ప్రియాన్ష్ ఆర్య (23 బంతుల్లో 47), కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ (42 బంతుల్లో 97 నాటౌట్), శశాంక్ సింగ్ (16 బంతుల్లో 44 నాటౌట్) అద్భుతంగా బ్యాటింగ్ చేశారు.ఫలితంగా నిర్ణీత ఇరవై ఓవర్లలో పంజాబ్ ఐదు వికెట్ల నష్టానికి 243 పరుగులు చేసింది. ఇక లక్ష్య ఛేదనలో గుజరాత్ విజయానికి చేరువగా వచ్చింది. సాయి సుదర్శన్ మెరుపు ఇన్నింగ్స్ (41 బంతుల్లో 74) ఆడగా.. జోస్ బట్లర్ (33 బంతుల్లో 54), షెర్ఫానే రూథర్ఫర్డ్ (28 బంతుల్లో 46) పంజాబ్ నుంచి మ్యాచ్ను లాగేసుకునే ప్రయత్నం చేశారు.ఇంపాక్ట్ ప్లేయర్అయితే, సరిగ్గా అదే సమయంలో పంజాబ్ ఇంపాక్ట్ ప్లేయర్గా విజయ్కుమార్ వైశాఖ్ను రంగంలోకి దించింది. దాదాపు పద్నాలుగు ఓవర్ల పాటు బెంచ్ మీద ఉన్న అతడు.. పదిహేనో ఓవర్లో కట్టుదిట్టంగా బౌలింగ్ చేశాడు. కేవలం ఐదు పరుగులే ఇచ్చాడు. అనంతరం పదిహేడో ఓవర్లో మళ్లీ బరిలోకి దిగి ఇదే ప్రదర్శనను పునరావృతం చేశాడు. ఆ తర్వాత పందొమ్మిదో ఓవర్లో(18 రన్స్)నూ ఫర్వాలేదనిపించాడు.ఈ నేపథ్యంలో చెన్నై సూపర్ కింగ్స్ ఆటగాడు అశ్విన్ మాట్లాడుతూ.. ‘‘శ్రేయస్ అయ్యర్ ప్రదర్శన ఈ విజయానికి మూలం. అయితే, ఓ ఆటగాడు డగౌట్లో కూర్చుని.. మైదానంలోని ఆటగాళ్ల కోసం నీళ్లు తీసుకువస్తూ కనిపించాడు.ఆ సమయంలో గుజరాత్ మొమెంటమ్లోకి వచ్చేసింది. రూథర్ఫర్డ్, బట్లర్ మ్యాజిక్ చేసేలా కనిపించారు. అప్పుడు ఎంట్రీ ఇచ్చాడు విజయ్కుమార్ వైశాఖ్. దాదాపు పద్నాలుగు ఓవర్లపాటు మ్యాచ్కు దూరంగా అతడిని పిలిపించి.. మ్యాచ్ను మనవైపు తిప్పమని మేనేజ్మెంట్ చెప్పింది.‘ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్’ అవార్డు అతడికే ఇవ్వాల్సిందిపదిహేడు, పందొమ్మిదో ఓవర్లో అతడు పరిణతితో బౌలింగ్ చేశాడు. అతడు వికెట్ తీయకపోవచ్చు. కానీ డెత్ ఓవర్లలో అద్బుతంగా బౌలింగ్ చేశాడు. తన ప్రణాళికలను తూచా తప్పకుండా అమలు చేశాడు. అద్భుతమైన యార్కర్లతో అలరించాడు.తన బౌలింగ్లో వైడ్లు, ఫుల్ టాస్లు ఉండవచ్చు. కానీ అతడి కట్టుదిట్టమైన బౌలింగ్ వల్లే గుజరాత్ వెనుకడుగు వేసింది. నా దృష్టిలో అతడు అత్యంత విలువైన ఆటగాడు. నిజానికి ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు విజయ్కుమార్ వైశాఖ్కు దక్కాల్సింది’’ అని పేర్కొన్నాడు. కాగా ఈ మ్యాచ్లో పంజాబ్ పదకొండు పరుగుల తేడాతో విజయం సాధించింది. శ్రేయస్ అయ్యర్ ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్గా నిలిచాడు. ఇదిలా ఉంటే.. మొత్తంగా మూడు ఓవర్ల బౌలింగ్లో విజయ్ 28 పరుగులు ఇచ్చి వికెట్ తీయలేకపోయాడు.చదవండి: NZ vs Pak: టిమ్ సీఫర్ట్ విధ్వంసం.. పాకిస్తాన్కు అవమానకర ఓటమిPunjab Kings hold their nerves in the end to clinch a splendid win against Gujarat Titans ❤️Scorecard ▶ https://t.co/PYWUriwSzY#TATAIPL | #GTvPBKS | @PunjabKingsIPL pic.twitter.com/0wy29ODStQ— IndianPremierLeague (@IPL) March 25, 2025 -
సాహసోపేత నిర్ణయాలు.. టైటాన్స్ ఈసారి విజృంభిస్తుందా?
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL) లోకి అడుగుపెట్టిన తొలి సీజన్లోనే (2022)లో టైటిల్ సాధించి తనదైన ముద్రవేసింది గుజరాత్ టైటాన్స్ (Gujarat Titans). ఆ తర్వాత సీజన్లో మళ్ళీ ఫైనల్లోకి ప్రవేశించింది. కానీ టైటిల్ పోరులో చెన్నై సూపర్ కింగ్స్ చేతిలో ఓటమితో రన్నర్ అప్ తో సరిపెట్టుకుంది. అయితే, గతేడాది గుజరాత్కు గట్టి ఎదురుదెబ్బ తగిలింది. ఆ జట్టుకి స్ఫూర్తిదాయకంగా నిలిచి ముందుండి నడిపించిన భారత్ అల్ రౌండర్, జట్టు కెప్టెన్ హార్దిక్ పాండ్యాను ముంబై ఇండియన్స్కు బదిలీ అయ్యాడు.ఈ మార్పుతో భారత్ యువ ఓపెనర్ శుబ్మన్ గిల్ (Shubman Gill)కు కెప్టెన్గా పగ్గాలు అప్పగించారు. కానీ గత సీజన్ గుజరాత్ కి పెద్దగా కలిసిరాలేదు. కేవలం 5 విజయాలు, 7 ఓటములతో గుజరాత్ 8వ స్థానంతో సరిపెట్టుకోవాల్సి వచ్చింది. దీనితో కొత్త సీజన్ కోసం గుజరాత్ కొన్ని సాహసోపేతమైన నిర్ణయాలు తీసుకుంది.భారత్ సీనియర్ పేసర్ మహమ్మద్ షమీ, నూర్ అహ్మద్, దక్షిణాఫ్రికాకి చెందిన డేవిడ్ మిల్లర్ వంటి సీనియర్ ఆటగాళ్ళని పక్కకుపెట్టాలని నిర్ణయించారు. ఇందుకు బదులుగా కొత్త తరహా జట్టుని నిర్మించాలని నిర్ణయించారు. ప్రపంచ క్రికెట్లో నిలకడగా రాణిస్తున్న ఆటగాళ్ల కోసం పెద్ద మొత్తంలో ఖర్చు చేయాలని నిర్ణయించుకుంది.మాజీ ఆరెంజ్ క్యాప్ విజేత జోస్ బట్లర్, దక్షిణాఫ్రికా పేస్ స్పియర్హెడ్ కగిసో రబాడను దక్కించుకోవడానికి గుజరాత్ పెద్ద మొత్తంలో ఖర్చు చేసింది. ఛాంపియన్స్ ట్రోఫీ లో తన వీరోచిత ప్రదర్శనలతో అందరినీ ఆశ్చర్యపరిచిన గ్లెన్ ఫిలిప్స్ను కూడా తీసుకున్నారు.వేలంలో గుజరాత్ ఎలా రాణించింది?ఐపీఎల్ 2025 మెగా వేలంలో గుజరాత్ చాలా సమయస్ఫూర్తితో వ్యవహరించింది. గిల్, రాహుల్ తెవాటియా, సాయి సుదర్శన్ మరియు షారుఖ్ ఖాన్లతో పాటు రషీద్ ఖాన్ను వేలానికి ముందు రెటైన్ చేసింది. వేలంలో ఇంగ్లాండ్ కెప్టెన్ జోస్ బట్లర్ ని రూ 15.75 కోట్లు కు కనుగోలు చేసారు.ఇంకా భారత్ పేసర్ మహమ్మద్ సిరాజ్ ( (రూ12.25 కోట్లు), రబాడ (రూ 10.75 కోట్లు) మరియు ప్రసిధ్ కృష్ణ (రూ 9.5 కోట్లు) ముగ్గురితో పేస్ బౌలింగ్ ని బలోపేతం చేశారు. గత సీజన్లో వారికి సమస్యగా ఉన్న రంగాల కోసం భారీగా ఖర్చు చేశారు. ఇక మిల్లర్ స్థానంలో జిటి ఫిలిప్స్ మరియు షెర్ఫేన్ రూథర్ఫోర్డ్లను జట్టులోకి తీసుకువచ్చారుగుజరాత్ టైటాన్స్ జట్టులో ప్రధాన ఆటగాళ్లుశుబ్మన్ గిల్ఒకప్పుడు భారత టీ20ఐ జట్టులో ప్రధాన ఆటగాళ్లలో ఒకడైన గిల్ ఇప్పుడు మునుపటి రీతిలో రాణించలేక పోతున్నాడన్నది వాస్తవం. 2023 ఐపీఎల్ లో చెలరేగిపోయిన గిల్ దాదాపు 900 పరుగులు సాధించాడు.గత సీజన్ను ఆశాజనకంగా ప్రారంభించినప్పటికీ ఆ తర్వాత అతని ఫామ్ తగ్గింది . 2024లో తన మొదటి ఆరు మ్యాచ్ల్లో 151.78 స్ట్రైక్ రేట్తో 255 పరుగులు చేశాడు, కానీ ఆ తర్వాత 147.40 సగటుతో 426 పరుగులు చేశాడు. ఈ సీజన్లో గిల్ మళ్ళీ మునుపటి ఫామ్ ని ప్రదర్శించాలని, జట్టుని విజయ బాటలో నడిపించాలని కృత నిశ్చయంతో ఉన్నాడు.జోస్ బట్లర్జట్టులో అత్యంత ఖరీదైన ఆటగాడు కావడంతో, బట్లర్ పై అందరి దృష్టి ఉంటుందనడంలో సందేహం లేదు. 2022 ఐపిఎల్ లో ఏకంగా 863 పరుగులు చేసిన తర్వాత, బట్లర్ 2023 మరియు 2024 సీజన్లలో 400 కి మించి పరుగులు చేయలేకపోయాడు. అయితే గత సంవత్సరం ఈడెన్ గార్డెన్స్లో కోల్కతా పై జరిగిన ఫైనల్లో 224 పరుగుల లక్ష్యం సాధించడంలో బట్లర్ చేసిన సెంచరీ లీగ్లో అత్యంత ప్రజాదరణ పొందిన ఇన్నింగ్స్లలో ఒకటిగా నిలిచింది. బట్లర్ ఈ సీజన్ లో గిల్ తో కలిసి గుజరాత్ ఇన్నింగ్స్ ప్రారంభించే అవకాశముంది. లేదా గత సీజన్లో లేని ఫైర్పవర్ను అందించడానికి 3వ స్థానంలోకి వస్తాడని భావిస్తున్నారు. అదనంగా అతన్ని స్టంప్స్ వెనుక కూడా చూడవచ్చు.రషీద్ ఖాన్గాయం నుంచి ఇప్పుడు పూర్తిగా కోలుకున్న ఆఫ్ఘన్ స్పిన్నర్ రషీద్ ఖాన్ మరోసారి గుజరాత్కు ట్రంప్ కార్డ్ గా భావించవచ్చు. గత సీజన్లో, రషీద్ శస్త్రచికిత్స నుండి కోలుకుంటున్నందున తన పూర్తి స్థాయిలో ఆడలేక పోయాడు. ఈసారి మాత్రం గుజరాత్ టైటిల్ సాధించాలన్న ఆశయాన్ని సాధించడంలో రషీద్ పెద్ద పాత్ర పోషిస్తాడని భావిస్తున్నారు.కగిసో రబాడపంజాబ్ కింగ్స్ తరుపున ఆది కాస్త నిరాశబరిచిన కగిసో రబాడ ఇప్పుడు గుజరాత్ జట్టులో చేరడంతో కోచ్ ఆశిష్ నెహ్రా ఆధ్వర్యంలో మళ్ళీ పుంజుకోగలడని భావిస్తున్నారు.మహ్మద్ సిరాజ్ఇటీవలి కాలంలో పెద్దగా రాణించలేక పోతున్న హైదరాబాద్ పేసర్ మొహమ్మద్ సిరాజ్ కి మళ్ళీ మునుపటి వైభవం సాధించడానికి ఐపీఎల్ మంచి అవకాశం కల్పిస్తోంది. భారత్ ఛాంపియన్స్ ట్రోఫీ జట్టు లో స్థానం పొందలేకపోయిన సిరాజ్ తన విమర్శకులను సమాధానము చెప్పాలని, తన కెరీర్ను తిరిగి ట్రాక్లోకి తీసుకురావాలని పట్టుదలతో ఉన్నాడు.గుజరాత్ టైటాన్స్ జట్టురషీద్ ఖాన్, శుబ్మాన్ గిల్, సాయి సుదర్శన్, రాహుల్ తెవాటియా, షారుఖ్ ఖాన్, కగిసో రబాడ, జోస్ బట్లర్. మహమ్మద్ సిరాజ్, ప్రసిద్ధ్ కృష్ణ, నిషాంత్ సింధు, మహిపాల్ లోమ్రోర్, కుమార్ కుషాగ్ర, అనుజ్ రావత్, మానవ్ సుతార్, వాషింగ్టన్ సుందర్, జెరాల్డ్ కోట్జీ, అర్షద్ ఖాన్, గుర్నూర్ బ్రార్, షెర్ఫాన్ రూథర్ఫోర్డ్, సాయి కిషోర్, ఇషాంత్ శర్మ, జయంత్ యాదవ్, గ్లెన్ ఫిలిప్స్, కరీం జనత్, కుల్వంత్ ఖేజ్రోలియా. చదవండి: విధ్వంసకర వీరులు.. పంత్కు పగ్గాలు.. లక్నో ఫైనల్ చేరుతుందా? -
అతడిని కెప్టెన్ చేస్తారా?.. అదే జరిగితే..: స్టువర్ట్ బ్రాడ్ వార్నింగ్
వన్డే క్రికెట్లో ఇంగ్లండ్ జట్టు గత కొంతకాలంగా గడ్డు పరిస్థితులు ఎదుర్కొంటోంది. ముఖ్యంగా ఐసీసీ టోర్నమెంట్లలో ఘోర పరాభవాలు చవిచూసింది. భారత్ వేదికగా వన్డే వరల్డ్కప్-2023 (ICC ODI World Cup)లో డిఫెండింగ్ చాంపియన్గా బరిలోకి దిగిన బట్లర్ బృందం... కనీసం సెమీస్ చేరకుండానే నిష్క్రమించింది.చరిత్రలోనూ ఎన్నడూ లేని విధంగా అఫ్గనిస్తాన్ జట్టు చేతిలోనూ ఓటమిపాలై విమర్శలు మూటగట్టుకుంది. ఇక ఇటీవల ముగిసిన ఐసీసీ చాంపియన్స్ ట్రోఫీ-2025 (ICC Champions Trophy) టోర్నీలోనూ ఇదే ఫలితాన్ని పునరావృతం చేసింది. గ్రూప్-బి మ్యాచ్లలో భాగంగా ఆస్ట్రేలియా, అఫ్గనిస్తాన్ సౌతాఫ్రికా చేతిల్లో హ్యాట్రిక్ ఓటములు చవిచూసి.. టోర్నీ నుంచి నిష్క్రమించింది.అంతకు ముందు టీమిండియాతో వన్డే సిరీస్లోనూ ఇంగ్లండ్ 3-0తో క్లీన్స్వీప్నకు గురైంది. ఈ పరిణామాల నేపథ్యంలో జోస్ బట్లర్ (Jos Buttler) ఇంగ్లండ్ టీ20, వన్డే జట్ల సారథ్య బాధ్యతల నుంచి తప్పుకొన్నాడు. చాంపియన్స్ ట్రోఫీలో జట్టు దారుణ వైఫల్యానికి బాధ్యత వహిస్తూ కెప్టెన్సీకి రాజీనామా చేశాడు.బట్లర్ వారసుడిగా స్టోక్స్? ఈ నేపథ్యంలో బట్లర్ స్థానంలో యువ బ్యాటర్, వైస్ కెప్టెన్ హ్యారీ బ్రూక్ నియామకం దాదాపు ఖరారైందనే వార్తలు రాగా.. ఇంగ్లండ్ జట్టు మేనేజింగ్ డైరెక్టర్ రాబర్ట్ కీ మాత్రం భిన్నంగా స్పందించాడు. బట్లర్ వారసుడిగా బెన్ స్టోక్స్ పగ్గాలు చేపట్టే అవకాశం ఉందని తెలిపాడు. ఈ అంశంపై ఇంగ్లండ్ దిగ్గజ పేసర్ స్టువర్ట్ బ్రాడ్ తాజాగా స్పందించాడు.బెన్ స్టోక్స్ను గనుక వన్డే జట్టు కెప్టెన్ను చేస్తే అంతకంటే అనాలోచిత నిర్ణయం మరొకటి ఉండదని బ్రాడ్ అభిప్రాయపడ్డాడు. ఒకవేళ అదే జరిగితే ఈ విషయం గురించి మాట్లాడటం కూడా వృథా ప్రయాసేనని పేర్కొన్నాడు. ఇప్పటికే స్టోక్స్పై పనిభారం ఎక్కువై.. గాయాల బారిన పడుతున్నాడని.. అలాంటిది అదనపు బాధ్యతలు అప్పగిస్తే అతడి పరిస్థితి ఏమిటని ప్రశ్నించాడు.అంతకంటే చెత్త నిర్ణయం మరొకటి ఉండదుఈ మేరకు... ‘‘స్టోక్స్ను కెప్టెన్గా నియమిస్తే అంతకంటే నిరాశ కలిగించే విషయం మరొకటి ఉండదు. ఇంగ్లండ్ బోర్డు గనుక ఈ పని చేస్తే.. అప్పుడు స్పందించడానికి నా దగ్గర మాటలు ఉండవు. ముందుగా షెడ్యూల్ను దృష్టిలో పెట్టుకోవాలి.టెస్టు క్రికెట్కు ప్రాధాన్యం ఇచ్చే క్రమంలో అతడు ఐపీఎల్ను వదిలేశాడు. కీలక సిరీస్లలో సత్తా చాటాలనే ఉద్దేశంతో ఫిట్గా ఉండేందుకు తగిన జాగ్రత్తలు తీసుకుంటున్నాడు. గడిచిన మూడేళ్లలో స్టోక్స్ ఎన్ని ఓవర్లు బౌల్ చేశాడో గుర్తుందా?మోకాలి గాయం వల్ల అతడు సతమతమైపోతున్నాడు. ఇలాంటి సమయంలో యాభై ఓవర్ల ఫార్మాట్లో ఎనిమిది నుంచి తొమ్మిది ఓవర్ల వేయాలంటూ అతడిపై అదనపు భారం మోపడం ఏమాత్రం సరికాదు. గణాంకాలతో పనిలేదు.121 వన్డే ఇంటర్నేషనల్స్ ఆడిన క్రికెటర్గా చెబుతున్నా.. టెస్టు మ్యాచ్ ఆడటం కంటే యాభై ఓవర్ల ఫార్మాట్లో మ్యాచ్ ఆడటం వల్లే ఆటగాళ్లు ఎక్కువగా అలసిపోతారు’’ అని స్టువర్ట్ బ్రాడ్ పేర్కొన్నాడు. స్టోక్స్పై అదనపు భారం మోపితే.. పరిస్థితులు మరింత దిగజారిపోతాయంటూ ఇంగ్లండ్ బోర్డును ఈ సందర్భంగా హెచ్చరించాడు.గాయాలతో సావాసంకాగా 33 ఏళ్ల సీమ్ బౌలింగ్ ఆల్రౌండర్ స్టోక్స్ ప్రస్తుతం టెస్టు జట్టు కెప్టెన్గా ఉన్నాడు. ఇక జూలై 2022లో వన్డే క్రికెట్కు రిటైర్మెంట్ ప్రకటించిన అతడు.. వన్డే వరల్డ్కప్-2023కి ముందు తన నిర్ణయాన్ని మార్చుకున్నాడు. అయితే, ఈ మెగా టోర్నీ తర్వాత మళ్లీ స్టోక్స్ ఇంగ్లండ్ తరఫున వైట్బాల్ క్రికెట్ ఆడనేలేదు. గత రెండేళ్లుగా అతడు మోకాలి నొప్పితో ఇబ్బందులు పడుతున్నాడు. 2024 ది హండ్రెడ్ లీగ్ సమయంలో మరోసారి గాయపడ్డ స్టోక్స్.. శ్రీలంకతో టెస్టు సిరీస్కు దూరమయ్యాడు. అనంతరం న్యూజిలాండ్తో సిరీస్కూ గైర్హాజరైన స్టోక్స్.. సర్జరీ చేయించుకున్నాడు. ఈ నేపథ్యంలో స్టోక్స్ను పరిమిత ఓవర్ల క్రికెట్ కెప్టెన్గా తీసుకువస్తే అతడి కెరీర్కే ప్రమాదమని స్టువర్ట్ బ్రాడ్ అభిప్రాయపడ్డాడు.చదవండి: CT 2025: కేఎల్ రాహుల్, శ్రేయస్ అయ్యర్లకు దక్కని చోటు.. కెప్టెన్గా అతడు! -
SA vs Eng: ఇంగ్లండ్కు ఘోర అవమానం.. బాధతో బట్లర్ బైబై
చాంపియన్స్ ట్రోఫీ-2025(ICC Champions Trophy)లో ఇంగ్లండ్కు ఘోర పరాభవం ఎదురైంది. ఒక్క మ్యాచ్ కూడా గెలవకుండానే ఈ ఐసీసీ వన్డే టోర్నమెంట్ నుంచి నిష్క్రమించింది. సౌతాఫ్రికాతో శనివారం నాటి మ్యాచ్తో పరాజయాల పరంపరను పరిపూర్ణం చేసుకుని ఇంటిబాట పట్టింది.ఈ మెగా టోర్నీలో గ్రూప్-‘బి’ నుంచి ఆస్ట్రేలియా, సౌతాఫ్రికా, అఫ్గనిస్తాన్లతో కలిసి ఇంగ్లండ్ బరిలోకి దిగింది. తమ తొలి మ్యాచ్లో ఆస్ట్రేలియాను ఎదుర్కొన్న బట్లర్ బృందం.. ఐదు వికెట్ల తేడాతో ఓడిపోయింది. అనంతరం అఫ్గనిస్తాన్తో తలపడ్డ ఇంగ్లండ్.. ఆఖరి వరకు పోరాడి అనూహ్య రీతిలో ఎనిమిది పరుగుల స్వల్ప తేడాతో పరాజయాన్ని చవిచూసింది.ఇప్పటి వరకు ఇదే అత్యల్ప స్కోరుఈ క్రమంలో సెమీస్ రేసు నుంచి వైదొలిగిన ఇంగ్లిష్ జట్టు.. ఆఖరిగా సౌతాఫ్రికా(England vs South Africa)తో మ్యాచ్లోనైనా గెలవాలని భావించింది. కానీ ప్రొటిస్ జట్టు బట్లర్ బృందానికి ఆ అవకాశం ఇవ్వలేదు. కరాచీ వేదికగా శనివారం నాటి మ్యాచ్లో టాస్ గెలిచిన ఇంగ్లండ్ తొలుత బ్యాటింగ్ చేసింది. అయితే, సౌతాఫ్రికా బౌలర్ల ధాటికి 179 పరుగులకే కుప్పకూలింది.ఓపెనర్లలో ఫిల్ సాల్ట్(8), వన్డౌన్ బ్యాటర్ జామీ స్మిత్(0)లతో సహా హ్యారీ బ్రూక్(19), లియామ్ లివింగ్స్టోన్(9) పూర్తిగా విఫలమయ్యారు. మిగతా వాళ్లలో జో రూట్ 37 పరుగులతో టాప్ రన్ స్కోరర్గా నిలవగా.. జోస్ బట్లర్(Jos Buttler- 21), జో జోఫ్రా ఆర్చర్(25) ఫర్వాలేదనిపించారు. ఈ క్రమంలో 179 పరుగులకే ఇంగ్లండ్ ఆలౌట్ కాగా.. చాంపియన్స్ ట్రోఫీ-2025లో ఇప్పటి వరకు ఇదే అత్యల్ప స్కోరుగా నమోదైంది.ఇక స్వల్ప లక్ష్యంతో బరిలోకి దిగిన సౌతాఫ్రికా 29.1 ఓవర్లలోనే పనిపూర్తి చేసింది. ఓపెనర్లలో రియాన్ రికెల్టన్(27) ఫర్వాలేదనిపించగా.. తన ప్రొఫెషనల్ కెరీర్లో తొలిసారిగా ఓపెనర్గా వచ్చిన ట్రిస్టన్ స్టబ్స్ డకౌట్ అయ్యాడు. అయితే, వన్డౌన్ బ్యాటర్ రాసీ వాన్ డెర్ డసెన్, హెన్రిచ్ క్లాసెన్ అర్ధ శతకాలతో చెలరేగారు. బాధతో బట్లర్ బైబైడసెన్ 87 బంతుల్లో 72 పరుగులతో అజేయంగా నిలవగా.. క్లాసెన్ 56 బంతుల్లో 64 రన్స్ సాధించాడు. ఈ క్రమంలో మూడు వికెట్లు కోల్పోయి సౌతాఫ్రికా టార్గెట్ను ఛేదించింది. సెమీస్ చేరడంతో పాటు గ్రూప్-బి టాపర్గా నిలిచింది. ఇక ఇదే గ్రూపు నుంచి ఆస్ట్రేలియా ఇప్పటికే సెమీస్ చేరగా.. గ్రూప్-ఎ నుంచి భారత్, న్యూజిలాండ్ తమ బెర్తులు ఖరారు చేసుకున్నాయి. ఇదిలా ఉంటే.. పరిమిత ఓవర్ల క్రికెట్లో ఇంగ్లండ్ వరుస పరాభవాల నేపథ్యంలో బట్లర్ కెప్టెన్సీకి గుడ్బై చెప్పాడు. అఫ్గనిస్తాన్తో మ్యాచ్ తర్వాత తన నిర్ణయాన్ని వెల్లడించిన బట్లర్.. సౌతాఫ్రికా చేతిలో ఓటమి వల్ల చేదు అనుభవంతో తన కెప్టెన్సీ కెరీర్ను ముగించాడు.సౌతాఫ్రికా వర్సెస్ ఇంగ్లండ్👉వేదిక: నేషనల్ స్టేడియం, కరాచి👉టాస్: ఇంగ్లండ్..బ్యాటింగ్👉ఇంగ్లండ్ స్కోరు: 179 (38.2)👉సౌతాఫ్రికా స్కోరు: 181/3 (29.1)👉ఫలితం: ఏడు వికెట్ల తేడాతో ఇంగ్లండ్పై సౌతాఫ్రికా విజయం👉ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్: మార్కో యాన్సెన్(3/39).చదవండి: Champions Trophy: టీమిండియాకు గుడ్ న్యూస్.. -
‘సెంచరీ’ కొట్టేసిన సౌతాఫ్రికా బౌలర్.. అరుదైన ఘనత
సౌతాఫ్రిక్రా ఫాస్ట్ బౌలర్ లుంగి ఎంగిడి(Lungi Ngidi) కీలక మైలురాయిని చేరుకున్నాడు. వన్డే ఫార్మాట్లో వంద వికెట్ల క్లబ్లో చేరాడు. ఐసీసీ చాంపియన్స్ ట్రోఫీ-2025(ICC Champions Trophy)లో భాగంగా ఇంగ్లండ్తో మ్యాచ్ సందర్భంగా ఎంగిడి ఈ ఘనత సాధించాడు. అంతేకాదు.. తక్కువ బంతుల్లోనే వన్డేల్లో వంద వికెట్లు(100 ODI Wickets) తీసిన రెండో సౌతాఫ్రికా బౌలర్గానూ ఈ రైటార్మ్ పేసర్ రికార్డులకెక్కాడు.పాకిస్తాన్ వేదికగా ఫిబ్రవరి 19న మొదలైన చాంపియన్స్ ట్రోఫీ టోర్నమెంట్ ముగింపు దశకు చేరుకుంటోంది. గ్రూప్-‘ఎ’ నుంచి భారత్, బంగ్లాదేశ్, న్యూజిలాండ్, పాకిస్తాన్.. గ్రూప్-‘బి’ నుంచి ఆస్ట్రేలియా, సౌతాఫ్రికా, అఫ్గనిస్తాన్, ఇంగ్లండ్ పోటీపడుతున్న ఈ వన్డే టోర్నీలో ఇప్పటికే సెమీస్ బెర్తులు ఖరారయ్యాయి.38.2 ఓవర్లలోనే ఖేల్ ఖతంగ్రూప్-‘ఎ’ నుంచి భారత్, న్యూజిలాండ్ సెమీ ఫైనల్లో అడుగుపెట్టగా.. గ్రూప్-‘బి’ నుంచి ఆస్ట్రేలియాతో పాటు సౌతాఫ్రికా కూడా సెమీస్కు అర్హత సాధించింది. లీగ్ దశలో తమ చివరి మ్యాచ్లో భాగంగా శనివారం నాటి మ్యాచ్లో ఇంగ్లండ్ను 179 పరుగులకే ఆలౌట్ చేసిన క్రమంలో సెమీ ఫైనల్ బెర్తును ఖరారు చేసుకుంది.ఇంగ్లండ్తో కరాచీ వేదికగా టాస్ ఓడి తొలుత బౌలింగ్ చేసిన సౌతాఫ్రికా.. 38.2 ఓవర్లలోనే ప్రత్యర్థి ఆట కట్టించింది. పేసర్లలో మార్కో యాన్సెన్, వియాన్ ముల్దర్ మూడేసి వికెట్లతో చెలరేగగా.. కగిసో రబడ, లుంగి ఎంగిడి ఒక్కో వికెట్ పడగొట్టారు. స్పిన్నర్ కేశవ్ మహరాజ్ రెండు వికెట్లు తన ఖాతాలో వేసుకున్నాడు. ఇంగ్లండ్ బ్యాటర్లలో 37 పరుగులతో జో రూట్ టాప్ రన్స్కోరర్గా నిలిచాడు.మిగతా వాళ్లలో బెన్ డకెట్(24), బట్లర్(21), జోఫ్రా ఆర్చర్(25) మాత్రమే ఇరవై పరుగుల మార్కు దాటారు. ఇదిలా ఉంటే.. ఈ మ్యాచ్లో ఇంగ్లండ్ కెప్టెన్ జోస్ బట్లర్ను అవుట్ చేయడం ద్వారా తన కెరీర్లో కీలక మైలురాయిని అందుకున్నాడు. ఎంగిడి బౌలింగ్లో 21 పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద.. కేశవ్ మహరాజ్కు క్యాచ్ ఇచ్చి బట్లర్ నిష్క్రమించాడు. ఇక ఎంగిడికి ఇది వన్డేల్లో వందో వికెట్ కావడం విశేషం. అంతేకాదు.. సౌతాఫ్రికా తరఫున తక్కువ బంతుల్లోనే ఈ ఫీట్ అందుకున్న రెండో బౌలర్గానూ ఎంగిడి నిలిచాడు. ఇక ఓవరాల్గా సౌతాఫ్రికా బౌలర్లలో ఈ ఘనత సాధించిన పదమూడో బౌలర్ ఎంగిడి.వన్డేల్లో సౌతాఫ్రికా తరఫున తక్కువ బంతుల్లోనే వంద వికెట్లు తీసిన బౌలర్లు1. మోర్నీ మోర్కెల్- 2859 బంతుల్లో వంద వికెట్లు2. లుంగి ఎంగిడి- 3048 బంతుల్లో వంద వికెట్లు3. ఇమ్రాన్ తాహిర్- 3050 బంతుల్లో వంద వికెట్లు.ఇంగ్లండ్ వర్సెస్ సౌతాఫ్రికా తుదిజట్లుసౌతాఫ్రికాట్రిస్టన్ స్టబ్స్, ర్యాన్ రికెల్టన్, రాసీ వాన్ డెర్ డస్సెన్, ఐడెన్ మార్క్రమ్(కెప్టెన్), హెన్రిచ్ క్లాసెన్(వికెట్ కీపర్), డేవిడ్ మిల్లర్, వియాన్ ముల్డర్, మార్కో జాన్సెన్, కేశవ్ మహరాజ్, కగిసో రబడ, లుంగి ఎంగిడి.ఇంగ్లండ్ఫిలిప్ సాల్ట్, బెన్ డకెట్, జామీ స్మిత్(వికెట్ కీపర్), జో రూట్, హ్యారీ బ్రూక్, జోస్ బట్లర్(కెప్టెన్), లియామ్ లివింగ్స్టోన్, జామీ ఓవర్టన్, జోఫ్రా ఆర్చర్, ఆదిల్ రషీద్, సకీబ్ మహమూద్.చదవండి: Karun Nair: మళ్లీ శతక్కొట్టాడు.. సెలబ్రేషన్స్తో సెలక్టర్లకు స్ట్రాంగ్ మెసేజ్! A tough outing for #JosButtler ends as #LungiNgidi finally gets his wicket. The English batter departs after battling hard in a challenging situation.#ChampionsTrophyOnJioStar 👉 #SAvENG | LIVE NOW on Star Sports 2 & Sports18-1 pic.twitter.com/fFMdIRyYeS— Star Sports (@StarSportsIndia) March 1, 2025 -
CT 2025: అఫ్గనిస్తాన్ ఆశలు ఆవిరి! సెమీస్కు సౌతాఫ్రికా
ICC Champions Trophy 2025: ఇంగ్లండ్తో మ్యాచ్లో సౌతాఫ్రికా బౌలర్లు ఆకాశమే హద్దుగా చెలరేగారు. ఆది నుంచే బట్లర్ బృందానికి చుక్కలు చూపించి... స్వల్ప స్కోరుకే పరిమితం చేశారు. 38.2 ఓవర్లలోనే ఇంగ్లండ్ బ్యాటర్ల ఆట కట్టించి 179 పరుగులకే ఆలౌట్ చేశారు.తద్వారా అఫ్గనిస్తాన్ సెమీస్ ఆశలపై నీళ్లు చల్లిన ప్రొటిస్ బౌలర్లు.. సౌతాఫ్రికా సెమీ ఫైనల్(Semi Final) బెర్తును అనధికారికంగా ఖరారు చేశారు. ఐసీసీ చాంపియన్స్ ట్రోఫీ-2025లో గ్రూప్-‘బి’ ఆఖరి లీగ్ దశ మ్యాచ్లో సౌతాఫ్రికా ఇంగ్లండ్కు చేదు అనుభవాన్ని మిగిల్చింది. కరాచీలో శనివారం నాటి ఈ మ్యాచ్లో టాస్ గెలిచిన ఇంగ్లండ్ తొలుత బ్యాటింగ్ ఎంచుకోగా.. పేసర్ మార్కో యాన్సెన్(Marco Jancen) టాపార్డర్ను కుప్పకూల్చాడు.ఆకాశమే హద్దుగాఓపెనర్లు ఫిల్ సాల్ట్(8), బెన్ డకెట్(24), వన్డౌన్ బ్యాటర్ జేమీ స్మిత్(0)ల వికెట్లను యాన్సెన్ తన ఖాతాలో వేసుకున్నాడు. మిగతా వాళ్లలో పేస్ బౌలర్ వియాన్ ముల్దర్ ప్రమాదకర బ్యాటర్ జో రూట్(44 బంతుల్లో 37)ను అద్బుత రీతిలో బౌల్డ్ చేయడంతో పాటు.. టెయిలెండర్లు జోఫ్ ఆర్చర్(31 బంతుల్లో 25), ఆదిల్ రషీద్(2)లను పెవిలియన్కు పంపాడు.ఇక స్పిన్నర్ కేశవ్ మహరాజ్ హ్యారీ బ్రూక్(19), కెప్టెన్ జోస్ బట్లర్(21)ల రూపంలో రెండు కీలక వికెట్లు దక్కించుకోగా.. పేసర్ కగిసో రబడ జేమీ ఓవర్టన్(11) వికెట్ను తన ఖాతాలో వేసుకున్నాడు. ఈ క్రమంలో 38.2 ఓవర్లలో కేవలం 179 పరుగులు మాత్రమే చేసి ఇంగ్లండ్ ఆలౌట్ అయింది.ఇదిలా ఉంటే.. గ్రూప్-‘బి’ నుంచి ఆస్ట్రేలియా ఇప్పటికే సెమీ ఫైనల్ చేరిన విషయం తెలిసిందే. అయితే, రెండో బెర్తును సౌతాఫ్రికా దాదాపు ఖాయం చేసుకున్నా.. టెక్నికల్గా అఫ్గనిస్తాన్ కూడా.. ఈ మ్యాచ్కు ముందు రేసులో ఉంది. సౌతాఫ్రికాతో మ్యాచ్లో ఇంగ్లండ్ ముందుగా బ్యాటింగ్ చేసి 300 పరుగులు చేయడం సహా.. ప్రొటిస్ను కనీసం 207 పరుగుల తేడాతో ఓడించాలి. హష్మతుల్లా బృందానికి నిరాశేఅప్పుడే అఫ్గనిస్తాన్ ఆశలు సజీవంగా ఉంటాయి. అయితే, సౌతాఫ్రికా బౌలర్లు హష్మతుల్లా బృందం ఆశలను ఇలా అడియాసలు చేశారు. కాగా గ్రూప్-‘బి’లో భాగంగా సౌతాఫ్రికా తొలుత అఫ్గనిస్తాన్తో తలపడి ఏకంగా 107 పరుగుల తేడాతో చిత్తు చేసింది. తద్వారా భారీ నెట్ రన్రేటు(+2.140) సాధించింది. ఈ క్రమంలో తమ తర్వాతి ఆస్ట్రేలియాతో ఆడాల్సిన మ్యాచ్ వర్షం రద్దైనా ప్రొటిస్ జట్టు పటిష్ట స్థితిలోనే నిలిచింది. ఈ నేపథ్యంలో ఆస్ట్రేలియా- అఫ్గనిస్తాన్ మధ్య శుక్రవారం నాటి మ్యాచ్లో గెలిచిన జట్టు గ్రూప్-బి నుంచి సెమీస్ చేరే అవకాశం ఉండగా.. వరుణుడి వల్ల ఈ మ్యాచ్ కూడా అర్ధంతరంగా ముగిసింది.ఈ క్రమంలో అప్పటికే రెండు పాయింట్లు(ఇంగ్లండ్పై గెలుపొంది) కలిగి ఉన్న ఆసీస్.. నిన్నటి మ్యాచ్ రద్దైన కారణంగా మరో పాయింట్ సాధించింది. తద్వారా గ్రూప్-బి నుంచి సెమీస్ చేరిన తొలి జట్టుగా నిలిచింది. ఇదిలా ఉంటే.. గ్రూప్- ఎ నుంచి భారత్, న్యూజిలాండ్.. పాకిస్తాన్, బంగ్లాదేశ్లను చిత్తు చేసి సెమీస్ బెర్తులు ఖరారు చేసుకున్నాయి. ఇక ఇంగ్లండ్ విధించిన స్వల్ప లక్ష్యాన్ని ఛేదించడంతో సంబంధం లేకుండా సౌతాఫ్రికా కూడా టాప్-4కు చేరుకుంది.సౌతాఫ్రికా- ఇంగ్లండ్ మ్యాచ్ ఇన్నింగ్స్ బ్రేక్ సమయానికి గ్రూప్-బి పాయింట్ల పట్టిక1. ఆస్ట్రేలియా- పూర్తైనవి మూడు- ఒక గెలుపు- రెండు రద్దు- పాయింట్లు 4- నెట్ రన్రేటు (+0.475)2. సౌతాఫ్రికా- పూర్తైనవి రెండు- ఒక గెలుపు- ఒకటి రద్దు- పాయింట్లు మూడు- నెట్ రన్రేటు (+2.140)3. అఫ్గనిస్తాన్- ఆడింది మూడు- గెలిచింది ఒకటి- ఓడింది ఒకటి- ఒకటి రద్దు - పాయింట్లు 3- నెట్ రన్రేటు (-0.990)4. ఇంగ్లండ్- ఆడింది రెండు- ఓడింది రెండు- పాయింట్లు సున్నా- నెట్ రన్రేటు (-0.305)చదవండి: Karun Nair: మళ్లీ శతక్కొట్టాడు.. సెలబ్రేషన్స్తో సెలక్టర్లకు స్ట్రాంగ్ మెసేజ్! -
SA vs ENG: హిట్టర్లు వచ్చేశారు..! కీలక మ్యాచ్లో బవుమా లేకుండానే..
చాంపియన్స్ ట్రోఫీ-2025(ICC Champions Trophy)లో మరో ఆసక్తికపోరుకు రంగం సిద్దమైంది. గ్రూప్-‘బి’ ఆఖరి లీగ్ మ్యాచ్లో భాగంగా సౌతాఫ్రికా- ఇంగ్లండ్(South Africa vs England) తలపడనున్నాయి. కరాచీ వేదికగా శనివారం నాటి ఈ మ్యాచ్లో టాస్ గెలిచిన ఇంగ్లండ్ తొలుత బ్యాటింగ్ ఎంచుకోగా.. ప్రొటిస్ జట్టు బౌలింగ్కు సిద్ధమైంది.కాగా ఈ ఐసీసీ వన్డే టోర్నీ నుంచి ఇంగ్లండ్ ఇప్పటికే నిష్క్రమించిన విషయం తెలిసిందే. అయితే, ఆఖరి మ్యాచ్లోనైనా గెలిచి పరువు నిలబెట్టుకోవాలని పట్టుదలగా ఉంది. మరోవైపు.. ఎలాంటి సమీకరణలతో పనిలేకుండా సెమీ ఫైనల్లో అడుగుపెట్టాలంటే సౌతాఫ్రికా ఈ మ్యాచ్లో తప్పక గెలవాల్సిందే. కాబట్టి ప్రొటిస్ జట్టుకు కూడా ఇంగ్లండ్తో పోరు కీలకంగా మారడంతో మ్యాచ్ మరింత రసవత్తరం కానుంది.హిట్టర్లు వచ్చేశారు..! కీలక మ్యాచ్లో బవుమా లేకుండానే.. అయితే, ఈ మ్యాచ్కు సౌతాఫ్రికా రెగ్యులర్ కెప్టెన్ టెంబా బవుమా(Temba Bavuma) దూరమయ్యాడు. అతడితో పాటు టోనీ డి జోర్జ్ కూడా ఇంగ్లండ్తో మ్యాచ్కు అందుబాటులో లేడని తాత్కాలిక సారథి ఐడెన్ మార్క్రమ్ టాస్ సందర్భంగా వెల్లడించాడు. వీరిద్దరు అనారోగ్యంతో బాధపడుతున్నారని.. బవుమా, టోనీ స్థానాల్లో ట్రిస్టన్ స్టబ్స్, హెన్రిచ్ క్లాసెన్ తుదిజట్టులోకి వచ్చినట్లు తెలిపాడు. గత మ్యాచ్ వర్షం కారణంగా రద్దైందని.. అయితే, ఆ తర్వాత తాము నెట్స్లో తీవ్రంగా శ్రమించి ఇంగ్లండ్తో మ్యాచ్కు సిద్ధమైనట్లు తెలిపాడు.సరైన సమయంలోనేమరోవైపు ఇంగ్లండ్ కెప్టెన్గా చివరి మ్యాచ్ ఆడుతున్న బట్లర్ మాట్లాడుతూ.. తాను సరైన సమయంలోనే కెప్టెన్సీకి రాజీనామా చేసినట్లు తెలిపాడు. అన్నీ ఆలోచించిన తర్వాతే ఈ నిర్ణయం తీసుకున్నానన్నాడు. గాయపడిన మార్క్వుడ్ స్థానంలో సకీబ్ మహబూబ్ జట్టులోకి వచ్చినట్లు పేర్కొన్నాడు. కాగా ఆసీస్, అఫ్గనిస్తాన్ జట్ల చేతిలో ఓటమి తర్వాత ఇంగ్లండ్ నిష్క్రమించగా... గ్రూప్-బి నుంచి ఆస్ట్రేలియా సెమీస్ చేరింది. గ్రూప్-ఎ నుంచి టీమిండియా,న్యూజిలాండ్ బెర్తులు ఖరారు చేసుకున్నాయి.తుదిజట్లుసౌతాఫ్రికాట్రిస్టన్ స్టబ్స్, ర్యాన్ రికెల్టన్, రాసీ వాన్ డెర్ డస్సెన్, ఐడెన్ మార్క్రమ్(కెప్టెన్), హెన్రిచ్ క్లాసెన్(వికెట్ కీపర్), డేవిడ్ మిల్లర్, వియాన్ ముల్డర్, మార్కో జాన్సెన్, కేశవ్ మహరాజ్, కగిసో రబడ, లుంగి ఎన్గిడి.ఇంగ్లండ్ఫిలిప్ సాల్ట్, బెన్ డకెట్, జామీ స్మిత్(వికెట్ కీపర్), జో రూట్, హ్యారీ బ్రూక్, జోస్ బట్లర్(కెప్టెన్), లియామ్ లివింగ్స్టోన్, జామీ ఓవర్టన్, జోఫ్రా ఆర్చర్, ఆదిల్ రషీద్, సకీబ్ మహమూద్.చదవండి: Champions Trophy: ఆసీస్తో కీలక సమరం.. ఆఫ్ఘనిస్తాన్ కొంపముంచిన రషీద్ ఖాన్ -
జోస్ బట్లర్ రాజీనామా.. ఇంగ్లండ్ కొత్త కెప్టెన్ అతడే!?
ఇంగ్లండ్ క్రికెట్లో కెప్టెన్గా జోస్ బట్లర్(Jos Buttler) ప్రస్థానం ముగిసింది. ఇంగ్లండ్ జట్టు పరిమిత ఓవర్ల ఫార్మాట్ కెప్టెన్సీ బాధ్యతల నుంచి తప్పుకుంటున్నట్లు జోస్ బట్లర్ శుక్రవారం ప్రకటించాడు. చాంపియన్స్ ట్రోఫీలో అఫ్గానిస్తాన్ చేతిలో ఓడిన ఇంగ్లండ్ జట్టు నాకౌట్ రేసుకు దూరమైన నేపథ్యంలో బట్లర్ ఈ నిర్ణయం తీసుకున్నాడు.శనివారం దక్షిణాఫ్రికాతో మ్యాచ్ అనంతరం నాయకత్వ బాధ్యతల నుంచి తప్పుకోనున్నట్లు బట్లర్ వెల్లడించాడు. అయితే ఆటగాడిగా జట్టులో కొనసాగుతానని వెల్లడించాడు. ‘కెప్టెన్సీ నుంచి తప్పుకోవాలని నిర్ణయించుకున్నా. ఈ నిర్ణయం నాకు, జట్టుకు మేలు చేస్తుందనుకుంటున్నా. సారథ్య బాధ్యతలను ఇతరులకు అప్పగించేందుకు ఇదే సరైన సమయమని భావిస్తున్నా’ అని బట్లర్ వెల్లడించాడు.అయితే 2022 టీ20 ప్రపంచకప్ను నాయకుడిగా తన జట్టుకు అందించిన బట్లర్.. ఆ తర్వాత జరిగిన ఐసీసీ ఈవెంట్లలో తన మార్క్ను చూపించలేకపోయాడు. 2023లో భారత్ వేదికగా జరిగిన వన్డే ప్రపంచకప్, టీ20 ప్రపంచకప్-2024లో లీగ్ స్టేజిలో ఇంటిముఖం పట్టిన ఇంగ్లీష్ జట్టు.. ఇప్పుడు ఛాంపియన్స్ ట్రోఫీలోనూ అదే ఫలితాన్ని పునరావృతం చేసింది. దీంతో బట్లర్ కెప్టెన్సీ పెద్ద ఎత్తున విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఈ క్రమంలోనే బట్లర్ తన కెప్టెన్సీకి రాజీనామా చేశాడు. అయితే ఇంగ్లండ్ తదుపరి కెప్టెన్ ఎవరన్నది క్రికెట్ వర్గాల్లో ప్రస్తుతం చర్చనీయాంశమైంది.కెప్టెన్గా హ్యారీ బ్రూక్..?పరిమిత ఓవర్ల ఫార్మాట్లో ఇంగ్లండ్ క్రికెట్ జట్టు తదుపరి కెప్టెన్గా మిడిల్-ఆర్డర్ బ్యాటర్ హ్యారీ బ్రూక్ బాధ్యతలు చేపట్టనున్నట్లు తెలుస్తోంది. బ్రూక్ ప్రస్తుతం ఇంగ్లండ్ జట్టు వైస్ కెప్టెన్గా ఉన్నాడు. గతేడాది బట్లర్ గైర్హజరీలో ఆస్ట్రేలియాతో జరిగిన టీ20 సిరీస్లో ఇంగ్లండ్ జట్టు సారథిగా కూడా బ్రూక్ వ్యవహరించాడు.అయితే ఈ సిరీస్ను 3-2 తేడాతో ఇంగ్లండ్ కోల్పోయింది. అయితే జట్టులో లివింగ్ స్టోన్, అదిల్ రషీద్, డకెట్ వంటి సీనియర్లు ఉన్నప్పటికి .. ఇంగ్లండ్ హెడ్ కోచ్ మాత్రం బ్రూక్ వైపే మొగ్గు చూపుతున్నారు. ఇంగ్లండ్ మాజీలు సైతం బ్రూక్ను కెప్టెన్గా నియమించాలని ఈసీబీని సూచిస్తున్నారు. ఇంగ్లండ్ తమ తదుపరి వైట్బాల్ సిరీస్ ఈ ఏడాది మేలో వెస్టిండీస్తో ఆడనుంది. ఈ గ్యాపులో ఇంగ్లండ్ క్రికెట్ జట్టుకు కొత్త వైట్బాల్ కెప్టెన్ వచ్చే ఛాన్స్ ఉంది.చదవండి: Champions Trophy: టీమిండియాకు గుడ్ న్యూస్.. -
ఇంగ్లండ్ కెప్టెన్సీకి జోస్ బట్లర్ రాజీనామా
ఇంగ్లండ్ పరిమిత ఓవర్ల కెప్టెన్సీకి (England White Ball Captaincy) జోస్ బట్లర్ (Jos Buttler) రాజీనామా చేశాడు. ఛాంపియన్స్ ట్రోఫీ-2025లో (Champions Trophy) ఇంగ్లండ్ గ్రూప్ దశలోనే నిష్క్రమించిన నేపథ్యంలో బట్లర్ ఈ నిర్ణయం తీసుకున్నాడు. సౌతాఫ్రికాతో రేపు (మార్చి 1) జరుగబోయే మ్యాచ్ ఇంగ్లండ్ వైట్ బాల్ కెప్టెన్గా బట్లర్కు చివరిది. 2022 జూన్లో బట్లర్ ఇంగ్లండ్ ఫుల్ టైమ్ వైట్ బాల్ కెప్టెన్గా బాధ్యతలు చేపట్టాడు. ఇయాన్ మోర్గాన్ నుంచి బట్లర్ బాధ్యతలు స్వీకరించాడు. బట్లర్ సారథ్యంలో ఇంగ్లండ్ 2022 టీ20 వరల్డ్కప్ గెలిచింది. బట్లర్ సారథ్యంలో ఇంగ్లండ్ వన్డేల్లో దారుణంగా విఫలమైంది. బట్లర్ కెప్టెన్సీలో ఇంగ్లండ్ 12 మ్యాచ్ల్లో గెలిచి 22 మ్యాచ్ల్లో ఓటమిపాలైంది. 2023 వన్డే వరల్డ్కప్లో బట్లర్ నేతృత్వంలోని ఇంగ్లండ్ ఏడో స్థానంలో నిలిచి, సెమీస్కు చేరకుండానే నిష్క్రమించింది. వన్డే వరల్డ్కప్ తర్వాత బట్లర్ నేతృత్వంలో ఇంగ్లండ్ 17లో 13 వన్డేలు ఓడింది.ఛాంపియన్స్ ట్రోఫీ-2025 తొలి మ్యాచ్లో ఇంగ్లండ్ భారీ స్కోర్ చేసినప్పటికీ ఆస్ట్రేలియా చేతిలో ఓటమిపాలైంది. అనంతరం రెండో మ్యాచ్లో పసికూన ఆఫ్ఘనిస్తాన్ చేతిలో స్వల్ప తేడాతో ఓటమిపాలై టోర్నీ నుంచి నిష్క్రమించింది. ఈ మ్యాచ్ పూర్తయిన వెంటనే బట్లర్ రాజీనామా విషయమై హింట్ ఇచ్చాడు. తాజాగా అధికారికంగా తన రాజీనామాను ప్రకటించాడు. భారత్ సిరీస్లోనూ ఘోర పరాభవంబట్లర్ నేతృత్వంలోని ఇంగ్లండ్ జట్టు ఛాంపియన్స్ ట్రోఫీకి ముందు భారత పర్యటనలోనూ దారుణంగా విఫలమైంది. ఈ పర్యటనలో ఇంగ్లండ్ ఐదు మ్యాచ్ల టీ20 సిరీస్ను 1-4 తేడాతో.. మూడు మ్యాచ్ల వన్డే సిరీస్ను 0-3 తేడాతో (క్లీన్ స్వీప్) కోల్పోయింది. భారత్తో సిరీస్లు ముగిసిన వెంటనే బట్లర్పై విమర్శలు తారాస్థాయికి చేరాయి. కెప్టెన్సీ నుంచి తప్పుకోవాలని పెద్ద ఎత్తును డిమాండ్లు వినిపించాయి.వ్యక్తిగతంగానూ దారుణంగా విఫలమవుతున్న బట్లర్పరిమిత ఓవర్లలో జట్టును విజయవంతంగా నడిపించలేకపోయిన బట్లర్.. వ్యక్తిగతంగానూ దారుణంగా విఫలమయ్యాడు. బట్లర్ బ్యాట్ నుంచి ఓ మంచి ఇన్నింగ్స్ జాలువారి చాలాకాలం అయ్యింది. భారత్ పర్యటనలో.. ప్రస్తుతం ఛాంపియన్స్ ట్రోఫీలోనూ బట్లర్ తేలిపోయాడు. ఫామ్ లేమితో సతమతమవుతున్న బట్లర్ గాయాలతోనూ వేధించబడుతున్నాడు. 2023 వన్డే వరల్డ్కప్, 2024 టీ20 వరల్డ్కప్లో డిఫెండింగ్ ఛాంపియన్గా బరిలోకి దిగిన ఇంగ్లండ్.. బట్లర్ నాయకత్వంలో టైటిల్ నిలబెట్టుకోవడంలో విఫలమైంది. ఇంగ్లండ్ తదుపరి వైట్ బాల్ కెప్టెన్గా హ్యారీ బ్రూక్ను నియమించాలని ఆ దేశ అభిమానలు కోరుకుంటున్నారు. -
‘గర్వం తలకెక్కింది.. అందుకే అందరు ఓడిపోవాలనే కోరుకున్నారు’
ఇంగ్లండ్ క్రికెట్ జట్టుపై ఆ దేశ మాజీ బ్యాటర్ మార్క్ బుచర్(Mark Butcher) ఆగ్రహం వ్యక్తం చేశాడు. గర్వ తలకెక్కితే ఇలాంటి చేదు అనుభవాలే చూడాల్సి వస్తుందంటూ ఘాటు విమర్శలు చేశాడు. ఇప్పటికైనా కళ్లు తెరిచి ఆటపై కాస్త దృష్టి పెట్టాలంటూ హితవు పలికాడు. కాగా ఐసీసీ వన్డే వరల్డ్కప్-2023(ICC ODI World Cup)లో పేలవ ప్రదర్శన కనబరిచిన ఇంగ్లండ్.. తాజాగా చాంపియన్స్ ట్రోఫీ-2025(ICC Champions Trophy)లోనూ తీవ్రంగా నిరాశపరిచింది.సెమీస్ కూడా చేరకుండానేగ్రూప్-‘బి’లో భాగంగా ఆస్ట్రేలియా, అఫ్గనిస్తాన్ జట్ల చేతిలో ఓడి కనీసం సెమీస్ కూడా చేరకుండానే టోర్నమెంట్ నుంచి నిష్క్రమించింది. ఈ రెండు మ్యాచ్లలో ఏమాత్రం కష్టపడినా ఇంగ్లండ్ గెలిచేదే. ముఖ్యంగా అఫ్గన్తో మ్యాచ్లో జో రూట్(120)కు ఒక్కరు సహకారం అందించినా బట్లర్ బృందం గట్టెక్కేదే. కానీ ఎనిమిది పరుగుల స్వల్ప తేడాతో ఓడి ఘోర పరాభవాన్ని మూటగట్టుకుంది.ఇక ఈ వన్డే టోర్నీకి ముందు భారత్లో పర్యటించిన ఇంగ్లండ్ జట్టు.. ఐదు మ్యాచ్ల టీ20 సిరీస్లో 4-1తో ఓడింది. అదే విధంగా సిరీస్లో రోహిత్ సేన చేతిలో వన్డే 3-0తో క్లీన్స్వీప్నకు గురైంది. ఈ నేపథ్యంలో నాడు ఇంగ్లండ్ ఓపెనర్ బెన్ డకెట్ మాట్లాడుతూ.. వైట్వాష్ పరాజయాన్ని తాము లెక్కచేయమని.. చాంపియన్స్ ట్రోఫీ గెలవడమే తమ లక్ష్యమని పేర్కొన్నాడు. అయితే, అది జరగదని ఇప్పటికే తేలిపోయింది.గర్వం తలకెక్కిందిఈ నేపథ్యంలో మార్క్ బుచర్ విజ్డన్తో మాట్లాడుతూ.. బట్లర్ బృందం తీరుపై మండిపడ్డాడు. ఆటగాళ్ల గర్వం, నిర్లక్ష్య ధోరణి వల్లే... ప్రతి ఒక్కరు ఇంగ్లండ్ జట్టు ఓడిపోవాలని కోరుకున్నారని.. ఇకనైనా దూకుడు స్వభావాన్ని విడిచిపెట్టాలని ఆటగాళ్లకు సూచించాడు. ‘‘చాలా మంది అఫ్గనిస్తాన్తో మ్యాచ్లో ఇంగ్లండ్ ఓడిపోవాలని ఎందుకు కోరుకున్నారో నాకు తెలుసు.ఇంగ్లండ్ జట్టుకు గర్వం తలకెక్కింది. వన్డే ఫార్మాట్ అంటే బొత్తిగా లెక్కలేదు. వన్డే వరల్డ్కప్(2019) గెలవడానికి ఎంత కష్టపడ్డారో మరచిపోయారు. గెలిచిన తర్వాత ఇకపై ఆడటం అవసరం లేదన్నట్లుగా వ్యవహరిస్తున్నారు. అహంభావం పెరిగిపోయింది. దాని ఫలితంగానే ఈ చేదు అనుభవాలు.ప్రతి ఒక్కరు ఇంగ్లండ్ ఓడిపోవాలనే కోరుకున్నారుమైదానంలో ఉన్న అఫ్గనిస్తాన్, పాకిస్తాన్ జట్ల అభిమానులే కాదు.. ప్రతి ఒక్కరు ఇంగ్లండ్ ఓడిపోవాలని కోరుకుంది ఇందుకే. ప్రతిసారీ ఆటతో అలరిస్తామని చెబితే సరిపోదు. మ్యాచ్లు కూడా గెలవాలి’’ అంటూ మార్క్ బుచర్ బట్లర్ బృందానికి చురకలు అంటించాడు.కాగా వన్డే వరల్డ్కప్-2023 నుంచి ఇప్పటి వరకు పదహారు వన్డేలు ఆడిన ఇంగ్లండ్ పన్నెండింట ఓడిపోవడం గమనార్హం. ఇక బ్రెండన్ మెకల్లమ్ వన్డే, టీ20 జట్ల హెడ్కోచ్గా వచ్చిన తర్వాత భారత్ చేతిలో క్లీన్స్వీప్, చాంపియన్స్ ట్రోఫీ లీగ్ దశలోనే నిష్క్రమించడంతో విమర్శలు తారస్థాయికి చేరాడు.చాంపియన్స్ ట్రోఫీ-2025లో ఇంగ్లండ్ జట్టుఫిలిప్ సాల్ట్, బెన్ డకెట్, జామీ స్మిత్ (వికెట్ కీపర్), జో రూట్, హ్యారీ బ్రూక్, జోస్ బట్లర్ (కెప్టెన్), లియామ్ లివింగ్స్టోన్, జోఫ్రా ఆర్చర్, జామీ ఓవర్టన్, ఆదిల్ రషీద్, మార్క్ వుడ్, రెహాన్ అహ్మద్, సకీబ్ మహమూద్, టామ్ బాంటన్, గస్ అట్కిన్సన్.చదవండి: CT 2025: ఇక్కడ ఓడిపోయాం.. అక్కడ మాత్రం రాణిస్తాం: పాక్ కెప్టెన్ -
అతడొక అద్భుతం.. క్రెడిట్ తనకే.. బాధగా ఉంది: బట్లర్
చాంపియన్స్ ట్రోఫీ-2025(ICC Champions Trophy)లో ఇంగ్లండ్ ప్రయాణం ముగిసిపోయింది. అఫ్గనిస్తాన్(Afghanistan vs England)తో ఆఖరి వరకు ఉత్కంఠగా సాగిన పోరులో బట్లర్ బృందానికి చేదు అనుభవమే మిగిలింది. ఎనిమిది పరుగుల స్వల్ప తేడాతో అఫ్గన్ గెలుపొంది ఇంగ్లండ్ను టోర్నమెంట్ నుంచి బయటకు పంపింది. తమదైన రోజున ఎంతటి పటిష్ట జట్టునైనా ఓడిస్తామని హష్మతుల్లా బృందం మరోసారి నిరూపించింది.ఈ నేపథ్యంలో ఇంగ్లండ్ కెప్టెన్ జోస్ బట్లర్(Jos Buttler) తీవ్ర నిరాశకు గురికాగా.. అఫ్గనిస్తాన్ సారథి హష్మతుల్లా పట్టరాని సంతోషంలో మునిగిపోయాడు. ఇక ఓటమిపై స్పందించిన బట్లర్.. తామే చేజేతులా కీలక మ్యాచ్ను చేజార్చుకున్నామని విచారం వ్యక్తం చేశాడు. గెలిచే మ్యాచ్లోనూ ఓడిపోవడం కంటే బాధ మరొకటి ఉండదని అన్నాడు.రూట్ అద్భుతమైన ఇన్నింగ్స్ ఆడాడు‘‘టోర్నమెంట్ నుంచి ఇంత త్వరగా నిష్క్రమించడం నిరాశను మిగిల్చింది. అఫ్గనిస్తాన్తో మ్యాచ్లో గెలిచేందుకు మాకు అన్ని అవకాశాలు ఉన్నా వాటిని సద్వినియోగం చేసుకోలేకపోయాం. ఈరోజు రూట్ అద్భుతమైన ఇన్నింగ్స్ ఆడాడు. ఆఖరి పది ఓవర్లలో అంతా తారుమారైంది.క్రెడిట్ తనకేఏదేమైనా ఇబ్రహీం జద్రాన్ అత్యద్భుతంగా బ్యాటింగ్ చేశాడు. అతడికి క్రెడిట్ ఇవ్వాలి. ఇక దురదృష్టవశాత్తూ మార్క్ వుడ్ మోకాలికి గాయమైంది. అయినా సరే తను బౌలింగ్ చేయడం ప్రశంసనీయం. డెత్ ఓవర్లలో ఇలా కీలక బౌలర్ గాయపడటం తీవ్ర ప్రభావం చూపింది. ప్రపంచంలోని అత్యుత్తమ ఆటగాళ్లు ఒకడిగా ఉన్నా నా నుంచి ఇలాంటి ప్రదర్శన ఎంతమాత్రం సరికాదు. అయినా ఈ ఉద్వేగ సమయంలో నేను ఎలాంటి నిర్ణయాలు(రిటైర్మెంట్) తీసుకోను’’ అని బట్లర్ పేర్కొన్నాడు.ఇబ్రహీం జద్రాన్ ప్రతిభావంతుడైన ఆటగాడుఇక అఫ్గనిస్తాన్ కెప్టెన్ హష్మతుల్లా షాహిది మాట్లాడుతూ.. ‘‘ఇది సమిష్టి విజయం. ఈ గెలుపుతో మా దేశం మొత్తం సంతోషంలో మునిగిపోయింది. 2023లో ఇంగ్లండ్ను తొలిసారిగా మేము ఓడించాం. అప్పటి నుంచి రోజురోజుకు మరింతగా మా ఆటకు మెరుగులు దిద్దుకుని.. ఇప్పుడు మరోసారి అదే ఫలితాన్ని పునరావృతం చేశాం.నరాలు తెగే ఉత్కంఠ రేపిన మ్యాచ్లో మాదే పైచేయి కావడం ఆనందంగా ఉంది. ఇబ్రహీం జద్రాన్ ప్రతిభావంతుడైన ఆటగాడు. ఒత్తిడిలోనూ అతడు అద్బుతంగా ఆడాడు. నేను చూసిన వన్డే ఇన్నింగ్స్లో ఇదొక అత్యుత్తమ ప్రదర్శన అని చెప్పగలను.అజ్మత్ కూడా బాగా ఆడాడు. జట్టులో నైపుణ్యాలు గల సీనియర్లతో పాటు జూనియర్లుకూడా ఉండటం మా అదృష్టం. ప్రతి ఒక్కరికి తమ పాత్ర ఏమిటో తెలుసు’’ అని తెలిపాడు.కాగా చాంపియన్స్ ట్రోఫీలో భాగంగా గ్రూప్-బి లో ఉన్న అఫ్గనిస్తాన్- ఇంగ్లండ్ మధ్య బుధవారం వన్డే మ్యాచ్ జరిగింది. లాహోర్లోని గడాఫీ స్టేడియంలో జరిగిన ఈ పోరులో టాస్ గెలిచిన అఫ్గన్ తొలుత బ్యాటింగ్ చేసింది. ఓపెనర్ ఇబ్రహీం జద్రాన్(177) భారీ శతకంతో దుమ్ములేపగా.. హష్మతుల్లా(40), అజ్మతుల్లా(41), మహ్మద్ నబీ(40) రాణించారు. ఫలితంగా నిర్ణీత 50 ఓవర్లలో అఫ్గన్ 325 పరుగుల మేర భారీ స్కోరు సాధించింది.ఇక లక్ష్య ఛేదనలో ఇంగ్లండ్ 317 పరుగులకే పరిమితమైంది. జో రూట్ శతకం(120) సెంచరీ చేయగా.. మిగతా వాళ్లలో ఒక్కరు కూడా కనీసం నలభై పరుగుల మార్కు అందుకోలేదు దీంతో ఎనిమిది పరుగుల స్వల్ప తేడాతో ఇంగ్లండ్కు పరాజయం తప్పలేదు. ఇక ఈ ఓటమితో టోర్నీ నుంచి బట్లర్ బృందం నిష్క్రమించింది. ఈ గ్రూపు నుంచి సౌతాఫ్రికా, ఆస్ట్రేలియా సెమీస్ రేసులో ఫేవరెట్లుగా ఉండగా.. అఫ్గనిస్తాన్ తానూ పోటీలో ఉన్నానంటూ ముందుకు వచ్చింది.చదవండి: Champions Trophy: టీమిండియాకు గుడ్ న్యూస్.. అతడు వచ్చేశాడు -
అఫ్గాన్ చేతిలో ఓటమి.. ఇంగ్లండ్ కెప్టెన్ సంచలన నిర్ణయం!
ఐసీసీ టోర్నమెంట్లలో ఇంగ్లండ్ క్రికెట్ జట్టుకు మరోసారి అఫ్గానిస్తాన్ చేతిలో పరాభావం ఎదురైంది. ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ-2025లో బుధవారం లహోర్ వేదికగా అఫ్గాన్తో జరిగిన మ్యాచ్లో 8 పరుగుల తేడాతో ఇంగ్లండ్ ఓటమి పాలైంది. 326 పరుగుల లక్ష్యఛేదనలో ఇంగ్లండ్.. 49.5 ఓవర్లలో 317 పరుగులకు ఆలౌట్ అయింది.ఓ దశలో సునాయసంగా గెలిచేలా కన్పించిన ఇంగ్లీష్ జట్టు.. వరుస క్రమంలో వికెట్లు కోల్పోవడంతో ఓటమి చవిచూడాల్సింది. దీంతో ఈ మెగా టోర్నీ లీగ్ స్టేజీలోనే ఇంగ్లండ్ ఇంటి ముఖం పట్టాల్సి వచ్చింది. ఈ టోర్నీలో ఇప్పటివరకు ఆడిన రెండు మ్యాచ్ల్లోనూ ఇంగ్లండ్ పరాజయం పాలైంది.జో రూట్ సూపర్ సెంచరీ..ఇంగ్లండ్ బ్యాటర్లలో వెటరన్ ఆటగాడు జో రూట్ అద్బుతమైన సెంచరీతో చెలరేగాడు. రూట్ 111 బంతుల్లో 11 ఫోర్లు, ఒక సిక్సర్తో 120 పరుగులు చేశాడు. ఈ ఇంగ్లండ్ మాజీ కెప్టెన్ మ్యాచ్ ఫినిష్ చేస్తాడని అంతా భావించారు. కానీ 46 ఓవర్లో అనూహ్యంగా రూట్ ఔట్ కావడంతో మ్యాచ్ ఒక్కసారిగా అఫ్గాన్ వైపు మలుపు తిరిగింది. రూట్తో పాటు బెన్ డకెట్ 38, కెప్టెన్ జోస్ బట్లర్ 38, జేమీ ఒవెర్టన్ 32, హ్యారీ బ్రూక్ 25 పరుగులు చేశారు. ఆఫ్ఘన్ బౌలర్లలో అజ్మతుల్లా ఒమర్జాయ్ 5 వికెట్లతో చెలరేగారు. అతడితో పాటు మహ్మద్ నబీ రెండు, , ఫజల్ హక్ ఫరూఖీ, రషీద్ ఖాన్, గుల్బదిన్ నాయబ్ తలా వికెట్ సాధించారు.జద్రాన్ రికార్డు సెంచరీ..ఈ మ్యాచ్ లో టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ చేసిన అఫ్గానిస్తాన్ నిర్ణీత 50 ఓవర్లలో 7 వికెట్లు కోల్పోయి 325 పరుగులు చేసింది. అఫ్గాన్ ఓపెనర్ ఇబ్రహీం జాద్రాన్ రికార్డు సెంచరీ (177)తో చెలరేగాడు. అతడితో పాటు నబీ(40), షాహిదీ(40), అజ్మతుల్లా ఓమర్జాయ్(41) రాణించారు. ఇంగ్లండ్ బౌలర్లలో జోఫ్రా అర్చర్ మూడు వికెట్లు పడగొట్టాడు.కెప్టెన్సీకి జోస్ గుడ్బై..!కాగా ఇంగ్లండ్ కెప్టెన్ జోస్ బట్లర్(Jos Buttler) ప్రస్తుతం గడ్డు పరిస్థితులను ఎదుర్కొంటున్నాడు. వ్యక్తిగత ప్రదర్శన పరంగా పర్వాలేదన్పిస్తున్న బట్లర్.. కెప్టెన్సీలో మాత్రం పూర్తిగా తేలిపోతున్నాడు. అతడు కెప్టెన్సీలో ఇంగ్లండ్ జట్టు వరుసగా మూడు ఐసీసీ టోర్నీల్లో గ్రూపు స్టేజిలోనే ఇంటిముఖం పట్టింది. వన్డే వరల్డ్కప్ 2023, టీ20 ప్రపంచకప్-2024లో లీగ్ దశలో నిష్క్రమించిన ఇంగ్లండ్.. ఇప్పుడు ఛాంపియన్స్ ట్రోఫీలోనూ అదే ఫలితాన్ని పునరావృతం చేసింది.ఇంగ్లండ్ ఐసీసీ టోర్నీల్లోనూ కాకుండా ద్వైపాక్షిక సిరీస్లలోనూ ఇదే తీరును కనబరుస్తుంది. ముఖ్యంగా అఫ్గానిస్తాన్ చేతిలో వరుసగా రెండు ఐసీసీ ఈవెంట్లలో ఇంగ్లండ్ ఓడిపోవడాన్ని ఆ దేశ మాజీ క్రికెటర్లు, అభిమానులు జీర్ణించుకోలేకపోతున్నారు. దీంతో కెప్టెన్ బట్లర్పై విమర్శల వర్షం కురిపిస్తున్నారు. ఈ క్రమంలో బట్లర్ ఓ సంచలన నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. ఛాంపియన్స్ ట్రోఫీ తర్వాత ఇంగ్లండ్ వైట్ బాల్ కెప్టెన్సీకి బట్లర్ రాజీనామా చేయనున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. అఫ్గాన్తో మ్యాచ్ అనంతరం బట్లర్ చేసిన వ్యాఖ్యలు ఈ వార్తలకు మరింత బలాన్ని చేకూరుస్తున్నాయి. "నేను ఇప్పుడు ఎలాంటి భావోద్వేగ ప్రకటన చేయాలనుకోలేదు. కానీ నా కోసం, కొంతమంది మా అగ్రశ్రేణి ప్లేయర్ల కోసం నేను కొన్ని ఆంశాలను పరిగణలోకి తీసుకోవాలంటూ" పోస్ట్ మ్యాచ్ ప్రేజెంటేషన్లో బట్లర్ పేర్కొన్నాడు. దీంతో త్వరలోనే కెప్టెన్సీకి జోస్ ది బాస్ గుడ్బై చెప్పనున్నాడన్న ఊహాగానాలు ఊపందుకున్నాయి.చదవండి: పాకిస్తాన్ కోచ్గా వెళ్లేందుకు నేను సిద్దం: యువరాజ్ తండ్రి -
ఇంగ్లండ్తో కీలక పోరు.. టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న అఫ్గాన్
ఛాంపియన్స్ ట్రోఫీ-2025లో కీలక పోరుకు రంగం సిద్దమైంది. ఈ మెగా టోర్నీ గ్రూపు-బిలో భాగంగా లహోర్ వేదికగా ఇంగ్లండ్ జట్లు తలపడతున్నాయి. ఈ మ్యాచ్లో టాస్ గెలిచిన అఫ్గానిస్తాన్ తొలుత బ్యాటింగ్ ఎంచుకుంది. ఇంగ్లండ్ ఓ మార్పుతో బరిలోకి దిగింది.గాయం కారణంగా ఈ టోర్నీకి దూరమైన బ్రాడైన్ కార్స్ స్ధానంలో తుది జట్టులోకి రెహన్ అహ్మద్ వచ్చాడు. సెమీస్ ఆశలను సజీవంగా ఉంచుకోవాలంటే ఈ మ్యాచ్ ఇరు జట్లకు కీలకం. ఈ మ్యాచ్లో ఓడిన జట్టు టోర్నీ నుంచి ఇంటిముఖం పడుతోంది. కాగా రెండు జట్లు కూడా తమ తొలి మ్యాచ్లో ఓటమి చవిచూశాయి.తుది జట్లుఅఫ్గానిస్తాన్ జట్టు: రహ్మానుల్లా గుర్బాజ్(వికెట్ కీపర్), ఇబ్రహీం జద్రాన్, సెడిఖుల్లా అటల్, రహ్మత్ షా, హష్మతుల్లా షాహిదీ(సి), అజ్మతుల్లా ఒమర్జాయ్, గుల్బాదిన్ నాయబ్, మొహమ్మద్ నబీ, రషీద్ ఖాన్, నూర్ అహ్మద్, ఫజల్హాక్ ఫరూఖీ.ఇంగ్లండ్: ఫిల్ సాల్ట్, బెన్ డకెట్, జామీ స్మిత్(వికెట్), జో రూట్, హ్యారీ బ్రూక్, జోస్ బట్లర్(కెప్టెన్), లియామ్ లివింగ్స్టోన్, జామీ ఓవర్టన్, ఆదిల్ రషీద్, జోఫ్రా ఆర్చర్, మార్క్ వుడ్.చదవండి: పాకిస్తాన్ కోచ్గా వెళ్లేందుకు నేను సిద్దం: యువరాజ్ తండ్రి -
ఛాంపియన్స్ ట్రోఫీలో నేడు (ఫిబ్రవరి 22) బిగ్ ఫైట్
ఛాంపియన్స్ ట్రోఫీ-2025లో ఇవాళ (ఫిబ్రవరి 22) బిగ్ ఫైట్ జరుగనుంది. గాయాలతో సతమతమవుతున్న వరల్డ్ ఛాంపియన్స్ ఆస్ట్రేలియా.. ఇటీవలే భారత్ చేతిలో భంగపడ్డ ఇంగ్లండ్ను ఢీకొట్టనుంది. ఈ మ్యాచ్ లాహోర్లోని గడాఫీ స్టేడియంలో మధ్యాహ్నం 2:30 గంటలకు ప్రారంభం కానుంది. గ్రూప్-బిలో భాగంగా ఈ మ్యాచ్ జరుగనుంది. గ్రూప్-బిలో భాగంగా నిన్న జరిగిన తొలి మ్యాచ్లో సౌతాఫ్రికా.. ఆఫ్ఘనిస్తాన్ను 107 పరుగుల తేడాతో చిత్తు చేసింది.కీలక ఆటగాళ్లు దూరంఈ టోర్నీలో ఆస్ట్రేలియా ద్వితియ శ్రేణి జట్టుతో బరిలోకి దిగుతుంది. కీలక ఆటగాళ్లు పాట్ కమిన్స్, జోష్ హాజిల్వుడ్, మిచెల్ మార్ష్ గాయాల బారిన పడగా.. మిచెల్ స్టార్క్ వ్యక్తిగత కారణాల చేత ఈ టోర్నీకి దూరంగా ఉన్నాడు. మరో స్టార్ ప్లేయర్ మార్కస్ స్టోయినిస్ టోర్నీ ప్రారంభానికి కొద్ది రోజుల ముందు వన్డేలకు రిటైర్మెంట్ ప్రకటించాడు. రెగ్యులర్ కెప్టెన్ కమిన్స్ గైర్హాజరీలో స్టీవ్ స్మిత్ ఆసీస్ సారథ్య బాధ్యతలను మోస్తున్నాడు.భారత్ చేతిలో భంగపాటుఈ టోర్నీ ప్రారంభానికి ముందు ఇంగ్లండ్ భారత్ చేతిలో వన్డే సిరీస్ను కోల్పోయి భంగపాటుకు గురైంది. భారత్తో సిరీస్లో ఇంగ్లండ్ బ్యాటింగ్, బౌలింగ్ విభాగాల్లో దారుణంగా విఫలమైంది. ఆసీస్తో మ్యాచ్ ప్రారంభానికి రెండు రోజుల ముందే ఇంగ్లండ్ తమ తుది జట్టును ప్రకటించింది. యువ ఆటగాడు జేమీ స్మిత్ మూడో స్థానంలో బరిలోకి దిగనున్నాడు. రూట్ నాలుగో స్థానంలో బ్యాటింగ్ చేయనున్నాడు.ఆసీస్తో వన్డే కోసం ఇంగ్లండ్ తుది జట్టు..ఫిల్ సాల్ట్, బెన్ డకెట్, జేమీ స్మిత్ (వికెట్కీపర్), జో రూట్, హ్యారీ బ్రూక్, జోస్ బట్లర్ (కెప్టెన్), లియామ్ లివింగ్స్టోన్, బ్రైడన్ కార్స్, జోఫ్రా ఆర్చర్, ఆదిల్ రషీద్, మార్క్ వుడ్హెడ్ టు హెడ్ రికార్డులు ఇలా..!ఆస్ట్రేలియా, ఇంగ్లండ్ జట్లు ఇప్పటివరకు వన్డేల్లో 161 సార్లు ఎదురెదురుపడ్డాయి. ఇందులో ఆసీస్ 91 సార్లు గెలుపొందగా.. ఇంగ్లండ్ 65 మ్యాచ్ల్లో విజేతగా నిలిచింది. రెండు మ్యాచ్లు టై కాగా.. మూడు మ్యాచ్ల్లో ఫలితం తేలలేదు.ఛాంపియన్స్ ట్రోఫీలో ఎవరిది ఆధిపత్యం..?ఛాంపియన్స్ ట్రోఫీలో ఆసీస్, ఇంగ్లండ్ ఇప్పటివరకు 5 మ్యాచ్ల్లో తలపడగా.. ఇంగ్లండ్ 3, ఆసీస్ 2 మ్యాచ్ల్లో గెలుపొందాయి. చివరి రెండు ఎడిషన్లలో (2013, 2017) ఇంగ్లండ్ ఆసీస్పై జయకేతనం ఎగురవేసింది. ఇక ఇరు జట్లు చివరిగా తలపడిన ఐదు వన్డేల్లో ఆసీస్ 3, ఇంగ్లండ్ 2 మ్యాచ్ల్లో విజయాలు సాధించాయి. ఆసీస్ జట్టు..స్టీవ్ స్మిత్ (కెప్టెన్), జోస్ ఇంగ్లిస్ (వికెట్కీపర్), మాథ్యూ షార్ట్, ట్రవిస్ హెడ్, జేక్ ఫ్రేజర్ మెక్గుర్క్, ఆరోన్ హార్డీ, గ్లెన్ మ్యాక్స్వెల్, సీన్ అబాట్, బెన్ డ్వార్షుయిష్, ఆడమ్ జంపా, తన్వీర్ సంఘా, నాథన్ ఇల్లిస్, స్పెన్సర్ జాన్సన్, మార్నస్ లబూషేన్, అలెక్స్ క్యారీ -
ఆస్ట్రేలియాతో మ్యాచ్.. ఇంగ్లండ్ తుది జట్టు ప్రకటన
ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ-2025లో ఇంగ్లండ్ తమ తొలి మ్యాచ్ ఆడేందుకు సిద్దమవుతోంది. ఈ మెగా టోర్నీ గ్రూపు-బిలో భాగంగా ఫిబ్రవరి 23న లహోర్ వేదికగా ఆస్ట్రేలియాతో ఇంగ్లండ్ తలపడనుంది. ఇప్పటికే లహోర్కు చేరుకున్న ఇంగ్లీష్ జట్టు నెట్స్లో తీవ్రంగా శ్రమిస్తోంది. ఈ మ్యాచ్లో ఎలాగైనా గెలిచి టోర్నీలో శుభారంభం చేయాలని బట్లర్ సేన భావిస్తోంది.ఈ క్రమంలో ఆసీస్తో మ్యాచ్కు ఇంగ్లండ్ క్రికెట్ తమ ప్లేయింగ్ ఎలెవన్ను ప్రకటించింది. భారత్తో వన్డే సిరీస్కు గాయం కారణంగా దూరమైన వికెట్ కీపర్ బ్యాటర్ జేమీ స్మిత్ తిరిగి జట్టులోకి వచ్చాడు. కెప్టెన్ జోస్ బట్లర్ స్ధానంలో వికెట్ కీపర్ బాధ్యతలు చేపట్టనున్నాడు. ఈ విషయాన్ని ఇంగ్లండ్ అండ్ వేల్స్ క్రికెట్ బోర్డు ధ్రువీకరించింది. ఆస్ట్రేలియాతో మ్యాచ్లో ఇంగ్లండ్ ముగ్గురు పేసర్లతో బరిలోకి దిగనుంది.ఆసీస్తో మ్యాచ్కు ఇంగ్లండ్ తుది జట్టు ఇదేఫిల్ సాల్ట్, బెన్ డకెట్, జామీ స్మిత్ (వికెట్ కీపర్), జో రూట్, హ్యారీ బ్రూక్, జోస్ బట్లర్ (కెప్టెన్), లియామ్ లివింగ్స్టోన్, బ్రైడన్ కార్సే, జోఫ్రా ఆర్చర్, ఆదిల్ రషీద్, మార్క్ వుడ్చదవండి: Champions Trophy: చరిత్ర సృష్టించిన రోహిత్ శర్మ.. సచిన్ రికార్డు బద్దలు -
అదంతా అబద్దం.. మాకంటూ ఓ విధానం ఉంది: మెకల్లమ్ ఫైర్
కామెంటేటర్లు రవి శాస్త్రి(Ravi Shastri), కెవిన్ పీటర్సన్ వ్యాఖ్యలపై ఇంగ్లండ్ క్రికెట్ జట్టు ప్రధాన కోచ్ బ్రెండన్ మెకల్లమ్(Brendon Mccullum) మండిపడ్డాడు. వీరిద్దరు మాట్లాడిన మాటల్లో ఏమాత్రం నిజం లేదంటూ కొట్టిపారేశాడు. ఆట విషయంలో ఎలా ముందుకు వెళ్లాలో తమకంటూ ఓ విధానం ఉందని.. ఫలితాలు అనుకూలంగా లేనపుడు ఇలాంటివి సహజమేనని పేర్కొన్నాడు.అసలేం జరిగిందంటే.. టీమిండియా(India vs England)తో ఐదు టీ20లు, మూడు వన్డేలు ఆడేందుకు ఇంగ్లండ్ భారత పర్యటనకు వచ్చిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో పొట్టి ఫార్మాట్ సిరీస్లో సూర్యసేన చేతిలో 4-1తో చిత్తైన బట్లర్ బృందం.. రోహిత్ సేనతో వన్డేల్లో 3-0తో క్లీన్స్వీప్నకు గురైంది.తద్వారా ప్రతిష్టాత్మక ఐసీసీ చాంపియన్స్ ట్రోఫీ-2025 ఆరంభానికి ముందు గట్టి ఎదురుదెబ్బను చవిచూసింది. ఈ నేపథ్యంలో అహ్మదాబాద్ వేదికగా భారత్తో ఇంగ్లండ్ మూడో వన్డే సందర్భంగా.. టీమిండియా మాజీ హెడ్ కోచ్ రవిశాస్త్రి, ఇంగ్లండ్ మాజీ కెప్టెన్ కెవిన్ పీటర్సన్ కీలక వ్యాఖ్యలు చేశాడు. ఒకే ఒక్క నెట్ సెషన్ఈ సిరీస్ కోసం సన్నద్ధమయ్యే క్రమంలో ఇంగ్లండ్ ఒకే ఒక్క నెట్ సెషన్లో పాల్గొన్నదంటూ బట్లర్ బృందం తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆట పట్ల అంకితభావం లేదంటూ విమర్శలకు దిగారు. ఈ విషయంపై ఇంగ్లండ్ హెడ్కోచ్ బ్రెండన్ మెకల్లమ్ తాజాగా స్పందించాడు.టాక్స్పోర్ట్తో మాట్లాడుతూ.. ‘‘మేము అసలు శిక్షణా శిబిరంలో పాల్గొననేలేదన్న వారి మాటలు పూర్తిగా అవాస్తవం. సిరీస్ ఆసాంతం మేము నెట్ సెషన్స్లో బిజీగా ఉన్నాం.అంతకు ముందు కూడా మా వాళ్లు వరుస సిరీస్లు ఆడారు. ఎదుటివారి విషయంలో ఆధారాలు లేకుండా ఇష్టారీతిన మాట్లాడటం సులువే. ఫలితాలు మాకు అనుకూలంగా లేవు కాబట్టి ఇలాంటి వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి.మాకంటూ ఒక విధానం ఉందిఏ ఫార్మాట్లో ఎలా ఆడాలో మాకంటూ ఒక విధానం ఉంది. దానినే మేము అనుసరిస్తాం. ఇక ఇప్పటికే జట్టులోని చాలా మంది ఆటగాళ్లు గాయపడ్డారు. కాబట్టి ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో మాకు తెలుసు. ముందుగా చెప్పినట్లు వాళ్లు మాట్లాడిన మాటలు అబద్దాలు’’ అని మెకల్లమ్ రవిశాస్త్రి, పీటర్సన్ వ్యాఖ్యలను తిప్పికొట్టాడు.ఇక ఇప్పటికే ఇంగ్లండ్ కెప్టెన్ జోస్ బట్లర్ సైతం వీరి మాటలను ఖండించిన విషయం తెలిసిందే. సుదీర్ఘ ప్రయాణాలు, బిజీ షెడ్యూల్ కారణంగా ఒకటీ రెండు సెషన్లు మాత్రమే మిస్సయ్యామని తెలిపాడు. అంతేతప్ప రవిశాస్త్రి, పీటర్సన్ అన్నట్లుగా తామేమీ పూర్తిగా ప్రాక్టీస్కు దూరంగా లేమని పేర్కొన్నాడు.కాగా టెస్టుల్లో ‘బజ్బాల్’ విధానంతో దూకుడైన ఆటను పరిచయం చేసిన బ్రెండన్ మెకల్లమ్.. టీమిండియాతో సిరీస్ సందర్భంగా ఇంగ్లండ్ పరిమిత ఓవర్ల కోచ్గానూ నియమితుడయ్యాడు. అయితే, తొలి ప్రయత్నంలోనే ఘోర పరాజయాలతో విమర్శలు మూటగట్టుకున్నాడు.చదవండి: CT 2025: సురేశ్ రైనా ఎంచుకున్న భారత తుదిజట్టు... వరల్డ్కప్ వీరులకు నో ఛాన్స్! -
IND vs ENG 3rd ODI: మూడో వన్డేలో భారత్ ఘన విజయం
IND vs ENG 3rd Odi Live Updates: భారత్ ఘన విజయం..అహ్మదాబాద్ వేదికగా ఇంగ్లండ్తో జరిగిన మూడో వన్డేలో 142 పరుగుల తేడాతో భారత్ ఘనవిజయాన్ని అందుకుంది. దీంతో మూడు వన్డేల సిరీస్ను టీమిండియా క్లీన్ స్వీప్ చేసింది. 357 పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన ఇంగ్లీష్ జట్టు.. 34.2 ఓవర్లలో 214 పరుగులకు ఆలౌటైంది.భారత బౌలర్లలో అర్ష్దీప్ సింగ్, హర్షిత్ రాణాచ, అక్షర్ పటేల్, హార్దిక్ పాండ్యా తలా రెండు వికెట్లు పడగొట్టగా.. సుందర్, కుల్దీప్ చెరో వికెట్ సాధించారు. ఇంగ్లండ్ బ్యాటర్లలో గాస్ అట్కినసన్(38), టామ్ బాంటన్(38) టాప్ స్కోరర్లగా నిలవగా.. డకెట్(34) మరోసారి దూకుడుగా ఆడాడు.అంతకుముందు బ్యాటింగ్ చేసిన భారత్ నిర్ణీత 50 ఓవర్లలో 356 పరుగులు చేసి భారత్ ఆలౌట్ అయింది. శుబ్మన్ గిల్(112) శతక్కొట్టగా.. విరాట్ కోహ్లి(52), శ్రేయస్ అయ్యర్(78) అర్ధ శతకాలతో రాణించారు. వికెట్ కీపర్ బ్యాటర్ కేఎల్రాహుల్ సైతం 29 బంతుల్లోనే 40 పరుగులతో మెరిశాడు. ఇంగ్లండ్ బౌలర్లలో ఆదిల్ రషీద్ నాలుగు వికెట్లతో చెలరేగగా.. మార్క్ వుడ్ రెండు, సకీబ్ మహమూద్, గస్ అట్కిన్సన్, జో రూట్ ఒక్కో వికెట్ దక్కించుకున్నారు.ఓటమి దిశగా ఇంగ్లండ్..ఇంగ్లండ్ వరుస క్రమంలో మూడు వికెట్లను కోల్పోయింది. తొలుత హ్యారీ బ్రూక్ను హర్షిత్ రాణా క్లీన్ బౌల్డ్ చేయగా.. ఆ తర్వాత లైమ్ లివింగ్ స్టోన్, అదిల్ రషీద్ పెవిలియన్కు చేరారు. 31 ఓవర్లకు ఇంగ్లండ్ స్కోర్: 179/8ఇంగ్లండ్ ఐదో వికెట్ డౌన్..జోస్ బట్లర్ రూపంలో ఇంగ్లండ్ ఐదో వికెట్ కోల్పోయింది. 6 పరుగులు చేసిన బట్లర్.. హర్షిత్ రాణా బౌలింగ్లో పెవిలియన్కు చేరాడు.ఇంగ్లండ్ నాలుగో వికెట్ డౌన్..జో రూట్ రూపంలో ఇంగ్లండ్ నాలుగో వికెట్ కోల్పోయింది. 24 పరుగులు చేసిన రూట్.. అక్షర్ పటేల్ బౌలింగ్లో క్లీన్ బౌల్డయ్యాడు. క్రీజులోకి కెప్టెన్ జోస్ బట్లర్ వచ్చాడు. 22 ఓవర్లకు ఇంగ్లండ్ స్కోర్: 137/4మూడో వికెట్ కోల్పోయిన ఇంగ్లండ్టామ్ బాంటన్ రూపంలో ఇంగ్లండ్ మూడో వికెట్ కోల్పోయింది. కుల్దీప్ యాదవ్ బౌలింగ్లో కీపర్ కేఎల్ రాహుల్కు క్యాచ్ ఇచ్చి అతడు పెవిలియన్ చేరాడు. మొత్తం 41 బంతులు ఎదుర్కొని 38 పరుగులు చేసి నిష్క్రమించాడు. ఇంగ్లండ్ స్కోరు: 126/3 (18). రూట్ 20 పరుగులతో ఉండగా.. హ్యారీ బ్రూక్ క్రీజులోకి వచ్చాడు.నిలకడగా ఆడుతున్న రూట్, బాంటన్ఇంగ్లండ్ బ్యాటర్లు టామ్ బాంటన్(25), జో రూట్(9) నిలకడగా ఆడుతున్నారు. 14 ఓవర్లకు ఇంగ్లండ్ స్కోర్: 102/2ఇంగ్లండ్ రెండో వికెట్ డౌన్.. సాల్ట్ ఔట్ఫిల్ సాల్ట్ రూపంలో ఇంగ్లండ్ రెండో వికెట్ కోల్పోయింది. 23 పరుగులు చేసిన సాల్ట్.. అర్ష్దీప్ సింగ్ బౌలింగ్లో పెవిలియన్కు చేరాడు. క్రీజులోకి జో రూట్ వచ్చాడు. 10 ఓవర్లకు ఇంగ్లండ్ స్కోర్: 84/2. ఇంగ్లండ్ తొలి వికెట్ డౌన్..60 పరుగుల వద్ద ఇంగ్లండ్ తొలి వికెట్ కోల్పోయింది. దూకుడుగా ఆడిన బెన్ డకెట్(32).. అర్ష్దీప్ సింగ్ బౌలింగ్లో రోహిత్ శర్మకు క్యాచ్ ఇచ్చి పెవిలియన్కు చేరాడు. క్రీజులోకి టామ్ బాంటన్ వచ్చాడు.టీమిండియా భారీ స్కోరుఇంగ్లండ్తో మూడో వన్డేలో టీమిండియా భారీ స్కోరు సాధించింది. శుబ్మన్ గిల్(112) శతక్కొట్టగా.. విరాట్ కోహ్లి(52), శ్రేయస్ అయ్యర్(78) అర్ధ శతకాలతో రాణించారు. వికెట్ కీపర్ బ్యాటర్ కేఎల్రాహుల్ సైతం 29 బంతుల్లోనే 40 పరుగులతో మెరిశాడు. ఈ క్రమంలో నిర్ణీత 50 ఓవర్లలో 356 పరుగులు చేసి భారత్ ఆలౌట్ అయింది. ఇంగ్లండ్ బౌలర్లలో ఆదిల్ రషీద్ నాలుగు వికెట్లతో చెలరేగగా.. మార్క్ వుడ్ రెండు, సకీబ్ మహమూద్, గస్ అట్కిన్సన్, జో రూట్ ఒక్కో వికెట్ దక్కించుకున్నారు.ఎనిమిదో వికెట్గా వెనుదిరిగిన హర్షిత్ రాణాటెయిలెండర్ హర్షిత్ రాణా రూపంలో టీమిండియా ఎనిమిదో వికెట్ కోల్పోయింది. గస్ అట్కిన్సన్ బౌలింగ్లో బట్లర్కు క్యాచ్ ఇచ్చి అతడు పెవిలియన్ చేరాడు. 10 బంతుల్లో 13 పరుగులు చేసి నిష్క్రమించాడు. భారత్ స్కోరు: 353-8(49). అర్ష్దీప్ సింగ్ క్రీజులోకి వచ్చాడు.ఏడో వికెట్ డౌన్.. రాహుల్ నిష్క్రమణకేఎల్ రాహుల్ రూపంలో టీమిండియా ఏడో వికెట్ కోల్పోయింది. ఇంగ్లండ్ పేసర్ సకీబ్ మహమూద్ బౌలింగ్లో లెగ్ బిఫోర్ వికెట్(ఎల్బీడబ్ల్యూ)గా రాహుల్.. 40 పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద వెనుదిరిగాడు. హర్షిత్ రాణా క్రీజులోకి వచ్చాడు. స్కోరు: 334-7(47).ఆరో వికెట్ కోల్పోయిన టీమిండియాజో రూట్ బౌలింగ్లో అక్షర్ పటేల్ ఆరో వికెట్గా వెనుదిరిగాడు. 13 పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద టామ్ బాంటన్కు క్యాచ్ ఇచ్చి పెవిలియన్ చేరాడు. వాషింగ్టన్ సుందర్ క్రీజులోకి రాగా.. కేఎల్ రాహుల్ 21 పరుగులతో ఆడుతున్నాడు. స్కోరు: 308-6(44). టీమిండియా ఐదో వికెట్ డౌన్.. పాండ్యా ఔట్టీమిండియా ఐదో వికెట్ కోల్పోయింది. 17 పరుగులు చేసిన పాండ్యా.. అదిల్ రషీద్ బౌలింగ్లో క్లీన్ బౌల్డయ్యాడు. క్రీజులోకి అక్షర్ పటేల్ వచ్చాడు. 42 ఓవర్లకు భారత్ స్కోర్: 295/5అయ్యర్ ఔట్.. టీమిండియా నాలుగో వికెట్ కోల్పోయింది. 78 పరుగులు చేసిన శ్రేయస్ అయ్యర్.. అదిల్ రషీద్ బౌలింగ్లో ఔటయ్యాడు.క్రీజులోకి హార్దిక్ పాండ్యా వచ్చాడు. 40 ఓవర్లకు భారత్ స్కోర్: 275/4మూడో వికెట్ కోల్పోయిన టీమిండియాసెంచరీ వీరుడు శుబ్మన్ గిల్ రూపంలో టీమిండియా మూడో వికెట్ కోల్పోయింది. ఆదిల్ రషీద్ బౌలింగ్లో గిల్ బౌల్డ్ అయ్యాడు. 112 పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద నిష్క్రమించాడు. కేఎల్ రాహుల్ క్రీజులోకి రాగా.. శ్రేయస్ అయ్యర్ 52 పరుగులతో ఉన్నాడు. స్కోరు: 227/3 (34.4) గిల్ సెంచరీ..అహ్మదాబాద్ వన్డేలో టీమిండియా ఓపెనర్ శుబ్మన్ గిల్ సెంచరీతో మెరిశాడు. 92 బంతుల్లో 13 ఫోర్లు, 2 సిక్స్లతో సాయంతో గిల్ తన సెంచరీ మార్క్ను అందుకున్నాడు. గిల్కు ఇది ఏడో వన్డే సెంచరీ కావడం విశేషం. 31 ఓవర్లకు భారత్ స్కోర్: 213/2. క్రీజులో గిల్(104)తో పాటు శ్రేయస్ అయ్యర్(48) ఉన్నాడు.విరాట్ కోహ్లి ఔట్..విరాట్ కోహ్లి రూపంలో టీమిండియా రెండో వికెట్ కోల్పోయింది. 52 పరుగులు చేసిన కోహ్లి.. అదిల్ రషీద్ బౌలింగ్లో ఔటయ్యాడు. క్రీజులోకి శ్రేయస్ అయ్యర్ వచ్చాడు.గిల్, కోహ్లి హాఫ్ సెంచరీలు..మూడో వన్డేలో టీమిండియా స్టార్ ప్లేయర్లు విరాట్ కోహ్లి(51), గిల్(60) అదరగొడుతున్నారు. వీరిద్దరూ ఈ మ్యాచ్లో తమ హాఫ్ సెంచరీలను పూర్తి చేస్తున్నారు. 18 ఓవర్లకు భారత్ స్కోర్: 120/1నిలకడగా ఆడుతున్న కోహ్లి, గిల్..16 ఓవర్లు ముగిసే సరికి టీమిండియా వికెట్ నష్టానికి 97 పరుగులు చేసింది. కోహ్లి(41), గిల్(48) నిలకడగా ఆడుతున్నారు.10 ఓవర్లకు భారత్ స్కోర్: 52/110 ఓవర్లు ముగిసే టీమిండియా వికెట్ నష్టానికి 52 పరుగులు చేసింది. క్రీజులో కోహ్లి(17), శుబ్మన్ గిల్(28) పరుగులతో ఉన్నారు.తొలి వికెట్ కోల్పోయిన టీమిండియాకెప్టెన్ రోహిత్ శర్మ రూపంలో భారత్ తొలి వికెట్ కోల్పోయింది. రెండో వన్డేల్లో విధ్వంసకర శతకం(119)తో చెలరేగిన రోహిత్.. తాజాగా ఒక్క పరుగుకే నిష్క్రమించాడు. మార్క్వుడ్ బౌలింగ్లో వికెట్ కీపర్ ఫిలిప్ సాల్ట్కు క్యాచ్ ఇచ్చి అవుటయ్యాడు. కోహ్లి క్రీజులోకి వచ్చాడు. స్కోరు: 8-1(2)అహ్మదాబాద్ వేదికగా మూడో వన్డేలో భారత్-ఇంగ్లండ్ జట్లు తలపడుతున్నాయి. ఈ మ్యాచ్లో టాస్ గెలిచిన ఇంగ్లండ్ తొలుత బ్యాటింగ్ ఎంచుకుంది. ఈమ్యాచ్లో ఇంగ్లండ్ ఓ మార్పుతో బరిలోకి దిగింది. జేమీ ఓవర్టన్ స్థానంలో టామ్ బాంటన్ జట్టులోకి వచ్చాడు. మరోవైపు భారత్ మూడు మార్పులతో ఆడుతోంది. రవీంద్ర జడేజా, మహ్మద్ షమీలకు విశ్రాంతి ఇవ్వగా.. స్పిన్నర్ వరుణ్ చక్రవర్తి గాయం కారణంగా దూరమయ్యాడు. ఈ ముగ్గురి స్థానంలో వాషింగ్టన్ సుందర్, అర్ష్దీప్ సింగ్, కుల్దీప్ యాదవ్ తుది జట్టులోకి వచ్చారు.కాగా ఐదు టీ20లు, మూడు వన్డేలు ఆడేందుకు భారత పర్యటనకు వచ్చిన ఇంగ్లండ్కు ఘోర పరాభవం ఎదురైన విషయం తెలిసిందే. సూర్యకుమార్ సేన చేతిలో పొట్టి ఫార్మాట్ సిరీస్లో 4-1తో ఓడిపోయిన బట్లర్ బృందం.. వన్డే సిరీస్ను కూడా కోల్పోయింది.నాగ్పూర్, కటక్ వేదికలుగా జరిగిన తొలి రెండు వన్డేల్లో రోహిత్ సేన జయభేరి మోగించగా.. మరో మ్యాచ్ మిగిలి ఉండగానే ఇంగ్లండ్ 2-0తో ఓటమిపాలైంది. తాజాగా అహ్మదాబాద్ వేదికగా నామమాత్రపు మూడో వన్డేలోనైనా గెలిచి పరువు దక్కించుకోవాలని ఇంగ్లండ్ భావిస్తోంది. తుదిజట్లుటీమిండియారోహిత్ శర్మ(కెప్టెన్), శుబ్మన్ గిల్, విరాట్ కోహ్లి, శ్రేయస్ అయ్యర్, కేఎల్ రాహుల్(వికెట్ కీపర్), హార్దిక్ పాండ్యా, అక్షర్ పటేల్, వాషింగ్టన్ సుందర్, హర్షిత్ రాణా, కుల్దీప్ యాదవ్, అర్ష్దీప్ సింగ్.ఇంగ్లండ్ఫిలిప్ సాల్ట్(వికెట్ కీపర్), బెన్ డకెట్, జో రూట్, హ్యారీ బ్రూక్, జోస్ బట్లర్(కెప్టెన్), టామ్ బాంటన్, లియామ్ లివింగ్స్టోన్, గస్ అట్కిన్సన్, ఆదిల్ రషీద్, మార్క్ వుడ్, సకీబ్ మహమూద్. -
Ind vs Eng 3rd ODI: వరుణ్ చక్రవర్తికి గాయం.. ఆ ఇద్దరికి విశ్రాంతి
Ind vs Eng 3rd ODI: టీమిండియాతో అహ్మదాబాద్ వన్డేలో టాస్ గెలిచిన ఇంగ్లండ్ తొలుత బౌలింగ్ ఎంచుకుంది. తన నిర్ణయం గురించి ఇంగ్లండ్ కెప్టెన్ జోస్ బట్లర్(Jos Buttler) మాట్లాడుతూ.. ‘‘ఈరోజు మేము ముందుగా బౌలింగ్ చేయాలని అనుకుంటున్నాం. మ్యాచ్ సాగే కొద్దీ పిచ్ పరిస్థితి మెరుగుపడవచ్చు. తొలి రెండు వన్డేల్లో మేము ముందుగా బ్యాటింగ్ చేశాం. అందుకే చాంపియన్స్ ట్రోఫీకి ముందు కాస్త కొత్తగా ప్రయత్నిస్తున్నాం. వికెట్ బాగుంది. ఇక్కడే మేము న్యూజిలాండ్తో వరల్డ్కప్ మ్యాచ్ ఆడాం. నల్లరేగడి మట్టి పిచ్ సెకండాఫ్లో బ్యాటింగ్కు ఇంకాస్త అనుకూలంగా మారుతుంది. ఈరోజు మేము ఒక మార్పుతో బరిలోకి దిగుతున్నాం. జేమీ ఓవర్టన్ స్థానంలో టామ్ బాంటన్ జట్టులోకి వచ్చాడు’’ అని తెలిపాడు.మరోవైపు.. టాస్ సందర్భంగా రోహిత్ శర్మ(Rohit Sharma) తాము మూడు మార్పులతో మూడో వన్డే ఆడుతున్నట్లు వెల్లడించాడు. రవీంద్ర జడేజా, మహ్మద్ షమీలకు విశ్రాంతినిచ్చామన్న రోహిత్.. దురదృష్టవశాత్తూ వరుణ్ చక్రవర్తి ఈ మ్యాచ్కు దూరమయ్యాడని తెలిపాడు. వరుణ్ పిక్కల్లో నొప్పితో బాధపడుతున్నట్లు తెలిపాడు. ఇక ఈ ముగ్గురి స్థానంలో వాషింగ్టన్ సుందర్, అర్ష్దీప్ సింగ్, కుల్దీప్ యాదవ్ తుదిజట్టులోకి వచ్చినట్లు రోహిత్ శర్మ వెల్లడించాడు.కాగా ఐదు టీ20లు, మూడు వన్డేలు ఆడేందుకు భారత పర్యటనకు వచ్చిన ఇంగ్లండ్కు ఘోర పరాభవం ఎదురైన విషయం తెలిసిందే. సూర్యకుమార్ సేన చేతిలో పొట్టి ఫార్మాట్ సిరీస్లో 4-1తో ఓడిపోయిన బట్లర్ బృందం.. వన్డే సిరీస్ను కూడా కోల్పోయింది. నాగ్పూర్, కటక్ వేదికలుగా జరిగిన తొలి రెండు వన్డేల్లో రోహిత్ సేన జయభేరి మోగించగా.. మరో మ్యాచ్ మిగిలి ఉండగానే ఇంగ్లండ్ 2-0తో ఓటమిపాలైంది.తాజాగా అహ్మదాబాద్ వేదికగా నామమాత్రపు మూడో వన్డేలోనైనా గెలిచి పరువు దక్కించుకోవాలని ఇంగ్లండ్ భావిస్తోంది. చాంపియన్స్ ట్రోఫీ-2025కి ముందు ఒక్క వన్డేలో అయినా గెలిచి ఆత్మవిశ్వాసాన్ని కూడగట్టుకునే పనిలో ఉంది. మరోవైపు.. క్లీన్స్వీప్ విజయంతో ఐసీసీ టోర్నీలో అడుగుపెట్టాలని టీమిండియా పట్టుదలగా ఉంది. తుదిజట్లుటీమిండియారోహిత్ శర్మ(కెప్టెన్), శుబ్మన్ గిల్, విరాట్ కోహ్లి, శ్రేయస్ అయ్యర్, కేఎల్ రాహుల్(వికెట్ కీపర్), హార్దిక్ పాండ్యా, అక్షర్ పటేల్, వాషింగ్టన్ సుందర్, హర్షిత్ రాణా, కుల్దీప్ యాదవ్, అర్ష్దీప్ సింగ్.ఇంగ్లండ్ఫిలిప్ సాల్ట్(వికెట్ కీపర్), బెన్ డకెట్, జో రూట్, హ్యారీ బ్రూక్, జోస్ బట్లర్(కెప్టెన్), టామ్ బాంటన్, లియామ్ లివింగ్స్టోన్, గస్ అట్కిన్సన్, ఆదిల్ రషీద్, మార్క్ వుడ్, సకీబ్ మహమూద్.చదవండి: 119 ఏళ్ల రికార్డు బద్దలు: ప్రపంచంలోనే తొలి టెస్టు జట్టుగా ఐర్లాండ్ ఘనత -
హర్షిత్ రాణాపై రోహిత్ శర్మ ఫైర్!.. వీడియో వైరల్
టీమిండియా యువ పేసర్ హర్షిత్ రాణా(Harshit Rana)పై కెప్టెన్ రోహిత్ శర్మ(Rohit Sharma) ఆగ్రహం వ్యక్తం చేశాడు. ‘మెదడు పని చేస్తోందా?.. మనసు ఎక్కడపెట్టి ఆడుతున్నావు?’ అంటూ తీవ్రస్థాయిలో మండిపడ్డాడు. ఇంగ్లండ్తో రెండో వన్డే సందర్భంగా ఈ ఘటన చోటుచేసుకుంది. ఇందుకు సంబంధించిన దృశ్యాలు నెట్టింట వైరల్గా మారాయి.కాగా కటక్ వేదికగా టీమిండియా- ఇంగ్లండ్(India vs England) మధ్య ఆదివారం రెండో వన్డే జరిగిన విషయం తెలిసిందే. ఈ మ్యాచ్లో టాస్ గెలిచిన పర్యాటక ఇంగ్లండ్ తొలుత బ్యాటింగ్ చేసింది. ఓపెనర్లలో ఫిల్ సాల్ట్(26) నిరాశపరిచినా.. బెన్ డకెట్ మాత్రం అర్ధ శతకం(56 బంతుల్లో 65)తో మెరిశాడు. వన్డౌన్లో వచ్చిన జో రూట్(72 బంతుల్లో 69) కూడా హాఫ్ సెంచరీ సాధించాడు.ఉచితంగా నాలుగు పరుగులుఇక హ్యారీ బ్రూక్(31) ఫర్వాలేదనిపించగా.. కెప్టెన్ జోస్ బట్లర్ పాతుకుపోయే ప్రయత్నం చేశాడు. అయితే, ఇంగ్లండ్ ఇన్నింగ్స్లో 32వ ఓవర్ను భారత యువ పేస్ బౌలర్ హర్షిత్ రాణా వేశాడు. అప్పుడు క్రీజులో ఉన్న బట్లర్ ఐదో బంతిని డిఫెన్స్ ఆడగా.. బంతిని అందుకున్న రాణా వికెట్ల వైపునకు త్రో చేశాడు.అయితే, అది స్టంప్స్ను తాకకపోగా.. వికెట్ కీపర్ కేఎల్ రాహుల్ చేతికి కూడా అందకుండా బౌండరీ వైపు దూసుకువెళ్లింది. దీంతో రాణా చేసిన తప్పు వల్ల ఇంగ్లండ్కు ఉచితంగా నాలుగు పరుగులు వచ్చాయి. ఈ క్రమంలో కోపోద్రిక్తుడైన రోహిత్ శర్మ.. హర్షిత్ రాణాను చూస్తూ.. ‘మెదడు ఎక్కడ పెట్టుకుని ఆడుతున్నావు?’ అన్నట్లుగా సైగలతో అతడిపై అసహనం వెళ్లగక్కాడు.రోహిత్ విశ్వరూపంఇదిలా ఉంటే.. ఇక బట్లర్ 34 పరుగులు చేసి నిష్క్రమించగా.. లివింగ్స్టోన్ 41 పరుగులతో రాణించాడు. మిగతా వాళ్లు విఫలం కాగా 49.5 ఓవర్లలో ఇంగ్లండ్ 304 పరుగులు చేసి ఆలౌట్ అయింది. భారత బౌలర్లలో స్పిన్నర్లు రవీంద్ర జడేజా మూడు, వరుణ్ చక్రవర్తి ఒక వికెట్ పడగొట్టగా.. పేసర్లు హర్షిత్ రాణా, హార్దిక్ పాండ్యా, మహ్మద్ షమీ ఒక్కో వికెట్ దక్కించుకున్నారు.ఇక లక్ష్య ఛేదనలో భారత కెప్టెన్ రోహిత్ శర్మ శతకం(90 బంతుల్లో 12 ఫోర్లు, 7 సిక్సర్లు- 119 రన్స్) చెలరేగగా.. శుబ్మన్ గిల్(60), శ్రేయస్ అయ్యర్(47 బంతుల్లో 44), అక్షర్ పటేల్(43 బంతుల్లో 41*) కూడా రాణించారు. ఫలితంగా 44.3 ఓవర్లలో ఆరు వికెట్లు నష్టపోయిన టీమిండియా 308 పరుగులు చేసింది. ఇంగ్లండ్పై నాలుగు వికెట్ల తేడాతో గెలిచి మరో వన్డే మిగిలి ఉండగానే సిరీస్ను 2-0తో కైవసం చేసుకుంది.చదవండి: చరిత్ర సృష్టించిన రోహిత్ శర్మ.. సచిన్ టెండుల్కర్ను దాటేసి.. Rohit sharma angry on harshit rana on overthrow #LCDLFAllStars #SEVENTEEN #jailstool #DelhiElectionResults #cepostaperte pic.twitter.com/XEUjyQMRdK— kyaa haal hai (@Nittin08572676) February 9, 2025What a way to get to the HUNDRED! 🤩A treat for the fans in Cuttack to witness Captain Rohit Sharma at his best 👌👌Follow The Match ▶️ https://t.co/NReW1eEQtF#TeamIndia | #INDvENG | @IDFCFIRSTBank | @ImRo45 pic.twitter.com/oQIlX7fY1T— BCCI (@BCCI) February 9, 2025 -
ఇంగ్లండ్ రెండో వన్డే.. వరుణ్ చక్రవర్తి అరంగేట్రం! కోహ్లి వచ్చేశాడు
కటక్లోని బారాబతి స్టేడియం వేదికగా భారత్-ఇంగ్లండ్ జట్లు రెండో వన్డేలో తలపడుతున్నాయి. ఈ మ్యాచ్లో టాస్ గెలిచిన ఇంగ్లండ్ తొలుత బ్యాటింగ్ ఎంచుకుంది. ఈ మ్యాచ్లో భారత తుది జట్టులో స్టార్ ప్లేయర్ విరాట్ కోహ్లికి చోటు దక్కింది.తొలి వన్డేకు గాయం కారణంగా దూరమైన కోహ్లి.. పూర్తి ఫిట్నెస్ సాధించడంతో తిరిగి జట్టులోకి జట్టులోకి వచ్చాడు. అదేవిధంగా ఈ మ్యాచ్తో వరుణ్ చక్రవర్తి భారత తరపున వన్డే అరంగేట్రం చేశాడు. టీ20ల్లో మెరుగైన ప్రదర్శన కనబరుస్తుండడంతో వరుణ్కు వన్డేల్లో కూడా అవకాశం దక్కింది. కోహ్లి, వరుణ్ రాకతో జైశ్వాల్,కుల్దీప్ యాదవ్ బెంచ్కే పరిమితం కావాల్సి వచ్చింది.మరోవైపు ఇంగ్లండ్ తమ జట్టులో మూడు మార్పులు చేసింది. గుస్ అట్కిన్సన్, మార్క్ వుడ్, జేమీ ఓవర్టన్ తుది జట్టులోకి వచ్చారు. దీంతో జాకబ్ బెతల్, కార్స్, అర్చర్లకు ఇంగ్లండ్ మెనెజ్మెంట్ విశ్రాంతి ఇచ్చింది.తుది జట్లుఇంగ్లండ్ ప్లేయింగ్ ఎలెవన్: బెన్ డకెట్, ఫిలిప్ సాల్ట్ (వికెట్ కీపర్), జో రూట్, హ్యారీ బ్రూక్, జోస్ బట్లర్ (కెప్టెన్), లియామ్ లివింగ్స్టోన్, జామీ ఓవర్టన్, గుస్ అట్కిన్సన్, ఆదిల్ రషీద్, మార్క్ వుడ్, సాకిబ్ మహమూద్ఇండియా ప్లేయింగ్ ఎలెవన్: రోహిత్ శర్మ (కెప్టెన్), శుభ్మన్ గిల్ (వైస్ కెప్టెన్), విరాట్ కోహ్లి, శ్రేయాస్ అయ్యర్, కెఎల్ రాహుల్ (వికెట్ కీపర్), హార్దిక్ పాండ్యా, అక్షర్ పటేల్, రవీంద్ర జడేజా, హర్షిత్ రాణా, మహమ్మద్ షమీ, వరుణ్ చక్రవర్తిచదవండి: SL vs AUS: చరిత్ర సృష్టించిన స్మిత్.. ప్రపంచంలో తొలి ప్లేయర్గా -
క్రెడిట్ మొత్తం అతడికే.. మా ఓటమికి కారణం అదే: బట్లర్
భారత్లో ఇంగ్లండ్ పరాజయాల పరంపర కొనసాగుతోంది. తొలుత ఐదు మ్యాచ్ల టీ20 సిరీస్ను 4-1తో కోల్పోయిన బట్లర్ బృందం.. వన్డే సిరీస్(India vs England ODIs)నూ ఓటమితోనే ఆరంభించింది. నాగ్పూర్లో గురువారం జరిగిన మ్యాచ్లో నాలుగు వికెట్ల తేడాతో టీమిండియా చేతిలో ఓడిపోయింది. ఈ నేపథ్యంలో కెప్టెన్ జోస్ బట్లర్(Jos Buttler) విచారం వ్యక్తం చేశాడు.క్రెడిట్ మొత్తం అతడికేశుభారంభం అందుకున్నా దానిని కొనసాగించలేకపోవడమే తమ పరాజయానికి కారణమని బట్లర్ అన్నాడు. అదే విధంగా.. టీమిండియా విజయంలో క్రెడిట్ మొత్తం శ్రేయస్ అయ్యర్(Shreyas Iyer)కు దక్కుతుందంటూ అతడి బ్యాటింగ్ తీరును ప్రశంసించాడు. కాగా విదర్భ క్రికెట్ అసోసియేషన్ స్టేడియంలో జరిగిన తొలి వన్డేలో టాస్ గెలిచిన బట్లర్ తొలుత బ్యాటింగ్ వైపు మొగ్గుచూపాడు.అతడి రనౌట్లో అయ్యర్ కీలక పాత్రఈ క్రమంలో టీమిండియా సీనియర్ పేసర్ భారత బౌలింగ్ అటాక్ ఆరంభించి.. తొలి ఓవర్లో పరుగులేమీ ఇవ్వలేదు. అనంతరం వన్డే అరంగేట్ర ఆటగాడు, మరో పేసర్ హర్షిత్ రాణా సైతం మెయిడిన్ వేసి సత్తా చాటాడు. అయితే, ఆ తర్వాత ఇంగ్లండ్ ఓపెనర్ ఫిల్ సాల్ట్ ధనాధన్ ఇన్నింగ్స్తో హర్షిత్ రాణాకు చుక్కలు చూపించాడు.ఒకే ఓవర్లో ఏకంగా ఇరవై ఆరు పరుగులు పిండుకుని రాణాను పనిష్ చేశాడు. కానీ మంచి జోరు మీదున్న సమయంలో అనవసరపు పరుగు కోసం యత్నించి రనౌట్ అయ్యాడు. భారత స్టార్ బ్యాటర్ శ్రేయస్ అయ్యర్ అద్భుత ఫీల్డింగ్ కారణంగా సాల్ట్(26 బంతుల్లో 5 ఫోర్లు, 3 సిక్సర్లు- 43 రన్స్) వెనుదిరిగాడు.A moment of brilliance on the field by #ShreyasIyer and #PhilSalt is RUNOUT! 🙌🏻Start watching FREE on Disney+ Hotstar ➡️ https://t.co/gzTQA0IDnU#INDvENGOnJioStar 1st ODI 👉 LIVE NOW on Disney+ Hotstar, Star Sports 2, Star Sports 3, Sports 18 1 & Colors Cineplex! pic.twitter.com/n9hvFfJQpE— Star Sports (@StarSportsIndia) February 6, 2025 ఇక మరో ఓపెనర్ బెన్ డకెట్ సైతం 29 బంతుల్లో ఆరు ఫోర్ల సాయంతో 32 పరుగులతో రాణించగా.. వన్డౌన్లో వచ్చిన రీఎంట్రీ స్టార్ జో రూట్(19) నిరాశపరిచాడు. ఇక హ్యారీ బ్రూక్ హర్షిత్ రాణా దెబ్బకు పరుగుల ఖాతా తెరవకుండానే వెనుదిరిగాడు. ఇలాంటి తరుణంలో బట్లర్, జాకొబ్ బెతెల్తో కలిసి ఇన్నింగ్స్ చక్కదిద్దే ప్రయత్నం చేశాడు.బట్లర్ 67 బంతుల్లో 52 పరుగులు చేయగా.. బెతెల్ 64 బాల్స్ ఎదుర్కొని 51 రన్స్ సాధించాడు. కానీ మిగతా వాళ్లు మాత్రం చేతులెత్తేశారు. లియామ్ లివింగ్స్టోన్(5), బ్రైడన్ కార్సే(10), ఆదిల్ రషీద్(8) త్వరత్వరగా పెవిలియన్ చేరగా.. టెయిలెండర్ జోఫ్రా ఆర్చర్ 18 బంతుల్లో 21 పరుగులతో అజేయంగా నిలిచాడు. 38.4 ఓవర్లలోనే..ఫలితంగా ఇంగ్లండ్ 47.4 ఓవర్లలో 248 పరుగులు చేయగలిగింది. భారత బౌలర్లలో హర్షిత్ రాణా, రవీంద్ర జడేజా మూడేసి వికెట్లతో చెలరేగగా.. మహ్మద్ షమీ, అక్షర్ పటేల్, కుల్దీప్ యాదవ్ ఒక్కో వికెట్ దక్కించుకున్నారు.ఇక నామమాత్రపు లక్ష్యంతో బరిలోకి దిగిన టీమిండియా 38.4 ఓవర్లలో ఆరు వికెట్లు నష్టపోయి పని పూర్తి చేసింది. ఓపెనర్లు యశస్వి జైస్వాల్(15), కెప్టెన్ రోహిత్ శర్మ(2) విఫలమైనా.. శుబ్మన్ గిల్ (87) అద్భుత అర్థ శతకంతో మెరిశాడు. అతడికి తోడుగా నాలుగో నంబర్ బ్యాటర్ శ్రేయస్ అయ్యర్ టీ20 తరహా మాదిరి 36 బంతుల్లోనే 59 పరుగులతో దుమ్ములేపాడు. ఇక ఆల్రౌండర్ అక్షర్ పటేల్(47 బంతుల్లోనే 52) కూడా హాఫ్ సెంచరీ సాధించాడు.మా ఓటమికి కారణం అదేఈ నేపథ్యంలో ఓటమి అనంతరం ఇంగ్లండ్ కెప్టెన్ జోస్ బట్లర్ మాట్లాడుతూ.. ‘‘గెలవలేకపోయినందుకు బాధగా ఉంది. పవర్ ప్లేలో మేము అద్భుతంగా రాణించాం. కానీ త్వరత్వరగా వికెట్లు కోల్పోవడం ప్రభావం చూపింది. ఇంకో 40- 50 పరుగులు చేసేందుకు వికెట్ అనుకూలంగానే ఉంది. కానీ మేము ఆఖరిదాకా నిలవలేకపోయాం.ఏదేమైనా మా వాళ్లు శుభారంభం అందించారనేది వాస్తవం. ఆ సమయంలో మ్యాచ్ మాకు అనుకూలంగానే ఉంది. ఇక టీమిండియా విజయంలో శ్రేయస్ అయ్యర్కు క్రెడిట్ ఇవ్వాల్సి ఉంటుంది. అతడి అద్భుత ఇన్నింగ్స్ వల్ల భారత్కు మెరుగైన భాగస్వామ్యం లభించింది. ఏదేమైనా.. ఇకపై మేము ఇన్నింగ్స్ ఆసాంతం ఇంకాస్త మెరుగ్గా ఆడాల్సి ఉంది’’ అని పరాజయానికి గల కారణాలను విశ్లేషించాడు. చదవండి: IND vs ENG: శ్రేయస్ అయ్యర్ వరల్డ్ రికార్డు -
ఇంగ్లండ్తో తొలి వన్డే.. టీమిండియా ఘన విజయం
ఇంగ్లండ్తో తొలి వన్డే.. టీమిండియా ఘన విజయంనాగ్పూర్ వేదికగా ఇంగ్లండ్తో జరిగిన తొలి వన్డేలో టీమిండియా ఘన విజయం సాధించింది. ఈ మ్యాచ్లో తొలుత బ్యాటింగ్ చేసిన ఇంగ్లండ్ 47.4 ఓవర్లలో 248 పరుగులకు ఆలౌటైంది. అనంతరం భారత్ 38.4 ఓవర్లలో 6 వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని ఛేదించింది. మిడిలార్డర్ బ్యాటర్లు శుభ్మన్ గిల్ (87), శ్రేయస్ అయ్యర్ (59), అక్షర్ పటేల్ (52) అర్ద సెంచరీలు సాధించి టీమిండియాను గెలిపించారు.ఈ గెలుపుతో భారత్ మూడు మ్యాచ్ల సిరీస్లో 1-0 ఆధిక్యంలోకి వెళ్లింది.నాలుగో వికెట్ కోల్పోయిన భారత్.. అక్షర్ ఔట్లక్ష్యానికి 28 పరుగుల దూరంలో టీమిండియా నాలుగో వికెట్ కోల్పోయింది. హాఫ్ సెంచరీ అనంతరం ఆదిల్ రషీద్ బౌలింగ్లో అక్షర్ పటేల్ (52) క్లీన్ బౌల్డ్ అయ్యాడు. హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్న గిల్.. లక్ష్యానికి 85 పరుగుల దూరంలో భారత్ఈ మ్యాచ్లో శుభ్మన్ గిల్ 60 బంతుల్లో 7 ఫోర్ల సాయంతో హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. ఈ మ్యాచ్లో టీమిండియా గెలవాలంటే మరో 85 పరుగులు చేయాలి. గిల్తో పాటు అక్షర్ (29) క్రీజ్లో ఉన్నాడు. మూడో వికెట్ కోల్పోయిన టీమిండియా.. శ్రేయస్ ఔట్మంచి టచ్లో కనిపించిన శ్రేయస్ అయ్యర్ 59 పరుగుల వ్యక్తిగత స్కోర్ వద్ద జేకబ్ బేతెల్ బౌలింగ్లో ఎల్బీడబ్ల్యూ అయ్యాడు. 16 ఓవర్ల తర్వాత టీమిండియా స్కోర్ 113/3గా ఉంది. గిల్కు (28) జతగా అక్షర్ పటేల్ క్రీజ్లోకి వచ్చాడు. హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్న శ్రేయస్ఈ మ్యాచ్లో శ్రేయస్ 30 బంతుల్లో హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. బేకబ్ బేతెల్ బౌలింగ్లో బౌండరీ బాది ఈ మైలురాయిని చేరుకున్నాడు. శ్రేయస్ ఇన్నింగ్స్లో 8 ఫోర్లు, 2 సిక్సర్లు ఉన్నాయి. 14 ఓవర్ల తర్వాత టీమిండియా స్కోర్ 101/2గా ఉంది. శ్రేయస్తో పాటు శుభ్మన్ గిల్ (18) క్రీజ్లో ఉన్నాడు.వరుసగా రెండు సిక్సర్లు బాదిన శ్రేయస్నాలుగో స్థానంలో బ్యాటింగ్కు వచ్చిన శ్రేయస్ అయ్యర్.. జోఫ్రా ఆర్చర్ వేసిన ఏడో ఓవర్లో వరుసగా రెండు సిక్సర్లు బాదాడు. 7 ఓవర్ల తర్వాత భారత్ స్కోర్ 43/2గా ఉంది. శ్రేయస్ (18), శుభ్మన్ గిల్ (1) క్రీజ్లో ఉన్నారు. రెండో వికెట్ కోల్పోయిన టీమిండియా.. రోహిత్ ఔట్రోహిత్ వైఫల్యాల పరంపర వన్డేల్లోనూ కొనసాగుతుంది. బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో దారుణంగా విఫలమైన రోహిత్.. ఇంగ్లండ్తో జరుగుతున్న తొలి వన్డేలోనూ నిరాశపరిచాడు. ఈ మ్యాచ్లో 7 బంతులు ఎదుర్కొన్న రోహిత్ చెత్త షాట్ ఆడి కేవలం 2 పరుగులకే ఔటయ్యాడు. తొలి వికెట్ కోల్పోయిన భారత్249 పరుగుల లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన భారత్ 19 పరుగుల వద్ద తొలి వికెట్ను కోల్పోయింది. అరంగేట్రం ఆటగాడు యశస్వి జైస్వాల్ 15 పరుగులు చేసి జోఫ్రా ఆర్చర్ బౌలింగ్లో ఫిలిప్ సాల్ట్కు క్యాచ్ ఇచ్చి ఔటయ్యాడు.రెచ్చిపోయిన టీమిండియా బౌలర్లు.. 248 పరుగులకే ఆలౌటైన ఇంగ్లండ్ నాగ్పూర్ వేదికగా ఇంగ్లండ్తో జరుగుతున్న తొలి వన్డేలో టీమిండియా బౌలర్లు చెలరేగిపోయారు. టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ చేసిన ఇంగ్లండ్ను 248 పరుగులకే ఆలౌట్ చేశారు. రవీంద్ర జడేజా, హర్షిత్ రాణా తలో మూడు వికెట్లు తీసి ఇంగ్లండ్ను చావుదెబ్బ కొట్టగా.. షమీ, అక్షర్, కుల్దీప్ తలో వికెట్ తీశారు. ఇంగ్లండ్ బ్యాటర్లలో జోస్ బట్లర్ (52), జేకబ్ బేతెల్ (51) హాఫ్ సెంచరీలతో రాణించగా.. ఓపెనర్లు బెన్ డకెట్ (32), ఫిలిప్ సాల్ట్ (43) ఓ మోస్తరు స్కోర్లు చేశారు. రూట్ 19, బ్రూక్ 0, లివింగ్స్టోన్ 5, కార్స్ 10, ఆదిల్ రషీద్ 8, సాకిబ్ మహమూద్ 2 పరుగులు చేసి ఔటయ్యారు. ఆఖర్లో జోఫ్రా ఆర్చర్ (21 నాటౌట్) బ్యాట్ ఝులిపించడంతో ఇంగ్లండ్ ఈ మాత్రం స్కోరైనా చేయగలిగింది. తొమ్మిదో వికెట్ కోల్పోయిన ఇంగ్లండ్241 పరుగుల వద్ద ఇంగ్లండ్ తొమ్మిదో వికెట్ కోల్పోయింది. రవీంద్ర జడేజా బౌలింగ్లో ఆదిల్ రషీద్ (8) క్లీన్ బౌల్డ్ అయ్యాడు. ఆరో వికెట్ డౌన్.. లివింగ్స్టోన్ ఔట్183 పరుగుల వద్ద ఇంగ్లండ్ ఆరో వికెట్ కోల్పోయింది. హర్షిత్ రాణా బౌలింగ్లో వికెట్కీపర్ కేఎల్ రాహుల్కు క్యాచ్ ఇచ్చి లివింగ్స్టోన్ (5) ఔటయ్యాడు. హర్షిత్ రాణాకు ఇది మూడో వికెట్. ఐదో వికెట్ కోల్పోయిన ఇంగ్లండ్.. బట్లర్ ఔట్170 పరుగుల వద్ద ఇంగ్లండ్ ఐదో వికెట్ కోల్పోయింది. అక్షర్ పటేల్ బౌలింగ్లో హార్దిక్ పాండ్యాకు క్యాచ్ ఇచ్చి జోస్ బట్లర్ (52) ఔటయ్యాడు. 33 ఓవర్ల అనంతరం ఇంగ్లండ్ స్కోర్ 170/5గా ఉంది. జేకబ్ బేతెల్ (22), లివింగ్స్టోన్ క్రీజ్లో ఉన్నారు. 30 ఓవర్ల తర్వాత ఇంగ్లండ్ స్కోర్ 162/430 ఓవర్ల తర్వాత ఇంగ్లండ్ స్కోర్ 162/4గా ఉంది. జేకబ్ బేతెల్ (18), జోస్ బట్లర్ (48) క్రీజ్లో ఉన్నారు.నాలుగో వికెట్ కోల్పోయిన ఇంగ్లండ్.. రూట్ ఔట్111 పరుగుల వద్ద ఇంగ్లండ్ నాలుగో వికెట్ కోల్పోయింది. రవీంద్ర జడేజా బౌలింగ్లో జో రూట్ (19) ఎల్బీడబ్ల్యూ అయ్యాడు. ఒకే ఓవర్లో రెండు వికెట్లు తీసిన రాణాఅరంగ్రేటం పేసర్ హర్షిత్ రాణా ఒకే ఓవర్లో రెండు వికెట్లు తీసి ఇంగ్లండ్ను దెబ్బేశాడు. 10వ ఓవర్ మూడో బంతికి డకెట్ను (32) ఔట్ చేసిన రాణా.. అదే ఓవర్ చివరి బంతికి హ్యారీ బ్రూక్ను డకౌట్ చేశాడు. 10 ఓవర్ల అనంతరం ఇంగ్లండ్ స్కోర్ 77/3గా ఉంది. జో రూట్ (1), జోస్ బట్లర్ క్రీజ్లో ఉన్నారు. తొలి వికెట్ కోల్పోయిన ఇంగ్లండ్.. సాల్ట్ రనౌట్ఇంగ్లండ్ జట్టు 75 పరుగుల వద్ద తొలి వికెట్ కోల్పోయింది. ప్రమాదకరంగా కనిపించిన సాల్ట్ (26 బంతుల్లో 43; 5 ఫోర్లు, 3 సిక్సర్లు) లేని మూడో పరుగు కోసం ప్రయత్నించి రనౌటయ్యాడు.రాణా బౌలింగ్లో చితక్కొట్టిన సాల్ట్ఆరో ఓవర్లో ఇంగ్లండ్ ఓపెనర్ ఫిల్ సాల్ట్ తన విశ్వరూపం ప్రదర్శించాడు. హర్షిత్ రాణా బౌలింగ్లో వరుసగా 6,4,6,4,0,6 బాదాడు. ఒకే ఓవర్లో ఏకంగా 26 పరుగులు పిండుకున్నాడు.కట్టుదిట్టంగా భారత పేసర్ల బౌలింగ్టాస్ గెలిచిన ఇంగ్లండ్ తొలుత బ్యాటింగ్కు దిగగా.. సీనియర్ పేసర్ మహ్మద్ షమీ భారత బౌలింగ్ ఎటాక్ ఆరంభించాడు. తొలి ఓవర్నే మెయిడిన్ వేసి శుభారంభం అందించాడు. అతడికి తోడుగా హర్షిత్ రాణా కొత్త బంతితో బరిలోకి దిగి వన్డేల్లో తన మొదటి ఓవర్నే మెయిడిన్(సున్నా పరుగులు) చేశాడు. ఐదు ఓవర్లు ముగిసే సరికి ఇంగ్లండ్ స్కోరు: 26/0 (5)బ్యాటింగ్ ఎంచుకున్న ఇంగ్లండ్నాగ్పూర్ వేదికగా భారత్, ఇంగ్లండ్ మధ్య తొలి వన్డే ఇవాళ (ఫిబ్రవరి 6) మధ్యాహ్నం 1:30 గంటలకు ప్రారంభమవుతుంది. ఈ మ్యాచ్లో ఇంగ్లండ్ టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ ఎంచుకుంది. ఈ మ్యాచ్లో టీమిండియా స్టార్ ఆటగాడు విరాట్ కోహ్లి ఆడటం లేదు. అతని కుడి మోకాలికి గాయమైంది. కోహ్లి గాయపడటంతో యశస్వి జైస్వాల్కు అవకాశం వచ్చింది. యశస్వి.. రోహిత్తో కలిసి భారత ఇన్నింగ్స్ను ఆరంభిస్తాడు. యశస్వికి వన్డేల్లో ఇది తొలి మ్యాచ్ (డెబ్యూ). ఈ మ్యాచ్లో యశస్వితో పాటు హర్షిత్ రాణా కూడా వన్డేల్లో అరంగేట్రం చేయనున్నాడు. ఈ మ్యాచ్లో రిషబ్ పంత్కు కూడా అవకాశం దక్కలేదు. కేఎల్ రాహుల్ వికెట్కీపింగ్ బాధ్యతలను అదనంగా మోయనున్నాడు. ఈ మ్యాచ్లో భారత్ ముగ్గురు స్పిన్నర్లు, ఇద్దరు స్పెషలిస్ట్ పేసర్లతో బరిలోకి దిగింది.ఇంగ్లండ్ విషయానికొస్తే.. టీ20 సిరీస్ ఆడిన జట్టులో పెద్దగా మార్పులు లేవు. జో రూట్ కొత్తగా జట్టులో చేరాడు. ఈ సిరీస్ భారత్, ఇంగ్లండ్ జట్లకు ఛాంపియన్స్ ట్రోఫీకి సన్నాహకంగా ఉపయోగపడుతుంది. ఈ సిరీస్లో మొత్తం మూడు మ్యాచ్లు జరుగనున్నాయి. దీనికి ముందు ఇరు జట్ల మధ్య జరిగిన ఐదు మ్యాచ్ల టీ20 సిరీస్ను భారత్ 4-1 తేడాతో కైవసం చేసుకున్న విషయం తెలిసిందే.తుది జట్లు..ఇండియా (ప్లేయింగ్ XI): రోహిత్ శర్మ(కెప్టెన్), యశస్వి జైస్వాల్, శ్రేయస్ అయ్యర్, శుభ్మన్ గిల్, కేఎల్ రాహుల్(వికెట్కీపర్), హార్దిక్ పాండ్యా, అక్షర్ పటేల్, రవీంద్ర జడేజా, హర్షిత్ రాణా, కుల్దీప్ యాదవ్, మహ్మద్ షమీఇంగ్లండ్ (ప్లేయింగ్ XI): బెన్ డకెట్, ఫిలిప్ సాల్ట్(వికెట్కీపర్), జో రూట్, హ్యారీ బ్రూక్, జోస్ బట్లర్(కెప్టెన్), లియామ్ లివింగ్స్టోన్, జేకబ్ బేతెల్, బ్రైడన్ కార్సే, జోఫ్రా ఆర్చర్, ఆదిల్ రషీద్, సాకిబ్ మహమూద్ -
Ind vs Eng 1st ODI: కోహ్లి దూరం.. జైస్వాల్తో పాటు అతడి అరంగేట్రం
టీమిండియాతో తొలి వన్డేలో ఇంగ్లండ్(India vs England) టాస్ గెలిచి.. తొలుత బ్యాటింగ్ ఎంచుకుంది. మూడు వన్డేల సిరీస్లో భాగంగా ఇరుజట్ల మధ్య నాగ్పూర్లో గురువారం మ్యాచ్ మొదలైంది. అయితే, దురదృష్టవశాత్తూ టీమిండియా స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లి(Virat Kohli) ఈ మ్యాచ్కు దూరమయ్యాడు.జైస్వాల్తో పాటు అతడి అరంగేట్రంటాస్ సందర్భంగా భారత జట్టు కెప్టెన్ రోహిత్ శర్మ(Rohit Sharma) ఈ విషయాన్ని వెల్లడించాడు. అదే విధంగా.. ఇంగ్లండ్తో తొలి వన్డేతో స్టార్ ఓపెనర్ యశస్వి జైస్వాల్, యువ పేసర్ హర్షిత్ రాణా యాభై ఓవర్ల ఫార్మాట్లో టీమిండియా తరఫున అరంగేట్రం చేస్తున్నట్లు వెల్లడించాడు.‘‘టాస్ ఓడినా మరేం పర్లేదు. మేము తొలుత బౌలింగ్ చేయాలనే భావించాం. బంతితో, బ్యాట్తో దూకుడుగానే రాణించాలని కోరుకుంటున్నాం. ఇదొక సరికొత్త ఆరంభం. చాంపియన్స్ ట్రోఫీకి ముందుకు మాకు వచ్చిన ఈ అవకాశాన్ని పూర్తిగా సద్వినియోగం చేసుకుంటాం.జైస్వాల్, హర్షిత్ రాణా వన్డేల్లో అరంగేట్రం చేస్తున్నారు. దురదృష్టవశాత్తూ మోకాలి సమస్య వల్ల కోహ్లి ఆడలేకపోతున్నాడు’’ అని రోహిత్ శర్మ పేర్కొన్నాడు. కాగా టీమిండియా తరఫున టెస్టుల్లో ఓపెనర్గా పాతుకుపోయిన యశస్వి జైస్వాల్.. ఇప్పటికే టీ20లలోనూ అరంగేట్రం చేశాడు. ఈ రెండు ఫార్మాట్లలోనూ తనను తాను నిరూపించుకున్న జైసూ.. తాజాగా వన్డేల్లోనూ అడుగుపెట్టాడు. మరోవైపు.. హర్షిత్ రాణా ఆస్ట్రేలియాతో బోర్డర్- గావస్కర్ ట్రోఫీ సందర్భంగా అంతర్జాతీయ క్రికెట్లో అడుగుపెట్టిన విషయం తెలిసిందే. అనంతరం ఇటీవల ఇంగ్లండ్తో నాలుగో టీ20 సందర్భంగా.. శివం దూబేకు కంకషన్ సబ్స్టిట్యూట్గా వచ్చి పొట్టి ఫార్మాట్లో ఎంట్రీ ఇచ్చాడు. జో రూట్కు స్వాగతంమరోవైపు.. ఇంగ్లండ్ కెప్టెన్ జోస్ బట్లర్ టాస్ గెలవడం పట్ల హర్షం వ్యక్తం చేశాడు. సరికొత్త ఉత్సాహంతో వన్డే బరిలో దిగుతున్నామని.. జో రూట్కు తిరిగి జట్టులోకి స్వాగతం పలికాడు. ఇక తాము ప్రస్తుతం పటిష్ట జట్టుతో తలపడుతున్నామన్న బట్లర్.. హెడ్కోచ్ బ్రెండన్ మెకల్లమ్ ప్రతి విషయంలోనూ తమను జాగ్రత్తగా చూసుకుంటున్నాడని పేర్కొన్నాడు. ఈ మ్యాచ్లో తాము ముగ్గురు పేసర్లతో పాటు ఒక అదనపు స్పిన్ బౌలింగ్ ఆల్రౌండర్ను కూడా ఆడిస్తున్నట్లు తెలిపాడు. కాగా ఐదు టీ20లు, మూడు వన్డేల సిరీస్లు ఆడే నిమిత్తం ఇంగ్లండ్ భారత్ పర్యటనకు వచ్చింది. ఈ క్రమంలో ఇరుజట్ల మధ్య తొలుత టీ20 సిరీస్ జరుగగా.. సూర్యకుమార్ సేన 4-1తో జయభేరి మోగించింది. అనంతరం గురువారం నుంచి ఇరుజట్ల మధ్య వన్డే సిరీస్కు తెరలేచింది.భారత తుదిజట్టురోహిత్ శర్మ (కెప్టెన్), యశస్వి జైస్వాల్, శ్రేయస్ అయ్యర్, శుభ్మన్ గిల్, కెఎల్ రాహుల్ (వికెట్ కీపర్), హార్దిక్ పాండ్యా, అక్షర్ పటేల్, రవీంద్ర జడేజా, హర్షిత్ రాణా, కుల్దీప్ యాదవ్, మహ్మద్ షమీ.భారత్తో తొలి వన్డేకు ఇంగ్లండ్ తుదిజట్టుబెన్ డకెట్, ఫిల్ సాల్ట్(వికెట్ కీపర్), జో రూట్, హ్యారీ బ్రూక్, జోస్ బట్లర్(కెప్టెన్), లియామ్ లివింగ్ స్టోన్, జాకొబ్ బెతెల్, బ్రైడన్ కార్సే, జోఫ్రా ఆర్చర్, ఆదిల్ రషీద్, సకీబ్ మహమూద్.చదవండి: హార్దిక్ పాండ్యా లేకపోతే ఏంటి?.. అతడు లేకుండానే వరల్డ్కప్ ఆడాం: రోహిత్ శర్మ -
తొలి వన్డేకు ఇంగ్లండ్ తుదిజట్టు ప్రకటన.. వెటరన్ ప్లేయర్ రీఎంట్రీ
టీమిండియాతో తొలి వన్డేకు ఇంగ్లండ్ అండ్ వేల్స్ క్రికెట్ బోర్డు(ఈసీబీ) తమ తుది జట్టును బుధవారం ప్రకటించింది. జోస్ బట్లర్(Jos Buttler) కెప్టెన్సీలోని ఈ టీమ్లో మాజీ సారథి జో రూట్(Joe Root)కు స్థానం కల్పించింది. దీంతో.. వన్డే ప్రపంచకప్-2023 తర్వాత అతడు తొలిసారిగా వన్డే ఫార్మాట్ బరిలో దిగనున్నాడు.కాగా ఐదు టీ20లు, మూడు వన్డేల సిరీస్(India vs England)లు ఆడేందుకు ఇంగ్లండ్ భారత్లో పర్యటిస్తున్న విషయం తెలిసిందే. ఇందులో భాగంగా ఇప్పటికే టీ20 సిరీస్ ముగియగా.. బట్లర్ బృందం సూర్యకుమార్ సేన చేతిలో 4-1తో చిత్తుగా ఓడి.. సిరీస్ను కోల్పోయింది. కేవలం రాజ్కోట్ టీ20లో మాత్రమే గెలిచి వైట్వాష్ నుంచి తప్పించుకుంది.ఓపెనర్లుగా వారేఈ క్రమంలో ఇరుజట్ల మధ్య నాగ్పూర్ వేదికగా గురువారం(ఫిబ్రవరి) వన్డే సిరీస్ మొదలుకానుంది. ఈ నేపథ్యంలో ఇంగ్లండ్ తాజాగా తమ తుదిజట్టును వెల్లడించింది. తొలి వన్డేలో ఓపెనర్లుగా బెన్ డకెట్, ఫిల్ సాల్ట్ తమ స్థానాలను పదిలం చేసుకోగా.. జో రూట్ వన్డౌన్లో ఆడనున్నాడు. దాదాపు పదిహేను నెలల విరామం తర్వాత రూట్ తిరిగి రాగా.. కెప్టెన్ బట్లర్ ఐదో స్థానంలో బ్యాటింగ్కు రానున్నాడు. ఆల్రౌండర్ల జాబితాలో లియామ్ లివింగ్స్టోన్- జాకొబ్ బెతెల్ జోడీ కొనసాగనుంది.ముగ్గురు సీమర్లతోమరోవైపు.. తొలి వన్డేలో ఇంగ్లండ్ ముగ్గురు సీమర్లతో బరిలోకి దిగనుంది. జోఫ్రా ఆర్చర్, బ్రైడన్ కార్సేలతో పాటు సకీమ్ మహమూద్ కూడా ప్లేయింగ్ ఎలెవన్లో చోటు దక్కించుకున్నాడు. ఇక ఈ మ్యాచ్లో ఇంగ్లండ్ తమ వెటరన్ స్పిన్నర్ ఆదిల్ రషీద్ను ఆడించనుంది.మ్యాచ్ ఆరంభ సమయం ఇదేఇక భారత్- ఇంగ్లండ్ మధ్య కటక్ వేదికగా రెండో వన్డే ఆదివారం(ఫిబ్రవరి 9) జరుగనుండగా.. అహ్మదాబాద్లో ఆఖరి వన్డే(ఫిబ్రవరి 12) నిర్వహణకు షెడ్యూల్ ఖరారైంది. భారత కాలమానం ప్రకారం భారత్- ఇంగ్లండ్ మధ్య మధ్యాహ్నం ఒంటిగంట ముప్పై నిమిషాలకు వన్డే మ్యాచ్లు ఆరంభం కానున్నాయి. ఐసీసీ చాంపియన్స్ ట్రోఫీకి ముందు ఇరుజట్లకు ఈ సిరీస్ ద్వారా కావాల్సినంత ప్రాక్టీస్ లభించనుంది. వరుస చేదు అనుభవాల తర్వాతఇదిలా ఉంటే.. బట్లర్ సారథ్యంలోని ఇంగ్లండ్ జట్టు గత రెండు వన్డే సిరీస్లను కోల్పోయింది. ఆస్ట్రేలియా, వెస్టిండీస్ జట్ల చేతిలో ఓటమిపాలైంది. ఇక వన్డే వరల్డ్కప్-2023లోనూ ఇంగ్లండ్ దారుణంగా విఫలమైన విషయం తెలిసిందే. డిఫెండింగ్ చాంపియన్గా బరిలోకి దిగి పాయింట్ల పట్టికలో ఏడో స్థానానికి పరిమితమై అప్రదిష్టను మూటగట్టుకుంది. ఈ నేపథ్యంలో తాజా సిరీస్లో రోహిత్ సేనకు ఏమేర పోటీ ఇవ్వనుందనేది ఆసక్తికరంగా మారింది. ఇక పరిమిత ఓవర్ల క్రికెట్లోనూ ఇంగ్లండ్ హెడ్కోచ్గా బాధ్యతలు చేపట్టిన బ్రెండన్ మెకల్లమ్కు తొలుత టీ20 సిరీస్లో చేదు అనుభవం ఎదురైంది. అయినప్పటికీ వన్డే సిరీస్లోనూ అదే దూకుడును కొనసాగించేందుకు తాము సిద్ధంగా ఉన్నట్లు మేనేజ్మెంట్ చెప్పడం విశేషం. టీమిండియాతో తొలి వన్డేకు ఇంగ్లండ్ తుదిజట్టుబెన్ డకెట్, ఫిల్ సాల్ట్(వికెట్ కీపర్), జో రూట్, హ్యారీ బ్రూక్, జోస్ బట్లర్(కెప్టెన్), లియామ్ లివింగ్ స్టోన్, జాకొబ్ బెతెల్, బ్రైడన్ కార్సే, జోఫ్రా ఆర్చర్, ఆదిల్ రషీద్, సకీబ్ మహమూద్. చదవండి: ఐసీసీ టోర్నీ తర్వాత రోహిత్ గుడ్బై? కోహ్లికి మాత్రం బీసీసీఐ గ్రీన్సిగ్నల్! -
టీమిండియా ప్రపంచ రికార్డు.. సరికొత్త చరిత్ర
అంతర్జాతీయ టీ20 ఫార్మాట్లో తనకు తిరుగులేదని టీమిండియా మరోసారి నిరూపించుకుంది. ఇంగ్లండ్తో ఐదో టీ20లో భారీ తేడాతో గెలుపొంది.. ప్రపంచ రికార్డును తన ఖాతాలో వేసుకుంది. టెస్టు హోదా కలిగిన జట్లలో ఇంత వరకు.. ఏ టీమ్కీ సాధ్యం కాని రీతిలో ‘బిగ్గెస్ట్ విక్టరీ(Biggest Victory)’ల విషయంలో అత్యంత అరుదైన ఘనత సాధించింది.కాగా సొంతగడ్డపై ఇంగ్లండ్తో ఐదు మ్యాచ్ల టీ20 సిరీస్ను భారత్ 4-1(India Won Series With 4-1)తో కైవసం చేసుకున్న విషయం తెలిసిందే. కోల్కతాలో విజయంతో ఈ సిరీస్ ఆరంభించిన టీమిండియా.. చెన్నైలోనూ గెలిచింది. అయితే, ఆ తర్వాత రాజ్కోట్లో జరిగిన మూడో టీ20లో మాత్రం ఓటమిపాలైంది.ఏకపక్ష విజయం అయితే, పడిలేచిన కెరటంలా పుణె వేదికగా మరోసారి సత్తా చాటి.. మరో మ్యాచ్ మిగిలి ఉండగానే సిరీస్ సొంతం చేసుకుంది. ఈ నాలుగు మ్యాచ్లలో టీమిండియాకు ఇంగ్లండ్ గట్టి పోటీనివ్వగా.. నామమాత్రపు ఆఖరి టీ20లో మాత్రం సూర్యకుమార్ సేన ఏకపక్ష విజయం సాధించింది.అభిషేక్ పరుగుల సునామీవాంఖడేలో ఆదివారం జరిగిన ఈ మ్యాచ్లో టాస్ గెలిచిన ఇంగ్లండ్ సారథి జోస్ బట్లర్(Jos Buttler) టీమిండియాను బ్యాటింగ్కు ఆహ్వానించాడు. మార్క్వుడ్ సంజూ శాంసన్(16)ను త్వరగానే పెవిలియన్కు పంపి ఇంగ్లండ్కు శుభారంభం అందించినా.. ఆ ఆ ఆనందం ఎక్కువసేపు నిలవలేదు. వరుస విరామాల్లో వికెట్లు పడుతున్నా.. భారత మరో ఓపెనర్ అభిషేక్ శర్మ దూకుడు కనబరిచాడు.ఇంగ్లండ్ బౌలింగ్ను ఊచకోత కోస్తూ.. కేవలం 54 బంతుల్లోనే 135 పరుగులతో పరుగుల సునామీ సృష్టించాడు. ఇతరులలో తిలక్ వర్మ(15 బంతుల్లో 24), శివం దూబే(13 బంతుల్లో 30) మెరుపు ఇన్నింగ్స్లో ఆకట్టుకున్నారు. ఈ క్రమంలో భారత్ నిర్ణీత 20 ఓవర్లలో తొమ్మిది వికెట్ల నష్టానికి 247 పరుగుల భారీ స్కోరు సాధించింది.బౌలర్ల విజృంభణ ఇక లక్ష్య ఛేదనలో ఇంగ్లండ్ భారత బౌలర్ల ధాటికి చేతులెత్తేసింది. ఓపెనర్ ఫిల్ సాల్ట్(23 బంతుల్లో 55) అర్ధ శతకం సాధించగా.. మిగతా వాళ్లంతా పెవిలియన్కు క్యూ కట్టారు. బెన్ డకెట్ 0, కెప్టెన్ బట్లర్ 7, హ్యారీ బ్రూక్ 2, లియామ్ లివింగ్స్టోన్ 9, జాకొబ్ బెతెల్ 10, బ్రైడన్ కార్సే 3, జేమీ ఓవర్టన్ 1, జోఫ్రా ఆర్చర్ 1*, ఆదిల్ రషీద్ 6, మార్క్ వుడ్ 0 పరుగులు చేశాడు.ప్రపంచంలోనే ఏకైక జట్టుగాఫలితంగా 97 పరుగులకే ఇంగ్లండ్ ఆలౌట్ అయింది. పొదుపుగా బౌలింగ్ చేస్తూనే భారత బౌలర్లలో మహ్మద్ షమీ మూడు, శివం దూబే, అభిషేక్ శర్మచ వరుణ్ చక్రవర్తి తలా రెండు.. రవి బిష్ణోయి ఒక వికెట్ తీశాడు. దీంతో కేవలం 10.3 ఓవర్లలోనే ఇంగ్లండ్ కథ ముగిసిపోయింది. టీమిండియా చేతిలో 150 పరుగుల భారీ తేడాతో మట్టికరిచింది.కాగా టీమిండియా అంతర్జాతీయ టీ20లలో ప్రత్యర్థి జట్టుపై 150 పైచిలుకు పరుగులతో విజయం సాధించడం ఇది రెండోసారి. తద్వారా ప్రపంచంలో ఈ ఘనత సాధించిన ఏకైక జట్టుగా నిలిచింది. అంతేకాదు.. అత్యధిక పరుగుల తేడాతో ప్రత్యర్థి జట్లపై ఎక్కువసార్లు(4) గెలుపొందిన టీ20 టీమ్గానూ తన రికార్డును మరింత పదిలం చేసుకుంది. ఇక వన్డేల్లోనూ బిగ్గెస్ట్ విక్టరీ సాధించిన జట్టుగా టీమిండియాకు రికార్డు ఉంది. శ్రీలంకపై 2023లో తిరువనంతపురం వేదికగా 317 పరుగుల తేడాతో భారత్ గెలుపొందింది.అంతర్జాతీయ టీ20లలో అత్యధిక పరుగుల తేడాతో గెలుపొందిన జట్లు(ఫుల్ మెంబర్ సైడ్)👉ఇండియా- న్యూజిలాండ్పై 2023లో అహ్మదాబాద్ వేదికగా 168 పరుగుల తేడాతో గెలుపు👉ఇండియా- ఇంగ్లండ్పై 2025లో ముంబై వేదికగా 150 పరుగుల తేడాతో గెలుపు👉పాకిస్తాన్- వెస్టిండీస్పై 2018లో కరాచీ వేదికగా 143 పరుగుల తేడాతో గెలుపు👉ఇండియా- ఐర్లాండ్పై 2018లో డబ్లిన్ వేదికగా 143 పరుగుల తేడాతో గెలుపు👉ఇంగ్లండ్- వెస్టిండీస్పై 2019లో బెసెటెరె వేదికగా 137 పరుగుల తేడాతో గెలుపు👉ఇండియా- సౌతాఫ్రికాపై 2024లో జొహన్నస్బర్గ్ వేదికగా 135 పరుగుల తేడాతో గెలుపు.చదవండి: వాళ్లిద్దరు అద్భుతం.. రిస్క్ అని తెలిసినా ఒక్కోసారి తప్పదు: సూర్య -
'నేను చూసిన బెస్ట్ ఇన్నింగ్స్ ఇదే'.. అభిషేక్పై బట్లర్ ప్రశంసల జల్లు
టీమిండియాతో ఐదు టీ20ల సిరీస్ను ఇంగ్లండ్ ఘోర పరాభావంతో ముగించింది. ముంబై వేదికగా భారత్తో జరిగిన ఐదో టీ20లో 150 పరుగుల తేడాతో ఇంగ్లండ్ ఓటమి చవిచూసింది. ఈ మ్యాచ్లో బౌలింగ్, బ్యాటింగ్ రెండింటిలోనూ ఇంగ్లండ్ తేలిపోయింది. ఈ మ్యాచ్లో టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన భారత్ నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 247 పరుగుల భారీ స్కోర్ చేసింది.భారత బ్యాటర్లలో అభిషేక్ శర్మ( 54 బంతుల్లో 7 ఫోర్లు, 13 సిక్స్ లతో 135) మెరుపు సెంచరీతో చెలరేగగా.. శివమ్ దూబే(30), తిలక్ వర్మ(24) పరుగులతో రాణించారు. అనంతరం బ్యాటింగ్కు దిగిన ఇంగ్లండ్ 97 పరుగులకే కుప్పకూలింది. భారత బౌలర్లలో మహ్మద్ షమీ మూడు వికెట్లతో సత్తాచాటగా.. వరుణ్ చక్రవర్తి, దూబే, అభిషేక్ శర్మ తలా రెండు వికెట్లు సాధించారు. ఇంగ్లండ్ బ్యాటర్లలో ఫిల్ సాల్ట్(55) టాప్ స్కోరర్గా నిలిచాడు. ఇక ఈ ఓటమిపై మ్యాచ్ అనంతరం ఇంగ్లండ్ సారథి జోస్ బట్లర్(Jos Buttler) స్పందించాడు. అద్బుత ఇన్నింగ్స్ ఆడిన అభిషేక్ శర్మ(Abhishek Sharma)పై బట్లర్ సైతం ప్రశంసల వర్షం కురిపించాడు."ఈ సిరీస్ను కోల్పోవడం మమ్మల్ని తీవ్ర నిరాశకు గురిచేసింది. . కానీ కొన్ని విభాగాల్లో మాత్రం మేము మెరుగ్గానే రాణించాము. ఈ ఓటమి నుంచి కచ్చితంగా కొన్ని పాఠాలు నేర్చుకుంటాము. స్వదేశంలో భారత జట్టుకు తిరుగులేదు. వారిని ఓడించడం అంత సులువు కాదు. ఈ సిరీస్లో మా బౌలర్లు బాగానే రాణించారు. ఆఖరికి ఈ హైస్కోరింగ్ మ్యాచ్లో కూడా బ్రైడన్ కార్స్, మార్క్ వుడ్ అద్బుతంగా రాణించారు. ఇక అభిషేక్ శర్మ గురుంచి ఎంత చెప్పుకున్న తక్కువే. నేను ఇప్పటివరకు నా కెరీర్లో ఎంతో క్రికెట్ చూశాను. కానీ టీ20ల్లో అభిషేక్ శర్మ లాంటి విధ్వంసకర ఇన్నింగ్స్ను చూడడం ఇదే తొలిసారి. ఇక మా జట్టులోకి జో రూట్ తిరిగొచ్చాడు. అతడు ప్రపంచంలోని అత్యుత్తమ ఆటగాళ్లలో ఒకడు. వన్డే సిరీస్ కోసం ఆతృతగా ఎదురుచూస్తున్నాము. టీ20 సిరీస్ తరహాలోనే ఇది కూడా హోరా హోరీగా సాగుతోంది" అని పోస్ట్ మ్యాచ్ ప్రేజెంటేషన్లో బట్లర్ పేర్కొన్నాడు. కాగా ఫిబ్రవరి 6 నుంచి నాగ్పూర్ వేదికగా ఇరు జట్ల మధ్య మూడు వన్డేల సిరీస్ ప్రారంభం కానుంది. మరోవైపు టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ, జైశ్వాల్, కోహ్లి, శ్రేయస్ అయ్యర్, రిషబ్ పంత్ ఇంగ్లండ్తో వన్డేలకు బరిలోకి దిగనున్నారు.ఇంగ్లండ్తో మూడు వన్డేలకు భారత జట్టురోహిత్ శర్మ, శుబ్మన్ గిల్, విరాట్ కోహ్లి, శ్రేయస్ అయ్యర్, కేఎల్ రాహుల్, హార్దిక్ పాండ్యా, అక్షర్ పటేల్, వాషింగ్టన్ సుందర్, కుల్దీప్ యాదవ్, హర్షిత్ రాణా, మహ్మద్ షమీ, అర్ష్దీప్ సింగ్, యశస్వి జైస్వాల్, రిషభ్ పంత్, రవీంద్ర జడేజా.భారత్తో వన్డేలకు ఇంగ్లండ్ జట్టుజోస్ బట్లర్ (కెప్టెన్), జోఫ్రా ఆర్చర్, గస్ అట్కిన్సన్, జాకబ్ బెతెల్, హ్యారీ బ్రూక్, బ్రైడన్ కార్సే, బెన్ డకెట్, జేమీ ఓవర్టన్, జేమీ స్మిత్, లియామ్ లివింగ్స్టోన్, ఆదిల్ రషీద్, జో రూట్, సాకిబ్ మహమూద్, ఫిల్ సాల్ట్, మార్క్ వుడ్.చదవండి: IND vs ENG: చరిత్ర సృష్టించిన అభిషేక్.. ప్రపంచంలోనే తొలి ప్లేయర్గా -
ఐదో టీ20లో భారత్ ఘన విజయం
ఐదో టీ20లో భారత్ ఘన విజయంముంబై వేదికగా ఇంగ్లండ్తో జరిగిన ఐదో టీ20లో భారత్ ఘన విజయం సాధించింది. ఈ మ్యాచ్లో భారత్ ఇంగ్లండ్ను 150 పరుగుల తేడాతో మట్టికరిపించింది. తొలుత బ్యాటింగ్ చేసిన భారత్ నిర్ణీత ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 247 పరుగులు చేయగా.. ఇంగ్లండ్ 10.3 ఓవర్లలో 97 పరుగులకే ఆలౌటైంది. ఈ మ్యాచ్లో అభిషేక్ శర్మ విధ్వంసకర శతకంతో విరుచుకుపడ్డాడు. భారత బౌలర్లు తలో చేయి వేసి ఇంగ్లండ్ ఇన్నింగ్స్ను పేకమేడలా కూల్చారు. ఈ గెలుపుతో భారత్ ఐదు మ్యాచ్ల సిరీస్ను 4-1 తేడాతో కైవసం చేసుకుంది.మూడో వికెట్ కోల్పోయిన ఇంగ్లండ్59 పరుగుల వద్ద ఇంగ్లండ్ మూడో వికెట్ కోల్పోయింది. బిష్ణోయ్ బౌలింగ్లో హ్యారీ బ్రూక్ (2) ఔటయ్యాడు.రెండో వికెట్ కోల్పోయిన ఇంగ్లండ్48 పరుగుల వద్ద ఇంగ్లండ్ రెండో వికెట్ కోల్పోయింది. జోస్ బట్లర్ను (7) వరుణ్ చక్రవర్తి పెవిలియన్కు పంపాడు. టార్గెట్ 248.. తొలి వికెట్ కోల్పోయిన ఇంగ్లండ్248 పరుగుల లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన ఇంగ్లండ్కు శుభారంభమే లభించింది. అయితే ఆ జట్టు 3వ ఓవర్ తొలి బంతికి తొలి వికెట్ కోల్పోయింది. షమీ బౌలింగ్లో బెన్ డకెట్ డకౌటాయ్యాడు. 4 ఓవర్లలో ఇంగ్లండ్ స్కోర్ 48/1గా ఉంది. ఫిల్ సాల్ట్ (39) ధాటిగా ఆడుతున్నాడు. అభిషేక్ విధ్వంసకర శతకం.. టీమిండియా భారీ స్కోర్ముంబై వేదికగా ఇంగ్లండ్తో జరుగుతున్న ఐదో టీ20లో టీమిండియా భారీ స్కోర్ (247/9) చేసింది. ఈ మ్యాచ్లో అభిషేక్ శర్మ (54 బంతుల్లో 135; 7 ఫోర్లు, 13 సిక్సర్లు) విధ్వంసకర శతకంతో విరుచుకుపడ్డాడు. హాఫ్ సెంచరీని 17 బంతుల్లో పూర్తి చేసిన అభిషేక్.. సెంచరీని 37 బంతుల్లో శతక్కొట్టాడు. టీ20ల్లో అభిషేక్ది భారత్ తరఫున రెండో వేగవంతమైన హాఫ్ సెంచరీ (17), సెంచరీ (37). టీ20ల్లో భారత్ తరఫున ఫాస్టెస్ట్ సెంచరీ రికార్డు రోహిత్ శర్మ (35 బంతుల్లో) పేరిట ఉండగా.. ఫాస్టెస్ట్ హాఫ్ సెంచరీ యువరాజ్ సింగ్ (12 బంతుల్లో) పేరిట ఉంది. అభిషేక్కు టీ20ల్లో ఇది రెండో సెంచరీ.టీ20ల్లో భారత్ తరఫున అత్యధిక స్కోర్ (135) కూడా అభిషేక్దే. అలాగే ఓ టీ20లో భారత్ తరఫున అత్యధిక సిక్సర్లు (13) కొట్టింది కూడా అభిషేకే. అభిషేక్ ధాటికి భారత్ పవర్ ప్లేల్లో అత్యధిక స్కోర్ (95/1) నమోదు చేసింది. అభిషేక్ సెంచరీ పూర్తయ్యాక భారత్ స్కోర్ బాగా నెమ్మదించింది. వరుస క్రమంలో వికెట్లు పడిపోయాయి. ఆరంభంలో సంజూ శాంసన్ (7 బంతుల్లో 16; ఫోర్, 2 సిక్సర్లు).. మధ్యలో తిలక్ వర్మ (15 బంతుల్లో 24; 3 ఫోర్లు, సిక్స్), శివమ్ దూబే (13 బంతుల్లో 30; 3 ఫోర్లు, 2 సిక్సర్లు) మెరుపు ఇన్నింగ్స్లు ఆడారు. వేగంగా పరుగులు రాబట్టే క్రమంలో సూర్యకుమార్ యాదవ్ (3 బంతుల్లో 2), హార్దిక్ పాండ్యా (6 బంతుల్లో 9; సిక్స్), రింకూ సింగ్ 6 బంతుల్లో 9; ఫోర్), అక్షర్ పటేల్ (11 బంతుల్లో 15; 2 ఫోర్లు), బిష్ణోయ్ (0) ఔటయ్యారు. ఇంగ్లండ్ బౌలర్లలో బ్రైడన్ కార్స్ 3, మార్క్ వుడ్ 2, జోఫ్రా ఆర్చర్, జేమీ ఓవర్టన్, ఆదిల్ రషీద్ తలో వికెట్ తీశారు.37 బంతుల్లో శతక్కొట్టిన అభిషేక్హాఫ్ సెంచరీ తర్వాత పేట్రేగిపోయిన అభిషేక్ శర్మ 37 బంతుల్లో 5 ఫోర్లు, 10 సిక్సర్ల సాయంతో సెంచరీ పూర్తి చేశాడు. టీ20ల్లో భారత్ తరఫున ఇది రెండో వేగవంతమైన శతకం. టీ20ల్లో భారత్ తరఫున వేగవంతమైన సెంచరీ రికార్డు రోహిత్ శర్మ పేరిట ఉంది. హిట్మ్యాన్ 2017లో శ్రీలంకపై 35 బంతుల్లోనే శతక్కొట్టాడు. ఓవరాల్గా టీ20ల్లో ఫాస్టెస్ట్ సెంచరీ రికార్డు ఎస్టోనియాకు చెందిన సాహిల్ చౌహాన్ పేరిట ఉంది. గతేడాది చౌహాన్ సైప్రస్పై కేవలం 27 బంతుల్లోనే సెంచరీ చేశాడు. అభిషేక్ శర్మ విధ్వంసం.. 17 బంతుల్లో అర్ధ శతకంఈ మ్యాచ్లో అభిషేక్ శర్మ పూనకం వచ్చినట్లు ఊగిపోయాడు. సంజూ ఔటయ్యాక ఒక్కసారిగా బీస్ట్ మోడ్లోకి వచ్చిన అభిషేక ఎడాపెడా బౌండరీలు, సిక్సర్లు బాది 17 బంతుల్లో హాఫ్సెంచరీ పూర్తి చేసుకున్నాడు. టీ20ల్లో యువరాజ్ సింగ్ (12 బంతుల్లో) తర్వాత అభిషేక్దే ఫాస్టెస్ట్ ఫిఫ్టి. అభిషేక్ దెబ్బకు భారత్ తొలి 6 ఓవర్లలో 95 పరుగులు చేసిం్ది. అభిషేక్ 58, తిలక్ 19 పరుగులతో క్రీజ్లో ఉన్నారు.సంజూ శాంసన్ మరోసారి విఫలంటీమిండియా ఓపెనర్ సంజూ శాంసన్ మరోసారి విఫలమయ్యాడు.వరుసగా నాలుగు మ్యాచ్ల్లో విఫలమైనా టీమిండియా మేనేజ్మెంట్ సంజూకు మరో ఛాన్స్ ఇచ్చింది. ఈ మ్యాచ్లో తొలి బంతికే సిక్సర్ బాదిన సంజూ.. ఆతర్వాత అదే ఓవర్లో మరో సిక్సర్, బౌండరీ బాదాడు. అయితే సంజూ (7 బంతుల్లో 16; ఫోర్, 2 సిక్సర్లు) ఆతర్వాతి ఓవర్లోనే మార్క్ వుడ్ బౌలింగ్లో జోఫ్రా ఆర్చర్కు క్యాచ్ ఇచ్చి ఔటయ్యాడు.టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకున్న ఇంగ్లండ్ముంబై వేదికగా భారత్, ఇంగ్లండ్ జట్ల మధ్య ఇవాళ (ఫిబ్రవరి 2) నామమాత్రపు ఐదో టీ20 జరుగుతుంది. ఈ మ్యాచ్లో ఇంగ్లండ్ టాస్ గెలిచి తొలుత ఫీల్డింగ్ ఎంచుకుంది. ఈ మ్యాచ్ కోసం ఇరు జట్లు చెరో మార్పు చేశాయి. భారత్ తరఫున అర్షదీప్ సింగ్ స్థానంలో మహ్మద్ షమీ తుది జట్టులోకి రాగా.. గత మ్యాచ్లో సంచలన బౌలింగ్ ప్రదర్శన చేసిన సాకిబ్ మహమూద్కు ఇంగ్లండ్ రెస్ట్ ఇచ్చింది. సాకిబ్ స్థానంలో మార్క్ వుడ్ తుది జట్టులోకి వచ్చాడు. కాగా, ఐదు మ్యాచ్ల ఈ సిరీస్ను భారత్ ఇదివరకే 3-1 తేడాతో కైవసం చేసుకున్న విషయం తెలిసిందే.తుది జట్లు..ఇంగ్లండ్: ఫిలిప్ సాల్ట్, బెన్ డకెట్, జోస్ బట్లర్(కెప్టెన్), హ్యారీ బ్రూక్, లియామ్ లివింగ్స్టోన్, జేకబ్ బేతెల్, జామీ ఓవర్టన్, బ్రైడన్ కార్సే, జోఫ్రా ఆర్చర్, ఆదిల్ రషీద్, మార్క్ వుడ్భారత్: సంజు శాంసన్(వికెట్ కీపర్), అభిషేక్ శర్మ, తిలక్ వర్మ, సూర్యకుమార్ యాదవ్(కెప్టెన్), రింకూ సింగ్, హార్దిక్ పాండ్యా, శివమ్ దూబే, అక్షర్ పటేల్, మహ్మద్ షమీ, రవి బిష్ణోయ్, వరుణ్ చక్రవర్తి -
'అతడిని ఆడించడం అన్యాయం.. మాకు ఒక మాట కూడా చెప్పలేదు'
పుణే వేదికగా భారత్తో జరిగిన నాలుగో టీ20లో 15 పరుగుల తేడాతో ఇంగ్లండ్ ఓటమి చవిచూసింది. దీంతో ఐదు మ్యాచ్ల సిరీస్ను 3-1 తేడాతో ఇంగ్లండ్ కోల్పోయింది. 182 పరుగుల లక్ష్య చేధనలో ఇంగ్లండ్ 166 పరుగులకు ఆలౌటైంది. భారత బౌలర్లలో కంకషన్ సబ్స్ట్యూట్గా వచ్చిన హర్షిత్ రాణా(Harshit Rana) మూడు వికెట్లు పడగొట్టగా.. వరుణ్ చక్రవర్తి, రవి బిష్ణోయ్ తలా రెండు వికెట్లు పడగొట్టారు. అంతకుముందు బ్యాటింగ్ చేసిన భారత్ నిర్ణీత నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్లకు 181 పరుగులు చేసింది. హార్దిక్ పాండ్యా( 30 బంతుల్లో 4 ఫోర్లు, 4 సిక్స్లతో 53), శివమ్ దూబే(34 బంతుల్లో 7 ఫోర్లు, 2 సిక్స్లతో 53) హాఫ్ సెంచరీలతో మెరిశారు. ఇక ఇది ఉండగా.. కంకషన్ సబ్స్ట్యూట్గా హర్షిత్ రాణా జట్టులోకి రావడం ప్రస్తుతం వివాదస్పదమైంది.అసలేం జరిగిందంటే ?భారత ఇన్నింగ్స్ ఆఖరి ఓవర్ వేసిన జేమీ ఓవర్టన్ బౌలింగ్లో ఓ బంతి దూబే హెల్మెట్ బలంగా తాకింది. వెంటనే ప్రోటోకాల్ ప్రకారం ఫిజియో వచ్చి అతడిని పరీక్షించాను. అతడు అంతా బాగానే ఉందనడంతో ఫిజియో తిరిగి వెనక్కి వెళ్లిపోయాడు. కానీ దూబే మాత్రం ఫీల్డింగ్ రాలేదు. దూబే తన బ్యాటింగ్ను కూడా కొనసాగించాడు. కానీ ఫీల్డింగ్కు మాత్రం దూబే రాలేదు.అతడి స్ధానంలో హర్షిత్ రాణా కంకషన్ సబ్స్ట్యూట్గా బరిలోకి దిగాడు. కంకషన్ సబ్గా వచ్చిన రాణా మూడు వికెట్లు పడగొట్టి ఇంగ్లండ్ను దెబ్బతీశాడు. ఈ క్రమంలో హర్షిత్ రాణాకు కంకషన్ సబ్గా అవకాశమివ్వడంపై ఇంగ్లండ్ కెప్టెన్ జోస్ బట్లర్(jos buttler) తీవ్ర అగ్రహం వ్యక్తం చేశాడు. శివమ్ దూబే వంటి ఆటగాడికి హర్షిత్ రాణా ఏ మాత్రం ప్రత్యామ్నాయం కాదని బట్లర్ మండిపడ్డాడు.మేము అంగీకరించము.."ఇది ఏ మాత్రం సరైన రిప్లేస్ మెంట్ కాదు. దీన్ని మేము మేం ఏమాత్రం అంగీకరించం శివమ్ దూబే గంటకు 25 మైల్స్ వేగంతో బౌలింగ్ చేసినా.. హర్షిత్ రాణా తన బ్యాటింగ్ను మెరుగుపరుచుకున్నా మాకు అనవసరం. అది ఆటలో భాగం మాత్రమే. ఈ మ్యాచ్లో మేమే గెలవాల్సింది. ఈ నిర్ణయం వల్లే మేము గెలవాల్సిన మ్యాచ్లో ఓడిపోయాము.మమ్మల్ని సంప్రదించకుండానే హర్షిత్ రాణాను కంకషన్ సబ్స్టిట్యూట్గా బరిలోకి దించారు. నేను బ్యాటింగ్ చేయడానికి వచ్చినప్పుడు అతడిని మైదానంలో చూశాను. అతడు ఎవరికి బదులుగా ఆడుతున్నాడని అప్పుడే అంపైర్లకు అడిగాను. వారు కంకషన్ రిప్లేస్మెంట్ అని బదులిచ్చారు. అప్పుడే ఈ నిర్ణయాన్ని నేను వ్యతిరేకించాను. 'లైక్ ఫర్ లైక్ రీప్లేస్మెంట్’ కాదని చెప్పా. మ్యాచ్ రిఫరీ జవగల్ శ్రీనాథ్ నిర్ణయం తీసుకున్నారని అంపైర్లు చెప్పారు. క్లారిటీ కోసం జవగల్ శ్రీనాథ్తో కచ్చితంగా మాట్లాడుతాం అని పోస్ట్ మ్యాచ్ ప్రేజేంటేషన్లో బట్లర్ పేర్కొన్నాడు.చదవండి: వారిద్దరి వల్లే గెలిచాము.. కానీ అది మాత్రం ఊహించలేదు: సూర్య -
హార్దిక్, దూబే విధ్వంసం.. నిప్పులు చెరిగిన రాణా.. నాలుగో టీ20లో టీమిండియా విజయం
స్వదేశంలో ఇంగ్లండ్తో (England) జరుగుతున్న ఐదు మ్యాచ్ల టీ20 సిరీస్ను భారత్ (Team India) మరో మ్యాచ్ మిగిలుండగానే 3-1 తేడాతో కైవసం చేసుకుంది. పూణే వేదికగా ఇవాళ (జనవరి 31) జరిగిన నాలుగో మ్యాచ్లో భారత్ 15 పరుగుల తేడాతో గెలుపొందింది. భారత్ ఇంగ్లండ్పై టీ20 సిరీస్ గెలవడం ఇది వరుసగా ఐదుసారి. భారత్కు స్వదేశంలో ఇది వరుసగా 17వ సిరీస్ విజయం.మ్యాచ్ విషయానికొస్తే.. టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన భారత్.. హార్దిక్ పాండ్యా (Hardik Pandya) (30 బంతుల్లో 53; 4 ఫోర్లు, 4 సిక్సర్లు), శివమ్ దూబే (Shivam Dube) (34 బంతుల్లో 53; 7 ఫోర్లు, 2 సిక్సర్లు) విరుచుకుపడటంతో నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 181 పరుగుల భారీ స్కోర్ చేసింది.12 పరుగుల వద్ద ఒకే ఓవర్లో మూడు వికెట్లు కోల్పోయి కష్టాల్లో ఉండిన భారత్ను హార్దిక్, దూబే మెరుపు ఇన్నింగ్స్లతో ఆదుకున్నారు.వీరికి ముందు అభిషేక్ శర్మ (19 బంతుల్లో 29; 4 ఫోర్లు, సిక్స్), రింకూ సింగ్ (26 బంతుల్లో 30; 4 ఫోర్లు, సిక్స్) ఓ మోస్తరు ఇన్నింగ్స్లు ఆడారు. 19 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 178 పరుగులు చేసిన భారత్.. చివరి ఓవర్లో కేవలం 3 పరుగులు మాత్రమే చేసి మూడు వికెట్లు కోల్పోయింది. చివరి ఓవర్ను జేమీ ఓవర్టన్ అద్భుతంగా బౌలింగ్ చేశాడు.భారత ఆటగాళ్లలో సంజూ శాంసన్ (1), తిలక్ వర్మ (0), సూర్యకుమార్ యాదవ్ (0) దారుణంగా విఫలమయ్యారు. ఇంగ్లండ్ బౌలర్లలో సాకిబ్ మహమూద్ 3, జేమీ ఓవర్టన్ 2, బ్రైడన్ కార్స్, ఆదిల్ రషీద్ తలో వికెట్ పడగొట్టారు. 182 పరుగుల లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన ఇంగ్లండ్ 19.4 ఓవర్లలో 166 పరుగులకు ఆలౌటైంది. ఇంగ్లండ్ ఇన్నింగ్స్లో హ్యారీ బ్రూక్ (51) అర్ద సెంచరీతో రాణించగా.. ఓపెనర్లు బెన్ డకెట్ (39), ఫిలిప్ సాల్ట్ (23) ఓ మోస్తరు స్కోర్లు చేశారు.బ్రూక్ క్రీజ్లో ఉండగా.. ఇంగ్లండ్ విజయం సాధించేలా కనిపించింది. అయితే వరుణ్ చక్రవర్తి ఒకే ఓవర్లో బ్రూక్తో పాటు బ్రైడన్ కార్స్ను ఔట్ చేసి తిరిగి భారత్ను గేమ్లోకి తెచ్చాడు. బ్రూక్, కార్స్ ఔటయ్యాక జేమీ ఓవర్టన్ కొద్ది సేపు భారత బౌలర్లను బయపెట్టాడు. ఈ మ్యాచ్లో బ్యాటింగ్ చేస్తూ గాయపడిన శివమ్ దూబేకు కన్కషన్ సబ్స్టిట్యూట్గా వచ్చిన హర్షిత్ రాణా (Harshit Rana) మ్యాజిక్ చేశాడు. తన కెరీర్లో తొలి టీ20 ఆడిన హర్షిత్.. ఏకంగా మూడు వికెట్లు తీసి ఇంగ్లండ్ను చావుదెబ్బ కొట్టాడు. హర్షిత్.. ప్రమాదకరమైన లివింగ్స్టోన్ (9), జేకబ్ బేతెల్ (6), జేమీ ఓవర్టన్ (19) వికెట్లు తీశాడు. ఈ మ్యాచ్లో హర్షిత్ 150 కిమీకు పైగా వేగంతో బంతులు సంధించడం విశేషం. హర్షిత్తో పాటు రవి బిష్ణోయ్ మూడు వికెట్లు పడగొట్టగా.. వరుణ్ చక్రవర్తి 2, అక్షర్ పటేల్, అర్షదీప్ సింగ్ చెరో వికెట్ దక్కించుకున్నారు. ఈ సిరీస్లో నామమాత్రపు ఐదో టీ20 ఫిబ్రవరి 2న ముంబైలో జరుగుతుంది. -
నాలుగో టీ20లో ఇంగ్లండ్పై భారత్ గెలుపు.. సిరీస్ కైవసం
ఇంగ్లండ్తో జరుగుతున్న ఐదు మ్యాచ్ల టీ20 సిరీస్ను భారత్ మరో మ్యాచ్ మిగిలుండగానే 3-1 తేడాతో కైవసం చేసుకుంది. ఇవాళ (జనవరి 31) జరిగిన నాలుగో మ్యాచ్లో భారత్ 15 పరుగుల తేడాతో గెలుపొందింది. ఈ మ్యాచ్లో తొలుత బ్యాటింగ్ చేసిన భారత్.. హార్దిక్ పాండ్యా (30 బంతుల్లో 53; 4 ఫోర్లు, 4 సిక్సర్లు), శివమ్ దూబే (34 బంతుల్లో 53; 7 ఫోర్లు, 2 సిక్సర్లు) విరుచుకుపడటంతో నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 181 పరుగుల భారీ స్కోర్ చేసింది.భారత ఇన్నింగ్స్లో హార్దిక్, దూబేతో పాటు అభిషేక్ శర్మ (19 బంతుల్లో 29; 4 ఫోర్లు, సిక్స్), రింకూ సింగ్ (26 బంతుల్లో 30; 4 ఫోర్లు, సిక్స్) రాణించగా.. సంజూ శాంసన్ (1), తిలక్ వర్మ (0), సూర్యకుమార్ యాదవ్ (0) దారుణంగా విఫలమయ్యారు. ఇంగ్లండ్ బౌలర్లలో సాకిబ్ మహమూద్ 3, జేమీ ఓవర్టన్ 2, బ్రైడన్ కార్స్, ఆదిల్ రషీద్ తలో వికెట్ పడగొట్టారు. 182 పరుగుల లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన ఇంగ్లండ్ 19.4 ఓవర్లలో 166 పరుగులకు ఆలౌటైంది. ఇంగ్లండ్ ఇన్నింగ్స్లో హ్యారీ బ్రూక్ (51) అర్ద సెంచరీతో రాణించగా.. ఓపెనర్లు బెన్ డకెట్ (39), ఫిలిప్ సాల్ట్ (23) ఓ మోస్తరు స్కోర్లు చేశారు. ఆఖర్లో జేమీ ఓవర్టన్ (19) వేగంగా పరుగులు రాబట్టినప్పటికీ అప్పటికే ఇంగ్లండ్ ఓటమి ఖరారైపోయింది. ఇంగ్లండ్ ఆటగాళ్లు జోస్ బట్లర్ (2), లివింగ్స్టోన్ (9), జేకబ్ బేతెల్ 96), బ్రైడన్ కార్స్ (0), జోఫ్రా ఆర్చర్ (0) నిరాశపరిచారు. భారత బౌలర్లలో హర్షిత్ రాణా (గాయపడిన శివమ్ దూబే స్థానంలో కన్కషన్ సబ్స్టిట్యూట్గా వచ్చాడు), రవి బిష్ణోయ్ తలో మూడు వికెట్లు పడగొట్టగా.. వరుణ్ చక్రవర్తి 2, అక్షర్ పటేల్, అర్షదీప్ సింగ్ చెరో వికెట్ దక్కించుకున్నారు. ఏడో వికెట్ కోల్పోయిన ఇంగ్లండ్137 పరుగుల వద్ద ఇంగ్లండ్ ఏడో వికెట్ కోల్పోయింది. హర్షిత్ రాణా బౌలింగ్లో జేకబ్ బేతెల్ (6) ఔటయ్యాడు. ఈ మ్యాచ్లో ఇంగ్లండ్ గెలవాలంటే 24 బంతుల్లో 45 పరుగులు చేయాలి.ఐదో వికెట్ కోల్పోయిన ఇంగ్లండ్129 పరుగుల వద్ద ఇంగ్లండ్ ఐదో వికెట్ కోల్పోయింది. 25 బంతుల్లో హాఫ్ సెంచరీ పూర్తి చేసి ప్రమాదకరంగా కనిపించిన హ్యారీ బ్రూక్.. వరుణ్ చక్రవర్తి బౌలింగ్లో ఔటయ్యాడు.నాలుగో వికెట్ కోల్పోయిన ఇంగ్లండ్గాయపడిన శివమ్ దూబే స్థానంలో కన్కషన్ సబ్స్టిట్యూట్గా వచ్చిన హర్షిత్ రాణా డేంజరెస్ ఆటగాడు లియామ్ లివింగ్స్టోన్ (9) వికెట్ పడగొట్టాడు. 12 ఓవర్ల తర్వాత ఇంగ్లండ్ స్కోర్ 99/4గా ఉంది. హ్యారీ బ్రూక్ (23), జేకబ్ బేతెల్ క్రీజ్లో ఉన్నారు. ఈ మ్యాచ్లో ఇంగ్లండ్ గెలవాలంటే 48 బంతుల్లో 83 పరుగులు చేయాలి. మూడో వికెట్ కోల్పోయిన ఇంగ్లండ్.. బట్లర్ ఔట్67 పరుగుల వద్ద ఇంగ్లండ్ మూడో వికెట్ కోల్పోయింది. రవి బిష్ణోయ్ బౌలింగ్లో హర్షిత్ రాణాకు క్యాచ్ ఇచ్చి జోస్ బట్లర్ (2) ఔటయ్యాడు. టార్గెట్ 182.. 65 పరుగులకే 2 వికెట్లు కోల్పోయిన ఇంగ్లండ్182 పరుగుల లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన ఇంగ్లండ్ 65 పరుగులకే రెండు వికెట్లు కోల్పోయింది. తొలుత బెన్ డకెట్ను (39) రవి బిష్ణోయ్ ఔట్ చేయగా.. ఆతర్వాత ఫిల్ సాల్ట్ను (23) అక్షర్ పటేల్ క్లీన్ బౌల్డ్ చేశాడు. 7.1 ఓవర్ల అనంతరం ఇంగ్లండ్ స్కోర్ 66/2గా ఉంది. ఈ మ్యాచ్లో ఇంగ్లండ్ గెలవాలంటే మరో 77 బంతుల్లో 116 పరుగులు చేయాలి. జోస్ బట్లర్, హ్యారీ బ్రూక్ క్రీజ్లో ఉన్నారు. హార్దిక్, దూబే విధ్వంసం.. టీమిండియా భారీ స్కోర్ఇంగ్లండ్తో నాలుగో టీ20లో టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన భారత్ భారీ స్కోర్ (181/9) చేసింది. 12 పరుగుల వద్ద మూడు వికెట్లు కోల్పోయి కష్టాల్లో ఉండిన జట్టును హార్దిక్ పాండ్యా (30 బంతుల్లో 53; 4 ఫోర్లు, 4 సిక్సర్లు), శివమ్ దూబే (34 బంతుల్లో 53; 7 ఫోర్లు, 2 సిక్సర్లు) ఆదుకున్నారు. వీరికి ముందు అభిషేక్ శర్మ (19 బంతుల్లో 29; 4 ఫోర్లు, సిక్స్), రింకూ సింగ్ (26 బంతుల్లో 30; 4 ఫోర్లు, సిక్స్) ఓ మోస్తరు ఇన్నింగ్స్లు ఆడారు. 19 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 178 పరుగులు చేసిన భారత్.. చివరి ఓవర్లో కేవలం 3 పరుగులు మాత్రమే చేసి మూడు వికెట్లు కోల్పోయింది. చివరి ఓవర్ను జేమీ ఓవర్టన్ అద్భుతంగా బౌలింగ్ చేశాడు. భారత ఆటగాళ్లలో సంజూ శాంసన్ (1), తిలక్ వర్మ (0), సూర్యకుమార్ యాదవ్ (0) దారుణంగా విఫలమయ్యారు. ఇంగ్లండ్ బౌలర్లలో సాకిబ్ మహమూద్ 3, జేమీ ఓవర్టన్ 2, బ్రైడన్ కార్స్, ఆదిల్ రషీద్ తలో వికెట్ పడగొట్టారు. సుడిగాలి ఇన్నింగ్స్ ఆడి ఔటైన హార్దిక్చాలాకాలం తర్వాత హార్దిక్ పాండ్యా తన స్థాయికి తగ్గట్టుగా బ్యాట్ను ఝులిపించాడు. ఈ మ్యాచ్లో హార్దిక్ జట్టు కష్టాల్లో ఉన్నప్పుడు బరిలోకి దిగి మెరుపు ఇన్నింగ్స్ ఆడాడు. ఈ మ్యాచ్లో 30 బంతులు ఎదుర్కొన్న హార్దిక్ 4 ఫోర్లు, 4 సిక్సర్ల సాయంతో 53 పరుగులు చేసి ఔటయ్యాడు. 18 ఓవర్ల తర్వాత భారత్ స్కోర్ 166/6గా ఉంది. శివమ్ దూబే (43), అక్షర్ పటేల్ క్రీజ్లో ఉన్నారు. ఐదో వికెట్ కోల్పోయిన భారత్79 పరుగుల వద్ద భారత్ ఐదో వికెట్ కోల్పోయింది. బ్రైడన్ కార్స్ బౌలింగ్లో ఆదిల్ రషీద్కు క్యాచ్ ఇచ్చి రింకూ సింగ్ (30) ఔటయ్యాడు. 11 ఓవర్ల అనంతరం భారత్ స్కోర్ 79/5గా ఉంది. శివమ్ దూబే (13), హార్దిక్ పాండ్యా క్రీజ్లో ఉన్నారు. కష్టాల్లో భారత్57 పరుగుల వద్ద భారత్ నాలుగో వికెట్ కోల్పోయింది. ఆదిల్ రషీద్ బౌలింగ్లో జేకబ్ బేతెల్కు క్యాచ్ ఇచ్చి అభిషేక్ శర్మ (29) ఔటయ్యాడు. 8 ఓవర్ల అనంతరం భారత్ స్కోర్ 65/4గా ఉంది. రింకూ సింగ్ (26), శివమ్ దూబే (7) క్రీజ్లో ఉన్నారు. సాకిబ్ మహమూద్ విజృంభణ.. ఒకే ఓవర్లో మూడు వికెట్లు కోల్పోయిన భారత్ఇంగ్లండ్ సాకిబ్ మహమూద్ రెచ్చిపోయాడు. ఇన్నింగ్స్ రెండో ఓవర్లో ఏకంగా మూడు వికెట్లు పడగొట్టాడు. తొలి రెండు బంతులకు సంజూ శాంసన్, తిలక్ వర్మ వికెట్లు తీసిన సాకిబ్.. ఓవర్ చివరి బంతికి సూర్యకుమార్ యాదవ్ను (0) పెవిలియన్కు పంపాడు. శాంసన్, సూర్యకుమార్ తమ వైఫల్యాల పరంపరను కొనసాగించారు. అభిషేక్ శర్మ (11), రింకూ సింగ్ క్రీజ్లో ఉన్నారు. 12 పరుగులకే రెండు వికెట్లు కోల్పోయిన భారత్12 పరుగుల వద్ద టీమిండియా రెండు వికెట్లు కోల్పోయింది. సంజూ శాంసన్ (1) మరోసారి విఫలమయ్యాడు. ఆతర్వాత బంతికే తిలక్ వర్మ కూడా డకౌటయ్యాడు. సాకిబ్ మహమూద్కు రెండు వికెట్లు దక్కాయి. జోఫ్రా ఆర్చర్ వేసిన తొలి ఓవర్ చివరి రెండు బంతులకు అభిషేక్ శర్మ వరుసగా సిక్సర్, బౌండరీ బాదాడు. టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న ఇంగ్లండ్పూణే వేదికగా నాలుగో టీ20లో భారత్-ఇంగ్లండ్ జట్లు తలపడతున్నాయి. ఈ మ్యాచ్లో టాస్ గెలిచిన ఇంగ్లండ్ తొలుత బౌలింగ్ ఎంచుకుంది. ఈ మ్యాచ్ కోసం ఇంగ్లండ్ రెండు మార్పులు చేసింది. మార్క్ వుడ్ స్థానంలో సాకిబ్ మహమూద్.. జేమీ స్మిత్ స్థానంలో జేకబ్ బేతెల్ తుది జట్టులోకి వచ్చారు.ఈ మ్యాచ్ కోసం టీమిండియా మూడు మార్పులు చేసింది. షమీ స్థానంలో అర్షదీప్.. దృవ్ జురెల్ స్థానంలో రింకూ సింగ్.. వాషింగ్టన్ సుందర్ స్థానంలో శివమ్ దూబే తుది జట్టులోకి వచ్చారు. కాగా, ఐదు మ్యాచ్ల ఈ సిరీస్లో భారత్ 2-1 ఆధ్యింలో ఉన్న విషయం తెలిసిందే.తుది జట్లుఇంగ్లండ్: ఫిలిప్ సాల్ట్, బెన్ డకెట్, జోస్ బట్లర్(కెప్టెన్), హ్యారీ బ్రూక్, లియామ్ లివింగ్స్టోన్, జేకబ్ బేతెల్, జామీ ఓవర్టన్, బ్రైడన్ కార్సే, జోఫ్రా ఆర్చర్, ఆదిల్ రషీద్, సాకిబ్ మహమూద్భారత్: సంజు శాంసన్(వికెట్ కీపర్), అభిషేక్ శర్మ, తిలక్ వర్మ, సూర్యకుమార్ యాదవ్(కెప్టెన్), రింకూ సింగ్, హార్దిక్ పాండ్యా, శివమ్ దూబే, అక్షర్ పటేల్, అర్షదీప్ సింగ్, రవి బిష్ణోయ్, వరుణ్ చక్రవర్తి -
ప్రపంచంలోనే తొలి బౌలర్గా.. వరుణ్ చక్రవర్తి ‘చెత్త రికార్డు’
గుమ్మడికాయంత ప్రతిభ ఉన్నా.. ఆవగింజంత అదృష్టం కూడా కలిసిరావాలంటారు. టీమిండియా ‘మిస్టరీ స్పిన్నర్’ వరుణ్ చక్రవర్తి(Varun Chakravarthy) ప్రస్తుత పరిస్థితికి ఈ నానుడి చక్కగా సరిపోతుంది. సుదీర్ఘ నిరీక్షణ తర్వాత.. గతేడాది బంగ్లాదేశ్తో టీ20 సిరీస్ సందర్భంగా మరోసారి జాతీయ జట్టులోకి వచ్చాడు 33 ఏళ్ల ఈ రైటార్మ్ లెగ్బ్రేక్ స్పిన్ బౌలర్. సొంతగడ్డపై జరిగిన ఈ సిరీస్లో ఐదు వికెట్లు తీసిన వరుణ్.. అనంతరం సౌతాఫ్రికా పర్యటనలోనూ రాణించాడు.కెరీర్లోనే అత్యుత్తమంగాస్వభావసిద్ధంగా ఫాస్ట్బౌలర్లకు అనుకూలించే సౌతాఫ్రికా పిచ్లపై కూడా వరుణ్ చక్రవర్తి తన మార్కు చూపించగలిగాడు. ప్రొటిస్ జట్టుతో నాలుగు మ్యాచ్ల టీ20 సిరీస్లో మొత్తంగా 12 వికెట్లతో సత్తా చాటాడు. ఇందులో ఓ ఫైవ్ వికెట్ హాల్(ఒకే ఇన్నింగ్స్లో ఐదు లేదంటే అంతకంటే ఎక్కువ వికెట్లు తీయడం) కూడా ఉండటం విశేషం.ఇక తాజాగా స్వదేశంలో ఇంగ్లండ్తో టీ20 సిరీస్(India vs England T20 Series)లోనూ వరుణ్ చక్రవర్తి తన సూపర్ ఫామ్ను కొనసాగిస్తున్నాడు. కోల్కతాలో జరిగిన తొలి టీ20లో నాలుగు ఓవర్ల కోటా పూర్తి చేసి.. 23 పరుగులు ఇచ్చి మూడు వికెట్లు పడగొట్టాడు. అనంతరం చెన్నై చెపాక్ స్టేడియంలో రెండు వికెట్లు తీయగలిగాడు.అయితే, రాజ్కోట్లో మంగళవారం జరిగిన మూడో టీ20లో మాత్రం వరుణ్ చక్రవర్తి ఐదు వికెట్లతో చెలరేగాడు. నాలుగు ఓవర్ల కోటాలో కేవలం 24 పరుగులే ఇచ్చి మెరుగైన ఎకానమీ(6.00) నమోదు చేశాడు. ఇంగ్లండ్ కీలక బ్యాటర్, కెప్టెన్ జోస్ బట్లర్(24)తో పాటు జేమీ స్మిత్(6), జేమీ ఓవర్టన్(0), బ్రైడన్ కార్సే(3), జోఫ్రా ఆర్చర్(0)ల వికెట్లు తీశాడు.కానీ.. ఈ మ్యాచ్లో టీమిండియా ఓటమిపాలైంది. ఇంగ్లండ్ చేతిలో 26 పరుగుల తేడాతో ఓడిపోయింది. దీంతో ఐదు మ్యాచ్ల సిరీస్లో భారత్ ఆధిక్యం 2-1కు తగ్గింది.దురదృష్టం వెంటాడిందిసౌతాఫ్రికాతో 2024 నాటి రెండో టీ20 సందర్భంగా వరుణ్ చక్రవర్తి తొలిసారి అంతర్జాతీయ టీ20లలో అత్యుత్తమ గణాంకాలు నమోదు చేశాడు. నాలుగు ఓవర్లలో కేవలం 17 పరుగులే ఇచ్చి ఐదు వికెట్లు కూల్చాడు. తాజాగా ఇంగ్లండ్తో మూడో టీ20లో రెండో అత్యుత్తమ గణాంకాలు(5/24) సాధించాడు.కానీ దురదృష్టవశాత్తూ ఈ రెండు మ్యాచ్లలోనూ టీమిండియా ఓడిపోవడం గమనార్హం. ఇంటర్నేషనల్ పొట్టి ఫార్మాట్లో ఇలా ఓ బౌలర్ ఐదు వికెట్లు ప్రదర్శన నమోదు చేసిన రెండు సందర్భాల్లోనూ అతడి జట్టు ఓడిపోవడం క్రికెట్ ప్రపంచంలో ఇదే తొలిసారి.చెత్త ‘వరల్డ్’ రికార్డుతద్వారా.. వరుణ్ చక్రవర్తి పేరిట ఇలా ఓ చెత్త వరల్డ్ రికార్డు నమోదైంది. అయితే, ఇంగ్లండ్తో మూడో టీ20లో అద్భుత ప్రదర్శనకు గానూ వరుణ్కు ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు దక్కింది.మెరుగ్గా ఆడేందుకుఈ సందర్భంగా అతడు మాట్లాడుతూ.. దేశానికి ప్రాతినిథ్యం వహిస్తున్నప్పుడు అన్ని రకాల బాధ్యతలు తీసుకోవాల్సి ఉంటుందని.. ప్రస్తుతం తన ప్రదర్శన పట్ల సంతృప్తిగానే ఉన్నట్లు తెలిపాడు. అయితే, మున్ముందు ఇంతకంటే మెరుగ్గా ఆడేందుకు కష్టపడుతున్నట్లు తెలిపాడు.బ్యాటర్ల కారణంగానేకాగా ఇంగ్లండ్తో కోల్కతా టీ20లో ఏడు వికెట్ల తేడాతో ఘన విజయం సాధించిన సూర్యకుమార్ సేన.. చెన్నైలో రెండు వికెట్ల తేడాతో గట్టెక్కగలిగింది. అయితే, మూడో టీ20లో మాత్రం ఓటమి నుంచి తప్పించుకోలేకపోయింది. రాజ్కోట్లో టాస్ గెలిచి తొలుత బౌలింగ్ చేసిన టీమిండియా.. ఇంగ్లండ్ను 171 పరుగులకు కట్టడి చేయగలిగింది. అయితే, లక్ష్య ఛేదనలో 145 పరుగులకే పరిమితమై ఓటమిని ఆహ్వానించింది. ఇరుజట్ల మధ్య శుక్రవారం పుణెలో నాలుగో టీ20 జరుగుతుంది.చదవండి: భారత్ బ్యాటింగ్ ఆర్డర్ సరిగ్గా లేదు.. అతడిని లోయర్ ఆర్డర్లో ఆడిస్తారా??: కెవిన్ పీటర్సన్ -
రాజ్కోట్ టీ20లో టీమిండియా ఓటమి..
India vs England 3rd T20I Live Updates And Highlights: భారత్ ఓటమి.. రాజ్కోట్ వేదికగా ఇంగ్లండ్తో జరిగిన మూడో టీ20లో 26 పరుగుల తేడాతో భారత్ ఓటమి పాలైంది. 172 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన భారత్ నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్లు కోల్పోయి 145 పరుగులకే పరిమితమైంది. ఇంగ్లండ్ బౌలర్లలో జామీ ఓవర్టన్ మూడు వికెట్లు పడగొట్టగా.. బ్రైడన్ కార్స్, జోఫ్రా అర్చర్ తలా రెండు వికెట్లు సాధించారు.వీరిద్దరితో పాటు అదిల్ రషీద్, మార్క్ వుడ్ తలా వికెట్ సాధించారు. భారత బ్యాటర్లలో హార్దిక్ పాండ్యా(40) టాప్ స్కోరర్గా నిలవగా.. అభిషేక్ శర్మ(24), తిలక్ వర్మ(18) పర్వాలేదన్పించాడు. అంతకుముందు బ్యాటింగ్ చేసిన ఇంగ్లండ్ నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 171 పరుగులు చేసింది. భారత బౌలర్లలో వరుణ్ చక్రవర్తి 5 వికెట్లతో మెరిశాడు. తన 4 ఓవర్ల కోటాలో 24 పరుగులిచ్చి 5 వికెట్లను తన ఖాతాలో వేసుకున్నాడు. ఇంగ్లండ్ బ్యాటర్లలో బెన్ డకెట్(51) టాప్ స్కోరర్గా నిలవగా.. లివింగ్ స్టోన్(43), జోస్ బట్లర్(24) పరుగులతో రాణించారు. ఈ విజయంతో ఇంగ్లండ్ సిరీస్ ఆశలను 2-1 సజీవంగా ఉంచుకుంది.ఆరో వికెట్ డౌన్.. అక్షర్ పటేల్ ఔట్అక్షర్ పటేల్ రూపంలో భారత్ ఆరో వికెట్ కోల్పోయింది. 15 పరుగులు చేసిన అక్షర్ పటేల్.. అర్చర్ బౌలింగ్లో ఔటయ్యాడు.17 ఓవర్లకు భారత్ స్కోర్:122/517 ఓవర్లు ముగిసే సరికి భారత్ 5 వికెట్ల నష్టానికి 122 పరుగులు చేసింది. భారత్ విజయానికి 18 బంతుల్లో 50 పరుగులు కావాలి. క్రీజులో హార్దిక్ పాండ్యా(33),అక్షర్ పటేల్(15) ఉన్నారు.భారత్ ఐదో వికెట్ డౌన్..వాషింగ్టన్ సుందర్ రూపంలో భారత్ ఐదో వికెట్ కోల్పోయింది. 6 పరుగులు చేసిన సుందర్... జామీ ఓవర్టన్ బౌలింగ్లో ఔటయ్యాడు. 12.1 ఓవర్లకు భారత్ స్కోర్: 85/4తిలక్ వర్మ ఔట్..తిలక్ వర్మ రూపంలో భారత్ నాలుగో వికెట్ కోల్పోయింది. 18 పరుగులు చేసిన వర్మ.. అదిల్ రషీద్ బౌలింగ్లో క్లీన్ బౌల్డయ్యాడు. 10 ఓవర్లకు భారత్ స్కోర్: 78/4సూర్యకుమార్ ఔట్..భారత్ మూడో వికెట్ కోల్పోయింది. 14 పరుగులు చేసిన సూర్యకుమార్ యాదవ్.. మార్క్ వుడ్ బౌలింగ్లో ఔటయ్యాడు. క్రీజులో హార్దిక్ పాండ్యా వచ్చాడు. 6 ఓవర్లకు భారత్ స్కోర్: 51/3అభిషేక్ ఔట్..అభిషేక్ శర్మ రూపంలో భారత్ రెండో వికెట్ కోల్పోయింది. 24 పరుగులు చేసిన అభిషేక్.. బ్రైడన్ కార్స్ బౌలింగ్లో ఔటయ్యాడు. క్రీజులోకి తిలక్ వర్మ వచ్చాడు.తొలి వికెట్ డౌన్..టీమిండియా తొలి వికెట్ కోల్పోయింది. కేవలం మూడు పరుగులు మాత్రమే చేసిన సంజూ శాంసన్.. అర్చర్ బౌలింగ్లో ఔటయ్యాడు. క్రీజులోకి సూర్యకుమార్ యాదవ్ వచ్చాడు. అభిషేక్ శర్మ(16) దూకుడుగా ఆడుతున్నాడు. 3 ఓవర్లకు ఇంగ్లండ్ స్కోర్: 23/1ఐదేసిన వరుణ్.. భారత్ టార్గెట్ ఎంతంటే?రాజ్కోట్ వేదికగా ఇంగ్లండ్తో జరుగుతున్న మూడో టీ20లో భారత బౌలర్లు రాణించారు. తొలుత బ్యాటింగ్ చేసిన ఇంగ్లండ్ నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 171 పరుగులు చేసింది. భారత బౌలర్లలో వరుణ్ చక్రవర్తి 5 వికెట్లతో మెరిశాడు. తన 4 ఓవర్ల కోటాలో 24 పరుగులిచ్చి 5 వికెట్లను తన ఖాతాలో వేసుకున్నాడు. ఇంగ్లండ్ బ్యాటర్లలో బెన్ డకెట్(51) టాప్ స్కోరర్గా నిలవగా.. లివింగ్ స్టోన్(43), జోస్ బట్లర్(24) పరుగులతో రాణించారు.ఐదేసిన వరుణ్.. ఇంగ్లండ్ ఎనిమిదో వికెట్ డౌన్వరుణ్ చక్రవర్తి ఐదు వికెట్లతో చెలరేగాడు. ఇంగ్లండ్ ఇన్నింగ్స్ 16వ ఓవర్ వేసిన చక్రవర్తి.. నాలుగో బంతికి కార్సే, ఐదో బంతికి అర్చర్న ఔట్ చేశాడు.వరుణ్ మ్యాజిక్.. ఒకే ఓవర్లలో రెండు వికెట్లువరుణ్ చక్రవర్తి మరోసారి తన స్పిన్ మయాజాలాన్ని మరోసారి ప్రదర్శించాడు. ఇంగ్లండ్ ఇన్నింగ్స్ 14వ ఓవర్ వేసిన చక్రవర్తి.. మూడో బంతికి స్మిత్, నాలుగో బంతికి ఓవర్టన్ వరుస క్రమంలో ఔట్ చేశాడు.ఇంగ్లండ్ నాలుగో వికెట్ డౌన్..హ్యారీ బ్రూక్ రూపంలో ఇంగ్లండ్ నాలుగో వికెట్ కోల్పోయింది. 8 పరుగులు చేసిన బ్రూక్.. రవి బిష్ణోయ్ బౌలింగ్లో క్లీన్ బౌల్డయ్యాడు. క్రీజులోకి స్మిత్ వచ్చాడు. 13 ఓవర్లకు ఇంగ్లండ్ స్కోర్: 108/4ఇంగ్లండ్ మూడో వికెట్ డౌన్..దూకుడుగా ఆడుతున్న బెన్ డకెట్(51) వికెట్ భారత్ ఎట్టకేలకు సాధించింది. అక్షర్ పటేల్ బౌలింగ్లో భారీ షాట్కు ప్రయత్నించి డకెట్ తన వికెట్ను కోల్పోయాడు. క్రీజులోకి లైమ్ లివింగ్స్టోన్ వచ్చాడు.ఇంగ్లండ్ రెండో వికెట్ డౌన్.. బట్లర్ ఔట్జోస్ బట్లర్ రూపంలో ఇంగ్లండ్ రెండో వికెట్ కోల్పోయింది. 24 పరుగులు చేసిన బట్లర్.. వరుణ్ చక్రవర్తి బౌలింగ్లో ఔటయ్యాడు. క్రీజులోకి హ్యారీ బ్రూక్ వచ్చాడు. 9 ఓవర్లకు ఇంగ్లండ్ స్కోర్: 83/28 ఓవర్లకు ఇంగ్లండ్ స్కోర్: 74/1ఇంగ్లండ్ ప్లేయర్లు బెన్ డకెట్(42), బట్లర్(23) దూకుడుగా ఆడుతున్నారు. 8 ఓవర్లకు ఇంగ్లండ్ స్కోర్: 74/1దూకుడుగా ఆడుతున్న డకెట్..4 ఓవర్లు ముగిసే సరికి ఇంగ్లండ్ వికెట్ నష్టానికి 34 పరుగులు చేసింది. ఇంగ్లండ్ ఓపెనర్ బెన్ డకెట్(24) దూకుడుగా ఆడుతున్నాడు. అతడితో పాటు జోస్ బట్లర్(5) ఉన్నాడు.తొలి వికెట్ డౌన్..ఫిల్ సాల్ట్ రూపంలో ఇంగ్లండ్ తొలి వికెట్ కోల్పోయింది. 5 పరుగులు చేసిన సాల్ట్.. హార్దిక్ పాండ్యా బౌలింగ్లో ఔటయ్యాడు. క్రీజులోకి కెప్టెన్ జోస్ బట్లర్ వచ్చాడు. 3 ఓవర్లకు ఇంగ్లండ్ స్కోర్: 25/1బౌలింగ్ ఎంచుకున్న భారత్..రాజ్కోట్ వేదికగా మూడో టీ20లో భారత్-ఇంగ్లండ్ జట్లు తలపడతున్నాయి. ఈ మ్యాచ్లో టాస్ గెలిచిన భారత్ తొలుత బౌలింగ్ ఎంచుకుంది. ఈ మ్యాచ్తో టీమిండియా స్టార్ పేసర్ మహ్మద్ షమీ అంతర్జాతీయ క్రికెట్లోకి రీఎంట్రీ ఇచ్చాడు.రాజ్కోట్ టీ20లో యువ పేసర్ అర్ష్దీప్ సింగ్ స్ధానంలో షమీ తుది జట్టులోకి వచ్చాడు. అర్ష్దీప్కు జట్టు మెనెజ్మెంట్ విశ్రాంతి ఇచ్చింది. మరోవైపు ఇంగ్లండ్ తమ తుది జట్టులో ఎటువంటి మార్పులు చేయలేదు. చెపాక్లో ఆడిన జట్టునే ఇంగ్లండ్ కొనసాగించింది.తుది జట్లుఇంగ్లండ్: ఫిలిప్ సాల్ట్, బెన్ డకెట్, జోస్ బట్లర్(కెప్టెన్), హ్యారీ బ్రూక్, లియామ్ లివింగ్స్టోన్, జామీ స్మిత్(వికెట్ కీపర్), జామీ ఓవర్టన్, బ్రైడన్ కార్సే, జోఫ్రా ఆర్చర్, ఆదిల్ రషీద్, మార్క్ వుడ్భారత్: సంజు శాంసన్(వికెట్ కీపర్), అభిషేక్ శర్మ, తిలక్ వర్మ, సూర్యకుమార్ యాదవ్(కెప్టెన్), ధ్రువ్ జురెల్, హార్దిక్ పాండ్యా, వాషింగ్టన్ సుందర్, అక్షర్ పటేల్, మహ్మద్ షమీ, రవి బిష్ణోయ్, వరుణ్ చక్రవర్తిచదవండి: ఐసీసీ మెన్స్ క్రికెటర్ ఆఫ్ ద ఇయర్గా బుమ్రా -
Ind vs Eng: బౌలర్లకు కష్టమే.. బ్యాటర్లపైనే భారం! వారు ‘ఫాస్ట్ షో’ మొదలెడితే..
ఇంకా కెప్టెన్ సూర్యకుమార్(Suryakumar Yadav) ‘360 డిగ్రీ’ బ్యాటింగ్ బాకీ ఉంది. సంజూ శాంసన్(Sanju Samson) మెరుపు జోరు కనబర్చలేదు. హార్దిక్ పాండ్యా(Hardik Pandya) అసలు ఆట మిగిలే ఉంది. అయినాసరే భారత్ వరుసగా రెండు మ్యాచ్ల్లో నెగ్గింది. ఇప్పుడు సిరీస్ను కైవసం చేసుకునే పనిలో పడింది. ఒకవేళ ఈ ముగ్గురు గనక రాణిస్తే మూడో మ్యాచ్తోనే భారత్ ఐదు టీ20ల సిరీస్ను గెలుచుకునే అవకాశముంది. ఇప్పటికే ఒత్తిడిలో కూరుకుపోయిన ప్రత్యర్థి ఇంగ్లండ్పై ‘హ్యాట్రిక్’ విజయం, సిరీస్ కైవసం ఏమంత కష్టం కాకపోవచ్చు. వరుస విజయాలతో జోరుమీదున్న టీమిండియా ఇప్పుడు సిరీస్పైనే కన్నేసింది. రాజ్కోట్లో జరిగే మూడో టీ20లో గెలిచి ఇక్కడే సిరీస్ గెలవాలనే పట్టుదలతో బరిలోకి దిగుతోంది. స్టార్ ఆటగాళ్లు ఈ మ్యాచ్లో తమ వైఫల్యాల్ని అధిగమిస్తే ఇంగ్లండ్కు మూడో పరాజయం తప్పదేమో! ఇప్పటికే రెండు మ్యాచ్ల్లో ఓటమి బట్లర్ బృందాన్ని కుంగదీసింది.ఇప్పుడు సిరీస్లో నిలవాలంటే తప్పక గెలవాల్సిన క్లిష్టమైన పరిస్థితుల్లో ఉంది. అయితే ఇది పొట్టి ఫార్మాట్. ఏ క్షణంలోనైనా, ఏ ఓవరైనా ఉన్నపళంగా మార్చేయగలదు. కాబట్టి ఏ జట్టు తప్పక గెలుస్తుందనే గ్యారంటీ లేదు. గత రెండు మ్యాచ్ల్లోనూ ఇంగ్లండ్ ఓపెనింగ్ జోడీ సాల్ట్–డకెట్ విఫలమైంది. వారి ఓపెనింగ్లో గునక ‘పవర్ ప్లే’ కనబడితే భారత్కు సవాళ్లు తప్పవు. ఈ నేపథ్యంలో గత రెండో టీ20లాగే ఉత్కంఠరేపే సమరం జరిగొచ్చు.టాపార్డర్ రాణిస్తే... ఓపెనర్లలో అభిషేక్ శర్మ తొలి మ్యాచ్లో మెరిపించాడు. కానీ శాంసన్ నుంచే ఆ మెరుపులు కరువయ్యాయి. కెప్టెన్ సూర్యకుమార్ కూడా టీ20కి కాదుకదా... వన్డేకు సరిపడా ఆటకూడా చూపించలేకపోయాడు. ఈ ముగ్గురు మూకుమ్మడిగా రాణిస్తే మిడిలార్డర్ సంగతి చూసుకునేందుకు తిలక్ వర్మ, హర్దిక్ పాండ్యా, ధ్రువ్ జురేల్ ఉన్నారు.బ్యాటింగ్కు అచ్చొచ్చే పిచ్పై లోయర్ ఆర్డర్లో వైస్ కెప్టెన్ అక్షర్ పటేల్, వాషింగ్టన్ సుందర్లు కూడా దంచేసే అవకాశాన్ని పిచ్ కల్పిస్తుంది. గత మ్యాచ్ల్ని నిశితంగా గమనిస్తే... బ్యాటింగ్ కన్నా కూడా మన బౌలింగ్ దళం గట్టి ప్రభావమే చూపింది. ఇంగ్లండ్ టాపార్డర్ను తేలిగ్గా కూల్చేస్తుంది. అర్ష్దీప్, పాండ్యాలకు జతగా మరో సీమర్ను తీసుకోవాలనుకుంటే స్పిన్నర్ రవి బిష్ణోయ్ని పక్కన బెట్టొచ్చు.భారమంతా బ్యాటర్లపైనే... ఇంగ్లండ్ కూడా గత మ్యాచ్లో బౌలింగ్తో ఆకట్టుకుంది. హిట్టింగ్ ఓపెనర్లను కూల్చి, మిడిలార్డర్ను దెబ్బతీసి మ్యాచ్ను గెలిచేస్థితికి వచ్చేసింది. అయితే తిలక్ వర్మ పోరాటమే వారి శ్రమను నీరుగార్చింది. లేదంటే చెన్నైలోనే భారత్కు 1–1తో చెక్ పెట్టేది. కార్స్, మార్క్వుడ్, ఆర్చర్, రషీద్లతో కూడిన బౌలింగ్ దళం పటిష్టంగానే ఉంది.అయితే పరిస్థితి చక్కబెట్టాల్సింది... ఎదురుదాడికి దిగాల్సింది... బ్యాటర్లే! ఫిల్ సాల్ట్, డకెట్లు ఆషామాషీ ఓపెనర్లు కాదు. కానీ వారి ఫ్లాప్షో ముగిసి ‘ఫాస్ట్ షో’ మొదలైతే మాత్రం పరుగుల తుఫాన్ ఖాయం. బట్లర్, బ్రూక్, లివింగ్స్టోన్, స్మిత్, ఓవర్టన్, కార్స్, ఆర్చర్ ఇలా చెప్పుకుంటూ పోతే తొమ్మిదో వరుస బ్యాటింగ్ దాకా పరుగుల బాదే ఆటగాళ్లే జట్టుకు అందుబాటులో ఉన్నారు. కాబట్టి ఇంగ్లండ్ భారమంతా బ్యాటర్లపైనే ఉంది.పిచ్, వాతావరణం రాజ్కోట్ పిచ్ ఎప్పుడైనా బ్యాటింగ్కు స్వర్గధామం. ప్రత్యేకించి టీ20ల్లో పరుగుల వరద, మెరుపుల సరదా ఖాయం. బ్యాటర్ ఫ్రెండ్లీ వికెట్పై బౌలర్లకు కష్టాలు తప్పవు. గత రెండు మ్యాచ్ల్లో నమోదైన మోస్తరు స్కోరును సులువుగా అధిగమిస్తుందనడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు.తుది జట్లు (అంచనా) భారత్సూర్యకుమార్ యాదవ్ (కెప్టెన్), సంజూ శాంసన్, అభిషేక్ శర్మ, తిలక్ వర్మ, ధ్రువ్ జురేల్, హార్దిక్ పాండ్యా, వాషింగ్టన్ సుందర్, అక్షర్ పటేల్, అర్ష్దీప్ సింగ్, రవి బిష్ణోయ్/షమీ, వరుణ్ చక్రవర్తి.ఇంగ్లండ్ తుదిజట్టు: బెన్ డకెట్, ఫిలిప్ సాల్ట్ (వికెట్ కీపర్), జోస్ బట్లర్ (కెప్టెన్), హ్యారీ బ్రూక్, లియామ్ లివింగ్స్టోన్, జామీ స్మిత్, జామీ ఓవర్టన్, బ్రైడన్ కార్సే, జోఫ్రా ఆర్చర్, ఆదిల్ రషీద్, మార్క్ వుడ్రాజ్కోట్ సూర్యకు ప్రత్యేకంరాజ్కోట్లో భారత జట్టు ఇప్పటి వరకు 5 టీ20 మ్యాచ్లు ఆడింది. ఇందులో 4 మ్యాచ్ల్లో (2013లో ఆస్ట్రేలియాపై; 2019లో బంగ్లాదేశ్పై; 2022లో దక్షిణాఫ్రికాపై; 2023లో శ్రీలంకపై) గెలిచిన టీమిండియా ఒక మ్యాచ్లో (2017లో న్యూజిలాండ్ చేతిలో) ఓడిపోయింది. ఈ మైదానంలో చివరిసారి 2023 జనవరి 7న శ్రీలంకతో జరిగిన మ్యాచ్లో భారత జట్టు 20 ఓవర్లలో 5 వికెట్లు కోల్పోయి 228 పరుగులు చేసింది. ప్రస్తుతం కెప్టెన్గా ఉన్న సూర్యకుమార్ యాదవ్ (51 బంతుల్లో 112 నాటౌట్; 7 ఫోర్లు, 9 సిక్స్లు) ఈ మ్యాచ్లో సెంచరీ చేయడం విశేషం.చదవండి: అప్పట్లో ఒకడుండేవాడు.. ఇప్పుడు తిలక్ వర్మ!: భారత మాజీ క్రికెటర్ -
భారత్తో మూడో టీ20.. ఇంగ్లండ్ తుది జట్టు ప్రకటన
రాజ్కోట్ వేదికగా మంగళవారం(జనవరి 28) భారత్తో మూడో టీ20లో తలపడేందుకు ఇంగ్లండ్ సన్నదమవుతోంది. తొలి రెండు మ్యాచ్ల్లో ఓటమి చవిచూసిన ఇంగ్లండ్ జట్టు.. ఈ మ్యాచ్లో ఎలాగైనా గెలిచి సిరీస్లో నిలవాలని భావిస్తోంది. ఇప్పటికే రాజ్కోట్కు చేరుకున్న బట్లర్ సేన సోమవారం నెట్స్లో తీవ్రంగా శ్రమించింది. ఈ క్రమంలో మూడో టీ20కు ఇంగ్లండ్ క్రికెట్ తమ తుది జట్టును ప్రకటించింది.తమ ప్లేయింగ్ ఎలెవన్లో ఇంగ్లండ్ ఎటువంటి మార్పులు చేయలేదు. చెపాక్ టీ20లో ఆడిన జట్టునే మూడో మ్యాచ్కు కూడా కొనసాగించారు. చివరి మ్యాచ్లో ఆకట్టుకున్న జేమీ స్మిత్, బ్రైడన్ కార్స్ తమ స్దానాలను సుస్థిరం చేసుకున్నారు. రెండో టీ20లో బ్రైడన్ కార్స్ సంచలన ప్రదర్శన కనబరిచాడు. బ్యాటింగ్లో 31 పరుగులతో పాటు బౌలింగ్లో మూడు కీలక వికెట్లను కార్స్ తీసుకున్నాడు.అదే విధంగా తొలి రెండు మ్యాచ్ల్లో విఫలమైన ఫిల్ సాల్ట్, బెన్ డకెట్లకు ఇంగ్లండ్ మెనెజ్మెంట్ మరో అవకాశమిచ్చింది. విధ్వంసకర ఆటగాడిగా పేరు గాంచిన సాల్ట్ తొలి రెండు టీ20ల్లో వరుసగా 0,6 పరుగులు మాత్రమే చేశాడు. డకెట్ది కూడా అదే తీరు. కోల్కతాలో 4 పరుగులు చేసిన డకెట్.. చెపాక్లో కేవలం మూడు పరుగులు మాత్రమే చేశాడు.మరోవైపు లైమ్ లివింగ్ స్టోన్ కూడా తన మార్క్ను చూపించలేకపోతున్నాడు. మిడిలార్డర్లో అతడి వైఫల్యం ఇంగ్లండ్కు ప్రధాన సమస్యగా మారింది. ఈ మ్యాచ్లో వీరు రాణించకపోతే తదుపరి మ్యాచ్కు వేటు పడే ఛాన్స్ ఉంది. అయితే టాప్ క్లాస్ బ్యాటర్లు సైతం విఫలమకావడంతో కెప్టెన్ జోస్ బట్లర్పై ఒత్తడి పెరుగుతుంది.తొలి టీ20లో 68 పరుగులతో కెప్టెన్ నాక్ ఆడిన జోస్.. రెండో మ్యాచ్లోనూ 45 పరుగులతో రాణించాడు. కాగా ఈ సిరీస్లో ఇంగ్లండ్ ప్రస్తుతం 0-2తో వెనుకబడి ఉంది. ఇంగ్లండ్ జట్టు సిరీస్ ఆశలను సజీవంగా ఉంచుకోవాలంటే రాజ్కోట్లో తప్పకగెలవాల్సిందే.ఇక మూడో టీ20లో భారత జట్టు రెండు మార్పులతో బరిలోకి దిగే సూచనలు కన్పిస్తున్నాయి. ధ్రువ్ జురెల్ స్ధానంలో శివమ్ దూబే, రవి బిష్ణోయ్ ప్లేస్లో మహ్మద్ షమీ తుది జట్టులోకి వచ్చే అవకాశముంది. భారత్ బ్యాటింగ్, బౌలింగ్ విభాగాల్లో పటిష్టంగా కన్పిస్తోంది. అభిషేక్ శర్మ, తిలక్ వర్మ, అర్ష్దీప్, వరుణ్ చక్రవర్తి అద్బుతమైన ఫామ్లో ఉన్నాడు. దీంతో మరోసారి ఇంగ్లీష్ జట్టుకు కఠిన సవాలు ఎదురుకానుంది.మూడో టీ20కు ఇంగ్లండ్ తుది జట్టుబెన్ డకెట్, ఫిలిప్ సాల్ట్ (వికెట్ కీపర్), జోస్ బట్లర్ (కెప్టెన్), హ్యారీ బ్రూక్, లియామ్ లివింగ్స్టోన్, జామీ స్మిత్, జామీ ఓవర్టన్, బ్రైడన్ కార్సే, జోఫ్రా ఆర్చర్, ఆదిల్ రషీద్, మార్క్ వుడ్భారత తుది జట్టు(అంచనా)సంజు శాంసన్ (వికెట్ కీపర్), అభిషేక్ శర్మ, సూర్యకుమార్ యాదవ్ (కెప్టెన్), తిలక్ వర్మ, హార్దిక్ పాండ్యా, శివమ్ దూబే, వాషింగ్టన్ సుందర్, అక్షర్ పటేల్, మహ్మద్ షమీ, అర్ష్దీప్ సింగ్, వరుణ్ చక్రవర్తిచదవండి: IND vs ENG: ఇంగ్లండ్తో మూడో టీ20.. భారత జట్టులోకి ఇద్దరు స్టార్ ప్లేయర్లు? -
చరిత్ర సృష్టించిన ఇంగ్లండ్ కెప్టెన్.. ప్రపంచంలో తొలి ప్లేయర్గా
భారత్తో ఐదు మ్యాచ్ల టీ20 సిరీస్లో పర్యాటక ఇంగ్లండ్ జట్టు వరుసగా రెండో ఓటమి చవిచూసింది. శనివారం చెపాక్ వేదికగా టీమిండియాతో జరిగిన రెండో టీ20లో రెండు వికెట్ల తేడాతో ఇంగ్లండ పరాజయం పాలైంది. తొలి టీ20లో బ్యాటింగ్, బౌలింగ్లో తేలిపోయిన ఇంగ్లండ్.. రెండో టీ20లో మాత్రం గట్టి పోటీ ఇచ్చింది. ఆఖరి ఓవర్ ఉత్కంఠబరితంగా సాగిన ఈ మ్యాచ్లో తిలక్ వర్మ విరోచత పోరాటం వల్ల ఇంగ్లండ్ ఓటమి చవిచూడాల్సి వచ్చింది. ఈ మ్యాచ్లో కూడా ఇంగ్లండ్ కెప్టెన్ జోస్ బట్లర్ తన బ్యాట్కు పనిచెప్పాడు. 30 బంతుల్లో 3 ఫోర్లు, 2 భారీ సిక్సర్లతో 45 పరుగులు చేసి మరోసారి తృటిలో హాఫ్ సెంచరీ అవకాశాన్ని జోస్ కోల్పోయాడు. అయితే బట్లర్ హాఫ్ సెంచరీ సాధించకపోయినప్పటికి ఓ అరుదైన రికార్డును మాత్రం తన పేరిట లిఖించుకున్నాడు.పూరన్ రికార్డు బద్దలు..భారత్పై టీ20ల్లో అత్యధిక పరుగులు చేసిన ఆటగాడిగా జోస్ బట్లర్ రికార్డులకెక్కాడు. ఇంగ్లండ్ కెప్టెన్ టీ20ల్లో భారత్పై ఇప్పటివరకు 611 పరుగులు చేశాడు. ఇంతకుముందు ఈ రికార్డు వెస్టిండీస్ విధ్వంసకర ఆటగాడు నికోలస్ పూరన్ పేరిట ఉండేది.పూరన్ టీ20ల్లో టీమిండియాపై 592 పరుగులు చేశాడు. తాజా మ్యాచ్తో పూరన్ ఆల్టైమ్ రికార్డును బట్లర్ బ్రేక్ చేశాడు. అవేవిధంగా బట్లర టీ20ల్లో భారత్పై అత్యధికంగా 50+ స్కోర్లు సాధించిన రికార్డును నికోలస్ పూరన్తో కలిసి సంయుక్తంగా కలిగి ఉన్నాడు.టీ20ల్లో భారత్పై అత్యధిక పరుగులు చేసిన ఆటగాళ్లు వీరే..జోస్ బట్లర్- 611నికోలస్ పూరన్- 592గ్లెన్ మాక్స్వెల్- 574డేవిడ్ మిల్లర్- 524ఆరోన్ ఫించ్- 500చదవండి: సంతోషంగా ఉంది.. అతడి వల్లే ఓడిపోయే మ్యాచ్లో గెలిచాము: సూర్య -
తిలక్ వర్మ విరోచిత పోరాటం.. రెండో టీ20లో భారత్ విజయం
India vs England 2nd T20I Live Updates And Highlights: చెన్నైలోని చిదంబరం స్టేడియం వేదికగా రెండో టీ20లో భారత్-ఇంగ్లండ్ జట్లు తలపడుతున్నాయి.తిలక్ సూపర్ ఇన్నింగ్స్..చెపాక్ వేదికగా ఇంగ్లండ్తో జరిగిన రెండో టీ20లో 2 వికెట్ల తేడాతో భారత్ విజయం సాధించింది. 166 పరుగుల లక్ష్యాన్ని భారత్ 8 వికెట్లు కోల్పోయి చేధించింది. టీమిండియా విజయంలో హైదరాబాదీ తిలక్ వర్మ కీలక పాత్ర పోషించాడు. లక్ష్య చేధనలో క్రమం తప్పకుండా వికెట్లు పడుతున్నప్పటకి తిలక్ విరోచిత పోరాటం కనబరిచాడు.ఆఖరివరకు క్రీజుల ఉండి భారత్కు అద్బుతమైన విజయాన్ని అందించాడు. తిలక్ 55 బంతుల్లో 4 ఫోర్లు, 5 సిక్స్లతో 72 పరుగులు చేసి ఆజేయంగా నిలిచాడు. భారత బ్యాటర్లలో తిలక్తో పాటు వాషింగ్టన్ సుందర్(26) రాణించాడు. ఇక ఇంగ్లండ్ బౌలర్లలో బ్రైడన్ కార్సే మూడు వికెట్లు పడగొట్టగా.. రషీద్, వుడ్, అర్చర్, ఓవర్టన్ తలా వికెట్ సాధించారు. అంతకుముందు బ్యాటింగ్ చేసిన ఇంగ్లండ్ నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్లు కోల్పోయి 165 పరుగులు చేసింది. ఇంగ్లండ్ బ్యాటర్లలో జోస్ బట్లర్(45) టాప్ స్కోరర్గా నిలవగా.. బ్రైడన్ కార్సే(31), జేమీ స్మిత్(22) రాణించారు. భారత బౌలర్లలో వరుణ్ చక్రవర్తి, అక్షర్ పటేల్ తలా రెండు వికెట్లు సాధించగా.. అర్ష్దీప్, వాషింగ్టన్ సుందర్, అభిషేక్ తలా వికెట్ సాధించారు.18 ఓవర్లకు భారత్ స్కోర్: 153/818 ఓవర్లు ముగిసే సరికి భారత్ 8 వికెట్ల నష్టానికి 153 పరుగులు చేసింది. భారత విజయానికి కేవలం 12 బంతుల్లో 13 పరుగులు కావాలి.క్రీజులో తిలక్ వర్మ(63), రవి బిష్ణోయ్(5) ఉన్నారు.ఏడో వికెట్ డౌన్..టీమిండియా ఏడో వికెట్ కోల్పోయింది. 2 పరుగులు చేసిన అక్షర్ పటేల్..లివింగ్ స్టోన్ బౌలింగ్లో ఔటయ్యాడు.భారత్ ఆరో వికెట్ డౌన్..వాషింగ్టన్ సుందర్ రూపంలో భారత్ ఆరో వికెట్ కోల్పోయింది. 26 పరుగులు చేసిన సుందర్.. బ్రైడన్ కార్సే బౌలింగ్లో ఔటయ్యాడు. 14 ఓవర్లకు భారత్ స్కోర్: 119/6. భారత్ విజయానికి 6 ఓవర్లలో 47 పరుగులు కావాలి. క్రీజులో తిలక్ వర్మ(41), అక్షర్ పటేల్(1) ఉన్నారు.భారత్ ఐదో వికెట్ డౌన్.. పాండ్యా ఔట్టీమిండియా వరుస క్రమంలో వికెట్లు కోల్పోయింది. 8వ ఓవర్లో బ్రైడన్ కార్సే బౌలింగ్లో ధ్రువ్ జురెల్(4) ఔట్ కాగా.. 9వ ఓవర్లో ఓవర్టన్ బౌలింగ్లో హార్దిక్ పాండ్యా(7) ఔటయ్యాడు. 10 ఓవర్లకు భారత్ స్కోర్: 79/5మూడో వికెట్ డౌన్..58 పరుగులు వద్ద భారత్ మూడో వికెట్ కోల్పోయింది. 12 పరుగులు చేసిన సూర్యకుమార్ యాదవ్.. బ్రైడన్ కార్సే బౌలింగ్లో క్లీన్ బౌల్డయ్యాడు. 7 ఓవర్లకు భారత్ స్కోర్: 63-3, క్రీజులో తిలక్వర్మ(27), ధ్రువ్ జురెల్(3)ఉన్నారు.భారత్ రెండో వికెట్ డౌన్..భారత్ రెండో వికెట్ కోల్పోయింది. 5 పరుగులు చేసిన సంజూ శాంసన్.. జోఫ్రా అర్చర్ బౌలింగ్లో స్మిత్కు క్యాచ్ ఇచ్చి ఔటయ్యాడు. క్రీజులోకి కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ వచ్చాడు. 3 ఓవర్లకు భారత్ స్కోర్: 28/2తొలి వికెట్ డౌన్.. అభిషేక్ ఔట్అభిషేక్ శర్మ రూపంలో టీమిండియా తొలి వికెట్ కోల్పోయింది. 12 పరుగులు చేసిన అభిషేక్.. మార్క్ వుడ్ బౌలింగ్లో వికెట్ల ముందు దొరికిపోయాడు. క్రీజులో తిలక్ వర్మ వచ్చాడు.భారత టార్గెట్ ఎంతంటే?చెపాక్ వేదికగా ఇంగ్లండ్తో జరుగుతున్న రెండో టీ20లో భారత బౌలర్లు రాణించారు. టాస్ ఓడి తొలుత బ్యాటింగ్కు ఇంగ్లండ్ నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్లు కోల్పోయి 165 పరుగులు చేసింది. ఇంగ్లండ్ బ్యాటర్లలో జోస్ బట్లర్(45) టాప్ స్కోరర్గా నిలవగా.. బ్రైడన్ కార్సే(31), జేమీ స్మిత్(22) రాణించారు. భారత బౌలర్లలో వరుణ్ చక్రవర్తి, అక్షర్ పటేల్ తలా రెండు వికెట్లు సాధించగా.. అర్ష్దీప్, వాషింగ్టన్ సుందర్, అభిషేక్ తలా వికెట్ సాధించారు.ఏడో వికెట్ డౌన్..ఇంగ్లండ్ ఏడో వికెట్ కోల్పోయింది. 5 పరుగులు చేసిన జెమ్మీ ఓవర్టన్.. వరుణ్ చక్రవర్తి బౌలింగ్లో క్లీన్ బౌల్డయ్యాడు. 16ఓవర్లకు ఇంగ్లండ్ స్కోర్: 136/7ఇంగ్లండ్ ఆరో వికెట్ డౌన్..104 పరుగుల వద్ద ఇంగ్లండ్ ఆరో వికెట్ కోల్పోయింది. 22 పరుగులు చేసిన జేమీ స్మిత్.. అభిషేక్ శర్మ బౌలింగ్లో ఔటయ్యాడు. క్రీజులోకి కార్సే వచ్చాడు.ఐదో వికెట్ డౌన్..ఇంగ్లండ్ ఐదో వికెట్ కోల్పోయింది. 13 పరుగులు చేసిన లివింగ్ స్టోన్..అక్షర్ పటేల్ బౌలింగ్లో ఔటయ్యాడు. 12 ఓవర్లకు ఇంగ్లండ్ స్కోర్: 94/5బట్లర్ ఔట్..బట్లర్ రూపంలో ఇంగ్లండ్ నాలుగో వికెట్ కోల్పోయింది. 45 పరుగులు చేసిన బట్లర్.. అక్షర్ పటేల్ బౌలింగ్లో ఔటయ్యాడు. క్రీజులోకి స్మిత్ వచ్చాడు. 9.3 ఓవర్లకు ఇంగ్లండ్ స్కోర్: 77/4ఇంగ్లండ్ మూడో వికెట్ డౌన్.. ఇంగ్లండ్ మూడో వికెట్ కోల్పోయింది. 13 పరుగులు చేసిన బ్రూక్.. వరుణ్ చక్రవర్తి బౌలింగ్లో క్లీన్ బౌల్డయ్యాడు. క్రీజులోకి లివింగ్స్టోన్వచ్చాడు. 7 ఓవర్లకు ఇంగ్లండ్ స్కోర్:61/3ఇంగ్లండ్ రెండో వికెట్ డౌన్.. డకెట్ ఔట్బెన్ డకెట్ రూపంలో ఇంగ్లండ్ రెండో వికెట్ కోల్పోయింది. కేవలం 3 పరుగులు మాత్రమే చేసిన డకెట్.. వాషింగ్టన్ సుందర్ బౌలింగ్లో ఔటయ్యాడు. క్రీజులోకి హ్యారీ బ్రూక్ వచ్చాడు. 4 ఓవర్లకు ఇంగ్లండ్ స్కోర్: 35/2. క్రీజులో జోస్ బట్లర్(26), హ్యారీ బ్రూక్(1) ఉన్నారు.ఇంగ్లండ్ తొలి వికెట్ డౌన్..టాస్ ఓడి బ్యాటింగ్కు దిగిన ఇంగ్లండ్కు ఆదిలోనే బిగ్ షాక్ తగిలింది. స్టార్ ఓపెనర్ ఫిల్ సాల్ట్(4)ను అర్ష్దీప్ సింగ్ పెవిలియన్కు పంపాడు. క్రీజులోకి కెప్టెన్ జోస్ బట్లర్ వచ్చాడు. మొదటి ఓవరు ముగిసే సరికి ఇంగ్లండ్ స్కోర్: 8/1చెన్నైలోని చిదంబరం స్టేడియం వేదికగా రెండో టీ20లో భారత్-ఇంగ్లండ్ జట్లు తలపడుతున్నాయి. ఈ మ్యాచ్లో టాస్ గెలిచిన టీమిండియా తొలుత బ్యాటింగ్ చేసుకుంది. చెపాక్ టీ20లో భారత్ రెండు మార్పులతో బరిలోకి దిగింది. స్టార్ ఆల్రౌండర్ నితీశ్ కుమార్ రెడ్డి గాయం కారణంగా ఈ సిరీస్ మొత్తానికి దూరమయ్యాడు.అదేవిధంగా రింకూ సింగ్ కూడా ఈ మ్యాచ్కు దూరమయ్యాడు. వీరిద్దరి స్ధానంలో ప్లేయింగ్ ఎలెవన్లోకి వాషింగ్టన్ సుందర్, ధ్రువ్జురెల్ వచ్చారు. అయితే ఈ మ్యాచ్లో కూడా స్టార్ పేసర్ మహ్మద్ షమీ ఆడటం లేదు. షమీ అందుబాటుపై కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ ఎటువంటి అప్డేట్ ఇవ్వలేదు. మరోవైపు ఇంగ్లండ్ రెండు మార్పులతో బరిలోకి దిగింది. గాస్ అట్కినసన్, బెతల్ స్ధానంలో బ్రైడన్ కార్సే, జామీ స్మిత్లు వచ్చారు.తుది జట్లు..భారత్: సంజు శాంసన్(వికెట్ కీపర్), అభిషేక్ శర్మ, సూర్యకుమార్ యాదవ్(కెప్టెన్), తిలక్ వర్మ, హార్దిక్ పాండ్యా, వాషింగ్టన్ సుందర్, ధ్రువ్ జురెల్, అక్షర్ పటేల్, రవి బిష్ణోయ్, అర్ష్దీప్ సింగ్, వరుణ్ చక్రవర్తిఇంగ్లండ్: బెన్ డకెట్, ఫిలిప్ సాల్ట్(వికెట్ కీపర్), జోస్ బట్లర్(కెప్టెన్), హ్యారీ బ్రూక్, లియామ్ లివింగ్స్టోన్, జామీ స్మిత్, జామీ ఓవర్టన్, బ్రైడన్ కార్సే, జోఫ్రా ఆర్చర్, ఆదిల్ రషీద్, మార్క్ వుడ్చదవండి: BCCI: టీమిండియాకు భారీ షాక్.. ఇంగ్లండ్ సిరీస్ నుంచి ఇద్దరు స్టార్లు ఔట్ -
భారత్తో రెండో టీ20: ఇంగ్లండ్ తుదిజట్టు ప్రకటన.. అతడిపై వేటు
టీమిండియాతో రెండో టీ20కి ఇంగ్లండ్ తమ తుదిజట్టును ప్రకటించింది. తొలి టీ20లో ఆడిన జట్టులో ఒక మార్పుతో చెన్నై బరిలో దిగనున్నట్లు తెలిపింది. కాగా కోల్కతాలో ధారాళంగా పరుగులు ఇచ్చుకున్న పేస్ బౌలర్ గస్ అట్కిన్సన్పై వేటు వేసిన ఇంగ్లండ్ టీమ్ మేనేజ్మెంట్.. అతడి స్థానాన్ని నాలుగు అంతర్జాతీయ టీ20లు ఆడిన ఓ పేసర్తో భర్తీ చేయడం విశేషం.బ్యాటర్ల వైఫల్యంతాజా భారత పర్యటనలో భాగంగా ఇంగ్లండ్ టీమిండియాతో తొలుత ఐదు టీ20లు.. అనంతరం మూడు వన్డేల సిరీస్ ఆడనుంది. ఈ క్రమంలో ఇరుజట్ల మధ్య బుధవారం కోల్కతాలోని ఈడెన్ గార్డెన్స్లో తొలి టీ20 జరిగింది. ఇందులో టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన ఇంగ్లండ్ ఆదిలోనే వికెట్లు కోల్పోయింది.బట్లర్ అర్ధ శతకం చేసినాఓపెనర్లు ఫిల్ సాల్ట్(0) డకౌట్ కాగా.. బెన్ డకెట్(4) కూడా విఫలమయ్యాడు. అయితే, వన్డౌన్లో వచ్చిన కెప్టెన్ జోస్ బట్లర్ అర్ధ శతకంతో ఆకట్టుకున్నాడు. 44 బంతుల్లో ఎనిమిది ఫోర్లు, రెండు సిక్సర్ల సాయంతో 68 పరుగులతో కెప్టెన్ ఇన్నింగ్స్ ఆడాడు. అయితే, మిగతా వాళ్ల నుంచి అతడికి సహకారం అందలేదు.హ్యారీ బ్రూక్(17), జోఫ్రా ఆర్చర్(12) మాత్రమే డబుల్ డిజిట్ స్కోర్లు చేయగా.. లియామ్ లివింగ్స్టోన్(0), జాకబ్ బెతెల్(7), జేమీ ఓవర్టన్(2) దారుణంగా విఫలమయ్యారు. ఇక లోయర్ ఆర్డర్లో గస్ అట్కిన్సన్(2), ఆదిల్ రషీద్(8*), మార్క్వుడ్(1) కూడా కాసేపైనా క్రీజులో నిలవలేకపోయారు. ఫలితంగా నిర్ణీత 20 ఓవర్లలో 132 పరుగులకే ఇంగ్లండ్ ఆలౌట్ అయింది.12.5 ఓవర్లలోనే ఖేల్ ఖతంఇక లక్ష్య ఛేదనకు దిగిన టీమిండియా 12.5 ఓవర్లలోనే ఖేల్ ఖతం చేసి.. ఏడు వికెట్ల తేడాతో ఇంగ్లండ్పై జయభేరి మోగించింది. భారత బ్యాటర్లలో ఓపెనర్లలో సంజూ శాంసన్(26) ఫర్వాలేదనిపించగా.. అభిషేక్ శర్మ(34 బంతుల్లో 79) సుడిగాలి ఇన్నింగ్స్తో మెరిశాడు. అయితే, కెప్టెన్ సూర్యకుమార్ డకౌట్ కాగా.. తిలక్ వర్మ(19*), హార్దిక్ పాండ్యా(3*) నాటౌట్గా నిలిచారు.ఇంగ్లండ్ బౌలర్లలో జోఫ్రా ఆర్చర్ నాలుగు ఓవర్ల కోటా పూర్తి చేసి 21 పరుగులు ఇచ్చి రెండు వికెట్లు తీశాడు. ఆదిల్ రషీద్ 2 ఓవర్లలో 27 పరుగులిచ్చి ఒక వికెట్ తన ఖాతాలో వేసుకున్నాడు. అయితే, అట్కిన్సన్ మాత్రం కేవలం రెండు ఓవర్లలోనే ఏకంగా 38 పరుగులు సమర్పించుకున్నాడు. ఈ నేపథ్యంలోనే అతడిపై వేటు వేసిన యాజమాన్యం.. 29 ఏళ్ల రైటార్మ్ ఫాస్ట్ బౌలర్ బ్రైడన్ కార్సేకు తుదిజట్టులో చోటు కల్పించింది.కాగా భారత్- ఇంగ్లండ్ మధ్య చెన్నైలోని ఎంఏ చిదంబరం స్టేడియంలో శనివారం రెండో టీ20 జరుగుతుంది. భారత కాలమానం ప్రకారం ఈ మ్యాచ్ రాత్రి ఏడు గంటలకు ఆరంభం అవుతుంది.టీమిండియాతో రెండో టీ20కి ఇంగ్లండ్ తుదిజట్టు:బెన్ డకెట్, ఫిల్ సాల్ట్ (వికెట్ కీపర్), జోస్ బట్లర్ (కెప్టెన్), హ్యారీ బ్రూక్, లియామ్ లివింగ్స్టోన్, జాకబ్ బెతెల్, జేమీ ఓవర్టన్, బ్రైడన్ కార్సే, జోఫ్రా ఆర్చర్, ఆదిల్ రషీద్, మార్క్ వుడ్.చదవండి: అతడొక సూపర్స్టార్.. మా ఓటమికి కారణం అదే: బట్లర్ -
టీ20ల్లో జోస్ బట్లర్ అరుదైన ఘనత
టీ20ల్లో ఇంగ్లండ్ కెప్టెన్ జోస్ బట్లర్ అరుదైన ఘనత సాధించాడు. పొట్టి ఫార్మాట్లో 12000 పరుగులు పూర్తి చేసిన ఏడో బ్యాటర్గా రికార్డు నెలకొల్పాడు. భారత్తో తొలి టీ20 సందర్భంగా జోస్ ఈ అరుదైన మైలురాయిని అధిగమించాడు. జోస్కు ముందు క్రిస్ గేల్ (14562), షోయబ్ మాలిక్ (13492), కీరన్ పోలార్డ్ (13429), అలెక్స్ హేల్స్ (13361), విరాట్ కోహ్లి (12886), డేవిడ్ వార్నర్ (12757) మాత్రమే టీ20ల్లో 12000 పరుగులు చేశారు.టీ20ల్లో అత్యంత వేగంగా 12000 పరుగులు పూర్తి చేసిన ఆటగాళ్ల జాబితాలో బట్లర్ నాలుగో స్థానంలో ఉన్నాడు. గేల్ (343 మ్యాచ్ల్లో), విరాట్, వార్నర్ బట్లర్ కంటే వేగంగా ఈ మైలురాయిని చేరుకున్నారు. బట్లర్ తన టీ20 కెరీర్లో ఇప్పటివరకు (భారత్తో తొలి టీ20 కలుపుకుని) 430 మ్యాచ్లు ఆడి 145.29 స్ట్రయిక్రేట్తో, 35.08 సగటున 12035 పరుగులు చేశాడు. ఇందులో 8 సెంచరీలు, 84 అర్ద సెంచరీలు ఉన్నాయి.బట్లర్ ఒక్క అంతర్జాతీయ క్రికెట్లోనే సెంచరీ, 26 అర్ద సెంచరీల సాయంతో 3457 పరుగులు చేశాడు. బట్లర్ అంతర్జాతీయ క్రికెట్లో అత్యధిక పరుగులు చేసిన ఆటగాళ్ల జాబితాలో ఏడో స్థానంలో ఉన్నాడు. ఇంగ్లండ్ తరఫున 3000 టీ20 పరుగులు పూర్తి చేసిన ఏకైక బ్యాటర్ బట్లరే.భారత్, ఇంగ్లండ్ తొలి టీ20 విషయానికొస్తే.. ఈ మ్యాచ్లో భారత్ 7 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. ఈ మ్యాచ్లో తొలుత బ్యాటింగ్ చేసిన ఇంగ్లండ్ నిర్ణీత 20 ఓవర్లలో 132 పరుగులకు ఆలౌటైంది. ఇంగ్లండ్ ఇన్నింగ్స్లో జోస్ బట్లర్ (44 బంతుల్లో 68; 8 ఫోర్లు, 2 సిక్సర్లు) ఒక్కడే రాణించాడు. బట్లర్తో పాటు ఇంగ్లండ్ ఇన్నింగ్స్లో హ్యారీ బ్రూక్ (17), జోఫ్రా ఆర్చర్ (12) మాత్రమే రెండంకెల స్కోర్లు చేశారు. భారత బౌలర్లు వరుణ్ చక్రవర్తి (4-0-23-3), అర్షదీప్ సింగ్ (4-0-17-2), అక్షర్ పటేల్ (4-1-22-2), హార్దిక్ పాండ్యా (4-0-42-2) అద్భుతంగా బౌలింగ్ చేసి ఇంగ్లండ్ బ్యాటర్ల భరతం పట్టారు.133 పరుగుల స్వల్ప లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన భారత్.. అభిషేక్ శర్మ (34 బంతుల్లో 79; 5 ఫోర్లు, 8 సిక్సర్లు) విధ్వంసం సృష్టించడంతో 12.5 ఓవర్లలోనే లక్ష్యాన్ని చేరుకుంది. ఈ మ్యాచ్లో ఇంగ్లండ్ బౌలర్లను ఊచకోత కోసిన అభిషేక్ కేవలం 20 బంతుల్లోనే హాఫ్ సెంచరీ పూర్తి చేశాడు. అభిషేక్తో పాటు ఇన్నింగ్స్ను ఓపెన్ చేసిన సంజూ శాంసన్ కూడా బ్యాట్ను ఝులిపించాడు. శాంసన్ 20 బంతుల్లో 4 ఫోర్లు, సిక్సర్ సాయంతో 26 పరుగులు చేశాడు. వన్డౌన్లో వచ్చిన కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ డకౌట్ కాగా.. తిలక్ వర్మ (19), హార్దిక్ పాండ్యా (3) భారత్ను విజయతీరాలకు చేర్చారు. ఇంగ్లండ్ బౌలర్లలో జోఫ్రా ఆర్చర్ 2, ఆదిల్ రషీద్ ఓ వికెట్ పడగొట్టారు. ఈ సిరీస్లో తదుపరి టీ20 జనవరి 25న చెన్నై వేదికగా జరుగనుంది. -
అతడొక సూపర్స్టార్.. మా ఓటమికి కారణం అదే: బట్లర్
టీమిండియాతో తొలి టీ20లో ఓటమిపై ఇంగ్లండ్ కెప్టెన్ జోస్ బట్లర్(Jos Buttler) స్పందించాడు. పరుగులు రాబట్టేందుకు వీలుగా ఉన్న పిచ్ మీద సత్తా చాటలేకపోయామని విచారం వ్యక్తం చేశాడు. ప్రత్యర్థిపై ఒత్తిడి పెంచడంలో విఫలమయ్యామన్న బట్లర్.. ఆరంభంలోనే కీలక వికెట్లు కోల్పోవడం ప్రభావం చూపిందని తెలిపాడు. ఏదేమైనా భారత బౌలర్లు అద్భుతంగా ఆడారని.. తదుపరి మ్యాచ్లో తాము తిరిగి పుంజుకుంటామని పేర్కొన్నాడు.అర్ష్దీప్ అదరగొడితే..కాగా ఐదు టీ20ల సిరీస్లో భాగంగా ఇండియా- ఇంగ్లండ్ మధ్య బుధవారం తొలి మ్యాచ్ జరిగింది. కోల్కతాలోని చారిత్రాత్మక ఈడెన్ గార్డెన్స్(Eden Gardens)లో జరిగిన పోరులో టాస్ గెలిచిన టీమిండియా తొలుత బౌలింగ్ ఎంచుకుంది. ఈ క్రమంలో బ్యాటింగ్కు దిగిన ఇంగ్లండ్కు భారత పేసర్ అర్ష్దీప్ సింగ్ ఆదిలోనే షాకిచ్చాడు. ఓపెనర్లలో ఫిల్ సాల్ట్(0)ను డకౌట్ చేసిన ఈ లెఫ్టార్మ్ పేసర్.. అనంతరం బెన్ డకెట్(4)ను కూడా పెవిలియన్కు పంపాడు.వరుణ్ విశ్వరూపం ప్రదర్శించాడుఅర్ష్దీప్తో పాటు మిస్టరీ స్పిన్నర్, ‘ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్’ వరుణ్ చక్రవర్తి(Varun Chakravarthy) కూడా విశ్వరూపం ప్రదర్శించాడు. వరుస బంతుల్లో లివింగ్స్టోన్(0)తో పాటు హ్యారీ బ్రూక్(17)ను అవుట్ చేశాడు. అదే విధంగా.. కొరకాని కొయ్యగా మారిన కెప్టెన్ బట్లర్(44 బంతుల్లో 8 ఫోర్లు, 2 సిక్సర్లతో 68) వికెట్ను కూడా తన ఖాతాలో వేసుకున్నాడు. మిగతా వాళ్లలో హార్దిక్ పాండ్యా, అక్షర్ పటేల్ రెండేసి వికెట్లు తీశారు.ఈ క్రమంలో నిర్ణీత 20 ఓవర్లలో ఇంగ్లండ్ కేవలం 132 పరుగులు మాత్రమే చేసి ఆలౌట్ అయింది. అనంతరం లక్ష్య ఛేదనలో టీమిండియా ఆది నుంచే దూకుడు కనబరిచింది. అభిషేక్ శర్మ ధనాధన్సంజూ శాంసన్ (20 బంతుల్లో 26) వేగంగా ఇన్నింగ్స్ మొదలుపెట్టగా.. అభిషేక్ శర్మ అద్భుత హాఫ్ సెంచరీతో చెలరేగాడు. కేవలం 34 బంతుల్లోనే ఈ లెఫ్టాండర్ బ్యాటర్ 5 ఫోర్లు, 8 సిక్సర్లు బాది 79 పరుగులు చేశాడు.కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్(0) విఫలం కాగా.. తిలక్ వర్మ(19), హార్దిక్ పాండ్యా(3) నాటౌట్గా నిలిచి జట్టును విజయతీరాలకు చేర్చారు. అభిషేక్ ధాటికి 12.5 ఓవర్లలో కేవలం మూడు వికెట్ల నష్టానికి టీమిండియా 133 పరుగులు చేసింది. తద్వారా ఏడు వికెట్ల తేడాతో ఇంగ్లండ్ను ఓడించి.. 1-0తో ఆధిక్యంలోకి వెళ్లింది.ఒత్తిడి పెంచలేకపోయాం.. ఓటమికి కారణం అదేఈ నేపథ్యంలో జోస్ బట్లర్ స్పందిస్తూ.. ‘‘టీమిండియాపై ఒత్తిడి పెంచలేకపోయాం. నిజంగా వాళ్లు అద్భుతంగా బౌలింగ్ చేశారు. ఇక మా జట్టులోని కొంత మంది.. కొందరు భారత స్పిన్నర్లను ఎదుర్కోవడం ఇదే తొలిసారి. వాస్తవానికి.. వికెట్ బాగానే ఉంది. ఫాస్ట్ స్కోరింగ్ గ్రౌండ్ ఇది.కానీ మేము ఆరంభంలోనే రెండు కీలక వికెట్లు కోల్పోవడం ప్రభావం చూపింది. టీ20 క్రికెట్లో మేము మరింత దూకుడుగా బ్యాటింగ్ చేస్తాం. అయితే, అల్ట్రా- అగ్రెసివ్ జట్టుతో పోటీలో ఈరోజు వెనుకబడిపోయాం. ఏదేమైనా టీమిండియాతో పోరు రసవత్తరంగా ఉంటుంది. తదుపరి మ్యాచ్లలో కచ్చితంగా రాణిస్తాం. ప్రతీ వేదికపై విభిన్న పిచ్ పరిస్థితులు ఉంటాయి.జోఫ్రా ఆర్చర్ సూపర్స్టార్మా జట్టులో జోఫ్రా ఆర్చర్ మెరుగ్గా బౌలింగ్ చేశాడు. అతడొక సూపర్స్టార్. ప్రత్యర్థిని కచ్చితంగా భయపెట్టగలడు. ముందుగా చెప్పినట్లు మేము తిరిగి పుంజుకుంటాం’’ అని పేర్కొన్నాడు. బ్యాటర్ల వైఫల్యం కారణంగానే తమకు ఓటమి ఎదురైనట్లు బట్లర్ చెప్పుకొచ్చాడు.కాగా తొలి టీ20లో ఇంగ్లండ్ స్పీడ్స్టర్ జోఫ్రా ఆర్చర్ సంజూ, సూర్య రూపంలో రెండు కీలక వికెట్లు తీశాడు. అభిషేక్ శర్మ వికెట్ను ఆదిల్ రషీద్ దక్కించుకున్నాడు. ఇక ఇండియా- ఇంగ్లండ్ మధ్య చెన్నై వేదికగా శనివారం రెండో టీ20 జరుగనుంది.చదవండి: NADA: డోపింగ్ పరీక్షలు.. బుమ్రా, సూర్య, పంత్, సంజూ శాంసన్.. ఇంకా..𝗔 𝗱𝗼𝗺𝗶𝗻𝗮𝘁𝗶𝗻𝗴 𝘀𝗵𝗼𝘄 𝗮𝘁 𝘁𝗵𝗲 𝗘𝗱𝗲𝗻 𝗚𝗮𝗿𝗱𝗲𝗻𝘀! 💪 💪#TeamIndia off to a flying start in the T20I series, sealing a 7⃣-wicket win! 👏 👏Follow The Match ▶️ https://t.co/4jwTIC5zzs#INDvENG | @IDFCFIRSTBank pic.twitter.com/hoUcLWCEIP— BCCI (@BCCI) January 22, 2025 -
భారత్తో తొలి టీ20.. ఇంగ్లండ్ తుది జట్టు ప్రకటన
భారత్-ఇంగ్లండ్ మధ్య ఐదు మ్యాచ్ల టీ20 సిరీస్కు సర్వం సిద్దమైంది. బుధవారం(జనవరి 22) ఈడెన్గార్డెన్స్ వేదికగా జరగనున్న తొలి టీ20తో ఈ సిరీస్ ప్రారంభం కానుంది. ఇప్పటికే కోల్కతాకు చేరుకున్న ఇరు జట్లు నెట్స్లో తీవ్రంగా శ్రమిస్తున్నాయి.తొలి టీ20లో ఎలాగైనా గెలిచి సిరీస్ను విజయంతో ఆరంభించాలని ఇరు జట్లు పట్టుదలతో ఉన్నాయి. ఈ క్రమంలో కోల్కతా టీ20కు ఇంగ్లండ్ క్రికెట్ తమ ప్లేయింగ్ ఎలెవన్ను ప్రకటించింది. మొదటి టీ20లో ఇంగ్లండ్ నలుగురు ఫాస్ట్ బౌలర్లతో బరిలోకి దిగనుంది. పేస్ బౌలర్లలో కోటాలో మార్క్వుడ్, జోఫ్రా ఆర్చర్, జామీ ఓవర్టన్, గుస్ అట్కిన్సన్లకు చోటు దక్కింది. శ్రీలంకతో మాంచెస్టర్ టెస్టు సందర్భంగా గాయపడిన మార్క్వుడ్ దాదాపు ఆరు నెలల తర్వాత మళ్లీ ఇంగ్లండ్ లైనప్లోకి తిరిగి వచ్చాడు. అదిల్ రషీద్ స్పెషలిస్ట్ స్పిన్నర్గా చోటు దక్కించుకున్నాడు. ఇక ఇంగ్లండ్ బ్యాటింగ్ లైనప్లో ఫిల్ సాల్ట్, బెన్ డకెట్, లివింగ్స్టోన్, హ్యారీ బ్రూక్ వంటి విధ్వంసకర ఆటగాళ్లు ఉన్నారు. అదేవిధంగా వికెట్ కీపర్గా కెప్టెన్ జోస్ బట్లర్ బదులుగా ఫిల్ సాల్ట్ బాధ్యతలు నిర్వర్తించనున్నాడు. ఈ మ్యాచ్ సాయంత్రం 7:30 గంటలకు ప్రారంభం కానుంది.మరోవైపు భారత్ తొలి టీ20లో ముగ్గురు ఫాస్ట్ బౌలర్లు, ఇద్దరు స్పిన్నర్లతో ఆడే అవకాశముంది. మహ్మద్ షమీ, అర్ష్దీప్ సింగ్ స్పెషలిస్టు ఫాస్ట్ బౌలర్లగా ఉండగా.. పేస్ బౌలింగ్ ఆల్రౌండర్ హార్దిక్ పాండ్యా వీరిద్దరితో పాటు బంతిని పంచుకోనున్నాడు. స్పిన్నర్లగా వరుణ్ చక్రవర్తి, అక్షర్ పటేల్కు ప్లేయింగ్ ఎలెవన్లో చోటు దక్కే ఛాన్స్ ఉంది.ఇంగ్లండ్ తుది జట్టు: బెన్ డకెట్, ఫిల్ సాల్ట్ (వికెట్ కీపర్), జోస్ బట్లర్ (కెప్టతెన్), హ్యారీ బ్రూక్ (వైస్ కెప్టెన్), లియామ్ లివింగ్స్టోన్, జాకబ్ బెథెల్, జామీ ఓవర్టన్, జోఫ్రా ఆర్చర్, గస్ అట్కిన్సన్, ఆదిల్ రషీద్, మార్క్ వుడ్ Firepower with bat and ball 💥 Brendon McCullum has named the first white-ball team of his reign for tomorrow's opening IT20 v India 💪 pic.twitter.com/DSFdaWVPrB— England Cricket (@englandcricket) January 21, 2025 ఇంగ్లండ్తో తొలి టీ20కి భారత తుదిజట్టు(అంచనా)సంజూ శాంసన్, అభిషేక్ శర్మ, తిలక్ వర్మ, సూర్యకుమార్ యాదవ్(కెప్టెన్), హార్దిక్ పాండ్యా, రింకూ సింగ్, నితీశ్ కుమార్ రెడ్డి, అక్షర్ పటేల్, మహ్మద్ షమీ, అర్ష్దీప్ సింగ్, వరుణ్ చక్రవర్తి.బెంచ్: వాషింగ్టన్ సుందర్, ధ్రువ్ జురెల్, హర్షిత్ రాణా, రవి బిష్ణోయి.చదవండి: ‘నా కుమారుడిపై పగబట్టారు.. కావాలనే తొక్కేస్తున్నారు’ -
అబుదాబీ టీ10 లీగ్ విజేత డెక్కన్ గ్లాడియేటర్స్
అబుదాబీ టీ10 లీగ్ 2024 ఎడిషన్ విజేతగా డెక్కన్ గ్లాడియేటర్స్ అవతరించింది. మోరిస్విల్లే సాంప్ ఆర్మీతో నిన్న (డిసెంబర్ 2) జరిగిన ఫైనల్లో గ్లాడియేటర్స్ 8 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. ఈ మ్యాచ్లో తొలుత బ్యాటింగ్ చేసిన సాంప్ ఆర్మీ నిర్ణీత 10 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 104 పరుగులు చేసింది. ఫాఫ్ డుప్లెసిస్ (23 బంతుల్లో 34; 5 ఫోర్లు, సిక్స్), వికెట్కీపర్ ఆండ్రియస్ గౌస్ (9 బంతుల్లో 21; ఫోర్, 2 సిక్సర్లు) ఓ మోస్తరు పరుగులు చేశారు. షర్జీల్ ఖాన్ 5, అసలంక 13, జాక్ టేలర్ 1, కరీమ్ జనత్ 16 (నాటౌట్), రోహన్ ముస్తఫా 0, ఇమాద్ వసీం 7, ఖైస్ అహ్మద్ 1 (నాటౌట్) పరుగు చేశారు. గ్లాడియేటర్స్ బౌలర్లలో రిచర్డ్ గ్లీసన్ 2, తీక్షణ, నోర్జే, ఉస్మాన్ తారిక్, ఇబ్రార్ అహ్మద్ తలో వికెట్ పడగొట్టారు.105 పరుగుల లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన గ్లాడియేర్స్.. టామ్ కొహ్లెర్ కాడ్మోర్ (21 బంతుల్లో 56 నాటౌట్; 5 ఫోర్లు, 4 సిక్సర్లు), నికోలస్ పూరన్ (10 బంతుల్లో 28; ఫోర్, 3 సిక్సర్లు) విరుచుకుపడటంతో 6.5 ఓవర్లలోనే 2 వికెట్ల కోల్పోయి గమ్యాన్ని చేరుకుంది. ఆఖర్లో రిలీ రొస్సో (5 బంతుల్లో 12; 3 ఫోర్లు) మెరుపు ఇన్నింగ్స్ ఆడగా.. జోస్ బట్లర్ (5 బంతుల్లో 12 నాటౌట్; సిక్స్) సిక్సర్తో మ్యాచ్ను ముగించాడు. అబుదాబీ టీ10 లీగ్లో డెక్కన్ గ్లాడియేటర్స్కు ఇది మూడో టైటిల్. 2021-22, 2022 ఎడిషన్లలో కూడా గ్లాడియేటర్స్ ఛాంపియన్గా నిలిచింది. -
బట్లర్ ఊచకోత.. డస్సెన్, లిన్ మెరుపులు వృధా
అబుదాబీ టీ10 లీగ్లో ఇంగ్లండ్ పరిమిత ఓవర్ల కెప్టెన్ జోస్ బట్లర్ రెచ్చిపోయాడు. ఈ లీగ్లో డెక్కన్ గ్లాడియేటర్స్కు ప్రాతినిథ్యం వహిస్తున్న జోస్.. చెన్నై బ్రేవ్ జాగ్వార్స్తో జరిగిన మ్యాచ్లో వీరవిహారం చేశాడు. ఈ మ్యాచ్లో జోస్ కేవలం 15 బంతుల్లో హాఫ్ సెంచరీ పూర్తి చేశాడు. మొత్తంగా 24 బంతులు ఎదుర్కొన్న జోస్.. 4 ఫోర్లు, 6 సిక్సర్ల సాయంతో 62 పరుగులతో అజేయంగా నిలిచాడు. ఫలితంగా డెక్కన్ గ్లాడియేటర్స్ చెన్నై బ్రేవ్పై 7 వికెట్ల తేడాతో గెలుపొందింది.ఈ మ్యాచ్లో తొలుత బ్యాటింగ్ చేసిన చెన్నై బ్రేవ్ నిర్ణీత 10 ఓవర్లలో 2 వికెట్ల నష్టానికి 141 పరుగుల భారీ స్కోర్ చేసింది. రస్సీ వాన్ డర్ డస్సెన్ (29 బంతుల్లో 62; 2 ఫోర్లు, 5 సిక్సర్లు), క్రిస్ లిన్ (28 బంతుల్లో 68 నాటౌట్; 8 ఫోర్లు, 3 సిక్సర్లు) మెరుపు అర్ద శతకాలు సాధించారు. గ్లాడియేటర్స్ బౌలర్లలో నోర్జే, లూక్ వుడ్కు తలో వికెట్ దక్కింది.అనంతరం భారీ లక్ష్య ఛేదనకు దిగిన గ్లాడియేటర్స్.. బట్లర్, టామ్ కొహ్లెర్ కాడ్మోర్ (24 బంతుల్లో 51; 4 ఫోర్లు, 4 సిక్సర్లు) వీర ఉతుకుడు ధాటికి మరో రెండు బంతులు మిగిలుండగానే లక్ష్యాన్ని చేరుకుంది. బట్లర్ అజేయమైన అర్ద శతకంతో గ్లాడియేటర్స్ను విజయతీరాలకు చేర్చాడు. బట్లర్ విధ్వంసం ధాటికి డస్సెన్, లిన్ మెరుపు అర్ద శతకాలు వృధా అయ్యాయి. గ్లాడియేటర్స్ ఇన్నింగ్స్లో నికోలస్ పూరన్ గోల్డన్ డకౌట్ కాగా.. రిలీ రొస్సో 16 పరుగులు చేసి ఔటయ్యాడు. బట్లర్.. మార్కస్ స్టోయినిస్తో (2 నాటౌట్) కలిసి గ్లాడియేటర్స్ను గెలిపించాడు. బ్రేవ్ బౌలర్లలో సాబిర్ అలీ రావు 2 వికెట్లు పడగొట్టగా.. నువాన్ తుషార ఓ వికెట్ దక్కించుకున్నాడు. ఈ మ్యాచ్లో గెలుపొందిన డెక్కన్ గ్లాడియేటర్స్ రెండుసార్లు అబుదాబీ టీ10 లీగ్ ఛాంపియన్గా నిలిచిన విషయం తెలిసిందే. -
ఇషాన్ కాదు!.. అత్యధిక ధరకు అమ్ముడుపోయే వికెట్ కీపర్లు వీరే!
ఇండియన్ ప్రీమియర్ లీగ్-2025 మెగా వేలానికి సమయం ఆసన్నమైంది. సౌదీ అరేబియాలోని జెద్దా నగరంలో ఈ మెగా ఈవెంట్ను నిర్వహించాలని భారత క్రికెట్ నియంత్రణ మండలి(బీసీసీఐ) ఇప్పటికే నిర్ణయించింది. రెండురోజుల పాటు ఈ వేలం పాట జరుగనుండగా.. ఇందుకు సంబంధించిన షెడ్యూల్ను బీసీసీఐ నవంబరు 24, 25 తేదీల్లో ఖరారు చేసింది.ఇక ఈసారి వేలంలో టీమిండియా స్టార్లు రిషభ్ పంత్, కేఎల్ రాహుల్, శ్రేయస్ అయ్యర్, ఇషాన్ కిషన్, మహ్మద్ షమీ, మహ్మద్ సిరాజ్ తదితరులు హైలెట్గా నిలవనున్నారు. ఈ నేపథ్యంలో భారత మాజీ క్రికెటర్లు ఎవరు ఎంత ధర పలుకుతారనే అంశం మీద తమ అభిప్రాయాలు పంచుకుంటున్నారు.ఈ క్రమంలో టీమిండియా మాజీ వికెట్ కీపర్ బ్యాటర్ రాబిన్ ఊతప్ప ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. ఈసారి వేలంలో అత్యధిక ధరకు అమ్ముడుపోయే వికెట్ కీపర్లు వీరేనంటూ ఐదుగురి పేర్లు చెప్పాడు. అయితే, ఇందులో మాత్రం ఇషాన్ కిషన్కు చోటు దక్కలేదు.కాగా వేలానికి ముందే వికెట్ కీపర్లు భారీ ధర పలికిన విషయం తెలిసిందే. అదేనండీ రిటెన్షన్స్లో భాగంగా వికెట్ కీపర్ బ్యాటర్లకు ఆయా ఫ్రాంఛైజీలు భారీ మొత్తం ముట్టజెప్పాయి. అతడికి ఏకంగా రూ. 23 కోట్లుసన్రైజర్స్ హైదరాబాద్ హెన్రిచ్ క్లాసెన్ కోసం రూ. 23 కోట్లు, లక్నో సూపర్ జెయింట్స్ నికోలస్ పూరన్ కోసం రూ. 21 కోట్లు, రాజస్తాన్ రాయల్స్ సంజూ శాంసన్ కోసం రూ. 18 కోట్లు, ధ్రువ్ జురెల్ కోసం రూ. 14 కోట్లు ఖర్చు చేశాయి.ఆ ఐదుగురికే అధిక ధరఈ నేపథ్యంలో రాబిన్ ఊతప్ప స్టార్ స్పోర్ట్స్ షోలో మాట్లాడుతూ.. ఈసారి వికెట్ కీపర్ల కోటాలో రిషభ్ పంత్, కేఎల్ రాహుల్, జోస్ బట్లర్, క్వింటన్ డికాక్, ఫిల్ సాల్ట్ అత్యధిక మొత్తానికి అమ్ముడుపోతారని అంచనా వేశాడు. ముఖ్యంగా కేఎల్ రాహుల్ను సొంతం చేసుకునేందుకు రాయల్ చాలెంజర్స్ బెంగళూరు కచ్చితంగా ఇతర ఫ్రాంఛైజీలతో పోటీకి వస్తుందని అభిప్రాయపడ్డాడు. ఢిల్లీ క్యాపిటల్స్, గుజరాత్ టైటాన్స్ కూడా కేఎల్ వైపు చూసే అవకాశం లేకపోలేదని ఊతప్ప చెప్పుకొచ్చాడు.చదవండి: టాలెంటెడ్ కిడ్.. ఇక్కడ కూడా.. : నితీశ్ రెడ్డిపై కమిన్స్ కామెంట్స్ -
ఉతికి ఆరేసిన బట్లర్.. 115 మీటర్ల భారీ సిక్సర్
వెస్టిండీస్తో నిన్న (నవంబర్ 10) జరిగిన రెండో టీ20లో ఇంగ్లండ్ స్టార్ ఆటగాడు జోస్ బట్లర్ మెరుపు ఇన్నింగ్స్తో విరుచుకుపడ్డాడు. ఈ మ్యాచ్లో బట్లర్ 45 బంతుల్లో 8 ఫోర్లు, 6 సిక్సర్ల సాయంతో 83 పరుగులు చేశాడు. బట్లర్ సునామీ ఇన్నింగ్స్ కారణంగా ఈ మ్యాచ్లో ఇంగ్లండ్ 7 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. ఈ మ్యాచ్లో బట్లర్ బాదిన ఓ సిక్సర్ మ్యాచ్ మొత్తానికే హైలైట్గా నిలిచింది. గుడకేశ్ మోటీ బౌలింగ్ బట్లర్ బాదిన ఈ సిక్సర్ 115 మీటర్ల దూరంలో వెళ్లి పడింది. ఇంగ్లండ్ ఇన్నింగ్స్ తొమ్మిదో ఓవర్లో ఇది జరిగింది. మోటీ లెంగ్త్ బాల్ను వేయగా.. బట్లర్ క్రీజ్ దాటి ముందుకు వచ్చి భారీ షాట్ ఆడాడు. బట్లర్ హార్డ్ హిట్టింగ్ దెబ్బకు బంతి స్టేడియం దాటి బయటపడింది.JOS BUTTLER WITH A 115M SIX. 🤯🔥 pic.twitter.com/cfwNjHyWKn— Mufaddal Vohra (@mufaddal_vohra) November 11, 2024మ్యాచ్ విషయానికొస్తే.. వెస్టిండీస్ నిర్దేశించిన 159 పరుగుల లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన ఇంగ్లండ్.. బట్లర్ ఉతికి ఆరేయడంతో 14.5 ఓవర్లలో మూడు వికెట్లు కోల్పోయి గమ్యాన్ని చేరుకుంది. విల్ జాక్స్ (29 బంతుల్లో 38) ఓ మోస్తరు స్కోర్తో రాణించగా.. లియామ్ లివింగ్స్టోన్ (23 నాటౌట్), జాకబ్ బేతెల్ (2 నాటౌట్) ఇంగ్లండ్ను విజయతీరాలకు చేర్చారు. తొలి టీ20లో మెరుపు సెంచరీ చేసిన ఫిల్ సాల్ట్ ఈ మ్యాచ్లో గోల్డన్ డకౌట్గా వెనుదిరిగాడు. విండీస్ బౌలర్లలో రొమారియో షెపర్డ్ 2 వికెట్లు పడగొట్టగా.. అకీల్ హొసేన్ ఓ వికెట్ దక్కించుకున్నాడు.అంతకుముందు విండీస్ తొలుత బ్యాటింగ్ చేస్తూ నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 158 పరుగులు చేసింది. రోవ్మన్ పావెల్ 41 బంతుల్లో 43 పరుగులతో టాప్ స్కోరర్గా నిలువగా.. రొమారియో షెపర్డ్ (22), నికోలస్ పూరన్ (14), రోస్టన్ ఛేజ్ (13), మాథ్యూ ఫోర్డ్ (13 నాటౌట్) రెండంకెల స్కోర్లు చేశారు. ఇంగ్లండ్ బౌలర్లలో మౌస్లీ, లివింగ్స్టోన్, సకీబ్ మహమూద్ తలో 2 వికెట్లు తీసి విండీస్ బ్యాటర్లను కుదురుకోనివ్వలేదు. జోఫ్రా ఆర్చర్, ఆదిల్ రషీద్ చెరో వికెట్ దక్కించుకున్నారు. ఈ మ్యాచ్లో గెలుపుతో ఇంగ్లండ్ ఐదు మ్యాచ్ల సిరీస్లో 2-0 ఆధిక్యంలోకి వెళ్లింది. తొలి టీ20లో ఇంగ్లండ్ 8 వికెట్ల తేడాతో గెలుపొందిన విషయం తెలిసిందే. సెయింట్ లూసియా వేదికగా నవంబర్ 14న మూడో టీ20 జరుగనుంది. -
జోస్ బట్లర్ విధ్వంసం.. విండీస్పై ఇంగ్లండ్ ఘన విజయం
బ్రిడ్జిటౌన్ వేదికగా వెస్టిండీస్తో జరిగిన మ్యాచ్లో 7 వికెట్ల తేడాతో ఇంగ్లండ్ ఘన విజయం సాధించింది. దీంతో ఐదు టీ20ల సిరీస్లో ఇంగ్లీష్ జట్టు 2-0 ఆధిక్యంలోకి దూసుకెళ్లింది. ఈ మ్యాచ్లో తొలుత బ్యాటింగ్ చేసిన వెస్టిండీస్ నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 158 పరుగులు సాధించింది.విండీస్ బ్యాటర్లలో కెప్టెన్ రావ్మన్ పావెల్(43) పరుగులతో టాప్ స్కోరర్గా నిలవగా.. షెఫార్డ్ 22 పరుగులతో రాణించాడు. ఇంగ్లండ్ బౌలర్లలో లివింగ్ స్టోన్, మౌస్లీ, మహ్మద్ తలా రెండు వికెట్లు సాధించారు. వీరితో పాటు అర్చర్, రషీద్ చెరో వికెట్ పడగొట్టారు.జోస్ బట్లర్ విధ్వంసం..అనంతరం 159 పరుగుల లక్ష్యాన్ని ఇంగ్లండ్ 14.5 ఓవర్లలో కేవలం 3 వికెట్లు మాత్రమే కోల్పోయి ఊదిపడేసింది. ఇంగ్లండ్ బ్యాటర్లలో కెప్టెన్ జోస్ బట్లర్ విధ్వంసకర ఇన్నింగ్స్ ఆడాడు. 45 బంతుల్లో 8 ఫోర్లు, 6 సిక్స్లతో 83 పరుగులు చేశాడు.అతడితో పాటు విల్ జాక్స్(38) రాణించాడు. విండీస్ బౌలర్లలో షెఫర్డ్ రెండు, అకిల్ హోస్సేన్ ఓ వికెట్ సాధించారు. ఇక ఇరు జట్ల మధ్య మూడో టీ20 నవంబర్ 14న సెయింట్ లూసియా వేదికగా జరగనుంది.చదవండి: IND vs SA: సంజూ శాంసన్ అత్యంత చెత్త రికార్డు.. భారత క్రికెట్ చరిత్రలో ఒకే ఒక్కడు -
ఇంగ్లండ్ కెప్టెన్గా లియామ్ లివింగ్స్టోన్
వెస్టిండీస్తో మూడు మ్యాచ్ల వన్డే సిరీస్కు ముందు ఇంగ్లండ్ జట్టుకు భారీ షాక్ తగిలింది. గాయం నుంచి పూర్తిగా కోలుకోని కారణంగా ఆ జట్టు కెప్టెన్ జోస్ బట్లర్ ఈ సిరీస్ మొత్తానికి దూరమయ్యాడు. బట్లర్ గైర్హాజరీలో ఇంగ్లండ్ వన్డే జట్టు కెప్టెన్గా లియామ్ లివింగ్స్టోన్ బాధ్యతలు చేపట్టనున్నాడు. ఈ సిరీస్ కోసం బట్లర్ ప్రత్యామ్నాయ ఆటగాడిని ఇంగ్లండ్ క్రికెట్ బోర్డు ఎంపిక చేయలేదు.కాగా, ఈ ఏడాది జూన్లో జరిగిన టీ20 వరల్డ్కప్ సందర్భంగా బట్లర్ గాయపడిన విషయం తెలిసిందే. అప్పటి నుంచి అతను వన్డే, టీ20 జట్లకు దూరంగా ఉన్నాడు. గాయం నుంచి పూర్తిగా కోలుకున్నాడని విండీస్తో సిరీస్కు బట్లర్ను తొలుత ఎంపిక చేశారు. అయితే బట్లర్ పూర్తిగా ఫిట్నెస్ సాధించకపోవడంతో ఈసీబీ అతన్ని జట్టు నుంచి తప్పించింది. బట్లర్ విండీస్తో తదుపరి జరుగబోయే టీ20 సిరీస్ సమయానికంతా పూర్తిగా కోలుకుంటాడని ఈసీబీ ఆశాభావం వ్యక్తం చేసింది.వెస్టిండీస్తో మూడు మ్యాచ్ల వన్డే సిరీస్ అక్టోబర్ 31, నవంబర్ 2, నవంబర్ 8 తేదీల్లో జరుగనుంది. అనంతరం నవంబర్ 9, 10, 14, 16, 17 తేదీల్లో ఐదు మ్యాచ్ల టీ20 సిరీస్ జరుగనుంది. ఈ రెండు పరిమిత ఓవర్ల సిరీస్లు విండీస్ వేదికగా జరుగనున్నాయి. ఇంగ్లండ్ టెస్ట్ జట్టు ప్రస్తుతం పాక్తో మూడు మ్యాచ్ల సిరీస్లో పాల్గొంటున్న విషయం తెలిసిందే.విండీస్తో వన్డే, టీ20 సిరీస్ల కోసం ఇంగ్లండ్ జట్టు..లియామ్ లివింగ్స్టోన్ (వన్డే జట్టు కెప్టెన్), విల్ జాక్స్, డాన్ మౌస్లీ, జేకబ్ బేతెల్, జేమీ ఓవర్టన్, సామ్ కర్రన్, ఫిలిప్ సాల్ట్, జాఫర్ చోహాన్, జోఫ్రా ఆర్చర్, ఆదిల్ రషీద్, సాకిబ్ మహమూద్, రీస్ టాప్లే, జాన్ టర్నర్చదవండి: టీమిండియాకు గుడ్ న్యూస్ -
విండీస్తో పరిమిత ఓవర్ల సిరీస్లు.. ఇంగ్లండ్ జట్టు ప్రకటన.. కెప్టెన్ రీఎంట్రీ
మూడు మ్యాచ్ల వన్డే సిరీస్.. ఐదు మ్యాచ్ల టీ20 సిరీస్ల కోసం ఇంగ్లండ్ జట్టు వెస్టిండీస్లో పర్యటించనుంది. ఈ పర్యటన అక్టోబర్ 31న ప్రారంభం కానుంది. ఈ పర్యటనలో ఇంగ్లండ్ తొలుత వన్డే సిరీస్ ఆడుతుంది. మూడు వన్డే మ్యాచ్లు అక్టోబర్ 31 (ఆంటిగ్వా), నవంబర్ 2 (ఆంటిగ్వా), నవంబర్ 6 (బార్బడోస్) తేదీల్లో జరుగనున్నాయి. అనంతరం నవంబర్ 9 (బార్బడోస్), 10 (బార్బడోస్), 14 (సెయింట్ లూసియా), 16 (సెయింట్ లూసియా), 17 (సెయింట్ లూసియా) తేదీల్లో ఐదు టీ20లు జరుగనున్నాయి. ఈ సిరీస్ల కోసం 14 మంది సభ్యుల ఇంగ్లండ్ జట్టును ఇవాళ (అక్టోబర్ 3) ప్రకటించారు. గాయం కారణంగా ఆస్ట్రేలియాతో జరిగిన టీ20, వన్డే సిరీస్లకు దూరంగా ఉన్న రెగ్యులర్ కెప్టెన్ జోస్ బట్లర్ విండీస్తో సిరీస్లతో రీఎంట్రీ ఇవ్వనున్నాడు. ఇంగ్లండ్ జట్టులో ముగ్గురు అన్ క్యాప్డ్ ప్లేయర్లకు చోటు దక్కింది. వీరిలో జాఫర్ చోహాన్ తొలిసారి సీనియర్ జట్టులో చోటు దక్కించుకోగా.. జాన్ టర్నర్, డాన్ మౌస్లీ జాతీయ జట్టుకు మరోసారి ఎంపికయ్యారు. విండీస్తో సిరీస్లకు ఈ 14 మందితో పాటు మరో ఇద్దరిని కూడా ఇంగ్లండ్ క్రికెట్ బోర్డు ఎంపిక చేయనుంది. ఆ ఇద్దరు పాకిస్తాన్తో టెస్ట్ సిరీస్తో ముగిసిన అనంతరం (అక్టోబర్ 28) జట్టుతో చేరతారు. బట్లర్ గైర్హాజరీలో ఇంగ్లండ్ జట్టు పగ్గాలు చేపట్టిన హ్యారీ బ్రూక్ ప్రస్తుతం ఇంగ్లండ్ టెస్ట్ జట్టులో సభ్యుడిగా ఉన్నాడు. బ్రూక్తో పాటు మరో ఆటగాడు ఇంగ్లండ్ పరిమిత ఓవర్ల జట్టులో చేరతాడు.వెస్టిండీస్ వన్డే మరియు టీ20 సిరీస్ల కోసం ఇంగ్లండ్ జట్టు: జోస్ బట్లర్ (కెప్టెన్, జోఫ్రా ఆర్చర్, జాకబ్ బెథెల్, జాఫర్ చోహాన్, సామ్ కర్రన్, విల్ జాక్స్, లియామ్ లివింగ్స్టోన్, సాకిబ్ మహమూద్, డాన్ మౌస్లీ, జామీ ఓవర్టన్, ఆదిల్ రషీద్, ఫిల్ సాల్ట్, రీస్ టోప్లీ, జాన్ టర్నర్చదవండి: ధోని కంటే రోహిత్ బెటర్ కెప్టెన్: భారత స్పిన్ దిగ్గజం -
ఇంగ్లండ్ జట్టుకు భారీ షాక్
ఆస్ట్రేలియాతో ఐదు మ్యాచ్ల వన్డే సిరీస్కు ముందు ఇంగ్లండ్ జట్టుకు భారీ షాక్ తగిలింది. ఆ జట్టు రెగ్యులర్ కెప్టెన్ జోస్ బట్లర్ గాయం నుంచి పూర్తిగా కోలుకోకపోవడంతో వన్డే సిరీస్ మొత్తానికి దూరమయ్యాడు. బట్లర్ స్థానంలో యువ ఆటగాడు హ్యారీ బ్రూక్ ఇంగ్లండ్ జట్టుకు నాయకత్వం వహించనున్నాడు. సెప్టెంబర్ 19 నుంచి మొదలుకానున్న వన్డే సిరీస్ కోసం ఇంగ్లండ్ జట్టును ఇవాళ (సెప్టెంబర్ 15) ప్రకటించారు. గాయం కారణంగా 6 అడుగుల 7 అంగుళాల ఫాస్ట్ బౌలర్ జోష్ హల్ కూడా ఈ సిరీస్కు దూరమయ్యాడు. మరోవైపు ఆసీస్తో రెండో టీ20లో చెలరేగిన లియామ్ లివింగ్స్టోన్ జట్టులో చోటు దక్కించుకున్నాడు.కెప్టెన్గా హ్యారీ బ్రూక్25 ఏళ్ల హ్యారీ బ్రూక్ ఇంగ్లండ్ వన్డే జట్టు కెప్టెన్గా తొలిసారి బాధ్యతలు చేపట్టనున్నాడు. 18 నెలల కింద వన్డే అరంగేట్రం చేసిన బ్రూక్.. టెస్ట్, టీ20ల్లో తనను తాను నిరూపించుకున్నప్పటికీ.. వన్డేల్లో చెప్పుకోదగ్గ ప్రదర్శనలు చేయలేకపోయాడు. బ్రూక్ ఇప్పటివరకు 15 వన్డేలు ఆడి 29.1 సగటున 407 పరుగులు చేశాడు. ఇందులో మూడు అర్ద సెంచరీలు ఉన్నాయి. బ్రూక్ ఇటీవల ముగిసిన ద హండ్రెడ్ లీగ్లో నార్త్రన్ సూపర్ ఛార్జర్స్కు కెప్టెన్గా వ్యవహరించాడు.ఆస్ట్రేలియాతో వన్డే సిరీస్కు ఇంగ్లండ్ జట్టు..హ్యారీ బ్రూక్ (కెప్టెన్), జోఫ్రా ఆర్చర్, జాకబ్ బెథెల్, బ్రైడన్ కార్సే, జోర్డాన్ కాక్స్, బెన్ డకెట్, విల్ జాక్స్, లియామ్ లివింగ్స్టోన్, మాథ్యూ పాట్స్, ఆదిల్ రషీద్, ఫిల్ సాల్ట్, జామీ స్మిత్, ఒల్లీ స్టోన్, రీస్ టోప్లీ, జాన్ టర్నర్ఇదిలా ఉంటే, ఆస్ట్రేలియా, ఇంగ్లండ్ జట్లు ప్రస్తుతం మూడు మ్యాచ్ల టీ20 సిరీస్లో తలపడుతున్నాయి. ఈ సిరీస్లో ఇరు జట్లు చెరో మ్యాచ్లో గెలిచాయి. మూడో టీ20 ఇవాళ (రాత్రి 7 గంటలకు) జరగాల్సి ఉంది. అయితే వర్షం కారణంగా ఇప్పటివరకు టాస్ కూడా పడలేదు. టీ20 సిరీస్ ముగిసిన అనంతరం సెప్టెంబర్ 19, 21, 24, 27, 29 తేదీల్లో ఐదు వన్డేలు జరుగనున్నాయి. చదవండి: లివింగ్ స్టోన్ ఊచకోత.. ఆసీస్పై ఇంగ్లండ్పై ఘన విజయం -
ఆసీస్తో సిరీస్కు ముందు ఇంగ్లండ్కు భారీ ఎదురుదెబ్బ
ఆస్ట్రేలియాతో టీ20 సిరీస్కు ముందు ఇంగ్లండ్ జట్టుకు భారీ ఎదురుదెబ్బ తగిలింది. గాయం కారణంగా ఇంగ్లండ్ సారధి జోస్ బట్లర్ ఆసీస్తో టీ20 సిరీస్ మొత్తానికి దూరమయ్యాడు. బట్లర్.. టీ20 సిరీస్తో పాటు తదనంతరం జరిగే ఐదు మ్యాచ్ల వన్డే సిరీస్కు కూడా దూరమయ్యే అవకాశం ఉంది. బట్లర్ గైర్హాజరీలో ఫిల్ సాల్ట్ ఇంగ్లండ్ టీ20 జట్టు కెప్టెన్గా వ్యవహరిస్తాడు. ఈ విషయాన్ని ఇంగ్లండ్ అండ్ వేల్స్ క్రికెట్ బోర్డు గురువారం (సెప్టెంబర్ 5) అధికారికంగా ప్రకటించింది. బట్లర్ స్థానాన్ని ఆల్రౌండర్ జేమీ ఓవర్టన్ భర్తీ చేయనున్నాడు. కాగా, మూడు టీ20లు, ఐదు మ్యాచ్ల వన్డే సిరీస్ కోసం ఆస్ట్రేలియా జట్టు సెప్టెంబర్ 11 నుంచి ఇంగ్లండ్లో పర్యటించనుంది. ఈ పర్యటనలో తొలుత టీ20లు జరుగుతాయి. సెప్టెంబర్ 11, 13, 15 తేదీల్లో మూడు టీ20లు జరుగనున్నాయి. అనంతరం సెప్టెంబర్ 19, 21, 24, 27, 29 తేదీల్లో వన్డే సిరీస్ జరుగనుంది.ఇంగ్లండ్ టీ20 జట్టు: ఫిల్ సాల్ట్ (కెప్టెన్), జోఫ్రా ఆర్చర్, జాకబ్ బెథెల్, బ్రైడన్ కార్సే, జోర్డాన్ కాక్స్, సామ్ కర్రన్, జోష్ హల్, విల్ జాక్స్, లియామ్ లివింగ్స్టోన్, సాకిబ్ మహమూద్, డాన్ మౌస్లీ, జేమీ ఓవర్టన్, ఆదిల్ రషీద్, రీస్ టోప్లీ, జాన్ టర్నర్ఇంగ్లండ్ వన్డే జట్టు: జోస్ బట్లర్ (కెప్టెన్), జోఫ్రా ఆర్చర్, గస్ అట్కిన్సన్, జాకబ్ బెథెల్, హ్యారీ బ్రూక్, బ్రైడన్ కార్సే, జోర్డాన్ కాక్స్, బెన్ డకెట్, జోష్ హల్, విల్ జాక్స్, మాథ్యూ పాట్స్, ఆదిల్ రషీద్, ఫిల్ సాల్ట్, జేమీ స్మిత్, రీస్ టోప్లీ, జాన్ టర్నర్ -
ఆస్ట్రేలియాతో టీ20 సిరీస్.. ఇంగ్లండ్కు బిగ్ షాక్!
ఇంగ్లండ్ క్రికెట్ జట్టు స్వదేశంలో ఆస్ట్రేలియాతో టీ20 సిరీస్కు సిద్దమవుతోంది. ఈ సిరీస్కు ముందు ఇంగ్లండ్కు బిగ్ షాక్ తగిలే అవకాశముంది. ఆ జట్టు కెప్టెన్ జోస్ బట్లర్ గాయం కారణంగా ఆసీస్ సిరీస్కు దూరం కానున్నట్లు తెలుస్తోంది. జోస్ ప్రస్తుతం కాలి పిక్క కండరాల గాయంతో బాధపడుతున్నాడు.ఈ గాయం కారణంగానే ది హండ్రెడ్ టోర్నమెంట్కు సైతం దూరమయ్యాడు. అయితే అతడు ఇంకా గాయం నుంచి పూర్తిగా కోలుకోపోయినట్లు తెలుస్తోంది. పూర్తి ఫిట్నెస్ సాధించడానికి మరో రెండు నుంచి మూడు వారాల సమయం పట్టనున్నట్లు సమాచారం. బట్లర్ తిరిగి మళ్లీ ఆసీస్తో వన్డే సిరీస్కు అందుబాటులో వచ్చే ఛాన్స్ ఉంది. కాగా ఇప్పటికే ఆసీస్తో టీ20 సిరీస్కు ఇంగ్లండ్ క్రికెట్ బోర్డు 16 మంది సభ్యులతో కూడిన తమ జట్టును ప్రకటించింది.ఈ జట్టుకు బట్లర్ సారథ్యం వహించినట్లు ఈసీబీ వెల్లడించింది. కానీ ఇప్పుడు బట్లర్ ఫిట్నెస్పై సందిగ్దం నెలకొనడంతో.. ఇంగ్లండ్ జట్టుకు సామ్ కుర్రాన్ సారథ్యం వహించే అవకాశముంది. కాగా సెప్టెంబర్ 11 ఈ సిరీస్ ప్రారంభం కానుంది.చదవండి: PAKvBAN: క్లీన్స్వీప్ దిశగా బంగ్లాదేశ్ -
ఆసీస్తో పరిమిత ఓవర్ల సిరీస్ల కోసం ఇంగ్లండ్ జట్ల ప్రకటన
స్వదేశంలో ఆస్ట్రేలియాతో జరిగే పరిమిత ఓవర్ల సిరీస్ల కోసం ఇంగ్లండ్ జట్లను నిన్న (ఆగస్ట్ 26) ప్రకటించారు. ఈ జట్లకు జోస్ బట్లర్ కెప్టెన్గా వ్యవహరించనున్నాడు. గాయం కారణంగా హండ్రెడ్ లీగ్కు దూరంగా ఉండిన బట్లర్ ఆసీస్తో సిరీస్లతో రీఎంట్రీ ఇవ్వనున్నాడు. ఈ సిరీస్లలో తొలుత మూడు మ్యాచ్ల టీ20 సిరీస్, ఆతర్వాత ఐదు మ్యాచ్ల వన్డే సిరీస్ జరుగనున్నాయి. టీ20 సిరీస్ సెప్టెంబర్ 11, 13, 15 తేదీల్లో.. వన్డే సిరీస్ సెప్టెంబర్ 19, 21, 24, 27, 29 తేదీల్లో జరుగనుంది. లంకతో మూడు మ్యాచ్ల టెస్ట్ సిరీస్ ముగిసిన వెంటనే ఆసీస్తో టీ20 సిరీస్ మొదలుకానుంది.ఆసీస్తో సిరీస్ల కోసం సీనియర్లు జానీ బెయిర్స్టో, మొయిన్ అలీ, క్రిస్ జోర్డన్లను పక్కకు పెట్టారు ఇంగ్లండ్ సెలెక్టర్లు. ఈ ముగ్గురు ఇటీవల ముగిసిన టీ20 వరల్డ్కప్లో ఇంగ్లండ్ జట్టులో సభ్యులుగా ఉన్నారు. వీరి స్థానంలో ఇంగ్లండ్ సెలెక్టర్లు ఐదుగురు అన్క్యాప్డ్ ప్లేయర్లకు (జోర్డన్ కాక్స్, జేకబ్ బేతెల్, డాన్ మౌస్లీ, జోష్ హల్, జాన్ టర్నర్) టీ20 జట్టులో అవకాశం కల్పించారు. ఈ ఐదుగురు వివిధ దేశవాలీ టోర్నీల్లో సత్తా చాటి జాతీయ జట్టుకు ఎంపికయ్యారు. వీరిలో జోర్డన్ కాక్స్ వికెట్కీపర్ బ్యాటర్ కాగా.. జోష్ హల్, జాన్ టర్నర్ పేస్ బౌలర్లు. జేకబ్ బేతెల్, డాన్ మౌస్లీ బ్యాటింగ్ ఆల్రౌండర్లు. ప్రస్తుత శ్రీలంక టెస్ట్ సిరీస్లో సభ్యులుగా ఉన్న హ్యారీ బ్రూక్, మాథ్యూ పాట్స్, గస్ అట్కిన్సన్లకు టీ20 జట్టులో చోటు దక్కలేదు. ఈ ముగ్గురు కేవలం వన్డే సిరీస్కు మాత్రమే పరిమితమయ్యారు. లంకతో తొలి టెస్ట్ సందర్భంగా గాయపడిన మార్క్ వుడ్ను సెలెక్టర్లు పరిగణలోకి తీసుకోకపోగా.. జో రూట్కు వన్డే జట్టు నుంచి రెస్ట్ ఇచ్చారు సెలెక్టర్లు. ఏడాదికి పైగా జాతీయ జట్టుకు దూరంగా ఉన్న జోఫ్రా ఆర్చర్ ఈ సిరీస్లతో రీఎంట్రీ ఇస్తున్నాడు.ఇంగ్లండ్ టీ20 జట్టు: జోస్ బట్లర్ (కెప్టెన్), జోఫ్రా ఆర్చర్, జేకబ్ బేతెల్, బ్రైడన్ కార్స్, జోర్డన్ కాక్స్, సామ్ కర్రన్, జోష్ హల్, విల్ జాక్స్, లియామ్ లివింగ్స్టోన్, సకిబ్ మహమూద్, డాన్ మౌస్లీ, ఆదిల్ రషీద్, ఫిల్ సాల్ట్, రీస్ టాప్లే, జాన్ టర్నర్ఇంగ్లండ్ వన్డే జట్టు: జోస్ బట్లర్(కెప్టెన్), జోఫ్రా ఆర్చర్, గస్ అట్కిన్సన్, జేకబ్ బేతెల్, హ్యారీ బ్రూక్, బ్రైడన్ కార్స్, బెన్ డకెట్, జోష్ హల్, విల్ జాక్స్, మాథ్యూ పాట్స్, ఆదిల్ రషీద్, ఫిల్ సాల్ట్, జేమీ స్మిత్, రీస్ టాప్లే, జాన్ టర్నర్షెడ్యూల్..సెప్టెంబర్ 11- తొలి టీ20 (సౌతాంప్టన్)సెప్టెంబర్ 13- రెండో టీ20 (కార్డిఫ్)సెప్టెంబర్ 15- మూడో టీ20 (మాంచెస్టర్)సెప్టెంబర్ 19- తొలి వన్డే (నాటింగ్హమ్)సెప్టెంబర్ 21- రెండో వన్డే (లీడ్స్)సెప్టెంబర్ 24- మూడో వన్డే (చెస్టర్ లీ స్ట్రీట్)సెస్టెంబర్ 27- నాలుగో వన్డే (లండన్)సెప్టెంబర్ 29- ఐదో వన్డే (బ్రిస్టల్) -
బట్లర్తో విభేదాలు.. ఇంగ్లండ్ జట్టుతో ఫ్లింటాప్ తెగదెంపులు?
ఇంగ్లండ్ క్రికెట్లో ముసలం నెలకొంది. ఇంగ్లండ్ పరిమిత ఓవర్ల కెప్టెన్ జోస్ బట్లర్, టీమ్ కన్సల్టెంట్ ఆండ్రూ ఫ్లింటాఫ్కు మధ్య విభేదాలు తలెత్తినట్లు తెలుస్తోంది. దీంతో జట్టుతో విడిపోవాలని ఫ్లింటాప్ నిర్ణయించుకున్నట్లు సమాచారం.వచ్చె నెలలో స్వదేశంలో ఆస్ట్రేలియాతో జరగనున్న వైట్బాల్ సిరీస్లకు ఇంగ్లండ్ కోచింగ్ స్టాప్లో భాగం కాకూడదని అతడు ఫిక్స్ అయినట్లు వినికిడి. ఇప్పటికే తన నిర్ణయాన్ని ఇంగ్లండ్ క్రికెట్ బోర్డుకు కూడా ఈ లెజండరీ క్రికెటర్ తెలియజేసినట్లు పలు రిపోర్ట్లు పేర్కొంటున్నాయి.గతేడాది నుంచి ఇంగ్లండ్ జట్టుకు తాత్కాలిక కన్సల్టెంట్గా ఫ్లింటాఫ్ పనిచేస్తున్నాడు. టీ20 వరల్డ్కప్-2024లో కూడా ఈ ఇంగ్లండ్ దిగ్గజ ఆల్రౌండర్ తన సేవలను అందించాడు. వరల్డ్కప్ సమయంలోనే ఫ్లింటాప్,బట్లర్కు గొడవలు మొదలైనట్లు వార్తలు వినిపిస్తున్నాయి.ఫ్లింటాప్ నిర్ణయాలను బట్లర్ వ్యతిరేకించేవాడని, ఇద్దరి మధ్య సమన్వయం లోపించినట్లు ఇంగ్లండ్ క్రికెట్ వర్గాలు వెల్లడించాయి. ఈ క్రమంలోనే ఇంగ్లండ్ సీనియర్ టీమ్ కోచింగ్ స్టాప్ నుంచి బయటకు వెళ్లాలని ఫ్లింటాప్ నిర్ణయించుకున్నాడంట. అతడు ఫ్రాంచైజీ క్రికెట్లో కోచింగ్పై దృష్టిపెట్టినట్లు మార్నింగ్ టెలిగ్రాఫ్ తమ కథనంలో పేర్కొంది. ఫ్లింటాఫ్ ప్రస్తుతం ది హండ్రెడ్ ఫ్రాంచైజీ నార్తర్న్ సూపర్చార్జర్స్కు హెడ్కోచ్గా ఉన్నాడు.తాత్కాలిక హెడ్కోచ్గా ట్రెస్కోథిక్ఇక వన్డే, టీ20 ప్రపంచకప్లో ఇంగ్లండ్ విఫలమకావడంతో హెడ్కోచ్ బాధ్యతల నుంచి మాథ్యూ మోట్ తప్పుకున్నాడు. ప్రస్తుతం తాత్కాలిక హెడ్ కోచ్గా బ్యాటింగ్ కోచ్ మార్కస్ ట్రెస్కోథిక్ బాధ్యతలు చేపట్టాడు. అయితే అతడిని త్వరలోనే పూర్తి స్ధాయి హెడ్కోచ్గా నియమించే అవకాశముంది. -
బాధగా ఉంది.. కానీ తప్పడం లేదు: రాయల్స్కు బట్లర్ గుడ్బై
ఇంగ్లండ్ పరిమిత ఓవర్ల క్రికెట్ కెప్టెన్ జోస్ బట్లర్ కీలక ప్రకటన చేశాడు. సౌతాఫ్రికా టీ20 లీగ్(SA20) నుంచి దూరం అవుతున్నట్లు తెలిపాడు. జాతీయ జట్టు విధుల దృష్ట్యా ఈ నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించాడు. ప్రపంచవ్యాప్తంగా పొట్టి ఫార్మాట్ లీగ్ల హవా కొనసాగుతున్న నేపథ్యంలో సౌతాఫ్రికా క్రికెట్ బోర్డు సైతం.. 2023లో తమ సొంత లీగ్ను ఆరంభించింది.ఇండియన్ ప్రీమియర్ లీగ్(ఐపీఎల్)లో భాగమైన ముంబై ఇండియన్స్, చెన్నై సూపర్ కింగ్స్, లక్నో సూపర్ జెయింట్స్, రాజస్తాన్ రాయల్స్, ఢిల్లీ క్యాపిటల్స్, సన్రైజర్స్ హైదరాబాద్ ఫ్రాంఛైజీలు ఈ లీగ్లో పెట్టుబడులు పెట్టాయి. వరుసగా.. ఎంఐ కేప్టౌన్, జొబర్గ్ సూపర్ కింగ్స్, డర్బన్ సూపర్ జెయింట్స్, ప్రిటోరియా క్యాపిటల్స్, సన్రైజర్స్ ఈస్టర్న్కేప్ పేరిట ఆరు జట్లు కొనుగోలు చేశాయి.పర్ల్ రాయల్స్ తరఫునఇక ఐపీఎల్లో రాజస్తాన్ రాయల్స్కు ప్రాతినిథ్యం వహిస్తున్న ఇంగ్లండ్ సారథి జోస్ బట్లర్.. సౌతాఫ్రికా లీగ్లోనూ అదే ఫ్రాంఛైజీకి చెందిన పర్ల్ రాయల్స్కు ఆడుతున్నాడు. రెండేళ్లపాటు అదే జట్టుతో కొనసాగిన బట్లర్.. 2025 సీజన్కు మాత్రం అందుబాటులో ఉండటం లేదని స్పష్టం చేశాడు. ఈ నేపథ్యంలో అభిమానులను ఉద్దేశించి పర్ల్ రాయల్స్ సోషల్ మీడియా వేదికగా తన సందేశం వినిపించాడు.విడిచి వెళ్లాలంటే బాధగా ఉంది‘‘వచ్చే ఏడాది ఇక్కడకు రాలేకపోతున్నందుకు నిరాశగా ఉంది. ఇంగ్లండ్ మ్యాచ్లతో బిజీ కాబోతున్నాను. ప్రస్తుతం నా దృష్టి మొత్తం వాటి మీదే ఉంది. ఈ టోర్నీకి ఇక తిరిగి రాలేకపోతున్నందుకు ఎంతగానో బాధపడుతున్నా. ఇక్కడి అభిమానులు నన్నెంతగానో ప్రేమించారు. పర్ల్ రాయల్స్ను విడిచి వెళ్లాలంటే బాధగా ఉంది. టీమ్కి ఆల్ ది బెస్ట్. బహుశా భవిష్యత్తులో మళ్లీ తిరిగి వస్తానేమో’’ అంటూ జోస్ బట్లర్ ఉద్వేగపూరిత వ్యాఖ్యలు చేశాడు.రెండు సీజన్లలో విజేతగా సన్రైజర్స్ఈ వీడియోను షేర్ చేసిన పర్ల్ రాయల్స్.. ‘‘జోస్.. ది బాస్.. మా జట్టుకు ఆడినందుకు ధన్యవాదాలు. నీ స్కూప్ షాట్స్ మేము కచ్చితంగా మిస్ అవుతాం’’ అంటూ క్యాప్షన్ జత చేసింది. కాగా అరంగేట్ర 2023, 2024 సీజన్లలో సన్రైజర్స్ ఈస్టర్న్కేప్ సౌతాఫ్రికా టీ20 లీగ్ టైటిల్స్ను సొంతం చేసుకుంది. ఇప్పటిదాకా జరిగిన ఈ రెండు ఎడిషన్లలో ప్రిటోరియా క్యాపిటల్స్, డర్బన్ సూపర్ జెయింట్స్ రన్నరప్తో సరిపెట్టుకున్నాయి.ఇక 2023లో పది మ్యాచ్లకు గానూ నాలుగు మాత్రమే గెలిచి.. పాయింట్ల పట్టికలో నాలుగో స్థానంలో నిలిచిన పర్ల్ రాయల్స్.. 2024లో పదికి ఐదు గెలిచి మూడో స్థానంతో ముగించింది. రెండుసార్లు సెమీ ఫైనల్ చేరినా ఓటమినే చవిచూసి టోర్నీ నుంచి నిష్క్రమించింది. ఇదిలా ఉంటే.. వికెట్ కీపర్ బ్యాటర్ జోస్ బట్లర్ గాయం కారణంగా ప్రస్తుతం విశ్రాంతి తీసుకుంటున్నాడు.Thank you for everything, Jos the Boss. We’ll miss the scoops, we’ll miss you! 💗 pic.twitter.com/OTYR4cfWw2— Paarl Royals (@paarlroyals) August 6, 2024 -
బట్లర్పై వేటు.. ఇంగ్లండ్ కొత్త కెప్టెన్గా యువ బ్యాటర్?
ఇంగ్లండ్ పరిమిత ఓవర్ల క్రికెట్ కెప్టెన్ జోస్ బట్లర్పై వేటు పడనుందంటూ గత కొన్ని రోజులుగా ప్రచారం జరుగుతోంది. అతడి స్థానంలో ఓ యువ బ్యాటర్కు వన్డే, టీ20 పగ్గాలు అప్పగించాలని ఇంగ్లండ్ క్రికెట్ బోర్డు భావిస్తున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. అయితే, ఇందులో నిజమెంత?!వన్డే వరల్డ్కప్-2023, టీ20 ప్రపంచకప్-2024 టోర్నీల్లో డిఫెండింగ్ చాంపియన్గా బరిలోకి దిగిన ఇంగ్లండ్ పూర్తిగా విఫలమైంది. భారత్ వేదికగా జరిగిన ఈ వన్డే ప్రపంచకప్లో తొమ్మిదింట కేవలం మూడే గెలిచి సెమీస్ కూడా చేరకుండానే నిష్క్రమించింది.బట్లర్కు బైబైఇక అమెరికా- వెస్టిండీస్ సంయుక్తంగా ఆతిథ్యమిచ్చిన పొట్టి క్రికెట్ ప్రపంచకప్లో సూపర్-8కు చేరుకునేందుకు ఇతర జట్ల ఫలితాలపై ఆధారపడాల్సి వచ్చింది. కష్టమ్మీద సెమీ ఫైనల్ చేరినప్పటికీ.. టీమిండియా చేతిలో చిత్తుగా ఓడి ఇంటిబాట పట్టింది. ఈ నేపథ్యంలో వన్డే, టీ20 కెప్టెన్ను మార్చే విషయమై ఇంగ్లండ్ క్రికెట్ డైరెక్టర్ రోబ్ కీ సంకేతాలు ఇచ్చినట్లు స్థానిక మీడియాలో వార్తలు వచ్చాయి.ఈ క్రమంలో 33 ఏళ్ల బట్లర్ను తొలగించేందుకే ఇంగ్లండ్ బోర్డు మొగ్గుచూపుతుందనే ప్రచారం జరిగింది. అంతేకాదు.. బట్లర్ వారసుడిగా హ్యారీ బ్రూక్ పేరు తెరమీదకు వచ్చింది. ఈ వార్తలపై హ్యారీ బ్రూక్ తాజాగా స్పందించాడు.నా స్థాయికి మించిన పదవి అది‘‘వావ్.. నా స్థాయికి మించిన పదవి అది. కానీ దీని గురించి నాకేమీ తెలియదు. సూపర్చార్జర్స్కు తొలిసారిగా కెప్టెన్గా వ్యవహరించబోతున్నాను. ఆ బాధ్యతను ఎలా నిర్వర్తిస్తానో చూద్దాం. వచ్చే రెండునెలల పాటు మీతో మాట్లాడుతూనే ఉంటాను కదా!అయితే, ఇంగ్లండ్ కెప్టెన్ కాబోతున్నానంటూ వస్తున్న వార్తల్లో వాస్తవం లేదు. ఇప్పట్లో కెప్టెన్సీ మార్పు ఉండబోదనే అనుకుంటున్నా’’ అని హ్యారీ బ్రూక్ పేర్కొన్నాడు. అదే విధంగా.. టెస్టు క్రికెట్కే తన మొదటి ప్రాధాన్యం అని స్పష్టం చేశాడు.ప్రస్తుతం వెస్టిండీస్తో టెస్టు సిరీస్తో బిజీగా ఉన్న ఈ కుడిచేతి వాటం బ్యాటర్.. తదుపరి ‘ది హండ్రెడ్ లీగ్’లో పాల్గొనున్నాడు. నార్తర్న్ సూపర్చార్జర్స్ జట్టుకు సారథిగా బాధ్యతలు చేపట్టనున్నాడు. కాగా ఇదే జట్టుకు ఇంగ్లండ్ మాజీ కెప్టెన్ ఆండ్రూ ఫ్లింటాఫ్ హెడ్కోచ్గా నియమితుడయ్యాడు.భవిష్య హెడ్కోచ్గా ఫ్లింటాఫ్?కాగా ఇంగ్లండ్ వన్డే, టీ20ల భవిష్య హెడ్కోచ్గా ఫ్లింటాఫ్ పేరు వినిపిస్తున్న విషయం తెలిసిందే. ఇప్పుడు ది హండ్రెడ్ లీగ్లో అతడి మార్గదర్శనంలో 25 ఏళ్ల హ్యారీ బ్రూక్ కెప్టెన్గా పనిచేయడం గమనార్హం. ఇదిలా ఉంటే.. బెన్ స్టోక్స్ సారథ్యంలో వెస్టిండీస్తో స్వదేశంలో జరుగుతున్న టెస్టు సిరీస్ను ఇంగ్లండ్ ఇప్పటికే 2-0తో కైవసం చేసుకుంది. ఇరుజట్ల మధ్య మూడో టెస్టు శుక్రవారం(జూలై 26) నుంచి ఆరంభం కానుంది. చదవండి: టీమిండియా మ్యాచ్లన్నీ లాహోర్లోనే!.. నో చెప్పిన ఐసీసీ! -
టీమిండియా ఒక అద్భుతం.. అదే మా కొంపముంచింది: ఇంగ్లండ్ కెప్టెన్
టీ20 వరల్డ్కప్-2024లో డిఫెండింగ్ ఛాంపియన్స్ ఇంగ్లండ్ ప్రయాణం ముగిసింది. గురువారం గయానా వేదికగా జరిగిన రెండో సెమీఫైనల్లో భారత్ చేతిలో 68 పరుగుల తేడాతో ఘోర ఓటమి చవిచూసిన ఇంగ్లండ్.. ఈ మెగా టోర్నీ నుంచి ఇంటిముఖం పట్టింది.ఈ సెమీస్ పోరులో బ్యాటింగ్, బౌలింగ్ విభాగాల్లో ఇంగ్లీష్ జట్టు విఫలమైంది. తొలుత బ్యాటింగ్ చేసిన భారత్ నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 171 పరుగుల భారీ స్కోర్ సాధించింది. భారత బ్యాటర్లో కెప్టెన్ రోహిత్ శర్మ(57), సూర్యకుమార్ యాదవ్(47) అద్బుతమైన ఇన్నింగ్స్ ఆడారు. ఇంగ్లండ్ బౌలర్లలో క్రిస్ జోర్డాన్ 3 వికెట్లు పడగొట్టగా.. రషీద్, అర్చర్, టాప్లీ, కుర్రాన్ తలా వికెట్ సాధించారు.అనంతరం 172 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన భారత బౌలర్ల దాటికి 16.4 ఓవర్లలో 103 పరుగులకే కుప్పకూలింది. భారత బౌలర్లలో స్పిన్నర్లు కుల్దీప్ యాదవ్, అక్షర్ పటేల్ తిప్పేశారు. అక్షర్ పటేల్, కుల్దీప్ తలా మూడు వికెట్లు పడగొట్టి ఇంగ్లండ్ పతనాన్ని శాసించారు. వీరితో పాటు జస్ప్రీత్ బుమ్రా రెండు కీలక వికెట్లు పడగొట్టాడు. ఇంగ్లండ్ బ్యాటర్లలో హ్యారీ బ్రూక్(25) పరుగులతో టాప్ స్కోరర్గా నిలిచాడు. ఈ విజయంతో భారత్ ఫైనల్ చేరగా.. ఇంగ్లండ్ స్వదేశానికి పయనమైంది. ఇక ఓటమిపై మ్యాచ్ అనంతరం ఇంగ్లండ్ కెప్టెన్ జోస్ బట్లర్ స్పందించాడు.అదే మా కొంపముంచింది: బట్లర్ఈ మ్యాచ్లో భారత్ మాకంటే అద్బుతమైన ప్రదర్శన కనబరిచింది. తొలుత బ్యాటింగ్లో భారత్కు అదనంగా 20 నుంచి 25 పరుగులు సమర్పించుకున్నాము. బ్యాటింగ్కు కష్టమైన పిచ్పైనా కూడా భారత బ్యాటర్లు అద్బుతంగా ఆడారు. కాబట్టి కచ్చితంగా ఈ విజయానికి వారు అర్హలు. గత వరల్డ్కప్(2022) కంటే ఇక్కడ పరిస్థితులు పూర్తిగా విభిన్నం. ఇటువంటి పరిస్ధితుల్లో కూడా భారత్ తమ మార్క్ చూపిస్తోంది. నిజంగా భారత బ్యాటర్లు బాగా ఆడారు. వర్షం పడిన తర్వాత పిచ్ కండిషీన్స్ ఇంతగా మారతాయని ఊహించలేదు. భారత్ అద్బుతంగా ఆడి అంచనా వేసిన స్కోర్ కంటే ఎక్కువగా సాధించింది. ఈ మ్యాచ్లో టాస్ ఎటువంటి ప్రభావం చూపలేదు. మా స్పిన్నర్లు రషీద్, లివింగ్ స్టోన్ అద్భుతంగా బౌలింగ్ చేశారు. అయితే పిచ్ స్పిన్కు అనుకూలిస్తున్నప్పడు మొయిన్ అలీతో బౌలింగ్ చేసి ఉంటే బాగుండేది. కానీ మేము అలా చేయలేదు. ఇది కొంతవరకు ప్రభావం చూపిందని నేను భావిస్తున్నాను. ఏదేమైనప్పటికి ఈ టోర్నీలో మా మా బాయ్స్ అద్బుతమైన పోరాట పటిమ కనబరిచారు. నిజంగా చాలా గర్వంగా ఉందని పోస్ట్మ్యాచ్ ప్రేజేంటేషన్లో బట్లర్ పేర్కొన్నాడు. -
T20 WC 2024: ఇంగ్లండ్పై ఘన విజయం.. ఫైనల్కు టీమిండియా
India vs England 2nd Semi final Live Updates: ఫైనల్కు టీమిండియాటీ20 వరల్డ్కప్-2024 ఫైనల్లో టీమిండియా అడుగుపెట్టింది. ఈ మెగా టోర్నీలో భాగంగా గయానా వేదికగా జరిగిన సెమీఫైనల్లో ఇంగ్లండ్ను 68 పరుగుల తేడాతో చిత్తు చేసిన భారత జట్టు.. తమ ఫైనల్ బెర్త్ను ఖారారు చేసుకుంది. ఈ విజయంతో గత టీ20 వరల్డ్కప్ సెమీస్ ఓటమికి భారత్ బదులు తీర్చుకుంది. ఈ మ్యాచ్లో భారత్ ఆల్రౌండ్ షోతో అదరగొట్టింది. తొలుత బ్యాటింగ్ చేసిన టీమిండియా నిర్ణీత 20 ఓవర్లలో నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 171 పరుగులు చేసింది. విరాట్ కోహ్లి, రిషబ్ పంత్ ఆరంభంలోనే ఔటైనప్పటికి కెప్టెన్ రోహిత్ శర్మ(57), సూర్యకుమార్ యాదవ్(47) అద్బుతమైన ప్రదర్శన కనబరిచారు.ఆఖరిలో హార్దిక్ పాండ్యా(23), జడేజా(17), అక్షర్ పటేల్(10) కీలక ఇన్నింగ్స్ ఆడారు. ఇంగ్లండ్ బౌలర్లలో క్రిస్ జోర్డాన్ 3 వికెట్లు పడగొట్టగా.. రషీద్, అర్చర్, టాప్లీ, కుర్రాన్ తలా వికెట్ సాధించారు.తిప్పేసిన స్పిన్నర్లు..అనంతరం 172 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన భారత బౌలర్ల దాటికి 103 పరుగులకే కుప్పకూలింది. భారత బౌలర్లలో స్పిన్నర్లు కుల్దీప్ యాదవ్, అక్షర్ పటేల్ తిప్పేశారు. అక్షర్ పటేల్, కుల్దీప్ తలా మూడు వికెట్లు పడగొట్టి ఇంగ్లండ్ పతనాన్ని శాసించాడు. వీరితో పాటు జస్ప్రీత్ బుమ్రా రెండు కీలక వికెట్లు పడగొట్టాడు. ఇంగ్లండ్ బ్యాటర్లలో హ్యారీ బ్రూక్(25) పరుగులతో టాప్ స్కోరర్గా నిలిచాడు. ఇక జూన్ 29న బార్బోడస్ వేదికగా జరగనున్న ఫైనల్లో దక్షిణాఫ్రికాతో భారత్ తలపడనుంది.జ ఆరో వికెట్ డౌన్..68 పరుగుల వద్ద ఇంగ్లండ్ ఆరో వికెట్ కోల్పోయింది. 25 పరుగులు చేసిన హ్యారీ బ్రూక్.. కుల్దీప్ యాదవ్ క్లీన్ బౌల్డయ్యాడు. 11 ఓవర్లకు ఇంగ్లండ్ స్కోర్: 68/649 పరుగులకే 5 వికెట్లు.. కష్టాల్లో ఇంగ్లండ్49 పరుగులకే ఐదు వికెట్లు కోల్పోయి ఇంగ్లండ్ పీకల్లోతు కష్టాల్లో పడింది. ఐదో వికెట్గా సామ్ కుర్రాన్ వెనుదిరిగాడు. కుల్దీప్ యాదవ్ బౌలింగ్లో ఎల్బీగా కుర్రాన్ పెవిలియన్కు చేరాడు.ఇంగ్లండ్ మూడో వికెట్ డౌన్..ఇంగ్లండ్ మూడో వికెట్ కోల్పోయింది. అక్షర్ పటేల్ బౌలింగ్లో జానీ బెయిర్ స్టో(0) క్లీన్ బౌల్డయ్యాడు. క్రీజులోకి హ్యారీ బ్రూక్ వచ్చాడు. 7 ఓవర్లకు ఇంగ్లండ్ మూడు వికెట్ల నష్టానికి 46 పరుగులు చేసింది.రెండో వికెట్ కోల్పోయిన ఇంగ్లండ్..172 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన ఇంగ్లండ్ రెండో వికెట్ కోల్పోయింది. 5 పరుగులు చేసిన ఫిల్ సాల్ట్.. జస్ప్రీత్ బుమ్రా బౌలింగ్లో ఔటయ్యాడు. తొలి వికెట్ కోల్పోయిన ఇంగ్లండ్..172 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన ఇంగ్లండ్ తొలి వికెట్ కోల్పోయింది. 23 పరుగులు చేసిన జోస్ బట్లర్.. అక్షర్ పటేల్ బౌలింగ్లో ఔటయ్యాడు. 4 ఓవర్లకు ఇంగ్లండ్ వికెట్ నష్టానికి 33 పరుగులు చేసింది.అదరగొట్టిన రోహిత్, సూర్య.. ఇంగ్లండ్ టార్గెట్ ఎంతంటే?ఇంగ్లండ్తో సెకెండ్ సెమీఫైనల్లో టీమిండియా బ్యాటింగ్లో అదరగొట్టింది. తొలుత బ్యాటింగ్ చేసిన భారతత్ నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 171 పరుగులు చేసింది. భారత బ్యాటర్లలో రోహిత్ శర్మ(57) పరుగులతో టాప్ స్కోరర్గా నిలవగా.. సూర్యకుమార్ యాదవ్(47), హార్దిక్ పాండ్యా(23) కీలక ఇన్నింగ్స్ ఆడారు. ఇంగ్లండ్ బౌలర్లలో క్రిస్ జోర్డాన్ 3 వికెట్లు పడగొట్టగా.. రషీద్, అర్చర్, టాప్లీ, కుర్రాన్ తలా వికెట్ సాధించారు.ఒకే ఓవర్లలో రెండు వికెట్లు..వరుస క్రమంలో టీమిండియా రెండో వికెట్ కోల్పోయింది. 18వ ఓవర్ వేసిన జోర్డాన్ బౌలింగ్లో తొలుత హార్దిక్ పాండ్యా(23) ఔట్ కాగా.. అనంతరం శివమ్ దూబే(0) పెవిలియన్కు చేరాడు. 18 ఓవర్లు ముగిసే సరికి భారత్ 6 వికెట్ల నష్టానికి 147 పరుగులు చేసింది.సూర్యకుమార్ ఔట్...124 పరుగుల వద్ద భారత్ నాలుగో వికెట్ కోల్పోయింది. 47 పరుగులు చేసిన సూర్యకుమార్ యాదవ్.. అర్చర్ బౌలింగ్లో ఔటయ్యాడు. 17 ఓవర్లకు భారత్ నాలుగు వికెట్ల నష్టానికి 132 పరుగులు చేసింది. క్రీజులో హార్దిక్ పాండ్యా, రవీంద్ర జడేజా ఉన్నారు.రోహిత్ శర్మ ఔట్..టీమిండియా మూడో వికెట్ కోల్పోయింది. 57 పరుగులు చేసిన రోహిత్ శర్మ.. అదిల్ రషీద్ బౌలింగ్లో క్లీన్ బౌల్డయ్యాడు.రోహిత్ శర్మ హాఫ్ సెంచరీ..13 ఓవర్లు ముగిసే సరికి భారత్ రెండు వికెట్లు కోల్పోయి 110 పరుగులు చేసింది. కెప్టెన్ రోహిత్ శర్మ తన హాఫ్ సెంచరీ మార్క్ను అందుకున్నాడు. రోహిత్ శర్మ(56), సూర్యకుమార్ యాదవ్(39) పరుగులతో ఉన్నారు.10 ఓవర్లకు భారత్ స్కోర్: 77/2మ్యాచ్ తిరిగి మళ్లీ ఆరంభమైంది. 10 ఓవర్లు ముగిసే సరికి టీమిండియా 2 వికెట్ల నష్టానికి 77 పరుగులు చేసింది. క్రీజులో రోహిత్ శర్మ(41), సూర్యకుమార్ యాదవ్(21) పరుగులతో ఉన్నారు.వర్షం అంతరాయం..గయానా వేదికగా ఇంగ్లండ్-భారత్ మధ్య జరుగుతున్న సెకెండ్ సెమీఫైనల్కు వర్షం అంతరాయం కలిగించింది. మ్యచ్ నిలిచిపోయే సమయానికి టీమిండియా 8 ఓవర్లలో రెండు వికెట్లు కోల్పోయి 65 పరుగులు చేసింది. క్రీజులో సూర్యకుమార్ యాదవ్(13), రోహిత్ శర్మ(37) పరుగులతో ఉన్నారు.రెండో వికెట్ డౌన్40 పరుగుల వద్ద టీమిండియా రెండో వికెట్ కోల్పోయింది. 4 పరుగులు చేసిన రిషబ్ పంత్.. సామ్ కుర్రాన్ బౌలింగ్లో ఔటయ్యాడు. 6 ఓవర్లు ముగిసే సరికి భారత్ రెండు వికెట్ల నష్టానికి 21 పరుగులు చేసింది. క్రీజులో రోహిత్ శర్మ(26), సూర్యకుమార్ యాదవ్(5) పరుగులతో ఉన్నారు.తొలి వికెట్ డౌన్.. కోహ్లి ఔట్టాస్ ఓడి తొలుత బ్యాటింగ్కు దిగిన టీమిండియా తొలి వికెట్ కోల్పోయింది. 9 పరుగులు చేసిన విరాట్ కోహ్లి.. టాప్లీ బౌలింగ్లో క్లీన్ బౌల్డయ్యాడు. క్రీజులోకి రిషబ్ పంత్ వచ్చాడు. 3 ఓవర్లు ముగిసే సరికి భారత్ వికెట్ నష్టానికి 21 పరుగులు చేసింది.తొలుత బౌలింగ్ ఎంచుకున్న ఇంగ్లండ్..సెకెండ్ సెమీఫైనల్ మ్యాచ్లో టాస్ గెలిచిన ఇంగ్లండ్ తొలుత బౌలింగ్ ఎంచుకుంది. ఈ మ్యాచ్లో ఇరు జట్లు ఎటువంటి మార్పులు లేకుండా బరిలోకి దిగాయి. ఈ మ్యాచ్ రాత్రి 9.15 గంటలకు ప్రారంభం కానుంది.తుది జట్లుభారత్: రోహిత్ శర్మ(కెప్టెన్), విరాట్ కోహ్లి, రిషబ్ పంత్(వికెట్ కీపర్), సూర్యకుమార్ యాదవ్, శివమ్ దూబే, హార్దిక్ పాండ్యా, రవీంద్ర జడేజా, అక్షర్ పటేల్, కుల్దీప్ యాదవ్, అర్ష్దీప్ సింగ్, జస్ప్రీత్ బుమ్రాఇంగ్లండ్ : ఫిలిప్ సాల్ట్, జోస్ బట్లర్(వికెట్ కీపర్), జానీ బెయిర్స్టో, హ్యారీ బ్రూక్, మొయిన్ అలీ, లియామ్ లివింగ్స్టోన్, సామ్ కర్రాన్, క్రిస్ జోర్డాన్, జోఫ్రా ఆర్చర్, ఆదిల్ రషీద్, రీస్ టోప్లీఅభిమానులకు గుడ్ న్యూస్అభిమానులకు గుడ్ న్యూస్. గయానాలో ఎండ కాస్తోంది. కవర్స్ను పూర్తిగి తొలిగించారు. భారత ప్లేయర్లు మైదానంలోకి వచ్చి ప్రాక్టీస్ చేస్తున్నారు. అంపైర్లు 8.30 గంటలకు మైదానం, పిచ్ను పరిశీలిస్తారు.టీ20 వరల్డ్కప్-2024లో రెండో సెమీఫైనల్కు సమయం అసన్నమైంది. సెకెండ్ సెమీస్లో భాగంగా గయానా వేదికగా భారత్-ఇంగ్లండ్ జట్లు తలపడనున్నాయి. ఈ మ్యాచ్కు వరుణుడు అడ్డంకిగా నిలిచాడు.ప్రస్తుతం వర్షం అగినప్పటకి.. పిచ్ను కవర్లతో కప్పి ఉంచారు. అయితే గత రాత్రి నుంచి భారీ వర్షం కురుస్తుండడంతో మైదానం ఔట్ ఫీల్డ్ చిత్తడిగా మారింది. మైదానాన్ని సిద్ధం చేసేందుకు గ్రౌండ్ స్టాప్ తీవ్రంగా శ్రమిస్తున్నారు. ఇంకా పిచ్ సిద్దం కాకపోవడంతో టాస్ ఆలస్యం కానుంది. -
రోహిత్, బట్లర్ సేమ్ టూ సేమ్.. వాట్ఏ కో ఇన్సిడెన్స్
టీ20 వరల్డ్కప్-2024లో ఇంగ్లండ్-భారత్ సెమీఫైనల్ మ్యాచ్కు ముందు ఒక యాదృచిక సంఘటన అభిమానులను షాక్కు గురిచేస్తోంది. ఈ మెగా టోర్నీలో ఇప్పటివరకు టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ, ఇంగ్లండ్ కెప్టెన్ జోస్ బట్లర్ గణాంకాలు అందరిని ఆశ్చర్యపరుస్తున్నాయి.ఇద్దరి స్టాట్స్ సరిగ్గా ఒకేలా ఉన్నాయి. రోహిత్ ప్రస్తుత వరల్డ్కప్లో 6 మ్యాచ్లు ఆడి 159.9 స్ట్రైక్ రేటుతో 191 పరుగులు చేయగా.. బట్లర్ కూడా సరిగ్గా స్ట్రైక్ రేటుతో 191 పరుగులు చేశాడు. అంతేకాకుండా వారిద్దరూ ఎదుర్కొన్న బంతులు కూడా సమనంగా ఉండటం గమనార్హం. రోహిత్ 120 బంతులు ఎదుర్కొగా..బట్లర్ సైతం 120 బంతులే ఆడాడు. ఇవే కాక మరి కొన్ని గణంకాలు ఫ్యాన్స్ను అబ్బురపరుస్తున్నాయి. ఈ ఏడాది టీ20ల్లో రోహిత్, బట్లర్ ఇద్దరూ సరిగ్గా 9 మ్యాచ్లు ఆడి.. చెరో 192 బంతులు ఎదుర్కొన్నారు. అదేవిధంగా ఇద్దరూ ఈ ఏడాది టీ20ల్లో 2 సార్లు నాటౌట్గా నిలిచి రెండు హాఫ్ సెంచరీలు సాధించారు. ఈ క్రమంలో క్రికెట్ అభిమానులు నిజంగా ఒక అద్బుతమంటూ సోషల్ మీడియాలో పోస్ట్లు చేస్తున్నారు. కాగా భారత్-ఇంగ్లండ్ సెమీఫైనల్ మ్యాచ్కు వర్షం ముప్పు పొంచి ఉంది. -
T20 World Cup 2024: సెమీస్లో టీమిండియా ప్రత్యర్ధి ఇంగ్లండ్..!
టీ20 వరల్డ్కప్ 2024 గ్రూప్-2 సెమీస్ బెర్త్లు ఖరారయ్యాయి. ఈ గ్రూప్ నుంచి సౌతాఫ్రికా, ఇంగ్లండ్ సెమీస్కు చేరుకున్నాయి. గ్రూప్-1 సెమీస్ బెర్త్లు నేడు (జూన్ 24) జరుగబోయే మ్యాచ్లతో ఖరారవుతాయి. ఇవాళ రాత్రి (భారతకాలమానం ప్రకారం) జరిగే భారత్-ఆసీస్ మ్యాచ్ ఫలితంతో గ్రూప్-1 సెమీస్ బెర్త్లపై క్లారిటీ వస్తుంది. ఏ కారణాల చేతైనా ఈ మ్యాచ్ ఫలితంతో క్లారిటీ రాకపోతే రేపు ఉదయం జరిగే బంగ్లాదేశ్-ఆఫ్ఘనిస్తాన్ మ్యాచ్ వరకు ఆగాల్సి ఉంటుంది.కాగా, గ్రూప్-2 నుంచి సెమీస్ బెర్త్లు ఖరారు కావడంతో సెమీఫైనల్లో ఏయే జట్లు తలపడతాయనే అంశంపై అంచనాలు మొదలయ్యాయి. నేడు ఆసీస్తో జరుగబోయే మ్యాచ్లో భారత్ గెలిచినా లేక ఈ మ్యాచ్ వర్షం కారణంగా రద్దైనా సెమీస్లో టీమిండియా.. ఇంగ్లండ్తో తలపడాల్సి ఉంటుంది. ఎందుకంటే.. టీమిండియా ఆసీస్పై గెలిచినా లేక ఈ మ్యాచ్ రద్దైనా గ్రూప్-1లో టీమిండియా అగ్రస్థానంలో ఉంటుంది. అప్పుడు షెడ్యూల్ ప్రకారం గ్రూప్-1 టాపర్.. గ్రూప్-2లో రెండో స్థానంలో ఉన్న జట్టుతో సెమీస్లో తలపడాల్సి ఉంటుంది. అలాగే గ్రూప్-1లో రెండో స్థానంలో నిలిచే జట్టు.. గ్రూప్-2 టాపర్ను ఢీకొట్టాల్సి ఉంటుంది. గ్రూప్-2లో సౌతాఫ్రికా అగ్రస్థానంలో ఉండగా.. ఇంగ్లండ్ రెండో స్థానంలో నిలిచిందిసెమీస్లో తమ ప్రత్యర్ధిగా ఎవరుండాలని ఎంచుకుని సౌలభ్యం ప్రస్తుతం టీమిండియాకు దొరికింది. ఆసీస్పై గెలిస్తే ఇంగ్లండ్.. ఆసీస్ చేతిలో ఓడితే సౌతాఫ్రికాను టీమిండియా ఢీకొట్టాల్సి వస్తుంది. ఇదిలా ఉంటే, గ్రూప్-2కు సంబంధించి యూఎస్ఏపై గెలుపుతో ఇంగ్లండ్.. వెస్టిండీస్ను చిత్తు చేసి సౌతాఫ్రికా సెమీస్ఫైనల్స్ చేరిన విషయం తెలిసిందే. -
T20 World Cup 2024: ఉతికి 'ఆరే'సిన బట్లర్.. దెబ్బకు ప్యానెల్ బద్దలు
టీ20 వరల్డ్కప్ 2024లో భాగంగా నిన్న (జూన్ 23) జరిగిన సూపర్-8 మ్యాచ్లో యూఎస్ఏపై ఇంగ్లండ్ 10 వికెట్ల తేడాతో గెలుపొంది సెమీస్కు చేరుకుంది. ఈ మ్యాచ్లో స్వల్ప లక్ష్య ఛేదనలో ఇంగ్లండ్ కెప్టెన్ జోస్ బట్లర్ వీర విహారం చేశాడు. కేవలం 38 బంతుల్లో 6 ఫోర్లు, 7 సిక్సర్ల సాయంతో 83 పరుగులు చేసి అజేయంగా నిలిచాడు. బట్లర్ కొట్టిన సిక్సర్లలో ఓ భారీ సిక్సర్ మ్యాచ్ మొత్తానికే హైలైట్గా నిలిచింది. ఇన్నింగ్స్ నాలుగో ఓవర్లో సౌరభ్ నేత్రావల్కర్ బౌలింగ్ బట్లర్ బాదిన ఈ సిక్సర్.. 104 మీటర్ల దూరం వెళ్లి స్టేడియం పైకప్పుపై ఉన్న సోలార్ ప్యానెల్ను బద్దలు కొట్టింది. దీనికి సంబంధించిన వీడియో నెట్టింట షికార్లు కొడుతుంది. బట్లర్ ఉతుకుడును చూసిన వారంతా ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు.The Solar Panel damaging 104M six of Jos Buttler. 🌟pic.twitter.com/us41FZnZCF— Mufaddal Vohra (@mufaddal_vohra) June 23, 2024ఇదిలా ఉంటే, గ్రూప్-2 నుంచి ఇవాళ మరో సెమీస్ బెర్త్ ఖరారైంది. విండీస్ను ఓడించి సౌతాఫ్రికా సెమీస్కు చేరింది. ఇవాళ ఉదయం జరిగిన మ్యాచ్లో సౌతాఫ్రికా డక్వర్త్ లూయిస్ పద్దతిలో 3 వికెట్ల తేడాతో గెలుపొందింది. ఈ గెలుపుతో సౌతాఫ్రికా గ్రూప్-2లో తొలి స్థానంలో నిలిచింది. ఇంగ్లండ్ రెండో ప్లేస్కు పరిమితం కాగా.. విండీస్, యూఎస్ఏ టోర్నీ నుంచి నిష్క్రమించాయి.ఇంగ్లండ్-యూఎస్ఏ మ్యాచ్ విషయానికొస్తే.. తొలుత బ్యాటింగ్ చేసిన యూఎస్ఏ.. క్రిస్ జోర్డన్ (2.5-0-10-4) హ్యాట్రిక్ వికెట్లతో, ఆదిల్ రషీద్ (4-0-13-2) అద్బుత బౌలింగ్ ప్రదర్శనతో చెలరేగడంతో 18.5 ఓవర్లలో 115 పరుగులకే చాపచుట్టేసింది. యూఎస్ ఇన్నింగ్స్లో నితీశ్ కుమార్ (30) టాప్ స్కోరర్గా నిలిచాడు.అనంతరం స్వల్ప లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన ఇంగ్లండ్.. బట్లర్ మెరుపు ఇన్నింగ్స్తో విరుచుకుపడటంతో 9.4 ఓవర్లలోనే వికెట్ నష్టపోకుండా విజయతీరాలకు చేరింది. బట్లర్ సహచర ఓపెనర్ ఫిలిప్ సాల్ట్ 25 పరుగులతో అజేయంగా నిలిచాడు. -
T20 World Cup 2024: బట్లర్ విశ్వరూపం.. సిక్సర్ల సునామీ.. యువీ తర్వాత..!
యూఎస్ఏతో జరిగిన వరల్డ్కప్ 2024 సూపర్-8 మ్యాచ్లో ఇంగ్లండ్ కెప్టెన్ జోస్ బట్లర్ విశ్వరూపం ప్రదర్శించాడు. సెమీస్కు చేరాలంటే తప్పక నెగ్గాల్సిన మ్యాచ్లో చెలరేగిపోయాడు. హర్మీత్ సింగ్ వేసిన ఇన్నింగ్స్ తొమ్మిదో ఓవర్లో ఏకంగా ఐదు సిక్సర్లు బాది, యువరాజ్ సింగ్ (2007 ప్రపంచకప్లో యువీ.. ఇంగ్లండ్ దిగ్గజ పేసర్ స్టువర్ట్ బ్రాడ్ బౌలింగ్లో ఆరు బంతుల్లో ఆరు సిక్సర్లు బాదాడు) తర్వాత టీ20 వరల్డ్కప్ల్లో ఐదు అంతకంటే ఎక్కువ సిక్సర్లు బాదిన ఆటగాడిగా రికార్డుల్లోకెక్కాడు.హర్మీత్ ఓవర్లో ఐదు సిక్సర్లు సహా 32 పిండుకున్న బట్లర్.. మ్యాచ్ మొత్తంలో ఏడు సిక్సర్లు బాదాడు. తద్వారా ఇంగ్లండ్ తరఫున టీ20 వరల్డ్కప్ టోర్నీల్లో అత్యధిక సిక్సర్లు బాదిన ఆటగాడిగా అలెక్స్ హేల్స్ రికార్డును సమం చేశాడు. ఈ మ్యాచ్లో 38 బంతులు ఎదుర్కొన్న బట్లర్.. 6 బౌండరీలు, 7 సిక్సర్ల సాయంతో 83 పరుగులు చేసి అజేయంగా నిలిచాడు. బట్లర్ మెరుపు ఇన్నింగ్స్తో విరుచుకుపడటంతో యూఎస్ఏ నిర్దేశించిన 116 పరుగుల లక్ష్యాన్ని ఇంగ్లండ్ 9.4 ఓవర్లలోనే వికెట్ నష్టపోకుండా ఊదేసింది. ఫలితంగా 10 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించి, గ్రూప్-2 నుంచి సెమీస్కు చేరిన తొలి జట్టుగా నిలిచింది. బట్లర్ సహచర ఓపెనర్ ఫిలిప్ సాల్ట్ (25)తో కలిసి ఇంగ్లండ్ను విజయతీరాలకు చేర్చాడు.అంతకుముందు క్రిస్ జోర్డన్ (2.5-0-10-4) హ్యాట్రిక్ వికెట్లతో, ఆదిల్ రషీద్ (4-0-13-2) అద్బుత బౌలింగ్ ప్రదర్శనతో చెలరేగడంతో యూఎస్ఏ 18.5 ఓవర్లలో 115 పరుగులకే చాపచుట్టేసింది. యూఎస్ ఇన్నింగ్స్లో నితీశ్ కుమార్ (30) టాప్ స్కోరర్గా నిలిచాడు. -
T20 World Cup 2024: క్రిస్ జోర్డన్ హ్యాట్రిక్.. 6 బంతుల్లో 5 వికెట్లు
టీ20 వరల్డ్కప్ 2024లో భాగంగా ఇంగ్లండ్తో ఇవాళ (జూన్ 23) జరుగుతున్న సూపర్-8 మ్యాచ్లో యూఎస్ఏ-ఇంగ్లండ్ జట్లు తలపడుతున్నాయి. ఈ మ్యాచ్లో టాస్ గెలిచి తొలుత బౌలింగ్ ఎంచుకున్న ఇంగ్లండ్.. యూఎస్ఏను 115 పరుగులకే ఆలౌట్ చేసింది. ఇంగ్లండ్ బౌలర్లలో క్రిస్ జోర్డన్ హ్యాట్రిక్ వికెట్లతో (2.5-0-10-4) చెలరేగాడు. యూఎస్ఏ చివరి 5 వికెట్లను 6 బంతుల వ్యవధిలో (W, W, 0,W, W, W) కోల్పోయింది. జోర్డన్ ఒకే ఓవర్లో 4 వికెట్లు తీశాడు, జోర్డన్ తీసిన హ్యాట్రిక్ ఇవాళ రెండవది. ఉదయం జరిగిన మ్యాచ్లో ఆసీస్ బౌలర్ కమిన్స్ ఆఫ్ఘనిస్తాన్పై హ్యాట్రిక్ సాధించాడు. ఇది అతనికి వరుసగా రెండో మ్యాచ్లో రెండో హ్యాట్రిక్. యూఎస్ఏతో మ్యాచ్లో జోర్డన్తో పాటు ఆదిల్ రషీద్ (4-0-13-2), సామ్ కర్రన్ (2-0-23-2), రీస్ టాప్లే (3-0-29-1) సత్తా చాటారు. యూఎస్ఏ ఇన్నింగ్స్లో నితీశ్ కుమార్ (30) టాప్ స్కోరర్గా నిలువగా.. కోరె ఆండర్సన్ (29), హర్మీత్ సింగ్ (21), స్టీవ్ టేలర్ (12), ఆరోన్ జోన్స్ (10) రెండంకెల స్కోర్లు చేశారు. యూఎస్ఏ ఇన్నింగ్స్లో చివరి ముగ్గురు ఆటగాళ్లు డకౌటయ్యారు. -
T20 World Cup 2024: ఇంగ్లండ్-యూఎస్ఏ మ్యాచ్.. తుది జట్లు ఇవే..!
టీ20 వరల్డ్కప్ 2024లో ఇవాళ (జూన్ 23) ఓ ఆసక్తికర మ్యాచ్ జరుగనుంది. సూపర్-8 గ్రూప్-2లో భాగంగా జరిగే మ్యాచ్లో సంచలనాల యూఎస్ఏను డిఫెండింగ్ ఛాంసియన్ ఇంగ్లండ్ ఢీకొట్టనుంది. బార్బడోస్ వేదికగా జరిగే ఈ మ్యాచ్ భారతకాలమానం ప్రకారం ఇవాళ రాత్రి 8 గంటలకు ప్రారంభమవుతుంది. ఈ మ్యాచ్లో ఇంగ్లండ్ టాస్ గెలిచి తొలుత ఫీల్డింగ్ ఎంచుకుంది. ఈ మ్యాచ్ కోసం యూఎస్ఏ ఎలాంటి మార్పులు చేయకపోగా.. ఇంగ్లండ్ ఓ మార్పుతో బరిలోకి దిగింది. మార్క్ వుడ్ స్థానంలో క్రిస్ జోర్డన్ తుది జట్టులోకి వచ్చాడు.కాగా, గ్రూప్ దశలో పాక్ లాంటి పటిష్ట జట్టుకు షాకిచ్చిన యూఎస్ఏ.. సూపర్-8లో పెద్దగా ప్రభావం చూపలేకపోతుంది. ఆ జట్టు ఇప్పటివరకు ఆడిన రెండు మ్యాచ్ల్లో ఓటమిపాలై సెమీస్ అవకాశాలను దాదాపుగా చేజార్చుకుంది. మరోవైపు ఇంగ్లండ్ ఆడిన రెండు మ్యాచ్ల్లో ఓ గెలుపు, ఓ అపజయంతో గ్రూప్-2 నుంచి విండీస్తో పాటు సెమీస్ రేసులో ఉంది.తుది జట్లు..యునైటెడ్ స్టేట్స్: స్టీవెన్ టేలర్, ఆండ్రీస్ గౌస్(వికెట్కీపర్), నితీష్ కుమార్, ఆరోన్ జోన్స్(కెప్టెన్), కోరీ అండర్సన్, మిలింద్ కుమార్, హర్మీత్ సింగ్, షాడ్లీ వాన్ షాల్క్విక్, నోస్తుష్ కెంజిగే, అలీ ఖాన్, సౌరభ్ నేత్రవల్కర్ఇంగ్లండ్: ఫిలిప్ సాల్ట్, జోస్ బట్లర్(కెప్టెన్/వికెట్కీపర్), జానీ బెయిర్స్టో, హ్యారీ బ్రూక్, మొయిన్ అలీ, లియామ్ లివింగ్స్టోన్, సామ్ కర్రాన్, క్రిస్ జోర్డన్, జోఫ్రా ఆర్చర్, ఆదిల్ రషీద్, రీస్ టోప్లీ -
టీ20 వరల్డ్కప్లో నేటి (జూన్ 23) మ్యాచ్.. సంచలనాల యూఎస్ఏతో డిఫెండింగ్ ఛాంపియన్ 'ఢీ'
టీ20 వరల్డ్కప్ 2024లో ఇవాళ (జూన్ 23) ఓ ఆసక్తికర మ్యాచ్ జరుగనుంది. సూపర్-8 గ్రూప్-2లో భాగంగా జరిగే మ్యాచ్లో సంచలనాల యూఎస్ఏను డిఫెండింగ్ ఛాంసియన్ ఇంగ్లండ్ ఢీకొట్టనుంది. బార్బడోస్ వేదికగా జరిగే ఈ మ్యాచ్ భారతకాలమానం ప్రకారం ఇవాళ రాత్రి 8 గంటలకు ప్రారంభమవుతుంది.గ్రూప్ దశలో పాక్ లాంటి పటిష్ట జట్టుకు షాకిచ్చిన యూఎస్ఏ.. సూపర్-8లో పెద్దగా ప్రభావం చూపలేకపోతుంది. ఆ జట్టు ఇప్పటివరకు ఆడిన రెండు మ్యాచ్ల్లో ఓటమిపాలై సెమీస్ అవకాశాలను దాదాపుగా చేజార్చుకుంది. మరోవైపు ఇంగ్లండ్ ఆడిన రెండు మ్యాచ్ల్లో ఓ గెలుపు, ఓ అపజయంతో గ్రూప్-2 నుంచి విండీస్తో పాటు సెమీస్ రేసులో ఉంది. గ్రూప్-2లో ఆడిన రెండు మ్యాచ్ల్లో గెలిచిన సౌతాఫ్రికా సెమీస్ బెర్త్ను దాదాపుగా ఖరారు చేసుకుంది.పొట్టి ప్రపంచకప్లో ఇంగ్లండ్, యూఎస్ఏ జట్లు తలపడటం ఇదే మొదటిసారి. ఇరు జట్ల బలాబలాల బట్టి చూస్తే.. యూఎస్ఏపై ఇంగ్లండ్కే విజయావకాశాలు అధికంగా ఉన్నాయి. బార్బడోస్ పిచ్ బ్యాటింగ్కు అనుకూలించే అవకాశం ఉంది కాబట్టి ఈ పిచ్పై ఇంగ్లండ్ బ్యాటర్లు చెలరేగిపోవచ్చు. మరోవైపు యూఎస్ఏ కూడా తక్కువ అంచనా వేయడాలనికి వీళ్లేదు. ఆ జట్టు కూడా బ్యాటింగ్లో పటిష్టంగా ఉంది. పాక్ లాంటి జట్టుకు షాకిచ్చిన యూఎస్ను ఇంగ్లండ్ తక్కవ అంచనా వేయదు. యూఎస్ అమ్ములపొదిలో డాషింగ్ బ్యాటర్లతో సంచలన పేసర్ సౌరభ్ నేత్రావల్కర్ ఉన్నాడు. నేత్రావల్కర్ చెలరేగితే ఇంగ్లండ్కు కష్టాలు తప్పకపోవచ్చు.తుది జట్లు..యూఎస్ఏ: స్టీవెన్ టేలర్, ఆండ్రీస్ గౌస్ (వికెట్కీపర్), నితీష్ కుమార్, ఆరోన్ జోన్స్ (కెప్టెన్), కోరీ అండర్సన్, మిలింద్ కుమార్, హర్మీత్ సింగ్, నిసర్గ్ పటేల్, నోస్తుష్ కెంజిగే, అలీ ఖాన్, సౌరభ్ నేత్రావల్కర్ఇంగ్లండ్: ఫిలిప్ సాల్ట్, జోస్ బట్లర్ (కెప్టెన్/వికెట్కీపర్), జానీ బెయిర్స్టో, మొయిన్ అలీ, హ్యారీ బ్రూక్, లియామ్ లివింగ్స్టోన్, సామ్ కర్రన్, జోఫ్రా ఆర్చర్, ఆదిల్ రషీద్, మార్క్ వుడ్, రీస్ టాప్లీ -
ఇంగ్లండ్-సౌతాఫ్రికా సూపర్-8 పోరు.. తుది జట్లు ఇవే
టీ20 వరల్డ్ కప్-2024లో కీలక సమరానికి సమయం అసన్నమైంది. ఈ మెగా టోర్నీ సూపర్-8లో భాగంగా సెయింట్ లూసియా వేదికగా ఇంగ్లండ్, దక్షిణాఫ్రికా జట్లు తలపడతున్నాయి. ఈ మ్యాచ్లో టాస్ గెలిచిన ఇంగ్లండ్ తొలుత బౌలింగ్ ఎంచుకుంది. ఈ హైవోల్టేజ్ మ్యాచ్లో ఇంగ్లండ్ ఎటువంటి మార్పులు లేకుండా బరిలోకి దిగగా.. సౌతాఫ్రికా మాత్రం తమ తుది జట్టులో ఒక మార్పు చేసింది.స్పిన్నర్ షంమ్సీ స్ధానంలో ఒట్నీల్ బార్ట్మాన్ తుది జట్టులోకి వచ్చాడు. ఇక ఇరు జట్లు ఇప్పటికే సూపర్-8 రౌండ్లో చెరో విజయం సాధించాయి. తుది జట్లుదక్షిణాఫ్రికా: క్వింటన్ డికాక్(వికెట్ కీపర్), రీజా హెండ్రిక్స్, ఐడెన్ మార్క్రామ్(కెప్టెన్), డేవిడ్ మిల్లర్, హెన్రిచ్ క్లాసెన్, ట్రిస్టన్ స్టబ్స్, మార్కో జాన్సెన్, కేశవ్ మహరాజ్, కగిసో రబడ, అన్రిచ్ నార్ట్జే, ఒట్నీల్ బార్ట్మన్ఇంగ్లండ్: ఫిలిప్ సాల్ట్, జోస్ బట్లర్(కెప్టెన్/ వికెట్ కీపర్), హ్యారీ బ్రూక్, జానీ బెయిర్స్టో, మొయిన్ అలీ, లియామ్ లివింగ్స్టోన్, సామ్ కర్రాన్, జోఫ్రా ఆర్చర్, ఆదిల్ రషీద్, మార్క్ వుడ్, రీస్ టోప్లీ -
టీ20 వరల్డ్కప్లో నేటి (జూన్ 21) మ్యాచ్.. ఇంగ్లండ్తో సౌతాఫ్రికా 'ఢీ'
టీ20 వరల్డ్కప్ 2024లో ఇవాళ (జూన్ 21) మరో ఆసక్తికర సమరం జరుగనుంది. సూపర్-8 గ్రూప్-2లో భాగంగా సౌతాఫ్రికా, ఇంగ్లండ్ జట్లు తలపడనున్నాయి. సెయింట్ లూసియా వేదికగా ఈ మ్యాచ్ జరుగనుంది. భారతకాలమానం రాత్రి 8 గంటలకు ప్రారంభంకానుంది. గ్రూప్-2 నుంచి ఇంగ్లండ్, సౌతాఫ్రికా ఇదివరకే చెరో మ్యాచ్ గెలిచి పాయింట్ల పట్టికలో మొదటి రెండు స్థానాల్లో ఉన్నాయి. ఇంగ్లండ్.. వెస్టిండీస్పై, సౌతాఫ్రికా.. యూఎస్ఏపై గెలిచి చెరో రెండు పాయింట్లు ఖాతాలో వేసుకున్నాయి. ఈ టోర్నీలో ఇప్పటివరకు అజేయంగా ఉన్న సౌతాఫ్రికా.. తాజాగా జరిగిన మ్యాచ్లో విండీస్పై గెలిచి ఇంగ్లండ్ మరో గెలుపుపై ధీమాగా ఉన్నాయి. టీ20 ప్రపంచకప్ టోర్నీల్లో సౌతాఫ్రికా, ఇంగ్లండ్ ఇప్పటివరకు ఆరు మ్యాచ్ల్లో ఎదురెదురుపడగా.. సౌతాఫ్రికా 4, ఇంగ్లండ్ 2 మ్యాచ్ల్లో విజయాలు సాధించాయి. ఇరు జట్లు చివరిసారి తలపడిన మ్యాచ్లో (2022) ఇంగ్లండ్దే పైచేయిగా నిలిచింది.ప్రస్తుత ఫామ్ ప్రకారం చూస్తే.. సౌతాఫ్రికాతో పోలిస్తే ఇంగ్లండ్కే విజయావకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఆ జట్టులో ఓపెనర్లు సాల్ట్, బట్లర్ మంచి ఫామ్లో ఉన్నారు. బౌలింగ్ పరంగా చూస్తే.. ఇంగ్లండ్ కంటే సౌతాఫ్రికా కాస్త మెరుగ్గా కనిపిస్తుంది. ఆ జట్టు పేసర్లు ఓట్నీల్, రబాడ భీకర ఫామ్లో ఉన్నారు.వాతావరణం విషయానికొస్తే.. నేటి మ్యాచ్కు వర్షం నుంచి ఎలాంటి ముప్పు ఉండదు. మ్యాచ్ జరిగే సమయానికి వాతావరణం ఆహ్లాదంగా ఉండే అవకాశం ఉంది. ఈ మ్యాచ్ ఎలాంటి అవాంతరాలు ఎదురుకాకుండా సవ్యంగా సాగనుంది.పిచ్ విషయానికొస్తే.. సెయింట్ లూసియా పిచ్ బ్యాటర్లకు అనుకూలించే అవకాశం ఉంది. ప్రస్తుత ప్రపంచకప్లో నమోదైన టాప్ స్కోర్లలో మెజార్టీ శాతం ఇక్కడ నమోదైనవే. ఈ వికెట్పై బౌలర్లు గడ్డు పరిస్థితులు ఎదుర్కోక తప్పదు.తుది జట్లు (అంచనా).. ఇంగ్లండ్: ఫిల్ సాల్ట్, జోస్ బట్లర్ (కెప్టెన్/వికెట్కీపర్), మొయిన్ అలీ, జానీ బెయిర్స్టో, హ్యారీ బ్రూక్, లియామ్ లివింగ్స్టోన్, సామ్ కర్రన్, జోఫ్రా ఆర్చర్, ఆదిల్ రషీద్, మార్క్ వుడ్, రీస్ టాప్లీసౌతాఫ్రికా: క్వింటన్ డికాక్ (వికెట్కీపర్), రీజా హెండ్రిక్స్, ఎయిడెన్ మార్క్రమ్ (కెప్టెన్), ట్రిస్టన్ స్టబ్స్, హెన్రిచ్ క్లాసెన్, డేవిడ్ మిల్లర్, మార్కో జాన్సెన్, కేశవ్ మహారాజ్, కగిసో రబడ, అన్రిచ్ నోర్ట్జే, ఒట్నీల్ బార్ట్మన్ -
మరోసారి తండ్రైన జోస్ బట్లర్
ఇంగ్లండ్ పరిమిత ఓవర్ల కెప్టెన్ జోస్ బట్లర్ మూడోసారి తండ్రి అయ్యాడు. బట్లర్ భార్య లూయిస్ పండంటి మగబిడ్డకు జన్మనిచ్చింది. బట్లర్-లూయిస్ దంపతులకు ఇదివరకే పాప, బాబు ఉన్నారు. బట్లర్ దంపతులు తమ మూడో సంతానానికి చార్లీ అని పేరు పెట్టారు. చార్లీ పుట్టిన విషయం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఈ చిన్నారి గత నెల (మే) 28వ తేదీనే జన్మించినట్లు తెలుస్తుంది. చార్లీ జన్మించిన విషయాన్ని బట్లర్ దంపతుల గోప్యంగా ఉంచారు. తాజాగా ఈ విషయం సోషల్మీడియాలో వైరలవుతుంది.ఇదిలా ఉంటే, ప్రస్తుతం జోస్ బట్లర్ టీ20 ప్రపంచకప్ 2024తో బిజీగా ఉన్నాడు. బట్లర్ సారథ్యం వహిస్తున్న ఇంగ్లండ్ జట్టు గ్రూప్-బి నుంచి సూపర్-8 బెర్త్ కోసం స్కాట్లాండ్తో పోటీపడుతుంది. గ్రూప్ దశలో ఇంగ్లండ్, స్కాట్లాండ్ మరో మ్యాచ్ ఆడాల్సి ఉంది. ప్రస్తుతం స్కాట్లాండ్ ఆడిన 3 మ్యాచ్ల్లో 5 పాయింట్లతో గ్రూప్-బిలో రెండో స్థానంలో ఉండగా.. ఇంగ్లండ్ మూడింట ఒక మ్యాచ్ గెలిచి 3 పాయింట్లతో మూడో స్థానంలో కొనసాగుతుంది. A new baby on board for Jos Buttler's family! 🤗👶Congratulations to the happy couple! 🎉 pic.twitter.com/GhmhHxcs1q— CricTracker (@Cricketracker) June 14, 2024స్కాట్లాండ్-ఇంగ్లండ్ మధ్య జరగాల్సిన మ్యాచ్ రద్దు రావడంతో ఇరు జట్లు చెరో పాయింట్ పంచుకున్నాయి. ఇంగ్లండ్ సూపర్-8కు చేరాలంటే తదుపరి నమీబియాతో ఆడబోయే మ్యాచ్లో గెలవాల్సి ఉంటుంది. అలాగే స్కాట్లాండ్.. ఆస్ట్రేలియా చేతిలో ఓడాల్సి ఉంటుంది. ఒకవేళ ఇంగ్లండ్ నమీబియాపై గెలిచి, స్కాట్లాండ్-ఆస్ట్రేలియా మ్యాచ్ రద్దైనా ఇంగ్లండ్ ఇంటి ముఖం పట్టాల్సి ఉంటుంది. గ్రూప్-బి నుంచి ఆస్ట్రేలియా ఇదివరకే సూపర్-8 బెర్త్ ఖరారు చేసుకుంది.మరోవైపు గ్రూప్-ఏ నుంచి భారత్.. గ్రూప్-సి నుంచి ఆఫ్ఘనిస్తాన్, వెస్టిండీస్.. గ్రూప్-డి నుంచి సౌతాఫ్రికా జట్లు సూపర్-8కు అర్హత సాధించాయి. గ్రూప్-బి నుంచి నమీబియా, ఒమన్.. గ్రూప్-సి నుంచి ఉగాండ, పపువా న్యూ గినియా, న్యూజిలాండ్.. గ్రూప్-డి నుంచి శ్రీలంక ఎలిమినేట్ అయ్యాయి. -
T20 WC 2024: 47 పరుగులకే ఆలౌట్.. వరల్డ్కప్లోనే అతిపెద్ద విజయం
టీ20 ప్రపంచకప్-2024 గ్రూప్ దశలో తప్పక గెలవాల్సిన మ్యాచ్లో ఇంగ్లండ్ ఘన విజయం సాధించింది. ఒమన్ను ఎనిమిది వికెట్ల తేడాతో చిత్తు చేసి సూపర్-8 ఆశలను సజీవం చేసుకుంది.కాగా వరల్డ్కప్-2024లో భాగంగా ఆస్ట్రేలియా, స్కాట్లాండ్, నమీబియా, ఒమన్లతో కలిసి ఇంగ్లండ్ గ్రూప్-బిలో ఉంది. అయితే, తొలి రెండు మ్యాచ్లలో ఈ డిఫెండింగ్ చాంపియన్కు చేదు అనుభవాలే ఎదురయ్యాయి.స్కాట్లాండ్తో మ్యాచ్ వర్షం కారణంగా ఫలితం తేలకుండానే ముగిసిపోగా.. రెండో మ్యాచ్లో ఆసీస్ చేతిలో 36 పరుగుల తేడాతో ఓడిపోయింది. ఈ క్రమంలో సూపర్-8కు అర్హత సాధించాలంటే ఒమన్తో శుక్రవారం(ఉదయం 12.30 నిమిషాలకు ఆరంభం) నాటి మ్యాచ్లో చావో రేవో తేల్చుకోవాల్సిన పరిస్థితిలో నిలిచింది.ఈ నేపథ్యంలో వెస్టిండీస్లోని ఆంటిగ్వా వేదికగా టాస్ గెలిచిన ఇంగ్లండ్ తొలుత బౌలింగ్ చేసింది. బౌలర్లు ఆదిల్ రషీద్(4/11), జోఫ్రా ఆర్చర్(3/12), మార్క్ వుడ్(3/12) చెలరేగడంతో ఒమన్ 47 పరుగులకే కుప్పకూలింది. ఇంగ్లండ్ బౌలర్ల దెబ్బకు 13.2వ ఓవర్లోనే ఆలౌట్ అయింది. View this post on Instagram A post shared by ICC (@icc)టీ20 ప్రపంచకప్ చరిత్రలో అతిపెద్ద విజయం ఇక స్వల్ప లక్ష్యంతో బరిలోకి దిగిన ఇంగ్లండ్ కేవలం పందొమ్మిది బంతుల్లోనే పని పూర్తి చేసింది. ఓపెనర్లు ఫిలిప్ సాల్ట్(3 బంతుల్లో 12), కెప్టెన్ జోస్ బట్లర్(8 బంతుల్లో 24 నాటౌట్), జానీ బెయిర్ స్టో(2 బంతుల్లో 8 నాటౌట్) దంచికొట్టారు.ఇక వన్డౌన్ బ్యాటర్ విల్ జాక్స్(7 బంతుల్లో 5) పర్వాలేదనిపించగా.. 3.1 ఓవర్లలో రెండు వికెట్లు నష్టపోయిన ఇంగ్లండ్ 50 పరుగులు చేసింది. ఎనిమిది వికెట్ల తేడాతో ఒమన్ను చిత్తుగా ఓడించింది. 101 బంతులు మిగిలి ఉండగానే టార్గెట్ ఛేదించి మెన్స్ టీ20 ప్రపంచకప్ చరిత్రలో అతిపె ద్ద విజయం నమోదు చేసింది. అలా అయితేనే సూపర్-8కుకాగా గ్రూప్-డి నుంచి ఆస్ట్రేలియా ఇప్పటికే సూపర్-8 బెర్తు ఖరారు చేసుకోగా.. ఇంగ్లండ్ తమ తదుపరి మ్యాచ్లో తప్పక గెలవాలి. అంతేగాకుండా స్కాట్లాండ్ ఆస్ట్రేలియాతో జరిగే మ్యాచ్లో తప్పక ఓడిపోవాలి.లేదంటే ఇంగ్లండ్ సూపర్-8 చేరకుండానే టోర్నీ నుంచి నిష్క్రమించాల్సి ఉంటుంది. ఒకవేళ తదుపరి మ్యాచ్లో ఇంగ్లండ్ గెలిచి, స్కాట్లాండ్ ఓడినా నెట్రన్రేటు కీలకం(ఇంగ్లండ్ 3 పాయింట్లు, +3.081), స్కాట్లాండ్ ఐదు పాయింట్లు +2.164))గా మారుతుంది. చదవండి: T20 World Cup 2024: వరల్డ్కప్ టోర్నీ నుంచి అవుట్.. శ్రీలంకకు ఏమైంది? View this post on Instagram A post shared by ICC (@icc) -
AUS Vs ENG: ఇంగ్లండ్ను చిత్తు చేసిన ఆస్ట్రేలియా..
టీ20 వరల్డ్కప్-2024లో ఆస్ట్రేలియా తమ జోరును కొనసాగిస్తోంది. ఈ మెగా టోర్నీలో భాగంగా బార్బోడస్ వేదికగా ఇంగ్లండ్తో జరిగిన మ్యాచ్లో 36 పరుగుల తేడాతో ఆసీస్ ఘన విజయం సాధించింది. తొలుత బ్యాటింగ్ చేసిన ఆస్ట్రేలియా నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 201 పరుగుల భారీ స్కోర్ సాధించింది. ఆసీస్ టాపార్డర్ బ్యాటర్లు అద్బుతమైన ఇన్నింగ్స్ ఆడారు.ట్రావిస్ హెడ్(34), వార్నర్(39), మిచెల్ మార్ష్(35), మాక్స్వెల్(28), స్టోయినిష్(30) పరుగులతో రాణించారు. ఇంగ్లండ్ బౌలర్లలో క్రిస్ జోర్డాన్ రెండు వికెట్లు పడగొట్టగా.. మొయిన్ అలీ,అర్చర్, లివింగ్ స్టోన్, రషీద్ తలా వికెట్ సాధించారు.రాణించిన ఆసీస్ బౌలర్లు..202 పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన ఇంగ్లండ్.. నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 165 పరుగులు మాత్రమే చేయగల్గింది. ఇంగ్లండ్ బ్యాటర్లలో కెప్టెన్ జోస్ బట్లర్(42) టాప్ స్కోరర్గా నిలవగా.. ఫిల్ సాల్ట్(37), మొయిన్ అలీ(25) తమ వంతు ప్రయత్నం చేశారు. ఆసీస్ బౌలర్లలో పాట్ కమ్మిన్స్, జంపా తలా రెండు వికెట్లు సాధించగా.. హాజిల్వుడ్, మార్కస్ స్టోయినిష్ తలా వికెట్ పడగొట్టారు. కాగా ఆసీస్కు ఇది వరుసగా రెండో విజయం కావడం గమనార్హం. -
T20 World Cup 2024: సెమీస్కు చేరేది ఆ నాలుగు జట్లే.. ఆసీస్కు నో ఛాన్స్..?
టీ20 వరల్డ్కప్ 2024పై జోస్యాల పర్వం తారాస్థాయికి చేరింది. పలనా జట్టు టైటిల్ గెలుస్తుంది.. పలానా జట్లు సెమీస్కు చేరతాయంటూ మాజీలు, విశ్లేషకులు ఊదరగొడుతున్నారు. తాజాగా ఢిఫెండింగ్ ఛాంపియన్ ఇంగ్లండ్ కెప్టెన్ జోస్ బట్లర్ కూడా ఈ క్రికెట్ జ్యోతిష్యుల సరసన చేరాడు. ఈసారి ప్రపంచకప్లో ఇంగ్లండ్, టీమిండియా, సౌతాఫ్రికా, వెస్టిండీస్ జట్లు సెమీస్కు చేరతాయని అభిప్రాయపడ్డాడు. బట్లర్ తన అంచనాల్లో పటిష్టమైన ఆస్ట్రేలియాకు చోటివ్వకపోవడం ఆశ్చర్యకరం.కాగా, ఇంగ్లండ్ నిన్న (జూన్ 4) జరగాల్సిన తమ తొలి మ్యాచ్లో స్కాట్లాండ్తో తలపడాల్సి ఉండింది. అయితే ఈ మ్యాచ్ వర్షం కారణంగా రద్దైంది. దీంతో ఇరు జట్లు చెరో పాయింట్ పంచుకున్నాయి. సూపర్-8 చేరే క్రమంలో ఇంగ్లండ్కు ఇది అంత శుభపరిణామం కాదు. ఇంగ్లండ్, స్కాట్లాండ్ పోటీపడుతున్న గ్రూప్లోనే ఆస్ట్రేలియా, నమీబియా, ఒమన్ జట్లు ఉన్నాయి. ఈ గ్రూప్లో మొదటి రెండు స్థానాల్లో నిలిచే జట్లు సూపర్-8కు అర్హత సాధిస్తాయి. ప్రస్తుతానికి ఆడిన ఒక్క మ్యాచ్లో (ఒమన్తో) గెలిచిన నమీబియా 2 పాయింట్లు ఖాతాలో కలిగి టాప్లో ఉంది. ఆస్ట్రేలియా తమ తొలి మ్యాచ్ను ఆడాల్సి ఉంది.Jos Buttler reveals his predictions for the top four teams in the T20 World Cup 2024.Share your own selections in the comments section below👇 pic.twitter.com/SX0TZxuD5D— CricTracker (@Cricketracker) June 5, 2024ఇదిలా ఉంటే, ఇవాళ జరిగే గ్రూప్-ఏ పోటీలో భారత్-ఐర్లాండ్ జట్లు పోటీపడనున్నాయి. న్యూయార్క్ వేదికగా ఈ మ్యాచ్ రాత్రి 8 గంటలకు (భారతకాలమానం ప్రకారం) ప్రారంభంకానుంది. గ్రూప్-ఏలో ఇప్పటివరకు జరిగిన ఏకైక మ్యాచ్లో యూఎస్ఏ.. కెనడాపై విజయం సాధించింది. ప్రస్తుతం యూఎస్ఏ పాయింట్ల పట్టికలో టాప్లో ఉంది. ఈ గ్రూప్లో భారత్, ఐర్లాండ్, యూఎస్ఏ, కెనడాతో పాటు పాకిస్తాన్ ఉంది. భారత్.. జూన్ 9న చిరకాల ప్రత్యర్థి పాక్తో తలపడుతుంది. భారతకాలమానం ప్రకారం రేపు ఉదయం జరుగబోయే మ్యాచ్ల్లో ఆస్ట్రేలియా-ఒమన్ (6 గంటలకు).. పపువా న్యూ గినియా-ఉగాండ (5 గంటలకు) తలపడనున్నాయి. -
రాణించిన రషీద్, సాల్ట్.. పాక్ను చిత్తుగా ఓడించిన ఇంగ్లండ్
టీ20 ప్రపంచకప్ 2024కు ముందు పాకిస్తాన్ క్రికెట్ జట్టుకు భారీ ఎదురుదెబ్బ తగిలింది. ఇంగ్లండ్తో జరిగిన నాలుగు మ్యాచ్ల టీ20 సిరీస్లో పాక్ చిత్తుగా ఓడింది. నిన్న (మే 30) ముగిసిన నాలుగో మ్యాచ్లో ఇంగ్లండ్ 7 వికెట్ల తేడాతో పాక్ను మట్టికరిపించింది. తద్వారా 2-0 తేడాతో సిరీస్ను కైవసం చేసుకుంది.మ్యాచ్ విషయానికొస్తే.. ఓవల్ వేదికగా నిన్న జరిగిన నాలుగో టీ20లో తొలుత బ్యాటింగ్ చేసిన పాక్ 19.5 ఓవర్లలో 157 పరుగులకు ఆలౌటైంది. ఆదిల్ రషీద్ (4-0-27-2), లివింగ్స్టోన్ (3-1-17-2), మార్క్ వుడ్ (4-0-35-2) పాక్ను దెబ్బకొట్టారు. పాక్ ఇన్నింగ్స్లో బాబర్ ఆజమ్ (36), ఉస్మాన్ ఖాన్ (38) ఓ మోస్తరు స్కోర్లు చేయగా.. మొహమ్మద్ రిజ్వాన్ (23), ఇఫ్తికార్ అహ్మద్ (21), నసీం షా (16) రెండంకెల స్కోర్లు సాధించారు.అనంతరం 158 పరుగుల లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన ఇంగ్లండ్.. ఓపెనర్లు ఫిలిప్ సాల్ట్ (45), జోస్ బట్లర్ (39) దూకుడుగా ఆడటంతో 15.3 ఓవర్లలో 3 వికెట్లు మాత్రమే కోల్పోయి విజయతీరాలకు చేరింది. విల్ జాక్స్ (20), జానీ బెయిర్స్టో (28 నాటౌట్), హ్యారీ బ్రూక్ (17 నాటౌట్) ఇంగ్లండ్ గెలుపుకు తమవంతు సహకారాన్నందించారు. పాక్ బౌలర్లలో హరీస్ రౌఫ్కు మూడు వికెట్లు దక్కాయి.ఇదిలా ఉంటే, యూఎస్ఏ, వెస్టిండీస్ వేదికగా రేపటి నుంచి టీ20 ప్రపంచకప్ 2024 ప్రారంభంకానున్న విషయం తెలిసిందే. ఈ టోర్నీలో పాక్, ఇంగ్లండ్ జట్లు వేర్వేరే గ్రూప్ల్లో ఉన్నాయి. పాక్.. భారత్తో కలిసి గ్రూప్-ఏలో పోటీపడనుండగా.. ఇంగ్లండ్.. ఆస్ట్రేలియా లాంటి పటిష్టమైన జట్టుతో పాటు గ్రూప్-బిలో తమ అదృష్టాన్ని పరీక్షించుకోనుంది. ఈ టోర్నీలో భారత్-పాక్ల మెగా సమరం జూన్ 9న న్యూయార్క్ వేదికగా జరుగనుంది. -
ENG vs PAK: ఇంగ్లండ్కు ఓ గుడ్న్యూస్.. ఓ బ్యాడ్ న్యూస్
కార్డిఫ్ వేదికగా పాకిస్తాన్తో జరగనున్న మూడో టీ20కు ముందు ఇంగ్లండ్కు బిగ్ షాక్ తగిలింది. ఆ జట్టు కెప్టెన్ జోస్ బట్లర్ మూడో టీ20కు దూరమయ్యాడు. బట్లర్ భార్య లూయిస్ తమ మూడో బిడ్డకు జన్మనివ్వనుండడంతో.. బట్లర్ పితృత్వ సెలువు తీసుకున్నాడు. ఈ క్రమంలోనే మూడో టీ20కు జోస్ దూరం కానున్నాడు. నాలుగో టీ20కు కూడా అతడి అందుబాటులో ఉండేది అనుమానమే. బట్లర్ గైర్హజరీలో స్టార్ ఆల్రౌండర్ మొయిన్ అలీ ఇంగ్లీష్ జట్టును నడిపించనున్నాడు. అయితే తొలుత బట్లర్ టీ20 వరల్డ్కప్-2024లోని తమ ప్రారంభ మ్యాచ్లకు బట్లర్ దూరమవుతాడని అంతా భావించారు. కానీ అనుకున్న సమయం కంటేముందు తన భార్య బిడ్డకు జన్మనించే అవకాశం ఉంది.దీంతో అతడు ఈ మెగా ఈవెంట్ మొత్తం మ్యాచ్లకు అందుబాటులో ఉండనున్నట్లు ఇంగ్లండ్ మీడియాలో కథనాలు వెలువడుతున్నాయి. ఇక నాలుగు మ్యాచ్ల టీ20 సిరీస్లో భాగంగా తొలి టీ20 వర్షం కారణంగా రద్దు కాగా.. రెండో టీ20లో పాక్పై ఇంగ్లండ్ 23 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. ఈ మ్యాచ్లో జోస్ బట్లర్ ఆకాశమే హద్దుగా చెలరేగిపోయాడు. బట్లర్ 51 బంతుల్లో 8 ఫోర్లు, 3 సిక్సర్లతో 84 పరుగులు చేశాడు. -
తుస్సుమన్న పాక్ బ్యాటర్లు.. ఇంగ్లండ్ ఘన విజయం
నాలుగు మ్యాచ్ల టీ20 సిరీస్లో భాగంగా స్వదేశంలో పాక్తో జరిగిన రెండో మ్యాచ్లో ఇంగ్లండ్ ఘన విజయం సాధించింది. బర్మింగ్హమ్ వేదికగా జరిగిన ఈ మ్యాచ్లో ఇంగ్లండ్ అన్ని విభాగాల్లో సత్తా చాటి పాక్ను చిత్తు చేసింది. టాస్ ఓడి పాక్ ఆహ్వానం మేరకు తొలుత బ్యాటింగ్ చేసిన ఇంగ్లండ్ నిర్ణీత ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 183 పరుగులు చేయగా.. ఛేదనలో చేతులెత్తేసిన పాక్ 19.2 ఓవర్లలో 160 పరుగులకే చాపచుట్టేసి 23 పరుగుల తేడాతో పరాజయంపాలైంది. తద్వారా 1-0 ఆధిక్యంతో సిరీస్లో ముందడుగు వేసింది. సిరీస్లో భాగంగా జరగాల్సిన తొలి టీ20 వర్షం కారణంగా టాస్ కూడా పడకుండానే రద్దైంది. మూడో టీ20 కార్డిఫ్ వేదికగా ఈ నెల 28న జరుగనుంది. ఈ మ్యాచ్ భారతకాలమానం ప్రకారం రాత్రి 11 గంటలకు ప్రారంభమవుతుంది. మెరుపు ఇన్నింగ్స్తో ఆకట్టుకున్న బట్లర్ఈ మ్యాచ్లో జోస్ బట్లర్ మెరుపు ఇన్నింగ్స్తో (51 బంతుల్లో 84; 8 ఫోర్లు, 3 సిక్సర్లు) చెలరేగడంతో ఇంగ్లండ్ ఓ మోస్తరు స్కోర్ చేయగలిగింది. విల్ జాక్స్ (23 బంతుల్లో 37; 4 ఫోర్లు, 2 సిక్సర్లు), బెయిర్స్టో (18 బంతుల్లో 21; ఫోర్, 2 సిక్సర్లు) పర్వాలేదనిపించగా.. మిగతా బ్యాటర్లంతా నిరాశపరిచారు. ఓ దశలో (14.5 ఓవర్లలో 144/2) ఇంగ్లండ్ భారీ స్కోర్ సాధించేలా కనిపించింది. అయితే పాక్ బౌలర్లలో ఒక్కసారిగా లయను అందుకోవడంతో ఇంగ్లండ్ ఓ మోస్తరు స్కోర్తో సరిపెట్టుకోక తప్పలేదు. షాహీన్ అఫ్రిది 3, ఇమాద్ వసీం, హరీస్ రౌఫ్ తలో 2 వికెట్లతో రాణించారు.తేలిపోయిన పాక్ బ్యాటర్లు..ఓ మోస్తరు లక్ష్య ఛేదనలో ఇంగ్లండ్ బౌలర్ల ధాటికి పాక్ బ్యాటర్లు చేతులెత్తేశారు. ఫకర్ జమాన్ (45), బాబర్ ఆజమ్ (32), ఇఫ్తికార్ అహ్మద్ (23), ఇమాద్ వసీం (22) ఓ మోస్తరు స్కోర్లు చేయగా.. మిగతావారంతా దారుణంగా విఫలమయ్యారు. రీస్ టాప్లే భారీగా పరుగులు సమర్పించుకున్నప్పటికీ 3 వికెట్లు పడగొట్టగా.. మొయిన్ అలీ, జోఫ్రా ఆర్చర్ తలో 2 వికెట్లు పడగొట్టి పాక్ను ముప్పుతిప్పలు పెట్టారు. క్రిస్ జోర్డన్, ఆదిల్ రషీద్, లివింగ్స్టోన్ తలో వికెట్ పడగొట్టి జట్టు విజయంలో తమవంతు పాత్ర పోషించారు. -
చరిత్ర సృష్టించిన బట్లర్.. తొలి ఇంగ్లండ్ ఆటగాడిగా
ఎడ్జ్బాస్టన్ వేదికగా పాకిస్తాన్తో జరుగుతున్న రెండో టీ20లో ఇంగ్లండ్ కెప్టెన్ జోస్ బట్లర్ విధ్వంసం సృష్టించాడు. పాక్ బౌలర్లకు చుక్కలు చూపించాడు. బట్లర్ కేవలం 51 బంతుల్లో 8 ఫోర్లు, 3 సిక్స్లతో 84 పరుగులు చేశాడు. ఈ క్రమంలో బట్లర్ ఓ అరుదైన ఘనతను తన పేరిట లిఖించుకున్నాడు.అంతర్జాతీయ టీ20 క్రికెట్లో 3000 వేల పరుగుల మైలు రాయిని అందుకున్న తొలి ఇంగ్లండ్ క్రికెటర్గా బట్లర్ రికార్డులకెక్కాడు. ఇప్పటివరకు 115 టీ20 మ్యాచ్లు ఆడిన బట్లర్.. 3011 పరుగులు చేశాడు.బట్లర్ అంతర్జాతీయ టీ20 కెరీర్లో 23 ఫిప్టీలు, ఒక సెంచరీ ఉన్నాయి. అదే విధంగా టీ20ల్లో ఇంగ్లండ్ కెప్టెన్గా 1000 పరుగుల మైలురాయిని కూడా బట్లర్ అందుకున్నాడు. ఇక మ్యాచ్ విషయానికి వస్తే.. తొలుత బ్యాటింగ్ చేసిన ఇంగ్లండ్ నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 183 పరుగులు చేసింది. ఇంగ్లండ్ బ్యాటర్లలో జోస్ బట్లర్(84)తో పాటు విల్ జాక్స్(37), బెయిర్ స్టో(21) పరుగులతో రాణించారు. పాక్ బౌలర్లో షాహీన్ షా అఫ్రిది మూడు వికెట్లు పడగొట్టగా.. రవూఫ్, వసీం తలా రెండు వికెట్లు సాధించారు. -
ఇంగ్లండ్కు బిగ్ షాక్.. బట్లర్ దూరం! కొత్త కెప్టెన్ ఎవరంటే?
టీ20 వరల్డ్కప్-2024కు ముందు ఇంగ్లండ్ జట్టుకు భారీ షాక్ తగిలే ఛాన్స్ ఉంది. ఆ జట్టు రెగ్యూలర్ కెప్టెన్ జోస్ బట్లర్ ఈ ఏడాది పొట్టి ప్రపంచకప్లో కొన్ని మ్యాచ్లకు దూరం కానున్నట్లు తెలుస్తోంది. అతడి భార్య లూయిస్ మూడో బిడ్డకు జన్మనివ్వనుండడంతో.. బట్లర్ పితృత్వ సెలవు తీసుకోనున్నట్లు సమాచారం.ఈ క్రమంలోనే అతడు లీగ్ దశ మ్యాచ్లకు దూరం కానున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ఒక వేళ బట్లర్ దూరమైతే ఇంగ్లీష్ జట్టు కెప్టెన్సీ బాధ్యతలను ఆల్రౌండర్ మొయిన్ అలీ చేపట్టనున్నట్లు పలు రిపోర్ట్లు పేర్కొంటున్నాయి.ఈ మెగా ఈవెంట్లో ఇంగ్లండ్ తమ తొలి మ్యాచ్లో జూన్ 4న బార్బోడస్ వేదికగా స్కాట్లాండ్తో తలపడనుంది. ఇంగ్లండ్ ప్రస్తుతం టీ20 వరల్డ్కప్ సన్నాహాకాల్లో భాగంగా సొంత గడ్డపై నాలుగు మ్యాచ్ల టీ20 సిరీస్లో పాకిస్తాన్తో తలపడనుంది. తొలి మ్యాచ్ వర్షం కారణంగా టాస్ పడకుండానే రద్దు అయింది.శనివారం ఇరు జట్లు మధ్య రెండో టీ20 జరగనుంది. ఈ క్రమంలో రెండో టీ20కు ముందు మొయిన్ అలీ మీడియా సమావేశంలో మాట్లాడాడు. "నేను వైస్-కెప్టెన్గా ఉన్నప్పుడు జోస్ బట్లర్ గైర్హజరీలో చాలా సందర్బాల్లో జట్టును నడిపించాను. ఆ సమయంలో కెప్టెన్సీ పరంగా నేను ఎటువంటి ఒత్తిడికి లోనవ్వలేదు. కొత్తగా కూడా నాకేమి అన్పించలేదు. మనం తీసుకునే నిర్ణయాలపై ఏదైనా ఆధారపడి ఉంటుంది.ఇక జోస్ భార్య మూడో బిడ్డకు జన్మనివ్వనుంది. బేబీ అనుకున్న సమయంలోనే ఈ ప్రపంచంలో అడుగుపెడుతుందని నేను ఆశిస్తున్నాను. అంతేకాకుండా జోస్ ఎక్కువ మ్యాచ్లకు దూరం కాకుడదని నేను కోరుకుంటున్నాని" అలీ పేర్కొన్నాడు. -
ఐపీఎల్ నుంచి స్వదేశానికి...
న్యూఢిల్లీ: ఐపీఎల్లో లీగ్ దశ మ్యాచ్లు ముగింపు దశకు చేరగా... ఆయా జట్లకు కీలకమైన ఇంగ్లండ్ ఆటగాళ్లు తిరుగుపయనమయ్యారు. జోస్ బట్లర్ (రాజస్తాన్), లివింగ్స్టోన్ (పంజాబ్ కింగ్స్), విల్ జాక్స్, రీస్ టాప్లీ (బెంగళూరు)లు ఇంగ్లండ్కు బయలుదేరారు. వచ్చే నెల 2 నుంచి అమెరికా, వెస్టిండీస్లలో జరిగే టి20 ప్రపంచకప్కు తుది సన్నాహంగా సొంతగడ్డపై ఇంగ్లండ్ జట్టు పాకిస్తాన్తో టి20 సిరీస్ ఆడనుంది.మే 22 నుంచి ఇరు జట్ల మధ్య నాలుగు టి20ల సిరీస్ జరుగుతుంది. 22, 25, 28, 30 తేదీల్లో మ్యాచ్లు జరుగుతాయి. కాగా... ఈ ఐపీఎల్ సీజన్లో లివింగ్స్టోన్ ఆకట్టుకోలేకపోయాడు. బట్లర్ రాజ స్టాన్ స్టార్ ఓపెనర్. ఈ సీజన్లో ఒంటిచేత్తో కొన్ని మ్యాచ్ల్ని గెలిపించాడు. బెంగళూరుకు ప్రాతినిధ్యం వహిస్తున్న జాక్స్, టాప్లీలలో జాక్స్ది కీలకపాత్ర. బెంగళూరు వరుస విజయాల్లో భాగమైన అతను లేకపోవడం జట్టుకు లోటే! చివరి లీగ్ మ్యాచ్లో బెంగళూరు... చెన్నైతో ఈ నెల 18న తలపడుతుంది.ఇవి చదవండి: మళ్లీ హెడ్కోచ్గా రవిశాస్త్రి?.. కొట్టిపారేయలేం! -
రాజస్తాన్ రాయల్స్కు బిగ్ షాక్.. స్వదేశానికి వెళ్లిపోయిన బట్లర్
ఐపీఎల్-2024 ప్లే ఆఫ్స్కు ముందు రాజస్తాన్ రాయల్స్కు బిగ్ షాక్ తగిలింది. ఆ జట్టు స్టార్ ఓపెనర్, ఇంగ్లండ్ పరిమిత ఓవర్ల కెప్టెన్ జోస్ బట్లర్ ఈ ఏడాది సీజన్లో మిగిలిన మ్యాచ్లకు దూరమయ్యాడు. మరి కొన్ని రోజుల్లో టీ20 వరల్డ్కప్-2024 ప్రారంభం కానున్న నేపథ్యంలో బట్లర్ స్వదేశానికి పయనమయ్యాడు. ఈ పొట్టి వరల్డ్కప్ సన్నహాకాల్లో భాగంగా ఇంగ్లండ్ స్వదేశంలో పాకిస్తాన్తో 4 మ్యాచ్ల టీ20 సిరీస్ ఆడనుంది. ఈ సిరీస్ మే 22న ప్రారంభం కానుంది. టీ20 వరల్డ్కప్ జట్టులో భాగమైన ఆటగాళ్లు పాకిస్తాన్ సిరీస్ కంటే ముందే స్వదేశానికి రావాల్సి ఉంటుందని ఐపీఎల్ ప్రారంభంలోనే తమ ఆటగాళ్లకు ఇంగ్లండ్ క్రికెట్ బోర్డు ఆదేశాలు జారీ చేసింది. ఈ క్రమంలోనే జోస్ బట్లర్ ఇంగ్లండ్కు బయలు దేరాడు. ఈ విషయాన్ని సోషల్ మీడియా వేదికగా రాజస్తాన్ రాయల్స్ ఫ్రాంచైజీ వెల్లడించింది. తమ క్యాంప్ను బట్లర్ వీడి వెళ్తున్న వీడియోను రాజస్తాన్ ఎక్స్లో షేర్ చేసింది. బట్లర్తో పాటు ఆర్సీబీకి ప్రాతినిథ్యం వహిస్తున్న ఇంగ్లండ్ ఆటగాళ్లు విల్ జాక్స్, రీస్ టాప్లీ సైతం ఈ ఏడాది ఐపీఎల్ సీజన్లో మిగిలిన మ్యాచ్లకు దూరమయ్యారు. విల్ జాక్స్, రీస్ టాప్లీ బట్లర్తో పాటు ఇంగ్లండ్కు వెళ్లిపోయారు. We’ll miss you, Jos bhai! 🥺💗 pic.twitter.com/gnnbFgA0o8— Rajasthan Royals (@rajasthanroyals) May 13, 2024 -
IPL 2024: రెండు సెంచరీలకు విలువ లేకుండా చేసిన బట్లర్
ప్రస్తుత ఐపీఎల్ సీజన్లో రాజస్థాన్ రాయల్స్ విధ్వంసకర ఆటగాడు జోస్ బట్లర్ హవా కొనసాగుతుంది. ఈ సీజన్లో అతను 6 మ్యాచ్ల్లో 2 సెంచరీల సాయంతో 250 పరుగులు చేసి సీజన్ లీడింగ్ రన్స్కోరర్ల జాబితాలో ఎనిమిదో స్థానంలో ఉన్నాడు. నిన్న (ఏప్రిల్ 16) కేకేఆర్తో జరిగిన మ్యాచ్లో మెరుపు సెంచరీతో (60 బంతుల్లో 107 నాటౌట్; 9 ఫోర్లు, 6 సిక్సర్లు) చెలరేగిన బట్లర్.. ఓటమి తప్పదనుకున్న మ్యాచ్లో తన జట్టుకు చిరస్మరణీయ విజయాన్ని అందించాడు. 36 బంతుల్లో 96 పరుగులు చేయాల్సిన దశలో బట్లర్ వీర ఉతుకుడు ఉతికి రాయల్స్ను విజయతీరాలకు చేర్చాడు. ఈ శతకంతో ఎన్నో రికార్డులు ఖాతాలో వేసుకున్న బట్లర్.. ఎవరూ గమనించని ఓ అరుదైన ఘనతను సొంతం చేసుకున్నాడు. ప్రస్తుత ఐపీఎల్ సీజన్లో బట్లర్ సెంచరీలు చేసిన రెండు సందర్భాల్లో ప్రత్యర్ధి జట్టులోని బ్యాటర్లు కూడా శతకాలు చేశారు. ఆర్సీబీతో జరిగిన మ్యాచ్లో విరాట్ కోహ్లి అజేయ శతకంతో (113) చెలరేగగా.. నిన్న కేకేఆర్తో జరిగిన మ్యాచ్లో సునీల్ నరైన్ (109) సెంచరీతో కదంతొక్కాడు. ఈ రెండు సందర్భాల్లో బట్లర్ మెరుపు శతకాలతో సునామీలా విరుచుకుపడి ప్రత్యర్ధి ఆటగాళ్లు చేసిన సెంచరీలకు విలువ లేకుండా చేశాడు. పోతే.. కేకేఆర్తో మ్యాచ్లో విజయవంతమైన లక్ష్య ఛేదనలో సెంచరీ చేసిన బట్లర్.. ఐపీఎల్ హిస్టరీలో మూడు సార్లు ఛేజింగ్లో సెంచరీలు చేసి ఏకైక ఆటగాడిగా రికార్డుల్లోకెక్కాడు. ఈ సెంచరీతో (7) బట్లర్ ఐపీఎల్లో అత్యధిక సెంచరీలు చేసిన ఆటగాళ్ల జాబితాలో క్రిస్ గేల్ను (6) వెనక్కు నెట్టి రెండో స్థానానికి ఎగబాకాడు. ఈ జాబితాలో విరాట్ (8) టాప్లో ఉన్నాడు. కేకేఆర్తో మ్యాచ్లో బట్లర్ మెరుపు సెంచరీతో విరుచుకుపడటంతో రాజస్థాన్ రాయల్స్ 2 వికెట్ల తేడాతో విజయం సాధించిన విషయం సాధించింది. బట్లర్ సెంచరీతో కేకేఆర్ ఆటగాడు నరైన్ చేసిన సెంచరీ వృధా అయ్యింది. -
శ్రేయస్ అయ్యర్కు దెబ్బ మీద దెబ్బ! మరో షాక్..
ఓటమి బాధలో ఉన్న కోల్కతా నైట్ రైడర్స్ కెప్టెన్ శ్రేయస్ అయ్యర్కు మరో షాక్ తగిలింది. నిబంధనలు ఉల్లంఘించిన కారణంగా అతడికి భారత క్రికెట్ నియంత్రణ మండలి భారీ జరిమానా విధించింది. ఇందుకు సంబంధించి ఐపీఎల్ నిర్వాహకులు బుధవారం ప్రకటన విడుదల చేశారు. కాగా ఐపీఎల్-2024లో భాగంగా సొంతమైదానం ఈడెన్ గార్డెన్స్లో కేకేఆర్ మంగళవారం రాజస్తాన్ రాయల్స్తో తలపడింది. టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన అయ్యర్ సేన నిర్ణీత 20 ఓవర్లలో ఆరు వికెట్ల నష్టానికి 223 పరుగుల భారీ స్కోరు సాధించింది. అయితే, లక్ష్య ఛేదనలో ఆఖరి బంతి వరకు పోరాడినా రాజస్తాన్ రాయల్స్ జోస్ బట్లర్ వీరోచిత సెంచరీ కారణంగా ఓటమిని మూటగట్టుకుంది. రెండు వికెట్ల తేడాతో ఓడిపోయి పరాజయం పాలైంది. నిజానికి.. కేకేఆర్ రాజస్తాన్ను నిలువరిస్తుందనే అంతా అనుకున్నారు. కొంప ముంచి స్లో ఓవర్ రేటు కానీ స్లో ఓవర్ రేటు కేకేఆర్ కొంపముంచింది. నిర్ణీత సమయంలో బౌలింగ్ కోటా పూర్తి చేయనందున ఆఖరి ఓవర్లో 30 యార్డ్ సర్కిల్ ఆవల కేవలం నలుగురు ఫీల్డర్లనే ఉంచాల్సి వచ్చింది. దీనిని సద్వినియోగం చేసుకున్న బట్లర్ మొదటి బంతికే సిక్సర్ బాదాడు. ఓటమితో పాటు మరో షాక్ కూడా అనంతరం మూడు బంతుల్లో విజయ సమీకరణం ఐదు పరుగులు కాగా.. చివరి బంతికి సింగిల్ తీసి రాజస్తాన్ విజయలాంఛనం పూర్తి చేశాడు. ఇదిలా ఉంటే.. ఇప్పటికే స్లో ఓవర్ రేటు కారణంగా కేకేఆర్ మ్యాచ్ ఓడిపోగా.. నిర్ణీత సమయంలో బౌలింగ్ పూర్తి చేయనందున కోల్కతా సారథి శ్రేయస్ అయ్యర్కు బీసీసీఐ రూ. 12 లక్షల జరిమానా విధించింది. ఇది మొదటి తప్పు కాబట్టి ఈ మేర ఫైన్తో సరిపెట్టినట్లు తెలిపింది. కాగా ఐపీఎల్-2024లో ఇప్పటి వరకు ఆడిన ఆరు మ్యాచ్లలో నాలుగు గెలిచి పాయింట్ల పట్టికలో రెండో స్థానంలో కొనసాగుతోంది. చదవండి: ఈసారి టైటిల్ సన్రైజర్స్దే!.. రిక్కీ పాంటింగ్ కామెంట్స్ వైరల్ var request = 'https://www.sakshi.com/knowwidget/kwstr_7552012696.json'; $.ajaxPrefilter( function (request) { if (request.crossDomain && jQuery.support.cors) { var http = (window.location.protocol === 'http:' ? 'http:' : 'https:'); request.url = http + '//cors-anywhere.herokuapp.com/' + request.url; } }); $.get( request,function (response){ if(response == ''){ $('#frameId').hide(); }else{ $('#frameId').show(); } }); -
కోహ్లి, ధోని గురించే మాట్లాడాలా?... అతడూ ఓ లెజెండ్
రాజస్తాన్ రాయల్స్ ఓపెనర్ జోస్ బట్లర్పై టీమిండియా స్పిన్ దిగ్గజం హర్భజన్ సింగ్ ప్రశంసలు కురిపించాడు. అతడొక ప్రత్యేకమైన, అసాధారణ ఆటగాడు అంటూ ఈ ఇంగ్లండ్ కెప్టెన్ను ఆకాశానికెత్తాడు. ఐపీఎల్-2024లో భాగంగా రాజస్తాన్ రాయల్స్ మంగళవారం కోల్కతా నైట్ రైడర్స్తో తలపడింది. ఈడెన్ గార్డెన్స్లో ఆఖరి బంతి వరకు నువ్వా- నేనా అన్నట్లుగా సాగిన మ్యాచ్లో బట్లర్ రాజస్తాన్ను గెలిపించాడు. కేకేఆర్ విధించిన 224 పరుగుల భారీ లక్ష్యం ముందున్న వేళ.. 14 ఓవర్లలో ఆరు వికెట్ల నష్టానికి కేవలం 128 పరుగులే చేసిన తరుణంలో పట్టుదలగా నిలబడిన బట్లర్.. ఒత్తిడిలోనూ సంచలన ఇన్నింగ్స్తో మెరిశాడు. Another Last Over Thriller 🤩 A Jos Buttler special guides @rajasthanroyals over the line and further extends their lead at the 🔝 🙌 🙌 Scorecard ▶️ https://t.co/13s3GZLlAZ #TATAIPL | #KKRvRR pic.twitter.com/d3FECR81X1 — IndianPremierLeague (@IPL) April 16, 2024 అజేయ శతకం(60 బంతుల్లో 107)తో చెలరేగిన ఈ ఓపెనింగ్ బ్యాటర్.. ఆఖరి ఓవర్ చివరి బంతికి సింపుల్గా సింగిల్ తీసి రాజస్తాన్ను విజయతీరాలకు చేర్చాడు. ఫలితంగా రాజస్తాన్ ఖాతాలో ఆరో విజయం నమోదైంది. ఈ నేపథ్యంలో హర్భజన్ సింగ్ మాట్లాడుతూ బట్లర్ గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. కోహ్లి, ధోని గురించే ఎందుకు మాట్లాడాలి? ‘‘అతడొక ప్రత్యేకమైన ఆటగాడు. వేరే లెవల్ అంతే! బట్లర్ ఇలాంటి ప్రదర్శనతో ఆకట్టుకోవడం ఇదే మొదటిసారి కాదు. గత కొన్నేళ్లుగా అతడు ఇదే పని చేస్తున్నాడు. మున్ముందు కూడా చేస్తాడు. అసాధారణమైన ప్రతిభ అతడి సొంతం. అయితే, బట్లర్ భారత ఆటగాడు కాదు కాబట్టి మనం అతడి గురించి ఎక్కువగా మాట్లాడుకోం. ఒకవేళ ఇదే సెంచరీ గనుక విరాట్ కోహ్లి చేసి ఉంటే.. కనీసం రెండు నెలల పాటు అతడిని ప్రశంసిస్తూ మాట్లాడుతూ ఉండేవాళ్లం. అంతెందుకు ధోని కొట్టిన మూడు.. నాలుగు సిక్సర్ల గురించి కూడా మనం పెద్ద ఎత్తున చర్చిస్తాం. అతడొక లెజెండ్ మన ప్లేయర్ల గురించి సెలబ్రేట్ చేసుకున్నట్లుగానే బట్లర్ గురించి కూడా సంబరాలు చేసుకోవాలి. ఎందుకంటే అతడొక క్రికెట్ లెజెండ్’’ అని హర్భజన్ సింగ్ జోస్ బట్లర్పై ప్రశంసల వర్షం కురిపించాడు. కాగా ఐపీఎల్లో బట్లర్కు ఇది ఏడో సెంచరీ. ఆర్సీబీ స్టార్ విరాట్ కోహ్లి(8) తర్వాత అత్యధిక సెంచరీలు సాధించిన రెండో బ్యాటర్గా బట్లర్ కొనసాగుతున్నాడు. ఇక ఈ సీజన్లో ఇప్పటి వరకు ఆడిన ఆరు మ్యాచ్లలో కలిపి 250 పరుగులు చేశాడు. చదవండి : ఓటమిని జీర్ణించుకోలేకపోతున్నాం.. మాకు దొరికిన విలువైన ఆస్తి అతడు! var request = 'https://www.sakshi.com/knowwidget/kwstr_4381453179.json'; $.ajaxPrefilter( function (request) { if (request.crossDomain && jQuery.support.cors) { var http = (window.location.protocol === 'http:' ? 'http:' : 'https:'); request.url = http + '//cors-anywhere.herokuapp.com/' + request.url; } }); $.get( request,function (response){ if(response == ''){ $('#frameId').hide(); }else{ $('#frameId').show(); } }); -
అసలు ఆ ఓవర్లో అన్ని పరుగులిస్తావా?.. స్టార్క్పై ఆగ్రహం
#Starc: కోల్కతా నైట్ రైడర్స్ పేసర్ మిచెల్ స్టార్క్ ఆట తీరుపై విమర్శల వర్షం కురుస్తోంది. కోట్లు పెట్టి కొన్నందుకు అతడి వల్ల జట్టుకు ఏమాత్రం ఉపయోగం లేకుండా పోయిందని సొంత జట్టు అభిమానులే ఫైర్ అవుతున్నారు. కాగా ఐపీఎల్-2024 వేలంలో భాగంగా కేకేఆర్ మిచెల్ స్టార్క్ కోసం మిగతా ఫ్రాంఛైజీలతో పోటీ పడి మరీ అతడిని సొంతం చేసుకుంది. ఇందుకోసం ఏకంగా రికార్డు స్థాయిలో రూ. 24.75 కోట్లు ఖర్చు పెట్టింది. ఫలితంగా క్యాష్ రిచ్ లీగ్ చరిత్రలోనే అత్యంత ఖరీదైన ప్లేయర్గా ఈ ఆసీస్ స్టార్ రికార్డులకెక్కాడు. కానీ అందుకు తగ్గ ప్రదర్శన మాత్రం చేయలేకపోతున్నాడు. పదిహేడో ఎడిషన్లో తొలి రెండు మ్యాచ్లో వికెట్లు తీయలేకపోయిన స్టార్క్.. ఆ తర్వాత గాడిలో పడ్డట్లే కనిపించాడు. ఢిల్లీ క్యాపిటల్స్పై రెండు.. లక్నో సూపర్ జెయింట్స్తో మ్యాచ్లో మూడు వికెట్లు తీసి సత్తా చాటాడు. అసలు ఆ ఓవర్లో అన్ని పరుగులిస్తావా? అయితే.. రాజస్తాన్ రాయల్స్తో మంగళవారం నాటి మ్యాచ్లో మరోసారి విఫలమయ్యాడు. నాలుగు ఓవర్ల బౌలింగ్ కోటా పూర్తి చేసిన స్టార్క్ ధారాళంగా పరుగులు సమర్పించుకున్నాడు. ఏకంగా 50 పరుగులు లీక్ చేశాడు. ముఖ్యంగా కీలకమైన పద్దెనిమిదవ ఓవర్లో 18 పరుగులు ఇవ్వడం తీవ్ర ప్రభావం చూపింది. ఇక కేకేఆర్ మిగిలిన బౌలర్లలో స్పిన్నర్లు సునిల్ నరైన్ (2/30), వరుణ్ చక్రవర్తి (2/36) మెరుగ్గా ఆడగా.. స్టార్క్తో పాటు పేస్ విభాగంలో వైభవ్ అరోరా(1/45), హర్షిత్ రాణా (2/45) భారీగా పరుగులు ఇచ్చారు. అయితే, వీరిద్దరు వికెట్లు కూడా తీశారు. కానీ ఎంతో అనుభవం ఉన్న స్టార్క్ ఒక్క వికెట్ కూడా తీయలేక చతికిలపడ్డాడు. ఇక ఈ మ్యాచ్లో ఆఖరి బంతికి సింగిల్ తీసిన సెంచరీ వీరుడు జోస్ బట్లర్ రాజస్తాన్ను గెలిపించిన విషయం తెలిసిందే. పైసా వసూల్ మాత్రమే.. ప్రదర్శన లేదు ఫలితంగా వరుస విజయాలతో జోరు మీదున్న కేకేఆర్కు ఓటమి ఎదురైంది. ఈ క్రమంలో స్టార్క్ విమర్శకుల టార్గెట్గా మారాడు. స్టార్క్ కాస్త పొదుపుగా బౌలింగ్ చేసి ఉంటే కేకేఆర్కు భంగపాటు తప్పేదని పలువురు విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ఇక నెట్టింట అయితే.. అతడిపై పెద్ద ఎత్తున ట్రోలింగ్ జరుగుతోంది. ‘‘రూ. 24.75 కోట్లు ఖర్చు పెట్టి కొంటే పైసా వసూల్ మాత్రమే.. ప్రదర్శన లేదు’’ అంటూ స్టార్క్పై సెటైర్లు వేస్తున్నారు. అయితే, అతడి ఫ్యాన్స్ మాత్రం అండగా నిలుస్తూ.. కీలక సమయంలో రాణించి తన విలువేంటో చాటుకుంటాడని ధీమా వ్యక్తం చేస్తున్నారు. కేకేఆర్ వర్సెస్ రాజస్తాన్ స్కోర్లు: ►వేదిక: ఈడెన్ గార్డెన్స్, కోల్కతా ►టాస్: రాజస్తాన్.. బౌలింగ్ ►కేకేఆర్ స్కోరు: 223/6 (20) ►రాజస్తాన్ స్కోరు: 224/8 (20) ►ఫలితం: రెండు వికెట్ల తేడాతో కేకేఆర్పై రాజస్తాన్ విజయం Another Last Over Thriller 🤩 A Jos Buttler special guides @rajasthanroyals over the line and further extends their lead at the 🔝 🙌 🙌 Scorecard ▶️ https://t.co/13s3GZLlAZ #TATAIPL | #KKRvRR pic.twitter.com/d3FECR81X1 — IndianPremierLeague (@IPL) April 16, 2024 చదవండి: ఐపీఎల్ చరిత్రలో తొలి జట్టుగా రాజస్తాన్ ఆల్టైమ్ రికార్డు var request = 'https://www.sakshi.com/knowwidget/kwstr_4381453179.json'; $.ajaxPrefilter( function (request) { if (request.crossDomain && jQuery.support.cors) { var http = (window.location.protocol === 'http:' ? 'http:' : 'https:'); request.url = http + '//cors-anywhere.herokuapp.com/' + request.url; } }); $.get( request,function (response){ if(response == ''){ $('#frameId').hide(); }else{ $('#frameId').show(); } }); -
ఓటమిని జీర్ణించుకోలేకపోతున్నాం.. అందుకే వరుణ్ చేతికి బంతి!
రాజస్తాన్ రాయల్స్ చేతిలో ఓటమిని జీర్ణించుకోలేకపోతున్నామని కోల్కతా నైట్ రైడర్స్ కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ ఉద్వేగానికి లోనయ్యాడు. ఈ మ్యాచ్ ఆద్యంతం తమను భావోద్వేగాల డోలికలో ఊగిసలాడేలా చేసిందని.. కానీ తమకు ఈ పరిస్థితి వస్తుందని అస్సలు ఊహించలేదన్నాడు. ఏదేమైనా ఈ ఓటమిని అంగీకరించక తప్పదన్న శ్రేయస్.. టోర్నీ మధ్యలో ఇలాంటి అనుభవం ఎదురుకావడం ఒక రకంగా మంచిదైందని పేర్కొన్నాడు. లోపాలు సరిచేసుకుని రెట్టించిన ఉత్సాహంతో ముందుకు సాగే వీలుంటుందన్నాడు. ఇక ఈ మ్యాచ్లో అద్బుతంగా రాణించిన సునిల్ నరైన్ గురించి ప్రస్తావిస్తూ.. కేకేఆర్కు దొరికిన అత్యంత విలువైన ఆస్తి నరైన్ అని ప్రశంసించాడు. అదే విధంగా ఆఖరి ఓవర్లో బంతిని కావాలనే వరుణ్ చక్రవర్తికి ఇచ్చానన్న శ్రేయస్ అయ్యర్.. ఫలితం రాబట్టలేకపోయానని విచారం వ్యక్తం చేశాడు. On Display: 𝗘𝗳𝗳𝗼𝗿𝘁𝗹𝗲𝘀𝘀 𝗛𝗶𝘁𝘁𝗶𝗻𝗴 😍 Sunil Narine smacking it with perfection👌👌 Watch the match LIVE on @JioCinema and @StarSportsIndia 💻📱#TATAIPL | #KKRvRR | @KKRiders pic.twitter.com/yXC3F5r1SY — IndianPremierLeague (@IPL) April 16, 2024 అందుకే వరుణ్ చేతికి బంతి జోస్ బట్లర్ను నిలువరించేందుకు తాము అనుసరించి వ్యూహాలు ఫలించలేదని పేర్కొన్నాడు. కచ్చితంగా గెలుస్తామనుకున్న మ్యాచ్లో ఓడిపోవడం బాధగా ఉందని శ్రేయస్ అయ్యర్ అసంతృప్తిని వెళ్లగక్కాడు. అయితే ఓటమినే తలచుకుంటూ కూర్చోలేమని.. తదుపరి మ్యాచ్ కోసం పూర్తి స్థాయిలో సన్నద్ధమవుతామని శ్రేయస్ అయ్యర్ ఈ సందర్భంగా తెలిపాడు. కాగా ఐపీఎల్-2024లో భాగంగా సొంతమైదానంలో కేకేఆర్కు చేదు అనుభవం ఎదురైన విషయం తెలిసిందే. ఈడెన్ గార్డెన్స్లో రాజస్తాన్ రాయల్స్తో చివరి బంతి వరకు ఉత్కంఠ రేపిన మ్యాచ్లో కోల్కతా రెండు వికెట్ల తేడాతో పరాజయం పాలైంది. ఇక ఈ సీజన్లో కేకేఆర్కు ఇది రెండో ఓటమి. An Impactful Innings 😍 🔝 class effort from a 🔝 player ft. Jos Buttler Watch the match LIVE on @StarSportsIndia and @JioCinema 💻📱#TATAIPL | #KKRvRR | @rajasthanroyals pic.twitter.com/5vz2qLIC7Z — IndianPremierLeague (@IPL) April 16, 2024 నరైన్ సుడిగాలి ఇన్నింగ్స్ వృథా ఇక ఈ మ్యాచ్లో కేకేఆర్ ఆల్రౌండర్ సునిల్ నరైన్ 56 బంతుల్లో 13 ఫోర్లు, ఆరు సిక్స్ల సాయంతో 109 పరుగులు సాధించాడు. అదే విధంగా.. రెండు వికెట్లు కూడా పడగొట్టాడు ఈ స్పిన్ ఆల్రౌండర్. అయితే, రాయల్స్ స్టార్ జోస్ బట్లర్ అజేయ శతకం కారణంగా నరైన్సుడిగాలి ఇన్నింగ్స్ వృథాగా పోయింది. వాళ్లిద్దరి వల్లే ఓటమి 224 పరుగుల లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో 14 ఓవర్ల తర్వాత రాజస్తాన్ ఆరు వికెట్లు నష్టపోయి కేవలం 128 పరుగులకే పరిమితమైన వేళ బట్లర, రోవ్మన్ పావెల్తో కలిసి దూకుడుగా ఆడాడు. పావెల్ మెరుపు ఇన్నింగ్స్(13 బంతుల్లో 26)తో ఆకట్టుకోగా.. సెంచరీ వీరుడు బట్లర్(60 బంతుల్లో 107) ఆఖరి ఓవర్లో వరుణ్ చక్రవర్తి బౌలింగ్లో ఆఖరి బంతికి సింగిల్ తీసి రాజస్తాన్ను గెలుపుతీరాలకు చేర్చాడు. అలా నమ్మశక్యంకాని రీతిలో కేకేఆర్ ఓటమి పాలైంది. ఈ నేపథ్యంలో మ్యాచ్ అనంతరం కేకేఆర్ సారథి శ్రేయస్ అయ్యర్ పైవిధంగా స్పందించాడు. బట్లర్, రోవ్మన్ పావెల్ అద్భుతంగా ఆడారని వారిద్దరికి క్రెడిట్ ఇచ్చాడు. చదవండి: ఐపీఎల్ చరిత్రలో తొలి జట్టుగా రాజస్తాన్ ఆల్టైమ్ రికార్డు var request = 'https://www.sakshi.com/knowwidget/kwstr_7552012696.json'; $.ajaxPrefilter( function (request) { if (request.crossDomain && jQuery.support.cors) { var http = (window.location.protocol === 'http:' ? 'http:' : 'https:'); request.url = http + '//cors-anywhere.herokuapp.com/' + request.url; } }); $.get( request,function (response){ if(response == ''){ $('#frameId').hide(); }else{ $('#frameId').show(); } }); -
సంచలన విజయం.. ఐపీఎల్లో రాజస్తాన్ ఆల్టైమ్ రికార్డు
#KKRvRR: ఆఖరి బంతి వరకు నరాలు తెగే ఉత్కంఠ రేపిన మ్యాచ్లో రాజస్తాన్ రాయల్స్ పైచేయి సాధించింది. కోల్కతా నైట్ రైడర్స్పై రెండు వికెట్ల తేడాతో గెలుపొంది ఊపిరి పీల్చుకుంది. ఓపెనర్ జోస్ బట్లర్ అజేయ శతకం(107) కారణంగా ఐపీఎల్-2024లో ఆరో విజయాన్ని అందుకుంది. సొంతమైదానం ఈడెన్ గార్డెన్స్లో మంగళవారం నాటి మ్యాచ్లో టాస్ ఓడిన కేకేఆర్ తొలుత బ్యాటింగ్ చేసింది. సునిల్ నరైన్ విధ్వంసకర ఇన్నింగ్స్(56 బంతుల్లో 109) కారణంగా భారీ స్కోరు సాధించింది. నిర్ణీత 20 ఓవర్లలో ఆరు వికెట్ల నష్టానికి 223 పరుగులు సాధించింది కేకేఆర్. ఈ క్రమంలో లక్ష్య ఛేదనకు దిగిన రాజస్తాన్ చివరి బంతి వరకు పట్టుదలగా పోరాడింది. నిజానికి 14 ఓవర్ల తర్వాత రాజస్తాన్ స్కోరు 128/6. గెలవాలంటే చివరి ఆరు ఓవర్లలో 96 పరుగులు కావాలి.. రోవ్మన్ పావెల్తో కలిసి బట్లర్ ఈ క్లిష్టతర పరిస్థితి నుంచి రాజస్తాన్ను గట్టెక్కించాడు. An Impactful Innings 😍 🔝 class effort from a 🔝 player ft. Jos Buttler Watch the match LIVE on @StarSportsIndia and @JioCinema 💻📱#TATAIPL | #KKRvRR | @rajasthanroyals pic.twitter.com/5vz2qLIC7Z — IndianPremierLeague (@IPL) April 16, 2024 గెలుపు సమీకరణం 1 బాల్.. 1 రన్ ఉన్న తరుణంలో ‘ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్’ బట్లర్ ఏమాత్రం తడబడకుండా ఆవేశ్ ఖాన్ కలిసి సింగిల్ తీసి విజయలాంఛనాన్ని పూర్తి చేశాడు. ఆద్యంతం ఆసక్తి కలిగించిన ఈ మ్యాచ్లో ఆఖరికి ఇలా రాజస్తాన్ విజయ దరహాసం చేయగా.. కేకేఆర్ నైరాశ్యంలో మునిగిపోయింది. ఇక ఈ అద్భుతమైన గెలుపుతో రాజస్తాన్ రాయల్స్ ఐపీఎల్లో సరికొత్త రికార్డు సృష్టించింది. పదిహేడేళ్లుగా ఏ జట్టుకు సాధ్యం కాని ఓ అరుదైన ఘనత సాధించింది. రన్ ఛేజింగ్లో ఆరో వికెట్ పడిన తర్వాత అత్యధిక పరుగులు జోడించిన తొలి జట్టుగా ఆల్టైమ్ రికార్డు సృష్టించింది. అదే విధంగా అత్యధిక పరుగుల లక్ష్యాన్ని ఛేదించిన జట్టుగానూ అవతరించింది. ఛేజింగ్లో ఆరో వికెట్ పడిన తర్వాత అత్యధిక పరుగులు జోడించిన జట్లు 1. రాజస్తాన్ రాయల్స్- కేకేఆర్ మీద- 103 రన్స్- 2024, కోల్కతా. 2. ఆర్సీబీ- గుజరాత్ లయన్స్ మీద- 91 రన్స్- 2016, బెంగళూరు 3. చెన్నై- ముంబై మీద- 85 రన్స్- 2018, వాంఖడే, ముంబై 4. చెన్నై- సన్రైజర్స్ మీద- 78 రన్స్- 2018, వాంఖడే 5. ఢిల్లీ- గుజరాత్ లయన్స్ మీద- 76- 2017, కాన్పూర్. Another Last Over Thriller 🤩 A Jos Buttler special guides @rajasthanroyals over the line and further extends their lead at the 🔝 🙌 🙌 Scorecard ▶️ https://t.co/13s3GZLlAZ #TATAIPL | #KKRvRR pic.twitter.com/d3FECR81X1 — IndianPremierLeague (@IPL) April 16, 2024 కేకేఆర్ వర్సెస్ రాజస్తాన్ స్కోర్లు: ►టాస్: రాజస్తాన్.. బౌలింగ్ ►కేకేఆర్ స్కోరు: 223/6 (20) ►రాజస్తాన్ స్కోరు: 224/8 (20) ►ఫలితం: రెండు వికెట్ల తేడాతో కేకేఆర్పై రాజస్తాన్ గెలుపు. ఇవి కూడా చదవండి: #Pat Cummins: శెభాష్.. ఇది సరైన నిర్ణయం! కమిన్స్ అన్నతో అట్లుంటది మరి.. #T20WorldCup2024: రోహిత్తో ద్రవిడ్, అగార్కర్ చర్చలు.. హార్దిక్ పాండ్యాకు నో ఛాన్స్! var request = 'https://www.sakshi.com/knowwidget/kwstr_7522010156.json'; $.ajaxPrefilter( function (request) { if (request.crossDomain && jQuery.support.cors) { var http = (window.location.protocol === 'http:' ? 'http:' : 'https:'); request.url = http + '//cors-anywhere.herokuapp.com/' + request.url; } }); $.get( request,function (response){ if(response == ''){ $('#frameId').hide(); }else{ $('#frameId').show(); } }); -
వీరోచిత శతకంతో రాజస్తాన్ను గెలిపించిన బట్లర్ (ఫొటోలు)
-
KKR Vs RR Highlights: రాయల్స్కు బట్లర్ జోష్
కోల్కతా: కోల్కతాతో మ్యాచ్లో రాజస్తాన్ విజయలక్ష్యం 224...14 ఓవర్ల తర్వాత 128/6తో అసాధ్యంగా కనిపించింది. చివరి 6 ఓవర్లలో 96 పరుగులు కావాలి! ఈ దశలో బట్లర్ 42 పరుగుల వద్ద ఉన్నాడు. కానీ బట్లర్తో పాటు పావెల్ బ్యాటింగ్ అసాధ్యాన్ని సుసాధ్యం చేసింది. వరుసగా 6 ఓవర్లలో 17, 17, 16, 18, 19, 9 పరుగుల చొప్పున రాబట్టిన రాయల్స్ విజయాన్ని అందుకుంది. ఇందులో బట్లర్ 6 ఫోర్లు, 5 సిక్స్లు బాదగా...పావెల్ 1 ఫోర్, 3 సిక్స్లు బాదాడు. ఆఖరి ఓవర్లో తొలి బంతినే సిక్స్గా కొట్టి 55 బంతుల్లో శతకాన్ని పూర్తి చేసుకున్న బట్లర్... సింగిల్ తీయకుండా ఆఖరి బంతి దాకా నిలబడి గెలిపించాడు. 15వ ఓవర్లో 36 బంతుల్లో అర్ధసెంచరీ చేసిన బట్లర్ తర్వాత సంచలన ఇన్నింగ్స్ ఆడిన మరో 21 బంతుల్లోనే వందకు చేరుకున్నాడు. దీంతో మంగళవారం జరిగిన పోరులో రాజస్తాన్ రాయల్స్ 2 వికెట్ల తేడాతో కోల్కతా నైట్రైడర్స్పై అనూహ్య విజయం సాధించింది. తొలుత నైట్రైడర్స్ నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 223 పరుగులు చేసింది. సునీల్ నరైన్ (56 బంతుల్లో 109; 13 ఫోర్లు, 6 సిక్స్లు) తొలి సెంచరీ సాధించాడు. తర్వాత రాజస్తాన్ రాయల్స్ 20 ఓవర్లలో 8 వికెట్లు కోల్పోయి 224 పరుగులు చేసి గెలిచింది. జోస్ బట్లర్ (60 బంతుల్లో 107 నాటౌట్; 9 ఫోర్లు, 6 సిక్స్లు) సంచలన ఇన్నింగ్స్ ఆడాడు. పావెల్ (13 బంతుల్లో 26; 1 ఫోర్, 3 సిక్స్లు) మెరిపించాడు. నరైన్ ధనాధన్ ఫిల్ సాల్ట్ (10) లైఫ్ను సద్వినియోగం చేసుకోకపోగా, రఘువంశీ (18 బంతుల్లో 30; 5 ఫోర్లు) రాణించాడు. ఓపెనర్ నరైన్ 4, 6తో జట్టు పవర్ప్లేలో 56/1 స్కోరు చేసింది. సగం ఓవర్లు (10) ముగిసేసరికి నైట్రైడర్స్ సరిగ్గా 100/1 స్కోరు చేసింది. నరైన్ సిక్సర్తో 29 బంతుల్లో అర్ధసెంచరీ సాధించాడు. ఆ మరుసటి ఓవర్లో కుల్దీప్ సేన్... రఘువంశీ ఆట ముగించడంతో రెండో వికెట్కు 85 పరుగుల భాగస్వామ్యానికి తెరపడింది. కెపె్టన్ శ్రేయస్ అయ్యర్ (7), రసెల్ (13) జతయినా... పెద్ద స్కోర్లేమీ చేయలేకపోయారు. కానీ నరైన్ ఫోర్లు, సిక్స్లతో తన ఆటతీరును కొనసాగించాడు. చహల్ 16వ ఓవర్లో 2 ఫోర్లు, 2 సిక్స్లు బాదేయడంతో ఆ ఓవర్లో 23 పరుగులు వచ్చాయి. దీంతోనే అతని సెంచరీ 49 బంతుల్లో పూర్తయ్యింది. 18వ ఓవర్లో బౌల్ట్ యార్కర్తో నరైన్ పోరాటానికి ముగింపు పలికాడు. రింకూ సింగ్ (9 బంతుల్లో 20 నాటౌట్; 1 ఫోర్, 2 సిక్స్లు) మెరుపులతో నైట్రైడర్స్ 200 పైచిలుకు స్కోరు చేసేసింది. బట్లర్ మెరుపులతో... ఓపెనర్ యశస్వి జైస్వాల్ (9 బంతుల్లో 19; 3 ఫోర్లు, 1 సిక్స్) ధాటిగా ఆడిన అది కాసేపే కావడం, టాపార్డర్లో కెప్టెన్ సంజూ సామ్సన్ (12) చెప్పుకోదగ్గ స్కోరే చేయలేకపోవడం రాజస్థాన్ లక్ష్యఛేదనపై ప్రభావం చూపింది. ఇంపాక్ట్ ప్లేయర్గా ఓపెనింగ్ చేసిన బట్లర్ క్రీజును అట్టిపెట్టుకున్నాడు. కానీ ధాటిగా ఆడలేకపోయాడు. రియాన్ పరాగ్ (14 బంతుల్లో 34; 4 ఫోర్లు, 2 సిక్స్లు) వేగంగా ఆడే క్రమంలో వికెట్ కోల్పోగా... ధ్రువ్ జురెల్ (2), అశ్విన్ (8), హెట్మైర్ (0) చేతులెత్తేయడంతో 121 పరుగులకే 6 వికెట్లను కోల్పోయింది. స్కోరు వివరాలు కోల్కతా నైట్రైడర్స్ ఇన్నింగ్స్: సాల్ట్ (సి) అండ్ (బి) అవేశ్ 10; నరైన్ (బి) బౌల్ట్; రఘువంశీ (సి) అశ్విన్ (బి) కుల్దీప్ సేన్ 30; శ్రేయస్ (ఎల్బీడబ్ల్యూ) (బి) చహల్ 11; రసెల్ (సి) జురెల్ (బి) అవేశ్ 13; రింకూసింగ్ నాటౌట్ 20; వెంకటేశ్ (సి) జురెల్ (బి) కుల్దీప్ సేన్ 8; రమణ్దీప్ నాటౌట్ 1; ఎక్స్ట్రాలు 21; మొత్తం ( 20 ఓవర్లలో 6 వికెట్లకు) 223. వికెట్ల పతనం: 1–21, 2–106, 3–133, 4–184, 5–195, 6–215. బౌలింగ్: ట్రెంట్ బౌల్ట్ 4–0–31–1, అవేశ్ ఖాన్ 4–0–35–2, కుల్దీప్ సేన్ 4–0–46–2, చహల్ 4–0–54–1, అశ్విన్ 4–0–49–0. రాజస్తాన్ రాయల్స్ ఇన్నింగ్స్: యశస్వి (సి) వెంకటేశ్ (బి) వైభవ్ 19; బట్లర్ నాటౌట్ 107; సామ్సన్ (సి) నరైన్ (బి) హర్షిత్ 12; పరాగ్ (సి) రసెల్ (బి) హర్షిత్ 34; జురెల్ (ఎల్బీడబ్ల్యూ) (బి) నరైన్ 2; అశ్విన్ (సి) రఘువంశీ (బి) వరున్ 8; హెట్మైర్ (సి) శ్రేయస్ (బి) వరుణ్ 0; పావెల్ (ఎల్బీడబ్ల్యూ) (బి) నరైన్ 26; బౌల్ట్ రనౌట్ 0; అవేశ్ నాటౌట్ 0; ఎక్స్ట్రాలు 16; మొత్తం (20 ఓవర్లలో 8 వికెట్లకు) 224. వికెట్ల పతనం: 1–22, 2–47, 3–97, 4–100, 5–121, 6–121, 7–178, 8–186. బౌలింగ్: స్టార్క్ 4–0–50–0, వైభవ్ 3–0–45–1, హర్షిత్ రాణా 4–0–45–2, నరైన్ 4–0–30–2, వరుణ్ 3–0–36–2, రసెల్ 1–0–17–0. ఐపీఎల్లో నేడు గుజరాత్ X ఢిల్లీ వేదిక: అహ్మదాబాద్ రాత్రి 7: 30 గంటల నుంచి స్టార్ స్పోర్ట్స్, జియో సినిమా యాప్లో ప్రత్యక్ష ప్రసారం -
జోస్ బట్లర్ వీరోచిత సెంచరీ.. క్రిస్ గేల్ రికార్డు బద్దలు
ఐపీఎల్-2024లో భాగంగా ఈడెన్ గార్డెన్స్ వేదికగా కేకేఆర్తో జరిగిన మ్యాచ్లో రాజస్తాన్ రాయల్స్ 2 వికెట్ల తేడాతో విజయం సాధించింది. 224 పరుగుల భారీ లక్ష్యాన్ని రాజస్తాన్ 8 వికెట్లు కోల్పోయి ఆఖరి బంతికి చేధించింది. ఈ మ్యాచ్లో బట్లర్ విరోచిత శతకంతో చెలరేగాడు. ఈ విజయంలో ఆ జట్టు స్టార్ ఓపెనర్ జోస్ బట్లర్ కీలక పాత్ర పోషించాడు. ఓటమి తప్పదనుకున్న చోట బట్లర్ తన విధ్వంసకర ఇన్నింగ్స్తో తన జట్టుకు చిరస్మరణీయ విజయాన్ని అందించాడు. 224 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన రాజస్తాన్ రాయల్స్ ఆరంభంలో తడబడింది. వరుస క్రమంలో జైశ్వాల్, సంజూ శాంసన్ వికెట్లు కోల్పోయి రాజస్తాన్ కష్టాల్లో పడింది. ఆ తర్వాత క్రీజులోకి వచ్చిన పరాగ్తో కలిసి బట్లర్ ఇన్నింగ్స్ను ముందుకు నడిపించాడు. అనంతరం పరాగ్, అశ్విన్, హెట్మైర్ వరుస క్రమంలో ఔటయ్యారు. దీంతో రాజస్తాన్ ఓటమి ఖాయమైందని అంతా భావించారు. కానీ క్రీజులో ఉన్న బట్లర్ మాత్రం తన పట్టును విడలేదు. ఓ వైపు వికెట్లు పడుతున్నప్పటికి తన జోరును కొనసాగించాడు. తన హాఫ్ సెంచరీ పూర్తియ్యాక కేకేఆర్ బౌలర్లను బట్లర్ ఊచకోత కోశాడు. ఆఖరివరకు క్రీజులో ఉండి మ్యాచ్ను ఫినిష్ చేశాడు. ఓవరాల్గా ఈ మ్యాచ్లో 60 బంతులు ఎదుర్కొన్న బట్లర్.. 9 ఫోర్లు, 6 సిక్స్లతో 107 పరుగులతో ఆజేయంగా నిలిచాడు. క్రిస్ గేల్ రికార్డు బద్దలు ఓవరాల్గా బట్లర్కు ఇది ఏడో ఐపీఎల్ సెంచరీ కావడం గమనార్హం. తద్వారా ఐపీఎల్లో అత్యధిక సెంచరీలు చేసిన రెండో ఆటగాడిగా బట్లర్ రికార్డులకెక్కాడు. ఈ క్రమంలో వెస్టిండీస్ దిగ్గజం గేల్(6 సెంచరీలు) రికార్డును జోస్ బ్రేక్ చేశాడు. ఐపీఎల్లో అత్యధిక సెంచరీలు చేసిన జాబితాలో తొలి స్ధానంలో ఆర్సీబీ స్టార్ విరాట్ కోహ్లి(8) ఉన్నాడు. ఆ తర్వాతి స్ధానంలో బట్లర్(7) నిలిచాడు. Like this tweet if u witnessed jos Buttler Alone warrior century knock Jos the boss you absolutely beauty #KKRvRR | #IPL2024 pic.twitter.com/EpWGnD1OOL — 𝑃𝑖𝑘𝑎𝑐ℎ𝑢☆•° (@11eleven_4us) April 16, 2024 -
కోహ్లి, బుమ్రా, రోహిత్ కాదు.. అతడే మా జట్టుకు ఆడాలి: బట్లర్
ఇండియన్ ప్రీమియర్ లీగ్(ఐపీఎల్) ఇంగ్లండ్ వైట్ బాల్ కెప్టెన్ జోస్ బట్లర్ రాజస్తాన్ రాయల్స్కు ప్రాతినిథ్యం వహిస్తున్న సంగతి తెలిసిందే. ఐపీఎల్-2018 సీజన్ నుంచి బట్లర్ రాజస్తాన్ జట్టులో కీలక ఆటగాడిగా కొనసాగుతున్నాడు. ఐపీఎల్-2023 సీజన్లో 863 పరుగులతో ఆరెంజ్ క్యాప్ హోల్డర్ కూడా నిలిచాడు. అయితే ప్రస్తుత సీజన్లో తొలి మూడు మ్యాచ్ల్లో ఇబ్బంది పడిన బట్లర్.. ఆర్సీబీతో మ్యాచ్లో సెంచరీ చేసి తన ఫామ్ను తిరిగి పొందాడు. శనివారం ముల్లానాపూర్ వేదికగా పంజాబ్ కింగ్స్తో మ్యాచ్లో కూడా సత్తాచాటాలని బట్లర్ ఊవ్విళ్లరుతున్నాడు. అయితే ఈ మ్యాచ్కు ముందు బట్లర్ తన సహచర ఆటగాడు ట్రెంట్ బౌల్ట్త్ కలిసి "రాయల్స్ ర్యాపిడ్ ఫైర్" అనే ఇంటర్వ్యూలో పాల్గోనున్నాడు. ఈ క్రమంలో బట్లర్కు అనూహ్యమైన ప్రశ్న ఎదురైంది. ప్రస్తుత ఐపీఎల్ క్రికెటర్లలో ఏ ఆటగాడు రాజస్తాన్ రాయల్స్ తరపున ఆడాలని మీరు కోరుకుంటున్నారు? అని బౌల్ట్ ప్రశ్నించాడు. అందుకు బట్లర్ ఏమీ ఆలోచించకుండా వెంటనే అఫ్గానిస్తాన్ స్టార్ స్పిన్నర్ రషీద్ ఖాన్ పేరు చెప్పాడు. ఇందుకు సంబంధించిన వీడియోను రాజస్తాన్ రాయల్స్ సోషల్ మీడియాలో షేర్ చేసింది. కాగా బట్లర్ టీమిండియా స్టార్ క్రికెటర్లు విరాట్ కోహ్లి, జస్ప్రీత్ బుమ్రా, రోహిత్ శర్మలను ఎంచుకోపోవడం అందరని విస్మయానికి గురిచేస్తోంది. From his favourite wicket to one player he would like at the Royals, here’s Jos and Boulty like never before 🔥😂 pic.twitter.com/F7524zWiQZ — Rajasthan Royals (@rajasthanroyals) April 12, 2024 -
IPL 2024: గేల్ రికార్డు సమం చేసిన బట్లర్.. రాహుల్ తర్వాత..!
ఐపీఎల్ 2024లో భాగంగా ఆర్సీబీతో నిన్న (ఏప్రిల్ 6) జరిగిన మ్యాచ్లో శతక్కొట్టడంతో (58 బంతుల్లో 100 నాటౌట్; 9 ఫోర్లు, 4 సిక్సర్లు) రాజస్థాన్ రాయల్స్ ఆటగాడు జోస్ బట్లర్ రికార్డుల్లోకెక్కాడు. ఐపీఎల్లో అత్యధిక సెంచరీలు చేసిన ఆటగాళ్ల జాబితాలో రెండో స్థానానికి ఎగబాకాడు. నిన్నటి సెంచరీతో క్యాష్ రిచ్ లీగ్లో సెంచరీల సంఖ్యను ఆరుకు పెంచుకున్న బట్లర్.. యూనివర్సల్ బాస్ క్రిస్ గేల్తో (6) కలిసి సంయుక్తంగా రెండో స్థానాన్ని షేర్ చేసుకున్నాడు. బట్లర్ తన వందో ఐపీఎల్ మ్యాచ్లో వంద కొట్టడం మరో విశేషం. ఐపీఎల్ చరిత్రలో బట్లర్కు ముందు కేఎల్ రాహుల్ మాత్రమే ఈ ఘనత సాధించాడు. రాహుల్ సైతం తన వందో మ్యాచ్లో శతక్కొట్టాడు. ఐపీఎల్లో అత్యధిక సెంచరీలు చేసిన రికార్డు ఆర్సీబీ ఆటగాడు విరాట్ కోహ్లి పేరిట ఉంది. బట్లర్ నిన్న సెంచరీ చేసిన మ్యాచ్లోనే విరాట్ కూడా సెంచరీ చేశాడు. ఈ సెంచరీతో విరాట్ ఐపీఎల్ సెంచరీల సంఖ్య ఎనిమిదికి చేరింది. మ్యాచ్ విషయానికొస్తే.. ఆర్సీబీపై రాజస్థాన్ రాయల్స్ 6 వికెట్ల తేడాతో విజయం సాధించింది. తొలుత బ్యాటింగ్ చేసిన ఆర్సీబీ విరాట్ కోహ్లి అజేయ సెంచరీతో (72 బంతుల్లో 113 నాటౌట్; 12 ఫోర్లు, 4 సిక్సర్లు) కదంతొక్కడంతో నిర్ణీత ఓవర్లలో 3 వికెట్ల నష్టానికి 183 పరుగులు చేసింది. డుప్లెసిస్ (44) రాణించాడు. ఈ మ్యాచ్లో విరాట్ తన సెంచరీ పూర్తి చేసేందుకు 67 బంతులు తీసుకుని విమర్శలపాలయ్యాడు. ఐపీఎల్ చరిత్రలో బంతుల పరంగా ఇది స్లోయెస్ట్ సెంచరీ కావడమే విరాట్పై విమర్శలకు కారణం. అశ్విన్ (4-0-28-0), చహల్ (4-0-34-2) కట్టుదిట్టంగా బౌలింగ్ చేయడంతో విరాట్ వేగంగా పరుగులు సాధించలేకపోయాడు. పిచ్ కూడా విరాట్ బ్యాటింగ్ సమయంలో స్పిన్నర్ల పక్షాన ఉండింది. అనంతరం 184 పరుగుల లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన రాయల్స్.. బట్లర్ సుడిగాలి శతకంతో విరుచుకపడటంతో మరో ఐదు బంతులు మిగిలుండగానే విజయతీరాలకు చేరింది. బట్లర్తో పాటు సంజూ శాంసన్ (42 బంతుల్లో 69; 8 ఫోర్లు, 2 సిక్సర్లు) రాణించాడు. రాయల్స్ విజయానికి ఆరు బంతుల్లో ఒక్క పరుగు చేయాల్సిన తరుణంలో బట్లర్ సిక్సర్తో సెంచరీ పూర్తి చేసి మ్యాచ్ను ముగించాడు. ఈ విజయంతో రాయల్స్ పాయింట్ల పట్టికలో అగ్రస్థానానికి ఎగబాకింది. తాజా ఓటమితో ఆర్సీబీ ఎనిమిదో స్థానానికి పడిపోయింది. -
IPL 2024: ఒక్కడు ఎంత కాలమని లాక్కొస్తాడు..సెంచరీ చేసినా చెత్త కామెంట్లే..!
ఐపీఎల్ 2024లో భాగంగా రాజస్థాన్ రాయల్స్తో నిన్న (ఏప్రిల్ 6) జరిగిన మ్యాచ్లో ఆర్సీబీ ఆటగాడు విరాట్ కోహ్లి అజేయ సెంచరీతో (72 బంతుల్లో 113 నాటౌట్; 12 ఫోర్లు, 4 సిక్సర్లు) మెరిసిన విషయం తెలిసిందే. ఈ సీజన్లో ఇదే మొదటి సెంచరీ. స్పిన్నర్లకు అనుకూలిస్తున్న పిచ్పై సెంచరీ చేసేందుకు విరాట్ చాలా కష్టపడ్డాడు. జట్టు ప్రయోజనాల దృష్ట్యా విరాట్ చివరి వరకు క్రీజ్లో నిలబడాలని భావిస్తే.. అది కాస్త మిస్ ఫైర్ అయ్యింది. విరాట్ సెంచరీ కోసం నిదానంగా ఆడాడంటూ గిట్టని వాళ్లు కామెంట్లు చేస్తున్నారు. జట్టు కోసం నిస్వార్దంగా బ్యాటింగ్ చేసి విమర్శలు ఎదుర్కొంటుండటంతో కోహ్లి అభిమానులు రంగంలోకి దిగారు. తమ ఆరాధ్య ఆటగాడిని టార్గెట్ చేస్తున్న వారిపై ఎదురుదాడికి దిగారు. 18 మ్యాచ్లు అయినా ఒక్కరు కూడా సాధించలేకపోతే విరాట్ సీజన్ తొలి సెంచరీ చేసి చూపించాడని, ఇది తమ ఆరాధ్య ఆటగాడి లెవెల్ అంటూ కామెంట్లు చేస్తున్నారు. స్లోగా బ్యాటింగ్ చేశాడని కామెంట్లు చూసే ముందు విరాట్ బ్యాటింగ్ చేసే సమయంలో పిచ్ ఎలా ఉందో తెలుసుకోవాలంటూ చురకలు అంటిస్తున్నారు. నిన్నటి మ్యాచ్ జరిగిన పిచ్పై 183 పరుగుల స్కోర్ డిఫెండ్ చేసుకోదగిందే అంటూ మెసేజ్లు చేస్తున్నారు. అయినా ఎంత కాలమని విరాట్ ఒక్కడు ఆర్సీబీ బండిని లాక్కొస్తాడని తమ ఆరాధ్య ఆటగాడిని ఆకాశానికెత్తుతున్నారు. ఈ సీజన్లో అప్పటివరకు ఎవరి వల్ల కాని సెంచరీని చేసి చూపించినా చెత్త కామెంట్లేనా అని మండిపడుతున్నారు. జట్టులోని మిగతా ఆటగాళ్లంతా సహకరిస్తే కోహ్లి వ్యక్తిగతంగా చేసిన స్కోర్తోనే (113) మ్యాచ్లు గెలవొచ్చంటూ ప్రగల్బాలు పలుకుతున్నారు. గిట్టని వారు చెబుతున్నట్లు విరాట్ ఇన్నింగ్స్ మరీ అంత నెమ్మదిగా ఏమీ సాగలేదని.. చెత్త బంతులను ప్రతి సందర్భంలోనూ విరాట్ చీల్చిచెండాడని గుర్తు చేస్తున్నారు. అద్భుతంగా బౌలింగ్ చేసినందుకు అశ్విన్, చహల్లకు, సూపర్ సెంచరీ చేసినందుకు బట్లర్కు క్రెడిట్ ఇవ్వాల్సింది పోయి విరాట్ను టార్గెట్ చేయడం విడ్డూరంగా ఉందని కామెంట్లు చేస్తున్నారు. కాగా, రాజస్థాన్ రాయల్స్తో నిన్న జరిగిన మ్యాచ్లో విరాట్ సెంచరీతో కదంతొక్కినా ఆర్సీబీ 6 వికెట్ల తేడాతో ఓటమిపాలైంది. ఛేదనలో జోస్ బట్లర్ మెరుపు వేగంతో సెంచరీ (58 బంతుల్లో 100 నాటౌట్; 9 ఫోర్లు, 4 సిక్సర్లు) చేసి రాయల్స్ను గెలిపించాడు. తొలుత బ్యాటింగ్ చేసిన ఆర్సీబీ విరాట్ సెంచరీతో చెలరేగడంతో నిర్ణీత ఓవర్లలో 3 వికెట్ల నష్టానికి 183 పరుగులు చేసింది. డుప్లెసిస్ (44) రాణించాడు. విరాట్ తన సెంచరీని 67 బంతుల్లో సాధించాడు. ఐపీఎల్ చరిత్రలో బంతుల పరంగా ఇది స్లోయెస్ట్ సెంచరీగా రికార్డైంది. అశ్విన్ (4-0-28-0), చహల్ (4-0-34-2) కట్టుదిట్టంగా బౌలింగ్ చేయండతో విరాట్ అనుకున్నంత వేగంగా పరుగులు రాబట్టలేకపోయాడు. ఈ విషయాన్ని కోహ్లి సైతం అంగీకరించాడు. అనంతరం 184 పరుగుల లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన రాయల్స్.. బట్లర్ సుడిగాలి శతకంతో విరుచుకపడటంతో మరో ఐదు బంతులు మిగిలుండగానే విజయతీరాలకు చేరింది. బట్లర్తో పాటు సంజూ శాంసన్ (42 బంతుల్లో 69; 8 ఫోర్లు, 2 సిక్సర్లు) రాణించాడు. -
RCB: ఫామ్లో ఉన్నా అతడిని ఎందుకు ఆడించలేదు?
రాజస్తాన్ రాయల్స్తో మ్యాచ్లో రాయల్ చాలెంజర్స్ బెంగళూరు జట్టు కూర్పు గురించి టీమిండియా మాజీ ఆల్రౌండర్ ఇర్ఫాన్ పఠాన్ కీలక వ్యాఖ్యలు చేశాడు. మహిపాల్ లామ్రోర్కు తుదిజట్టులో చోటు కల్పించకపోవడాన్ని తప్పుబట్టాడు. కాగా ఐపీఎల్-2024లో భాగంగా శనివారం రాజస్తాన్తో తలపడ్డ ఆర్సీబీకి భంగపాటు తప్పలేదు. జైపూర్లో జరిగిన ఈ మ్యాచ్లో ఆరు వికెట్ల తేడాతో ఆర్సీబీ ఓటమి పాలైంది. తద్వారా ఈ సీజన్లో నాలుగో ఓటమి నమోదు చేసింది. స్టార్ ఓపెనర్ విరాట్ కోహ్లి అజేయ శతకం(113)తో వృథాగా పోగా.. జోస్ బట్లర్ సెంచరీ(100- నాటౌట్) రాజస్తాన్ను గెలిపించింది. ఇదిలా ఉంటే ఈ మ్యాచ్ ద్వారా ఆర్సీబీ బ్యాటర్ సౌరవ్ చౌహాన్ ఐపీఎల్లో అడుగుపెట్టాడు. అయితే అరంగేట్రంలో ఈ గుజరాత్ ఆటగాడు ప్రభావం చూపలేకపోయాడు. #ICYMI Local lad and our brilliant leggie, Himanshu 🔁 Saurav#PlayBold #ನಮ್ಮRCB #IPL2024 #RRvRCB pic.twitter.com/05BczWmHJh — Royal Challengers Bengaluru (@RCBTweets) April 6, 2024 సౌరవ్ అరంగేట్రంలో ఇలా నాలుగో స్థానంలో బ్యాటింగ్కు దిగి మొత్తంగా ఆరు బంతులు ఎదుర్కొని కేవలం తొమ్మిది పరుగులు మాత్రమే చేసిన లెఫ్టాండర్ సౌరవ్.. యజువేంద్ర చహల్ బౌలింగ్లో వెనుదిరిగాడు. మరోవైపు.. ఇంపాక్ట్ ప్లేయర్గా నామినేట్ చేసిన మహిపాల్ లామ్రోర్ సేవలను ఉపయోగించుకోలేకపోయింది ఆర్సీబీ. 4⃣ wins in 4⃣ matches for the @rajasthanroyals 🩷 And with that victory, the move to the 🔝 of the Points Table 😎💪 Scorecard ▶️ https://t.co/IqTifedScU#TATAIPL | #RRvRCB pic.twitter.com/cwrUr2vmJN — IndianPremierLeague (@IPL) April 6, 2024 ఫామ్లో ఉన్నా అతడిని ఎందుకు ఆడించలేదు? ఈ విషయంపై స్పందించిన ఇర్ఫాన్ పఠాన్ ఆర్సీబీ వ్యూహాలపై పెదవి విరిచాడు. ‘‘ దేశవాళీ క్రికెట్లో మహిపాల్ లామ్రోర్ ఈ పిచ్పై ఎన్నో మ్యాచ్లు ఆడాడు. కానీ ఈరోజు అతడికి ఆర్సీబీ తుదిజట్టులో చోటు కల్పించలేదు. అతడు ఫామ్లోనే ఉన్నాడు కూడా! అయినా ఇలా ఎందుకు చేశారో తెలియదు. భారత కోచ్లు కూడా ఐపీఎల్ విషయాల్లో కాస్త జోక్యం చేసుకుంటే.. ఇలాంటి ప్రాథమిక తప్పిదాలు జరగవు. ప్రతిభ ఉన్నవాళ్లకు అవకాశాలు సన్నగిల్లుతున్నాయన్న దానికి ఇది కేవలం ఒక్క ఉదాహరణ మాత్రమే’’ అని ఇర్ఫాన్ పఠాన్ ఎక్స్ వేదికగా తన అభిప్రాయం పంచుకున్నాడు. ధనాధన్ ఇన్నింగ్స్ ఆడిన లామ్రోర్ కాగా రాజస్తాన్లోని నాగౌర్కు చెందిన లెఫ్టాండ్ బ్యాటర్ మహిపాల్ లామ్రోర్ ఐపీఎల్లో ఆర్సీబీకి ప్రాతినిథ్యం వహిస్తున్నాడు. ఇప్పటి వరకు క్యాష్ రిచ్ లీగ్లో 32 మ్యాచ్లు ఆడిన ఈ బ్యాటింగ్ ఆల్రౌండర్.. 452 పరుగులు చేశాడు. లెఫ్టార్మ్ ఆర్థోడాక్స్ బౌలర్ అయిన అతడు ఒక వికెట్ కూడా తీశాడు. ఇక ఈ సీజన్లో ఇప్పటి వరకు ఆర్సీబీ సాధించిన ఒకే ఒక్క విజయం(పంజాబ్పై)లోనూ లామ్రోర్ కీలక పాత్ర పోషించాడు. పంజాబ్ కింగ్స్తో మ్యాచ్లో కేవలం 8 బంతుల్లోనే 17 పరుగులతో మెరుపు ఇన్నింగ్స్ ఆడాడు. ఇక లక్నో సూపర్ జెయింట్స్తో మ్యాచ్లో 13 బంతుల్లోనే 33 రన్స్ చేశాడు. రాజస్తాన్ వర్సెస్ ఆర్సీబీ స్కోర్లు: ►వేదిక: జైపూర్.. సవాయి మాన్సింగ్ స్టేడియం ►టాస్: రాజస్తాన్.. బౌలింగ్ ►ఆర్సీబీ స్కోరు: 183/3 (20) ►రాజస్తాన్ స్కోరు: 189/4 (19.1) ►ఫలితం: ఆరు వికెట్ల తేడాతో ఆర్సీబీపై రాజస్తాన్ గెలుపు ►ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్: జోస్ బట్లర్(రాజస్తాన్). చదవండి: Virat Kohli: స్లో ఇన్నింగ్స్ అంటూ సెటైర్లు.. కోహ్లి స్పందన ఇదే -
స్లో ఇన్నింగ్స్ అంటూ సెటైర్లు.. కోహ్లి స్పందన ఇదే
ఐపీఎల్-2024లో సెంచరీ నమోదు చేసిన తొలి క్రికెటర్గా నిలిచాడు రాయల్ చాలెంజర్స్ బెంగళూరు బ్యాటర్ విరాట్ కోహ్లి. అంతేకాదు క్యాష్ రిచ్ లీగ్ చరిత్రలో 7500 పరుగుల మైలురాయి అందుకున్న తొలి క్రికెటర్గా రికార్డు సృష్టించాడు. రాజస్తాన్ రాయల్స్తో మ్యాచ్ సందర్భంగా శనివారం ఈ ఘనత సాధించాడు. కోహ్లి స్లో ఇన్నింగ్స్ ఇక మ్యాచ్ విషయానికొస్తే.. జైపూర్లోని సవాయి మాన్సింగ్ స్టేడియంలో టాస్ ఓడి తొలుత బ్యాటింగ్కు దిగింది ఆర్సీబీ. ఈ క్రమంలో ఓపెనర్ విరాట్ కోహ్లి 113 పరుగులతో ఆఖరి వరకు అజేయంగా నిలవగా.. మరో ఓపెనర్, కెప్టెన్ ఫాఫ్ డుప్లెసిస్ 44 పరుగులు సాధించాడు. వీరి తర్వాతి స్థానాల్లో బరిలోకి దిగిన గ్లెన్ మాక్స్వెల్(1), సౌరవ్ చౌహాన్(9) పూర్తిగా నిరాశపరిచారు. కామెరాన్ గ్రీన్ ఆరు బంతులు ఎదుర్కొని 5 పరుగులతో నాటౌట్గా ఉన్నాడు. ఫలితంగా నిర్ణీత 20 ఓవర్లలో మూడు వికెట్ల నష్టానికి ఆర్సీబీ 183 రన్స్ స్కోరు చేసింది. లక్ష్య ఛేదనకు దిగిన రాజస్తాన్ 19.1 ఓవర్లలోనే పని పూర్తి చేసి ఆరు వికెట్ల తేడాతో విజయం నమోదు చేసింది. ఇదిలా ఉంటే.. ఆర్సీబీ బ్యాటర్లలో కోహ్లి స్లో ఇన్నింగ్స్ ఫలితాన్ని ప్రభావితం చేసిందంటూ విమర్శలు వస్తున్నాయి. దూకుడుగా ఆడలేకపోయానని తెలుసు ఈ నేపథ్యంలో ఆర్సీబీ ఇన్నింగ్స్ అనంతరం విరాట్ కోహ్లి చేసిన వ్యాఖ్యలు వైరల్ అవుతున్నాయి. ‘‘చూసేందుకు వికెట్ కాస్త ఫ్లాట్గా అనిపించింది. కానీ మ్యాచ్ సాగుతున్న కొద్దీ పిచ్ స్వభావం మారిపోయింది. కాబట్టి మా(విరాట్/డుప్లెసిస్)లో ఒక్కరైనా ఆఖరి వరకు బ్యాటింగ్ చేయాలని భావించాం. ఈ పిచ్పై 183 రన్స్.. మెరుగైన స్కోరే అనిపిస్తోంది. ఇలాగే బ్యాటింగ్ చేయాలని నేనేమీ ముందే ప్రణాళికలు రచించుకోలేదు. నేను దూకుడుగా ఆడలేకపోయానని నాకు తెలుసు. బౌలర్ల వ్యూహాలను అంచనా వేసి అందుకు తగ్గట్లుగా బ్యాటింగ్ చేశాను. పరిస్థితులకు అనుగుణంగా పరిణతితో కూడిన ఇన్నింగ్స్ ఆడటం అవసరమని భావించా. ఈ పిచ్పై అలవోకగా పరుగులు రాబట్టడం బ్యాటర్లకు అంత సులువేమీ కాదు’’ అని విరాట్ కోహ్లి పేర్కొన్నాడు. యజువేంద్ర చహల్, రవిచంద్రన్ అశ్విన్ బౌలింగ్లో హిట్టింగ్ ఆడటం కుదరలేదని తెలిపాడు. కాగా రాజస్తాన్తో మ్యాచ్లో కోహ్లి 67 బంతుల్లో శతకం పూర్తి చేసుకున్నాడు. ఓవరాల్గా ఐపీఎల్ హిస్టరీలోనే ఇది స్లోయెస్ట్ సెంచరీ. ఇక ఇదే మ్యాచ్లో రాజస్తాన్ బ్యాటర్ జోస్ బట్లర్ 58 బంతుల్లోనే 100 పరుగుల మార్కు అందుకుని సిక్సర్తో జట్టును గెలిపించడం విశేషం. చదవండి: IPL 2024: నీకు ‘బడిత పూజ’ తప్పదు.. యువీ ‘ఫైర్’! var request = 'https://www.sakshi.com/knowwidget/kwstr_7522010156.json'; $.ajaxPrefilter( function (request) { if (request.crossDomain && jQuery.support.cors) { var http = (window.location.protocol === 'http:' ? 'http:' : 'https:'); request.url = http + '//cors-anywhere.herokuapp.com/' + request.url; } }); $.get( request,function (response){ if(response == ''){ $('#frameId').hide(); }else{ $('#frameId').show(); } }); Another day, another fifty for Virat Kohli 🫡 👑#RRvRCB #TATAIPL #IPLonJioCinema pic.twitter.com/3OrfdETaqE — JioCinema (@JioCinema) April 6, 2024 -
Virat Kohli: ఇంత స్వార్థమా?.. ఐపీఎల్ చరిత్రలో కోహ్లి చెత్త రికార్డు
మళ్లీ పాత కథే.. ఐపీఎల్-2024లో రాయల్ చాలెంజర్స్ బెంగళూరుకు మరో పరాజయం. రాజస్తాన్ రాయల్స్తో శనివారం జరిగిన మ్యాచ్లో ఆర్సీబీ ఆరు వికెట్ల తేడాతో ఓటమి పాలైంది. స్టార్ ఓపెనర్ విరాట్ కోహ్లి అజేయ శతకం(113) బాదినా జట్టును గెలిపించలేకపోయాడు. మరో ఓపెనర్, కెప్టెన్ ఫాఫ్ డుప్లెసిస్(44) తప్ప మిగతా బ్యాటర్లు పెద్దగా రాణించకపోవడం.. ‘మిగిలిన వాళ్లకు ఆడే అవకాశం రాకపోవడం’తో నిర్ణీత 20 ఓవర్లలో మూడు వికెట్ల నష్టానికి 183 పరుగులు చేసింది ఆర్సీబీ. అయితే, సొంతమైదానంలో లక్ష్య ఛేదనలో ఆరంభంలోనే ఓపెనర్ యశస్వి జైస్వాల్ డకౌట్గా వెనుదిరిగినా రాజస్తాన్ తిరిగి పుంజుకుంది. మరో ఓపెనర్ జోస్ బట్లర్(100 నాటౌట్) సెంచరీతో చెలరేగగా.. కెప్టెన సంజూ శాంసన్ హాఫ్ సెంచరీ(69)తో మెరిశాడు. వీరిద్దరి ఇన్నింగ్స్ కారణంగా మరో ఐదు బంతులు మిగిలి ఉండగానే టార్గెట్ పూర్తి చేసిన రాజస్తాన్ జయభేరి మోగించి వరుసగా నాలుగో గెలుపు అందుకుంది. ఇక ఆర్సీబీ ఖాతాలో మాత్రం నాలుగో ఓటమి చేరింది. 4⃣ wins in 4⃣ matches for the @rajasthanroyals 🩷 And with that victory, the move to the 🔝 of the Points Table 😎💪 Scorecard ▶️ https://t.co/IqTifedScU#TATAIPL | #RRvRCB pic.twitter.com/cwrUr2vmJN — IndianPremierLeague (@IPL) April 6, 2024 అయితే, ఈ మ్యాచ్లో సెంచరీ చేసినా విరాట్ కోహ్లిపై మాత్రం విమర్శల వర్షం కురుస్తోంది. కోహ్లి స్వార్థపూరిత ఇన్నింగ్స్ వల్లే ఆర్సీబీ 183 పరుగులకు పరిమితమైందని.. ఒకరకంగా జట్టు ఓటమికి అతడు కూడా కారణమే అని నెటిజన్లు మండిపడుతున్నారు. కాగా ఈ మ్యాచ్లో కోహ్లి 72 బంతుల్లో 113 పరుగులు సాధించాడు. అతడి ఇన్నింగ్స్లో 12 ఫోర్లు, 4 సిక్సర్లు ఉన్నాయి. నిజానికి కోహ్లి వంద పరుగుల మార్కు అందుకోవడానికి 67 బంతులు తీసుకున్నాడు. ఐపీఎల్ చరిత్రలో.. భారత గడ్డపై సెంచరీ కొట్టడానికి ఇన్ని బంతులు(స్లోయెస్ట్ సెంచరీ) తీసుకున్న తొలి క్రికెటర్గా చెత్త రికార్డు సృష్టించాడు. Another day, another fifty for Virat Kohli 🫡 👑#RRvRCB #TATAIPL #IPLonJioCinema pic.twitter.com/3OrfdETaqE — JioCinema (@JioCinema) April 6, 2024 ఓవరాల్గా మనీశ్ పాండే(2009- సెంచూరియన్)తో కలిసి సంయుక్తంగా ఈ రికార్డును పంచుకున్నాడు. ఈ నేపథ్యంలో కోహ్లిని పెద్ద ఎత్తున ట్రోల్ చేస్తున్నారు నెటిజన్లు. అంతేకాదు.. టీ20 క్రికెట్లో కోహ్లి యాభై కంటే ఎక్కువ బంతులు ఎదుర్కొన్న సందర్భాల్లో అతడి జట్టు 96 శాతం మ్యాచ్లు ఓడిపోయిందంటూ గణాంకాలు షేర్ చేస్తున్నారు. "I've still got it, I guess." ❤️#RRvRCB #TATAIPL #IPLonJioCinema #ViratKohli pic.twitter.com/XdO7AmVq5l — JioCinema (@JioCinema) April 6, 2024 అంతేకాదు.. సెల్ఫిష్ అంటూ కోహ్లిని ట్రెండ్ చేస్తున్నారు. రాజస్తాన్ రాయల్స్ సైతం.. ‘‘200 పరుగులకు పైగా స్కోరు సాధ్యమయ్యే చోట 184 కూడా పర్లేదులెండి!’’ అంటూ కోహ్లి ఇన్నింగ్స్పై సెటైర్లు వేసింది. -
IPL 2024 RR vs RCB: కోహ్లి సెంచరీ వృథా.. రాజస్తాన్ 4/4
జైపూర్: ఐపీఎల్లో రాజస్తాన్ రాయల్స్ అజేయంగా దూసుకెళ్తోంది. వరుసగా నాలుగో మ్యాచ్లోనూ ఆ జట్టు జయభేరి మోగించింది. శనివారం జరిగిన పోరులో రాజస్తాన్ 6 వికెట్ల తేడాతో రాయల్ చాలెంజర్స్ బెంగళూరును ఓడించింది. ముందుగా బెంగళూరు 20 ఓవర్లలో 3 వికెట్ల నష్టానికి 183 పరుగులు చేసింది. విరాట్ కోహ్లి (72 బంతుల్లో 113 నాటౌట్; 12 ఫోర్లు, 4 సిక్స్లు) ఐపీఎల్లో 8వ శతకం సాధించగా, కెప్టెన్ డుప్లెసిస్ (33 బంతుల్లో 44; 2 ఫోర్లు, 2 సిక్స్లు) రాణించాడు. అనంతరం రాజస్తాన్ 19.1 ఓవర్లలో 4 వికెట్లు కోల్పోయి 189 పరుగులు చేసి గెలిచింది. ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’ జోస్ బట్లర్ (58 బంతుల్లో 100 నాటౌట్; 9 ఫోర్లు, 4 సిక్స్లు) మెరుపు శతకం సాధించగా, కెప్టెన్ సంజూ సామ్సన్ (42 బంతుల్లో 69; 8 ఫోర్లు, 2 సిక్స్లు) రాణించాడు. ఫ్రాంచైజీకి చెందిన ‘రాయల్ రాజస్తాన్ ఫౌండేషన్’ చేపట్టిన ‘పింక్ ప్రామిస్’లో భాగంగా మహిళా సాధికారత ప్రచార కార్యక్రమం కోసం రాజస్తాన్ జట్టు నిలువెల్లా గులాబీ రంగు జెర్సీతో బరిలోకి దిగింది. కోహ్లి శతక్కొట్టాడు కానీ... బెంగళూరుకు ఓపెనర్లు విరాట్ కోహ్లి, డుప్లెసిస్ శుభారంభం ఇచ్చారు. దీంతో పవర్ప్లేలో జట్టు 53/0 స్కోరు చేసింది. ఓవర్లు గడుస్తున్న కొద్దీ బ్యాటర్లు పాతుకుపోయినా... పరుగుల వేగం మాత్రం అంతంతమాత్రంగానే సాగింది. కోహ్లి 39 బంతుల్లో అర్ధ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. 12వ ఓవర్లో బెంగళూరు స్కోరు వందకు చేరింది. అప్పటికీ ఓపెనింగ్ జోడీనే అజేయంగా ఉంది. సింహభాగం ఓవర్లు (14) ఇద్దరే ఆడారు. కానీ బ్యాటింగ్కు బాగా అనుకూలించిన పిచ్పై ధాటిని ప్రదర్శించలేకపోయారు. 14వ ఓవర్లో డుప్లెసిస్ నిష్క్ర మించడంతో 125 పరుగుల తొలి వికెట్ భాగస్వామ్యానికి తెరపడింది. హిట్టర్ మ్యాక్స్వెల్ (1), సౌరవ్ చౌహాన్ (9) నిరాశపరిచారు. గ్రీన్ (5 నాటౌట్) వచ్చినా... కోహ్లి 67 బంతుల్లోనే సెంచరీతో అజేయంగా నిలిచినా... డెత్ ఓవర్లలో బెంగళూరు పెద్దగా మెరిపించలేదు. 19వ ఓవర్లో 4 పరుగులు, 20వ ఓవర్లో 14 పరుగులు రావడంతో 200 మార్క్కు ఆమడ దూరంలో నిలిచింది. బట్లర్, సామ్సన్ ధనాధన్ జైస్వాల్ (0) ఇన్నింగ్స్ రెండో బంతికే డకౌట్ కావడంతో బెంగళూరు శిబిరం సంబరాల్లో మునిగింది. కానీ ఈ ఆనందం ఆవిరయ్యేందుకు ఎంతోసేపు పట్టలేదు. బట్లర్కు కెప్టెన్ సంజూ సామ్సన్ జతవడంతో చేజింగ్ చాలా సులువుగా సాగింది. మయాంక్ డాగర్ వేసిన 6వ ఓవర్ను పూర్తిగా ఆడిన బట్లర్ 4, 0, 4, 6, 4, 0లతో 20 పరుగులు పిండుకున్నాడు. పవర్ప్లేలో రాయల్స్ స్కోరు 54/1 తక్కువే అయినా అక్కడ్నుంచి ఇద్దరు దంచేసే పనిలో పడటంతో బౌండరీలు, సిక్సర్లు క్రమం తప్పకుండా వచ్చేశాయి. బట్లర్ 30 బంతుల్లో అర్ధసెంచరీ పూర్తి చేసుకోగా... కాసేపటికే సామ్సన్ ఫిఫ్టీ 33 బంతుల్లో పూర్తయింది. ఇద్దరి దూకుడు కొనసాగడంతో బంతులు, పరుగుల మధ్య అంతరం తగ్గిపోయింది. సామ్సన్ను ఎట్టకేలకు సిరాజ్ అవుట్ చేయగా... 148 పరుగుల రెండో వికెట్కు భాగస్వామ్యం ముగిసింది. తర్వాత పరాగ్ (4), జురెల్ (2) స్వల్ప వ్యవధిలోనే అవుటయ్యారు. కానీ అప్పటికే 18 బంతుల్లో 14 పరుగుల సమీకరణం రాజస్తాన్కు విజయాన్ని ఖాయం చేసింది. 6 బంతుల్లో పరుగు అవసరమైన చోట 94 పరుగుల వద్ద ఉన్న బట్లర్ సిక్సర్తో సెంచరీని, మ్యాచ్ను ఒకేసారి పూర్తి చేశాడు. స్కోరు వివరాలు రాయల్ చాలెంజర్స్ బెంగళూరు ఇన్నింగ్స్: కోహ్లి నాటౌట్ 113; డుప్లెసిస్ (సి) బట్లర్ (బి) చహల్ 44; మ్యాక్స్వెల్ (బి) బర్గర్ 1; సౌరవ్ (సి) జైస్వాల్ (బి) చహల్ 9; గ్రీన్ నాటౌట్ 5; ఎక్స్ట్రాలు 11; మొత్తం (20 ఓవర్లలో 3 వికెట్లకు) 183. వికెట్ల పతనం: 1–125, 2–128, 3–155. బౌలింగ్: బౌల్ట్ 3–0–30–0, బర్గర్ 4–0–33–1, అశ్విన్ 4–0–28–0, అవేశ్ఖాన్ 4–0–46–0, చహల్ 4–0–34–2, పరాగ్ 1–0–10–0. రాజస్తాన్ రాయల్స్ ఇన్నింగ్స్: జైస్వాల్ (సి) మ్యాక్స్వెల్ (బి) టాప్లీ 0; బట్లర్ నాటౌట్ 100; సామ్సన్ (సి) యశ్ (బి) సిరాజ్ 69; పరాగ్ (సి) కోహ్లి (బి) యశ్ 4; జురెల్ (సి) కార్తీక్ (బి) టాప్లీ 2; హెట్మైర్ నాటౌట్ 11; ఎక్స్ట్రాలు 3; మొత్తం (19.1 ఓవర్లలో 4 వికెట్లకు) 189. వికెట్ల పతనం: 1–0, 2–148, 3–155, 4–164. బౌలింగ్: టాప్లీ 4–0–27–2, యశ్ దయాళ్ 4–0–37–1, సిరాజ్ 4–0–35–1, మయాంక్ 2–0–34–0, గ్రీన్ 3.1–0–27–0, హిమాన్షు 2–0–29–0. ఐపీఎల్లో నేడు ముంబై X ఢిల్లీ వేదిక: ముంబై మధ్యాహ్నం 3: 30 గంటల నుంచి లక్నో X గుజరాత్ వేదిక: లక్నో రాత్రి 7: 30 గంటల నుంచి స్టార్ స్పోర్ట్స్, జియో సినిమా యాప్లో ప్రత్యక్ష ప్రసారం -
#Jos Buttler: ఇది కదా బట్లర్ అంటే.. సిక్స్తో సెంచరీ! వీడియో వైరల్
ఐపీఎల్-2024లో రాజస్తాన్ రాయల్స్ స్టార్ ఓపెనర్ జోస్ బట్లర్ ఎట్టకేలకు తన విశ్వరూపాన్ని ప్రదర్శించాడు. ఈ మెగా ఈవెంట్లో భాగంగా జైపూర్ వేదికగా రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుతో జరిగిన మ్యాచ్లో బట్లర్ అద్బుతమైన సెంచరీతో చెలరేగాడు. ఆర్సీబీ బౌలర్లకు చుక్కలు చూపించాడు. ఓపెనర్గా వచ్చిన బట్లర్ ఆఖరి వరకు క్రీజులో నిలబడి మ్యాచ్ను ఫినిష్ చేశాడు. రాజస్తాన్ విజయానికి కేవలం ఒక్క పరుగు కావల్సిన నేపథ్యంలో బట్లర్ సిక్స్ కొట్టి మ్యాచ్ను ముగించాడు. ఇదే సిక్స్తో తన సెంచరీ మార్క్ను కూడా అందుకున్నాడు. ఈ మ్యాచ్లో 58 బంతులు ఎదుర్కొన్న బట్లర్.. 9 ఫోర్లు, 4 సిక్స్లతో 100 పరుగులు చేసి ఆజేయంగా నిలిచాడు. బట్లర్కు ఇది ఆరో ఐపీఎల్ సెంచరీ కావడం గమనార్హం. ఐపీఎల్లో అత్యధిక సెంచరీలు చేసిన జాబితాలో బట్లర్ క్రిస్ గేల్తో కలిసి సంయుక్తంగా రెండో స్ధానంలో కొనసాగతున్నాడు. ఇక ఈ మ్యాచ్లో తొలుత బ్యాటింగ్ చేసిన ఆర్సీబీ నిర్ణీత 20 ఓవర్లలో 3 వికెట్ల నష్టానికి 183 పరుగులు చేసింది. ఆర్సీబీ బ్యాటర్లలో విరాట్ కోహ్లి సెంచరీతో మెరిశాడు. 72 బంతులు ఎదుర్కొన్న కింగ్ కోహ్లి.. 12 ఫోర్లు, 4 సిక్స్లతో 113 పరుగులు చేశాడు. అనంతరం 184 పరుగుల లక్ష్యాన్ని 19.1 ఓవర్లలో కేవలం 4 వికెట్లు మాత్రమే కోల్పోయి రాయల్స్ ఛేదించింది. రాజస్తాన్ బ్యాటర్లలో బట్లర్తో పాటు కెప్టెన్ సంజూ శాంసన్(69) పరుగులతో అదరగొట్టాడు. 4⃣ wins in 4⃣ matches for the @rajasthanroyals 🩷 And with that victory, the move to the 🔝 of the Points Table 😎💪 Scorecard ▶️ https://t.co/IqTifedScU#TATAIPL | #RRvRCB pic.twitter.com/cwrUr2vmJN — IndianPremierLeague (@IPL) April 6, 2024 -
ఆ జట్టు ఈసారి కూడా ప్లే ఆఫ్స్ చేరలేదంటే సిగ్గుచేటే!
"It's a shame if this team..: ఐపీఎల్-2024 ఆరంభానికి సమయం ఆసన్నమవుతోంది. మార్చి 22న ఈ మెగా ఈవెంట్కు చెన్నైలో తెరలేవనుంది. ఈ నేపథ్యంలో టీమిండియా మాజీ క్రికెటర్, కామెంటేటర్ ఆకాశ్ చోప్రా.. రాజస్తాన్ రాయల్స్ను ఉద్దేశించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. ‘‘రాజస్తాన్ రాయల్స్ మెరుగైన జట్టు అనడంలో ఎలాంటి సందేహం లేదు. జోస్ బట్లర్, యశస్వి జైస్వాల్.. సంజూ శాంసన్, ధ్రువ్ జురెల్, షిమ్రన్ హెట్మెయిర్, రియాన్ పరాగ్.. వీరితో బ్యాటింగ్ విభాగం పటిష్టంగా కనిపిస్తోంది. ఇక రోవ్మన్ పావెల్తో పాటు రవిచంద్రన్ అశ్విన్, యుజువేంద్ర చహల్, ఆడం జంపా, ట్రెంట్ బౌల్ట్ కూడా ఉండనే ఉన్నారు. విదేశీ ప్లేయర్లలో చాలా మందికి తుదిజట్టులో ఆడే అవకాశం రాదన్న మాట నిజమే. అయితే, జట్టుకు అవసరాలకు అనుగుణంగా ఒక్కొక్కరికి ఒక్కోసారైనా ఛాన్స్ దక్కుతుంది. ఇప్పుడిక ఆవేశ్ ఖాన్ కూడా రాయల్స్తో చేరాడు. వీళ్లందరినీ చూస్తుంటే ఈ జట్టు ట్రోఫీ గెలుస్తుందని భావిస్తుందని అనుకోవచ్చా? అంటే కచ్చితంగా అవుననే అంటాను. అయితే, గత సీజన్లో తాము ఇంపాక్ట్ ప్లేయర్ను వాడదలచుకోలేదని రాయల్స్ చెప్పింది. ఈసారి మాత్రం వాళ్లు ఇంపాక్ట్ ప్లేయర్ను ఎలా ఉపయెగించుకుంటుందన్న అంశం మీద విజయావకాశాలు ఆధారపడి ఉంటాయి. ఇంత మంచి జట్టు ఉన్నా.. ఒకవేళ రాయల్స్ గనుక ఈసారి కనీసం ప్లే ఆఫ్స్ కూడా చేరలేదంటే నిజంగా అది సిగ్గుచేటే’’ అని ఆకాశ్ చోప్రా తన యూట్యూబ్ చానెల్ వేదికగా అభిప్రాయాలు పంచుకున్నాడు. కాగా ఐపీఎల్-2022 సీజన్లో ఫైనల్ వరకు వెళ్లిన రాజస్తాన్ రాయల్స్ ఆఖరి మెట్టుపై గుజరాత్ టైటాన్స్ చేతిలో ఓడిపోయింది. ఇక గతేడాది ప్లే ఆఫ్స్(టాప్-4) కూడా చేరలేక ఐదో స్థానంతో సరిపెట్టుకుంది. రాజస్తాన్ రాయల్స్ 2024 జట్టు సంజూ శాంసన్ (కెప్టెన్), జోస్ బట్లర్, షిమ్రాన్ హిట్మెయిర్, యశస్వి జైస్వాల్, ధ్రువ్ జురెల్, రియాన్ పరాగ్, డోనోవన్ ఫెరీరా, కునాల్ రాథోడ్, రవిచంద్రన్ అశ్విన్, కుల్దీప్ సేన్, నవదీప్ సైనీ, ప్రసిద్ధ్ కృష్ణ, సందీప్ శర్మ, ట్రెంట్ బౌల్ట్, యజువేంద్ర చాహల్, ఆడమ్ జంపా, రోవ్మన్ పావెల్, శుభమ్ దూబే, టామ్ కోహ్లర్ కాడ్మోర్, నండ్రే బర్గర్, అబిద్ ముస్తాక్, అవేశ్ ఖాన్ (లక్నో సూపర్ జెయింట్స్ నుంచి స్వాపింగ్). చదవండి: Anant- Radhika: రోహిత్ తిరుగు పయనం.. భయ్యాకు కోపం వచ్చిందంటే! -
IPL 2024: కోహ్లి, గిల్ కాదు!.. ఈసారి ఆరెంజ్ క్యాప్ అతడిదే!
మరికొన్ని రోజుల్లో ఐపీఎల్-2024 సందడి మొదలుకానుంది. చెన్నై వేదికగా మార్చి 22న ఈ మెగా టోర్నీకి తెరలేవనుంది. తాజా ఎడిషన్లో డిఫెండింగ్ చాంపియన్ చెన్నై సూపర్ కింగ్స్- రాయల్ చాలెంజర్స్ బెంగళూరు మధ్య తొలి మ్యాచ్ జరుగనుంది. ఈ నేపథ్యంలో ఇప్పటికే పది ఫ్రాంఛైజీల ఆటగాళ్లందరూ పూర్తిస్థాయిలో సన్నద్ధమవుతున్నారు. జాతీయ జట్టు షెడ్యూల్తో బిజీగా ఉన్న వాళ్లు మినహా మిగతా వాళ్లంతా ఐపీఎల్ జట్ల శిక్షణా శిబిరంలో చేరి.. ప్రాక్టీస్ మొదలుపెట్టేశారు. ఇక ఎప్పటిలాగే.. ఈ సీజన్ ఆరంభానికి ముందు కూడా.. ఈసారి ఆరెంజ్ క్యాప్ విజేత ఎవరు? పర్పుల్ క్యాప్ గెలిచేది ఎవరు? చాంపియన్గా నిలిచేది ఏ జట్టు? అంటూ అభిమానులు తమ అంచనాలు తెలియజేస్తున్నారు. సోషల్ మీడియా వేదికగా అభిప్రాయాలు పంచుకుంటున్నారు. ఈ నేపథ్యంలో టీమిండియా వెటరన్ స్పిన్నర్ యజువేంద్ర చహల్కు ఇలాంటి ప్రశ్నలు ఎదురుకాగా.. ఆసక్తికర సమాధానాలు ఇచ్చాడు. ఓ యూట్యూబ్ చానెల్కు ఇచ్చిన ఇంటర్వ్యూలో చహల్ మాట్లాడుతూ.. ‘‘ఈసారి ఆరెంజ్ క్యాప్ను యశస్వి జైస్వాల్ లేదంటే జోస్ బట్లర్ గెలుస్తాడు. ఇక పర్పుల్ క్యాప్ విషయానికొస్తే.. ఈసారి అత్యధిక వికెట్లు తీసేది నేనే.. నా తర్వాతి స్థానంలో రషీద్ ఖాన్ ఉంటాడు’’ అని పేర్కొన్నాడు. ఈ మేరకు అత్యధిక పరుగుల వీరుడిగా టీమిండియా స్టార్ ఓపెనర్, రాజస్తాన్ రాయల్స్ ఓపెనర్ యశస్వి జైస్వాల్ పేరును చెప్పాడు చహల్. యజువేంద్ర చహల్- బట్లర్, జైస్వాల్(PC: RR/IPL) అదే విధంగా.. రాయల్స్లో మరో సహచర ఆటగాడు, ఇంగ్లండ్ కెప్టెన్ జోస్ బట్లర్కు కూడా ఆరెంజ్ క్యాప్ గెలిచే ఛాన్స్ ఉందని అభిప్రాయపడ్డాడు. అయితే, అత్యధిక వికెట్లు పడగొట్టి పర్పుల్ క్యాప్ మాత్రం తానే గెలుస్తానని చహల్ ధీమా వ్యక్తం చేయడం గమనార్హం. కాగా ఐపీఎల్లో విజయవంతమైన బౌలర్గా యజువేంద్ర చహల్ పేరొందాడు. చాలా ఏళ్లపాటు రాయల్ చాలెంజర్స్ బెంగళూరుకు ఆడిన చహల్.. రెండేళ్ల క్రితం రాజస్తాన్ రాయల్స్కు మారాడు. ఈ క్రమంలో ఐపీఎల్-2023లో 14 మ్యాచ్లలో కలిపి 21 వికెట్లు తీశాడీ మణికట్టు స్పిన్నర్. తద్వారా క్యాష్ రిచ్ లీగ్లో అత్యధిక వికెట్లు(187) తీసిన బౌలర్గా చరిత్ర సృష్టించాడు. అయితే, టీమిండియాలో మాత్రం చహల్కు అవకాశాలు సన్నగిల్లాయి. ఇటీవలే సెంట్రల్ కాంట్రాక్టు కూడా కోల్పోయాడతడు! ఇదిలా ఉంటే.. ఐపీఎల్-2023లో గుజరాత్ టైటాన్స్ స్టార్ శుబ్మన్ గిల్ 890 పరుగులతో టాప్ స్కోరర్గా నిలిచి ఆరెంజ్ క్యాప్ అందుకున్నాడు. ఆర్సీబీ స్టార్ ఫాఫ్ డుప్లెసిస్ 730, సీఎస్కే ఓపెనర్ డెవాన్ కాన్వే 672, ఆర్సీబీ ముఖచిత్రం విరాట్ కోహ్లి 639 పరుగులతో తర్వాతి స్థానాల్లో నిలిచారు. చదవండి: #DhanashreeVerma: పదే పదే ఇలా ఎందుకు? చహల్ భార్య ధనశ్రీ వర్మ ఫొటోపై రచ్చ -
విధ్వంసం సృష్టించిన జోస్ బట్లర్.. కొనసాగుతున్న రాయల్స్ జైత్రయాత్ర
సౌతాఫ్రికా టీ20 లీగ్లో పార్ల్ రాయల్స్ జైత్రయాత్ర కొనసాగుతుంది. జోబర్గ్ సూపర్ కింగ్స్తో నిన్న (జనవరి 17) జరిగిన మ్యాచ్లో రాయల్స్ ఆటగాడు జోస్ బట్లర్ విశ్వరూపం ప్రదర్శించాడు. కేవలం 37 బంతుల్లోనే 8 ఫోర్లు, 3 సిక్సర్ల సాయంతో అజేయమైన 70 పరుగులు చేసి తన జట్టును గెలిపించాడు. ఈ మ్యాచ్లో తొలుత బ్యాటింగ్ చేసిన సూపర్ కింగ్స్.. లుంగి ఎంగిడి (3/17), ఓబెద్ మెక్కాయ్ (2/31) ధాటికి 19.5 ఓవర్లలో 134 పరుగులకే కుప్పకూలింది. డు ప్లూయ్ (71) మెరుపు ఇన్నింగ్స్ ఆడకపోయుంటే సూపర్ కింగ్స్ ఈ మాత్రం స్కోరైనా చేసుండేది కాదు. రీజా హెండ్రిక్స్ (8), డుప్లెసిస్ (10), మొయిన్ అలీ (18), డొనొవన్ ఫెరియెరా (5), రొమారియో షెపర్డ్ (0) నిరాశపరిచారు. అనంతరం స్వల్ప లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన రాయల్స్.. బట్లర్తో పాటు విహాన్ లుబ్బే (39) రాణించడంతో 14.1 ఓవర్లలో కేవలం 3 వికెట్లు మాత్రమే కోల్పోయి విజయతీరాలకు చేరింది. జేసన్ రాయ్ (5), డేవిడ్ మిల్లర్ (2) తక్కువ స్కోర్లకే ఔటయ్యారు. సూపర్ కింగ్స్ బౌలర్లలో లిజాడ్ విలియమ్స్, మొయిన్ అలీ, ఇమ్రాన్ తాహిర్ తలో వికెట్ పడగొట్టారు. సూపర్ కింగ్స్పై విజయంతో రాయల్స్ ఈ సీజన్లో వరుసగా మూడో విజయాన్ని నమోదు చేసి, పాయింట్ల పట్టికలో అగ్రస్థానంలో కొనసాగుతుంది. -
ఇంగ్లండ్ వెన్ను విరిచిన మోటీ.. సిరీస్ విండీస్దే..!
ట్రినిడాడ్ వేదికగా ఇంగ్లండ్తో జరిగిన నిర్ణయాత్మక ఐదో టీ20లో వెస్టిండీస్ 4 వికెట్ల తేడాతో గెలుపొంది, 3-2 తేడాతో సిరీస్ కైవసం చేసుకుంది. ఈ మ్యాచ్లో తొలుత బ్యాటింగ్ చేసిన ఇంగ్లండ్.. గుడకేశ్ మోటీ (4-0-24-3), ఆండ్రీ రసెల్ (4-0-25-2), అకీల్ హొసేన్ (4-0-20-2),హోల్డర్ (3.3-0-24-2) ధాటికి 19.3 ఓవర్లలో 132 పరుగులకే ఆలౌటైంది. ఇంగ్లండ్ ఇన్నింగ్స్లో ఫిలిప్ సాల్ట్ (38) టాప్ స్కోరర్గా నిలువగా.. లివింగ్స్టోన్ (28), మొయిన్ అలీ (23) ఓ మోస్తరు స్కోర్లు చేశారు. అనంతరం స్వల్ప లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన వెస్టిండీస్.. 19.2 ఓవర్లలో 6 వికెట్లు కోల్పోయి విజయతీరాలకు చేరుకుంది. జాన్సన్ ఛార్లెస్ (27), షెర్ఫాన్ రూథర్ఫోర్డ్ (30) సాయంతో షాయ్ హోప్ (43 నాటౌట్) విండీస్ను గెలిపించాడు. ఇంగ్లండ్ బౌలర్లలో రీస్ టాప్లే, ఆదిల్ రషీద్ తలో 2 వికెట్లు పడగొట్టగా.. క్రిస్ వోక్స్, సామ్ కర్రన్ తలో వికెట్ దక్కించుకున్నారు. 3 వికెట్లు తీసి ఇంగ్లండ్ వెనువిరిచిన మోటీకి ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు లభించగా.. సిరీస్ ఆధ్యాంతం అద్భుతంగా రాణించిన (వరుసగా రెండు సెంచరీలు) ఫిలిప్ సాల్ట్కు ప్లేయర్ ఆఫ్ ద సిరీస్ అవార్డు దక్కింది. కాగా, 3 వన్డేలు, 5 మ్యాచ్ల టీ20 సిరీస్ కోసం కరీబియన్ దీవుల్లో పర్యటించిన ఇంగ్లండ్.. వరుసగా రెండు సిరీస్లను కోల్పోయింది. వన్డే సిరీస్ను 1-2 తేడాతో కోల్పోయిన ఇంగ్లండ్.. టీ20 సిరీస్లో అద్భుతంగా రాణించినప్పటికీ సిరీస్ను చేజార్చుకుంది. -
IND VS SA 3rd ODI: సంజూ సెంచరీ.. బట్లర్ ఏం చేశాడో చూడండి..!
ఇంగ్లండ్ పరిమత ఓవర్ల జట్టు కెప్టెన్ జోస్ బట్లర్ తన ఐపీఎల్ జట్టు (రాజస్థాన్ రాయల్స్) సారధి సంజూ శాంసన్పై ఉన్న ప్రేమను ప్రత్యేకంగా చాటుకున్నాడు. సౌతాఫ్రికాతో ఇవాళ (డిసెంబర్ 21) జరుగుతున్న మూడో వన్డేలో సంజూ సెంచరీ (108) సాధించగా.. బట్లర్ తన కెప్టెన్ సాధించిన ఘనతను, అలాగే మరో రాయల్ (చహల్) కెప్టెన్ను అభినందిస్తున్న దృశ్యాన్ని తన ఇన్స్టా స్టోరీగా పోస్ట్ చేశాడు. బట్లర్ ఈ పోస్ట్ చేసిన నిమిషాల వ్యవధిలోనే వైరల్గా మారింది. Jos Buttler's Instagram story for Sanju Samson. pic.twitter.com/uSBAcKKCTZ — Mufaddal Vohra (@mufaddal_vohra) December 21, 2023 బట్లర్.. తన ఐపీఎల్ సహచరుడు సాధించిన ఘనతను సెలబ్రేట్ చేసుకోవడంపై భారత క్రికెట్ అభిమానులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. సంజూతో సమానంగా బట్లర్ను కూడా అభినందనలతో ముంచెత్తుతున్నారు. రాయల్స్కు తమ కెప్టెన్పై ఉన్న ప్రత్యేకమైన అభిమానానికి ఫిదా అవుతున్నారు. The hundred moment of Sanju Samson. 🔥pic.twitter.com/WjWODyjF3p — Johns. (@CricCrazyJohns) December 21, 2023 మ్యాచ్ విషయానికొస్తే.. సిరీస్ డిసైడర్లో క్లిష్టమైన పిచ్పై జట్టు కషాల్లో (49/2) ఉన్నప్పుడు క్రీజ్లోకి వచ్చిన సంజూ.. తన కెరీర్లో అత్యుత్తమ ఇన్నింగ్స్ ఆడి టీమిండియాకు భారీ స్కోర్ను అందించాడు. టాస్ ఓడి తొలుత బ్యాటింగ్కు దిగిన టీమిండియా సంజూ శతక్కొట్టడంతో నిర్ణీత 50 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 296 పరుగులు చేసింది. సంజూతో పాటు తిలక్ వర్మ (52) కూడా బాధ్యతాయుతమైన ఇన్నింగ్స్ ఆడాడు. ఆఖర్లో రింకూ సింగ్ (38) తనదైన స్టయిల్లో మెరుపులు మెరిపించాడు. Celebration by Sanju Samson after completing his maiden International hundred. 💪🫡 pic.twitter.com/fuHEwz0RPw — Johns. (@CricCrazyJohns) December 21, 2023 The way Yuzi Chahal celebrated the hundred of Sanju Samson. 👏 pic.twitter.com/XrC4hNxgXK — Johns. (@CricCrazyJohns) December 21, 2023 -
IPL 2024: సంజూను కెప్టెన్గా తప్పించాల్సిందే: శ్రీశాంత్ విమర్శలు
IPL 2024: ఐపీఎల్-2024 సీజన్లో రాజస్తాన్ రాయల్స్ అనుకున్న ఫలితాలు రాబట్టాలనుకుంటే కెప్టెన్ను మార్చాలని భారత మాజీ బౌలర్ శ్రీశాంత్ అన్నాడు. సంజూ శాంసన్కు నిలకడలేదని.. అతడిని సారథ్య బాధ్యతల నుంచి తప్పించాలని సూచించాడు. రాయల్స్కు రోహిత్ శర్మ వంటి అనుభవజ్ఞుడైన నాయకుడి అవసరం ఉందని అభిప్రాయపడ్డాడు. కాగా కేరళ వికెట్ కీపర్ సంజూ శాంసన్ 2021 నుంచి రాజస్తాన్ రాయల్స్ సారథిగా పగ్గాలు చేపట్టిన విషయం తెలిసిందే. గత మూడు ఎడిషన్లలో మొత్తంగా 45 మ్యాచ్లకు కెప్టెన్గా వ్యవహరించిన ఈ టీమిండియా బ్యాటర్.. 22 మ్యాచ్లు గెలిపించాడు. గతేడాది సంజూ నాయకత్వంలోనే.. దాదాపు పద్నాలుగేళ్ల తర్వాత రాయల్స్ తొలిసారి ఫైనల్ చేరింది. అయితే, తాజా ఎడిషన్లో మాత్రం ప్లే ఆఫ్స్ చేరడంలోనూ విఫలమైంది. ఇదిలా ఉంటే.. ఐపీఎల్-2024 సీజన్కు ముందు పలు ఫ్రాంఛైజీలు ఇప్పటికే తమ కెప్టెన్లను మారుస్తున్న విషయం తెలిసిందే. టీమిండియా స్టార్ శ్రేయస్ అయ్యర్ తిరిగి కేకేఆర్ కెప్టెన్గా బాధ్యతలు స్వీకరించనుండగా.. ఓపెనర్ శుబ్మన్ గిల్ గుజరాత్ టైటాన్స్ సారథి అయ్యాడు. తాజాగా ముంబై ఇండియన్స్ రోహిత్ శర్మను తప్పించి హార్దిక్ పాండ్యాకు బాధ్యతలు అప్పగించింది. ఈ నేపథ్యంలో కేరళ మాజీ పేసర్ శ్రీశాంత్ చేసిన వ్యాఖ్యలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి. ఈ మేరకు.. ‘‘నా అభిప్రాయం ప్రకారం రాజస్తాన్ రాయల్స్ సిస్టం మొత్తాన్ని పూర్తిగా మార్చివేయాలి. ముఖ్యంగా చాలా మంది ఆటగాళ్లను మార్చాలి. నేను రాజస్తాన్కు ఆడినపుడు మేనేజ్మెంట్ అన్ని విషయాల్లో జాగ్రత్త వహించేది. అప్పుడు రాహుల్ ద్రవిడ్ భాయ్ కెప్టెన్. సారథిగా జట్టును ఎలా ముందుకు నడిపించాలన్న అంశం పట్ల ఆయనకు పూర్తిగా అవగాహన ఉండేది. మైదానంలో ఎలాంటి ప్రణాళికలు అమలు చేయలన్న విషయంలో వ్యూహాత్మకంగా వ్యవహరించేవాడు. ఇప్పుడు ఆ జట్టుకు సంజూ కెప్టెన్గా ఉన్నాడు. అయితే, తను కెప్టెన్సీని సీరియస్గా తీసుకోవాలి. నాకెందుకో జోస్ బట్లర్ని కెప్టెన్ చేస్తే బాగుంటుందనిపిస్తోంది. అతడికి టీ20 వరల్డ్కప్ గెలిచిన రికార్డు ఉంది. వన్డే వరల్డ్కప్-2023లో అతడు బాగా ఆడకపోయాడన్న మాట వాస్తవమే. అయితే, కెప్టెన్గా తనకున్న అనుభవం జట్టుకు ఉపయోగపడుతుంది. లేదంటే.. నిలకడైన ప్రదర్శనతో ముందుకు సాగుతున్న ఆటగాడి వైపు రాయల్స్ చూడాలి. రోహిత్ శర్మ లాంటి నాయకుడి అవసరం జట్టుకు ఉంది. టీమ్ను గెలిపించే కెప్టెన్ కావాలి, అంతేగానీ రెండు మ్యాచ్లు గెలిచి నాలుగు మ్యాచ్లు ఓడిపోయేవాళ్ల వల్ల పెద్దగా ఉపయోగం ఉండదు’’ అంటూ శ్రీశాంత్ పరోక్షంగా సంజూ శాంసన్ను విమర్శించాడు. అమావాస్య- పున్నానికోసారి ఆడే వాళ్లను కెప్టెన్గా ఉంచితే ఫలితం ఉండదని ఘాటు వ్యాఖ్యలు చేశాడు. ఇదిలా ఉంటే.. రాయల్స్కు ఆడిన సమయంలోనే శ్రీశాంత్ మీద ఫిక్సింగ్ ఆరోపణలు వచ్చిన విషయం తెలిసిందే. చదవండి: IPL 2024: ఇలా చేయడానికి సిగ్గుండాలంటూ ఫైర్!.. పోస్ట్ డిలీట్ చేసిన సూర్య భార్య -
ఇంగ్లండ్కు ఏమైంది..? విండీస్ చేతిలో మరో ఘోర పరభావం
వెస్టిండీస్ గడ్డపై ఇంగ్లండ్కు మరో పరాభావం ఎదురైంది. గ్రెనడా వేదికగా విండీస్తో జరిగిన రెండో టీ20లో 10 పరుగుల తేడాతో ఇంగ్లండ్ ఓటమి పాలైంది. దీంతో ఐదు మ్యాచ్ల సిరీస్లో 2-0తో బట్లర్ సేన వెనకంజలో ఉంది. 177 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన ఇంగ్లండ్ నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్లు కోల్పోయి 166 పరుగులు మాత్రమే చేసింది. ఇంగ్లీష్ జట్టు బ్యాటర్లలో సామ్ కుర్రాన్(50) పరుగులతో టాప్ స్కోరర్గా నిలిచాడు. ఇక కరేబియన్ బౌలర్లలో అల్జారీ జోసెఫ్ 3వికెట్లతో అదరగొట్టగా.. అకేల్ హోసేన్ రెండు, హొల్డర్, మోటీ తలా వికెట్ పడగొట్టారు. బ్రాండెన్ కింగ్ విధ్వంసం.. టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన విండీస్ నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 176 పరుగులు చేసింది. విండీస్ బ్యాటర్లలో ఓపెనర్ బ్రాండెన్ కింగ్ విధ్వంసకర ఇన్నింగ్స్ ఆడాడు. 52 బంతుల్లో 8 ఫోర్లు, 5 సిక్స్లతో 82 పరుగులు చేసి ఆజేయంగా నిలిచాడు. అతడితో పాటు కెప్టెన్ పావెల్(28 బంతుల్లో 52) అద్భుత ఇన్నింగ్స్తో అలరించాడు. ఇంగ్లండ్ బౌలర్లలో అదిల్ రషీద్, మిల్స్ తలా రెండు వికెట్లు పడగొట్టగా.. వోక్స్, కుర్రాన్, అహ్మద్ చెరో వికెట్ సాధించారు. ఇక ఇరు జట్ల మధ్య మూడో టీ20 డిసెంబర్ 16న గ్రెనిడా వేదికగానే జరగనుంది. అయితే టీ20ల్లో అద్బుత రికార్డు ఉన్న ఇంగ్లండ్ ఈ తరహా ప్రదర్శన కనబరుస్తుండడం అభిమానులు జీర్ణించుకోలేకపోతున్నారు. కనీసం మూడో టీ20లో అయినా గెలిచి కమ్బ్యాక్ ఇవ్వాలని ఇంగ్లండ్ ఫ్యాన్స్ ఆశిస్తున్నారు. కాగా ఇప్పటికే విండీస్తో వన్డే సిరీస్ను ఇంగ్లండ్ కోల్పోయిన సంగతి తెలిసిందే. చదవండి: IND vs SA: చరిత్ర సృష్టించిన సూర్యకుమార్.. ప్రపంచంలో ఒకే ఒక్కడు -
రీఎంట్రీలో రసెల్ బ్యాటింగ్ విధ్వంసం.. విండీస్ చేతిలో ఇంగ్లండ్ చిత్తు
West Indies vs England, 1st T20I: వెస్టిండీస్ క్రికెటర్ ఆండ్రీ రసెల్ జాతీయ జట్టులో పునరాగమనాన్ని ఘనంగా చాటాడు. ఇంగ్లండ్తో తొలి టీ20లో అద్భుత ప్రదర్శనతో ఆకట్టుకున్నాడు. తొలుత బంతితో చెలరేగిన ఈ ఆల్రౌండర్.. అనంతరం లక్ష్య ఛేదనలో విధ్వంసకర ఇన్నింగ్స్తో విరుచుకుపడ్డాడు. ఇంగ్లండ్ బౌలర్ల ఎత్తులను చిత్తు చేస్తూ ధనాధన్ బ్యాటింగ్తో జట్టును విజయతీరాలకు చేర్చాడు. తద్వారా ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్గా నిలిచి రీఎంట్రీ అదుర్స్ అనిపించాడు. కాగా మూడు వన్డే, ఐదు టీ20 మ్యాచ్ల సిరీస్ ఆడేందుకు ఇంగ్లండ్ వెస్టిండీస్ పర్యటనకు వెళ్లింది. మూడు వికెట్లు పడగొట్టిన రసెల్ ఈ క్రమంలో వన్డే సిరీస్ను 2-1తో గెలిచి ఇంగ్లిష్ జట్టుకు షాకిచ్చిన వెస్టిండీస్.. టీ20 సిరీస్ను విజయంతో ఆరంభించి సత్తా చాటింది. బార్బడోస్ వేదికగా బుధవారం తెల్లవారుజామున జరిగిన మ్యాచ్లో టాస్ గెలిచిన విండీస్ తొలుత బౌలింగ్ ఎంచుకుంది. ఈ నేపథ్యంలో ఆతిథ్య జట్టు ఆహ్వానం మేరకు బ్యాటింగ్కు దిగిన ఇంగ్లండ్ 19.3 ఓవర్లలో 171 పరుగులు చేసి ఆలౌట్ అయింది. ఓపెనర్లు ఫిలిప్ సాల్ట్ 20 బంతుల్లో 40, జోస్ బట్లర్ 31 బంతుల్లో 39 పరుగులతో శుభారంభం అందించగా.. మిగతా వాళ్లలో లియామ్ లివింగ్ స్టోన్(27) ఒక్కడే ఇరవై పరుగుల పైచిలుకు స్కోరు రాబట్టాడు. కరేబియన్ బౌలర్ల ధాటికి మిగిలిన ఇంగ్లిష్ బ్యాటర్లంతా చేతులెత్తేశారు. ఇక ఇంగ్లండ్ ఇన్నింగ్స్లో పేస్ ఆల్రౌండర్ ఆండ్రీ రస్సెల్, మరో ఫాస్ట్బౌలర్ అల్జారీ జోసెఫ్ చెరో మూడు వికెట్లు పడగొట్టారు. మిగిలిన వాళ్లలో పేసర్లు జేసన్ హోల్డర్ ఒకటి, రొమారియో షెఫర్డ్ రెండు వికెట్లు కూల్చారు. ఇక స్పిన్నర్ అకీల్ హొసేన్కు ఒక వికెట్ దక్కింది. Unstoppable Russell Mania! . .#WIvENG #WIvENGonFanCode pic.twitter.com/VjbBCJMMIV — FanCode (@FanCode) December 13, 2023 పావెల్ కెప్టెన్ ఇన్నింగ్స్.. ఈ క్రమంలో లక్ష్య ఛేదనకు దిగిన వెస్టిండీస్కు ఓపెనర్లు బ్రాండన్ కింగ్(22), కైలీ మేయర్స్(35) మంచి ఆరంభం అందించగా.. వన్డౌన్ బ్యాటర్ షాయీ హోప్ 36 పరుగులతో రాణించాడు. ఆ తర్వాతి స్థానాల్లో వచ్చిన నికోలస్ పూరన్ 13, షిమ్రన్ హెట్మెయిర్ ఒక్క పరుగుకే పరిమితమయ్యారు. అయితే, ఆరో నంబర్ బ్యాటర్, కెప్టెన్ రోవ్మన్ పావెల్, ఎనిమిదో స్థానంలో వచ్చిన ఆండ్రీ రసెల్ ధనాధన్ ఇన్నింగ్స్తో చెలరేగారు. పావెల్ 15 బంతుల్లో మూడు ఫోర్లు, రెండు సిక్సర్లతో 206.67 స్ట్రైక్రేటుతో 31 పరుగులు రాబట్టి అజేయంగా నిలిచాడు. సునామీ ఇన్నింగ్స్తో రసెల్ విధ్వంసం మరోవైపు రసెల్ కూడా 14 బంతులు ఎదుర్కొని 207కు పైగా స్ట్రైక్రేటుతో 29 పరుగులు సాధించాడు. అతడి ఇన్నింగ్స్లో రెండు ఫోర్లు, రెండు సిక్సర్లు ఉన్నాయి. కాగా రసెల్ దాదాపు రెండేళ్ల తర్వాత వెస్టిండీస్ తరఫున బరిలోకి దిగడం ఇదే తొలిసారి. Russell roars back! . .#WIvENG #WIvENGonFanCode pic.twitter.com/zdlJBWJdWA — FanCode (@FanCode) December 13, 2023 ఈ నేపథ్యంలో ఇంగ్లండ్పై టీ20 సిరీస్లో వెస్టిండీస్ 1-0తో ఆధిక్యంలోకి వెళ్లింది. దీంతో జోస్ బట్లర్ బృందానికి మరోసారి నిరాశే మిగిలింది. ఇరు జట్ల మధ్య గురువారం రెండో టీ20 జరుగనుంది. చదవండి: Ind vs SA: అందుకే ఓడిపోయాం.. మాకు ఇదొక గుణపాఠం: సూర్యకుమార్ -
ఇంగ్లండ్ను చిత్తు చేసిన వెస్టిండీస్.. 24 ఏళ్ల తర్వాత ఇదే తొలిసారి
బార్బడోస్ వేదికగా ఇంగ్లండ్తో జరిగిన నిర్ణయాత్మక మూడో వన్డేలో 4 వికెట్ల తేడాతో వెస్టిండీస్ విజయం సాధించింది. తద్వారా మూడు వన్డేల సిరీస్ను 2-1తో విండీస్ కైవసం చేసుకుంది. కాగా కరేబియన్ దీవుల్లో ఇంగ్లీష్ జట్టుపై విండీస్ వన్డే సిరీస్ను సొంతం చేసుకోవడం 24 ఏళ్ల తర్వాత ఇదే తొలిసారి కావడం విశేషం. విండీస్ చివరగా తమ స్వదేశంలో 1998లో ఇంగ్లండ్పై వన్డే సిరీస్ విజయం సాధించింది. తాజా విజయంతో 24 ఏళ్ల నిరీక్షణకు వెస్టిండీస్ తెరదించింది. ఇక మ్యాచ్ విషయానికి వస్తే.. వర్షం కారణంగా మూడో వన్డేను 40 ఓవర్లకు కుదించారు. టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన ఇంగ్లండ్ నిర్ణీత ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 206 పరుగులు చేసింది. ఇంగ్లండ్ బ్యాటర్లలో బెన్ డకెట్(71) పరుగులతో టాప్ స్కోరర్గా నిలిచాడు. విండీస్ బౌలర్లలో మాథ్యూ ఫోర్డే, జోషఫ్య తలా 3 వికెట్లు పడగొట్టగా.. షెపెర్డ్ రెండు వికెట్లు సాధించాడు. అనంతరం విండీస్ టార్గెట్ను డక్వర్త్ లూయిస్ పద్దతి ప్రకారం 188గా నిర్ణయించారు. 188 లక్ష్యంతో బరిలోకి దిగిన వెస్టిండీస్ 31.4 ఓవర్లలో 6 వికెట్లు కోల్పోయి ఛేదించింది. కరేబియన్ బ్యాటర్లలో ఆథనాజ్(45), కార్టీ(50) పరుగులతో రాణించారు. ఇంగ్లండ్ బౌలర్లలో విల్ జాక్స్ 3 వికెట్లు.. అటిక్కినిసన్ 2, ఆహ్మద్ ఒక్క వికెట్ పడగొట్టారు. సిరీస్ ఆసాంతం అద్భుత ప్రదర్శన కనబరిచిన విండీస్ కెప్టెన్ షాయ్ హోప్కు మ్యాన్ ఆఫ్ది సిరీస్ అవార్డు దక్కింది. -
WI VS ENG 2nd ODI: అరుదైన క్లబ్లో చేరిన జోస్ బట్లర్
ఇంగ్లండ్ పరిమిత ఓవర్ల కెప్టెన్ జోస్ బట్లర్ అరుదైన క్లబ్లో చేరాడు. వెస్టిండీస్తో నిన్న (డిసెంబర్ 6) జరిగిన రెండో వన్డేలో మెరుపు అర్ధసెంచరీ (45 బంతుల్లో 58 నాటౌట్; 4 ఫోర్లు, 3సిక్సర్లు) సాధించిన బట్లర్.. వన్డే క్రికెట్లో ఇంగ్లండ్ తరఫున 5000 పరుగుల మార్కును దాటిన ఐదో బ్యాటర్గా రికార్డుల్లోకెక్కాడు. బట్లర్కు ముందు ఇయాన్ మోర్గన్ (6957), జో రూట్ (6522), ఇయాన్ బెల్ (5416), పాల్ కాలింగ్పుడ్ (5092), జోస్ బట్లర్ (5022) ఇంగ్లండ్ తరఫున ఐదు వేల పరుగుల మార్కును దాటారు. బట్లర్ మెరుపు అర్ధసెంచరీతో రాణించడంతో రెండో వన్డేలో ఇంగ్లండ్ వెస్టిండీస్పై 6 వికెట్ల తేడాతో గెలుపొందింది. ఈ గెలుపుతో ఇంగ్లండ్ తొలి వన్డేలో విండీస్ చేతిలో ఎదురైన పరాభవానికి ప్రతీకారం తీర్చుకుంది. తద్వారా మూడు మ్యాచ్ల సిరీస్లో 1-1తో సమంగా నిలిచింది. తొలుత బ్యాటింగ్ చేసిన వెస్టిండీస్.. ఇంగ్లండ్ బౌలర్లు మూకుమ్మడిగా రాణించడంతో 39.4 ఓవర్లలో 202 పరుగులకు ఆలౌటైంది. సామ్ కర్రన్, లివింగ్స్టోన్ చెరో 3 వికెట్లు.. అట్కిన్సన్, రెహాన్ అహ్మద్ తలో 2 వికెట్లు పడగొట్టారు. విండీస్ ఇన్నింగ్స్లో కెప్టెన్ షాయ్ హోప్ (68), షెర్ఫాన్ రూథర్ఫోర్డ్ (63) అర్ధసెంచరీలతో రాణించారు. తొలి వన్డేలో మెరుపు శతకంతో విండీస్ను గెలిపించిన హోప్ ఈ మ్యాచ్లోనూ బాధ్యతాయుతమైన ఇన్నింగ్స్ ఆడాడు. అనంతరం 203 పరుగుల స్వల్ప లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన ఇంగ్లండ్.. విల్ జాక్స్ (73), కెప్టెన్ జోస్ బట్లర్ (58 నాటౌట్) అర్ధసెంచరీలతో రాణించడంతో 32.5 ఓవర్లలో 4 వికెట్లు కోల్పోయి విజయతీరాలకు చేరింది. జాక్స్, బట్లర్లతో పాటు హ్యారీ బ్రూక్ (43 నాటౌట్) కూడా రాణించాడు. విండీస్ బౌలర్లలో గుడకేశ్ మోటీకి రెండు, రొమారియో షెపర్డ్, షెర్ఫాన్ రూథర్ఫోర్డ్లకు తలో వికెట్ దక్కింది. నిర్ణయాత్మకమైన మూడో వన్డే డిసెంబర్ 9న జరుగనుంది. -
రాణించిన కర్రన్, బట్లర్.. విండీస్పై ప్రతీకారం తీర్చుకున్న ఇంగ్లండ్
ఆంటిగ్వా వేదికగా వెస్టిండీస్తో జరిగిన రెండో వన్డేలో ఇంగ్లండ్ 6 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. ఈ గెలుపుతో ఇంగ్లండ్ తొలి వన్డేలో ఎదురైన పరాభవానికి ప్రతీకారం తీర్చుకుని మూడు మ్యాచ్ల సిరీస్లో 1-1తో సమంగా నిలిచింది. ఈ మ్యాచ్లో తొలుత బ్యాటింగ్ చేసిన వెస్టిండీస్.. ఇంగ్లండ్ బౌలర్లు మూకుమ్మడిగా రాణించడంతో 39.4 ఓవర్లలో 202 పరుగులకు ఆలౌటైంది. సామ్ కర్రన్, లివింగ్స్టోన్ చెరో 3 వికెట్లు.. అట్కిన్సన్, రెహాన్ అహ్మద్ తలో 2 వికెట్లు పడగొట్టారు. విండీస్ ఇన్నింగ్స్లో కెప్టెన్ షాయ్ హోప్ (68), షెర్ఫాన్ రూథర్ఫోర్డ్ (63) అర్ధసెంచరీలతో రాణించారు. తొలి వన్డేలో మెరుపు శతకంతో విండీస్ను గెలిపించిన హోప్ ఈ మ్యాచ్లోనూ బాధ్యతాయుతమైన ఇన్నింగ్స్ ఆడాడు. అనంతరం 203 పరుగుల స్వల్ప లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన ఇంగ్లండ్.. విల్ జాక్స్ (73), కెప్టెన్ జోస్ బట్లర్ (58 నాటౌట్) అర్ధసెంచరీలతో రాణించడంతో 32.5 ఓవర్లలో 4 వికెట్లు కోల్పోయి విజయతీరాలకు చేరింది. జాక్స్, బట్లర్లతో పాటు హ్యారీ బ్రూక్ (43 నాటౌట్) కూడా రాణించాడు. విండీస్ బౌలర్లలో గుడకేశ్ మోటీకి రెండు, రొమారియో షెపర్డ్, షెర్ఫాన్ రూథర్ఫోర్డ్లకు తలో వికెట్ దక్కింది. నిర్ణయాత్మకమైన మూడో వన్డే డిసెంబర్ 9న జరుగనుంది. -
వెస్టిండీస్ టూర్కు ఇంగ్లండ్ జట్టు ప్రకటన.. కెప్టెన్గా జోస్ బట్లర్
వన్డే వరల్డ్కప్-2023లో దారుణ ప్రదర్శన ప్రదర్శనతో ఇంటుముఖం పట్టిన ఇంగ్లండ్.. వచ్చే నెలలో వెస్టిండీస్ పర్యటనకు వెళ్లనుంది. ఈ కరేబియన్ టూర్లో భాగంగా ఆతిథ్య విండీస్తో మూడు వన్డేలు, ఐదు టీ20ల సిరీస్లో ఇంగ్లండ్ తలపడనుంది. ఈ సిరీస్ల కోసం రెండు వేర్వేరు జట్లను ఇంగ్లండ్ క్రికెట్ బోర్డు ప్రకటించింది. వన్డే సిరీస్కు స్టార్ ఆటగాళ్లు బెన్స్టోక్స్, రూట్, మొయిన్ అలీలకు ఇంగ్లండ్ సెలక్టర్లు విశ్రాంతి ఇచ్చారు. యువ పేసర్లు జోస్ టాంగ్వే, జాన్ టర్నర్కు తొలిసారి ఇంగ్లండ్ వైట్ బాల్ జట్టులో చోటు దక్కింది. అదే ఈ రెండు సిరీస్లలో ఇంగ్లండ్ జట్టు కెప్టెన్గా జోస్ బట్లర్ వ్యవహరించనున్నాడు. వన్డే ప్రపంచకప్-2023లో విఫలమకావడంతో బట్లర్ను ఇంగ్లండ్ వైట్ బాల్ కెప్టెన్సీ నుంచి తప్పిస్తారని ఊహాగానాలు వినిపించాయి. కానీ ఇంగ్లండ్ సెలక్షన్ కమిటీ మాత్రం యథావిధిగా జోస్నే తమ సారథిగా కొనసాగించింది. డిసెంబర్ 3న ఆంటిగ్వా వేదికగా జరగనున్న తొలి వన్డేతో ఇంగ్లండ్ జట్టు కరేబియన్ టూర్ ప్రారంభం కానుంది. విండీస్తో వన్డేలకు ఇంగ్లండ్ జట్టు: జోస్ బట్లర్ (కెప్టెన్), రెహాన్ అహ్మద్, గుస్ అట్కిన్సన్, హ్యారీ బ్రూక్, బ్రైడన్ కార్సే, జాక్ క్రాలే, సామ్ కర్రాన్, బెన్ డకెట్, టామ్ హార్ట్లీ, విల్ జాక్స్, లియామ్ లివింగ్స్టోన్, ఆలీ పోప్, ఫిల్ సాల్ట్, జోష్ టంగ్, జాన్ టర్నర్. విండీస్తో టీ20లకు ఇంగ్లండ్ జట్టు: జోస్ బట్లర్(కెప్టెన్), రెహాన్ అహ్మద్, మోయిన్ అలీ, గుస్ అట్కిన్సన్, హ్యారీ బ్రూక్, సామ్ కర్రాన్, బెన్ డకెట్, విల్ జాక్స్, లియామ్ లివింగ్స్టోన్, టైమల్ మిల్స్, ఆదిల్ రషీద్, ఫిల్ సాల్ట్, జోష్ టంగ్, రీస్ టోప్లీ, జాన్ టర్నర్, క్రిస్ వోక్స్ చదవండి: World Cup 2023: భారత్ వర్సెస్ న్యూజిలాండ్ సెమీఫైనల్.. వర్షం పడితే పరిస్థితి ఏంటి? -
పాకిస్తాన్ను చిత్తు చేసిన ఇంగ్లండ్..
వన్డే ప్రపంచకప్-2023ను ఇంగ్లండ్ విజయంతో ముగించింది. ఈడెన్ గార్డెన్స్ వేదికగా పాకిస్తాన్తో జరిగిన తమ ఆఖరి మ్యాచ్లో 93 పరుగుల తేడాతో ఇంగ్లండ్ ఘన విజయం సాధించింది. 338 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన పాకిస్తాన్.. 246 పరుగులకు ఆలౌటైంది. ఇంగ్లండ్ బౌలర్లలో డేవిడ్ విల్లీ మూడు వికెట్లతో అదరగొట్టగా.. గుస్ అట్కిన్సన్, అదిల్ రషీద్, మొయిన్ అలీ తలా రెండు వికెట్లు సాధించారు. పాకిస్తాన్ బ్యాటర్లలో అఘా సల్మాన్(51) పరుగులతో టాప్ స్కోరర్గా నిలిచాడు. అంతకుముందు బ్యాటింగ్ చేసిన ఇంగ్లండ్ నిర్ణీత 50 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 337 పరుగులు చేసింది. ఇంగ్లండ్ బ్యాటర్లలో బెన్ స్టోక్స్(84) పరుగులతో మరోసారి అద్బుత ఇన్నింగ్స్ ఆడగా.. జోరూట్(60), జానీ బెయిర్ స్టో(59) పరుగులతో రాణించారు. ఆఖరిలో హ్యారీ బ్రూక్(17 బంతుల్లో 2 ఫోర్లు, 2 సిక్స్లతో 30), డేవిడ్ విల్లీ(5 బంతుల్లో 2 ఫోర్లు, 1 సిక్సర్తో 15) మెరుపులు మెరిపించాడు. పాకిస్తాన్ బౌలర్లలో హ్యారీస్ రవూఫ్ మూడు వికెట్లు పడగొట్టగా.. షాహీన్ అఫ్రిది, వసీం తలా రెండు వికెట్లు సాధించారు. ఇక ఈ ఓటమితో పాకిస్తాన్ కూడా టోర్నీ నుంచి నిష్క్రమించింది. చదవండి: World Cup 2023: వరల్డ్కప్ నుంచి పాకిస్తాన్ ఔట్.. -
టాస్ ఓడిన పాక్.. సెమీస్ రేసు నుంచి అవుట్! 2.5 ఓవర్లలో ఛేదిస్తేనే
ICC WC 2023- Is Pakistan Knocked Out: వన్డే వరల్డ్కప్-2023లో సెమీస్ రేసులో నిలుస్తామంటూ ధీమా వ్యక్తం చేసిన పాకిస్తాన్ కెప్టెన్ బాబర్ ఆజంకు చేదు అనుభవం ఎదురైంది. కోల్కతాలోని ఈడెన్ గార్డెన్స్ వేదికగా బాబర్ టాస్ ఓడిపోవడంతో పాకిస్తాన్ ఓటమి దాదాపు ఖాయమైపోయింది. ప్రపంచకప్ లీగ్ దశలో భాగంగా శ్రీలంకపై జయభేరి మోగించి న్యూజిలాండ్ అనధికారికంగా సెమీస్ బెర్తును ఖాయం చేసుకున్న విషయం తెలిసిందే. అయితే, సాంకేతికంగా పాక్కు ఇంకా దింపుడుకళ్లెం ఆశలు ఉండేవి. ఇంగ్లండ్పై 287 పరుగులతో గెలవడం లేదంటే.. ఇంగ్లండ్ విధించిన ఎంతటి లక్ష్యాన్నైనా 3 ఓవర్లలోపు ఛేదించడం వంటి సమీకరణలు ఉన్నాయి. అయితే, గత రికార్డుల దృష్ట్యా ఇది ఏ రకంగా చూసినా అసాధ్యంగానే కనిపిస్తోంది. ఇక తాజాగా ఇంగ్లండ్ టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ ఎంచుకోవడంతో పాక్ సెమీస్ రేసు నుంచి నిష్క్రమించడం లాంఛనమే అయింది. ఈ నేపథ్యంలో మ్యాచ్కు ముందు బాబర్ ఆజం మాట్లాడుతూ.. ఇంగ్లండ్తో మ్యాచ్ గెలిచి.. రన్రేటు భారీగా పెంచుకుంటామని తెలిపాడు. అయితే, అద్భుతం జరిగితే తప్ప అతడి మాటలు నిజమయ్యే ఛాన్స్ లేదు! కాబట్టి పాక్ ఖేల్ టాస్ వద్ద ఖతమైందని చెప్పొచ్చు! కానీ.. బాబర్ చెప్పినట్లు క్రికెట్లో ఎప్పుడు, ఏమైనా జరగొచ్చు.. ఏమో గుర్రం ఎగరావచ్చు అంటారా?! అయితే, పాజిటివిటీకి అది పరాకాష్ట లాంటిదే! సమీకరణాల దృష్ట్యా అలాంటి అవకాశం ఇప్పుడైతే లేదు మరి!! View this post on Instagram A post shared by ICC (@icc) ఇంగ్లండ్ మొదట బ్యాటింగ్ చేస్తోంది కాబట్టి! ►ఇంగ్లండ్ స్కోరు - 20, 1.3 ఓవర్లలోనే పాక్ లక్ష్యాన్ని ఛేదించాలి ►ఇంగ్లండ్ స్కోరు - 50, పాక్ 2 ఓవర్లలోనే ఛేదించాలి ►ఇంగ్లండ్ - 100, 2.5 ఓవర్లలోనే పాక్ ఛేదించాలి ►ఇంగ్లండ్ - 150, పాక్ 3.4 ఓవర్లలోనే లక్ష్యాన్ని ఛేదించాలి ►ఇంగ్లండ్ - 200, 4.3 ఓవర్లలోనే పాక్ లక్ష్యాన్ని ఛేదించాలి ►ఇంగ్లండ్ - 300, పాక్ 6.1 ఓవర్లలోనే లక్ష్యాన్ని ఛేదించాలి. చదవండి: కానిస్టేబుల్ కొడుకు నుంచి టీమిండియా క్రికెటర్ దాకా! సంజూ ఆస్తి ఎంతంటే! -
CWC 2023: ఇంగ్లండ్ డ్రెస్సింగ్ రూమ్లో ఏదో జరుగుతుంది..!
ప్రస్తుత ప్రపంచకప్లో వరుస పరాజయాలు (6 మ్యాచ్ల్లో 5 అపజయాలు) ఎదుర్కొంటూ ఘోర నిష్క్రమణ దిశగా పయనిస్తున్న ఇంగ్లండ్ జట్టుపై ఆ దేశ మాజీ కెప్టెన్, ప్రస్తుత కామెంటేటర్ ఇయాన్ మోర్గాన్ సంచలన వ్యాఖ్యలు చేశాడు. భారీ అంచనాలతో బరిలోకి దిగి, ఇంత పేలవ ప్రదర్శన కనబర్చిన జట్టును నేనెప్పుడూ చూడలేదని ప్రస్తుత ఇంగ్లండ్ జట్టుపై ఘాటు వ్యాఖ్యలు చేశాడు. జట్టులో ఏదో అస్థిరత స్పష్టంగా కనిపిస్తుంది.. డ్రెస్సింగ్ రూమ్లో ఏదో జరుగుతుందని అనుమానాలు వ్యక్తం చేశాడు. గెలుపు కోసం జట్టు అవలంబిస్తున్న పద్ధతి, మ్యాచ్లను వారు కోల్పోయిన తీరు చూస్తుంటే ఏదో అనుమానం కలుగుతుందని బాంబు పేల్చాడు. 2019లో ఇంగ్లండ్కు ప్రపంచకప్ అందించి, ఆ దేశ ప్రజల చిరకాల వాంఛను నెరవేర్చిన మోర్గాన్, సొంత జట్టుపై ఇలాంటి వ్యాఖ్యలు చేయడం ప్రస్తుతం క్రికెట్ సర్కిల్స్లో చర్చనీయాంశంగా మారింది. మోర్గాన్ చేసిన వ్యాఖ్యల్లో నిజానిజాలు ఎంత ఉన్నాయో తెలీదు కానీ, అతను చేసిన వివాదాస్పద వ్యాఖ్యలపై ప్రస్తుత ఇంగ్లండ్ జట్టు సభ్యుడు లివింగ్స్టోన్ స్పందించాడు. జట్టు సభ్యులందరికీ మోర్గాన్పై అమితమైన గౌరవం ఉంది. అతను ఈ తరహా వ్యాఖ్యలు చేసి తన స్థాయిని దిగజార్చుకున్నాడు. గుండెల పై చెయ్యి వేసుకుని చెప్పగలను అతను అన్న విధంగా జట్టులో ఎలాంటి మనస్పర్థలు లేవు. మోర్గాన్ ఊహించిన విధంగా డ్రెస్సింగ్ రూమ్లో ఏమీ జరగడం లేదు. జట్టులో అందరం కలిసికట్టుగా ఉన్నాం. ప్రతి మ్యాచ్లో వంద శాతం విజయాల కోసం ప్రయత్నిస్తున్నాం. అయితే మాకేదీ కలిసి రావడం లేదంటూ మోర్గాన్ వ్యాఖ్యలకు కౌంటరిచ్చాడు. ఇదిలా ఉంటే, టీమిండియాతో నిన్న జరిగిన మ్యాచ్లో ఇంగ్లండ్ స్వల్ప లక్ష్యాన్ని (230) కూడా చేధించలేక 100 పరుగుల తేడాతో పరాజయంపాలైన విషయం తెలిసిందే. ఇప్పటివరకు జరిగిన 6 మ్యాచ్ల్లో కేవలం బంగ్లాదేశ్పై మాత్రమే గెలుపొందిన ఆ జట్టు.. న్యూజిలాండ్, ఆఫ్ఘనిస్తాన్, సౌతాఫ్రికా, శ్రీలంక, భారత్ చేతుల్లో ఘోర పరాజయాలు ఎదుర్కొని పాయింట్ల పట్టికలో ఆఖరి స్థానంలో ఉంది. బట్లర్ సేన తదుపరి జరిగే 3 మ్యాచ్ల్లో (ఆస్ట్రేలియా, నెదర్లాండ్స్, పాకిస్తాన్) రెండు మ్యాచ్ల్లో ఒడినా టోర్నీ నుంచి నిష్క్రమించడంతో పాటు ఛాంపియన్స్ ట్రోఫీకి కూడా అర్హత కోల్పోతుంది. కాగా, ప్రపంచకప్లో లీగ్ దశ తర్వాత టాప్-7లో నిలిచే జట్లు 2025 ఛాంపియన్స్ ట్రోఫీకి అర్హత సాధిస్తాయన్న విషయం తెలిసిందే. -
భారత బౌలర్ల దెబ్బకు తలవంచక తప్పలేదు.. అయినా ఇంగ్లండ్కు ఆ గోల్డెన్ ఛాన్స్!
ICC WC 2023- Champions Trophy 2025: లక్నోలో టీమిండియాతో మ్యాచ్.. టాస్ గెలిచిన ఇంగ్లండ్ తొలుత బౌలింగ్ ఎంచుకుంది.. భారత ఓపెనర్లు బ్యాటింగ్కు సిద్ధమయ్యారు.. ఇంగ్లండ్ పేసర్ డేవిడ్ విల్లే బౌలింగ్ అటాక్ ఆరంభించాడు. ఆది నుంచే కట్టుదిట్టంగా బౌలింగ్ చేస్తూ.. రోహిత్ శర్మ, శుబ్మన్ గిల్లకు సవాలు విసిరాడు. ఈ క్రమంలో.. మరో పేసర్ క్రిస్ వోక్స్ 4వ ఓవర్లో గిల్ను బౌల్డ్ చేయడం ద్వారా ఇంగ్లండ్కు మంచి ఆరంభం ఇచ్చాడు. బౌలర్లు మెరుగ్గానే ఆడారు ఏడో ఓవర్లో మళ్లీ రంగంలో దిగిన విల్లే.. టీమిండియా స్టార్ విరాట్ కోహ్లి రూపంలో బిగ్ వికెట్ సాధించి బ్రేక్ త్రూ ఇచ్చాడు. ఆ తర్వాత 12వ ఓవర్లో క్రిస్ వోక్స్ శ్రేయస్ అయ్యర్(4)ను మూడో వికెట్గా వెనక్కి పంపాడు. ఈ క్రమంలో టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ 36.5 ఓవర్ వరకు ఓపికగా క్రీజులో నిలబడి 87 పరుగులు సాధించాడు. అతడికి తోడుగా వికెట్ కీపర్ బ్యాటర్ కేఎల్ రాహుల్(39), సూర్యకుమార్ యాదవ్(49) రాణించడంతో టీమిండియా నిర్ణీత 50 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 229 పరుగుల నామమాత్రపు స్కోరు చేసింది. దీంతో వరుస పరాజయాలతో డీలా పడ్డ ‘డిఫెండింగ్ చాంపియన్’ మ్యాచ్ స్వల్ప లక్ష్యాన్ని ఛేదించి గెలవడం ఖాయమే అని ఇంగ్లండ్ జట్టు అభిమానులు అంచనా వేశారు. అయితే, టీమిండియా బౌలర్ల ముందు ఇంగ్లిష్ బ్యాటర్ల పప్పులు ఉడకలేదు. టీమిండియా బౌలర్ల దెబ్బకు తలవంచిన ఇంగ్లండ్ భారత పేసర్లు జస్ప్రీత్ బుమ్రా, మహ్మద్ షమీ ధాటికి ఇంగ్లండ్ టాపార్డర్ కుప్పకూలింది. బట్లర్ బృందం ఆట కట్టించడంలో వీరిద్దరితో పాటు తాను రేసులో ఉన్నానన్నంటూ టీమిండియా చైనామన్ స్పిన్నర్ కుల్దీప్ యాదవ్ మిడిలార్డర్ను దెబ్బకొట్టడంలో తన వంతు పాత్ర పోషించాడు. ఇక స్పిన్ ఆల్రౌండర్ రవీంద్ర జడేజా క్రిస్ వోక్స్ రూపంలో తానూ ఓ వికెట్ తీశాడు. మొత్తంగా బుమ్రా 3, షమీ 4 వికెట్లతో దుమ్ములేపగా.. కుల్దీప్ ఇంగ్లండ్ సారథి బట్లర్, ఆల్రౌండర్ లియామ్ లివింగ్స్టోన్ రూపంలో రెండు కీలక వికెట్లు కూల్చాడు. View this post on Instagram A post shared by ICC (@icc) పాయింట్ల పట్టికలో అట్టడుగున డిఫెండింగ్ చాంపియన్ వెరసి 34.5 ఓవర్లలో 129 పరుగులకు ఆలౌట్ అయిన ఇంగ్లండ్ 100 పరుగుల తేడాతో మరో ఘోర పరాభవాన్ని మూటగట్టుకుంది. టీమిండియా స్థాయిని అందుకోలేక చతికిలపడింది. వరుస ఓటములతో సెమీస్ రేసు నుంచి దాదాపుగా నిష్క్రమించి.. పాయింట్ల పట్టికలో అట్టడుగున అతుక్కుపోయింది. ఈ నేపథ్యంలో ప్రపంచకప్-2023లో డిఫెండింగ్ చాంపియన్ అన్న హోదాకు ఏమాత్రం న్యాయంచేయక అవమానాల పాలైన ఇంగ్లండ్.. చాంపియన్స్ ట్రోఫీ-2025లో ఆడుతుందా లేదా అన్న దుస్థితికి చేరుకుంది. అంతర్జాతీయ క్రికెట్ మండలి విడుదల చేసిన ప్రకటన ప్రకారం.. వన్డే వరల్డ్కప్-2023 పాయింట్ల పట్టికలో టాప్-7లో నిలిచిన జట్లకే చాంపియన్స్ ట్రోఫీ ఆడే అర్హత దక్కుతుంది. దీంతో ఇంగ్లండ్కు మిగిలిన మ్యాచ్లలో చావోరేవో తేల్చుకోవాల్సిన పరిస్థితి. అయితే, ఇప్పటి వరకు ఈ మెగా టోర్నీలో ఆడిన ఆరింటిలో ఐదు ఓడినప్పటికీ ఇంగ్లండ్కు ఇంకా టాప్-7లో నిలిచే అవకాశం ఉంది. ఆ సమీకరణలు ఇలా.. నంబర్ 1: ఇంగ్లండ్కు ఈ ఈవెంట్లో ఇంకా మూడు మ్యాచ్లు మిగిలి ఉన్నాయి. తదుపరి ఆస్ట్రేలియా, నెదర్లాండ్స్, పాకిస్తాన్తో బట్లర్ బృందం పోటీపడాల్సి ఉంది. ఈ మూడింటిలో రెండు తప్పక గెలవాలి. ►ఆస్ట్రేలియా ఆరంభంలో విఫలమైనా ఇప్పుడు సెమీస్ రేసులో దూసుకుపోతోంది. కాబట్టి కంగారూలపై నెగ్గాలంటే ఇంగండ్ చెమటోడ్చకతప్పదు. ►మరోవైపు.. నెదర్లాండ్స్ సౌతాఫ్రికా, బంగ్లాదేశ్లపై సంచలన విజయాలతో జోరు మీదుంది. మరి స్కాట్ ఎడ్వర్డ్స్ బృందాన్ని కట్టడి చేయడం బట్లర్ అండ్ కో తో అవుతుందో లేదో చూడాలి. ►ఇక పాకిస్తాన్.. నిలకడలేని జట్టుకు మారుపేరుగా పాక్కు అపఖ్యాతి ఉంది. ఈ టోర్నీ ఆరంభం ముందు సెమీస్ ఫేవరెట్లలో ఒకటిగా ఉన్న బాబర్ ఆజం సేన వరుస పరాజయాలతో డీలా పడింది. ►అయినప్పటికీ సాంకేతికంగా సెమీస్ రేసులో ఉండే ఛాన్స్ ఉంది కాబట్టి ఇంగ్లండ్తో సహా తమకు మిగిలిన అన్ని మ్యాచ్లలో గెలుపే లక్ష్యంగా ముందుకు వెళ్లడం ఖాయం. నంబర్ 2: ►పాయింట్ల పట్టికలో ప్రస్తుతం ఎనిమిదో స్థానంలో ఉన్న నెదర్లాండ్స్ తమకు మిగిలిన మూడు మ్యాచ్లలనూ ఓడిపోవాలి. అఫ్గనిస్తాన్, ఇంగ్లండ్, టీమిండియా చేతిలో చిత్తు కావాలి. నంబర్ 3: ►టేబుల్లో తొమ్మిదో స్థానంలో ఉన్న బంగ్లాదేశ్.. పాకిస్తాన్, శ్రీలంక, ఆస్ట్రేలియాలతో మిగిలిన మూడు మ్యాచ్లలో కనీసం రెండింట ఓడిపోవాలి. ►పై మూడు జరిగితేనే ఇంగ్లండ్ చాంపియన్స్ ట్రోఫీ-2025లో ఆడే అవకాశం ఉంటుంది. లేదంటే బట్లర్ కెప్టెన్సీ కెరీర్లో ఇదొక మచ్చలా మిగిలిపోతుంది. చదవండి: WC 2023: టీమిండియా ఇక చాలు! దిష్టి తగులుతుంది.. ఆ ఒక్క గండం గట్టెక్కితే! వరల్డ్ రికార్డు మనదే -
ఇంగ్లండ్ జట్టుకు ఏమైంది.. కనీసం 200 పరుగులు కూడా చేయలేని దీన స్థితికి దిగజారింది
వన్డే ఫార్మాట్తో పాటు టీ20 ఫార్మాట్లోనూ ప్రపంచ ఛాంపియన్గా ఉన్న ఇంగ్లండ్ క్రికెట్ జట్టు ప్రస్తుత వన్డే ప్రపంచకప్లో గడ్డు పరిస్థితులను ఎదుర్కొంటుంది. ఆ జట్టు ఇప్పటివరకు ఆడిన 6 మ్యాచ్ల్లో కేవలం ఒక్క విజయం మాత్రమే సాధించి పాయింట్ల పట్టికలో చివరి స్థానంలో ఉంది. క్వాలిఫయర్స్ ద్వారా ప్రపంచకప్కు అర్హత సాధించిన నెదర్లాండ్స్, శ్రీలంక జట్లు.. బలహీన జట్లైన బంగ్లాదేశ్, ఆఫ్ఘనిస్తాన్ (ఇంగ్లండ్తో పోలిస్తే) జట్లు కూడా ఇంగ్లండ్ కంటే మెరుగైన స్థితిలో ఉన్నాయి. అరివీర భయంకరులైన బ్యాటర్లు.. నిప్పులు చెరిగే ఫాస్ట్ బౌలర్లు.. వరల్డ్ క్లాస్ స్పిన్నర్లతో కూడి, ప్రపంచంలోని ఎంతటి మేటి జట్టుకైనా చెమటలు పట్టించగల సత్తా ఉన్న ఇంగ్లండ్ జట్టు ప్రస్తుత టోర్నీలో క్రికెట్ పసికూన ఆఫ్ఘనిస్తాన్ చేతుల్లో సైతం ఓటమిపాలై ఘోర అపవాదును మూటగట్టుకుంది. భారత్, న్యూజిలాండ్, సౌతాఫ్రికా లాంటి వరల్డ్ క్లాస్ జట్ల చేతుల్లో ఓటమి మాట అటుంచితే.. క్వాలిఫయర్స్ ద్వారా ప్రపంచకప్కు అర్హత సాధించిన శ్రీలంక చేతుల్లో కూడా ఓడి సొంత జనాలచే చీవాట్లు తింటుంది. ఇక్కడ గమనించదగ్గ మరో విషయం ఏంటంటే.. ఆ జట్టు చివరిగా ఆడిన మూడు మ్యాచ్ల్లో కనీస 200 పరుగులు కూడా చేయలేకపోయింది. ఈ మూడు మ్యాచ్ల్లో విధ్వంసకర వీరులతో నిండిన ఇంగ్లీష్ బ్యాటింగ్ లైనప్ ఒక్కో పరుగు చేసేందుకు నానా కష్టాలు పడి, చిన్న జట్లు కూడా వారిపై సానుభూతి చూపే స్థాయికి దిగజారింది. ఆ జట్టు భారత్తో నిన్న జరిగిన మ్యాచ్లో 129, అంతకుముందు శ్రీలంకతో జరిగిన మ్యాచ్లో 156, సౌతాఫ్రికాతో జరిగిన మ్యాచ్లో 170 పరుగులకు ఆలౌటై క్రికెట్లో ఇప్పుడిప్పుడే ఓనమాలు నేర్చుకుంటున్న జట్ల కంటే దారుణంగా తయారైంది. ప్రపంచకప్కు ముందు వన్డేల్లో అలవోకగా 400 పరుగుల మార్కును దాటేసిన ఇంగ్లండ్ జట్టు ఒక్కసారిగా ఇలా మారిపోవడంతో సగటు క్రికెట్ అభిమాని ఆశ్చర్యపోతున్నాడు. వన్డేల్లో టాప్ త్రీ టీమ్ స్కోర్లు (498, 481, 444) తమ పేరిటే కలిగి ఉన్న జట్టు కనీసం 200 పరుగులు కూడా చేయలేని దీన స్థితికి దిగజారడంతో జాలిపడుతున్నాడు. ఇంగ్లండ్ ఈ స్థాయికి దిగజారడానికి కారణమేమై ఉంటుందని అనుకుంటున్నారో కామెంట్ల రూపంలో తెలియజేయండి. -
WC 2023: ఈజీగా గెలుస్తామనుకున్నాం.. ఓడిపోవడానికి కారణం అదే: బట్లర్
ICC WC 2023- Ind Vs Eng- Jos Buttler Comments: టీమిండియా చేతిలో ఓటమి తమను తీవ్ర నిరాశకు గురిచేసిందని ఇంగ్లండ్ కెప్టెన్ జోస్ బట్లర్ అన్నాడు. స్వల్ప లక్ష్యాన్ని సులువుగా ఛేదిస్తామని భావిస్తే.. పాత కథే పునరావృతమైందని విచారం వ్యక్తం చేశాడు. తమ బౌలర్లు అద్భుతంగా రాణించారన్న బట్లర్.. బ్యాటర్లు మాత్రం పూర్తిగా తేలిపోయారంటూ అసహనం వ్యక్తం చేశాడు. వన్డే వరల్డ్కప్-2023లో డిఫెండింగ్ చాంపియన్ ఇంగ్లండ్ ఖాతాలో మరో పరాజయం చేరిన విషయం తెలిసిందే. టీమిండియా చేతిలో ఆదివారం నాటి మ్యాచ్లో 100 పరుగుల తేడాతో చిత్తుగా ఓడిన బట్లర్ బృందానికి ఈ టోర్నీలో ఇది ఐదో ఓటమి. ఇంగ్లండ్ బౌలర్లు రాణించినా.. లక్నోలో రోహిత్ సేనను 229 పరుగులకే కట్టడి చేసినప్పటికీ.. భారత బౌలర్ల విజృంభణతో.. స్వల్ప లక్ష్యాన్ని ఛేదించలేక చేతులెత్తేసింది. ఇంగ్లండ్ ఓపెనర్లు జానీ బెయిర్స్టో(14), డేవిడ్ మలన్(16) నిరాశ పరచగా.. జో రూట్, బెన్ స్టోక్స్ పూర్తిగా విఫలమయ్యారు. ఈ ఇద్దరు ‘స్టార్’ బ్యాటర్లు డకౌట్లుగా వెనుదిరగడంతో ఇంగ్లండ్ కష్టాల్లో కూరుకుపోయింది. ఇక కెప్టెన్ జోస్ బట్లర్ సైతం కేవలం 10 పరుగులకే పరిమితం కాగా.. మొయిన్ అలీ 15 పరుగులు చేయగలిగాడు. ఏడో నంబర్ బ్యాటర్ లియామ్ లివింగ్ స్టోన్ 27 పరుగులతో ఇంగ్లండ్ ఇన్నింగ్స్లో టాప్ స్కోరర్గా నిలవగా.. మిగతా వాళ్లలో ఎవరూ కూడా 20 పరుగుల మార్కును అందుకోలేకపోయారు. దీంతో 34.5 ఓవర్లలో 129 పరుగులకు ఆలౌట్ అయిన బట్లర్ బృందం మరో ఓటమిని మూటగట్టుకుంది. ఓటమికి కారణం అదే ఈ క్రమంలో ఇప్పటి వరకు ఆడిన ఆరింట కేవలం ఒక్క విజయానికే పరిమితమై పాయింట్ల పట్టికలో అట్టడుగున నిలిచింది. తద్వారా చాంపియన్స్ ట్రోఫీ-2025లో భాగమయ్యే అవకాశానికి దూరమయ్యే దుస్థితి వచ్చింది. ఈ నేపథ్యంలో ఓటమిపై స్పందించిన బట్లర్.. తమ బౌలర్లు ఆరంభం నుంచే వికెట్లు తీసి భారత్ను ఒత్తిడిలోకి నెట్టారని ప్రశంసించాడు. కీలక బ్యాటర్లను త్వరగా పెవిలియన్కు పంపి తమకు శుభారంభం ఇచ్చారని పేర్కొన్నాడు. లక్నో 230 పరుగుల లక్ష్యం తమకు సులువైనదిగా అనిపించినా.. ఏ ఒక్క బ్యాటర్ ఎక్కువ సేపు క్రీజులో నిలవలేకపోవడంతో పరాజయం తప్పలేదని బట్లర్ అసంతృప్తి వ్యక్తం చేశాడు. అలా అయితే మరో పరాభవం ఇక చాంపియన్స్ ట్రోఫీ 2025 క్వాలిఫికేషన్ సిస్టం గురించి మాట్లాడుతూ.. తమకు ఈ విషయం ముందే తెలుసన్న బట్లర్.. ఇక ముందు మరింత జాగ్రత్తగా ఆడతామని పేర్కొన్నాడు. కాగా ఇంగ్లండ్కు ఈ టోర్నీలో ఆస్ట్రేలియా, నెదర్లాండ్స్, పాకిస్తాన్లతో మ్యాచ్లు మిగిలి ఉన్నాయి. వీటిలో గెలిస్తేనే పాయింట్ల పట్టికలో టాప్-7లో నిలిచి చాంపియన్స్ ట్రోఫీలో ఆడే అవకాశం దక్కించుకుంటుంది. లేదంటే అంతే సంగతులు! చదవండి: WC 2023: అద్భుతం చేశారు.. మా బ్యాటింగ్ బాలేదు.. ఇదంతా వాళ్ల వల్లే: రోహిత్ శర్మ View this post on Instagram A post shared by ICC (@icc) -
ఇంగ్లండ్కు షాకుల మీద షాకులు.. అదే జరిగితే! షకీబ్కు ముందే తెలుసు!
WC 2023- ICC Champions Trophy 2025: వరల్డ్ కప్లో అత్యంత పేలవమైన ఆటతో పాయింట్ల పట్టికలో ప్రస్తుతం చివరి స్థానంలో ఉన్న ఇంగ్లండ్ను మరో ప్రమాదం వెంటాడుతోంది. వన్డే క్రికెట్లో ఎనిమిది జట్లతో ఆడే మరో ప్రతిష్టాత్మక టోర్నీ చాంపియన్స్ ట్రోఫీకి ఆ జట్టు దూరమయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. 2021లోనే ఐసీసీ తీసుకున్న నిర్ణయం ప్రకారం ప్రస్తుతం వరల్డ్ కప్లో టాప్–7లో నిలిచిన జట్లే చాంపియన్స్ ట్రోఫీకి అర్హత సాధిస్తాయి. బంగ్లా కెప్టెన్కు ముందే తెలుసు ఆతిథ్య దేశమైన పాకిస్తాన్కు నేరుగా అవకాశం లభిస్తుంది. టోర్నీలో ఆడుతున్న కొన్ని టీమ్లకు ఈ విషయంపై అవగాహన లేదని సమాచారం. అయితే ఇంగ్లండ్ కెప్టెన్ జోస్ బట్లర్, బంగ్లాదేశ్ సారథి షకీబ్ అల్ హసన్ మాత్రం ఈ విషయం తమకు తెలుసని, టాప్–7 లక్ష్యంగా ఆడతామని కూడా చెప్పారు. ఆస్ట్రేలియా, నెదర్లాండ్స్, పాకిస్తాన్లతో మ్యాచ్లు మిగిలి ఉన్న ఇంగ్లండ్ ఏ రకంగా ముందంజ వేస్తుందనేది చూడాలి. ఇక టాప్–7 నిబంధన కారణంగా ఈ వరల్డ్ కప్లో ఆడని వెస్టిండీస్, ఐర్లాండ్, జింబాబ్వేలకు ఏ రకంగానూ చాంపియన్స్ ట్రోఫీలో ఆడే అవకాశమే లేదు. టీమిండియా అక్కడికి వెళ్తుందా? మరోవైపు 2025లో పాకిస్తాన్ ఆతిథ్యమిస్తున్న ఈ టోర్నీకి భారత్ వెళుతుందా... లేక భారత్ కోసం తటస్థ వేదికను ఏర్పాటు చేస్తారా అనేది ఆసక్తికరం. చివరిసారి 2017లో చాంపియన్స్ ట్రోఫీ జరగ్గా... ఫైనల్లో భారత్పై గెలిచి పాకిస్తాన్ తొలిసారి చాంపియన్గా నిలిచింది. ఇంగ్లండ్కు షాకుల మీద షాకులు భారత్ వేదికగా ప్రపంచకప్-2023లో డిఫెండింగ్ చాంపియన్గా బరిలోకి దిగిన ఇంగ్లండ్కు ఏదీ కలిసి రావడం లేదు. టైటిల్ ఫేవరెట్ అనుకుంటే కనీసం సెమీస్ చేరే పరిస్థితి కూడా లేకుండా పోయింది. పటిష్ట జట్టుగా పేరొందిన బట్లర్ బృందం ఇప్పటి వరకు ఆడిన ఆరు మ్యాచ్లలో కేవలం ఒక్కటంటే ఒక్క విజయమే సాధించింది. View this post on Instagram A post shared by ICC (@icc) పాయింట్ల పట్టికలో అట్టడుగున నిలిచి ‘పసికూన’ నెదర్లాండ్స్ కంటే అధ్వాన్న స్థితిలో నిలిచింది. తాజాగా టీమిండియా చేతిలో 100 పరుగుల తేడాతో చిత్తుగా ఓడిన ఇంగ్లండ్.. తదుపరి ఆస్ట్రేలియా, నెదర్లాండ్స్, పాకిస్తాన్లపై గెలుపొంది పాయింట్ల పట్టికలో ఏడో స్థానానికి చేరుకుంటేనే చాంపియన్స్ ట్రోఫీ ఆడే అవకాశం ఉంటుంది. లేదంటే మరో ఘోర పరాభవం తప్పదు. చదవండి: CWC 2023: ఇంగ్లండ్పై గ్రాండ్ విక్టరీ.. రోహిత్ శర్మ సాధించిన ఘనతలు -
WC 2023: అంతా స్టార్లే కనిపిస్తారు.. కానీ వాస్తవం ఏమిటంటే: గంభీర్
ICC WC 2023- Ind vs Eng: ‘‘జాతీయ మీడియా, సోషల్ మీడియాలో భారత్, పాకిస్తాన్ కామెంటేటర్లు పరస్పర దూషణలతో చెలరేగుతుంటే మరో వైపు అందమైన, మానవ సంబంధాల కథనం ఒకటి నేను చదివాను. దిగ్గజ క్రికెటర్ బిషన్సింగ్ బేడి సర్ చనిపోయినప్పుడు ఆయన మిత్రుడు, పాక్ మాజీ కెప్టెన్ ఇంతికాబ్ ఆలమ్ ఇది రాశారు. మామూలుగా నేను అంత తొందరగా భావోద్వేగానికి గురి కాను. కానీ ఇది నన్ను కదిలించింది. ఈ రోజు భారత్, ఇంగ్లండ్ మధ్య మ్యాచ్లు ఆడబోయే క్రికెటర్లు పేర్లు చూస్తే అంతా స్టార్లే కనిపిస్తారు. కానీ వాస్తవం అందుకు భిన్నంగా ఉంది. ఇంత పెద్ద లైనప్ ఉండి కూడా ఇంగ్లండ్ దాదాపు చివరి స్థానంలో కొనసాగుతోంది. భారత జట్టును చూస్తే నా చిన్నప్పటి రోజులు గుర్తుకు వచ్చాయి. చివరి బెంచీలో ఉండే మేం ఆఖరి నిమిషంలో చదివేందుకు కిందా మీదా పడుతుంటే అదే సమయంలో మెరికల్లాంటి ఇతర విద్యార్థులు పరీక్షకు ముందు చాలా ప్రశాంతంగా, ఆడుతూ పాడుతూ కనిపించేవారు. భారత్ కోణంలో ఈ ‘ఇంగ్లీష్ పరీక్ష’ చాలా సులువైంది అయితే ఇంగ్లండ్ మాత్రం కష్టాల్లో ఉంది. పిచ్కు స్పిన్కు అనుకూలిస్తే మాత్రం ఇవి రెట్టింపవుతాయి. టాస్ గెలిస్తే బ్యాటింగ్ ఎంచుకోవడం ఉత్తమం’’ అని టీమిండియా మాజీ క్రికెటర్ గౌతం గంభీర్ అభిప్రాయపడ్డాడు. వన్డే వరల్డ్కప్-2023లో డిఫెండింగ్ చాంపియన్ ఇంగ్లండ్ దుస్థితిని వివరిస్తూ.. ఆదివారం నాటి మ్యాచ్లో టీమిండియానే ఫేవరెట్ అని పేర్కొన్నాడు. కాగా లక్నో వేదికగా రోహిత్ సేన బట్లర్ బృందంతో తలపడనుంది. -
జగజ్జేతలకు ఏంటీ దుస్థితి.. పుంజుకుంటారా లేక అవమాన భారంతో నిష్క్రమిస్తారా..?
వన్డే ఫార్మాట్తో పాటు పొట్టి ఫార్మాట్లోనూ డిఫెండింగ్ ఛాంపియన్గా ఉన్న ఇంగ్లండ్ క్రికెట్ జట్టుకు ప్రస్తుత వన్డే ప్రపంచకప్లో గ్రహణం పట్టినట్లుంది. ప్రస్తుత ఎడిషన్లో ఆ జట్టు ఇప్పటివరకు ఆడిన ఐదు మ్యాచ్ల్లో నాలుగింట ఓటమిపాలై, అవమానకర రీతిలో టోర్నీ నుంచి నిష్క్రమించే స్థితికి చేరింది. భారీ అంచనాల నడుమ వరల్డ్కప్ బరిలోకి దిగిన బట్లర్ సేన.. న్యూజిలాండ్, సౌతాఫ్రికా లాంటి సమవుజ్జీలతో పాటు ఆఫ్ఘనిస్తాన్, శ్రీలంక లాంటి చిన్న జట్ల చేతిలోనూ ఓటమిపాలై, సెమీస్ అవకాశాలను సంక్లిష్టం చేసుకుంది. చివరి మూడు మ్యాచ్ల్లో దారుణ పరాజయాలు ఎదుర్కొన్న ఇంగ్లీష్ టీమ్.. పాయింట్ల పట్టికలో చివరి నుంచి రెండో స్థానంలో (నెదర్లాండ్స్కు ముందు) నిలిచింది. స్టోక్స్ ఎంట్రీ ఇచ్చినా ఒరింగిదేమీ లేదు..! గాయం నుంచి పూర్తిగా కోలుకోని బెన్ స్టోక్స్ను హడావుడి చేసి (వన్డే ఫార్మాట్ రాజీనామా ఉపసంహరణ) వరల్డ్కప్ బరిలోకి దించిన ఇంగ్లీష్ టీమ్.. అందుకు తగిన మూల్యమే చెల్లించుకుంది. ఫిట్గా లేని స్టోక్స్కు తుది జట్టులో ఆడించలేక.. అతని స్థానంలో మరో ఆటగాడిని ఎంపిక చేయలేక సతమతమైన ఇంగ్లీష్ మేనేజ్మెంట్.. ఎట్టకేలకు ధైర్యం చేసి సౌతాఫ్రికాతో మ్యాచ్లో అతన్ని బరిలోకి దించినప్పటికీ ఫలితం లేకుండా పోయింది. అతను ఆడిన రెండు మ్యాచ్ల్లో నామమాత్రపు ప్రదర్శనకే పరిమితమయ్యాడు. సౌతాఫ్రికాతో మ్యాచ్లో 5, లంకతో మ్యాచ్లో 43 పరుగులు మాత్రమే చేసి దారుణంగా నిరాశపరిచాడు. స్టోక్స్ బంతితో ఏమైనా అద్భుతాలు చేస్తాడా అనుకుంటే.. అతను బంతిపట్టి చాలాకాలమే అయ్యింది. అరివీరభయంకరులైన బ్యాటర్లకు ఏమైంది..? ప్రస్తుత వరల్డ్కప్లో ఇంగ్లండ్ వరుస ఓటములకు ప్రధాన కారణం బ్యాటర్ల వైఫల్యమే అని చెప్పాలి. అరివీర భయంకరులతో ఆ జట్టు బ్యాటింగ్ లైనప్ నిండివున్నా ఈ టోర్నీలో వారు చేసిందేమీ లేదు. డేవిడ్ మలాన్, జో రూట్ కాస్త పర్వాలేదనిపించినా.. బెయిర్స్టో, బట్లర్, లివింగ్స్టోన్, మొయిన్ అలీ దారుణంగా నిరాశపరిచారు. బౌలర్ల ప్రదర్శన అంతంతమాత్రమే.. ఈ టోర్నీలో ఇంగ్లండ్ జట్టు బ్యాటింగ్తో పాటు బౌలింగ్లోనూ దారుణంగా నిరాశపరిచింది. టోర్నీ తొలి మ్యాచ్లో (న్యూజిలాండ్తో) 283 పరుగుల లక్ష్యాన్ని కాపాడుకోవడంలో ఆ జట్టు బౌలర్లు చేతులెత్తేశారు. ప్రత్యర్ధి వీరు నిర్ధేశించిన లక్ష్యాన్ని కేవలం 36.2 ఓవర్లలో ఛేదించింది. ఈ మ్యాచ్లో కివీస్ బ్యాటర్లు డెవాన్ కాన్వే, రచిన్ రవీంద్ర విధ్వంసకర శతకాలతో ఇంగ్లీష్ బౌలర్లను చీల్చిచెండాడారు. బంగ్లాదేశ్తో మ్యాచ్లో మలాన్ భారీ సెంచరీతో కదంతొక్కడంతో ప్రత్యర్ధికి (బంగ్లాదేశ్) 365 పరుగుల లక్ష్యాన్ని నిర్ధేశించిన ఇంగ్లీష్ టీమ్.. ఈ లక్ష్యాన్ని కాపాడుకోవడంలో సఫలమైంది. ఈ మ్యాచ్లో ఇంగ్లండ్ బౌలర్లు తలా ఓ చేయి వేసి ప్రత్యర్ధిని 48.2 ఓవర్లలో 227 పరుగులకు ఆలౌట్ చేశారు. ఆఫ్ఘనిస్తాన్తో మ్యాచ్ విషయానికొస్తే.. ఈ మ్యాచ్లో ఇంగ్లండ్ బ్యాటర్లు ఘోరంగా విఫలమయ్యారు. ఆఫ్ఘన్ బౌలర్లు ఓ మోస్తరు లక్ష్యఛేదనలో (285) ఇంగ్లండ్ను 215 పరుగులకే కుప్పకూల్చి సంచలన విజయం సాధించారు. అనంతరం సౌతాఫ్రికా, శ్రీలంక చేతుల్లో అదే పరాభవాలు.. ఆఫ్ఘనిస్తాన్ షాకివ్వడంతో ఇంగ్లండ్ జట్టు టోర్నీ తరువాతి మ్యాచ్ల్లో ఒళ్లు దగ్గరపెట్టుకుని ఆడుతుందని అంతా అనుకున్నారు. అయితే ఇది జరగకపోగా.. ఇంగ్లండ్ ప్రదర్శన మరింత అధ్వానంగా మారింది. సౌతాఫ్రికాతో మ్యాచ్లో ఇంగ్లండ్ బౌలర్లు ఏకంగా 399 పరుగులు సమర్పించుకోగా.. బ్యాటర్లంతా మూకుమ్మడిగా చేతులెత్తేయడంతో ఇంగ్లండ్ టీమ్ 170 పరుగులకే కుప్పకూలి మరో దారుణ పరాజయాన్ని మూటగట్టుకుంది. ఇది మరిచిపోయేలోపే మరో షాక్.. ఆఫ్ఘనిస్తాన్, సౌతాఫ్రికాల చేతుల్లో దారణ పరాజయాలు మరచిపోయేలోపే ఇంగ్లండ్ టీమ్ను మరో అవమానం పలకరించింది. శ్రీలంకతో జరిగిన మ్యాచ్లో ఇంగ్లండ్ ఆటగాళ్లు అన్ని విభాగాల్లో ఘోరంగా విఫలమై మరో దారుణ పరాభవాన్ని మూటగట్టుకున్నారు. ఈ మ్యాచ్లో తొలుత బ్యాటింగ్ చేసిన ఆ జట్టు 156 పరుగులకు ఆలౌట్ కాగా.. ఇంగ్లండ్ బౌలర్లను సునాయాసంగా ఎదుర్కొన్న లంక బ్యాటర్లు 25.4 ఓవర్లలోనే లక్ష్యాన్ని ఛేదించారు. ఇంగ్లండ్ సెమీస్ అవకాశాలు ఇతర జట్ల చేతుల్లో.. ఐదు మ్యాచ్ల్లో నాలుగు పరాజయాల తర్వాత ఇంగ్లండ్ జట్లు పాయింట్ల పట్టికలో చివరి నుంచి రెండో స్థానంలో నిలిచింది. ఆఖరి స్థానంలో నెదర్లాండ్స్ ఉంది. ఈ ఎడిషన్లో ఇంగ్లండ్ సెమీస్కు చేరాడమనే అంశం ఇతర జట్ల జయాపజాలపై అధారపడి ఉంది. ఇంగ్లండ్ తదుపరి ఆడే నాలుగు మ్యాచ్ల్లో భారీ విజయాలు సాధించి.. ప్రస్తుతం పాయింట్ల పట్టికలో టాప్-4లో ఉన్న జట్లు తమకంటే తక్కువ పాయింట్లు కలిగిన జట్ల చేతుల్లో ఓడితే ఇంగ్లండ్కు సెమీస్కు చేరే అవకాశం ఉంటుంది. ప్రస్తుత పరిస్థితుల నేపథ్యంలో ఇంగ్లండ్ పుంజుకుంటుందో లేక అవమాన భారంతో టోర్నీ నుంచి నిష్క్రమిస్తుందో తేలాలంటే మరికొద్ది రోజులు వేచి చూడాల్సిందే. -
WC 2023: పొరపాటు చేయలేదు.. మా ఓటమికి కారణాలివే! అయినా..: బట్లర్
ICC WC 2023- Jos Buttler Comments On Loss: ‘‘మాకిది కష్టకాలం. కెప్టెన్గా నాతో పాటు మా ఆటగాళ్లంతా పూర్తిగా నిరాశకు లోనయ్యాం. మా అత్యుత్తమ ప్రదర్శన కనబరచలేకపోయాం. మా జట్టులో అనుభవజ్ఞులైన క్రికెటర్లు ఎందరో ఉన్నారు. కానీ ఇపుడిలా జరిగిపోయింది. అయినా ఒక్కరోజులో మాది చెత్త టీమ్గా మారిపోదు కదా! అయితే, బాధ.. మాపై మాకు కోపం.. విసుగు వస్తున్నాయి. మేమిలా విఫలం చెందడానికి ఇదీ కారణం అని చెప్పడానికి ఏమీ లేదు. సెలక్షన్ విషయంలో మేము ఎలాంటి పొరపాట్లు చేయలేదు. మాకది అసలు సమస్యే కాదు. అయితే, స్థాయికి తగ్గట్లు ఆడలేకపోతున్నాం అనేది మాత్రం వాస్తవం. ఆ విషయంలో గర్వపడుతున్నాం ఈరోజు రూట్ రనౌట్ కావడం వంటి అంశాలు తీవ్ర ప్రభావం చూపాయి. సాధారణంగా మేము ఇలాంటి తప్పులు చేయము. ఈరోజు భాగస్వామ్యాలు నెలకొల్పడంలోనూ పూర్తిగా వైఫల్యం చెందాం. బ్యాట్, బంతి.. రెండింటితోనూ కనీస స్థాయి ప్రదర్శన కనబరచలేకపోయాం. ఏదేమైనా పటిష్ట జట్టుగా ఎదిగిన తీరు, మేము నెలకొల్పిన ప్రమాణాల పట్ల గర్వపడుతున్నాం. మిగిలిన మ్యాచ్లలో తిరిగి పుంజుకుని రాణిస్తామనే నమ్మకం ఉంది. ఏం జరుగుతుందో చూద్దాం’’అని ఇంగ్లండ్ కెప్టెన్ జోస్ బట్లర్ అన్నాడు. కాగా వన్డే వరల్డ్కప్-2023లో డిఫెండింగ్ చాంపియన్ హోదాలో అడుగుపెట్టిన ఇంగ్లండ్ వరుస పరాభవాలు మూటగట్టుకుంటోంది. శ్రీలంక చేతిలో మరోసారి చిత్తుగా తాజాగా బెంగళూరులో గురువారం శ్రీలంక చేతిలో 8 వికెట్ల తేడాతో చిత్తుగా ఓడింది ఇంగ్లండ్. వరల్డ్కప్ చరిత్రలో ఇంగ్లండ్పై ఏకపక్ష విజయాలతో దూసుకుపోతున్న శ్రీలంక మరోసారి అదే ఫీట్ రిపీట్ చేయడంతో ఇంగ్లండ్కు మరో ఘోర ఓటమి ఎదురైంది. దీంతో హాట్ ఫేవరెట్లలో ఒకటిగా బరిలోకి దిగిన బట్లర్ బృందం సెమీస్ అవకాశాలు సంక్లిష్టంగా మారాయి. ఈ నేపథ్యంలో ఓటమిపై స్పందించిన ఇంగ్లండ్ కెప్టెన్ జోస్ బట్లర్ స్థాయికి తగ్గట్లు ఆడలేక పరాభవాల పాలవుతున్నామని పేర్కొన్నాడు. తదుపరి మ్యాచ్లలో గెలుపే లక్ష్యంగా ముందుకు సాగుతామని తెలిపాడు. ఇంగ్లండ్ వర్సెస్ శ్రీలంక స్కోర్లు: ►టాస్- ఇంగ్లండ్- బ్యాటింగ్ ►ఇంగ్లంగ్ స్కోరు: 156 (33.2) ►శ్రీలంక స్కోరు: 160/2 (25.4) ►8 వికెట్ల తేడాతో శ్రీలంక విజయం ►ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్: లాహిరు కుమార(మూడు వికెట్లు) ►టాప్ స్కోరర్: పాతుమ్ నిసాంక(77- నాటౌట్) చదవండి: శ్రీలంక చేతిలో ఇంగ్లండ్కు మరో ఘోర ఓటమి.. సెమీస్ రేసు నుంచి నిష్క్రమించినట్లేనా? View this post on Instagram A post shared by ICC (@icc) -
WC 2023: శ్రీలంకతో మ్యాచ్.. ఇంగ్లండ్కు భారీ షాక్! తుది జట్లు ఇవే
ICC Cricket World Cup 2023- England vs Sri Lanka: వన్డే వరల్డ్కప్-2023లో శ్రీలంకతో మ్యాచ్లో టాస్ గెలిచిన ఇంగ్లండ్ తొలుత బ్యాటింగ్ ఎంచుకుంది. ఈ మ్యాచ్లో తాము మూడు మార్పులతో బరిలోకి దిగుతున్నట్లు ఇంగ్లండ్ కెప్టెన్ జోస్ బట్లర్ వెల్లడించాడు. ఇంగ్లండ్కు షాక్.. అతడు దూరం క్రిస్ వోక్స్, మొయిన్ అలీ, లియామ్ లివింగ్స్టోన్ తుదిజట్టులోకి వచ్చినట్లు తెలిపాడు. వేలికి గాయమైన కారణంగా స్టార్ పేసర్ రీస్ టోప్లే స్వదేశానికి తిరిగి వెళ్లిపోయినట్లు బట్లర్ పేర్కొన్నాడు. అట్కిన్సన్, హ్యారీ బ్రూక్లు కూడా లంకతో మ్యాచ్లో ఆడటం లేదని తెలిపాడు. వాళ్లిద్దరు అవుట్ ఇక ఇంగ్లండ్తో మ్యాచ్కు చమిక, హేమంత స్థానాల్లో ఏంజెలో మ్యాథ్యూస్, కుమార తుదిజట్టులోకి వచ్చినట్లు లంక సారథి కుశాల్ మెండిస్ తెలిపాడు. దసున్ షనక గైర్హాజరీలో కెప్టెన్సీ చేపట్టిన తనకు ఆటగాళ్లంతా పూర్తి మద్దతుగా నిలుస్తున్నారని పేర్కొన్నాడు. బెంగళూరు మ్యాచ్లో తాము విజయం సాధిస్తామనే నమ్మకం ఉందని ధీమా వ్యక్తం చేశాడు. కాగా డిఫెండింగ్ చాంపియన్ ఇంగ్లండ్ సెమీస్ రేసులో నిలవాలంటే ఈ మ్యాచ్లో కచ్చితంగా నెగ్గాల్సిందే! తుది జట్లు: శ్రీలంక కుశాల్ పెరీరా, కుశాల్ మెండిస్(కెప్టెన్/ వికెట్ కీపర్), సదీర సమరవిక్రమ, చరిత్ అసలంక, ధనుంజయ డిసిల్వా, ఏంజెలో మాథ్యూస్, మహీష్ దీక్షానా, కసున్ రజిత, లాహిరు కుమార, దిల్షాన్ మదుశంక. ఇంగ్లండ్ జానీ బెయిర్ స్టో, డేవిడ్ మలాన్, జో రూట్, బెన్ స్టోక్స్, జోస్ బట్లర్(కెప్టెన్/ వికెట్ కీపర్), లియామ్ లివింగ్స్టోన్, మొయిన్ అలీ, క్రిస్ వోక్స్, డేవిడ్ విల్లీ, ఆదిల్ రషీద్, మార్క్ వుడ్. చదవండి: WC 2023: ఇంగ్లండ్తో మ్యాచ్.. స్టార్ పేసర్కు రెస్ట్! జట్టులోకి అశ్విన్.. ఎందుకంటే? -
WC 2023: వాళ్లు అద్భుతం.. మేము ఓడిపోవడానికి ప్రధాన కారణాలు అవే.. కానీ: బట్లర్
వన్డే వరల్డ్కప్-2023లో అఫ్గనిస్తాన్ చేతిలో ఊహించని రీతిలో డిఫెండింగ్ చాంపియన్ ఇంగ్లండ్ ఓటమి చెంది విమర్శల పాలైంది. అఫ్గన్ బ్యాటర్లు అద్భుత ప్రదర్శనతో ఆకట్టుకున్న చోట.. ఇంగ్లండ్ ‘పటిష్ట’ బ్యాటింగ్ ఆర్డర్ తేలిపోయింది. మెరుగైన భాగస్వామ్యాలు కరువై ఓటమిని కొనితెచ్చుకుంది. ఫలితంగా తాజా ప్రపంచకప్ ఎడిషన్లో రెండో పరాజయాన్ని మూటగట్టుకుంది. ఓవైపు టీమిండియా, న్యూజిలాండ్ ఓటమి అన్నదే లేక రేసులో దూసుకుపోతున్న వేళ ఇంగ్లండ్ మాత్రం రోజురోజుకీ వెనుబడిపోతోంది. View this post on Instagram A post shared by ICC (@icc) ఢిల్లీలోని అరుణ్జైట్లీ స్టేడియంలో ఇంగ్లండ్- అఫ్గనిస్తాన్ మధ్య ఆదివారం మ్యాచ్ జరిగిన విషయం తెలిసిందే. టాస్ గెలిచి ఇంగ్లండ్ తొలుత బౌలింగ్ ఎంచుకుంది. ఈ క్రమంలో ఆది నుంచే ఇంగ్లండ్ బౌలర్లపై ఒత్తిడి పెంచారు అఫ్గన్ ఓపెనర్ రహ్మనుల్లా గుర్బాజ్. 57 బంతుల్లో 8 ఫోర్లు, 6 సిక్సర్ల సాయంతో 80 పరుగులతో చెలరేగాడు. ఈ క్రమంలో తిరిగి పుంజుకున్న ఇంగ్లండ్ బౌలర్లు అఫ్గన్ మిడిలార్డర్ను కుప్పకూల్చారు. అయితే, ఆరో స్థానంలో బరిలోకి దిగిన వికెట్ కీపర్ ఇక్రం అలిఖిల్ అర్ద శతకం(58)తో రాణించగా... రషీద్ ఖాన్ 23, ముజీబ్ ఉర్ రహ్మమాన్ 28 పరుగులతో అఫ్గన్ మంచి స్కోరు చేయడంలో తమ వంతు పాత్ర పోషించారు. ఈ క్రమంలో 49.5 ఓవర్లలో 284 పరుగులు చేసి అఫ్గన్ ఆలౌట్ అయింది. లక్ష్య ఛేదనలో ఇంగ్లిష్ జట్టుకు ఆరంభంలోనే ఎదురుదెబ్బ తగిలింది. ఓపెనర్ జానీ బెయిర్ స్టో 2 పరుగులకే పెవిలియన్ చేరగా.. మలన్ 32 రన్స్ స్కోరు చేశాడు. జో రూట్(11) విఫలం కాగా.. హ్యారీ బ్రూక్(66) ఒంటరి పోరాటం చేశాడు. మిగతా బ్యాటర్ల నుంచి అతడికి సహాయం కరువైంది. ఆఖర్లో ఆదిల్ రషీద్(20), మార్క్ వుడ్(18) బౌండరీలు బాది కాసేపు ఫ్యాన్స్ను సంతోషపెట్టగలిగారు గానీ జట్టును ఓటమి నుంచి తప్పించలేకపోయారు. View this post on Instagram A post shared by ICC (@icc) అఫ్గన్ బౌలర్ల దెబ్బకు 40.3 ఓవర్లకే ఇంగ్లండ్ కథ ముగిసిపోయింది. 215 పరుగులకే ఆలౌటై 69 పరుగుల తేడాతో ఓడి రన్రేటు పరంగానూ వెనుకబడిపోయింది. ఈ నేపథ్యంలో ఓటమిపై స్పందించిన జోస్ బట్లర్.. ‘‘టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకుని.. మొదటి బంతి నుంచే పరుగులు ఇవ్వడం నిరాశ పరిచింది. ఏదేమైనా ఈ మ్యాచ్లో అఫ్గనిస్తాన్ అద్భుతంగా ఆడింది. అందుకు వాళ్లకు క్రెడిట్ ఇవ్వాల్సిందే. మేము బౌలింగ్, బ్యాటింగ్లోనూ స్థాయికి తగ్గట్లు రాణించడంలో విఫలమయ్యాం. వాళ్ల జట్టులో కొంతమంది అద్భుతమైన బౌలర్లు ఉన్నారు. నిజానికి మేము ఊహించినట్లుగా పిచ్పై డ్యూ(తేమ) లేదు. మా బౌలర్లు విఫలమైన చోట వాళ్ల బౌలర్లు పిచ్ పరిస్థితులను సద్వినియోగం చేసుకున్నారు. ఈ ఓటమి కచ్చితంగా మమ్మల్ని బాధించేదే! కానీ.. అదే తలచుకుని బాధపడితే ఎలాంటి ప్రయోజనం ఉండదు. మా ఆటగాళ్లకు పట్టుదల ఎక్కువ.. జట్టు మరింత స్ట్రాంగ్గా కమ్బ్యాక్ ఇస్తుంది. ఒత్తిడిని తట్టుకుని రాణించగల ఆటగాళ్లు మా జట్టులో ఉన్నారు’’ అని పేర్కొన్నాడు. ప్రత్యర్థి ఆట తీరును ప్రశంసిస్తూ.. ఓటమిని హుందాగా అంగీకరిస్తూనే.. తిరిగి పుంజుకుంటామని బట్లర్ ధీమా వ్యక్తం చేశాడు. కాగా ఈ మ్యాచ్లో.. పొదుపుగా బౌలింగ్ చేసి మూడు కీలక వికెట్లు పడగొట్టిన ముజీబ్ ఉర్ రహ్మాన్ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు అందుకున్నాడు. అఫ్గన్ లోయర్ ఆర్డర్లో బ్యాటింగ్ చేసిన అతడు.. ఇంగ్లండ్ ఇన్నింగ్స్లో 28 పరుగులు చేయడంతో పాటు 10 ఓవర్ల బౌలింగ్లో 51 పరుగులిచ్చి కీలక వికెట్లు తీశాడు. View this post on Instagram A post shared by ICC (@icc) -
బోణీ కొట్టిన ఇంగ్లండ్.. 137 పరుగుల తేడాతో బంగ్లాదేశ్ చిత్తు
వన్డే ప్రపంచకప్-2023లో ఇంగ్లండ్ బోణీ కొట్టింది. ధర్మశాల వేదికగా బంగ్లాదేశ్తో జరిగిన మ్యాచ్లో 137 పరుగుల తేడాతో ఇంగ్లండ్ విజయం సాధించింది. ఈ మ్యాచ్లో తొలుత బ్యాటింగ్ చేసిన ఇంగ్లండ్.. నిర్ణీత 50 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 364 పరుగుల భారీ స్కోర్ చేసింది. ఇంగ్లండ్ బ్యాటర్లలో ఓపెనర్ డేవిడ్ మలాన్(107 బంతుల్లో 140) విధ్వసకర శతకంతో విరుచుకుపడ్డాడు. అతడితో పాటు జో రూట్(82), జానీ బెయిర్ స్టో(52) హాఫ్ సెంచరీలతో అదరగొట్టారు. బంగ్లాదేశ్ బౌలర్లలో మెహదీ హసన్ 4 వికెట్లు పడగొట్టగా.. షోర్ఫుల్ ఇస్లాం మూడు, టాస్కిన్ అహ్మద్, షకీబ్ తలా వికెట్ సాధించారు. బంగ్లా టాప్ లేపిన టాప్లీ.. 365 పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన బంగ్లాదేశ్ 227 పరుగులకు ఆలౌటైంది. ఇంగ్లండ్ పేసర్ టాప్లీ.. ఆదిలోనే మూడు వికెట్లు పడగొట్టి బంగ్లాను కోలుకోలేని దెబ్బతీశాడు. బంగ్లాబ్యాటర్లలో లిటన్ దాస్(76) పరుగులతో టాప్ స్కోరర్గా నిలవగా.. రహీమ్(51) తౌహిద్ హృదయ్(39) పరుగులతో పర్వాలేదనపించారు. ఇంగ్లండ్ బౌలర్లలో టాప్లీ 4 వికెట్లు.. క్రిస్ వోక్స్ రెండు, వుడ్, సామ్ కర్రాన్,రషీద్, లివింగ్ స్టోన్ తలా వికెట్ సాధించారు. ఇంగ్లండ్ తమ తదుపరి మ్యాచ్లో ఆక్టోబర్ 15న ఢిల్లీ వేదికగా ఆఫ్టానిస్తాన్తో తలపడనుంది. చదవండి: ODI WC 2023: చరిత్ర సృష్టించిన మెండిస్.. వన్డే ప్రపంచకప్లో ఫాస్టెస్ట్ సెంచరీ! View this post on Instagram A post shared by ICC (@icc) View this post on Instagram A post shared by ICC (@icc) -
వారిద్దరే మా ఓటమిని శాసించారు.. చాలా బాధగా ఉంది! కానీ: బట్లర్
వన్డే ప్రపంచకప్-2023ను డిఫెండింగ్ ఛాంపియన్స్ ఇంగ్లండ్ ఘోర ఓటమితో ఆరంభించింది. అహ్మదాబాద్ వేదికగా న్యూజిలాండ్తో జరిగిన తొలి మ్యాచ్లో ఏకంగా 9 వికెట్ల తేడాతో ఇంగ్లండ్ పరాజయం పాలైంది. బ్యాటింగ్లో పర్వాలేదన్పించిన ఇంగ్లీష్ జట్టు.. బౌలింగ్లో మాత్రం చేతిలేత్తేసింది. 283 పరుగుల లక్ష్యాన్ని కేవలం ఒక్క వికెట్ కోల్పోయి 36.2 ఓవర్లలలోనే కివీస్ ఛేదించింది. కివీస్ బ్యాటర్లలో ఓపెనర్ డెవాన్ కాన్వే(152), రచిన్ రవీంద్ర(123) ఆజేయ శతకాలతో చెలరేగారు. ఇంగ్లండ్ బౌలర్లలో సామ్ కర్రాన్ తప్ప మిగితా ఎవరూ వికెట్ సాధించలేకపోయారు. అంతకుముందు బ్యాటింగ్ చేసిన ఇంగ్లండ్ నిర్ణీత 50 ఓవర్లలో వికెట్ నష్టానికి 283 పరుగులు చేసింది. ఇంగ్లండ్ బ్యాటర్లలో జో రూట్(77) పరుగులతో టాప్ స్కోరర్గా నిలిచాడు. ఇక ఈ ఓటమిపై మ్యాచ్ అనంతరం ఇంగ్లండ్ కెప్టెన్ జోస్ బట్లర్ స్పందించాడు. తమ బ్యాటింగ్ తీరు పట్ల బట్లర్ ఆసహనం వ్యక్తం చేశాడు. వారిద్దరూ అద్బుతం "తొలి మ్యాచ్లోనే న్యూజిలాండ్ చేతిలో ఓటమి పాలవ్వడం మమ్మల్ని తీవ్ర నిరాశపరిచింది. అయితే ఈ టోర్నీలో మాకు ఇంకా చాలా మ్యాచ్లు ఉన్నాయి. కాబట్టి ఈ ఓటమిని ఎంతవేగం మర్చిపోతే అంతమంచిది. మా జట్టులో అద్భుతమైన ఆటగాళ్లు ఉన్నారు. ఇప్పటికే చాలా క్రికెట్ ఆడారు. ఇంతకు ముందు చాలా జట్లను ఈ విధంగానే మేము ఓడించాము. అదే విధంగా ఇటువంటి పరాజయాలు గతంలో కూడా మాకు ఎదురయ్యాయి. కానీ ఆ తర్వాతి మ్యాచ్ల్లో అద్బుతమైన కమ్బ్యాక్ ఇచ్చి విజయాలను సాధించాము. మేము ఈ మ్యాచ్లో బ్యాటింగ్ పరంగా మెరుగైన ప్రదర్శన చేయలేదు. న్యూజిలాండ్ బ్యాటింగ్ను చూసి ఈ మాట చెప్పడం లేదు. ఎందుకంటే వికెట్ బ్యాటింగ్కు చాలా బాగుంది. మేము ఈ పిచ్పై 330 పరుగులు చేయాల్సింది. రెండో ఇన్నింగ్స్లో పిచ్ బ్యాటింగ్కు మరింత అనుకూలించింది. ఆరంభంలోనే వికెట్ కోల్పోయిన న్యూజిలాండ్.. కీలక భాగస్వామ్యం నెలకొల్పడం చాలా కష్టం. కానీ మేము సరైన ప్రణాళికలను అమలు చేయడంలో విఫలమయ్యాం. ముఖ్యంగా బ్యాటింగ్లో చెత్త షాట్ సెలక్షన్తో వికెట్లను కోల్పోయాం. అయితే ఈ టోర్నీలో మేము పాజిటివ్గా ఆడాల్సిన అవసరం ఉంది. మరీ డిఫెన్సీవ్గా ఆడాల్సిన పని కూడా లేదు. మా శైలిలోనే మేము ఆడుతాం. కానీ న్యూజిలాండ్ మాత్రం అద్బుతంగా ఆడింది. వారు షాట్ సెలక్షన్స్ కూడా చాలా బాగుంది. అందుకు తగ్గట్టు ప్రతిఫలం కూడా దక్కింది. కాన్వే లాంటి ఆటగాడు భారీ షాట్లు ఆడలేదు, కానీ తన బ్యాటింగ్ టెక్నిక్తో చాలా త్వరగా పరుగులు సాధించాడు. రచిన్ రవీంద్ర కూడా ఆ విధంగానే ఆడాడు. వీరి నుంచి మేము ఇటువంటి ప్రదర్శన వస్తుందని అస్సలు ఊహించలేదు. వీరిద్దరూ అద్భుతమైన భాగస్వామ్యం నెలకొల్పారు. అదే మా ఓటమిని శాసించింది. ఫ్లడ్ లైట్స్ కింద బౌలింగ్ చేయడం కష్టమనే ముందుగా బౌలింగ్ చేయాలనుకున్నాం. కానీ అది జరగలేదు. ఇక జోరూట్ అద్భుతంగా బ్యాటింగ్ చేశాడు. అతడు ఫామ్పై మాకు ఎటువంటి సందేహం లేదు. అతను ఏ ఫార్మాట్లో ఆడినా రన్ మిషన్. స్టోక్స్ కూడా ఫిట్నెస్ సాధిస్తాడని ఆశిస్తున్నామని" పోస్ట్ మ్యాచ్ ప్రేజేంటేషన్లో బట్లర్ పేర్కొన్నాడు. 👉: (ఫొటో గ్యాలరీ కోసం ఇక్కడ క్లిక్ చేయండి) -
మేము కూడా ముందు బౌలింగ్ చేయాలనుకున్నాం.. కానీ! స్టోక్స్కు: బట్లర్
క్రికెట్లో అత్యున్నత టోర్నీ వన్డే ప్రపంచకప్-2023 ప్రారంభమైంది. అహ్మదాబాద్ వేదికగా డిఫెండింగ్ ఛాంపియన్స్ ఇంగ్లండ్- న్యూజిలాండ్ మ్యాచ్తో ఈ మెగా టోర్నీకి తెరలేచింది. ఈ మ్యాచ్లో టాస్ గెలిచిన న్యూజిలాండ్ కెప్టెన్ టామ్ లాథమ్ తొలుత ఇంగ్లడ్ను బ్యాటింగ్ అహ్హనించాడు. తొలి మ్యాచ్కు కేన్ విలియమ్సన్ దూరం కావడంతో లాథమ్ జట్టు పగ్గాలు చేపట్టాడు. అదే విధంగా ఈ మ్యాచ్కు ఇంగ్లండ్ ఆల్రౌండర్ బెన్ స్టోక్స్ దూరమయ్యాడు. స్టోక్స్ ప్రస్తుతం తుంటి గాయంతో బాధపడుతున్నాడు. ఈ విషయాన్ని టాస్ సందర్భంగా జోస్ బట్లర్ తెలిపాడు.బట్లర్ మాట్లాడుతూ.. ఈ పిచ్పై మాకు కూడా ముందు బౌలింగ్ చేయాలని ఉంది. ఎందుకంటే అహ్మదాబాద్ వికెట్ వికెట్ చాలా బాగుంది. ఇక టోర్నీకి అన్ని విధాల సన్నద్దమయ్యాం. అదేవిధంగా మా సొంత గడ్డపై న్యూజిలాండ్ను వన్డే సిరీస్లో ఓడించాం. కాగా ఈ మ్యాచ్కు బెన్ స్టోక్స్ దూరమయ్యాడు. స్టోక్స్ తుంటి గాయంతో బాధపడుతున్నాడు. స్టోక్స్తో పాటు టోప్లీ, విల్లీ, అటిక్సన్ దూరమయ్యారు. చివరగా ఈ టోర్నమెంట్ కోసం ఎంతో అతృతగా మేము ఎదురుచూశమని పేర్కొన్నాడు. తుది జట్లు: న్యూజిలాండ్ డెవాన్ కాన్వే, విల్ యంగ్, రచిన్ రవీంద్ర, డారిల్ మిచెల్, టామ్ లాథమ్(వికెట్ కీపర్/ కెప్టెన్), గ్లెన్ ఫిలిప్స్, మార్క్ చాప్మన్, మాట్ హెన్రీ, మిచెల్ శాంట్నర్, జేమ్స్ నీషమ్, ట్రెంట్ బౌల్ట్ ఇంగ్లండ్ జానీ బెయిర్స్టో, డేవిడ్ మలాన్, జో రూట్, హ్యారీ బ్రూక్, జోస్ బట్లర్(కెప్టెన్/ కెప్టెన్), లియామ్ లివింగ్స్టోన్, మొయిన్ అలీ, సామ్ కరన్, క్రిస్ వోక్స్, ఆదిల్ రషీద్, మార్క్ వుడ్. చదవండి: Eng Vs NZ: వాళ్లిద్దరు లేరు కదా! ఇదేం ప్రశ్న? నవ్వు ఆపుకొన్న బట్లర్! వీడియో -
WC 2023 Eng Vs NZ: టాస్ గెలిచిన కివీస్.. ఇంగ్లండ్కు షాక్
ICC Cricket World Cup 2023- England vs New Zealand: వన్డే వరల్డ్కప్-2023కు తెరలేచింది. భారత్ వేదికగా పుష్కరకాలం తర్వాత మెగా టోర్నీ ఆరంభమైంది. అహ్మదాబాద్లోని నరేంద్ర మోదీ స్టేడియంలో గురువారం.. డిఫెండింగ్ చాంపియన్ ఇంగ్లండ్- గత ఎడిషన్ రన్నరప్ న్యూజిలాండ్ మధ్య మ్యాచ్కు సర్వం సిద్ధమైంది. ఇంగ్లండ్కు షాక్.. స్టోక్స్ లేకుండానే టాస్ గెలిచిన న్యూజిలాండ్ తొలుత బౌలింగ్ ఎంచుకుంది. ఇక 2019 వరల్డ్కప్ హీరో బెన్ స్టోక్స్ లేకుండానే ఇంగ్లండ్.. కివీస్తో బరిలోకి దిగనుంది. గాయం వేధిస్తున్న క్రమంలో అతడు జట్టుకు దూరం కావడం పెద్ద ఎదురుదెబ్బ. వాళ్లు ముగ్గురూ మిస్ కాగా కొన్నాళ్ల క్రితం 50 ఓవర్ల ఫార్మాట్కు రిటైర్మెంట్ ప్రకటించిన స్టోక్స్.. ఇంగ్లండ్ బోర్డు విజ్ఞప్తి మేరకు తన నిర్ణయం వెనక్కి తీసుకున్న విషయం తెలిసిందే. ఇదిలా ఉంటే.. రెగ్యులర్ కెప్టెన్ కేన్ విలియమ్సన్ గైర్హాజరీలో టామ్ లాథమ్ న్యూజిలాండ్కు సారథ్యం వహించనున్నాడు. ఈ సందర్భంగా.. లాథమ్ మాట్లాడుతూ.. ‘‘టోర్నీ కోసం పూర్తి స్థాయిలో సన్నద్ధమయ్యాం. పిచ్ బాగుంది. పాతబడే కొద్దీ బ్యాటింగ్కు అనుకూలిస్తుందనుకుంటున్నాం. అందుకే తొలుత బౌలింగ్ ఎంచుకున్నాం. దురదృష్టవశాత్తూ కేన్ ఇంకా మ్యాచ్ ఆడేందుకు సిద్ధం కాలేదు. ఫెర్గూసన్ని గాయం వేధిస్తోంది. ఇష్ సోధి, కేన్ విలియమ్సన్, టిమ్ సౌతీ ఈరోజు మిస్సయ్యారు’’ అని పేర్కొన్నాడు. తుది జట్లు: న్యూజిలాండ్ డెవాన్ కాన్వే, విల్ యంగ్, రచిన్ రవీంద్ర, డారిల్ మిచెల్, టామ్ లాథమ్(వికెట్ కీపర్/ కెప్టెన్), గ్లెన్ ఫిలిప్స్, మార్క్ చాప్మన్, మాట్ హెన్రీ, మిచెల్ శాంట్నర్, జేమ్స్ నీషమ్, ట్రెంట్ బౌల్ట్ ఇంగ్లండ్ జానీ బెయిర్స్టో, డేవిడ్ మలాన్, జో రూట్, హ్యారీ బ్రూక్, జోస్ బట్లర్(కెప్టెన్/వికెట్ కీపర్), లియామ్ లివింగ్స్టోన్, మొయిన్ అలీ, సామ్ కరన్, క్రిస్ వోక్స్, ఆదిల్ రషీద్, మార్క్ వుడ్. చదవండి: WC 2023: వన్డేల్లో ఇదే చివరి ప్రపంచకప్? ఆ బద్దకస్తులు అంతే! మనోళ్లు మాత్రం.. -
Eng Vs NZ: వాళ్లిద్దరు లేరు కదా! బట్లర్ రిప్లై ఇదే! వీడియో వైరల్
ICC Cricket World Cup 2023- England vs New Zealand: వన్డే ప్రపంచకప్-2023 ఆరంభ మ్యాచ్ నేపథ్యంలో ఇంగ్లండ్ కెప్టెన్ జోస్ బట్లర్కు వింత ప్రశ్న ఎదురైంది. ఓ రిపోర్టర్ తిక్క ప్రశ్నతో అతడిని ఆశ్చర్యపరిచాడు. అయితే, బట్లర్ మాత్రం హుందాగా సమాధానమిచ్చి అభిమానుల మనసు గెలుచుకున్నాడు. కాగా డిఫెండింగ్ చాంపియన్ ఇంగ్లండ్- గత ఎడిషన్ రన్నరప్ న్యజిలాండ్ మధ్య మ్యాచ్తో గురువారం ప్రపంచకప్ టోర్నకి తెరలేవనుంది. అహ్మదాబాద్లోని నరేంద్ర మోదీ స్టేడియం ఇందుకు వేదిక. ఈ నేపథ్యంలో మ్యాచ్కు ముందు మీడియాతో మాట్లాడిన జోస్ బట్లర్కు ఇంగ్లండ్ జట్టు కూర్పు గురించి ప్రశ్న ఎదురైంది. వాళ్లిద్దరు లేరు కదా! ఓ జర్నలిస్టు.. వెటరన్ పేసర్ జేమ్స్ అండర్సన్, మరో ఫాస్ట్బౌలర్ స్టువర్డ్ బ్రాడ్ లేకుండా ఈ మెగా టోర్నీలో బట్లర్ బృందం ఎలా ఆడబోతుందని ప్రశ్నించారు. ఇందుకు బదులుగా.. ‘‘నాకు తెలిసి జిమ్మీ ఇంకా సెలక్షన్కు అందుబాటులోనే ఉన్నాడనే అనుకుంటున్నా. 2015 నుంచి అతడు ఒక్క వన్డే కూడా ఆడలేదు. ఇక స్టువర్ట్ బ్రాడ్ రిటైర్ అయ్యాడు. కాబట్టి దురదృష్టవశాత్తూ ఈ ఇద్దరు ఈసారి ప్రతిష్టాత్మక ఈవెంట్లో భాగం కావడం లేదు. అయితే, మా జట్టులో మెరుగైన నైపుణ్యాలు గల మరికొంత మంది ఫాస్ట్బౌలర్లు ఉన్నారు. నవ్వు ఆపుకొన్న బట్లర్ స్పిన్నర్లు కూడా అందుబాటులో ఉన్నారు. మా జట్టు సమతూకంగా ఉంది’’ అంటూ బట్లర్ నవ్వులు చిందించాడు. ప్రశ్న అడిగిన వ్యక్తి నవ్వులపాలు కాకుండా చూశాడు. కాగా ఆండర్సన్ టెస్టులపై దృష్టిపెట్టే క్రమంలో 2015లో తన చివరి వన్డే ఆడాడు. ఆ ఏడాది వరల్డ్కప్లో ఆస్ట్రేలియాతో వెల్లింగ్టన్లో 50 ఓవర్ల ఫార్మాట్లో ఆఖరి మ్యాచ్ ఆడేశాడు. అయితే, 41 ఏళ్ల వయసులోనూ రెడ్బాల్ క్రికెట్ జట్టులో కీలక సభ్యుడు కావడం విశేషం. ఇదిలా ఉంటే.. స్టువర్ట్ బ్రాడ్ సైతం ఎక్కువగా టెస్టులు ఆడే క్రమంలో 2016లోనే వన్డేలకు దూరమయ్యాడు. ఇక ఇటీవలే అతడు ఆటకు పూర్తిగా వీడ్కోలు పలికిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో తాజా ఐసీసీ టోర్నమెంట్లో సదరు రిపోర్టర్ వీళ్లిద్దరి ప్రస్తావన తీసుకురాగా.. బట్లర్ ఈ విధంగా స్పందించాడు. ఇక 2019లో తొలిసారి ఇంగ్లండ్కు వరల్డ్కప్ అందించిన ఇయాన్ మోర్గాన్ వారసత్వాన్ని నిలబెట్టేక్రమంలో.. టీ20 ప్రపంచకప్ విజేత బట్లర్ భారత్లో తన వ్యూహాలు ఎలా అమలు చేస్తాడో చూడాలి! చదవండి: WC 2023: వన్డేల్లో ఇదే చివరి ప్రపంచకప్? ఆ బద్దకస్తులు అంతే! మనోళ్లు మాత్రం.. A journalist asked Jos Buttler in the PC if the absence of Anderson and Broad will affect their pace bowling in the tournament?Just look at him,he was trying so hard not to laugh 😂😭.#CWC23 Video Credit: @ICC Facebook pic.twitter.com/1rdOjglfEd — Delhi Capitals Fan (@pantiyerfc) October 4, 2023 -
కోహ్లికి నో ఛాన్స్! మరో టీమిండియా స్టార్కు చోటు.. ఆ ఐదుగురు అదుర్స్: బట్లర్
ICC ODI WC 2023: వన్డే వరల్డ్కప్-2023లో టైటిల్ ఫేవరెట్గా బరిలోకి దిగుతోంది డిఫెండింగ్ చాంపియన్ ఇంగ్లండ్. ఇయాన్ మోర్గాన్ సారథ్యంలో 2019లో మొట్టమొదటిసారిగా జగజ్జేతగా నిలిచిన ఇంగ్లిష్ జట్టు పగ్గాలు ఇప్పుడు స్టార్ బ్యాటర్ జోస్ బట్లర్ చేతిలో ఉన్న విషయం తెలిసిందే. అన్ని విభాగాల్లో పటిష్టంగా బట్లర్ బృందం పరిమిత ఓవర్ల క్రికెట్లో ఆటగాడిగా రాణిస్తూ.. కెప్టెన్గానూ అద్భుత విజయాలతో దూసుకుపోతున్నాడు ఈ వికెట్ కీపర్. గతేడాది ఆస్ట్రేలియా వేదికగా జరిగిన టీ20 ప్రపంచకప్ ట్రోఫీని గెలిచిన రికార్డు బట్లర్ సొంతం. కోహ్లికి నో ఛాన్స్ ఈ నేపథ్యంలో అన్ని విభాగాల్లో వన్డే ప్రపంచకప్లోనూ ఇంగ్లండ్ పటిష్టంగా ఉండటంతో మోర్గాన్ వారసత్వాన్ని బట్లర్ నిలబెట్టే అవకాశాలు పుష్కలంగానే ఉన్నాయి. ఇదిలా ఉంటే.. మెగా టోర్నీ ఆరంభానికి ముందు ఈ రైట్హ్యాండ్ బ్యాటర్ తన డ్రీమ్ ఎలెవన్ వన్డే టీమ్లో మొదటి ఛాయిస్గా ఐదుగురు ప్లేయర్లను ఎంపిక చేసుకున్నాడు. అనూహ్యంగా ఇందులో టీమిండియా స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లికి మాత్రం బట్లర్ చోటివ్వలేదు. అయితే, మరో భారత స్టార్ను మాత్రం తన జట్టుకు ఎంపిక చేశాడు. ఇంతకీ ఆ ఐదుగురు ఎవరంటే? 1.ఆదిల్ రషీద్ ఇంగ్లండ్ స్పిన్నర్ ఆదిల్ రషీద్ ఇప్పటి వరకు అంతర్జాతీయ వన్డేల్లో 5.67 ఎకానమీతో 184 వికెట్లు పడగొట్టాడు. వరల్డ్కప్ టోర్నీలో 11 వికెట్లు తన ఖాతాలో వేసుకున్నాడు. గత 10 వన్డేల్లో రషీద్ ఏకంగా 22 వికెట్లు తీయడం విశేషం. ఈ నేపథ్యంలో బట్లర్ తన మొదటి ఎంపికగా ఆదిల్ పేరు చెప్పాడు. 2.క్వింటన్ డికాక్ సౌతాఫ్రికా వికెట్ కీపర్ బ్యాటర్ క్వింటన్ డికాక్ వన్డేల్లో 95.75 స్ట్రైక్రేటుతో 6176 పరుగులు సాధించాడు. ప్రపంచకప్ ఈవెంట్లో 450 రన్స్ తీశాడు. అదే విధంగా అతడి ఖాతాలో 190 క్యాచ్లు, 16 స్టంపింగ్లు ఉన్నాయి. కాగా తాజా వరల్డ్కప్ తర్వాత తాను వన్డేలకు గుడ్బై చెప్పనున్నట్లు డికాక్ ఇటీవలే ప్రకటించిన విషయం తెలిసిందే. 3.రోహిత్ శర్మ టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ వన్డేల్లో ఇప్పటి వరకు 10112 పరుగులు సాధించాడు. వరల్డ్కప్ టోర్నీలో 978 పరుగులు తీశాడు. 2011లో ప్రపంచకప్ జట్టులో చోటు దక్కించుకోలేకపోయిన రోహిత్.. ఈసారి సొంతగడ్డపై ఏకంగా కెప్టెన్ హోదాలో బరిలోకి దిగనుండటం విశేషం. 4.గ్లెన్ మాక్స్వెల్ ఆస్ట్రేలియా స్టార్ ఆల్రౌండర్ గ్లెన్ మాక్స్వెల్ ఖాతాలో 3495 వన్డే పరుగులు, 64 వికెట్లు ఉన్నాయి. బ్యాట్, బాల్ రెండింటితోనూ రాణించగల సత్తా ఉన్న ఈ స్పిన్ ఆల్రౌండర్ ఆసీస్కు ప్రధాన బలం కానున్నాడు. భారత్లోని స్లో పిచ్లపై ఈసారి ఆఫ్ స్పిన్నర్ మాక్సీ ప్రభావం చూపే అవకాశం ఉంది. 5. అన్రిచ్ నోర్జే సౌతాఫ్రికా పేసర్ అన్రిచ్ నోర్జే వన్డేల్లో ఇప్పటి వరకు 36 వికెట్లు తీశాడు. 29 ఏళ్ల ఈ ఫాస్ట్బౌలర్ గాయం కారణంగా వన్డే వరల్డ్కప్-2023టోర్నీకి దూరమయ్యాడు. 2019లోనూ చేతినొప్పి కారణంగా ఐసీసీ ఈవెంట్ ఆడే అవకాశం కోల్పోయాడు. చదవండి: WC 2023: మునుపటిలా లేదు.. కానీ ఆ జట్టు సెమీస్ చేరితే ఆపడం కష్టం! -
WC- Ind vs Eng: టీమిండియా అభిమానులకు బ్యాడ్న్యూస్!
ICC Cricket World Cup Warm-up Matches 2023- India vs England: వన్డే ప్రపంచకప్-2023 సన్నాహక మ్యాచ్ కోసం ఆశగా ఎదురుచూసిన టీమిండియా అభిమానులకు వరణుడు షాకిచ్చాడు. గువాహటిలో ఎడతెరిపిలేని వర్షం కారణంగా ఇంగ్లండ్తో శనివారం జరగాల్సిన వామప్ మ్యాచ్ రద్దైపోయింది. కాగా అసోంలోని బర్సపరా స్టేడియంలో రోహిత్ సేన.. జోస్ బట్లర్ బృందంతో తమ తొలి వామప్ మ్యాచ్ ఆడేందుకు సిద్ధమైంది. ఈ మ్యాచ్లో టాస్ గెలిచిన భారత జట్టు తొలుత బ్యాటింగ్ ఎంచుకుంది. అయితే, టాస్ అనంతరం వర్షం మొదలుకావడంతో ఆలస్యంగానైనా ఆట మొదలవుతుందని అభిమానులు ఆశించారు. కానీ వరణుడు వాళ్ల ఆశలపై నీళ్లు చల్లాడు. వర్షం తగ్గే సూచనలు కనిపించకపోవడంతో అంపైర్లు టీమిండియా- ఇంగ్లండ్ వామప్ మ్యాచ్ను రద్దు చేస్తున్నట్లు ప్రకటించారు. వన్డే వరల్డ్కప్-2023 వామప్ మ్యాచ్ టీమిండియా (బ్యాటింగ్ ఎలెవన్, ఫీల్డింగ్ ఎలెవన్): రోహిత్ శర్మ(కెప్టెన్), శుభ్మన్ గిల్, విరాట్ కోహ్లి, ఇషాన్ కిషన్, శ్రేయస్ అయ్యర్, కేఎల్ రాహుల్(వికెట్ కీపర్), సూర్యకుమార్ యాదవ్, హార్దిక్ పాండ్యా, రవీంద్ర జడేజా, రవిచంద్రన్ అశ్విన్, కుల్దీప్ యాదవ్, శార్దూల్ ఠాకూర్ , జస్ప్రీత్ బుమ్రా, మహ్మద్ సిరాజ్, మహ్మద్ షమీ. ఇంగ్లండ్ (బ్యాటింగ్ ఎలెవన్, ఫీల్డింగ్ ఎలెవన్): డేవిడ్ మలన్, జానీ బెయిర్స్టో, జో రూట్, హ్యారీ బ్రూక్, జోస్ బట్లర్(కెప్టెన్), లియామ్ లివింగ్స్టోన్, బెన్ స్టోక్స్, మొయిన్ అలీ, క్రిస్ వోక్స్, సామ్ కరన్, డేవిడ్ విల్లీ, ఆదిల్ రషీద్, గుస్ అట్కిన్సన్, రీస్ టోప్లీ, మార్క్ వుడ్. చదవండి: సచిన్, కోహ్లి కాదు! అతడికి బౌలింగ్ చేయడం చాలా కష్టం: డేల్ స్టెయిన్ -
విధ్వంసకర ఇన్నింగ్స్.. వన్డేల్లో హెన్రిచ్ క్లాసెన్ వరల్డ్ రికార్డు
దక్షిణాఫ్రికా బ్యాటర్ హెన్రిచ్ క్లాసెన్ తన విశ్వరూపం ప్రదర్శించాడు. ఆస్ట్రేలియాతో శుక్రవారం జరిగిన నాలుగో వన్డేలో 83 బంతుల్లో 13 ఫోర్లు, 13 సిక్స్లు బాది 174 పరుగులు సాధించాడు. 38 బంతుల్లో అర్ధ సెంచరీ పూర్తి చేసుకున్న క్లాసెన్ 57 బంతుల్లోనే సెంచరీని అందుకున్నాడు. ఆ తర్వాత 26 బంతుల్లో మరో 74 పరుగులు సాధించాడు. రికార్డుల క్లాసెన్ తద్వారా క్లాసెన్ పలు అరుదైన రికార్డులు నెలకొల్పాడు. వన్డే చరిత్రలో అత్యంత వేగంగా ఆస్ట్రేలియాపై శతకం బాదిన రెండో బ్యాటర్గా నిలిచాడు. అంతకు ముందు టీమిండియా బ్యాటర్ 52 బంతుల్లో ఆసీస్పై శతక్కొట్టాడు. అత్యధిక సిక్సర్లు కొట్టిన రెండో బ్యాటర్గా అదే విధంగా.. వన్డే క్రికెట్ చరిత్రలో క్లాసెన్ ఐదో వేగవంతమైన సెంచరీ నమోదు చేశాడు. అంతేకాదు.. ఒకే బౌలర్ బౌలింగ్లో అత్యధిక సిక్సర్లు బాదిన రెండో బ్యాటర్గానూ నిలిచాడు. ఆడం జంపా బౌలింగ్లో ఆరు సిక్సర్లు బాది ఈ ఘనత సాధించాడు. గతంలో ఆడం ఇంగ్లండ్ మాజీ కెప్టెన్ అఫ్గనిస్తాన్ స్టార్ స్పిన్నర్ రషీద్ ఖాన్ బౌలింగ్లో ఏడు సిక్స్లు కొట్టాడు. 2019 వరల్డ్కప్ సందర్భంగా మోర్గాన్ ఈ రికార్డు సాధించాడు. వన్డేల్లో క్లాసెన్ వరల్డ్ రికార్డు ఇవన్నీ ఒకెత్తైతే.. వన్డేల్లో 200కు పైగా స్ట్రైక్రేటుతో అత్యధిక వ్యక్తిగత స్కోరు సాధించిన తొలి క్రికెటర్గా క్లాసెన్ చరిత్ర సృష్టించడం వేరే లెవల్! అంతకు ముందు ఈ రికార్డు సంయుక్తంగా.. సౌతాఫ్రికా దిగ్గజం ఏబీ డివిలియర్స్(245.45 స్ట్రైక్రేటుతో 162 పరుగులు నాటౌట్), ఇంగ్లండ్ కెప్టెన్ జోస్ బట్లర్(231.41 స్ట్రైక్రేటుతో 162 పరుగులు, నాటౌట్) పేరిట ఉండేది. ఆడం జంపా చెత్త రికార్డు ఆస్ట్రేలియాతో మ్యాచ్లో క్లాసెన్తో పాటు.. మిల్లర్ (45 బంతుల్లో 82 నాటౌట్; 6 ఫోర్లు, 5 సిక్స్లు), డసెన్ (62; 7 ఫోర్లు, 2 సిక్స్లు) కూడా అదరగొట్టారు. దాంతో తొలుత దక్షిణాఫ్రికా నిర్ణీత 50 ఓవర్లలో 5 వికెట్లకు 416 పరుగులు సాధించింది. ఈ క్రమంలో వన్డేల్లో అత్యధికంగా ఏడుసార్లు 400 అంతకంటే ఎక్కువ పరుగులు సాధించిన జట్టుగా దక్షిణాఫ్రికా రికార్డు నెలకొల్పింది. భారత్ ఆరుసార్లు ఈ ఘనత సాధించింది. సిరీస్ సమం మరోవైపు ఆస్ట్రేలియా స్పిన్నర్ ఆడమ్ జంపా 10 ఓవర్లలో 113 పరుగులిచ్చాడు. వన్డే మ్యాచ్లో అత్యధిక పరుగులిచ్చిన బౌలర్గా మిక్ లూయిస్ (10 ఓవర్లలో 113; ఆస్ట్రేలియా; 2006లో దక్షిణాఫ్రికాపై) పేరిట ఉన్న చెత్త రికార్డును జంపా సమం చేశాడు. ఇక 417 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన ఆ్రస్టేలియా 34.5 ఓవర్లలో 252 పరుగులకు ఆలౌటై ఓడిపోయింది. అలెక్స్ క్యారీ (77 బంతుల్లో 99; 9 ఫోర్లు, 4 సిక్స్లు) సెంచరీ కోల్పోయాడు. ఐదు మ్యాచ్ల సిరీస్లో రెండు జట్లు 2–2తో సమంగా ఉన్నాయి. చివరిదైన ఐదో వన్డే ఆదివారం జరుగుతుంది. చదవండి: టీమిండియాకు షాక్.. ఫైనల్కు ఆల్రౌండర్ దూరం! లంకకు యువ క్రికెటర్.. #Klassen🥵@Heini22 🔥#OrangeArmy 💥@SunRisers 🧡#SAvsAUS😺😸 pic.twitter.com/DEoOrZuCpp — Bhagi👰 (@orangearmylub) September 16, 2023 💯 for Klassen infront of his home crowd !! 100(57)* He was batting on 29(28) Scored the next 71 runs off 29 balls#Klassen #SAvAus pic.twitter.com/wCrMXYiB0r — Karthik Rao (@Cric_Karthikk) September 15, 2023 -
వరల్డ్కప్ 2023లో ఆ ఐదుగురు ప్లేయర్లు తీవ్ర ప్రభావం చూపడం ఖాయం..!
అక్టోబర్ 5 నుంచి భారత్లో జరుగనున్న వన్డే ప్రపంచకప్-2023లో ఐదుగురు ప్లేయర్లు తీవ్ర ప్రభావం చూపగలరని సౌతాఫ్రికన్ లెజెండరీ ఆల్రౌండర్ జాక్ కల్లిస్ అంచనా వేశాడు. ఆఫ్ఘనిస్తాన్ స్పిన్ ఆల్రౌండర్ రషీద్ ఖాన్, టీమిండియా స్టార్ ప్లేయర్ విరాట్ కోహ్లి, సౌతాఫ్రికా పేస్ గన్ ఎన్రిచ్ నోర్జే, ఇంగ్లండ్ సారధి జోస్ బట్లర్, పాక్ కెప్టెన్ బాబర్ ఆజమ్లు వరల్డ్కప్లో విశేషంగా రాణిస్తారని కల్లిస్ జోస్యం చెప్పాడు. కల్లిస్ ఈ ఐదుగురిని ఎంపిక చేయడానికి గల కారణాలను కూడా విశ్లేషించాడు. ఆయా ఆటగాళ్ల ప్రస్తుత ఫామ్తో పాటు భారత్లో ఆడిన అనుభవం వారి కలిసొస్తుందని అభిప్రాయపడ్డాడు. పాక్ కెప్టెన్ బాబర్ ఆజమ్ ఇండియాలో ఆడనప్పటికీ, అతను ప్రపంచకప్లో తప్పక చెలరేగుతాడని తెలిపాడు. రషీద్ ఖాన్, నోర్జే, బట్లర్కు ఐపీఎల్లో ఆడిన అనుభవం, భారత పిచ్లపై వారికున్న రికార్డు, అలాగే ఇండియన్ ఫ్యాన్స్లో వారికున్న క్రేజ్ వారిలోని అత్యుత్తమ ఆటతీరును వెలికి తీస్తుందని అన్నాడు. విరాట్ కోహ్లి విషయానికొస్తే.. ఈ ప్రపంచకప్లో అతన్ని ఆపడం కష్టమని తెలిపాడు. మునుపటితో పోలిస్తే, ప్రస్తుతం విరాట్ ఫామ్ చాలా భీకరంగా ఉందని, అతను మెగా టోర్నీలో అద్భుతాలు చేయడం ఖాయమని జోస్యం చెప్పాడు. విరాట్తో పాటు రషీద్ ఖాన్పై కూడా కల్లిస్ ప్రశంసల వర్షం కురిపించాడు. వరల్డ్కప్లో అతను రాణిస్తే ఆఫ్ఘనిస్తాన్ సంచలనాలను నమోదు చేయడం ఖాయమని అన్నాడు. కల్లిస్.. ఐసీసీ షేర్ చేసిన ఓ వీడియోలో ఈ విషయాలను పంచుకున్నాడు. ఇదిలా ఉంటే, వన్డే వరల్డ్కప్-2023 అక్టోబర్ 5 నుంచి ప్రారంభంకానున్న విషయం తెలిసిందే. డిఫెండింగ్ ఛాంపియన్ ఇంగ్లండ్-రన్నరప్ న్యూజిలాండ్ మధ్య మ్యాచ్తో మెగా టోర్నీ ప్రారంభంకానుంది. అక్టోబర్ 8న భారత్ తమ తొలి మ్యాచ్లో ఆస్ట్రేలియాతో తలపడుతుంది. అక్టోబర్ 14న భారత్.. పాక్ను ఢీకొంటుంది. -
WC: కోహ్లి, బట్లర్, బాబర్ కాదు! ఈసారి వరల్డ్కప్లో టాప్ రన్ స్కోరర్ అతడే!
ICC ODI WC 2023 Top Scorer Prediction: వన్డే వరల్డ్కప్-2023 నేపథ్యంలో ఇంగ్లండ్ టెస్టు జట్టు మాజీ కెప్టెన్ జో రూట్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. ఈ ఐసీసీ టోర్నీలో అత్యధిక పరుగులు చేసే బ్యాటర్ ఇతడేనంటూ ఎవరూ ఊహించని పేరును చెప్పాడు. టీమిండియా రన్మెషీన్ విరాట్ కోహ్లి, ఇంగ్లండ్ సారథి జోస్ బట్లర్, పాకిస్తాన్ కెప్టెన్ బాబర్ ఆజం, భారత కెప్టెన్ రోహిత్ శర్మ.. వంటి స్టార్లందరినీ కాదని సహచర ఆటగాడికే ఓటువేశాడు. స్టోక్స్ అద్బుత ఇన్నింగ్స్ కారణంగా 2019లో సొంతగడ్డపై తొలిసారిగా విశ్వవిజేతగా నిలిచిన ఇంగ్లండ్ జట్టులో జో రూట్ సభ్యుడన్న విషయం తెలిసిందే. నాటి ఈ మెగా ఈవెంట్లో ఫైనల్లో న్యూజిలాండ్ను ఓడించి మోర్గాన్ బృందం జగజ్జేతగా అవతరించింది. ఆనాటి మ్యాచ్లో బెన్స్టోక్స్ 84 పరుగుల అజేయ ఇన్నింగ్స్తో ఇంగ్లండ్ను రేసులో నిలిపి విజయం అందించాడు. ఈ క్రమంలో వరల్డ్కప్-2019లో ఇంగ్లండ్ హీరోగా నీరాజనాలు అందుకున్న స్టోక్స్.. మళ్లీ బరిలోకి దిగేందుకు వీలుగా వన్డేల రిటైర్మెంట్ నిర్ణయాన్ని వెనక్కితీసుకున్నాడు. ఇంగ్లండ్ క్రికెట్ బోర్డు విజ్ఞప్తి మేరకు మెగా టోర్నీలో ఆడేందుకు అంగీకరించాడు. ఆ ‘హీరో’ పేరు చెప్పలేదు! అయితే, ప్రపంచకప్-2023లో టాప్ రన్స్కోరర్గా రూట్.. స్టోక్స్ పేరు చెప్పాడనుకుంటున్నారా? కానే కాదు... ఆశ్చర్యకరంగా ఇంగ్లండ్ వికెట్ కీపర్ బ్యాటర్ జానీ బెయిర్స్టోను ఎంచుకున్నాడు. ‘‘తనను తాను నిరూపించుకోవడంలో జానీ ఎల్లప్పుడూ ముందే ఉంటాడు. పరిమిత ఓవర్ల క్రికెట్లో అద్బుతమైన ఆటగాడు. టాపార్డర్లో గత కొంతకాలంగా నిలకడగా రాణిస్తున్నాడు. జేసన్రాయ్తో కలిసి గొప్ప భాగస్వామ్యాలు నమోదు చేసిన ఘనత అతడిది. పవర్ప్లేలో విధ్వంసకర బ్యాటింగ్తో విరుచుకుపడగలడు. ఈసారి ప్రపంచకప్లో మరింత గొప్పగా రాణిస్తాడనుకుంటున్నా. నా ఛాయిస్ జానీ బెర్స్టో’’ అని ఐసీసీతో రూట్ వ్యాఖ్యానించాడు. ఇందుకు సంబంధించిన నెట్టింట చక్కర్లు కొడుతోంది. బెయిర్స్టో గణాంకాలు ఇలా కాగా 33 ఏళ్ల జానీ బెయిర్స్టో ఇంగ్లండ్ తరఫున ఇప్పటి వరకు 95 వన్డేలు ఆడాడు. 50 ఓవర్ల ఫార్మాట్లో ఈ రైట్హ్యాండ్ బ్యాటర్ సాధించిన పరుగులు 3634. కాగా అక్టోబరు 5న భారత్ వేదికగా ఇంగ్లండ్- న్యూజిలాండ్ మ్యాచ్తో ప్రపంచకప్-2023 ఈవెంట్కు తెరలేవనుంది. చదవండి: వరల్డ్కప్ తర్వాత ద్రవిడ్ బై.. బై! నాడు అతడు ‘బలిపశువు’.. కొత్త కోచ్గా అతడే? సిగ్గుపడు రోహిత్! నువ్వసలు కెప్టెన్వేనా?.. వాళ్లకు ఉన్నపాటి బుద్ధి నీకు లేదు! View this post on Instagram A post shared by ICC (@icc) -
ఈసారి ప్రపంచకప్ టోర్నీలో అత్యధిక వికెట్ల వీరుడు అతడే: విండీస్ దిగ్గజం
ICC World Cup 2023- Leading Wicket Taker Prediction: క్రికెట్ ప్రపంచంలో ప్రస్తుతం వన్డే వరల్డ్కప్ ఫీవర్ నడుస్తోంది. మెగా ఈవెంట్కు ఇంకా నెలరోజులకు పైగా సమయం ఉన్నా.. ఇప్పటి నుంచే డిబేట్లు మొదలయ్యాయి. ఐసీసీ టోర్నీలో అత్యధిక పరుగుల వీరుడిగా నిలిచేదెవరు? టాప్ వికెట్ టేకర్ అయ్యేదెవరు? తదితర అంశాల గురించి క్రికెట్ దిగ్గజాలు తమ అభిప్రాయాలు పంచుకుంటున్నారు. కలిస్ ఓటు అతడికి.. సెహ్వాగ్ అంచనా ఇతడిపై ఈ మేరకు అంతర్జాతీయ క్రికెట్ మండలి నిర్వహిస్తున్న షోలో సౌతాఫ్రికా దిగ్గజం జాక్వెస్ కలిస్, టీమిండియా స్టార్ వీరేంద్ర సెహ్వాగ్ టాప్ రన్ స్కోరర్ ఎవరన్న అంశంపై తమ అంచనాలు తెలియజేశారు. ప్రొటిస్ ఆల్రౌండర్ కలిస్.. ఇంగ్లండ్ కెప్టెన్ జోస్ బట్లర్ను ఎంపిక చేసుకోగా.. వీరూ భాయ్.. టీమిండియా సారథి రోహిత్ శర్మకు అగ్రస్థానం దక్కుతుందని పేర్కొన్నాడు. పాకిస్తాన్లో ఉన్నపుడు దగ్గరగా చూశాను ఈ క్రమంలో వెస్టిండీస్ దిగ్గజ ఆటగాడు వివియన్ రిచర్డ్స్ అత్యధిక వికెట్ల వీరుడిగా నిలిచేదెవరో అంచనా వేశాడు. పాకిస్తాన్ స్టార్ పేసర్ షాహిన్ ఆఫ్రిదికి ఆ అర్హత ఉందని రిచర్డ్స్ పేర్కొన్నాడు. ‘‘పాకిస్తాన్ సూపర్ లీగ్లో భాగమైన సమయంలో షాహిన్ ఆఫ్రిది ఎదుగుదలను దగ్గరగా చూశాను. ఈసారి అత్యధిక పరుగుల వీరుడు అతడే ఆట పట్ల అంకితభావం కలవాడు. వరల్డ్కప్లో షాహిన్ ఆఫ్రిది లీడింగ్ వికెట్ టేకర్ అవుతాడు. అతడినే నేను ఎంపిక చేసుకుంటా’’ అని వివియర్ రిచర్డ్స్ చెప్పుకొచ్చాడు. కాగా మూడు ఫార్మాట్లలోనూ పాకిస్తాన్ ప్రధాన పేసర్గా మారాడు 23 ఏళ్ల షాహిన్ ఆఫ్రిది. పాకిస్తాన్ స్టార్ పేసర్.. మూడు ఫార్మాట్లలోనూ ఇప్పటి వరకు అంతర్జాతీయ స్థాయిలో 27 టెస్టులు, 39 వన్డేలు, 52 టీ20 మ్యాచ్లు ఆడాడు. ఆయా ఫార్మాట్లలో వరుసగా 105, 76, 64 వికెట్లు పడగొట్టాడు. ఇటీవల అఫ్గనిస్తాన్తో జరిగిన మూడు వన్డేల సిరీస్లో అత్యధికంగా ఆరు వికెట్లు తీశాడు. ఇక ప్రపంచకప్ కంటే ముందు షాహిన్ ఆఫ్రిది ఆసియా కప్-2023 బరిలో దిగనున్నాడు. ఇదిలా ఉంటే.. ఆగష్టు 30 నుంచి ఈ వన్డే టోర్నీ ఆరంభం కానుండగా.. భారత్ వేదికగా అక్టోబరు 5 నుంచి ప్రపంచకప్ ఈవెంట్ మొదలుకానుంది. ఆసియా కప్-2023కి పాకిస్తాన్ జట్టు: అబ్దుల్లా షఫీక్, ఫఖర్ జమాన్, ఇమామ్-ఉల్-హక్, బాబర్ ఆజం (కెప్టెన్), సల్మాన్ అలీ ఆఘా, ఇఫ్తికర్ అహ్మద్, తయ్యబ్ తాహిర్, సౌద్ షకీల్, మహ్మద్ రిజ్వాన్, మహ్మద్ హరీస్, షాదాబ్ ఖాన్, మహ్మద్ నవాజ్, ఉసామా మీర్, హరీమ్ అష్రఫ్, హ్యారిస్ రవూఫ్, మహ్మద్ వసీం, నసీమ్ షా, షాహిన్ అఫ్రిది. చదవండి: WC 2023: వరల్డ్కప్ జట్టులో సంజూకు ఛాన్స్! వాళ్లిద్దరికీ షాక్.. View this post on Instagram A post shared by ICC (@icc) View this post on Instagram A post shared by ICC (@icc) -
దంచుడే దంచుడు.. బౌలర్లను ఉతికారేసిన బట్లర్! 6 ఫోర్లు, 4 సిక్స్లతో
ది హండ్రెడ్ లీగ్-2023 ఫైనల్లో మాంచెస్టర్ ఒరిజినల్స్ జట్టు అడుగుపెట్టింది. శనివారం లండన్ వేదికగా జరిగిన ఎలిమినేటర్లో సదరన్ బ్రేవ్ను 7 వికెట్ల తేడాతో చిత్తు చేసిన బట్లర్ బృందం.. ఫైనల్ బెర్త్ను ఖారారు చేసుకుంది. ఈ మ్యాచ్లో తొలుత బ్యాటింగ్ చేసిన సదరన్ బ్రేవ్ నిర్ణీత 100 బంతుల్లో వికెట్ నష్టానికి 196 పరుగుల భారీ స్కోర్ సాధించింది. సదరన్ బ్రేవ్ బ్యాటర్లలో ఫిన్ అలెన్(69), కాన్వే(51 నాటౌట్), విన్స్(56 నాటౌట్) అద్బుత ఇన్నింగ్స్లు ఆడారు. మాంచెస్టర్ బౌలర్లలో వాల్టర్ ఒక్కడే వికెట్ సాధించాడు. బట్లర్ ఊచకోత.. ఇక 197 పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన మాంచెస్టర్కు ఓపెనర్లు ఫిల్ సాల్ట్, జోస్ బట్లర్ అద్భుతమైన ఆరంభం ఇచ్చారు. వీరిద్దరూ తొలి వికెట్కు 83 పరుగుల భాగస్వామ్యం నెలకోల్పారు. తొలి వికెట్గా సాల్ట్(47) ఔటైనప్పటికీ బట్లర్ మాత్రం తన జోరును తగ్గించలేదు. ప్రత్యర్థి బౌలర్లను ఊచకోత కోశాడు. కేవలం 46 బంతుల్లో 6 ఫోర్లు, 4 సిక్స్లతో 82 పరుగులు చేసి.. మాంచెస్టర్ ఫైనల్ చేరడంలో కీలక పాత్ర పోషించాడు. బట్లర్ విధ్వంసకర ఇన్నింగ్స్ ఫలితంగా మాంచెస్టర్ టార్గెట్ను మరో నాలుగు బంతులు మిగిలూండగానే ఛేదించింది. ఆఖరిలో హోల్డన్(31), ఈవెన్స్(22) కూడా మెరుపులు మెరిపించారు. ఇక ఆదివారం ఓవల్ ఇన్విన్సిబుల్స్తో జరగనున్న ఫైనల్లో మాంచెస్టర్ ఒరిజినల్స్ తలపడనుంది. చదవండి: నా కూతురు ఫీజు కూడా కట్టలేకపోయా.. కన్నీళ్లు పెట్టుకున్న స్టార్ క్రికెటర్ 50 for England's white ball captain, Jos Buttler 🙌 pic.twitter.com/vG9l9x18Hs — Sky Sports Cricket (@SkyCricket) August 26, 2023 -
ఇంగ్లండ్ జట్టుకు భారీ ఎదురుదెబ్బ
న్యూజిలాండ్తో టీ20 సిరీస్కు ముందు ఇంగ్లండ్ జట్టుకు భారీ ఎదురుదెబ్బ తగిలింది. ఆ జట్టు అప్కమింగ్ పేస్ గన్ జోష్ టంగ్ గాయం బారిన పడి సిరీస్ మొత్తానికి దూరమయ్యాడు. దీంతో ఇంగ్లండ్ టీమ్ సెలెక్టర్లు టంగ్ స్థానాన్ని వెటరన్ పేసర్ క్రిస్ జోర్డన్తో భర్తీ చేశారు. కాగా, యాషెస్-2023 సిరీస్కు ముందు జరిగిన ఐర్లాండ్ టెస్ట్తో అంతర్జాతీయ క్రికెట్లోకి ఎంట్రీ ఇచ్చిన 25 ఏళ్ల టంగ్.. ఐర్లాండ్ మ్యాచ్తో పాటు యాషెస్ సిరీస్లోని లార్డ్స్ టెస్ట్లోనూ అద్భుతంగా రాణించాడు. ఈ రెండు మ్యాచ్ల్లో టంగ్ 25.7 సగటున 10 వికెట్లు పడగొట్టాడు. ఇందులో ఓ 5 వికెట్ల ఘనత కూడా ఉంది. ఇదిలా ఉంటే, 4 టీ20లు, 4 వన్డే సిరీస్ల కోసం న్యూజిలాండ్ జట్టు ఇంగ్లండ్లో పర్యటించనున్న విషయం తెలిసిందే. ఈనెల (ఆగస్ట్) 30న ప్రారంభమయ్యే ఈ సిరీస్లలో తొలుత టీ20 సిరీస్ (ఆగస్ట్ 30 నుంచి సప్టెంబర్ 5 వరకు), ఆతర్వాత వన్డే సిరీస్ జరుగుతుంది. తొలి టీ20 ఆగస్ట్ 30న, రెండోది సెప్టెంబర్ 1న, మూడోది సెప్టెంబర్ 3న, నాలుగో టీ20 సెప్టెంబర్ 5న జరుగనున్నాయి. అనంతరం సెప్టెంబర్ 8న తొలి వన్డే, సెప్టెంబర్ 10న రెండో వన్డే, సెప్టెంబర్ 13న మూడో వన్డే, సెప్టెంబర్ 15న నాలుగో వన్డే జరుగనున్నాయి. న్యూజిలాండ్ సిరీస్ కోసం ఇంగ్లండ్ టీ20 జట్టు.. జోస్ బట్లర్ (కెప్టెన్), రెహాన్ అహ్మద్, మొయిన్ అలీ, గుస్ అట్కిన్సన్, జానీ బెయిర్స్టో, హ్యారీ బ్రూక్, సామ్ కర్రన్, బెన్ డకెట్, విల్ జాక్స్, లియామ్ లివింగ్స్టోన్, డేవిడ్ మలన్, ఆదిల్ రషీద్, క్రిస్ జోర్డన్, ల్యూక్ వుడ్ -
WC: కోహ్లి, బాబర్ కాదు.. ఈసారి అతడే టాప్ స్కోరర్: సౌతాఫ్రికా లెజెండ్
ICC ODI World Cup 2023: వన్డే ప్రపంచకప్-2023 టోర్నీకి సమయం ఆసన్నమవుతున్న క్రమంలో సౌతాఫ్రికా మాజీ క్రికెటర్ జాక్వెస్ కలిస్ ఆసక్తిర వ్యాఖ్యలు చేశాడు. ఈసారి ఐసీసీ ఈవెంట్లో టాప్ స్కోరర్ జోస్ బట్లర్ అని అంచనా వేశాడు. కాగా అక్టోబరు 5 నుంచి నవంబరు 19 వరకు భారత్ వేదికగా వరల్డ్కప్ నిర్వహణకు షెడ్యూల్ ఖరారైంది. తొలి మ్యాచ్ అక్కడే డిపెండింగ్ చాంపియన్ ఇంగ్లండ్- న్యూజిలాండ్ మధ్య అహ్మదాబాద్ వేదికగా మెగా క్రికెట్ సమరానికి తెరలేవనుంది. ఈ నేపథ్యంలో ఇప్పటికే సెమీస్ చేరే జట్లపై పలువురు మాజీ క్రికెటర్లు తమ అభిప్రాయాలు పంచుకుంటున్నారు. ఈ క్రమంలో ప్రొటిస్ లెజెండ్ జాక్వెస్ కలిస్ వన్డే వరల్డ్కప్-2023లో అత్యధిక పరుగుల వీరుడిగా ఇంగ్లండ్ పరిమిత ఓవర్ల కెప్టెన్ జోస్ బట్లర్ నిలుస్తాడని జోస్యం చెప్పాడు. ఈ మేరకు ఐసీసీ షోలో మాట్లాడుతూ.. భారత పిచ్లపై అతడు ఈసారి మెరుగ్గా రాణిస్తాడని భావిస్తున్నా. ఇక ఇంగ్లండ్ ఈ వరల్డ్కప్లో కూడా మంచి ప్రదర్శన ఇస్తుందనే నమ్మకం ఉంది. భారత్లో వన్డే రికార్డు అంతంత మాత్రమే! ఈసారి బట్లర్ లీడ్ రన్ స్కోరర్గా నిలుస్తాడని విశ్వసిస్తున్నా’’ అని జాక్వెస్ కలిస్ చెప్పుకొచ్చాడు. కాగా ఇయాన్ మోర్గాన్ తర్వాత ఇంగ్లండ్ పరిమిత ఓవర్ల కెప్టెన్గా జోస్ బట్లర్ గతేడాది సారథ్య బాధ్యతలు చేపట్టాడు. తన కెరీర్లో ఇప్పటి వరకు అంతర్జాతీయ స్ధాయిలో 165 వన్డేలు ఆడిన బట్లర్ 41.49 సగటుతో 4647 పరుగులు సాధించాడు. ఇందులో 11 సెంచరీలు, 24 అర్ధ శతకాలు ఉన్నాయి. అయితే, భారత్లో మాత్రం అతడి వన్డే రికార్డు అంతంతమాత్రంగానే ఉంది. ఇప్పటి వరకు భారత గడ్డపై 8 వన్డే మ్యాచ్లు ఆడిన బట్లర్.. కేవలం 83 పరుగులు చేశాడు. బెస్ట్ స్కోరు 31. ఈ నేపథ్యంలో భారత్ వేదికగా జరిగే ఐసీసీ టోర్నీలో జోస్ బట్లర్ టాప్ స్కోరర్గా నిలుస్తాడని జాక్వెస్ కలిస్ అంచనా వేయడం విశేషం. టీ20 వరల్డ్కప్ విన్నింగ్ కెప్టెన్ ఇదిలా ఉంటే.. 2019 వరల్డ్కప్ కెప్టెన్ ఇయాన్ మోర్గాన్ ఇటీవల మాట్లాడుతూ.. ‘‘జోస్ బట్లర్ అద్భుతమైన నాయకుడు. పరిమిత ఓవర్ల క్రికెట్లో అత్యుత్తమ ప్లేయర్లలో ఒకడు. బట్లర్ లాంటి ఆటగాడిని కెప్టెన్గా కలిగి ఉండటం ఇంగ్లండ్కు అదనపు బలం. కూల్ కెప్టెన్సీతో ఒత్తిడిని జయించి వరల్డ్కప్లో జట్టు రాణించేలా కృషి చేస్తాడనే నమ్మకం ఉంది’’ అని బట్లర్పై ప్రశంసలు కురిపించాడు. కాగా బట్లర్ సారథ్యంలో ఆస్ట్రేలియాలో జరిగిన టీ20 వరల్డ్కప్-2022ను ఇంగ్లండ్ కైవసం చేసుకున్న విషయం తెలిసిందే. ఇదిలా ఉంటే.. జోస్ బట్లర్ ఐపీఎల్లో రాజస్తాన్ రాయల్స్కు ప్రాతినిథ్యం వహిస్తున్నాడు. కలిస్ వ్యాఖ్యల నేపథ్యంలో.. మరి వన్డేల్లో అద్భుత రికార్డులు కలిగి ఉన్న టీమిండియా స్టార్ విరాట్ కోహ్లి, పాకిస్తాన్ కెప్టెన్ బాబర్ ఆజంను బట్లర్ వెనక్కి నెట్టగలడా? అని అభిమానులు చర్చించుకుంటున్నారు. చదవండి: వారెవ్వా.. నీరజ్! అత్యుత్తమ ప్రదర్శనతో ప్యారిస్ ఒలింపిక్స్కు అర్హత -
రాణించిన బట్లర్.. రెచ్చిపోయిన కాన్వే
హండ్రెడ్ లీగ్ 2023లో భాగంగా మాంచెస్టర్ ఒరిజినల్స్తో నిన్న (ఆగస్ట్ 24) జరిగిన మ్యాచ్లో సథరన్ బ్రేవ్స్ 6 వికెట్ల తేడాతో గెలుపొందింది. ఫలితంగా ఈ జట్టు ఫైనల్కు చేరే అవకాశాలను మరింత మెరుగుపర్చుకుంది. ఈ మ్యాచ్లో తొలుత బ్యాటింగ్ చేసిన ఒరిజినల్స్ జోస్ బట్లర్ (42 బంతుల్లో 45; 5 ఫోర్లు) రాణించడంతో నిర్ణీత 100 బంతుల్లో 8 వికెట్ల నష్టానికి 130 పరుగులు చేసింది. ఒరిజినల్స్ ఇన్నింగ్స్లో బట్లర్ మినహాయించి ఎవరూ పెద్దగా రాణించలేదు. మాడ్సన్ (22), సాల్ట్ (17), పాల్ వాల్టర్ (12), ఓవర్టన్ (0) రెండంకెల స్కోర్లు చేయగా.. లారీ ఈవాన్స్ (2), టామ్ హార్ట్లీ (2), హ్యారీసన్ (1) సింగిల్ డిజిట్ స్కోర్లకే పరిమతమయ్యారు. బ్రేవ్ బౌలర్లలో తైమాల్ మిల్స్ 3 వికెట్లు పడగొట్టగా.. రెహాన్ అహ్మద్ 2, క్రిస్ జోర్డన్, అకెర్మ్యాన్ తలో వికెట్ దక్కించుకున్నారు. A knock which put the Southern Brave into #TheHundred Eliminator 🙌 How good was this man today? pic.twitter.com/1hxlAuxdok — The Hundred (@thehundred) August 23, 2023 రెచ్చిపోయిన కాన్వే.. 131 పరుగుల లక్ష్య ఛేదనలో ఓపెనర్ డెవాన్ కాన్వే (40 బంతుల్లో 54 నాటౌట్; 5 ఫోర్లు, సిక్స్) రెచ్చిపోవడంతో బ్రేవ్ మరో 5 బంతులు మిగిలుండగానే 4 వికెట్లు కోల్పోయి విజయతీరాలకు చేరింది. బ్రేవ్ ఇన్నింగ్స్లో కెప్టెన్ జేమ్స్ విన్స్ (25 బంతుల్లో 33; 2 ఫోర్లు, సిక్స్), ఆకెర్మ్యాన్ (21 బంతుల్లో 24 నాటౌట్; 4 ఫోర్లు), ఫిన్ అలెన్ (4 బంతుల్లో 14; 2 ఫోర్లు, సిక్స్) ఓ మోస్తరుగా రాణించగా.. డు ప్లూయ్ (2), వెథర్లీ (0) విఫలమయ్యారు. ఒరిజినల్స్ బౌలర్లలో జమాన్ ఖాన్ 2, జోష్ టంగ్, ఆస్టన్ టర్నర్ తలో వికెట్ పడగొట్టారు. కాగా, హండ్రెడ్ లీగ్ ప్రస్తుత ఎడిషన్లో ఓవల్ ఇన్విన్సిబుల్స్ ఇదివరకే ఫైనల్కు చేరుకుంది. మరో బెర్త్ కోసం మాంచెస్టర్ ఒరిజినల్స్, సథరన్ బ్రేవ్ జట్ల మధ్య పోటీ జరుగుతుంది. మిగతా జట్లన్నీ ఎలిమినేట్ అయ్యాయి. -
ఇంగ్లండ్ బౌలర్ విధ్వంసం.. 30 బంతుల్లోనే..!
హండ్రెడ్ లీగ్-2023లో భాగంగా నార్త్రన్ సూపర్ ఛార్జర్స్తో నిన్న (ఆగస్ట్ 13) జరిగిన మ్యాచ్లో మాంచెస్టర్ ఒరిజినల్స్ డక్వర్త్ లూయిస్ పద్ధతిలో 40 పరుగుల తేడాతో విజయం సాధించింది. ఈ మ్యాచ్లో ఇంగ్లండ్ బౌలర్, ఒరిజినల్స్ ఆల్రౌండర్ జేమీ ఓవర్టన్ ఆరో స్థానంలో బ్యాటింగ్కు వచ్చి తుఫాన్ ఇన్నింగ్స్ (30 బంతుల్లో 83; 9 ఫోర్లు, 6 సిక్సర్లు) ఆడి తన జట్టు విజయంలో ప్రధానపాత్ర పోషించాడు. Manchester Originals have won the derby 👊 Which player impressed you the most?#TheHundred pic.twitter.com/RLudfitjnD — The Hundred (@thehundred) August 13, 2023 అతనికి లారీ ఈవాన్స్ (18 బంతుల్లో 41; 3 ఫోర్లు, 4 సిక్సర్లు) మెరుపు ఇన్నింగ్స్ తోడవ్వడంతో తొలుత బ్యాటింగ్ చేసిన ఒరిజినల్స్ 90 బంతుల్లో (వర్షం అంతరాయం కారణంగా 90 బంతుల మ్యాచ్గా అంపైర్లు నిర్ణయించారు) 6 వికెట్ల నష్టానికి 182 పరుగుల భారీ స్కోర్ చేసింది. ఒరిజినల్స్ ఇన్నింగ్స్లో ఓవర్టన్, ఈవాన్స్తో పాటు పాల్ వాల్టర్ (22; 4 ఫోర్లు) ఓ మోస్తరు స్కోర్ చేయగా.. సూపర్ ఛార్జర్స్ బౌలర్లు రీస్ టాప్లే 3, బ్రైడన్ కార్స్, పార్కిన్సన్, ఆదిల్ రషీద్ తలో వికెట్ పడగొట్టారు. The highest men's total for a Manchester Original player 🙌#TheHundred pic.twitter.com/RpRsNNOt7j — The Hundred (@thehundred) August 13, 2023 అనంతరం 183 పరుగుల లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన సూపర్ ఛార్జర్స్ నిర్ణీత 90 బంతుల్లో 9 వికెట్ల నష్టానికి 141 పరుగులకే పరిమితమై ఓటమిపాలైంది. ఒరిజినల్స్ బౌలర్లు ఉసామా మిర్ (4/19), జాషువ లిటిల్ (2/33) సూపర్ ఛార్జర్స్ను దారుణంగా దెబ్బకొట్టారు. వీరికి జోష్ టంగ్ (1/25), టామ్ హార్ట్లీ (1/9), పాల్ వాల్డర్ (1/26) తోడవ్వడంతో సూపర్ఛార్జర్స్ ఇన్నింగ్స్ పేకమేడలా కూలింది. సూపర్ ఛార్జర్స్ ఇన్నింగ్స్లో మాథ్యూ షార్ట్ (37), సైఫ్ జైబ్ (21), హ్యారీ బ్రూక్ (20) మాత్రమే ఓ మోస్తరు స్కోర్లు చేశారు. Well, that was incredible... 👀#TheHundred pic.twitter.com/KBXmSj7nls — The Hundred (@thehundred) August 13, 2023 -
ఆసీస్ యువ పేసర్ సంచలనం.. 20 బంతుల్లో 1 పరుగు.. 3 వికెట్లు! వీడియో
Oval Invincibles won by 94 runs- Jason Roy- Heinrich Klaasen: ఆస్ట్రేలియా యువ పేసర్ స్పెన్సర్ జాన్సన్ సంచలన స్పెల్తో మెరిశాడు. ది హండ్రెడ్ లీగ్లో అరంగేట్రంలోనే అత్యద్భుత గణాంకాలు నమోదు చేశాడు. 20 బంతుల్లో కేవలం ఒక్క పరుగు మాత్రమే ఇచ్చి ఏకంగా మూడు వికెట్లు పడగొట్టాడు. ఇంగ్లండ్ హండ్రెడ్ లీగ్లో జాన్సన్ ఓవల్ ఇన్విసిబుల్కు ప్రాతినిథ్యం వహిస్తున్నాడు. ఈ క్రమంలో లండన్లోని కెన్నింగ్టన్ ఓవల్ వేదికగా మాంచెస్టర్ ఒరిజినల్స్తో మ్యాచ్లో అద్భుత ఆట తీరుతో ఆకట్టుకున్నాడు. అంతర్జాతీయ టీ20 జట్టుకు ఎంపికైన మరుసటి రోజే 20 డెలివరీల్లో 19 డాట్ బాల్స్ వేసి సంచలనం సృష్టించాడు. మాంచెస్టర్ బ్యాటర్ జోస్ బట్లర్.. జాన్సన్ వేసిన షార్ట్ బంతిని డీప్ స్వ్కేర్ లెగ్ దిశగా ఆడి అతడి బౌలింగ్లో ఆ ఒక్క సింగిల్కు కారణమయ్యాడు. వేసిన పదకొండో బంతికి ఉసామా మిర్ను అవుట్ చేసితొలి వికెట్ తీసిన జాన్సన్.. ఆ తర్వాత టామ్ హార్ట్లీ, జాషువా లిటిల్లను పెవిలియన్కు పంపాడు. ఓవల్ ఇన్విసిబుల్ బౌలర్లు గస్ అట్కిన్సన్ రెండు, నాథన్ సోవటెర్ రెండేసి వికెట్లు తీయగా.. స్పెన్సర్ జాన్సర్తో పాటు సునిల్ నరైన్ మూడు వికెట్లు పడగొట్టాడు. సొంతమైదానంలో ఓవల్ బౌలర్ల విజృంభణతో పర్యాటక మాంచెస్టర్ జట్టు 89 బంతులాడి 92 పరుగులకే కుప్పకూలింది. దీంతో.. జేసన్ రాయ్(59), హెన్రిచ్ క్లాసెన్(60) అర్ధ శతకాలతో మెరవడంతో 100 బంతుల్లో 5 వికెట్ల నష్టానికి 186 పరుగులు చేసిన ఓవల్ జట్టు భారీ విజయం సాధించింది. మ్యాచ్లో మాంచెస్టర్పై 94 పరుగుల తేడాతో నెగ్గింది. చదవండి: శ్రేయస్ అయ్యర్ దూరం.. తిలక్ వర్మకు అవకాశం.. అలా అయితే..! Spencer Johnson's 3️⃣ wickets 🔥#TheHundred pic.twitter.com/kyQwS35BOC — The Hundred (@thehundred) August 9, 2023 -
ఉతికి ఆరేసిన బట్లర్.. మెరిసిన సాల్ట్
హండ్రెడ్ లీగ్-2023లో భాగంగా లండన్ స్పిరిట్తో ఇవాళ (ఆగస్ట్ 5) జరుగుతున్న మ్యాచ్లో ఇంగ్లండ్ పరిమిత ఓవర్ల జట్టు కెప్టెన్ జోస్ బట్లర్ చెలరేగి ఆడాడు. 36 బంతుల్లో 3 ఫోర్లు, 5 సిక్సర్ల సాయంతో 62 పరుగులు చేశాడు. క్రీజ్లో ఉన్నంత సేపు పూనకం వచ్చినట్లు ఊగిపోయిన బట్లర్.. ఎడాపెడా బౌండరీలు, సిక్సర్లు బాది, రవి బొపారా బౌలింగ్లో క్లీన్ బౌల్డయ్యాడు. 🌶 @josbuttler is in the mood! 😮💨#TheHundred pic.twitter.com/9IRiMKqCmA — The Hundred (@thehundred) August 5, 2023 మరో ఎండ్లో ఫిలిప్ సాల్ట్ (9 బంతుల్లో 21; 3 సిక్సర్లు) కూడా మెరుపు ఇన్నింగ్స్ ఆడటంతో ఒరిజినల్స్ 80 బంతుల్లో 5 వికెట్ల నష్టానికి 138 పరుగులు చేసింది. ఈ దశలో వర్షం మొదలుకావడంతో అంపైర్లు మ్యాచ్ను నిలిపి వేశారు. ఒరిజినల్స్ ఇన్నింగ్స్లో బట్లర్, సాల్ట్తో పాటు మ్యాక్స్ హోల్డన్ (24; 3 ఫోర్లు) రాణించగా.. లారీ ఈవాన్స్ (1), పాల్ వాల్టర్ (2) నిరాశపరిచారు. ఆస్టన్ టర్నర్ (16), జేమీ ఓవర్టన్ (2) క్రీజ్లో ఉన్నారు. Things that should come with a content warning: ⚠️ @josbuttler striking the ball like this to reach his 50 ⚠️#TheHundred pic.twitter.com/uLXbdkVdZz — The Hundred (@thehundred) August 5, 2023 లండన్ బౌలర్లలో రవి బొపారా 2 వికెట్లు పడగొట్టగా.. డేనియల్ వార్రెల్, లియామ్ డాసన్, మాథ్యూ క్రిచ్లీ తలో వికెట్ దక్కించుకున్నారు. కాగా, హండ్రెడ్ లీగ్ ప్రస్తుత ఎడిషన్లో బట్లర్కు ఇది తొలి హాఫ్ సెంచరీ కావడం విశేషం. బట్లర్ ఫామ్లోని రావడంతో అతని అభిమానులు సంబురపడిపోతున్నారు. బట్లర్ ఇలాగే భారీ షాట్లు ఆడుతూ తమను అలరించాలని కోరుకుంటున్నారు. ఈ మ్యాచ్లో బట్లర్ ఆడిన భారీ షాట్లకు సంబంధించిన వీడియోలు ప్రస్తుతం వైరలవుతున్నాయి. Jos Buttler smashed his first fifty of the Hundred season 🔥#Hundred pic.twitter.com/HMcyWQI0Ot — CricTracker (@Cricketracker) August 5, 2023 -
బట్లర్కు రాజస్తాన్ రాయల్స్ బంపరాఫర్.. ఏకంగా రూ.40 కోట్లు!
ఇంగ్లండ్ పరిమిత ఓవర్ల క్రికెట్ కెప్టెన్ జోస్ బట్లర్కు రాజస్తాన్ రాయల్స్ యాజమాన్యం బంపరాఫర్ ఇచ్చినట్లు తెలుస్తోంది. వివిధ లీగుల్లో తమ ఫ్రాంచైజీకే నాలుగేళ్లు ఆడేందుకు రూ. 40 కోట్ల భారీ మొత్తాన్ని రాజస్తాన్ ఆఫర్ చేసినట్లు సమాచారం. రాజస్తాన్ ఆఫర్ పై బట్లర్ కూడా ఆలోచనలో పడినట్లు వార్తలు వినిపిస్తున్నాయి.. ఐపీఎల్లో గత కొన్ని సీజన్లగా రాజస్తాన్ రాయల్స్కు బట్లర్ ప్రాతినిధ్యం వహిస్తున్న సంగతి తెలిసిందే. ఐపీఎల్-2022 మెగా వేలంకు ముందు రూ.10 కోట్లకు బట్లర్ను రాజస్తాన్ రీటైన్ చేసుకుంది. అదే విధంగా బట్లర్ ఐపీఎల్తో పాటు దక్షిణాఫ్రికాలో జరిగే ఎస్ఎ టీ20 లీగ్ లో రాజస్తాన్ యాజమాన్యం కొనుగోలు చేసిన పార్ల్ రాయల్స్కు కెప్టెన్గా వ్యవహరిస్తున్నాడు. కరేబియన్ ప్రీమియర్ లీగ్ లో కూడా రాజస్తాన్ రాయల్స్ యాజమాన్యం బార్బోడస్ రాయల్స్ ఫ్రాంచైజీని కొనుగోలు చేసింది. అమెరికాలో జరగబోయే మేజర్ లీగ్ క్రికెట్ టోర్నీలో ఓ ఫ్రాంచైజీని కొనుగోలు చేసే ఆలోచనలో రాజస్తాన్ రాయల్స్ యాజమాన్యం ఉన్నట్లు సమాచారం. ఈ క్రమంలోనే బట్లర్కు ఈ క్రేజీ ఆఫర్ ఇచ్చినట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ఇక ఈ ఆఫర్ను బట్లర్ అంగీకరించనట్లయితే ఇంగ్లండ్ క్రికెట్తో తన కాంట్రాక్ట్ను వదులుకోవాల్సి ఉంటుంది. మరోవైపు ముంబై ఇండియన్స్ ఫ్రాంచైజీ కూడా ఇలాంటి ఒక ఆఫర్ను ఇంగ్లండ్ ఆల్రౌండర్ జోఫ్రా ఆర్చర్ ముందు ఉంచినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం ఆర్చర్.. ఐపీఎల్లో ముంబై ఇండియన్స్, సౌతాఫ్రికా టీ20 లీగ్లో ఎంఐ కేప్టౌన్కు ప్రాతినిధ్యం వహిస్తున్నాడు. ఈ డీల్ కనుక ఒప్పుకుంటే.. ఐఎల్టీ20, ఎంఎల్సీ వంటి లీగ్స్లో కూడా ముంబై ఫ్రాంచైజీ తరఫున ఆడాల్సి ఉంటుంది. చదవండి: World Cup 2023: టీమిండియాకు బిగ్షాక్.. వరల్డ్కప్కు స్టార్ ఆటగాడు దూరం! -
టీ20ల్లో బట్లర్ జమానా.. ఉతికి ఆరేస్తున్న ఇంగ్లండ్ కెప్టెన్, అత్యంత అరుదైన జాబితాలో చోటు
టీ20ల్లో ఇంగ్లండ్ పరిమిత ఓవర్ల జట్టు కెప్టెన్ జోస్ బట్లర్ జమానా నడుస్తుంది. ఇటీవలకాలంలో పొట్టి ఫార్మాట్లో బట్లర్ ఆకాశమే హద్దుగా చెలరేగిపోతున్నాడు. ఈ రాజస్థాన్ రాయల్స్ చిచ్చరపిడుగు తాజాగా ఓ అరుదైన క్లబ్లో చేరి రికార్డు సృష్టించాడు. టీ20ల్లో 10000 పరుగుల మైలురాయిని అధిగమించాడు. టీ20 బ్లాస్ట్ 2023లో భాగంగా బట్లర్ ఈ అరుదైన ఫీట్ను సాధించాడు. డెర్బీషైర్తో నిన్న (జూన్ 23) జరిగిన మ్యాచ్లో లాంకాషైర్ తరఫున బరిలోకి దిగిన బట్లర్.. 39 బంతుల్లో 8 ఫోర్లు, 6 సిక్సర్ల సాయంతో 83 పరుగులు చేశాడు. ఈ ఇన్నింగ్స్లో 3 పరుగుల వ్యక్తిగత స్కోర్ వద్ద బట్లర్ 10000 పరుగుల ల్యాండ్ మార్క్ను రీచ్ అయ్యాడు. టీ20 కెరీర్లో మొత్తం 372 మ్యాచ్లు ఆడిన బట్లర్.. 34.16 సగటున, 144.70 స్ట్రయిక్ రేట్తో 6 శతకాలు, 21 హాఫ్ సెంచరీల సాయంతో 10080 పరుగులు చేశాడు. The crowning moment 🙌 pic.twitter.com/bTAyzxz0dS — Vitality Blast (@VitalityBlast) June 23, 2023 టీ20ల్లో 10000 పరుగులు పూర్తి చేసుకున్న తొమ్మిదో ఆటగాడు.. టీ20 ఫార్మాట్లో 10000 పరుగులు సాధించిన తొమ్మిదో ఆటగాడిగా బట్లర్ రికార్డుల్లోకెక్కాడు. ఈ జాబితాలో క్రిస్ గేల్ (14562) అగ్రస్థానంలో ఉండగా.. షోయబ్ మాలిక్ (12528), కీరన్ పోలార్డ్ (12175), విరాట్ కోహ్లి (11965), డేవిడ్ వార్నర్ (11695), ఆరోన్ ఫించ్ (11392), అలెక్స్ హేల్స్ (11214), రోహిత్ శర్మ (11035) వరుసగా 2 నుంచి 8 స్థానాల్లో నిలిచారు. Jos Buttler becomes the 9th batter to complete 10,000 runs in T20. 😍#Cricket #JosButtler #England pic.twitter.com/XQ7uIwWTMH — Sportskeeda (@Sportskeeda) June 24, 2023 ఇంగ్లండ్ తరఫున రెండో ఆటగాడు.. టీ20ల్లో ఇంగ్లండ్ తరఫున 10000 పరుగులు పూర్తి చేసుకున్న రెండో ఆటగాడిగా బట్లర్ రికార్డుల్లోకెక్కాడు. బట్లర్కు ముందు అలెక్స్ హేల్స్ (11214) ఈ ఘనత సాధించాడు. బట్లర్ తర్వాత జేమ్స్ విన్స్ (9343) టీ20ల్లో 10000 పరుగులకు చేరువలో ఉన్నాడు. Can we have 12 for that one, @VitalityBlast? 💥@liaml4893 clears a maximum over the new development! 👷♂️ Watch LIVE on #LancsTV! 💻➡️ https://t.co/mClaOSvXZ6 ⚡ #LightningStrikes pic.twitter.com/HZ1NdKIiOW — Lancashire Lightning (@lancscricket) June 23, 2023 రోహిత్ శర్మ కంటే వేగంగా.. జోస్ బట్లర్ టీ20ల్లో రోహిత్ శర్మ కంటే వేగంగా 10000 పరుగుల మార్క్ను రీచ్ అయ్యాడు. రోహిత్కు ఈ ఘనత సాధించేందుకు 362 ఇన్నింగ్స్లు అవసరమైతే.. బట్లర్ కేవలం 350 ఇన్నింగ్స్ల్లోనే ఈ మైలురాయిని అధిగమించాడు. ఓవరాల్గా విరాట్ కోహ్లి ఈ ఘనతను వేగంగా అధిగమించాడు. విరాట్ కేవలం 285 ఇన్నింగ్స్ల్లో 10000 పరుగులు పూర్తి చేసుకున్నాడు. బట్లర్ వీరవిహారంతో లాంకాషైర్ ఘన విజయం.. డెర్బీషైర్తో నిన్న జరిగిన మ్యాచ్లో బట్లర్ వీరవిహారం చేయడంతో లాంకాషైర్ 27 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. బట్లర్కు జతగా లవింగ్స్టోన్ (30 బంతుల్లో 47 నాటౌట్; ఫోర్, 3 సిక్సర్లు), వెల్స్ (4 బంతుల్లో 13; 2 సిక్సర్లు) రాణించడంతో లాంకాషైర్ 15 ఓవర్లలో (వర్షం కారణంగా కుదించారు) 4 వికెట్ల నష్టానికి 177 పరుగుల భారీ స్కోర్ చేసింది. ఛేదనలో తడబడిన డెర్బీషైర్ 15 ఓవర్లలో 150 పరుగులకే పరిమితమై ఓటమిపాలైంది. -
చెలరేగిన లివింగ్స్టోన్.. బట్లర్ ఊచకోత
టీ20 బ్లాస్ట్లో భాగంగా డెర్బీషైర్తో నిన్న (జూన్ 23) జరిగిన మ్యాచ్లో ఇంగ్లండ్ పరిమిత ఓవర్ల జట్టు కెప్టెన్, లాంకాషైర్ ఆటగాడు జోస్ బట్లర్ శివాలెత్తిపోయాడు. ఈ మ్యాచ్లో 39 బంతులు ఎదుర్కొన్న బట్లర్.. 8 ఫోర్లు, 6 సిక్సర్ల సాయంతో 83 పరుగులు చేశాడు. బట్లర్కు మరో ఎండ్లో లియామ్ లవింగ్స్టోన్ (30 బంతుల్లో 47 నాటౌట్; ఫోర్, 3 సిక్సర్లు) సహకరించడంతో లాంకాషైర్ 15 ఓవర్లలో (వర్షం కారణంగా కుదించారు) 4 వికెట్ల నష్టానికి 177 పరుగుల భారీ స్కోర్ చేసింది. ఆఖర్లో వెల్స్ (4 బంతుల్లో 13; 2 సిక్సర్లు) భారీ షాట్లు ఆడాడు. డెర్బీషైర్ బౌలర్లలో జాక్ ఛాపెల్ 2, జమాన్ ఖాన్, మెక్ కీయెర్నన్ తలో వికెట్ పడగొట్టారు. చెలరేగిన లివింగ్స్టోన్.. బట్లర్ ఊచకోత టాస్ ఓడి ప్రత్యర్ధి ఆహ్వానం మేరకు బ్యాటింగ్కు దిగిన లాంకాషైర్.. ఆది నుంచే దూకుడుగా ఆడింది. సాల్ట్ (11 బంతుల్లో 16; 2 ఫోర్లు) వికెట్ పడిపోయాక బట్లర్ గేర్ మార్చి ధాటిగా ఆడటం ప్రారంభించాడు. ఎడాపెడా బౌండరీలు, సిక్సర్లు బాది డెర్బీషర్ బౌలర్లను ఊచకోత కోశాడు. బట్లర్ ఔటయ్యాక లివింగ్స్టోన్ కూడా చెలరేగిపోయాడు. ఆదిలో లవింగ్స్టోన్ కాస్త నిదానంగా ఆడినప్పటికీ.. ఆఖర్లో రెచ్చిపోయాడు. 3 భారీ సిక్సర్లు బాదాడు. భారీ లక్ష్య ఛేదనలో తడబడిన డెర్బీషైర్.. 178 పరుగుల భారీ లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన డెర్బీషైర్.. ఆది నుంచే తడబడుతూ వచ్చింది. లాంకాషైర్ బౌలర్లు టామ్ బెయిలీ (2/16), డారిల్ మిచెల్ (2/13), లూక్ వెల్స్ (2/32), టామ్ హార్ట్లీ ధాటికి ఆ జట్టు 15 ఓవర్లలో 7 వికెట్లు కోల్పోయి 150 పరుగులు మాత్రమే చేసి 27 పరుగుల తేడాతో ఓటమిపాలైంది. డెర్బీషైర్ ఇన్నింగ్స్లో హ్యారీ కేన్ (45), బ్రూక్ గెస్ట్ (31 నాటౌట్) ఓ మోస్తరుగా రాణించారు. -
జోస్ బట్లర్ వీరవిహారం.. శివాలెత్తిన సామ్ కర్రన్
టీ20 బ్లాస్ట్లో భాగంగా నిన్న (జూన్ 7) జరిగిన వివిధ మ్యాచ్ల్లో ఇంగ్లండ్ క్రికెటర్లు పేట్రేగిపోయారు. వార్సెస్టర్షైర్తో జరిగిన మ్యాచ్లో లాంకాషైర్కు ప్రాతినిధ్యం వహించిన జోస్ బట్లర్ (42 బంతుల్లో 58; 4 ఫోర్లు, 3 సిక్సర్లు) వీరవిహారం చేయగా.. గ్లామోర్గన్పై ససెక్స్ ఆటగాళ్లు లారీ ఈవాన్స్ (60 బంతుల్లో 118 నాటౌట్; 12 ఫోర్లు, 6 సిక్సర్లు), సామ్ కర్రన్ (29 బంతుల్లో 66; ఫోర్, 7 సిక్సర్లు, 2/36) రెచ్చిపోయారు. ఫలితంగా వారు ప్రాతినిధ్యం వహిస్తున్న జట్లు ఘన విజయం సాధించాయి. బట్లర్ వీరవిహారం.. లాంకాషైర్తో జరిగిన మ్యాచ్లో తొలుత బ్యాటింగ్ చేసిన వార్సెస్టర్షైర్ ఆడమ్ హోస్ (29 బంతుల్లో 42), మిచెల్ సాంట్నర్ (33 బంతుల్లో 57) రాణించడంతో నిర్ణీత ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 177 పరుగులు సాధించింది. లాంకాషైర్ బౌలర్లలో డారిల్ మిచెల్ 3, కొలిన్ డి గ్రాండ్హోమ్ 2, లూక్ వుడ్, టామ్ హార్ట్లీ, వెల్స్ తలో వికెట్ పడగొట్టారు. ఛేదనలో జోస్ బట్లర్, స్టీవ్ క్రాఫ్ట్ (40), డారిల్ మిచెల్ (33 నాటౌట్), లివింగ్స్టోన్ (23) రాణించడంతో లాంకాషైర్ 6 వికెట్లు కోల్పోయి 19.3 ఓవర్లలో లక్ష్యాన్ని ఛేదించింది. ఫలితంగా 4 వికెట్ల తేడాతో విజయం సాధించింది. వార్సెస్టర్షైర్ బౌలర్లలో పెన్నింగ్టన్, పాట్రిక్ బ్రౌన్ తలో 2 వికెట్లు, ఆడమ్ ఫించ్ ఓ వికెట్ పడగొట్టారు. శతక్కొట్టిన ఈవాన్స్.. శివాలెత్తిన సామ్ కర్రన్ గ్లామోర్గన్తో జరిగిన మ్యాచ్లో తొలుత బ్యాటింగ్ చేసిన సర్రే.. లారీ ఈవాన్స్, సామ్ కర్రన్ చెలరేగడంతో నిర్ణీత ఓవర్లలో 2 వికెట్ల నష్టానికి 236 పరుగులు చేసింది. ఛేదనలో చేతులెత్తేసిన గ్లామోర్గన్.. 20 ఓవర్లలో 8 వికెట్లు కోల్పోయి 171 పరుగులు మాత్రమే చేసి 65 పరుగుల తేడాతో ఓటమిపాలైంది. సర్రే బౌలర్లలో కర్రన్, అట్కిన్సన్, క్రిస్ జోర్డన్ తలో 2 వికెట్లు, సీన్ అబాట్,సునీల్ నరైన్ చెరో వికెట్ పడగొట్టారు. నిన్న జరిగిన ఇతర మ్యాచ్ల్లో ఎసెక్స్పై కెంట్ 4 వికెట్ల తేడాతో.. వార్విక్షైర్పై డెర్బీషైర్ 6 వికెట్ల తేడాతో.. సోమర్సెట్పై హ్యాంప్షైర్ 5 పరుగుల తేడాతో విజయం సాధించాయి. చదవండి: WTC Final: ట్రెవిస్ హెడ్ చరిత్ర.. సెంచరీ చేసిన తొలి బ్యాటర్గా -
IPL 2023: ఐపీఎల్ 2023 లీగ్ స్టేజీలో బద్దలైన రికార్డులివే
ఐపీఎల్ 2023 లీగ్ స్టేజ్ ఆదివారం (మే 21)తో ముగిసింది. మొత్తం 70 మ్యాచ్లు జరిగాయి. మంగళవారం (మే 23) నుంచి ప్లేఆఫ్స్ ప్రారంభం కానున్నాయి. ఈ నేపథ్యంలో ఈసారి లీగ్ స్టేజ్లో నమోదైన రికార్డులు గతంలో ఏ సీజన్లోనూ నమోదు కాలేదు. పరుగుల వరద పారిన ఈ సీజన్ లో లెక్కకు మిక్కిలిగా రికార్డులు బద్దలయ్యాయి. సిక్స్లు, 200+ స్కోర్లు, సెంచరీల పరంగా గత రికార్డులన్నీ తుడిచిపెట్టుకుపోయాయి. మరి అవేంటో ఒకసారి పరిశీలిద్దాం. ఐపీఎల్ 2023 లీగ్ స్టేజ్లో బద్దలయిన రికార్డులు ► 7263 పరుగులతో ఐపీఎల్ చరిత్రలో అత్యధిక పరుగులు చేసిన బ్యాటర్ గా విరాట్ కోహ్లి నిలిచాడు. ► ఐపీఎల్ 2023 లీగ్ స్టేజ్ లోనే 11 సెంచరీలు నమోదయ్యాయి. ఒక ఐపీఎల్ సీజన్ లో నమోదైన అత్యధిక సెంచరీలు ఇవే. ఐపీఎల్ 2022లో 8 సెంచరీలతో ఉన్న రికార్డు బ్రేయింది. ► ముంబై ఇండియన్స్ ఈ ఏడాది నాలుగుసార్లు 200కుపైగా లక్ష్యాలను ఛేదించింది. ఒక సీజన్ లో ఒక టీమ్ అత్యధికసార్లు 200కుపైగా స్కోర్లను చేజ్ చేసిన ఘనతను సొంతం చేసుకుంది. ► ఆర్సీబీ ఈ సీజన్ లో ఐదుసార్లు 200కుపైగా రన్స్ సమర్పించుకుంది. ఒక సీజన్ లో ఒక టీమ్ అత్యధికసార్లు 200కుపైగా స్కోర్లు ఇచ్చిన రికార్డు ఇదే. ► ఈ ఏడాది ఇప్పటికే 35సార్లు ఒక ఇన్నింగ్స్ లో 200కుపైగా స్కోర్లు నమోదయ్యాయి. 2022లో 18సార్లతో ఉన్న రికార్డు బ్రేకయింది. ► ఈ ఏడాది విరాట్ కోహ్లి 2 సెంచరీలు చేశాడు. దీంతో ఐపీఎల్లో మొత్తం 7 సెంచరీలతో అత్యధిక సెంచరీలు చేసిన ప్లేయర్ గా నిలిచాడు. ► ఈ ఏడాది లీగ్ స్టేజ్ లోనే 1066 సిక్స్ లు నమోదయ్యాయి. ఒక సీజన్ లో నమోదైన అత్యధిక సిక్స్ ల రికార్డు ఇదే. 1062 సిక్స్ లతో 2022 సీజన్ పేరిట ఉన్న రికార్డు బ్రేకయింది. ► యశస్వి జైశ్వాల్ 625 రన్స్ చేశాడు. ఒక సీజన్ లో అంతర్జాతీయ క్రికెట్ ఆడని ప్లేయర్ చేసిన అత్యధిక పరుగులు ఇవే. ► జాస్ బట్లర్ ఈ ఏడాది ఐదుసార్లు డకౌటయ్యాడు. ఒక సీజన్ లో అత్యధిక డకౌట్లు అతడివే. ►దినేష్ కార్తీక్ 17సార్లు డకౌటయ్యాడు. ఐపీఎల్ చరిత్రలో అత్యధికసార్లు డకౌటైన రికార్డు కార్తీక్ దే. రోహిత్ శర్మ 16 డకౌట్లతో రెండోస్థానంలో ఉన్నాడు. ► యజ్వేంద్ర చహల్ 187 వికెట్లతో ఐపీఎల్ హిస్టరీలో అత్యధిక వికెట్లు తీసిన బౌలర్ గా నిలిచాడు. ► యశస్వి జైశ్వాల్ 13 బంతుల్లోనే హాఫ్ సెంచరీ చేశాడు. ఐపీఎల్లో అత్యంత వేగంగా హాఫ్ సెంచరీ చేసిన ప్లేయర్ గా నిలిచాడు. ► వరుసగా రెండో ఏడాది కూడా గుజరాత్ టైటన్స్ టేబుల్లో టాప్ లో నిలిచింది. ముంబై ఇండియన్స్ (2019, 2020) తర్వాత ఈ ఘనత సాధించిన రెండో టీమ్ గా నిలిచింది. చదవండి: #ShubmanGill: సెంచరీతో కదం తొక్కి.. ఆర్సీబీని ఇంటికి పంపి -
IPL 2023: పాపం రాజస్థాన్..!
ఐపీఎల్ 2023 నుంచి గతేడాది రన్నరప్ రాజస్థాన్ రాయల్స్ ఎలిమినేట్ అయ్యింది. ఇవాళ (మే 21) సన్రైజర్స్పై ముంబై ఇండియన్స్ విజయం సాధించడంతో రాజస్థాన్ అధికారికంగా లీగ్ నుంచి నిష్క్రమించింది. జట్టు నిండా స్టార్ ప్లేయర్లు, కెరీర్ టాప్ ఫామ్లో ఉన్న ఆటగాళ్లు ఉన్నా.. ఏం ప్రయోజనం లేకుండా పోయింది. ఫేవరెట్ జట్లలో ఒకటిగా బరిలోకి దిగి లీగ్ మధ్యలో అనూహ్య పరాజయాలను ఎదుర్కొని తగిన మూల్యం చెల్లించుకుంది. యశస్వి జైస్వాల్, జోస్ బట్లర్, హెట్మైర్, కెప్టెన్ సంజూ శాంసన్, ట్రెంట్ బౌల్ట్, అశ్విన్, చహల్, సందీప్ శర్మ.. ఇలా జట్టులో దాదాపు ప్రతి ఒక్కరు మ్యాచ్ విన్నర్లే అయినా కొన్ని వ్యూహాత్మక తప్పిదాల కారణంగా హిట్ కావాల్సిన జట్టు ఫట్ అయ్యింది. రాజస్థాన్ బాధాకర పరిస్థితుల్లో లీగ్ నుంచి నిష్క్రమించడంతో ఆ జట్టు అభిమానల బాధ వర్ణణాతీతంగా ఉంది. పాపం, పాపం అనుకుంటూ తమను తామే సర్ధి చెప్పుకుంటున్నారు. జైస్వాల్ (14 మ్యాచ్ల్లో 625 పరుగులు), చహల్ (14 మ్యాచ్ల్లో 21 వికెట్లు) సాధించిన ఘనతలను తలచుకుంటూ తృప్తి పడుతున్నారు. సోషల్మీడియా వేదికగా రాజస్థాన్పై సానుభూతి వెల్లువెత్తుతుంది. ఒకవేళ సన్రైజర్స్తో నేటి మ్యాచ్లో ముంబై ఓడిపోయినా, అలాగే గుజరాత్ చేతిలో ఆర్సీబీ ఓడినా రాజస్థాన్కు ప్లే ఆఫ్స్ అవకాశాలు ఉండేవి. ఎస్ఆర్హెచ్పై ముంబై గెలుపుతో ఆర్సీబీ మ్యాచ్ వరకు కూడా ఉత్కంఠగా ఎదురుచూడకుండా ఐపీఎల్-2023లో రాజస్థాన్ భవిష్యత్తు తేలిపోయింది. ఆ జట్టు ప్రస్తుత సీజన్లో 14 మ్యాచ్లు ఆడి, ఆరో స్థానంతో ముగించింది. ఇదిలా ఉంటే, సన్రైజర్స్తో ఇవాల్టి మ్యాచ్లో ముంబై ఇండియన్స్ 8 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. తొలుత బ్యాటింగ్ చేసిన హైదరాబాద్.. వివ్రాంత్ శర్మ (69), మయాంక్ అగర్వాల్ (83) మెరుపు ఇన్నింగ్స్లతో విరుచుకుపడటంతో సన్రైజర్స్ నిర్ణీత ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 200 పరుగులు చేయగా.. కెమారూన్ గ్రీన్ (47 బంతుల్లో 100 నాటౌట్) విధ్వంసకర సెంచరీతో చెలరేగడంతో ముంబై మరో 12 బంతులు మిగిలుండగానే సునాయాసంగా లక్ష్యాన్ని ఛేదించింది. చదవండి: SRH VS MI: చరిత్ర సృష్టించిన రోహిత్ శర్మ -
బ్యాటింగ్ ఆర్డర్ కుప్పకూలింది.. ఇందుకు నా దగ్గర సమాధానం లేదు: సంజూ
IPL 2023 RR vs RCB: ‘‘టాపార్డర్లో ముగ్గురం బాగానే స్కోర్ చేస్తామనుకున్నాం. పవర్ ప్లేలో పరుగులు రాబట్టాలనుకున్నాం. కానీ ఈరోజు అది సాధ్యపడలేదు. నిజానికి టోర్నీ ఆరంభం నుంచి జైశ్వాల్, జోస్ అద్భుతంగా ఆడుతున్నారు. కానీ ఈరోజు ఈ పిచ్పై ఇలా జరిగిపోయింది. ఈ మ్యాచ్లో గెలుపునకు ఆర్సీబీ బౌలర్లకే క్రెడిట్ ఇవ్వాలి. ఆద్యంతం అద్బుతమైన ఎనర్జీతో.. గెలవాలన్న కసితో బౌల్ చేశారు. ఒకవేళ మేము పవర్ప్లేలో మంచిగా స్కోర్ చేసి ఉంటే.. లక్ష్యాన్ని ఛేదించగలిగే వాళ్లవేమో! సమష్టి వైఫల్యం కానీ మా బ్యాటింగ్ ఆర్డర్ కుప్పకూలిపోయింది. లోపం ఎక్కడుందో అర్థం కావడం లేదు. మా బ్యాటింగ్ వైఫల్యానికి కారణమేమిటన్న ప్రశ్నకు నా దగ్గర ప్రస్తుతం సమాధానం లేదు. ఐపీఎల్ స్వభావం ఎలా ఉంటుందో అందరికీ తెలిసిందే. అంచనాలు తారుమారు అవడం సహజం. ఈసారి లీగ్ దశలో ఎలాంటి సరదా ఘటనలు జరిగాయో చూశాం. ఈ పరాజయం కారణంగా మేము కుంగిపోము. సానుకూల దృక్పథంతో ముందుకు సాగుతాం. ప్రస్తుతం మా దృష్టి మొత్తం తదుపరి మ్యాచ్పైనే ఉంది. మేము మరింత స్ట్రాంగ్గా ఉండాల్సిన తరుణం. ఈ ఓటమికి ఎవరో ఒకరు కారణం కాదు.. ఇది జట్టు సమష్టి వైఫల్యం’’ అని రాజస్తాన్ రాయల్స్ కెప్టెన్ సంజూ శాంసన్ విచారం వ్యక్తం చేశాడు. కాగా ఐపీఎల్-2023లో రాయల్ చాలెంజర్స్ బెంగళూరుతో మ్యాచ్లో రాజస్తాన్ ఘోర పరాభవాన్ని మూటగట్టుకుంది. సొంతమైదనాంలో టాస్ ఓడి తొలుత ఫీల్డింగ్ చేసిన సంజూ శాంసన్ సేనకు 172 పరుగుల లక్ష్యం విధించింది ఆర్సీబీ. ఈ క్రమంలో టార్గెట్ను ఛేదించేందుకు బరిలోకి దిగిన రాజస్తాన్ బ్యాటింగ్ ఆర్డర్ కుప్పకూలింది. ఆర్సీబీ బౌలర్ల విజృంభణతో పవర్ ప్లేలో కేవలం 28 పరుగులు మాత్రమే చేసి 5 వికెట్లు కోల్పోయింది. ఆ తర్వాత ఏ దశలోనూ కోలుకోలేక కేవలం 59 పరుగులకే ఆలౌట్ అయింది. కుప్పకూలిన బ్యాటింగ్ ఆర్డర్ ఆర్సీబీ బౌలర్ల సమష్టి ప్రదర్శన కారణంగా 10.3 ఓవర్లలోనే రాజస్తాన్ కథ ముగిసిపోయింది. ఈ మ్యాచ్లో ఓపెనర్లు యశస్వి జైశ్వాల్, జోస్ బట్లర్ డకౌట్ కాగా.. వన్డౌన్ బ్యాటర్ సంజూ శాంసన్ 4 పరుగులకే పెవిలియన్ చేరాడు. నాలుగో స్థానంలో వచ్చిన జోరూట్ 10, తర్వాతి స్థానాల్లో బ్యాటింగ్ చేసిన పడిక్కల్ 4, షిమ్రన్ హెట్మెయిర్ 35, ధ్రువ్ జురెల్ 1, అశ్విన్ 0, ఆడం జంపా 2, సందీప్ శర్మ 0, కేఎమ్ ఆసిఫ్ 0 స్కోరు చేశారు. దీంతో 112 పరుగుల భారీ తేడాతో రాజస్తాన్ ఓటమిపాలై ప్లే ఆఫ్స్ అవకాశాలను సంక్లిష్టం చేసుకుంది. రాజస్తాన్ బ్యాటింగ్ ఆర్డర్ పతనాన్ని శాసించిన వేన్ పార్నెల్ ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్గా నిలిచాడు. చదవండి: రోహిత్ శర్మతో పోటాపోటీ.. నువ్వు మారవా? ఫ్యాన్స్ ఫైర్ 𝗗𝗢 𝗡𝗢𝗧 𝗠𝗜𝗦𝗦! The Anuj Rawat direct-hit that left everyone in disbelief 🔥🔥 Check out the dismissal here 🔽 #TATAIPL | #RRvRCB pic.twitter.com/2GWC5P0nYP — IndianPremierLeague (@IPL) May 14, 2023 -
రనౌట్ విషయంలో సంజూ భాయ్ నాతో ఏమన్నాడంటే: యశస్వి జైశ్వాల్
IPL 2023 KKR Vs RR: ‘‘అన్నివేళలా మనం కోరుకున్నవన్నీ జరగకపోవచ్చు. మనపై మనకు నమ్మకం ఉండటం ముఖ్యం. ఆత్మవిశ్వాసం ఉంటే అనుకున్న ఫలితాలు రాబట్టగలం. నేను మ్యాచ్కు ముందు అన్ని రకాలుగా సన్నద్ధమయ్యాను. ఎలాగైనా జట్టును గెలిపించాలనే సంకల్పంతో ఉన్నాను. ఈరోజు నాకు చాలా సంతోషంగా ఉంది’’ అని రాజస్తాన్ యువ ఓపెనర్ యశస్వి జైశ్వాల్ హర్షం వ్యక్తం చేశాడు. ఐపీఎల్-2023లో కోల్కతా నైట్ రైడర్స్తో మ్యాచ్లో యశస్వి అత్యుత్తమ ఇన్నింగ్స్తో ఆకట్టుకున్న విషయం తెలిసిందే. ఫాస్టెస్ట్ ఫిఫ్టీ ఈడెన్ గార్డెన్స్లో 13 బంతుల్లోనే 50 పరుగుల మార్కు అందుకున్న ఈ లెఫ్టాండ్ బ్యాటర్ మొత్తంగా 47 బంతుల్లో 98 పరుగులు రాబట్టాడు. అతడి ఇన్నింగ్స్లో 13 ఫోర్లు, 5 సిక్సర్లు ఉన్నాయి. కెప్టెన్ సంజూ శాంసన్తో కలిసి ఆఖరి వరకు అజేయంగా నిలిచిన యశస్వి.. ఫోర్ బాది జట్టు విజయాన్ని ఖరారు చేశాడు. ఈ సీజన్లో మరో సెంచరీకి రెండు పరుగుల దూరంలో నిలిచిపోయిన యశస్వి.. ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్గా నిలిచాడు. ఈ నేపథ్యంలో విజయానంతరం అతడు మాట్లాడుతూ.. విన్నింగ్ షాట్ ఆడటం గొప్ప అనుభూతినిచ్చిందని పేర్కొన్నాడు. రనౌట్ విషయంలో నాకు చెప్పిందిదే ‘‘నా బెస్ట్ ఇచ్చేందుకు శాయశక్తులా కృషి చేశాను. సెంచరీ మిస్ అయినందుకు పెద్దగా బాధ లేదు. మాకు ప్రస్తుతం రన్రేటు ముఖ్యం. అదే నా మైండ్లో ఉండిపోయింది. మ్యాచ్ను త్వరగా ఫినిష్ చేయాలని నేను సంజూ భావించాం. మ్యాచ్లో రనౌట్లు సహజం. అయితే, మరోసారి ఇలాంటి తప్పిదాలు పునరావృతం కాకుండా చూసుకోవాల్సిన బాధ్యత నాపై ఉంది. బట్లర్ రనౌట్ విషయంలో సంజూ భాయ్ నన్నేమీ అనలేదు. కేవలం బ్యాటింగ్ మీద దృష్టి పెట్టమని చెప్పాడు’’ అని 21 ఏళ్ల యశస్వి జైశ్వాల్ తెలిపాడు. ఐపీఎల్కు థాంక్స్ ఇక.. తన లాంటి ఎంతో మంది యువ ఆటగాళ్లకు ప్రతిభను నిరూపించుకునేందుకు ఐపీఎల్ అవకాశం ఇస్తోందని.. ఇలాంటి టోర్నీలు ఉండటం నిజంగా గొప్ప విషయం అని అతడు పేర్కొన్నాడు. క్రికెటర్లుగా ఎదగాలని కలల కంటున్న యువకుల ఆశయసాధనకు ఈ టోర్నీ ఎంతగానో ఉపయోగపడుతుందని సంతోషం వ్యక్తం చేశాడు. కాగా 41 బంతులు మిగిలి ఉండగానే కేకేఆర్ విధించిన లక్ష్యాన్ని ఛేదించిన రాజస్తాన్ రన్రేటు భారీగా మెరుగుపరచుకుని ప్లే ఆఫ్స్ రేసులో ముందుకు దూసుకొచ్చింది. ప్రస్తుతం పాయింట్ల పట్టికలో మూడో స్థానానికి ఎగబాకింది. చదవండి: నెం.1 బౌలర్ అనుకున్నావా.. మ్యాచ్ స్వరూపాన్నే మార్చేశాడు! చెత్త కెప్టెన్సీ గెలుపు జోష్లో ఉన్న రాజస్తాన్కు బిగ్ షాక్.. బట్లర్కు భారీ జరిమానా! The Yashasvi effect❤️🔥 - FASTEST 50 in #TATAIPL history!! 🤯💪#KKRvRR #IPL2023 #IPLonJioCinema | @rajasthanroyals @ybj_19 pic.twitter.com/WgNhYJQiUN — JioCinema (@JioCinema) May 11, 2023 What is it like for youngsters to be playing in a league like IPL? 🤔@ybj_19 encapsulates the emotion and experience that this platform provides 😁#TATAIPL | #KKRvRR | @rajasthanroyals pic.twitter.com/qvNm71X8rb — IndianPremierLeague (@IPL) May 11, 2023 150 runs chased down in just 13.1 overs. @rajasthanroyals have won this in a jiffy with Yashasvi Jaiswal smashing an incredible 98* from just 47 balls. Scorecard - https://t.co/jOscjlr121 #TATAIPL #KKRvRR #IPL2023 pic.twitter.com/2u0TiGPByI — IndianPremierLeague (@IPL) May 11, 2023 -
గెలుపు జోష్లో ఉన్న రాజస్తాన్కు బిగ్ షాక్.. బట్లర్కు భారీ జరిమానా!
ఐపీఎల్-2023లో భాగంగా ఈడెన్ గార్డన్స్ వేదికగా కోల్కతా నైట్రైడర్స్తో జరిగిన మ్యాచ్లో 9 వికెట్ల తేడాతో రాజస్తాన్ రాయల్స్ అద్భుత విజయం సాధించింది. 150 పరుగుల లక్ష్యాన్ని కేవలం 13.1 ఓవర్లలోనే రాజస్తాన్ ఊదిపడేసింది. రాజస్తాన్ బ్యాటర్లలో జైశ్వాల్( 47 బంతుల్లో 13 ఫోర్లు, 5 సిక్సర్లతో 98 నాటౌట్), శాంసన్(48 నాటౌట్) విధ్వంసం సృష్టించారు. అంతకుముందు బ్యాటింగ్ చేసిన కేకేఆర్ నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 149 పరుగులు చేసింది. కేకేఆర్ బ్యాటర్లలో వెంకటేశ్ అయ్యర్(57) పరుగులతో టాప్ స్కోరర్గా నిలిచాడు. రాజస్తాన్ బౌలర్లలో చాహల్ నాలుగు వికెట్లతో చెలరేగాడు. జోస్ బట్లర్కు జరిమానా ఇక రాజస్తాన్ స్టార్ ఓపెనర్ జోస్ బట్లర్కు బిగ్షాక్ తగిలింది. ఈ మ్యాచ్లో ఐపీఎల్ కోడ్ ఆఫ్ కాండక్ట్ నిబంధనలు ఉల్లంఘించినందుకు బట్లర్కు మ్యాచ్ రిఫరీ జరిమానా విధించాడు. అతడి మ్యాచ్లో 10 శాతం కోత విధిస్తున్నట్లు ఐపీఎల్ ఒక ప్రకటనలో వెల్లడించింది. బట్లర్ లెవెల్1 అత్రికమణకు పాల్పడ్డాడని, ఈ విషయంలో మ్యాచ్ రెఫరీదే తుది నిర్ణయమని ఐపీఎల్ నిర్వాహకులు పేర్కొన్నారు. కాగా మ్యాచ్లో దురదృష్టవశాత్తూ ఖాతా తెరవకుండానే బట్లర్ రనౌట్గా వెనుదిరిగాడు. చదవండి: #RajasthanRoylas: బంతుల పరంగా అతిపెద్ద విజయం.. ఐపీఎల్ చరిత్రలో రెండో జట్టుగా -
జైశ్వాల్ శివతాండవం.. బట్లర్ త్యాగం ఊరికే పోలేదు
ఐపీఎల్ 16వ సీజన్లో రాజస్తాన్ రాయల్స్ అతిపెద్ద విజయాన్ని నమోదు చేసింది. కేకేఆర్తో మ్యాచ్లో 150 పరుగుల టార్గెట్ను 13.1 ఓవర్లలో ఒక్క వికెట్ మాత్రమే కోల్పోయి చేధించింది. యశస్వి జైశ్వాల్ 47 బంతుల్లోనే 98 పరుగులు నాటౌట్ విధ్వంసకర ఇన్నింగ్స్ ఆడి రాజస్తాన్కు భారీ విజయాన్ని కట్టబెట్టాడు. అయితే ఇదే జైశ్వాల్ రాజస్తాన్ ఇన్నింగ్స్ ఆరంభంలో బట్లర్ రనౌట్కు ప్రధాన కారణమయ్యాడు. జైశ్వాల్తో మిస్ కమ్యునికేషన్ గ్యాప్ వల్ల బట్లర్ ఔటయ్యాడు. ఇన్నింగ్స్ రెండో ఓవర్లో హర్షిత్ రానా వేసిన నాలుగో బంతిని బట్లర్ పాయింట్ దిశగా ఆడాడు. అయితే బంతిని చూస్తూ బట్లర్ క్రీజు నుంచి కాస్త ముందుకు కదిలాడు. అయితే సింగిల్ కోసం వస్తున్నాడేమోనని భావించిన జైశ్వాల్ పరిగెత్తుకొచ్చాడు. ఇది గమనించిన బట్లర్ జైశ్వాల్ను వద్దని వారించకుండా తాను నాన్స్ట్రైక్ ఎండ్వైపు పరిగెత్తాడు. అప్పటికే బంతిని అందుకున్న రసెల్ మెరుపు వేగంతో త్రో విసరగా బట్లర్ డైరెక్ట్ హిట్కు బలయ్యాడు. ఒక రకంగా జైశ్వాల్ను ఔట్ చేయడం ఇష్టం లేక తన వికెట్ను త్యాగం చేశాడు. బట్లర్ త్యాగం అర్థం చేసుకున్న జైశ్వాల్ దానిని వృథా కానివ్వలేదు. తన కారణంగా బట్లర్ ఔటయ్యాడన్న కోపంతో మరింత ధాటిగా ఆడాడు. దీంతో జైశ్వాల్.. 13 బంతుల్లోనే ఫిఫ్టీ మార్క్ అందుకున్న సమయంలో డగౌట్లో బట్లర్ పైకి లేచి చప్పట్లతో అభినందించడం హైలెట్గా నిలిచింది. The Yashasvi effect❤️🔥 - FASTEST 50 in #TATAIPL history!! 🤯💪#KKRvRR #IPL2023 #IPLonJioCinema | @rajasthanroyals @ybj_19 pic.twitter.com/WgNhYJQiUN — JioCinema (@JioCinema) May 11, 2023 చదవండి: జైశ్వాల్ సెంచరీ కోసం తపించిన శాంసన్.. -
ఎస్ఆర్హెచ్తో మ్యాచ్ అంటే చాలు.. చెలరేగిపోతారు
ఐపీఎల్ 16వ సీజన్లో ఆదివారం ఎస్ఆర్హెచ్తో మ్యాచ్లో రాజస్తాన్ రాయల్స్ భారీ స్కోరు చేసింది. బట్లర్ 95, శాంసన్ 66 నాటౌట్ విధ్వంసం సృష్టించడంతో రాజస్తాన్ నిర్ణీత 20 ఓవర్లలో రెండు వికెట్లు మాత్రమే కోల్పోయి 214 పరుగులు చేసింది. Photo: IPL Twitter ► ఎస్ఆర్హెచ్తో మ్యాచ్ అంటే చాలు.. జాస్ బట్లర్, సంజూ శాంసన్లు చెలరేగిపోతారు. ముఖ్యంగా శాంసన్లో ఎక్కడ లేని ఎనర్జీ వస్తుంది. తాజాగా ఎస్ఆర్హెచ్తో మ్యాచ్లో 38 బంతుల్లో 66 పరుగులు నాటౌట్గా నిలిచిన శాంసన్ ఖాతాలో 4 ఫోర్లు, ఐదు సిక్సర్లు ఉన్నాయి. ఎస్ఆర్హెచ్తో ఆడిన చివరి 9 మ్యాచ్ల్లో శాంసన్ వరుసగా 102*, 48*, 26, 36, 48, 82, 55, 55, 66* పరుగులు చేశాడు. అంటే తొమ్మిది ఇన్నింగ్స్ల వ్యవధిలో ఐదు అర్థసెంచరీలు సహా ఒక సెంచరీ మార్క్ సాధించిన శాంసన్ ఎస్ఆర్హెచ్పై స్పష్టమైన ఆధిక్యం చూపాడు. Another game against @SunRisers, another 50 for Sanju Samson 🔥 4 in a row against the #OrangeArmy for @rajasthanroyals skipper ✨#RRvSRH #IPLonJioCinema #IPL2023 #TATAIPL | @IamSanjuSamson pic.twitter.com/3IQRkbtBrQ — JioCinema (@JioCinema) May 7, 2023 Photo: IPL Twitter ► ఇక రాజస్తాన్ ఓపెనర్ జాస్ బట్లర్ కూడా ఎస్ఆర్హెచ్ అంటూ చాలు పూనకం వచ్చినట్లుగా ఆడుతున్నాడు. తాజా మ్యాచ్లో ఐదు పరుగుల తేడాతో సెంచరీ మిస్ అయినప్పటికి 59 బంతుల్లో 95 పరుగులు చేశాడు. ఎస్ఆర్హెచ్తో గత నాలుగు మ్యాచ్ల్లో వరుసగా 124, 35, 54, 95 పరుగులు సాధించాడు. Back to 𝘽𝙊𝙎𝙎𝙄𝙉𝙂 it Jos Buttler brings up 5️⃣0️⃣!#IPLonJioCinema #RRvSRH #IPL2023 | @josbuttler pic.twitter.com/GkadXOqAcr — JioCinema (@JioCinema) May 7, 2023 ► ఇక బట్లర్, సంజూ శాంసన్ కలిసి రాజస్తాన్ తరపున ఒక మ్యాచ్లో రెండో వికెట్కు అత్యధిక పరుగులు జోడించిన జాబితాలో రెండో స్థానంలో నిలిచారు. ఎస్ఆర్హెచ్తో మ్యాచ్లో బట్లర్- శాంసన్లు రెండో వికెట్కు 138 పరుగులు జోడించారు. ఇంతకముందు కూడా ఈ రికార్డు ఎస్ఆర్హెచ్పైనే ఉంది. 2021లో బట్లర్- శాంసన్ జోడినే 150 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పి రికార్డులకెక్కారు. ఇక మూడో స్థానంలో రహానే-స్మిత్ జోడి 2019లో ఢిల్లీ క్యాపిటల్స్పై 130 పరుగులు జోడించారు. ► ఇక రాజస్తాన్ రాయల్స్కు హోంగ్రౌండ్ అయిన జైపూర్లో ఇప్పటివరకు 202 పరుగులే ఇన్నింగ్స్ అత్యధిక స్కోరు. తాజాగా ఎస్ఆర్హెచ్తో మ్యాచ్లో 214 పరుగులు చేసిన రాజస్తాన్ పాత రికార్డును బద్దలుకొట్టింది. చదవండి: అంతర్జాతీయ క్రికెట్ నుంచి ఐపీఎల్ దాకా అన్నీ ఇక్కడే! -
తెలివైన బంతితో బోల్తా కొట్టించాడు.. వీడియో వైరల్
ఐపీఎల్ 16వ సీజన్లో హైదరాబాదీ మహ్మద్ సిరాజ్ తన సూపర్ ఫామ్ను కంటిన్యూ చేస్తున్నాడు. పంజాబ్ కింగ్స్తో జరిగిన గత మ్యాచ్లో నాలుగు వికెట్లతో చెలరేగిన సిరాజ్.. తాజాగా రాజస్తాన్ రాయల్స్తో మ్యాచ్ను కూడా ఘనంగా ఆరంభించాడు. రాజస్తాన్ ఇన్నింగ్స్ తొలి ఓవర్లోనే సిరాజ్ ఆర్సీబీకి శుభారంభం అందించాడు. ఓవర్ నాలుగో బంతికి డేంజరస్ బ్యాటర్ జాస్ బట్లర్ను క్లీన్ బౌల్డ్ చేశాడు. అయితే బట్లర్ను ఔట్ చేసిన విధానం సిరాజ్ ఎంత మెరుగయ్యాడనేది చూపిస్తోంది. ఈ ఐపీఎల్లో ఇన్స్వింగర్లు, ఔట్స్వింగర్లతో మంచి ఫలితాలు రాబడుతున్న సిరాజ్ బట్లర్పై అదే అస్త్రాన్ని ప్రయోగించి సక్సెస్ అయ్యాడు. దీనికి కాస్త తెలివిని కూడా జోడించాడు. రైట్ హ్యాండ్ బ్యాటర్లకు ఔట్స్వింగర్ వేసే సిరాజ్.. బట్లర్కు మాత్రం ఇన్స్వింగర్ వేసి బోల్తా కొట్టించాడు. ఔట్సైడ్ వెళ్తుందని భావించిన బట్లర్ బంతిని వదిలేయడం.. దాంతో బంతి వెళ్లి నేరుగా మిడిల్ స్టంప్ను ఎగురగొట్టింది. సిరాజ్ దెబ్బకు బట్లర్ వద్ద సమాధానం లేకుండా పోయింది. దీనికి సంబంధించిన వీడియోపై ఒక లుక్కేయండి. 𝙍𝙞𝙜𝙝𝙩 𝙩𝙝𝙧𝙤𝙪𝙜𝙝 𝙩𝙝𝙚 𝙙𝙚𝙛𝙚𝙣𝙘𝙚 🔥🔥 An extraordinary delivery THAT 💪🏻@mdsirajofficial cleans up Jos Buttler and continues his habit of striking early for @RCBTweets! #TATAIPL | #RCBvRR pic.twitter.com/YE4ge4tAU0 — IndianPremierLeague (@IPL) April 23, 2023 చదవండి: ఏప్రిల్ 23.. కోహ్లికి కలిసిరాని రోజు! -
బిడ్డ ముందే బట్లర్ కు లవ్ ప్రపోజల్ చేసిన చాహల్..
-
నువ్వంటే నాకిష్టం.. నా లవ్ నువ్వే: బట్లర్కు చాహల్ ప్రపోజల్.. వైరల్
టీమిండియా స్పిన్నర్ యుజువేంద్ర చాహల్ మైదానంలోనే కాకుండా ఆఫ్ది ఫీల్డ్లో కూడా చాలా యాక్టివ్గా ఉంటాడన్న సంగతి తెలిసిందే. ఎప్పటికప్పుడు ఫన్నీ వీడియోలతో సోషల్ మీడియాలో తన అభిమానులను చాహల్ అలరిస్తుంటాడు. అయితే తాజాగా చాహల్కు సంబంధించిన మరో వీడియో అభిమానులను తెగ ఆకట్టుకుంటోంది. చాహల్ ప్రస్తుతం ఐపీఎల్-2023లో బిజీబిజీగా ఉన్నాడు. ఈ మెగా ఈవెంట్లో రాజస్తాన్ రాయల్స్కు చాహల్ ప్రాతినిధ్యం వహిస్తున్నాడు. ఈ క్రమంలో తన సహచర ఆటగాడు, ఇంగ్లండ్ కెప్టెన్ జోస్ బట్లర్కు.. చహల్ ఫన్నీగా డేటింగ్ ప్రపోజ్ చేశాడు. ఇందుకు సంబంధించిన వీడియోను రాజస్తాన్ రాయల్స్ సోషల్ మీడియాలో షేర్ చేసింది. ఈ టీమిండియా చేతిలో ఒక చిన్న పూల కుండీని పట్టుకుని మరీప్రపోజ్ చేశాడు. "జోస్ భాయ్, నువ్వంటే నాకు చాలా ఇష్టం. నువ్వే నా జీవితం. గతేడాది తొలిసారి మిమ్మల్ని చూసినప్పుడే నేను ప్రేమలో పడిపోయాను. ప్రతిరోజు నాకు గుర్తొస్తూనే ఉంటావు. ప్లీజ్ నాతో డేట్కు వస్తారా" అని సరదాగా చహల్ ప్రపోజ్ చేశాడు. అందుకు బదులుగా బట్లర్ "సరే యుజీ.. నేను కచ్చితంగా వస్తాను" అంటూ సమాధానం ఇచ్చాడు. దీంతో చుట్టుపక్కన వారంతా ఒక్కసారిగా చప్పట్లు కొడుతూ గట్టిగా నవ్వుకున్నారు. ఈ వీడియో నెట్టింట వైరల్ అవుతోంది. ఇక రాజస్తాన్ తమ తదుపరి మ్యాచ్లో ఏప్రిల్ 20న ఆర్సీబీతో తలపడనుంది. చదవండి: IPL 2023: తిన్నగా ఆడటమే రాదు.. ఇంకా ప్రయోగాలు ఒకటి! చెత్త బ్యాటింగ్ IPL 2023: విధ్వంసకర వీరుడొచ్చాడు.. వెలగబెట్టిందేమీ లేదు! పాపం పంజాబ్.. The perfect proposal doesn’t exi- 😂 pic.twitter.com/vENeuVtfTq — Rajasthan Royals (@rajasthanroyals) April 20, 2023 -
జోస్ బట్లర్ 112 మీటర్ల భారీ సిక్సర్.. వీడియో వైరల్
ఐపీఎల్-2023లో రాజస్తాన్ రాయల్స్ ఓపెనర్ జోస్ బట్లర్ తన అద్భుత ఫామ్ను కొనసాగిస్తున్నాడు. జైపూర్ వేదికగా లక్నో సూపర్ జెయింట్స్తో జరిగిన మ్యాచ్లో 40 పరుగులు సాధించాడు. ఈ మ్యాచ్లో బట్లర్ కాస్త స్లో ఇన్నింగ్స్ ఆడినప్పటికీ.. ఓ భారీ సిక్సర్ మాత్రం బాదాడు. రాజస్తాన్ ఇన్నింగ్స్ ఐదో ఓవర్ వేసిన యుధ్వీర్ బౌలింగ్లో బట్లర్ 112 మీటర్ల భారీ సిక్సర్ బాదాడు. ఈ ఏడాది సీజన్లో ఇది రెండవ అతి పెద్ద సిక్సర్ కావడం గమనార్హం. కాగా ఐపీఎల్-2023లో ఇప్పటివరకు అతి పెద్ద సిక్సర్ కొట్టిన రికార్డు ఆర్సీబీ కెప్టెన్ ఫాఫ్ డు ప్లెసిస్ పేరిట ఉంది. ఈ మెగా ఈవెంట్లో భాగంగా లక్నో సూపర్ జెయింట్స్తో జరిగిన మ్యాచ్లో డుప్లెసిస్ 115 మీటర్ల భారీ సిక్స్ కొట్టాడు. ఇక మ్యాచ్ విషయానికి వస్తే.. లక్నో చేతిలో 10 పరుగుల తేడాతో రాజస్తాన్ ఓటమి పాలైంది. 155 పరుగుల స్వల్ప లక్క్ష్యంతో బరిలోకి దిగిన రాజస్తాన్.. నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్లు కోల్పోయి 144 పరుగులకే పరిమితమైంది. రాజస్తాన్ బ్యాటర్లలో జైశ్వాల్(44), జోస్ బట్లర్(40) మినహా మిగతా బ్యాటర్లందరూ దారుణంగా విఫలమయ్యారు. అంతకుముందు బ్యాటింగ్ చేసిన లక్నో నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 154 పరుగులు చేసింది. చదవండి: IPL 2023: నీకెందుకు ఈ ఆట.. వెళ్లి డ్యాన్స్లు వేసుకో పో! 3 కోట్లు దండగా.. IPL 2023: ఎందుకు వస్తున్నాడో తెలియదు.. ప్రతీ మ్యాచ్లో ఇంతే! తీసి పడేయండి.. pic.twitter.com/NE4n8hQTOB — A (@cricketvf) April 19, 2023