David Miller
-
ఇంతకంటే చెత్త ఫ్రాంఛైజీ మరొకటి ఉండదు: ‘లక్నో’పై నెటిజన్లు ఫైర్
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL) ఆరంభానికి ముందు లక్నో సూపర్ జెయింట్స్ తీవ్ర స్థాయిలో విమర్శలు మూటగట్టుకుంటోంది. ఇంతకంటే చెత్త ఫ్రాంఛైజీ ఇంకొకటి ఉండదంటూ క్రికెట్ ప్రేమికులు సోషల్ మీడియా వేదికగా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. డబ్బులు పెట్టి కొనుకున్నాం కాబట్టి.. ఆటగాళ్ల భావోద్వేగాలతో ఆడుకోవచ్చనే సంస్కృతికి వీడ్కోలు పలకాలని హితవు పలుకుతున్నారు.భారీ ధరకు కొనుగోలుఅసలేం జరిగిందంటే.. ఐపీఎల్ మెగా వేలం-2025లో లక్నో యాజమాన్యం సౌతాఫ్రికా హార్డ్ హిట్టర్ డేవిడ్ మిల్లర్ (David Miller)ను సొంతం చేసుకున్న విషయం తెలిసిందే. గతేడాది గుజరాత్ టైటాన్స్కు ఆడిన ఈ విధ్వంసకర వీరుడు ఆక్షన్లోకి రాగా.. రూ. 7.5 కోట్లకు లక్నో కొనుగోలు చేసింది.ఇక మార్చి 22న ఐపీఎల్ తాజా ఎడిషన్ ఆరంభం కానుండగా.. మార్చి 24న లక్నో తమ తొలి మ్యాచ్ ఆడనుంది. విశాఖపట్నం వేదికగా ఢిల్లీ క్యాపిటల్స్తో తలపడనుంది. ఈ నేపథ్యంలో ఇప్పటికే ఇరుజట్లు విశాఖకు చేరుకున్నాయి. ఇదిలా ఉంటే.. లక్నో ఫ్రాంఛైజీ డేవిడ్ మిల్లర్తో ఓ ఇంటర్వ్యూయర్ జరిపిన సంభాషణకు సంబంధించిన వీడియోను విడుదల చేసింది. ఇందులో ఓ వ్యక్తి.. మీ కెరీర్లో బిగ్గర్ హార్ట్బ్రేక్ ఏది? అంటూ మిల్లర్ను ప్రశ్నించాడు. బిగ్గర్ హార్ట్బ్రేక్ ఏది? నవ్వుతూ ప్రశ్నలుఇందులో.. ‘‘గుజరాత్ టైటాన్స్ తరఫున 2023 ఫైనల్లో ఓటమి.. 2014లో పంజాబ్ కింగ్స్ ఫైనల్ ఓటమి.. లేదంటే.. వరల్డ్కప్-2019, 2021లలో సౌతాఫ్రికా గ్రూప్ దశలోనే నిష్క్రమించడం.. లేదా టీ20 వరల్డ్కప్-2024 ఫైనల్లో ఓటమి.. అదీ కాదంటే వన్డే వరల్డ్కప్-2023 సెమీస్లో ఓటమి.. లేదంటే.. చాంపియన్స్ ట్రోఫీ-2025లో న్యూజిలాండ్ చేతిలో ఓటమి.. వీటిల్లో మీ హృదయాన్ని ముక్కలు చేసిన సంఘటన ఏది?’’ అంటూ బోలెడన్ని ఆప్షన్లు కూడా ఇచ్చాడు.అంతేకాదు.. సదరు వ్యక్తి నవ్వుతూ ఈ ప్రశ్నలు అడగటం గమనార్హం. ఇందుకు మిల్లర్ బాధగా, దిగాలుగా ముఖం పెట్టుకుని సమాధానాలు ఇచ్చాడు. అయితే, ఇంటర్వ్యూయర్ మాత్రం నవ్వుతూనే ఉన్నాడు. ఇందుకు సంబంధించిన వీడియోను సోషల్ మీడియాలో పోస్ట్ చేసిన లక్నో.. ‘ఇకపై మిల్లర్కు ఇలాంటి బాధలు ఉండవు’ అంటూ తాము ఈసారి టైటిల్ గెలవబోతున్నట్లు క్యాప్షన్ ఇచ్చింది.ఇంతకంటే చెత్త ఫ్రాంఛైజీ మరొకటి లేదుమిలియన్కు పైగా వ్యూస్ సాధించిన ఈ వీడియోపై నెటిజన్లు మండిపడుతున్నారు. ‘‘ఇది వినోదం కాదు.. ఓ ఆటగాడిని మానసికంగా వేధించడం లాంటిది. ఓటములను గుర్తుచేస్తూ అతడి మనసును మరింత బాధపెట్టడం సరికాదు. వీడియోలు సృజనాత్మకంగా ఉండాలి గానీ.. ఇలా ఆటగాడి మనసును నొప్పించేలా ఉండకూడదు.డబ్బులు పెట్టి కొన్నారు కాబట్టి ఆటగాళ్లంతా తాము చెప్పినట్లు నడచుకోవాలనే లక్నో యాజమాన్యం అహంభావ వైఖరికి ఇది నిదర్శనం. గత సీజన్లో కేఎల్ రాహుల్ను అవమానించిన తీరును మేము ఇప్పటికీ మర్చిపోలేకపోతున్నాం. ఐపీఎల్లో ఇంతకంటే చెత్త ఫ్రాంఛైజీ మరొకటి లేదు’’ అంటూ తీవ్ర స్థాయిలో ట్రోల్ చేస్తున్నారు.రాహుల్ పట్ల అదే తీరుకాగా గతేడాది సన్రైజర్స్ హైదరాబాద్ చేతిలో ఓటమి తర్వాత లక్నో జట్టు యజమాని సంజీవ్ గోయెంకా.. అప్పటి తమ కెప్టెన్ కేఎల్ రాహుల్పై మైదానంలోనే అరిచేశాడు. అందుకు సంబంధించిన దృశ్యాలు విస్తృతంగా వైరల్ కాగా.. గోయెంకాపై తీవ్ర స్థాయిలో విమర్శలు వచ్చిన విషయం తెలిసిందే.ఇక ఈ పరిణామాల నేపథ్యంలో కేఎల్ రాహుల్ లక్నోను వీడి వేలంలోకి రాగా.. ఢిల్లీ క్యాపిటల్స్ కొనుగోలు చేసింది. మరోవైపు.. మరో టీమిండియా స్టార్ రిషభ్ పంత్ను రికార్డు స్థాయిలో రూ. 27 కోట్లకు కొన్న లక్నో.. కెప్టెన్గా అతడికి పగ్గాలు అప్పగించింది. చదవండి: నమ్మశక్యం కాని ఇన్నింగ్స్.. అతడి బ్యాటింగ్ అద్భుతం: కివీస్ కెప్టెన్Manifesting zero heartbreaks for Miller bhai this season 🤞 pic.twitter.com/4zd5FbtblW— Lucknow Super Giants (@LucknowIPL) March 20, 2025 -
విధ్వంసకర వీరులు.. పంత్కు పగ్గాలు.. లక్నో ఫైనల్ చేరుతుందా?
లక్నో సూపర్ జెయింట్స్ జట్టు ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL) లో 2022లో అరంగేట్రం చేసింది. వరుసగా రెండు (2022, 2023) సీజన్లలో మూడో స్థానంలో నిలిచి.. ప్లే ఆఫ్స్ చేరింది. అయితే, గతేడాది మాత్రం లక్నోకు ఎదురు దెబ్బతగిలింది. తొలిసారిగా ఐపీఎల్లో లీగ్ దశ నుంచే నిష్క్రమించింది. ఏడు విజయాలు, ఏడు పరాజయాలతో 14 పాయింట్లతో ఏడవ స్థానంతో ముగించింది.ఈ నేపథ్యంలో 2025 సీజన్ కోసం జట్టులో భారీ మార్పులు చేపట్టింది. ఐపీఎల్ మెగా వేలం ఇందుకు అనువుగా ఉపయోగించుకుంది. విశాఖపట్నంలోని డాక్టర్ వై.ఎస్. రాజశేఖర రెడ్డి ఏసీఏ-విడిసిఏ క్రికెట్ స్టేడియంలో ఢిల్లీ క్యాపిటల్స్ మార్చి 24 (గురువారం)న ఢిల్లీ క్యాపిటల్స్ తో జరిగే మ్యాచ్ తో లక్నో సూపర్ జెయింట్స్ తన ఐపీఎల్ టైటిల్ వేట ప్రారంభిస్తుంది.భారీ మార్పులతో కొత్త సీజన్లోకి ప్రారంభంలో నికోలస్ పూరన్ (Nicholas Pooran), రవి బిష్ణోయ్, మయాంక్ యాదవ్, ఆయుష్ బదోని, మోసిన్ ఖాన్ వంటి ఆటగాళ్ళని రెటైన్ చేసుకుంది. అయితే అనూహ్యంగా కెప్టెన్ కేఎల్ రాహుల్ (KL Rahul)ను తప్పించాలని నిర్ణయించింది. రాహుల్ ఢిల్లీ క్యాపిటల్స్ జట్టులో చేరాడు. వేలంలో ఢిల్లీ క్యాపిటల్స్ విడుదల చేసిన భారత యువ వికెట్ కీపర్ రిషబ్ పంత్ (Rishabh Pant)ను రూ. 27 కోట్ల భారీ బిడ్తో కొనుగోలుచేసింది. ఇది ఐపీఎల్ చరిత్రలో నే అత్యంత ఖరీదైన ఒప్పందంగా రికార్డ్ నెలకొల్పింది.ఇంకా వేలంలో డేవిడ్ మిల్లర్, ఐడెన్ మార్క్రామ్ మరియు మిచెల్ మార్ష్ వంటి విదేశీ ఆటగాళ్ల ను జట్టులో చేర్చుకుంది. వీరు కాక అవేష్ ఖాన్, అబ్దుల్ సమద్, ఆర్యన్ జుయల్, ఆకాష్ దీప్ వంటి వారిని కూడా తీసుకున్నారు. విధ్వంసకర ఆటగాళ్లు.. ఫైనల్ చేరేనా?రిషబ్ పంత్తో పటు విధ్వంసకర ఆటగాళ్లుగా పేరుపొందిన మాథ్యూ బ్రీట్జ్కే, నికోలస్ పూరన్, డేవిడ్ మిల్లర్ వంటి ఆటగాళ్లు ఉన్నందున లక్నో జట్టు బ్యాటింగ్ ఫైర్ పవర్ పూర్తి స్థాయిలో ఉందని చెప్పవచ్చు.ఇంకా ఆల్ రౌండర్లు మిచెల్ మార్ష్, షాబాజ్ అహ్మద్ జట్టు కు సమతుల్యతను తెస్తారు. అవేష్ ఖాన్, మోసిన్ ఖాన్, రవి బిష్ణోయ్ నేతృత్వంలోని బౌలింగ్ యూనిట్ ఏ బ్యాటింగ్ లైనప్నైనా కూల్చివేసే సామర్థ్యాన్ని కలిగి ఉంది. ఈ భారీ మార్పులు తర్వాత ఇప్పుడు రిషబ్ పంత్ నాయకత్వంలో ఐపీఎల్ ఫైనల్కి చేరాలని లక్నో ఆశిస్తోంది.గంభీర్ వెళ్లిపోయిన తర్వాతఅలాగే, 2024 సీజన్ ప్రారంభంలో మెంటార్ గౌతమ్ గంభీర్ జట్టును విడిచిపెట్టి కోల్కతాలో చేరాడు. గంభీర్ రెండు సీజన్ లలో లక్నో జట్టుకు మెంటార్ గా పనిచేసాడు. ఇప్పుడు అతడి స్థానంలో దక్షిణాఫ్రికా లెజెండ్ లాన్స్ క్లూసెనర్ను అసిస్టెంట్ కోచ్గా చేర్చుకోవడం ద్వారా కోచింగ్ సిబ్బందిని బలోపేతం చేసింది. ఆస్ట్రేలియా మాజీ కెప్టెన్ జస్టిన్ లాంగర్ నాయకత్వంలో క్లూసెనర్ నైపుణ్యం ఉండటంతో, లక్నో చివరి అడ్డంకులను అధిగమించి రాబోయే సీజన్లో విజయం సాధించాలని లక్ష్యంగా పెట్టుకుంది.లక్నో సూపర్ జెయింట్స్ జట్టు లో ప్రధాన ఆటగాళ్లురిషబ్ పంత్లక్నో సూపర్ జెయింట్స్ బిడ్డింగ్ పోరులో విజయం సాధించి, రిషబ్ పంత్ను రూ. 27 కోట్లకు దక్కించుకుంది. ఈ చారిత్రాత్మక బిడ్లో గత రికార్డులన్నింటినీ బద్దలు కొట్టి, పంత్ను టోర్నమెంట్ చరిత్రలో అత్యంత ఖరీదైన ఆటగాడిగా నిలిపింది. పంత్ చేరికతో లక్నో వ్యూహం, స్వరూపం పూర్తిగా మారే అవకాశముంది.నికోలస్ పూరన్ఈ వెస్టిండీస్ వికెట్ కీపర్ బ్యాటర్ తన అసాధారణ ప్రతిభ తో మ్యాచ్ స్వరూపాన్ని మార్చేయగలడు. అందుకే లక్నో ఈ ఆటగాడ్ని వేలానికి ముందే రెటైన్ చేసుకుంది. 76 ఐపీఎల్ మ్యాచ్ లలో పూరన్ 160 కంటే ఎక్కువ స్ట్రైక్ రేట్ తో 1,769 పరుగులు చేశాడు, తొమ్మిది అర్ధ సెంచరీలు కూడా సాధించాడు. అతని అపార సామర్థ్యం కారణంగా జట్టులో కీలకమైన ఆటగాడనడంలో సందేహం లేదు.డేవిడ్ మిల్లర్మిడిల్ ఆర్డర్ లో బ్యాటింగ్ చేసే డేవిడ్ మిల్లర్ ఇప్పటికే మ్యాచ్ విన్నర్గా నిరూపించుకున్నాడు. డేవిడ్ మిల్లర్ 130 ఐపీఎల్ మ్యాచ్ లలో 13 అర్ధ సెంచరీలు, ఒక సెంచరీతో దాదాపు 140 స్ట్రైక్ రేట్ తో 2,924 పరుగులు చేశాడు.మయాంక్ యాదవ్మయాంక్ యాదవ్ బౌలింగ్లో లక్నోకి కీలకమైన ఆటగాడిగా ఉండే అవకాశముంది. లక్నో రూ. 11 కోట్లకు మయాంక్ యాదవ్ ను కొనుగోలు చేసింది. వేగం, వైవిధ్యం మయాంక్ సొత్తు. కొత్త బంతితో పాటు డెత్ బౌలింగ్లో కూడా మయాంక్ బాగా రాణించగలనని ఇప్పటికే నిరూపించాడు.ఆయుష్ బదోనిలక్నో జట్టుతో చేరినప్పటి నుంచి ఆయుష్ బదోని తన క్రికెట్ కెరీర్లో భారీ పురోగతి సాధించాడు. 25 ఏళ్ల ఈ స్టైలిష్ బ్యాటర్ 2022 సీజన్లో రెండు మ్యాచ్ విన్నింగ్ నాక్స్ ఆడటం ద్వారా ఫ్రాంచైజీపై తనదైన ముద్ర వేశాడు. అయితే, టోర్నమెంట్ కొనసాగే కొద్దీ అతని ఫామ్ క్షీణించింది. కొద్దిగా నిలకడ తగ్గినప్పటికీ లక్నో అతన్ని రెటైన్ చేయాలని నిర్ణయించింది.లక్నో సూపర్ జెయింట్స్ జట్టులక్నో సూపర్ జెయింట్స్ జట్టునికోలస్ పూరన్, రవి బిష్ణోయ్, మయాంక్ యాదవ్, మొసిన్ ఖాన్, ఆయుష్ బదోని, రిషబ్ పంత్, డేవిడ్ మిల్లర్, ఐడెన్ మార్క్రామ్, మిచెల్ మార్ష్, అవేష్ ఖాన్, అబ్దుల్ సమద్, ఆర్యన్ జుయల్, ఆకాష్ దీప్, హిమ్మత్ సింగ్, ఎం. సిద్ధార్థ్, దిగ్వేష్ సింగ్, ప్రిన్స్ యాదవ్, యువరాజ్ చౌదరి, రాజవర్ధన్ హంగర్గేకర్, షెహబాజ్ అహ్మద్, షమార్ జోసెఫ్, అర్షిన్ కులకర్ణి, మాథ్యూ బ్రీట్జ్కే. చదవండి: ముగ్గురు టీమిండియా కెప్టెన్లు.. అది నా అదృష్టం: హార్దిక్ పాండ్యా Never give up the superpower 👊 pic.twitter.com/NtahEerR2x— Lucknow Super Giants (@LucknowIPL) March 19, 2025 -
IND vs NZ: ఇది సరికాదు!.. ఫైనల్లో కివీస్ గెలవాలి: సౌతాఫ్రికా స్టార్
ఐసీసీ చాంపియన్స్ ట్రోఫీ-2025(ICC Champions Trophy) ఫైనల్లో తన మద్దతు న్యూజిలాండ్ జట్టుకేనని సౌతాఫ్రికా స్టార్ క్రికెటర్ డేవిడ్ మిల్లర్(David Miller) అన్నాడు. టైటిల్ పోరులో తలపడే టీమిండియా- కివీస్ రెండూ పటిష్ట జట్లే అయినప్పటికీ తాను మాత్రం సాంట్నర్ బృందం వైపే ఉంటానని స్పష్టం చేశాడు. సెమీ ఫైనల్లో న్యూజిలాండ్ చేతిలో ఓటమి అనంతరం మిల్లర్ ఈ మేరకు వ్యాఖ్యలు చేశాడు. సెమీస్ మ్యాచ్ల షెడ్యూల్ పట్ల అతడికి ఉన్న అసంతృప్తే ఇందుకు కారణమని తెలుస్తోంది.కాగా ఫిబ్రవరి 19న పాకిస్తాన్(Pakistan) వేదికగా చాంపియన్స్ ట్రోఫీ మొదలుకాగా.. భారత జట్టు మాత్రం తటస్థ వేదికైన దుబాయ్లో తమ మ్యాచ్లు ఆడుతోంది. టీమిండియాతో మ్యాచ్ల కోసం గ్రూప్-‘ఎ’లో భాగమైన బంగ్లాదేశ్, పాకిస్తాన్, న్యూజిలాండ్ పాక్ నుంచి దుబాయ్కు ప్రయాణం చేయాల్సి వచ్చింది. ఇక రోహిత్ సేన సెమీస్ చేరడంతో గ్రూప్-బి నుంచి పోటీదారు ఎవరన్న అంశంపై ముందే స్పష్టత లేదు కాబట్టి ఆస్ట్రేలియాతో పాటు సౌతాఫ్రికా కూడా అరబిక్ దేశానికి రావాల్సి వచ్చింది.అయితే, గ్రూప్ దశలో ఆఖరిగా కివీస్పై విజయం సాధించిన భారత్.. గ్రూప్-ఎ టాపర్గా నిలవగా.. గ్రూప్-బి పాయింట్ల పట్టికలో రెండో స్థానంలో ఉన్న ఆస్ట్రేలియా దుబాయ్లోనే ఉండిపోగా.. సౌతాఫ్రికా వెంటనే న్యూజిలాండ్తో సెమీస్ ఆడేందుకు పాకిస్తాన్కు తిరిగి వచ్చింది.ఈ పరిణామాల నేపథ్యంలో డేవిడ్ మిల్లర్ మాట్లాడుతూ.. ‘‘మా షెడ్యూల్ ఏమాత్రం బాగా లేదు. దుబాయ్కి ప్రయాణం గంటా 40 నిమిషాలే కావచ్చు. కానీ మేం వెళ్లక తప్పలేదు. మ్యాచ్ ముగిసిన తర్వాతే ఆ రోజే సిద్ధమై సాయంత్రం దుబాయ్కు వెళ్లాం. సోమవారం తెల్లవారుజామున మళ్లీ పాకిస్తాన్కు వచ్చాం’ అని మిల్లర్ అన్నాడు.ఇక ఫైనల్లో టీమిండియా- కివీస్ తలపడనున్న తరుణంలో.. ‘‘ప్రతి ఒక్క జట్టు తమ అత్యుత్తమ ప్రదర్శన ఇచ్చేందుకు ప్రయత్నిస్తుంది. నిజానికి టీమిండియాతో మేము మరోసారి ఫైనల్ ఆడే పరిస్థితి ఉంటే ఎంతో బాగుండేది. కానీ మనం అనుకున్నవన్నీ జరగవు. ఏదేమైనా ట్రోఫీ గెలిచేందుకు ప్రతి ఒక్క ఆటగాడు కఠినశ్రమకు ఓర్చి అంకితభావంతో పనిచేస్తాడని చెప్పగలను. భారత్, న్యూజిలాండ్లు పటిష్టమైన జట్లే అయినా.. నిజాయితీగా చెప్పాలంటే.. నేను మాత్రం కివీస్ గెలవాలనే కోరుకుంటున్నా’’ అని డేవిడ్ మిల్లర్ పేర్కొన్నాడు.కాగా రెండో సెమీ ఫైనల్లో న్యూజిలాండ్ చేతిలో సౌతాఫ్రికా ఓడిపోయిన విషయం తెలిసిందే. లాహోర్ వేదికగా బుధవారం జరిగిన ఈ మ్యాచ్లో కివీస్ రికార్డు స్థాయిలో నిర్ణీత యాభై ఓవర్లలో ఆరు వికెట్ల నష్టానికి 362 పరుగులు సాధించింది. అయితే, లక్ష్య ఛేదనలో సౌతాఫ్రికా 312 పరుగులకే పరిమితమైంది. దీంతో డేవిడ్ మిల్లర్ వీరోచిత, విధ్వంసకర శతకం వృథాగా పోయింది. మిల్లర్ 67 బంతుల్లో 10 ఫోర్లు, 4 సిక్సర్ల సాయంతో 100 పరుగులతో అజేయంగా నిలిచాడు.ఇదిలా ఉంటే.. టీ20 ప్రపంచకప్-2024 ఫైనల్లో టీమిండియా- సౌతాఫ్రికా తలపడిన విషయం తెలిసిందే. అయితే, ప్రొటిస్ జట్టు ఆఖరి వరకు పోరాడినా ఫలితం లేకుండా పోయింది. రోహిత్ సే న ఏడు పరుగుల స్వల్ప తేడాతో గెలిచి చాంపియన్గా నిలిచింది.ఇక... ఐసీసీ టోర్నమెంట్లలో కీలక సమయాల్లో చేతులెత్తేసి చోకర్స్గా ముద్రపడ్డ సౌతాఫ్రికా ఖాతాలో ఉన్న ఏకైక ఐసీసీ టైటిల్ చాంపియన్స్ ట్రోఫీ మాత్రమే. 1998లో ప్రొటిస్ జట్టు విజేతగా నిలిచింది. ఆ తర్వాత పలు సందర్భాల్లో అద్భుత ప్రదర్శనతో సెమీస్, ఫైనల్ చేరినా ఇంత వరకు ట్రోఫీని మాత్రం ముద్దాడలేకపోయింది. -
చరిత్ర సృష్టించిన డేవిడ్ మిల్లర్.. సెహ్వాగ్ వరల్డ్ రికార్డు బద్దలు
ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ-2025లో సౌతాఫ్రికా ప్రయాణం ముగిసింది. ఈ మెగా టోర్నీలో భాగంగా లహోర్ వేదికగా బుధవారం న్యూజిలాండ్తో జరిగిన సెమీఫైనల్లో 50 పరుగుల తేడాతో ప్రోటీస్ జట్టు ఓటమి పాలైంది. ఈ మ్యాచ్లో సౌతాఫ్రికా ఓటమి పాలైనప్పటికి.. ఆ జట్టు స్టార్ బ్యాటర్ డేవిడ్ మిల్లర్ మాత్రం తన విరోచిత పోరాటంతో అందరి మనసులను గెలుచుకున్నాడు.363 పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన 50 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 312 పరుగులు మాత్రమే చేయగలిగింది. అయితే మిల్లర్ క్రీజులోకి వచ్చినప్పటికి ప్రోటీస్ స్కోర్ 167/4 గా ఉంది. అప్పటికే మ్యాచ్ సఫారీల చేజారిపోయింది. ఛాంపియన్స్ ట్రోఫీ ఫైనల్కు చేరుకోవడానికి దక్షిణాఫ్రికా 128 బంతుల్లో 196 పరుగులు చేయాల్సి ఉండేది.ఈ సమయంలో మిల్లర్ విధ్వంసం సృష్టించాడు. అప్పటివరకు అద్బుతంగా బౌలింగ్ చేస్తున్న కివీస్ బౌలర్లపై ఎదురుదాడికి దిగాడు. ఓవైపు క్రమం తప్పకుండా వికెట్ కోల్పోతున్నప్పటికి మిల్లర్ మాత్రం తన విధ్వంసాన్ని ఆపలేదు. వరుస క్రమంలో బౌండరీలు బాదుతూ ఆఖరి బంతికి తన 6వ వన్డే సెంచరీ మార్క్ను అందుకున్నాడు.మిల్లర్ తుపాన్ ఇన్నింగ్స్ ఫలితంగా సౌతాఫ్రికా భారీ ఓటమి నుంచి తప్పించుకుంది. మిల్లర్ 67 బంతుల్లో 10 ఫోర్లు, 4 సిక్సులతో 100 పరుగులు చేసి ఆజేయంగా నిలిచాడు. ఈ క్రమంలో మిల్లర్ పలు అరుదైన రికార్డులను తన పేరిట లిఖించుకున్నాడు.సెహ్వాగ్ రికార్డు బద్దలు..👉ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ అత్యంత వేగవంతమైన సెంచరీ చేసిన ఆటగాడిగా మిల్లర్ చరిత్ర సృష్టించాడు. ఇంతకుముందు ఈ రికార్డు భారత మాజీ ఓపెనర్ వీరేంద్ర సెహ్వాగ్ పేరిట ఉండేది. 2002 ఛాంపియన్స్ ట్రోఫీలో సెహ్వాగ్ ఇంగ్లండ్పై 77 బంతుల్లో సెంచరీ సాధించాడు. తాజా మ్యాచ్లో కేవలం 67 బంతుల్లోనే శతక్కొట్టిన మిల్లర్..సెహ్వాగ్ ఆల్టైమ్ రికార్డును బద్దలు కొట్టాడు.👉అదేవిధంగా ఐసీసీ వన్డే నాకౌట్ మ్యాచ్ల్లో రెండు సెంచరీలు సాధించిన తొలి సౌతాఫ్రికా ప్లేయర్గా మిల్లర్ రికార్డులకెక్కాడు. 2023 ప్రపంచ కప్ సెమీ-ఫైనల్లో కోల్కతా వేదికగా ఆస్ట్రేలియాపై మిల్లర్ మూడు అంకెల స్కోర్ను సాధించాడు.👉ఐసీసీ వన్డే టోర్నమెంట్ నాకౌట్ మ్యాచ్లలో సెంచరీ చేసిన రెండో అతి పెద్ద వయస్కుడిగా మిల్లర్ నిలిచాడు. మిల్లర్ 35 ఏళ్ల 268 రోజుల వయస్సులో ఈ ఫీట్ సాధించాడు. ఈ అరుదైన రికార్డు సాధించిన జాబితాలో ఆస్ట్రేలియా మాజీ కెప్టెన్ రికీ పాంటింగ్(36 సంవత్సరాల 95 రోజులు) అగ్రస్ధానంలో ఉన్నాడు.చదవండి: Temba Bavuma: ఆ నలుగురు వల్లే ఈ ఓటమి.. కానీ అతడు మాత్రం అద్బుతం -
ఛాంపియన్స్ ట్రోఫీకి ముందు సౌతాఫ్రికాకు షాక్..
ఛాంపియన్స్ ట్రోఫీ 2025కు ముందు సౌతాఫ్రికా(South Afrcia)కు ఊహించని షాక్ తగిలింది. ఆ స్టార్ బ్యాటర్ డేవిడ్ మిల్లర్(David Miller) గాయపడ్డాడు. సౌతాఫ్రికా టీ20 లీగ్లో భాగంగా డర్బన్ సూపర్ జెయింట్స్తో జరిగిన మ్యాచ్లో మిల్లర్ మోకాలికి గాయమైంది. ఈ టోర్నీలో పార్ల్ రాయల్స్కు సారథ్యం వహిస్తున్న మిల్లర్.. డర్బన్ బ్యాటర్ మార్కస్ స్టోయినిస్ కొట్టిన షాట్ను ఆపే క్రమంలో మిల్లర్ గాయపడ్డాడు.వెంటనే వైద్య బృందం వచ్చి ప్రాథమిక చికిత్స అందించినప్పటికీ కొన్ని నిమిషాల తర్వాత మిల్లర్ మైదానాన్ని వీడాడు. ఆ తర్వాత రన్ ఛేజ్లో బ్యాటింగ్ కూడా రాలేదు. ఛాంపియన్స్ ట్రోఫీకి ముందు మిల్లర్ గాయం బారిన పడటం ప్రోటీస్ సెలక్టర్లను ఆందోళనకు గురిచేస్తోంది. ఈ మెగా టోర్నీకి సౌతాఫ్రికా క్రికెట్ ప్రకటించిన 15 మంది సభ్యుల జట్టులో మిల్లర్ చోటు దక్కించుకున్నాడు.ఒక వేళ ఛాంపియన్స్ ట్రోఫీకి మిల్లర్ దూరమైతే అది సఫారీలకు గట్టి ఎదురుదెబ్బ అనే చెప్పుకోవాలి. ఎందుకంటే గత కొంతకాలంగా వైట్బాల్ క్రికెట్లో దక్షిణాఫ్రికాకు మిడిలార్డర్లో మిల్లర్ కీలక బ్యాటర్గా కొనసాగుతున్నాడు. ఓంటి చేత్తో మ్యాచ్లను గెలిపించే సత్తా అతడిది. ఈ క్రమంలో దక్షిణాఫ్రికా క్రికెట్ మిల్లర్పై గాయంపై ఇప్పటికే అప్డేట్ తెలుసుకున్నట్లు సమాచారం.అతడి గాయం తీవ్రతను సౌతాఫ్రికా క్రికెట్ వైద్యబృందం నిశితంగా పరిశీలిస్తున్నట్లు పలు రిపోర్ట్లు పేర్కొంటున్నాయి. ఒకవేళ అతడి గాయం తీవ్రత ఎక్కువగా ఉంటే ఎస్ఎ టీ20లో మిగిలిన మ్యాచ్లకు దూరమయ్యే ఛాన్స్ ఉంది. మరోవైపు సౌతాఫ్రికా స్పీడ్ స్టార్ లుంగీ ఎంగిడీ సైతం కాలి గజ్జ గాయంతో బాధపడుతున్నాడు.పార్ల్ రాయల్స్కు ప్రాతినిథ్యం వహిస్తున్న ఎంగిడి గాయం కారణంగా గత నాలుగు మ్యాచ్లకు దూరమయ్యాడు. గతేడాది జాతీయ జట్టుకు దూరంగా ఉంటున్న ఎంగిడీ ఇటీవలే క్రికెట్ మైదానంలో తిరిగి అడుగుపెట్టాడు. అంతలోనే మళ్లీ ఈ స్టార్ ఫాస్ట్ బౌలర్ గాయపడ్డాడు. ఛాంపియన్స్ ట్రోఫీ జట్టులో ఎంగిడీ కూడా ఉన్నాడు.అయితే ఛాంపియన్స్ ట్రోఫీ ఆరంభానికి మరో 24 రోజుల సమయం ఉండడంతో వీరిద్దరూ పూర్తి ఫిట్నెస్ సాధిస్తారని సౌతాఫ్రికా అభిమానులు ఆశిస్తున్నారు. కాగా ఈ ఐసీసీ టోర్నీ ఫిబ్రవరి 19 నుంచి ప్రారంభం కానుంది. సౌతాఫ్రికా తమ తొలి మ్యాచ్లో కరాచీ వేదికగా ఫిబ్రవరి 21న అఫ్గానిస్తాన్తో తలపడనుంది.ఛాంపియన్స్ ట్రోఫీకి దక్షిణాఫ్రికా జట్టు: టెంబా బవుమా (కెప్టెన్), టోనీ డి జోర్జి, మార్కో జన్సెన్, హెన్రిచ్ క్లాసెన్, కేశవ్ మహరాజ్, ఐడెన్ మర్క్రమ్, డేవిడ్ మిల్లర్, వియాన్ ముల్డర్, లుంగి ఎంగిడి, అన్రిచ్ నోర్ట్జే, కగిసో రబడ, ర్యాన్ రికెల్టన్, తబ్రైజ్ షమ్సీ, ట్రిస్టన్ స్టబ్స్, రస్సీ వాన్ డెర్ డస్సెన్చదవండి: AUS vs SL 1st Test: ట్రావిస్ హెడ్కు ప్రమోషన్.. -
రాణించిన కిల్లర్ మిల్లర్.. రాయల్స్కు హ్యాట్రిక్ విక్టరీ
సౌతాఫ్రికా టీ20 లీగ్లో (SA20 2025) పార్ల్ రాయల్స్ హ్యాట్రిక్ విజయాలు నమోదు చేసింది. జోబర్గ్ సూపర్ కింగ్స్తో నిన్న (జనవరి 20) జరిగిన లో స్కోరింగ్ మ్యాచ్లో 6 వికెట్ల తేడాతో గెలుపొందింది. ఈ గెలుపుతో రాయల్స్ పాయింట్ల పట్టికలో అగ్రస్థానానికి ఎగబాకింది. రాయల్స్ ఈ సీజన్లో ఇప్పటివరకు ఆడిన 5 మ్యాచ్ల్లో 4 విజయాలు సాధించింది. రాయల్స్ చేతిలో ఓడిన సూపర్ కింగ్స్ 5 మ్యాచ్ల్లో రెండు విజయాలతో మూడో స్థానంలో నిలిచింది. 5 మ్యాచ్ల్లో మూడింట గెలిచిన ఎంఐ కేప్టౌన్ రెండో స్థానంలో ఉంది.మ్యాచ్ విషయానికొస్తే.. తొలుత బ్యాటింగ్ చేసిన జోబర్గ్ సూపర్ కింగ్స్ నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 146 పరుగులు చేసింది. సూపర్ కింగ్స్ ఈ మాత్రం స్కోరైనా చేసిందంటే అది జానీ బెయిర్స్టో పుణ్యమే. బెయిర్స్టో 40 బంతుల్లో 2 ఫోర్లు, 3 సిక్సర్ల సాయంతో 60 పరుగులు చేశాడు. ఆఖర్లో డొనొవన్ ఫెరియెరా (19 బంతుల్లో 32 నాటౌట్; ఫోర్, 2 సిక్సర్లు) మెరుపు ఇన్నింగ్స్ ఆడాడు. రాయల్స్ బౌలర్లలో ఫోర్టుయిన్ 2 వికెట్లు పడగొట్టగా.. ముజీబ్ ఉర్ రెహ్మాన్, జో రూట్, డేవిడ్ గేలియమ్ తలో వికెట్ దక్కించుకున్నారు.అనంతరం 147 పరుగుల లక్ష్యాన్ని రాయల్స్ 19.1 ఓవర్లలో ఛేదించింది. మిచెల్ వాన్ బెర్రెన్ (44), కెప్టెన్ డేవిడ్ మిల్లర్ (40 నాటౌట్) రాణించి రాయల్స్ను విజయతీరాలకు చేర్చారు. రాయల్స్ ఇన్నింగ్స్లో డ్రి ప్రిటోరియస్ 27 పరుగులు చేయగా.. జో రూట్ 6, రూబిన్ హెర్మన్ 19 పరుగులకు ఔటయ్యారు. మిల్లర్కు జతగా దినేశ్ కార్తీక్ (2) అజేయంగా నిలిచాడు. సూపర్ కింగ్స్ బౌలర్లలో హర్డస్ సిపామ్లా 2, ఇమ్రాన్ తాహిర్, ఫెరియెరా తలో వికెట్ దక్కించుకున్నారు. -
చరిత్ర సృష్టించిన డేవిడ్ మిల్లర్
సౌతాఫ్రికా మిడిలార్డర్ బ్యాటర్ డేవిడ్ మిల్లర్ చరిత్ర సృష్టించాడు. టీ20ల్లో 11000 పరుగులు పూర్తి చేసుకున్న తొలి సౌతాఫ్రికా ఆటగాడిగా రికార్డు నెలకొల్పాడు. సౌతాఫ్రికా టీ20 లీగ్-2025లో భాగంగా ప్రిటోరియా క్యాపిటల్స్తో నిన్న (జనవరి 18) జరిగిన మ్యాచ్లో మిల్లర్ ఈ మైలురాయిని తాకాడు. ఈ మ్యాచ్లో మిల్లర్ రికార్డు లక్ష్య ఛేదనలో 24 బంతుల్లో 4 ఫోర్లు, 2 సిక్సర్ల సాయంతో అజేయమైన 48 పరుగులు చేశాడు. మిల్లర్ తన ఓవరాల్ టీ20 కెరీర్లో 468 ఇన్నింగ్స్లు ఆడి 11,046 పరుగులు చేశాడు.మిల్లర్ 11000 టీ20 రన్స్ క్లబ్లో చేరిన గంటల వ్యవధిలోనే మరో సౌతాఫ్రికన్ ఈ క్లబ్లో చేరాడు. సౌతాఫ్రికా మాజీ కెప్టెన్ ఫాఫ్ డుప్లెసిస్ కూడా సౌతాఫ్రికా టీ20 లీగ్లోనే 11000 పరుగుల మార్కును తాకాడు. ఈ లీగ్లో భాగంగా ఎంఐ కేప్టౌన్తో జరిగిన మ్యాచ్లో డుప్లెసిస్ ఈ మైలురాయిని చేరుకున్నాడు. డుప్లెసిస్ 376 ఇన్నింగ్స్ల తన టీ20 కెరీర్లో 11,042 పరుగులు చేశాడు.టీ20ల్లో అత్యధిక పరుగులు చేసిన సౌతాఫ్రికా ఆటగాళ్లు..డేవిడ్ మిల్లర్-11046డుప్లెసిస్-11042డికాక్-10620ఏబీ డివిలియర్స్-9424రిలీ రొస్సో-9067నిన్న జరిగిన మ్యాచ్ల విషయానికొస్తే.. ప్రిటోరియా క్యాపిటల్స్పై పార్ల్ రాయల్స్ 8 వికెట్ల తేడాతో గెలుపొందింది. ఈ మ్యాచ్లో తొలుత బ్యాటింగ్ చేసిన క్యాపిటల్స్ నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 212 పరుగుల భారీ స్కోర్ చేసింది. విల్ స్మీడ్ (34 బంతుల్లో 54; 5 ఫోర్లు, 3 సిక్సర్లు) మెరుపు అర్ద సెంచరీతో సత్తా చాటగా.. రహ్మానుల్లా గుర్భాజ్ (29 బంతుల్లో 42; 3 ఫోర్లు, 2 సిక్సర్లు), కైల్ వెర్రిన్ (23 బంతుల్లో 45; 2 ఫోర్లు, 4 సిక్సర్లు) ఓ మోస్తరు ఇన్నింగ్స్లతో రాణించారు. ఆఖర్లో జేమ్స్ నీషమ్ (13 బంతుల్లో 28 నాటౌట్; 2 ఫోర్లు, 2 సిక్సర్లు) కీలక ఇన్నింగ్స్ ఆడాడు. క్యాపిటల్స్ ఆటగాళ్లలో విల్ జాక్స్ 2, రిలీ రొస్సో 14 పరుగులు చేసి ఔటయ్యారు.213 పరుగుల భారీ లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన రాయల్స్ 19.4 ఓవర్లలో 2 వికెట్లు మాత్రమే కోల్పోయి విజయతీరాలకు చేరింది. ఇన్నింగ్స్ తొలి బంతికే ఇన్ఫామ్ బ్యాటర్ డ్రి ప్రిటోరియన్ డకౌట్ కాగా.. జో రూట్ (60 బంతుల్లో 92 నాటౌట్; 11 ఫోర్లు, 2 సిక్సర్లు), రూబిన్ హెర్మన్ (33 బంతుల్లో 56; 5 ఫోర్లు, 3 సిక్సర్లు), డేవిడ్ మిల్లర్ (24 బంతుల్లో 48 నాటౌట్; 4 ఫోర్లు, 2 సిక్సర్లు) విధ్వంసకర ఇన్నింగ్స్లతో తమ జట్టును గెలిపించారు. సౌతాఫ్రికా టీ20 లీగ్లో ఇదే రికార్డు లక్ష్య ఛేదన.మరో మ్యాచ్లో జోబర్గ్ సూపర్ కింగ్స్పై ముంబై ఇండియన్స్ కేప్టౌన్ 7 వికెట్ల తేడాతో గెలుపొందింది. ఈ మ్యాచ్లో తొలుత బ్యాటింగ్ చేసిన సూపర్ కింగ్స్ నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 172 పరుగులు చేసింది. ఓపెనర్లు డెవాన్ కాన్వే (31 బంతుల్లో 35; 4 ఫోర్లు), ఫాఫ్ డుప్లెసిస్ (38 బంతుల్లో 61; 6 ఫోర్లు, 3 సిక్సర్లు), వికెట్ కీపర్ జానీ బెయిర్స్టో (27 బంతుల్లో 43 నాటౌట్; 2 ఫోర్లు, 4 సిక్సర్లు) రాణించారు.ఛేదనలో ర్యాన్ రికెల్టన్ (39 బంతుల్లో 89; 8 ఫోర్లు, 6 సిక్సర్లు) శివాలెత్తిపోవడంతో ఎంఐ కేప్టౌన్ 15.5 ఓవర్లలో 3 వికెట్లు మాత్రమే కోల్పోయి విజయతీరాలకు చేరింది. రస్సీ వాన్ డర్ డస్సెన్ (24 బంతుల్లో 39; 4 ఫోర్లు, సిక్స్), రీజా హెండ్రిక్స్ (28 బంతుల్లో 34 నాటౌట్; 4 ఫోర్లు, సిక్స్) రాణించారు. -
పాక్తో వన్డే సిరీస్.. సౌతాఫ్రికా విధ్వంసకర వీరుల రీఎంట్రీ
పాకిస్తాన్తో వన్డే సిరీస్కు క్రికెట్ సౌతాఫ్రికా తమ జట్టును ప్రకటించింది. తెంబా బవుమా సారథ్యంలోని ఈ జట్టులో క్వెనా మఫాకాకు తొలిసారి చోటు ఇచ్చినట్లు తెలిపింది. ఇక ఈ సిరీస్తో కగిసో రబడ, ట్రిస్టన్ స్టబ్స్, కేశవ్ మహరాజ్ పునరాగమనం చేయనుండగా.. టీ20 వీరులు డేవిడ్ మిల్లర్, హెన్రిచ్ క్లాసెన్ సైతం తిరిగి వన్డే జట్టులో స్థానం సంపాదించారు.డిసెంబరు 17 నుంచి వన్డే సిరీస్ కాగా మూడు టీ20, మూడు వన్డే, రెండు టెస్టు మ్యాచ్ల సిరీస్ ఆడేందుకు పాకిస్తాన్ సౌతాఫ్రికా పర్యటనకు వచ్చింది. ఈ క్రమంలో ఇరుజట్ల మధ్య డిసెంబరు 10న తొలి టీ20 జరుగగా.. ఆతిథ్య జట్టు 11 పరుగుల తేడాతో పాక్పై గెలిచింది. ఇక డిసెంబరు 13న రెండో, డిసెంబరు 14న మూడో టీ20 జరుగునుండగా.. డిసెంబరు 17 నుంచి వన్డే సిరీస్ మొదలుకానుంది.‘అన్క్యాప్డ్’ ప్లేయర్కు చోటుఈ నేపథ్యంలో సౌతాఫ్రికా గురువారం తమ వన్డే జట్టును ప్రకటించింది. ఇక ఈ సిరీస్తో పద్దెమినిదేళ్ల లెఫ్టార్మ్ పేసర్ క్వెనా మఫాకా వన్డేల్లో అరంగేట్రం చేసే అవకాశం ఉంది. ఇటీవల వెస్టిండీస్తో టీ20 సిరీస్ సందర్భంగా అంతర్జాతీయ క్రికెట్లో అడుగుపెట్టిన క్వెనా మఫాకా.. పాక్తో తొలి టీ20లో అదరగొట్టాడు. తన అద్భుత బౌలింగ్తో బాబర్ ఆజంను అవుట్ చేశాడు. మొత్తంగా ఈ మ్యాచ్లో నాలుగు ఓవర్ల బౌలింగ్ కోటా పూర్తిచేసి 39 పరుగులిచ్చి రెండు వికెట్లు కూల్చాడు.గాయాల బెడదమరోవైపు.. స్టార్ పేసర్ అన్రిచ్ నోర్జే కాలి గాయం కారణంగా.. మిగిలిన రెండు టీ20లు, వన్డే సిరీస్కు దూరమయ్యాడు. ఇక వేలు విరిగిన కారణంగా వియాన్ ముల్దర్, తుంటినొప్పి వల్ల లుంగి ఎంగిడి, గజ్జల్లో గాయం కారణంగా గెరాల్డ్ కోయెట్జి, వెన్నునొప్పితో బాధపడుతున్న నండ్రీ బర్గర్ సెలక్షన్కు అందుబాటులో లేకుండా పోయారు.వారికి పునఃస్వాగతంఇదిలా ఉంటే.. పాక్తో టీ20 సిరీస్లో విశ్రాంతి తీసుకున్న రబడ, స్టబ్స్, కేశవ్ మహరాజ్ రీఎంట్రీ ఇచ్చేందుకు సిద్ధమయ్యారు. ఈ నేపథ్యంలో సౌతాఫ్రికా కోచ్ రాబ్ వాల్టర్ మాట్లాడుతూ.. తాము తమ వన్డే జట్టు పట్ల పూర్తి సంతృప్తితో ఉన్నట్లు తెలిపాడు. క్వెనా మఫాకాకు కొత్త పాఠాలు నేర్చుకునే అవకాశం దొరుకుతుందని.. క్లాసెన్, మిల్లర్లకు వన్డే జట్టులోకి తిరిగి స్వాగతం పలుకుతున్నట్లు పేర్కొన్నాడు.పాకిస్తాన్తో వన్డే సిరీస్కు సౌతాఫ్రికా క్రికెట్ జట్టుతెంబా బవుమా (కెప్టెన్), ఒట్ట్నీల్ బార్ట్మన్, టోనీ డి జోర్జీ, మార్కో జాన్సెన్, హెన్రిచ్ క్లాసెన్ (వికెట్ కీపర్), కేశవ్ మహరాజ్, క్వెనా మఫాకా, ఐడెన్ మార్క్రమ్, డేవిడ్ మిల్లర్, ఆండిల్ ఫెహ్లుక్వాయో, కగిసో రబాడ, ట్రిస్టన్ స్టబ్స్, ర్యాన్ రికెల్టన్, తబ్రేజ్ షంసీ, రాస్సీ వాన్ డెర్ డస్సెన్.సౌతాఫ్రికా వర్సెస్ పాకిస్తాన్ వన్డే సిరీస్ షెడ్యూల్తొలి వన్డే- డిసెంబరు 17- పర్ల్- బోలాండ్ పార్క్రెండో వన్డే- డిసెంబరు 19- సెంచూరియన్- సూపర్స్పోర్ట్ పార్క్మూడో వన్డే- డిసెంబరు 22- జొహన్నస్బర్గ్- ది వాండరర్స్ స్టేడియం.చదవండి: భారత్తో మూడో టెస్టు... ఆసీస్ స్టార్ క్రికెటర్పై వేటు! -
SA Vs PAK: డేవిడ్ మిల్లర్ ఊచకోత.. ఉత్కంఠ పోరులో ఓడిన పాకిస్తాన్
స్వదేశంలో పాకిస్తాన్తో టీ20 సిరీస్ను దక్షిణాఫ్రికా విజయంతో ఆరంభించింది. డర్బన్ వేదికగా జరిగిన తొలి టీ20లో 11 పరుగుల తేడాతో పాక్పై సౌతాఫ్రికా విజయం సాధించింది. 184 పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన పాకిస్తాన్.. నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్లు కోల్పోయి 172 పరుగులు చేయగల్గింది. ఓ దశలో కెప్టెన్ రిజ్వాన్ క్రీజులో ఉన్నప్పుడు పాకిస్తాన్ సునాయసంగా లక్ష్యాన్ని అందుకుంటుందని అంతా భావించారు.కానీ ఆఖరి ఓవర్లో రిజ్వాన్ ఔట్ కావడం, ఇతరుల నుంచి అతడికి సపోర్ట్ లభించకపోవడంతో పాక్ ఓటమి చవిచూడాల్సి వచ్చింది. చివరి ఓవర్లో పాక్ విజయానికి 19 పరుగుల అవసరమవ్వగా.. సఫారీ యువ పేసర్ మఫాక కేవలం 7 పరుగులు మాత్రమే ఇచ్చాడు.పాక్ బ్యాటర్లలో మహ్మద్ రిజ్వాన్(62 బంతుల్లో 74, 5 ఫోర్లు, 3 సిక్స్లు) టాప్ స్కోరర్గా నిలవగా.. అయూబ్(31) పరుగులతో పర్వాలేదన్పించాడు. బాబర్ ఆజం(0)తో సహా మిగితా బ్యాటర్లంతా దారుణంగా విఫలమయ్యారు. ప్రోటీస్ బౌలర్లలో జార్జ్ లిండీ 4 వికెట్లు పడగొట్టగా.. మఫాక రెండు, సీమ్లేన్, బార్ట్మన్ తలా వికెట్ సాధించారు.డేవిడ్ మిల్లర్ ఊచకోత..ఇక ఈ మ్యాచ్లో తొలుత బ్యాటింగ్ చేసిన సౌతాఫ్రికా నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్లు కోల్పోయి 183 పరుగులు చేసింది. ప్రోటీస్ టాపర్డర్ విఫలమైనప్పటికి.. మిడిలార్డర్ బ్యాట్ డేవిడ్ మిల్లర్ విధ్వంసం సృష్టించాడు. కేవలం 40 బంతుల్లో 4 ఫోర్లు, 8 సిక్స్లతో 82 పరుగులు చేసి ఔటయ్యాడు.అతడితో పాటు జార్జ్ లిండే(24 బంతుల్లో 48, 3 ఫోర్లు, 4 సిక్స్లు) మెరుపు ఇన్నింగ్స్ ఆడాడు. పాక్ బౌలర్లలో షాహీన్ అఫ్రిది, అర్బర్ ఆహ్మద్ తలా మూడు వికెట్లు పడగొట్టగా.. అబ్బాస్ అఫ్రిది రెండు వికెట్లు సాధించారు. ఇక ఇరు జట్ల మధ్య మూడో డిసెంబర్ 13న సెంచూరియన్ వేదికగా జరగనుంది.చదవండి: సిరాజ్ను సీనియర్లే నియంత్రించాలి: ఆసీస్ మాజీ కెప్టెన్ -
రోహిత్ శర్మ వరల్డ్ రికార్డు బ్రేక్.. ఫాస్టెస్ట్ సెంచూరియన్గా!
జింబాబ్వే కెప్టెన్ సికందర్ రజా అంతర్జాతీయ టీ20 క్రికెట్లో ప్రపంచ రికార్డు సాధించాడు. కేవలం 33 బంతుల్లోనే శతకం బాది.. టీమిండియా సారథి రోహిత్ శర్మ పేరిట ఉన్న రికార్డును బద్దలుకొట్టాడు. కాగా ఐసీసీ మెన్స్ టీ20 ప్రపంచకప్ సబ్ రీజినల్ ఆఫ్రికా క్వాలిఫయర్స్లో భాగంగా జింబాబ్వే బుధవారం గాంబియాతో మ్యాచ్ ఆడింది.ఫాస్టెస్ట్ సెంచరీనైరోబీలో జరిగిన ఈ మ్యాచ్లో టాస్ గెలిచిన జింబాబ్వే మొదట బ్యాటింగ్ చేసింది. ఓపెనర్లు బ్రియాన్ బెనెట్( 26 బంతుల్లో 50), తాడివాన్షే మరుమణి(Tadiwanashe Marumani- 19 బంతుల్లోనే 62) దుమ్ములేపగా.. సికందర్ రజా కేవలం 33 బంతుల్లోనే సెంచరీ మార్కు అందుకున్నాడు.ఈ క్రమంలో హిట్మ్యాన్ రోహిత్ శర్మ, సౌతాఫ్రికా విధ్వంసకర వీరుడు డేవిడ్ మిల్లర్ పేరిట ఉన్న రికార్డును బ్రేక్ చేశాడు. టెస్టు హోదా ఉన్న దేశాలకు చెందిన ఆటగాళ్లలో ఫాస్టెస్ట్ సెంచరీ నమోదు చేసిన క్రికెటర్గా సికందర్ రజా వరల్డ్ రికార్డు సృష్టించాడు.టెస్టులు ఆడే దేశాలకు చెందిన ఆటగాళ్లలో టీ20 ఫాస్టెస్ట్ సెంచరీలు నమోదు చేసింది వీరే1. సికందర్ రజా(జింబాబ్వే)- గాంబియాపై 33 బంతుల్లో శతకం2. డేవిడ్ మిల్లర్(సౌతాఫ్రికా)- బంగ్లాదేశ్పై 35 బంతుల్లో సెంచరీ3. రోహిత్ శర్మ(ఇండియా)- శ్రీలంకపై 35 బంతుల్లో శతకం4. జాన్సన్ చార్ల్స్(వెస్టిండీస్)- సౌతాఫ్రికాపై 39 బంతుల్లో శతకం5. సంజూ శాంసన్(ఇండియా)- బంగ్లాదేశ్పై 40 బంతుల్లో శతకంఏకంగా 15 సిక్సర్లతో మరో రికార్డుఇక గాంబియాతో మ్యాచ్లో మొత్తంగా 3 బంతులు ఎదుర్కొన్న సికందర్ రజా.. ఏడు బౌండరీలు, పదిహేను సిక్స్ల సాయంతో 133 పరుగులతో అజేయంగా నిలిచాడు. ఈ క్రమంలో మరో రికార్డును కూడా సికందర్ రజా తన ఖాతాలో వేసుకున్నాడు. అంతర్జాతీయ టీ20లలో అత్యధిక సిక్సర్లు బాదిన క్రికెటర్ల జాబితాలో చేరాడు. ఈ లిస్టులో సాహిల్ చౌహాన్, హజ్రతుల్లా జజాయ్, ఫిన్ అలెన్ 16 సిక్సర్లతో అగ్రస్థానంలో ఉండగా.. సికందర్ రజా, జీషన్ కుకిఖెల్ 15 సిక్స్లతో సంయుక్తంగా రెండో స్థానంలో నిలిచాడు. ఇదిలా ఉంటే.. ఈ మ్యాచ్లో జింబాబ్వే గాంబియాపై 344 పరుగులుస్కోరు చేసి ప్రపంచ రికార్డు సాధించింది.చదవండి: Asia Cup 2024: పాకిస్తాన్ భారీ విజయం.. భారత్తో పాటు సెమీస్లో! -
డేవిడ్ మిల్లర్ విధ్వంసం.. కేవలం 17 బంతుల్లోనే
కరేబియన్ ప్రీమియర్ లీగ్-2024లో క్వాలిఫియర్-2కు బార్బడోస్ రాయల్స్ ఆర్హత సాధించింది. ఈ లీగ్లో భాగంగా బుధవారం ఎలిమినేటర్లో ట్రిన్బాగో నైట్ రైడర్స్పై 9 వికెట్ల తేడాతో బార్బడోస్ ఘన విజయం సాధించింది. ఫ్లడ్ లైట్స్ అంతరాయం కలిగించిన ఈ మ్యాచ్లో తొలుత బ్యాటింగ్ చేసిన నైట్ రైడర్స్ 19.1 ఓవర్లలో 3 వికెట్ల నష్టానికి 168 పరుగులు చేసింది. నైట్రైడర్స్ బ్యాటర్లలో నికోలస్ పూరన్ మరోసారి సత్తాచాటాడు. 60 బంతులు ఎదుర్కొన్న పూరన్.. 6 ఫోర్లు, 5 సిక్స్లతో 90 పరుగులు చేశాడు. అతడితో పాటు జాసన్ రాయ్ 25 పరుగులతో రాణించాడు. డీఎల్ఎస్ ప్రకారం రాయల్స్ టార్గెట్ను 5 ఓవర్లలో 60 పరుగులగా నిర్ణయించారు.చెలరేగిన మిల్లర్..అనంతరం లక్ష్య చేధనలో బార్బడోస్ స్టార్ ప్లేయయ్, ప్రోటీస్ విధ్వంసకర వీరుడు డేవిడ్ మిల్లర్ ఆకాశమే హద్దుగా చెలరేగాడు. కేవలం 17 బంతుల్లోనే తన హాఫ్ సెంచరీ మార్క్ను అందుకున్నాడు. మిల్లర్ ఇన్నింగ్స్లో 3 ఫోర్లు, 5 సిక్స్లు ఉన్నాయి. అతడి ఊచకోత ఫలితంగా బార్బడోస్ కేవలం 4.2 ఓవర్లలోనే లక్ష్యాన్ని చేధించింది. -
చాలా బాధగా ఉంది.. ఓటమిని జీర్ణించుకోలేకపోతున్నా: మిల్లర్
టీ20 వరల్డ్కప్-2024 టోర్నీ ఆధ్యంతం అదరగొట్టిన దక్షిణాఫ్రికా ఆఖరి మెట్టుపై బోల్తా పడింది. ఫైనల్లో ఎలాగైనా గెలిచి తమ 30 ఏళ్ల వరల్డ్కప్ నిరీక్షణకు తెరదించాలని భావించిన సఫారీలకు మరోసారి నిరాశే ఎదురైంది. బార్బోడస్ వేదికగా భారత్తో జరిగిన టైటిల్ పోరులో 7 పరుగుల తేడాతో సౌతాఫ్రికా పరాజయం పాలైంది. గెలుపు అంచుల దాక వెళ్లిన దక్షిణాఫ్రికా.. ఆఖరిలో భారత బౌలర్ల దాటికి చేతులేత్తేసింది. ఈ మ్యాచ్ అనంతరం భారత ఆటగాళ్లు సెలబ్రేషన్స్లో మునిగి తేలితే.. మరోవైపు ప్రోటీస్ ఆటగాళ్లు న్నీటి పర్యంతం అయ్యారు. ముఖ్యంగా ప్రోటీస్ స్టార్ డేవిడ్ మిల్లర్ను ఓదార్చడం ఎవరి తరం కాలేదు.తన చివరి ఓవర్ వరకు క్రీజులో ఉన్నప్పటికి జట్టును గెలిపించలేకపోయానన్న బాధతో మిల్లర్ కుంగిపోయాడు. కాగా ఆఖరి ఓవర్లో ప్రోటీస్ విజయానికి 16 పరుగులు అవసరమవ్వగా..తొలి బంతికే సూర్యకుమార్ యాదవ్ అద్భుతమైన క్యాచ్తో పెవిలియన్కు పంపాడు. దీంతో ప్రోటీస్ ఓటమి లాంఛనమైంది. కాగా వరల్డ్కప్లో ఓటమిపై డేవిడ్ మిల్లర్ తొలిసారి స్పందించాడు. సోషల్ మీడియా వేదికగా భావోద్వేగ నోట్ను షేర్ చేశాడు."నేను చాలా నిరాశకు గురయ్యా. రెండు రోజులు గడిచినప్పటికి ఇంకా మా ఓటమిని జీర్ణించుకోలేకపోతున్నాను. నా బాధను మాటల్లో వర్ణించలేను. అయితే ఒక్క విషయాన్ని మాత్రం గొప్పగా చెప్పగలను. మా జట్టు పోరాటం, ప్రదర్శన పట్ల చాలా గర్వంగా ఉంది. ఈ నెలలో ఎన్నో ఎత్తుపల్లాలను చవిచూశాము. కానీ ఈ ప్రయాణం మాత్రం ఎంతో అద్భుతం. మేము మా బాధను ఇంకా భరిస్తున్నాము. కానీ ఒక జట్టుగా మేము మరింత బలంగా తిరిగి వస్తామన్న నమ్మకం నాకు ఉందంటూ" ఇన్స్టాలో మిల్లర్ రాసుకొచ్చాడు. -
సూర్యకుమార్ యాదవ్ వరల్డ్కప్ విన్నింగ్ క్యాచ్... వివాదాస్పదం
టీమిండియా 2024 టీ20 వరల్డ్కప్ గెలవడంలో కీలకపాత్ర పోషించిన సూర్యకుమార్ యాదవ్ సూపర్ మ్యాన్ క్యాచ్ ప్రస్తుతం వివాదాస్పదంగా మారింది. హార్దిక్ పాండ్యా బౌలింగ్లో డేవిడ్ మిల్లర్ కొట్టిన షాట్ను స్కై బౌండరీ లైన్ వద్ద అద్భుతమైన విన్యాసం చేసి క్యాచ్గా మలిచాడు. ఈ క్యాచ్కు సంబంధించిన వీడియో నెట్టింట వైరలైంది. స్కై సూపర్ మ్యాన్లా క్యాచ్ పట్టాడని అభిమానులు కొనియాడారు.అయితే స్కై పట్టిన ఈ క్యాచ్ క్యాచ్ కాదు సిక్సర్ అని కొందరు సౌతాఫ్రికా అభిమానులు అంటున్నారు. దీనికి సంబంధించిన ఓ వీడియో నిన్నటి నుంచి సోషల్మీడియాలో చక్కర్లు కొడుతుంది. ఈ వీడియోలో స్కై క్యాచ్ పట్టుకునే క్రమంలో అతని కాలు బౌండరీ లైన్ను తాకినట్లు కనిపిస్తుంది.This certainly deserved more than one look, just saying. Boundary rope looks like it clearly moves. 🤷 pic.twitter.com/ulWyT5IJxy— Ben Curtis 🇿🇦 (@BenCurtis22) June 29, 2024ఈ వీడియోను పోస్ట్ చేస్తూ.. ఓ సౌతాఫ్రికా అభిమాని మేం దోచుకోబడ్డాం అని కామెంట్ చేశాడు. ఈ వీడియోకు సోషల్మీడియాలో విపరీతమైన రెస్పాన్స్ వస్తుంది. టీమిండియా వ్యతిరేకులు ఈ వీడియోను ఆసరగా చేసుకునే భారత జట్టును నిందిస్తున్నారు. టీమిండియా మోసం చేసి గెలిచిందని కామెంట్ చేస్తున్నారు.బంతి చేతిలో ఉన్నప్పుడు సూర్యకుమార్ కాలు బౌండరీ లైన్ను తాకినట్లు రీప్లేలో స్పష్టంగా కనిపించినా థర్డ్ అంపైర్ నిజాయితీగా వ్యవహరించలేదని ఆరోపిస్తున్నారు. ఒకవేళ ఆ బంతిని సిక్సర్గా ప్రకటించి ఉంటే సౌతాఫ్రికా వరల్డ్కప్ గెలిచేదని కామెంట్స్ చేస్తున్నారు. మొత్తంగా ఈ వీడియో ప్రస్తుతం ఇంటర్నెట్ను షేక్ చేస్తుంది. కాగా, 2024 వరల్డ్కప్ ఫైనల్లో టీమిండియా సౌతాఫ్రికాపై 7 పరుగుల స్వల్ప తేడాతో విజయం సాధించిన విషయం తెలిసిందే. చివరి నిమిషం వరకు ఉత్కంఠ రేపిన ఈ మ్యాచ్లో భారత్ పైచేయి సాధించింది. సూర్యకుమార్ క్యాచ్ మ్యాచ్ను మలుపు తిప్పింది. చివరి ఓవర్లో సౌతాఫ్రికా గెలుపుకు 16 పరుగులు అవసరం కాగా.. ఆ ఓవర్ తొలి బంతికే మిల్లర్ ఔటయ్యాడు. మిల్లర్ ఔట్ కావడంతో సౌతాఫ్రికా విజయావకాశాలు దెబ్బతిన్నాయి. -
T20 WC 2024: చెలరేగిన డికాక్, మిల్లర్.. ఇంగ్లండ్ టార్గెట్ ఎంతంటే?
టీ20 వరల్డ్కప్-2024 సూపర్-8లో భాగంగా సెయింట్ లూసియా వేదికగా దక్షిణాఫ్రికా- ఇంగ్లండ్ జట్లు తలపడతున్నాయి. ఈ మ్యాచ్లో టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన సౌతాఫ్రికా నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 163 పరుగులు చేసింది. సౌతాఫ్రికా బ్యాటర్లలో ఓపెనర్ క్వింటన్ డికాక్ అద్బుతమైన ఇన్నింగ్స్ ఆడాడు. డికాక్ ఇన్నింగ్స్ ఆరంభం నుంచే ఇంగ్లీష్ బౌలర్లపై విరుచుకుపడ్డాడు. ఓవరాల్గా 38 బంతులు ఎదుర్కొన్న డికాక్.. 4 ఫోర్లు, 4 సిక్స్లతో 65 పరుగులు చేశాడు. అతడితో పాటు డేవిడ్ మిల్లర్ మెరుపులు మెరిపించాడు. 28 బంతులు ఎదుర్కొన్న మిల్లర్ 4 ఫోర్లు, 2 సిక్స్లతో 43 పరుగులు చేశాడు. ప్రోటీస్ బ్యాటర్లలో వీరిద్దరి మినహా మిగితా బ్యాటర్లంతా దారుణంగా విఫలమయ్యారు. కెప్టెన్ మార్క్రమ్ తన పేలవ ఫామ్ను కొనసాగిస్తున్నాడు. ఈ మ్యాచ్లో కూడా మార్క్రమ్ కేవలం ఒక్క పరుగు మాత్రమే చేసి ఔటయ్యాడు. ఇక ఇంగ్లండ్ బౌలర్లలో జోఫ్రా అర్చర్ మూడు వికెట్లు పడగొట్టగా.. మొయిన్ అలీ, రషీద్ తలా వికెట్ సాధించారు. -
IPL 2024 GT VS DC: అద్భుతమైన డైవింగ్ క్యాచ్ పట్టిన పంత్
ఐపీఎల్ 2024 సీజన్లో భాగంగా అహ్మదాబాద్ వేదికగా గుజరాత్ టైటాన్స్తో ఇవాళ (ఏప్రిల్ 17) జరుగుతున్న మ్యాచ్లో ఢిల్లీ క్యాపిటల్స్ బౌలర్లు చెలరేగిపోతున్నారు. ఈ మ్యాచ్లో టాస్ గెలిచి తొలుత బౌలింగ్ ఎంచుకున్న ఢిల్లీ.. గుజరాత్ బ్యాటింగ్ లైనప్పై ఎదురుదాడికి దిగింది. ఇషాంత్ శర్మ (2-0-8-2), ముకేశ్ కుమార్ (2-0-13-1) నిప్పులు చెరిగే బంతులతో విజృంభించగా.. సుమిత్ కుమార్ అద్భుతమైన త్రోతో సాయి సుదర్శన్ను రనౌట్ చేశాడు. ఫలితంగా గుజరాత్ 5 ఓవర్లలో 30 పరుగులు మాత్రమే చేసి నాలుగు వికెట్లు కోల్పోయింది. పంత్ సూపర్ క్యాచ్.. ఢిల్లీ క్యాపిటల్స్ వికెట్ కీపర్ రిషబ్ పంత్ చాలాకాలం తర్వాత అద్భుతమైన డైవింగ్ క్యాచ్ అందుకున్నాడు. పెను ప్రమాదం నుంచి ప్రాణాలతో బయటపడి ప్రస్తుత ఐపీఎల్తో క్రికెట్లోకి రీఎంట్రీ ఇచ్చిన పంత్.. మునుపటి తరహాలో వికెట్ల వెనక చురుగ్గా ఉండి అద్భుతమైన డైవింగ్ క్యాచ్ పట్టుకున్నాడు. ఇషాంత్ శర్మ బౌలింగ్లో లెగ్ సైడ్ దిశగా డేవిడ్ మిల్లర్ ఆడిన షాట్ను పంత్ అద్భుతమైన డైవిండ్ క్యాచ్గా మలిచి అభిమానుల మన్ననలు పొందాడు. ఈ క్యాచ్కు సంబంధించిన వీడియో వైరలవుతుంది. RISHABH PANT WITH A STUNNER 🥶pic.twitter.com/Se9bdsAAxi — Johns. (@CricCrazyJohns) April 17, 2024 మ్యాచ్ విషయానికొస్తే.. గుజరాత్ 47 పరుగుల వద్ద మరో (ఐదో) వికెట్ కోల్పోయింది. ట్రిస్టన్ స్టబ్స్ బౌలింగ్లో రిషబ్ పంత్ అద్భుతమైన స్టంపింగ్ చేయడంతో అభినవ్ మనోహర్ (8) ఔటయ్యాడు. 8.3 ఓవర్ల అనంతరం గుజరాత్ స్కోర్ 47/5గా ఉంది. రాహుల్ తెవాటియా (7), రషీద్ ఖాన్ క్రీజ్లో ఉన్నారు. సాహా (2), గిల్ (8), సాయి సుదర్శన్ (12), డేవిడ్ మిల్లర్ (2), అభినవ్ మనోహర్ (8) ఔటయ్యారు. ఇషాంత్ శర్మ 2, ముకేశ్ కుమార్, స్టబ్స్ తలో వికెట్ పడగొట్టారు. -
ఓటమి బాధలో ఉన్న గుజరాత్ టైటాన్స్కు బిగ్ షాక్ .. స్టార్ క్రికెటర్ దూరం?
ఐపీఎల్-2024లో భాగంగా అహ్మదాబాద్ వేదికగా పంజాబ్ కింగ్స్తో జరిగిన మ్యాచ్లో 3 వికెట్ల తేడాతో గుజరాత్ టైటాన్స్ అనుహ్యంగా ఓటమి పాలైంది. సునయాసంగా గెలవాల్సిన మ్యాచ్లో గుజరాత్ బౌలర్లు చెతిలేత్తిశారు. అయితే ఓటమి బాధలో ఉన్న గుజరాత్ టైటాన్స్కు బిగ్ షాక్ తగిలింది. ఆ జట్టు స్టార్ బ్యాటర్, ఫినిషర్ డేవిడ్ మిల్లర్ గాయం కారణంగా రెండు వారాల పాటు ఆటకు దూరంగా ఉండనన్నట్లు తెలుస్తోంది. ఈ కారణంతోనే పంజాబ్ కింగ్స్తో మ్యాచ్కు కూడా మిల్లర్ దూరమయ్యాడు. అతడి స్ధానంలో తుది జట్టులోకి న్యూజిలాండ్ కేన్ విలియమ్సన్ వచ్చాడు. జట్టులోకి వచ్చిన విలియమ్సన్.. మిల్లర్ గాయంపై అప్డేట్ ఇచ్చాడు. "జట్టులోకి తిరిగి వచ్చినందుకు చాలా సంతోషంగా ఉంది. కానీ డేవిడ్ మిల్లర్ సేవలు కోల్పోవడం మాకు పెద్ద ఎదురు దెబ్బ. డేవిడ్ గాయం కారణంగా రెండు వారాల పాటు ఆటకు దూరంగా ఉండనున్నాడని" విలియమ్సన్ పేర్కొన్నాడు. కాగా రెండు వారాల అంటే దాదాపు గుజరాత్ ఆడే నాలుగు మ్యాచ్లకు మిల్లర్ దూరమయ్యే ఛాన్స్ ఉంది. కాగా మిల్లర్ ప్రస్తుతం గుజరాత్ జట్టులో ఫినిషర్గా కొనసాగుతున్నాడు. సన్ రైజర్స్ తో జరిగిన మ్యాచ్ లో మిల్లర్ 27 బంతుల్లో 44 పరుగులు చేసి అజేయంగా నిలిచి జట్టుకు విజయాన్ని అందించాడు. ఇక గుజరాత్ తమ తదుపరి మ్యాచ్లో ఏప్రిల్ 7న లక్నో సూపర్ జెయింట్స్తో తలపడనుంది. చదవండి: #Shashank Singh: పంజాబ్ హీరో.. ఓడిపోయే మ్యాచ్ను గెలిపించాడు! ఎవరీ శశాంక్ సింగ్? -
IPL 2024: గుజరాత్, పంజాబ్ మ్యాచ్.. విధ్వంసకర ఆటగాళ్లు దూరం
అహ్మదాబాద్ వేదికగా గుజరాత్ టైటాన్స్, పంజాబ్ కింగ్స్ జట్లు ఇవాళ (ఏప్రిల్ 4) తలపడుతున్నాయి. ఈ మ్యాచ్లో పంజాబ్ కింగ్స్ టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకుంది. ఈ మ్యాచ్కు ఇరు జట్ల నుంచి ఇద్దరు విధ్వంసకర ఆటగాళ్లు మిస్ అయ్యారు. గాయాల కారణంగా గుజరాత్ హిట్టర్ డేవిడ్ మిల్లర్, పంజాబ్ చిచ్చరపిడుగు లియామ్ లివింగ్స్టోన్ ఈ మ్యాచ్ ఆడటం లేదు. మిల్లర్ స్థానంలో కేన్ విలియమ్సన్ ఎంట్రీ ఇవ్వగా.. లివింగ్స్టోన్ స్థానంలో సికందర్ రజా తుది జట్లలోకి ఎంట్రీ ఇచ్చారు. తుది జట్లు.. గుజరాత్ టైటాన్స్: వృద్ధిమాన్ సాహా(వికెట్కీపర్), శుభ్మన్ గిల్(కెప్టెన్), సాయి సుదర్శన్, కేన్ విలియమ్సన్, విజయ్ శంకర్, అజ్మతుల్లా ఒమర్జాయ్, రాహుల్ తెవాటియా, రషీద్ ఖాన్, నూర్ అహ్మద్, ఉమేష్ యాదవ్, దర్శన్ నల్కండే పంజాబ్ కింగ్స్: శిఖర్ ధవన్ (కెప్టెన్), జానీ బెయిర్స్టో, జితేష్ శర్మ (వికెట్కీపర్), ప్రభ్సిమ్రన్ సింగ్, సామ్ కర్రన్, శశాంక్ సింగ్, సికందర్ రజా, హర్ప్రీత్ బ్రార్, హర్షల్ పటేల్, కగిసో రబాడ, అర్ష్దీప్ సింగ్ పంజాబ్ కింగ్స్ సబ్స్: తనయ్ త్యాగరాజన్, నాథన్ ఎల్లిస్, అసుతోష్ శర్మ, రాహుల్ చాహర్, విద్వత్ కవేరప్ప గుజరాత్ టైటాన్స్ సబ్స్: బీఆర్ శరత్, మోహిత్ శర్మ, సందీప్ వారియర్, అభినవ్ మనోహర్, మానవ్ సుతార్ -
మూడు మ్యాచ్లకు రూ.1.25 కోట్లు.. పెళ్లినే వాయిదా వేసుకున్న స్టార్ క్రికెటర్
దక్షిణాఫ్రికా స్టార్ క్రికెటర్ ఇటీవలే(మార్చి 10) తన గర్ల్ ఫ్రెండ్ కామిల్లా హారిస్ను వివాహమడిన సంగతి తెలిసిందే. అయితే వాస్తవానికి వీరిద్దరి పెళ్లి గత నెలలోనే జరగాల్సింది. కానీ మిల్లర్ బంగ్లాదేశ్ ప్రీమియర్ లీగ్లో ఆడేందుకు తన పెళ్లిని వాయిదా వేసున్నాడు. బీపీఎల్లో ఫార్చూన్ బరిషల్ జట్టుకు మూడు మ్యాచులు ఆడితే ఏకంగా రూ. 1.25 కోట్లను చెల్లించేందుకు ఆ ఫ్రాంచైజీ ఆఫర్ ఇచ్చింది. దీంతో మిల్లర్ తన పెళ్లిని వాయిదా వేసుకుని ఫార్చూన్ బరిషల్ జట్టుకు ప్రాతినిథ్యం వహించాడు . ఫిబ్రవరి 26 (ఎలిమినేటర్), ఫిబ్రవరి 28 (క్వాలిఫయర్ 2), మార్చి 1న (ఫైనల్) ఫార్చూన్ బరిషల్కు మిల్లర్ ఆడాడు. బీపీఎల్-2024 విజేతగా ఫార్చూన్ బరిషల్ జట్టు నిలిచింది. తాజాగా ఈ విషయాన్ని పాకిస్తాన్ క్రికెట్ దిగ్గజం వసీం అక్రమ్ వెల్లడించాడు. "పాకిస్తాన్ సూపర్ లీగ్లో బీజీగా ఉండటంతో బీపీఎల్ను పెద్దగా ఫాలో కాలేదు. అయితే ఈ ఏడాది బీపీఎల్ టైటిల్ను ఎవరు గెలుచుకున్నారన్న విషయం గురించి నా స్నేహితులను ఆడిగాను. అప్పుడే నాకు ఓ సంచలన విషయం తెలిసింది. మూడు మ్యాచ్లు ఆడితే డేవిడ్ మిల్లర్కు 1.50 లక్షల డాలర్లు ఇచ్చేందుకు ఫార్చూన్ బరిషల్ ఫ్రాంచైజీ ముందుకు వచ్చింది. దీంతో తన పెళ్లిని వాయిదా వేసుకున్నాడు" దిపెవిలియన్ షోలో అక్రమ్ పేర్కొన్నాడు. కాగా ఐపీఎల్లో గుజరాత్ టైటాన్స్కు మిల్లర్ ప్రాతినిథ్యం వహిస్తున్న సంగతి తెలిసిందే. చదవండి: IPL 2024: ఢిల్లీ క్యాపిటల్స్కు బిగ్ షాక్.. రూ.4 కోట్ల ఆటగాడు దూరం -
David Miller Marriage Photos: గర్ల్ఫ్రెండ్ను పెళ్లి చేసుకున్న స్టార్ క్రికెటర్ (ఫొటో గ్యాలరీ)
-
David Miller: గర్ల్ఫ్రెండ్ను పెళ్లి చేసుకున్న స్టార్ క్రికెటర్.. ఫోటోలు వైరల్
దక్షిణాఫ్రికా స్టార్ క్రికెటర్ డేవిడ్ మిల్లర్ ఓ ఇంటివాడయ్యాడు. తన చిరకాల ప్రేయసి కామిలా హారిస్ను మిల్లర్ పెళ్లి చేసుకున్నాడు. గత కొంత కాలంగా ప్రేమలో మునిగితేలుతున్న ఈ జంట.. ఆదివారం వివాహ బంధంలోకి అడుగుపెట్టింది. ఈ విషయాన్ని స్వయంగా హారిస్ సోషల్ మీడియావేదికగా వెల్లడించారు. వారు పెళ్లికి సంబంధించిన ఫోటోలను హారిస్ ఇన్స్టాగ్రామ్లో షేర్ చేసింది. వీరి వివాహానికి పలువురు దక్షిణాఫ్రికా క్రికెటర్లు హాజరయ్యారు. కాగా వీరిద్దరి ఎంగేజ్మెంట్ గతేడాది ఆగస్ట్లో జరిగింది. ఇక దక్షిణాఫ్రికా జట్టులో డేవిడ్ మిల్లర్ కీలక ఆటగాడిగా కొనసాగుతున్నాడు. ముఖ్యంగా వైట్ బాల్ క్రికెట్లో ప్రోటీస్ విజయాల్లో కీలక పాత్ర పోషిస్తున్నాడు. ఇప్పటివరకు దక్షిణాఫ్రికా తరపున 173 వన్డేలు ఆడిన మిల్లర్ 4458 పరుగులు చేశాడు. అదే విధంగా 116 టీ20ల్లో 2270 పరుగులు డేవిడ్ చేశాడు. ఇక మిల్లర్ ఐపీఎల్లో గుజరాత్ టైటాన్స్కు ప్రాతినిథ్యం వహిస్తున్నాడు. ఐపీఎల్-2022 సీజన్ టైటిల్ను గుజరాత్ సొంతం చేసుకోవడంలో మిల్లర్ కీలక పాత్ర పోషించాడు. చదవండి: WPL 2024: ప్లేఆఫ్స్కు ఢిల్లీ -
చరిత్ర సృష్టించిన డేవిడ్ మిల్లర్.. తొలి సౌతాఫ్రికా క్రికెటర్గా
దక్షిణాఫ్రికా స్టార్ ఆటగాడు డేవిడ్ మిల్లర్ చరిత్ర సృష్టించాడు. టీ20 క్రికెట్లో 10 వేల పరుగుల మైలు రాయిని అందుకున్న తొలి సౌతాఫ్రికా క్రికెటర్గా మిల్లర్ రికార్డులకెక్కాడు. సౌతాఫ్రికా టీ20 లీగ్-2024లో భాగంగా బుధవారం జో బర్గ్ సూపర్ కింగ్స్తో జరిగిన ఎలిమేనిటర్ మ్యాచ్లో28 పరుగుల వ్యక్తిగత స్కోర్ వద్ద మిల్లర్.. ఈ అరుదైన ఘనతను అందుకున్నాడు. ఈ లీగ్లో పార్ల్ రాయల్స్ కెప్టెన్గా మిల్లర్ వ్యవహరిస్తున్నాడు. ఇప్పటివరకు 466 టీ20 మ్యాచ్లు ఆడిన మిల్లర్ 10019 పరుగులు చేశాడు. కాగా ఈ మైలు రాయిని సౌతాఫ్రికా దిగ్గజాలు ఏబీ డివిలియర్స్, ఫాప్ డుప్లెసిస్ కూడా అందుకోలేకపోయారు. ఇక ఓవరాల్గా ఈ అరుదైన మైలు రాయిని అందుకున్న జాబితాలో మిల్లర్ 12 స్ధానంలో నిలిచాడు. వెస్టిండీస్ క్రికెట్ దిగ్గజం క్రిస్ గేల్(14562) తొలి స్ధానంలో ఉన్నాడు. ఇక మ్యాచ్ విషయానికి వస్తే.. జో బర్గ్ సూపర్ కింగ్స్ చేతిలో 9 వికెట్ల తేడాతో ఓటమి పాలైన పార్ల్ రాయల్స్ టోర్నీ నుంచి నిష్క్రమించింది. 10 వేల పరుగుల మైలు రాయిని అందుకున్న ఆటగాళ్లు వీరే? క్రిస్ గేల్ (14562) షోయబ్ మాలిక్ (13077) కీరన్ పొలార్డ్ (12577), అలెక్స్ హేల్స్ (12002), విరాట్ కోహ్లి (11994), డేవిడ్ వార్నర్ (11860), ఆరోన్ ఫించ్ (11458), రోహిత్ శర్మ (11156), జోస్ బట్లర్ 11146), కోలిన్ మున్రో (10602) జేమ్స్ విన్స్ (10019) డేవిడ్ మిల్లర్(10019) -
మిల్లర్ కిల్లర్ ఇన్నింగ్స్.. నిప్పులు చెరిగిన ఎంగిడి
సౌతాఫ్రికా టీ20 లీగ్లో భాగంగా నిన్న (జనవరి 14) జరిగిన హై స్కోరింగ్ మ్యాచ్లో పార్ల్ రాయల్స్ ఆటగాళ్లు చెలరేగిపోయాడు. ప్రిటోరియా క్యాపిటల్స్తో జరిగిన ఈ మ్యాచ్లో తొలుత రాయల్స్ బ్యాటర్లు డేవిడ్ మిల్లర్ (42 బంతుల్లో 75 నాటౌట్; 8 ఫోర్లు, 3 సిక్సర్లు), వాన్ బురెన్ (40 బంతుల్లో 72 నాటౌట్; 7 ఫోర్లు, 3 సిక్సర్లు), జోస్ బట్లర్ (23 బంతుల్లో 39; 5 ఫోర్లు, సిక్స్) విజృంభించగా.. ఆతర్వాత బౌలింగ్లో లుంగి ఎంగిడి (4-0-39-4) నిప్పులు చెరిగాడు. ఫలితంగా రాయల్స్ 10 పరుగుల తేడాతో క్యాపిటల్స్పై విజయం సాధించింది. ఈ మ్యాచ్లో తొలుత బ్యాటింగ్ చేసిన రాయల్స్.. మిల్లర్, బురెన్, బట్లర్ చెలరేగడంతో నిర్ణీత ఓవర్లలో 3 వికెట్ల నష్టానికి 210 పరుగుల భారీ స్కోర్ చేసింది. రాయల్స్ ఇన్నింగ్స్లో జేసన్ రాయ్ (5), విహాన్ లుబ్బే (12) తక్కువ స్కోర్లకే ఔటయ్యారు. క్యాపిటల్స్ బౌలర్లలో డుపవిల్లోన్, జేమ్స్ నీషమ్, ఆదిల్ రషీద్ తలో వికెట్ పడగొట్టారు. ఛేదనలో క్యాపిటల్స్ అద్భుతమైన పోరాటపటిమ కనబర్చినప్పటికీ.. లుంగి ఎంగిడి (4/39) ధాటికి ఓడక తప్పలేదు. ఎంగిడి నిప్పులు చెరిగే బంతులతో వికెట్లు తీసి క్యాపిటల్స్ పతనాన్ని శాశించాడు. విల్ జాక్స్ (34 బంతుల్లో 58; 6 ఫోర్లు, 3 సిక్సర్లు), రిలీ రొస్సో (45 బంతుల్లో 82; 10 ఫోర్లు, 3 సిక్సర్లు), నీషమ్ (9 బంతుల్లో 20; 4 ఫోర్లు) క్యాపిటల్స్ను గెలిపించేందుకు తమవంతు ప్రయత్నం చేశారు. నిర్ణీత ఓవర్లలో ఆ జట్టు 7 వికెట్లు కోల్పోయి లక్ష్యానికి 11 పరుగుల దూరంలో నిలిచిపోయింది. క్యాపిటల్స్ హిట్టర్లు ఫిల్ సాల్ట్ (0), డి బ్రూయిన్ (4), కొలిన్ ఇన్గ్రామ్ (1) నిరాశపరిచారు. -
ఇదేమి అంపైరింగ్.. కళ్లు కన్పించడం లేదా? వీడియో వైరల్
జోహన్నెస్బర్గ్ వేదికగా దక్షిణాఫ్రికా-భారత్ మద్య జరిగిన మూడో టీ20లో అంపైర్ అల్లావుదీన్ పాలేకర్ తీసుకున్న నిర్ణయం వివాదాస్పదమైంది. దక్షిణాఫ్రికా బ్యాటర్ డేవిడ్ మిల్లర్ క్లియర్గా ఔటైనప్పటికి అంపైర్ నాటౌట్గా ప్రకటించడం అందరని షాక్కు గురిచేసింది. ఏమి జరిగిందంటే? దక్షిణాఫ్రికా ఇన్నింగ్స్ 9 ఓవర్లో నాలుగో బంతిని ఔట్ సైడ్ ఆఫ్ స్టంప్ దిశగా వేశాడు. ఈ క్రమంలో మిల్లర్ కట్ షాట్ ఆడటానికి ప్రయత్నించాడు. అయితే బంతి బ్యాట్ ఎడ్జ్ తీసుకుని నేరుగా వికెట్ కీపర్ జితేష్ శర్మ చేతికి వెళ్లింది. వెంటనే కీపర్తో పాటు బౌలర్ జడేజా గట్టిగా అప్పీల్ చేశారు. అయితే ఫీల్డ్ అంపైర్ అల్లావుదీన్ మాత్రం నాటౌట్ అంటూ తల ఊపాడు. అంపైర్ నిర్ణయం పట్ల జడ్డూతో పాటు కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ ఆసంతృప్తి వ్యక్తం చేశారు. ఆ తర్వాత రిప్లేలో సృష్టంగా బంతి బ్యాట్కు తాకినట్లు కన్పించింది. అయితే జడేజా వేసిన ఓవర్లో సాంకేతిక లోపం వల్ల డీఆర్ఎస్ అందుబాటులో లేదు. దీంతో ఔటయ్యే ప్రమాదం నుంచి మిల్లర్ తప్పించుకున్నాడు. ఒక వేళ్ల డీఆర్ఎస్ అందుబాటులో ఉండి ఉంటే మిల్లర్ పెవిలియన్కు వెళ్లక తప్పేది కాదు. యాదృచ్ఛికంగా జడ్డు వేసిన ఓవర్ తర్వాత డీఆర్ఎస్ అందుబాటులో రావడం గమనార్హం. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్గా మారింది. ఇది చూసిన నెటిజన్లు అంపైర్ను దారుణంగా ట్రోల్ చేస్తున్నారు. ఇదేమి అంపైరింగ్రా బాబు.. కళ్లు కన్పించడం లేదా అంటూ కామెంట్లు చేస్తున్నారు. చదవండి: ENG vs WI: ఇంగ్లండ్కు ఏమైంది..? విండీస్ చేతిలో మరో ఘోర పరభావం pic.twitter.com/796HKVL104 — Cricket Videos (@cricketvid123) December 14, 2023 -
దంచికొట్టిన మిల్లర్.. ఆఫ్ఘన్ ఓపెనర్ పోరాటం వృధా
అబుదాబీ టీ10 లీగ్లో బ్యాటర్ల హవా కొనసాగుతుంది. బంగ్లా టైగర్స్-నార్త్ర్న్ వారియర్స్ మధ్య ఇవాళ (డిసెంబర్ 3) జరిగిన మ్యాచ్లో ఇరు జట్ల బ్యాటర్లు చెలరేగిపోయారు. బంగ్లా టైగర్స్ తరఫున డేవిడ్ మిల్లర్ (24 బంతుల్లో 50; 4 ఫోర్లు, 3 సిక్సర్లు), జోర్డన్ కాక్స్ (16 బంతుల్లో 35; 3 ఫోర్లు, 3 సిక్సర్లు) విధ్వంసం సృష్టించగా.. వారియర్స్ తరఫున ఆఫ్ఘన్ ఆటగాడు హజ్రతుల్లా జజాయ్ (20 బంతుల్లో 57; 5 ఫోర్లు, 5 సిక్సర్లు), కెన్నార్ లెవిస్ (9 బంతుల్లో 22; 2 ఫోర్లు, 2స సిక్సర్లు) పేట్రేగిపోయారు. 138 పరుగుల భారీ లక్ష్య ఛేదనలో వారియర్స్ ఆటగాళ్లు పోరాడినప్పటికీ, విజయం బంగ్లా టైగర్స్నే వరించింది. ఈ మ్యాచ్లో తొలుత బ్యాటింగ్ చేసిన బంగ్లా టైగర్స్.. జోర్డన్ కాక్స్, డేవిడ్ మిల్లర్ చెలరేగడంతో నిర్ణీత 10 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 137 పరుగుల భారీ స్కోర్ చేసింది.టైగర్స్ ఇన్నింగ్స్లో అవిష్క ఫెర్నాండో (11), కుశాల్ మెండిస్ (20), షనక (14 నాటౌట్) రెండంకెల స్కోర్లు చేశారు. వారియర్స్ బౌలర్లలో జేమ్స్ నీషమ్ 2, సుల్తాన్ అహ్మద్ ఓ వికెట్ పడగొట్టారు. 138 పరుగుల లక్ష్య ఛేదనలో వారియర్స్ బ్యాటర్లు ఆది నుంచి దూకుడుగా ఆడినప్పటికీ లక్ష్యానికి 3 పరుగుల దూరంలో నిలిచిపోయారు. వారియర్స్ ఇన్నింగ్స్లో హజ్రతుల్లా జజాయ్, కెన్నార్ లెవిస్తో పాటు ఆడమ్ హోస్ (17), జేమ్స్ నీషమ్ (23 నాటౌట్) ఓ మోస్తరు స్కోర్లు చేసి తమ జట్టును గెలిపించేందుకు విఫలయత్నం చేశారు. టైగర్స్ బౌలర్లలో కార్లోస్ బ్రాత్వైట్ 2 వికెట్లు పడగొట్టగా.. జాషువ లిటిల్, డేనియల్ సామ్స్, రోహన్ ముస్తఫా తలో వికెట్ దక్కించుకున్నారు. -
34 బంతుల్లోనే సెంచరీ.. రోహిత్ శర్మ, డేవిడ్ మిల్లర్ రికార్డు బద్దలు
Asian Games Mens T20I 2023 - Nepal vs Mongolia: ఆసియా క్రీడలు-2023లో నేపాల్ క్రికెటర్ కుశాల్ మల్లా సంచలన ఇన్నింగ్స్తో మెరిశాడు. 34 బంతుల్లోనే శతకం సాధించి చరిత్ర సృష్టించాడు. అంతర్జాతీయ టీ20 ఫార్మాట్లో తక్కువ బంతుల్లోనే వంద పరుగుల మార్కు అందుకుని ఫాస్టెస్ట్ సెంచరీ నమోదు చేశాడు. తద్వారా టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ, సౌతాఫ్రికా స్టార్ డేవిడ్ మిల్లర్(35 బాల్స్ సెంచరీ) పేరిట సంయుక్తంగా ఉన్న రికార్డు బద్దలు కొట్టాడు. మంగోలియాతో మ్యాచ్ సందర్భంగా చైనా వేదికగా బుధవారం ఈ ఫీట్ నమోదు చేశాడు. మెన్స్ క్రికెట్ ఈవెంట్ మొదలు కాగా ఆసియా క్రీడల్లో భాగంగా బుధవారం నేపాల్, మంగోలియా హొంగ్జూలోని పిన్ఫెంగ్ క్యాంపస్ క్రికెట్ ఫీల్డ్లో పోటీకి దిగాయి. గ్రూప్-ఏలో భాగమైన ఈ జట్ల మధ్య పోరుతో మెన్స్ టీ20 క్రికెట్ ఈవెంట్కు తెరలేచింది. టాస్ గెలిచిన మంగోలియా తొలుత బౌలింగ్ ఎంచుకుంది. ఈ క్రమంలో నేపాల్ ఓపెనర్లు విఫలం కాగా.. వన్డౌన్లో వచ్చిన కుశాల్ మల్లా 50 బంతుల్లో 137, ఐదో స్థానంలో వచ్చిన దీపేంద్ర సింగ్ ఆరీ 10 బంతుల్లో 52 పరుగులతో సంచలన ఇన్నింగ్స్ ఆడారు. దీంతో నిర్ణీత 20 ఓవర్లలో 3 వికెట్ల నష్టానికి నేపాల్ 314 పరుగులు చేసింది. చదవండి: పసికూనపై ఇంగ్లండ్ ప్రతాపం.. ఫిలిప్ సాల్ట్ విధ్వంసం.. 28 బంతుల్లోనే..! -
జన్సెన్ ఆల్రౌండ్ షో.. ఆసీస్కు షాకిచ్చిన సౌతాఫ్రికా.. సిరీస్ కైవసం
స్వదేశంలో ఆస్ట్రేలియాతో జరిగిన 5 మ్యాచ్ల వన్డే సిరీస్ను సౌతాఫ్రికా 3-2 తేడాతో కైవసం చేసుకుంది. జొహన్నెస్బర్గ్ వేదికగా ఇవాళ (సెప్టెంబర్ 17) జరిగిన ఐదో వన్డేలో సౌతాఫ్రికా 122 పరుగుల భారీ తేడాతో గెలుపొందింది. మార్కో జన్సెన్ ఆల్రౌండ్ షోతో (23 బంతుల్లో 47; 4 ఫోర్లు, 3 సిక్సర్లు, 8-1-39-5) ఇరగదీసి తన జట్టును విజయపథాన నడిపించాడు. జన్సెన్కు కేశవ్ మహారాజ్ (9.1-2-33-4) సహకరించడంతో ఆస్ట్రేలియా ఓటమిపాలైంది. ఈ మ్యాచ్లో తొలుత బ్యాటింగ్ చేసిన సౌతాఫ్రికా.. మార్క్రమ్ (87 బంతుల్లో 93; 9 ఫోర్లు, 3 సిక్సర్లు), డేవిడ్ మిల్లర్ (65 బంతుల్లో 63; 4 ఫోర్లు, 3 సిక్సర్లు) అర్ధ సెంచరీలతో చెలరేగడంతో.. నిర్ణీత 50 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 315 పరుగులు చేసింది. ఇన్నింగ్స్ చివర్లో మార్కో జన్సెన్, ఫెలుక్వాయో (19 బంతుల్లో 39 నాటౌట్; 2 ఫోర్లు, 4 సిక్సర్లు) మెరుపు ఇన్నింగ్స్తో విరుచుకుపడటంతో సౌతాఫ్రికా 300 స్కోర్ను దాటింది. ఆసీస్ బౌలర్లలో ఆడమ్ జంపా (3/71), సీన్ అబాట్ (2/54), గ్రీన్ (1/59), నాథన్ ఇల్లిస్ (1/49), టిమ్ డేవిడ్ (1/20) వికెట్లు పడగొట్టారు. అనంతరం 316 పరుగుల భారీ లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన ఆసీస్.. జన్సెన్, కేశవ్ మహారాజ్, ఫెలుక్వాయో (1/44) ధాటికి 34.1 ఓవర్లలో 193 పరుగులకు ఆలౌటైంది. ఆసీస్ ఇన్నింగ్స్లో కెప్టెన్ మిచెల్ మార్ష్ (71) టాప్ స్కోరర్గా నిలువగా.. లబూషేన్ (44) పర్వాలేదనిపించాడు. వీరు మినహాయించి అంతా విఫలమయ్యారు. వార్నర్ 10, ఇంగ్లిస్ 0, అలెక్స్ క్యారీ 2, గ్రీన్ 18, టిమ్ డేవిడ్ 1, సీన్ అబాట్ 23, మైఖేల్ నెసర్ 0, జంపా 5 పరుగులు చేసి నిరాశపరిచారు. కాగా, ఈ సిరీస్లో ఆసీస్ తొలి రెండు వన్డేలు గెలువగా.. ఆతర్వాత సౌతాఫ్రికా వరుసగా మూడు విజయాలు సాధించి, సిరీస్ కైవసం చేసుకుంది. దీనికి ముందు జరిగిన 3 మ్యాచ్ల టీ20 సిరీస్ను ఆసీస్ 3-0తో క్లీన్స్వీప్ చేసింది. -
చెలరేగిన మార్క్రమ్, మిల్లర్.. క్లాసెన్పై ప్రతీకారం తీర్చుకున్న జంపా
జోహన్నెస్బర్గ్ వేదికగా ఆస్ట్రేలియాతో జరుగుతున్న నిర్ణయాత్మకమైన ఐదో వన్డేలో సౌతాఫ్రికా భారీ స్కోర్ సాధించింది. ఈ మ్యాచ్లో టాస్ ఓడి ఆస్ట్రేలియా ఆహ్వానం మేరకు తొలుత బ్యాటింగ్ చేసిన సౌతాఫ్రికా.. నిర్ణీత 50 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 315 పరుగులు చేసింది. చెలరేగిన మార్క్రమ్, మిల్లర్.. తొలుత బ్యాటింగ్ చేసిన సౌతాఫ్రికా.. మార్క్రమ్్ (87 బంతుల్లో 93; 9 ఫోర్లు, 3 సిక్సర్లు), డేవిడ్ మిల్లర్ (65 బంతుల్లో 63; 4 ఫోర్లు, 3 సిక్సర్లు) అర్ధ సెంచరీలతో చెలరేగడంతో భారీ స్కోర్ చేసింది. ఆఖర్లో జన్సెన్, ఫెలుక్వాయో మెరుపులు.. ఇన్నింగ్స్ చివర్లో మార్కో జన్సెన్ (23 బంతుల్లో 47; 4 ఫోర్లు, 3 సిక్సర్లు), ఫెలుక్వాయో (19 బంతుల్లో 39 నాటౌట్; 2 ఫోర్లు, 4 సిక్సర్లు) మెరుపు ఇన్నింగ్స్తో విరుచుకుపడటంతో సౌతాఫ్రికా 300 పరుగుల మార్కును దాటింది. పర్వాలేదనిపించిన డికాక్, డస్సెన్.. సౌతాఫ్రికా ఇన్నింగ్స్లో మార్క్రమ్, మిల్లర్, జన్సెన్, ఫెలుక్వాయోలతో పాటు డికాక్ (27), డస్సెన్ (30) ఓ మోస్తరు స్కోర్లు చేశారు. కెప్టెన్ బవుమా (0), గత మ్యాచ్లో విధ్వంసకర శతకంతో వీరవిహారం చేసిన క్లాసెన్ (6), గెరాల్డ్ కొయెట్జీ (0), కేశవ్ మహారాజ్ (0) నిరాశపరిచారు. క్లాసెన్పై ప్రతీకారం తీర్చుకున్న జంపా.. నాలుగో వన్డేలో తన బౌలింగ్లో భారీగా పరుగులు పిండుకుని, వన్డేల్లో అత్యంత ఘోరమైన గణాంకాలు (10-0-113-0) నమోదు చసేలా చేసిన క్లాసెన్పై ఈ మ్యాచ్లో ఆడమ్ జంపా ప్రతీకారం తీర్చుకున్నాడు. ఈ మ్యాచ్లో జంపా.. క్లాసెన్ను కేవలం 6 పరుగులకే క్లీన్బౌల్డ్ చేశాడు. క్లాసెన్ వికెట్ తీశాడన్న మాట తప్పిస్తే.. జంపా ఈ మ్యాచ్లోనూ భారీగా పరుగులు సమర్పించుకున్నాడు. 10 ఓవర్లలో 3 వికెట్లు తీసి ఏకంగా 71 పరుగులు సమర్పించుకున్నాడు. జంపాతో పాటు సీన్ అబాట్ (2/54), గ్రీన్ (1/59), నాథన్ ఇల్లిస్ (1/49), టిమ్ డేవిడ్ (1/20) వికెట్లు తీశారు. అనంతరం 316 పరుగుల భారీ లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన ఆసీస్.. 15 ఓవర్లలో 2 వికెట్ల నష్టానికి 91 పరుగులు చేసింది. వార్నర్ (10), ఇంగ్లిస్ (0) ఔట్ కాగా.. మిచెల్ మార్ష్ (46), లబూషేన్ (27) క్రీజ్లో ఉన్నారు. జన్సెన్కు 2 వికెట్లు పడ్డాయి. కాగా, 5 మ్యాచ్లో ఈ వన్డే సిరీస్లో ప్రస్తుతం ఇరు జట్లు చెరో 2 మ్యాచ్లు గెలిచి, సిరీస్లో సమంగా నిలిచాయి. -
క్లాసెన్ మహోగ్రరూపం.. క్రికెట్ చరిత్రలో కనీవినీ ఎరుగని విధ్వంసం
వన్డే క్రికెట్ చరిత్రలో కనీవినీ ఎరుగని విధ్వంసం జరిగింది. సెంచూరియన్ వేదికగా ఆస్ట్రేలియాతో జరుగుతున్న కీలకమైన నాలుగో వన్డేలో సౌతాఫ్రికా ఆటగాడు హెన్రిచ్ క్లాసెన్ మహోగ్రరూపం దాల్చాడు. 83 బంతుల్లో 13 ఫోర్లు, 13 సిక్సర్ల సాయంతో 174 పరుగులు చేశాడు. క్లాసెన్కు తొలుత రస్సీ వాన్ డర్ డస్సెన్ (65 బంతుల్లో 62; 7 ఫోర్లు, 2 సిక్సర్లు), ఆఖర్లో డేవిడ్ మిల్లర్ (45 బంతుల్లో 82 నాటౌట్; 6 ఫోర్లు, 5 సిక్సర్లు) తోడవ్వడంతో సౌతాఫ్రికా నిర్ణీత 50 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 416 పరుగుల అతి భారీ స్కోర్ చేసింది. సౌతాఫ్రికా ఇన్నింగ్స్లో కెప్టెన్ మార్క్రమ్ (8) మినహా అందరూ పరుగులు చేశారు. క్వింటన్ డికాక్ (45), రీజా హెండ్రిక్స్ (28) ఓ మోస్తరు స్కోర్లు చేశారు. క్లాసెన్ మహోగ్రరూపం.. క్రికెట్ చరిత్రలో కనీవినీ ఎరుగని విధ్వంసం సిరీస్లో నిలబడాలంటే తప్పక గెలవాల్సిన మ్యాచ్లో సౌతాఫ్రికా ఆటగాడు హెన్రిచ్ క్లాసెన్ మహోగ్రరూపం దాల్చాడు. కేవలం 57 బంతుల్లో శతక్కొట్టాడు. వన్డే క్రికెట్ చరిత్రలో ఇది ఐదో వేగవంతమైన శతకం. గతంలో క్లాసెన్ ఓసారి 54 బంతుల్లోనే సెంచరీ చేశాడు. వన్డేల్లో ఫాస్టెస్ట్ హండ్రెడ్ రికార్డు ఏబీ డివిలియర్స్ (31 బంతుల్లో) పేరిట ఉంది. ఈ మ్యాచ్లో క్లాసెన్ ఆడిన ఇన్నింగ్స్ వన్డే క్రికెట్ ఉన్నన్ని రోజులు గుర్తుంటుంది. క్లాసెన్కు మిల్లర్ కూడా జతకలవడంతో ఆసీస్ బౌలింగ్ లైనప్ తునాతునకలైంది. వీరిద్దరి ధాటికి ఆసీస్ స్పిన్నర్ ఆడమ్ జంపా 10 ఓవర్లలో రికార్డు స్థాయిలో 113 పరుగులు సమర్పించుకున్నాడు. జంపాతో పాటు స్టొయినిస్ (10-1-81-1), హాజిల్వుడ్ (10-0-79-2), నాథన్ ఇల్లిస్ (10-0-79-1), మైఖేల్ నెసర్ (10-0-59-1) ధారాళంగా పరుగులు సమర్పించుకున్నారు. కాగా, 5 మ్యాచ్ల వన్డే సిరీస్లో ప్రస్తుతం ఆసీస్ 2-1 ఆధిక్యంలో ఉంది. ఈ మ్యాచ్లో గెలిస్తేనే సౌతాఫ్రికా సిరీస్ ఆవకాశాలు సజీవంగా ఉంటాయి. క్లాసెన్ పరుగులు ఇలా సాధించాడు.. తొలి హాఫ్ సెంచరీ: 38 బంతులు రెండో హాఫ్ సెంచరీ: 19 బంతులు మూడో హాఫ్ సెంచరీ: 20 బంతులు ఆఖరి 24 పరుగులు: 6 బంతులు ఈ ఇన్నింగ్స్లో క్లాసెన్ ఆఖరి 150 పరుగులను 58 బంతుల్లో చేయడం విశేషం. క్లాసెన్-మిల్లర్ జోడీ కేవలం 94 బంతుల్లో 222 పరుగులు జోడించింది. క్రికెట్ చరిత్రలో ఇదే ఫాస్టెస్ట్ డబుల్ సెంచరీ భాగస్వామ్యం. ఆస్ట్రేలియాపై రెండో ఫాస్టెస్ట్ హండ్రెడ్.. కోహ్లి 52 బంతుల్లో ఆసీస్పై శతక్కొట్టాడు. వన్డేల్లో అత్యధిక పరుగులు సమర్పించుకున్న బౌలర్గా జంపా.. ఆసీస్కే చెందిన మిక్ లెవిస్ (113) రికార్డును సమం చేశాడు. వన్డేల్లో అత్యధిక సార్లు (7) 400 స్కోర్ దాటిన సౌతాఫ్రికా -
మిల్లర్ కిల్లర్ ఇన్నింగ్స్.. రసెల్ పోరాటం వృధా.. బోణీ కొట్టిన సూపర్ కింగ్స్
అమెరికా వేదికగా జరుగుతున్న మేజర్ లీగ్ క్రికెట్ (ఎంఎల్సీ) తొలి సీజన్ నిన్నటి (జులై 13) నుంచి ప్రారంభమైంది. సీజన్ ఆరంభ మ్యాచ్లో టెక్సాస్ సూపర్ కింగ్స్.. లాస్ ఏంజెలెస్ నైట్ రైడర్స్పై విజయఢంకా మోగించింది. భారతకాలమానం ప్రకారం ఇవాళ ఉదయం ప్రారంభమైన మ్యాచ్లో సూపర్ కింగ్స్ 69 పరుగుల తేడాతో గెలుపొంది, ఎంఎల్సీ-2023లో బోణీ విజయం దక్కించుకుంది. మిల్లర్ కిల్లర్ ఇన్నింగ్స్.. కాన్వే సూపర్ ఫిఫ్టి.. బ్రేవో మెరుపులు ఈ మ్యాచ్లో టాస్ ఓడి ప్రత్యర్ధి ఆహ్వానం మేరకు తొలుత బ్యాటింగ్ చేసిన సూపర్ కింగ్స్.. కాన్వే (37 బంతుల్లో 55; 7 ఫోర్లు, సిక్స్), డేవిడ్ మిల్లర్ (42 బంతుల్లో 61; 2 ఫోర్లు, 4 సిక్సర్లు) మెరుపు అర్ధసెంచరీలతో చెలరేగడంతో నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 181 పరుగులు చేసింది. ఆఖర్లో మిచెల్ సాంట్నర్ (14 బంతుల్లో 21; 2 సిక్సర్లు), డ్వేన్ బ్రేవో (6 బంతుల్లో 16 నాటౌట్; 2 సిక్సర్లు) మెరుపు ఇన్నింగ్స్లు ఆడారు. సూపర్ కింగ్స్ కెప్టెన్ ఫాఫ్ డుప్లెసిస్ తానెదుర్కొన్న తొలి బంతికే ఔటయ్యాడు. నైట్రైడర్స్ బౌలరల్లో అలీ ఖాన్, లోకీ ఫెర్గూసన్ తలో 2 వికెట్లు.. సునీల్ నరైన్, ఆడమ్ జంపా చెరో వికెట్ దక్కించుకున్నారు. రసెల్ పోరాటం వృధా.. 182 పరుగుల లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన నైట్ రైడర్స్.. సూపర్ కింగ్స్ బౌలర్ల ధాటికి 14 ఓవర్లలో 112 పరుగులకే కుప్పకూలింది. సూపర్ కింగ్స్ స్పిన్నర్ మొహమ్మద్ మొహిసిన్ (4/8) నైట్రైడర్స్ పతనాన్ని శాశించగా.. గెరాల్డ్ కొయెట్జీ, రస్టీ థెరన్ తలో 2 వికెట్లు, కాల్విన్ సావేజ్, డ్వేన్ బ్రేవో చెరో వికెట్ పడగొట్టారు. నైట్రైడర్స్ ఇన్నింగ్స్లో మిగతా బ్యాటర్లంతా పెవిలియన్కు క్యూ కడుతుంటే విండీస్ విధ్వంసర వీరుడు ఆండ్రీ రసెల్ (34 బంతుల్లో 55; 7 ఫోర్లు, 3 సిక్సర్లు) ఒక్కడే ఒంటరిపోరాటం చేశాడు. జస్కరన్ మల్హోత్రా (22), సునీల్ నరైన్ (15) రెండంకెల స్కోర్లు చేయగా.. మిగతావారంతా సింగిల్ డిజిట్కే పరిమితమయ్యారు. మార్టిన్ గప్తిల్ (0), ఉన్ముక్త్ చంద్ (4), రిలీ రొస్సో (4), జంపా (3), ఫెర్గూసన్ (1) నిరాశపరిచారు. కాగా, ఐపీఎల్ ఫ్రాంచైజీల యాజమాన్యాలే ఎంఎల్సీ జట్లను కూడా కొనుగోలు చేసిన విషయం తెలిసిందే. చెన్నై సూపర్ కింగ్స్ యాజమాన్యం.. టెక్సాస్ సూపర్ కింగ్స్ను, కోల్కతా నైట్రైడర్స్ యాజమాన్యం.. లాస్ ఏంజెలెస్ నైట్రైడర్స్ను సొంతం చేసుకున్నాయి. లీగ్లో భాగంగా రేపు (భారతకాలమానం ప్రకారం) సీటిల్ ఓర్కాస్, వాషింగ్టన్ ఫ్రీడం జట్లు.. ముంబై ఇండియన్స్ న్యూయార్క్, శాన్ఫ్రాన్సిస్కో యూనికార్న్స్ జట్లు తలపడతాయి. -
పాక్ కెప్టెన్ బాబర్ ఆజమ్, ధోని శిష్యుడు ఒకే టీమ్లో..!
లంక ప్రీమియర్ లీగ్ నాలుగో ఎడిషన్ (2023)కు సంబంధించి, లీగ్లో పాల్గొనే 5 జట్లు తమ ఐకాన్ (లోకల్, ఓవర్సీస్), ప్లాటినం (లోకల్, ఓవర్సీస్) ప్లేయర్లతో ఒప్పందం చేసుకున్నాయి. ఆటగాళ్ల డ్రాఫ్టింగ్కు నిర్ధేశిత తేదీ జూన్ 11 అయినప్పటికీ.. ఆయా జట్లకు ముందుగానే ఆటగాళ్లను ఎంపిక చేసుకునే వెసులుబాటు ఉన్న నేపథ్యంలో ఈ ఎంపిక జరిగింది. ఎల్పీఎల్లో తొలిసారి ఆడుతున్న కొలొంబో స్ట్రయికర్స్.. తమ ఐకాన్ ప్లేయర్గా పాక్ కెప్టెన్ బాబర్ ఆజమ్ను, మిగతా సభ్యులుగా పాక్ స్పీడ్స్టర్ నసీం షా, లోకల్ టీ20 స్టార్ చమిక కరుణరత్నే, ఐపీఎల్-2023తో ధోని శిష్యుడిగా మారిపోయిన జూనియర్ మలింగ మతీష పతిరణను ఎంపిక చేసుకుంది. గాలే గ్లాడియేటర్స్.. బంగ్లాదేశ్ వన్డే జట్టు కెప్టెన్ షకీబ్ అల్ హసన్ను.. డంబుల్లా ఔరా మాథ్యూ వేడ్ను.. క్యాండీ ఫాల్కన్స్ ముజీబ్ ఉర్ రెహ్మాన్ను.. జాఫ్నా కింగ్స్ డేవిడ్ మిల్లర్ను తమ ఓవర్సీస్ ఐకాన్ ప్లేయర్లుగా ఎంపిక చేసుకున్నాయి. ఎల్పీఎల్-2023 కోసం ఆయా జట్లు ఎంపిక చేసుకున్న ఆటగాళ్ల వివరాలు.. చదవండి: వరల్డ్ కప్ 2023 షెడ్యూల్ విడుదల -
కేకేఆర్ను ఎన్కౌంటర్ చేసిన విజయ్ శంకర్
ఐపీఎల్ 16వ సీజన్లో గుజరాత్ టైటాన్స్ తన హవా కొనసాగిస్తుంది. తాజాగా శనివారం కేకేఆర్తో మ్యాచ్లో గుజరాత్ టైటాన్స్ ఏడు వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. 14 ఓవర్ల వరకు 111 పరుగులు మాత్రమే ఉన్న గుజరాత్ తర్వాత మూడు ఓవర్ల వ్యవధిలోనే మ్యాచ్ను గెలవడం విశేషం. ఇదంతా మిల్లర్, విజయ్ శంకర్ల చలవే అని చెప్పొచ్చు. 14వ ఓవర్ వరకు మిల్లర్ 13, విజయ్ శంకర్ ఏడు పరుగులతో ఆడుతున్నారు. అసలు విధ్వంసం 14వ ఓవర్ నుంచే మొదలైంది. ఇద్దరు పోటాపోటీగా సిక్సర్లు బౌండరీలు బాదుతూ వచ్చారు. వీరిద్దరి దెబ్బకు తర్వాతి 3.5 ఓవర్లలో 79 పరుగులు వచ్చాయంటే ఎంత విధ్వంసం జరిగిందో అర్థం చేసుకోవచ్చు. ముఖ్యంగా విజయ్ శంకర్ తన ఇన్నింగ్స్తో మ్యాచ్లో హైలెట్గా నిలిచాడు. 24 బంతుల్లో 51 పరుగులు నాటౌట్గా నిలిచిన విజయ్ శంకర్ ఇన్నింగ్స్లో రెండు ఫోర్లు, ఐదు సిక్సర్లు ఉన్నాయి. వరుణ్ చక్రవర్తి వేసిన ఇన్నింగ్స్ 17వ ఓవర్లో మూడు సిక్సర్లు, ఫోర్తో విధ్వంసం సృష్టించిన విజయ్ శంకర్ ఆ తర్వాత నితీశ్రానా వేసిన 18వ ఓవర్లో మరో సిక్స్, ఫోర్తో విరుచుకుపడి మ్యాచ్ను ముగించాడు. మిల్లర్ను కూడా తక్కువ చేసి చూడలేం. నిజానికి మిల్లర్ 14వ ఓవర్లో రెండు సిక్సర్లు బాది గుజరాత్పై ఒత్తిడి తగ్గించాడు. 18 బంతుల్లో 32 పరుగులు నాటౌట్గా నిలిచిన మిల్లర్ ఇన్నింగ్స్లో రెండు ఫోర్లు, రెండు సిక్సర్లు ఉన్నాయి. మొత్తానికి ఇద్దరు కలిసి తమ విధ్వంసకర ఇన్నింగ్స్తో కేకేఆర్ను ఎన్కౌంట్ర్ చేశారని చెప్పొచ్చు. Vijay Shankar's counter-attacking 5️⃣0️⃣ ensures #GujaratTitans keep their perfect away record intact 💯 The defending champions also go 🔝 of the #TATAIPL points table!#KKRvGT #IPLonJioCinema #IPL2023 | @vijayshankar260 pic.twitter.com/uLpd5RYmgW — JioCinema (@JioCinema) April 29, 2023 చదవండి: పీసీబీ ఘనకార్యం.. క్రికెట్ చరిత్రలో ఇదే తొలిసారి! అద్భుతాలు అరుదుగా.. చూసి తీరాల్సిందే -
మిల్లర్ వికెట్తో వంద వికెట్ల క్లబ్లో స్టోయినిస్
ఐపీఎల్ 16వ సీజన్లో భాగంగా గుజరాత్ టైటాన్స్తో మ్యాచ్లో మిల్లర్ వికెట్ తీయడం ద్వారా మార్కస్ స్టోయినిస్ టి20ల్లో వంద వికెట్లు పూర్తి చేసుకున్నాడు. 225 టి20 మ్యాచ్ల్లో స్టోయినిస్ ఈ ఘనత సాధించాడు. గుజరాత్ ఇన్నింగ్స్ ఆఖరి ఓవర్ వేసిన స్టోయినిస్.. ఓవర్ ఆఖరి బంతికి మిల్లర్ భారీ షాట్కు యత్నించి దీపక్ హుడాకు క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు. అంతకముందు గుజరాత్ కెప్టెన్ హార్దిక్ పాండ్యా వికెట్ను ఖాతాలో వేసుకున్న స్టోయినిస్ మ్యాచ్లో రెండు వికెట్లు తీశాడు. ఇక స్టోయినిస్ అంతర్జాతీయ కెరీర్ విషయానికొస్తే.. 60 వన్డేల్లో 1326 పరుగులతో పాటు 40 వికెట్లు, 51 టి20ల్లో 803 పరుగులతో పాటు 18 వికెట్లు తీశాడు. ఇక మ్యాచ్ విషయానికి వస్తే టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న గుజరాత్ టైటాన్స్ అంచనా తప్పయింది. ప్లాట్గా ఉన్న పిచ్పై పరుగులు రావడం కష్టమైంది. నిర్ణీత 20 ఓవర్లలో గుజరాత్ టైటాన్స్ ఆరు వికెట్ల నష్టానికి 135 పరుగులు చేసింది. హార్దిక్ పాండ్యా 66, సాహా 47 పరుగులు చేశాడు. -
SRH Vs MI: మా జట్టులో తెవాటియా, మిల్లర్ లాంటి ఆటగాళ్లు ఉంటే బాగుండు!
IPL 2023 SRH Vs MI- Brian Lara Comments: తమ జట్టు మిడిలార్డర్ను మరింత పటిష్టం చేయాల్సి ఉందని.. ఇందుకోసం కసరత్తులు చేస్తున్నామని సన్రైజర్స్ హైదరాబాద్ కోచ్ బ్రియన్ లారా అన్నాడు. ఒత్తిడిని అధిగమించి జట్టును విజయతీరాలకు చేర్చగల ఫినిషర్ల అవసరం ఉందని పేర్కొన్నాడు. తెవాటియా, మిల్లర్ లాంటి ఆటగాళ్లు సన్రైజర్స్లో కూడా ఉంటే బాగుండేదని అభిప్రాయపడ్డాడు. ఐపీఎల్-2023లో భాగంగా ఉప్పల్ వేదికగా మంగళవారం జరిగిన మ్యాచ్లో సన్రైజర్స్.. ముంబై ఇండియన్స్తో తలపడింది. సొంతమైదానంలో టాస్ గెలిచిన రైజర్స్ తొలుత బౌలింగ్ ఎంచుకుంది. ఈ క్రమంలో బ్యాటింగ్కు దిగిన ముంబై నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 192 పరుగులు చేసింది. అలా కథ ముగిసింది టార్గెట్ చేధించేందుకు బరిలోకి దిగిన సన్రైజర్స్ 19.5 ఓవర్లలో 178 పరుగులు మాత్రమే చేసి అవుటైంది. దీంతో 14 పరుగుల తేడాతో రోహిత్ సేన చేతిలో ఓటమిపాలైంది. ఈ మ్యాచ్లో ఆఖరి ఓవర్లో రైజర్స్ గెలుపొందాలంటే 20 పరుగులు అవసరమైన వేళ.. రోహిత్ శర్మ..అర్జున్ టెండుల్కర్ చేతికి బంతినిచ్చాడు. అప్పటికి భువనేశ్వర్ కుమార్తో పాటు క్రీజులో ఉన్న అబ్దుల్ సమద్.. చివరి ఓవర్ రెండో బంతికి రనౌట్గా వెనుదిరిగాడు. ఈ క్రమంలో మయాంక్ మార్కండే క్రీజులోకి రాగా.. రెండు పరుగులు వచ్చాయి. ఆ తర్వాత బై రూపంలో ఒక పరుగు రాగా.. మరుసటి బంతికి అర్జున్.. భువీని పెవిలియన్కు పంపడంతో సన్రైజర్స్ కథ ముగిసింది. వాళ్లలాంటి ఆటగాళ్లు కావాలి ఈ నేపథ్యంలో మ్యాచ్ అనంతరం రైజర్స్ కోచ్ లారా మాట్లాడుతూ.. ‘‘మేము ఆ విషయం(మిడిలార్డర్)లో ఇంకా కసరత్తులు చేస్తున్నాం. మ్యాచ్ చివరి వరకు ఒత్తిడిని అధిగమించి జట్టును గెలిపించే ఆత్మవిశ్వాసం ఆటగాళ్లలో ఉండాలి. తెవాటియా, మిల్లర్ లాంటి ప్లేయర్ల అవసరం మాకు ఉంది. ఒత్తిడిలోనూ మ్యాచ్ను ఎలా ఫినిష్ చేయాలో వాళ్లకు తెలుసు. అలాంటి వాళ్లను తయారు చేసుకోగలగాలి. మేము ఆ పనిలోనే ఉన్నాం. ఈరోజైతే మేము అత్యుత్తమ జట్టు చేతిలోనే ఓడిపోయాం అని కచ్చితంగా చెప్పగలను’’ అని పేర్కొన్నాడు. కాగా 2022లో ఐపీఎల్లో ఎంట్రీ ఇచ్చిన గుజరాత్ టైటాన్స్కు ఆడుతున్న రాహుల్ తెవాటియా, డేవిడ్ మిల్లర్ ఫినిషర్లుగా అద్భుత పాత్ర పోషిస్తున్న సంగతి తెలిసిందే. ఇదిలా ఉంటే.. తాజా ఓటమితో సన్రైజర్స్ పరాజయాల సంఖ్య మూడుకు చేరగా 4 పాయింట్లతో పట్టికలో తొమ్మిదోస్థానానికి పడిపోయింది. చదవండి: నేను మూడేళ్లు ఇక్కడే ఆడాను.. అతడొక అద్భుతం! ఏ బౌలర్ కైనా చుక్కలే: రోహిత్ SRH Vs MI: టెస్టు ప్లేయర్తో ఇట్లనే ఉంటది మరి! ‘టాప్ స్కోరర్’ అయితే ఏంటి? Three wins in a row for the @mipaltan as they beat #SRH by 14 runs to add two key points to their tally. Scorecard - https://t.co/oWfswiuqls #TATAIPL #SRHvMI #IPL2023 pic.twitter.com/asznvdy1BS — IndianPremierLeague (@IPL) April 18, 2023 -
అందుకే అక్షర్తో బౌలింగ్ చేయించలేదు.. మా నుంచి అతడు మ్యాచ్ లాగేసుకున్నాడు!
గుజరాత్ టైటాన్స్తో మ్యాచ్లో ఢిల్లీ క్యాపిటల్స్ ఆల్రౌండర్ అక్షర్ పటేల్ అద్భుతంగా రాణించాడు. టాపార్డర్లో కెప్టెన్ డేవిడ్ వార్నర్ (37), సర్ఫరాజ్ ఖాన్(30) మినహా మిగతా వాళ్లు విఫలమైన వేళ అక్షర్ బ్యాట్ ఝులిపించాడు. ఈ స్పిన్ ఆల్రౌండర్ 22 బంతుల్లో 2 ఫోర్లు, 3 సిక్సర్లతో 36 పరుగులు సాధించాడు. ఈ క్రమంలో టాస్ ఓడి తొలుత బ్యాటింగ్కు దిగిన ఢిల్లీ నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్లు నష్టపోయి 162 పరుగులు చేయగలిగింది. కానీ లక్ష్య ఛేదనకు దిగిన గుజరాత్ టైటాన్స్ను సాయి సుదర్శన్(62), డేవిడ్ మిల్లర్ (31) ఆఖరి వరకు అజేయంగా నిలిచి విజయతీరాలకు చేర్చారు. దీంతో సొంతగడ్డపై ఆడిన తొలి మ్యాచ్లో ఢిల్లీ ఆరు వికెట్ల తేడాతో ఓటమి పాలైంది. ఐపీఎల్-2023లో వరుసగా రెండో పరాజయం నమోదు చేసింది. ఇదిలా ఉంటే.. గుజరాత్తో మ్యాచ్లో అక్షర్ చేతికి వార్నర్ బంతినివ్వకపోవడం చర్చనీయాంశమైంది. అందుకే అక్షర్ చేతికి బంతినివ్వలేదు.. అతడు మ్యాచ్ లాగేసుకున్నాడు ఈ నేపథ్యంలో మ్యాచ్ అనంతరం మాట్లాడిన ఢిల్లీ కెప్టెన్ వార్నర్ భాయ్.. తన నిర్ణయానికి గల కారణాన్ని వెల్లడించాడు. ‘‘మ్యాచ్ ఆరంభంలోనే గుజరాత్ సీమర్లను చూసి నేను ఆశ్చర్యపోయాననుకోకండి. నిజానికి ఊహించిన దానికంటే బంతి మరింత ఎక్కువగా స్వింగ్ అయింది. పరిస్థితులకు అనుగుణంగా ఎలా బౌలింగ్ చేయాలో వాళ్లు(గుజరాత్) చూపించారు. ఇంకా ఇక్కడ మరో ఆరు మ్యాచ్లు ఆడాల్సి ఉంది. ఆరంభ ఓవర్లలో బంతి ఇలాగే స్వింగ్ అయ్యే అవకాశం ఉంది. నిజానికి ఆఖరి వరకు మేము గెలుస్తామనే నమ్మకం ఉండింది. అయితే, సాయి అద్బుత బ్యాటింగ్తో మ్యాచ్ను మా నుంచి లాగేసుకున్నాడు. ఇక మిల్లర్ గురించి చెప్పేదేముంది. అతడు ఏం చేయగలడో అదే చేశాడు. నిజానికి డ్యూ(తేమ) ఎక్కువగా ఉంది. ఇలాంటి చోట 180-190 వరకు స్కోర్ చేస్తేనే మ్యాచ్ను కాపాడుకోగలం. అంతేగానీ అతడికి(అక్షర్ను ఉద్దేశించి) బౌలింగ్ ఇవ్వకపోవడం వల్ల కాదు’’ అని వార్నర్ తెలిపాడు. సీమర్లకు అనుకూలించే వికెట్పై స్పిన్ ఆల్రౌండర్ అక్షర్ పటేల్ చేతికి బంతినివ్వలేదని పరోక్షంగా చెప్పుకొచ్చాడు. ఇక ఈ మ్యాచ్లో 3 ఓవర్లు బౌలింగ్ చేసిన ఢిల్లీ చైనామన్ స్పిన్నర్ కుల్దీప్ యాదవ్ 18 పరుగులు ఇచ్చాడు. చదవండి: IPL 2023: చెత్తగా ఆడుతున్నాడు.. వాళ్లను చూసి నేర్చుకో! సెహ్వాగ్ ఘాటు విమర్శలు DC Vs GT: రానున్న రెండేళ్లలో ఫ్రాంఛైజ్ క్రికెట్తో పాటు టీమిండియాలో కూడా! Double delight for @gujarat_titans 🙌🙌 They win their second consecutive game of #TATAIPL 2023 and move to the top of the Points Table. Scorecard - https://t.co/tcVIlEJ3bC#DCvGT pic.twitter.com/WTZbIZTQmm — IndianPremierLeague (@IPL) April 4, 2023 -
అందుకే మిల్లర్ను 'కిల్లర్' అనేది
సౌతాఫ్రికా విధ్వంసకర బ్యాటర్ డేవిడ్ మిల్లర్ను ముద్దుగా కిల్లర్ మిల్లర్ అని పిలుస్తుంటారు. ఎందుకంటే అతను క్రీజులో పాతుకుపోయాడంటే క్షణాల్లో మ్యాచ్ను మార్చేయగల సత్తా ఉన్నవాడు. అందుకే అతను క్రీజులో కుదురుకునే లోపే ఔట్ చేయడానికి ప్రయత్నించాలి. ఒకవేళ తాను ఔటయ్యే ప్రమాదం నుంచి బయటపడ్డాడో ఆపడం ఎవరి తరం కాదు. గతేడాది ఐపీఎల్లోనే మిల్లర్ విధ్వంసం ఎలా ఉంటుందో అందరం చూసే ఉంటాం. తాజాగా ఐపీఎల్ 16వ సీజన్లోనూ తన వేటను ఆరంభించాడు. ఢిల్లీ క్యాపిటల్స్తో జరిగిన మ్యాచ్లో సాయి సుదర్శన్తో కలిసి మిల్లర్ మ్యాచ్ విన్నింగ్ ఇన్నింగ్స్ ఆడాడు. కుల్దీప్ యాదవ్ బౌలింగ్లో ఔటయ్యే ప్రమాదం నుంచి తప్పించుకున్నాడు. ఎల్బీగా అంపైర్ ఔట్ ఇవ్వడంతో మిల్లర్ రివ్యూకు వెళ్లి ఫలితం సాధించాడు. ఆ తర్వాత ఢిల్లీ క్యాపిటల్స్ బౌలర్ల భరతం పట్టాడు. కేవలం 16 బంతుల్లోనే 2 ఫోర్లు, 2 సిక్సర్లతో 31 పరుగులు నాటౌట్గా నిలిచి గుజరాత్ విజయంలో కీలకపాత్ర పోషించాడు. అయితే ఐపీఎల్కు రావడానికి ముందు నెదర్లాండ్స్తో జరిగిన మూడో వన్డేలో మిల్లర్ 61 బంతుల్లోనే 91 పరుగులతో విధ్వంసకర ఇన్నింగ్స్ ఆడాడు. వచ్చిన ఒక్కరోజు గ్యాప్లోనే ఐపీఎల్లో తన పవర్ ఏంటో చూపించాడు. ఇకపై తనతో అన్ని జట్లు జాగ్రత్తగా ఉండాల్సిందే అని మిల్లర్ పరోక్షంగా హెచ్చరించాడు. ICYMI - @DavidMillerSA12 takes on Mukesh Kumar 🔥🔥🔥#TATAIPL #DCvGT pic.twitter.com/ilEDdItqz3 — IndianPremierLeague (@IPL) April 4, 2023 Double delight for @gujarat_titans 🙌🙌 They win their second consecutive game of #TATAIPL 2023 and move to the top of the Points Table. Scorecard - https://t.co/tcVIlEJ3bC#DCvGT pic.twitter.com/WTZbIZTQmm — IndianPremierLeague (@IPL) April 4, 2023 -
పావెల్ విధ్వంసం.. దక్షిణాఫ్రికాపై వెస్టిండీస్ సంచలన విజయం
సెంచూరియన్ వేదికగా దక్షిణాఫ్రికాతో జరిగిన తొలి టీ20లో వెస్టిండీస్ సంచలన విజయం సాధించింది. వర్షం కారణంగా ఈ మ్యాచ్ను 11 ఓవర్లకు కుదించారు. తొలుత బ్యాటింగ్ చేసిన దక్షిణాఫ్రికా నిర్ణీత ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 131 పరుగులు చేసింది. ప్రోటీస్ బ్యాటర్లలో డేవిడ్ మిల్లర్ అద్భుత ఇన్నింగ్స్ ఆడాడు. అతడు కేవలం 22 బంతుల్లోనే 48 పరుగులు సాధించాడు. మిల్లర్ ఇన్నింగ్స్లో 4 ఫోర్లు, 3 భారీ సిక్సర్లు ఉన్నాయి. విండీస్ బౌలర్లలో కాట్రల్, స్మిత్ తలా రెండు వికెట్లు సాధించగా.. జోషఫ్, హోస్సేన్, షెపర్డ్ చెరో వికెట్ సాధించారు. అనంతరం 132 పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన వెస్టిండీస్ 7 వికెట్లు కోల్పోయి మరో మూడు బంతులు మిగిలూండగానే ఛేదించింది. విండీస్ కెప్టెన్ రోవమన్ పావెల్(18 బంతుల్లో 42 పరుగులు) ఆఖరి వరకు క్రీజులో నిలిచి తమ జట్టుకు అద్భుతమైన విజయాన్ని అందించాడు. పావెల్తో పాటు చార్లెస్ (14 బంతుల్లో 28) పరుగులతో రాణించాడు. కాగా ప్రోటీస్ బౌలర్లలో మగాల మూడు వికెట్లు సాధించాడు. ఇక ఇరు జట్ల మధ్య రెండో టీ20 ఆదివారం జరగనుంది. చదవండి: SA vs WI: డేవిడ్ మిల్లర్ విధ్వంసం.. కేవలం 22 బంతుల్లోనే! -
SA vs WI: డేవిడ్ మిల్లర్ విధ్వంసం.. కేవలం 22 బంతుల్లోనే!
సెంచూరియన్ వేదికగా వెస్టిండీస్తో జరుగుతున్న తొలి టీ20లో దక్షిణాఫ్రికా బ్యాటర్ డేవిడ్ మిల్లర్ విధ్వంసం సృష్టించాడు. వర్షం కారణంగా 11 ఓవర్లకు కుదించిన ఈ మ్యాచ్లో మిల్లర్.. కేవలం 22 బంతుల్లోనే 48 పరుగులు సాధించాడు. అతడి ఇన్నింగ్స్లో 4 ఫోర్లు, 3 భారీ సిక్సర్లు ఉన్నాయి. ఐదో స్థానంలో బ్యాటింగ్కు వచ్చిన మిల్లర్ తన అద్బుత ఇన్నింగ్స్తో జట్టును అదుకున్నాడు. అతడితో పాటు ప్రోటీస్ పేసర్ మగాల మెరుపు ఇన్నింగ్స్ ఆడాడు. కేవలం 5 బంతులు ఎదుర్కొన్న మగాల 2 సిక్స్లు, ఒక్క ఫోరు సాయంతో 18 పరుగులు చేశాడు. ఇక వీరిద్దరి అద్భుత ఇన్నింగ్స్ల ఫలితంగా దక్షిణాఫ్రికా నిర్ణీత 11 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 131 పరుగులు చేసింది. విండీస్ బౌలర్లలో కాట్రల్, స్మిత్ తలా రెండు వికెట్లు సాధించగా.. జోషఫ్, హోస్సేన్, షెపర్డ్ చెరో వికెట్ సాధించారు. చదవండి: IPL 2023: ఐపీఎల్కు ముందు సన్రైజర్స్ బ్యాటర్ సిక్సర్ల వర్షం.. వీడియో వైరల్ -
IPL 2023: గుజరాత్ టైటాన్స్కు బిగ్ షాక్.. హ్యాండ్ ఇచ్చిన కిల్లర్ మిల్లర్
David Miller: ఐపీఎల్-2023 సీజన్ ప్రారంభానికి ముందు డిఫెండింగ్ ఛాంపియన్స్ గుజరాత్ టైటాన్స్కు భారీ షాక్ తగిలింది. ఆ జట్టు ఛాంపియన్ ఆటగాడు డేవిడ్ మిల్లర్ సీజన్ ఆరంభ మ్యాచ్లకు దూరంగా ఉండనున్నట్లు స్వయంగా వెల్లడించాడు. వరల్డ్ కప్ సూపర్ లీగ్ (WCSL)లో భాగంగా నెదర్లాండ్స్తో జరిగే అత్యంత కీలకమైన రెండు వన్డే మ్యాచ్లకు అందుబాటులో ఉండేందుకు మిల్లర్తో పాటు ఐపీఎల్లో పాల్గొనే పలువురు సఫారీ స్టార్ ప్లేయర్లు ఈ నిర్ణయం తీసుకున్నారు. సరిగ్గా ఐపీఎల్-2023 ప్రారంభ తేదీనే (మార్చి 31) సౌతాఫ్రికా నెదర్లాండ్స్తో తొలి వన్డే, అనంతరం ఏప్రిల్ 2న రెండో వన్డే ఆడాల్సి ఉంది. ఈ ఏడాది చివర్లో జరిగే వన్డే ప్రపంచ కప్కు నేరుగా అర్హత సాధించాలంటే దక్షిణాఫ్రికా ఈ రెండు వన్డేల్లో గెలిచి తీరాలి. అందుకే క్రికెట్ సౌతాఫ్రికా స్టార్ ఆటగాళ్లనంతా ఈ మ్యాచ్లకు అందుబాటులో ఉండాలని కోరింది. ఇది మ్యాండేటరీ కాకపోయినప్పటికీ.. జాతీయ జట్టు అవసరాల దృష్ట్యా సౌతాఫ్రికా క్రికెటర్లు ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. మిల్లర్తో పాటు సఫారీ ఆటగాళ్లు ఎయిడెన్ మార్క్రమ్ (ఎస్ఆర్హెచ్), హెన్రిచ్ క్లాసెన్ (ఎస్ఆర్హెచ్), మార్కో జన్సెన్ (ఎస్ఆర్హెచ్), అన్రిచ్ నోర్జే, లుంగి ఎంగిడి (ఢిల్లీ క్యాపిటల్స్), ట్రిస్టన్ స్టబ్స్, డెవాల్డ్ బ్రెవిస్ (ముంబై ఇండియన్స్), క్వింటన్ డికాక్ (లక్నో), రబాడ (పంజాబ్) ఐపీఎల్-2023లో వారాడే ఒకటి, రెండు మ్యాచ్లకు దూరమయ్యే అవకాశం ఉంది. కాగా, గతేడాది ఐపీఎల్కు ముందు కూడా సౌతాఫ్రికా క్రికెటర్లకు ఇలాంటి పరిస్థితే ఏర్పడింది. అయితే అప్పుడు రబాడ, ఎంగిడి, జన్సెన్, మార్క్రమ్, డస్సెన్లు జాతీయ జట్టుకు కాకుండా ఐపీఎల్కు ప్రధమ ప్రాధాన్యత ఇచ్చి లీగ్లో ఆడారు. అప్పుడు సౌతాఫ్రికా.. బంగ్లాదేశ్తో టెస్ట్ సిరీస్ ఆడింది. ఐపీఎలా లేక జాతీయ జట్టా అన్న నిర్ణయాన్ని క్రికెట్ సౌతాఫ్రికా ఆటగాళ్లకే వదిలేయడంతో వారు అప్పట్లో ఐపీఎల్కే ఓటేశారు. -
కిల్లర్ మిల్లర్ ఊచకోత.. పోలార్డ్ విధ్వంసం
పాకిస్తాన్ సూపర్ లీగ్-2023లో బ్యాటర్ల హవా కొనసాగుతుంది. ఇవాళ (ఫిబ్రవరి 19) ఇస్లామాబాద్ యునైటెడ్తో జరిగిన మ్యాచ్లో ముల్తాన్ సుల్తాన్స్ రెచ్చిపోయారు. తొలుత బ్యాటింగ్ చేసిన సుల్తాన్స్.. కెప్టెన్ మహ్మద్ రిజ్వాన్ (38 బంతుల్లో 50; 5 ఫోర్లు, సిక్స్), రిలీ రొస్సో (30 బంతుల్లో 36; 2 ఫోర్లు, 2 సిక్సర్లు), డేవిడ్ మిల్లర్ (25 బంతుల్లో 52; 3 ఫోర్లు, 4 సిక్సర్లు), పోలార్డ్ (21 బంతుల్లో 32 నాటౌట్; 4 ఫోర్లు, సిక్స్) శివాలెత్తడంతో నిర్ణీత ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 190 పరుగుల భారీ స్కోర్ చేసింది. Killer Miller time 🤩#HBLPSL8 | #SabSitarayHumaray | #MSvIU pic.twitter.com/7bfAEfTRAp — PakistanSuperLeague (@thePSLt20) February 19, 2023 ఈ ఇన్నింగ్స్లో రిజ్వాన్, రొస్సో ఓ మోస్తరుగా బ్యాట్ ఝులిపించగా.. మిల్లర్, పోలార్డ్లు ఆకాశమే హద్దుగా చెలరేగిపోయారు. మిల్లర్ 4 సిక్సర్లు, 3 ఫోర్లతో ప్రత్యర్ధి బౌలర్లను ఊచకోత కోస్తే.. పోలార్డ్ చిన్న సైజ్ విధ్వంసమే సృష్టించాడు. ఇన్నింగ్స్ 15వ ఓవర్లో మిల్లర్ హ్యాట్రిక్ సిక్సర్లతో విరుచుకుపడితే.. ఇన్నింగ్స్ ఆఖరి మూడు బంతులను పోలీ బౌండరీలకు తరలించాడు. సుల్తాన్స్ ఇన్నింగ్స్లో మసూద్ (3) ఒక్కడే నిరాశపరిచాడు. ఇస్లామాబాద్ బౌలర్లలో రయీస్, మహ్మద్ వసీం జూనియర్, షాదాబ్ ఖాన్, టామ్ కర్రన్ తలో వికెట్ పడగొట్టారు. A hat-trick of boundaries ⚡ The perfect finish for @MultanSultans 🙌#HBLPSL8 | #SabSitarayHumaray | #MSvIU pic.twitter.com/5HcJQpxs8h — PakistanSuperLeague (@thePSLt20) February 19, 2023 191 పరుగుల భారీ లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన ఇస్లామాబాద్.. అబ్బాస్ అఫ్రిది (4/22), మహ్మద్ ఇలియాస్ (2/12), ఇహసానుల్లా (2/19), ఉసామా మిర్ (2/33) చెలరేగడంతో 17.5 ఓవర్లలో 138 పరుగలకు ఆలౌటై, 52 పరుగుల తేడాతో ఓటమిపాలైంది. ఇస్లామాబాద్ ఇన్నింగ్స్లో డస్సెన్ (49) టాప్ స్కోరర్గా నిలువగా.. హసన్ (21), మున్రో (31), ఆజం ఖాన్ (16) మాత్రమే రెండంకెల స్కోర్ చేశారు. ఇదిలా ఉంటే, ఈ సీజన్లో ముల్తాన్ సుల్తాన్స్ హవా కొనసాగుతుంది. తొలి మ్యాచ్లో లాహోర్ ఖలందర్స్ చేతిలో ఓడిన ఈ జట్టు, ఆతర్వాత వరుసగా హ్యాట్రిక్ విజయాలు సాధించింది. సుల్తాన్స్ కెప్టెన్ రిజ్వాన్ ఈ సీజన్లో ఇప్పటికే మూడు హాఫ్ సెంచరీలు సాధించి సూపర్ ఫామ్లో ఉండగా.. రిలీ రొస్సో 3 మ్యాచ్ల్లో రెండు మెరుపు హాఫ్ సెంచరీలతో విరుచుకుపడ్డాడు. ఈ మ్యాచ్తో కిల్లర్ మిల్లర్ కూడా ఫామ్లోకి రావడంతో తదుపరి లీగ్లో ప్రత్యర్ధి బౌలర్లకు కష్టాలు తప్పవని విశ్లేషకులు అంటున్నారు. లీగ్లో ఇవాళ జరుగబోయే మరో మ్యాచ్లో కరాచీ కింగ్స్, లాహోర్ ఖలందర్స్ తలపడనున్నాయి. -
SA20 2023: చెలరేగిన బట్లర్, మిల్లర్.. సన్రైజర్స్కు భంగపాటు
Sunrisers Eastern Cape vs Paarl Royals: సౌతాఫ్రికా టీ20 లీగ్లో గత మ్యాచ్లో భారీ విజయం సాధించిన సన్రైజర్స్ ఈస్టర్న్ కేప్ తాజా మ్యాచ్లో ఓడిపోయింది. పర్ల్ రాయల్స్ చేతిలో 5 వికెట్ల తేడాతో పరాజయం పాలైంది. జోస్ బట్లర్, డేవిడ్ మిల్లర్ మెరుపు ఇన్నింగ్స్తో రాయల్స్ జట్టును గెలిపించారు. సెయింట్ జార్జ్ పార్క్ వేదికగా మంగళవారం జరిగిన మ్యాచ్లో టాస్ గెలిచిన సన్రైజర్స్ తొలుత బ్యాటింగ్ ఎంచుకుంది. ఓపెనర్లు రాసింగ్టన్(4), జోర్డాన్ హెర్మాన్(4) విఫలం కాగా.. వన్డౌన్ బ్యాటర్ స్మట్స్ జట్టును ఆదుకున్నాడు. 49 బంతుల్లో 9 ఫోర్ల సాయంతో 65 పరుగులు సాధించాడు. మిగతా బ్యాటర్లలో ఎవరూ కనీసం 20 పరుగుల మార్కును అందుకోలేకపోయారు. దీంతో నిర్ణీత 20 ఓవర్లలో మార్కరమ్ బృందం 7 వికెట్లు నష్టపోయి 130 పరుగులు చేసింది. బట్లర్ హాఫ్ సెంచరీ లక్ష్య ఛేదనకు దిగిన రాయల్స్కు ఆరంభంలోనే ఎదురుదెబ్బ తగిలింది. మార్కో జాన్సెన్ జేసన్ రాయ్ను 8 పరుగులకే పెవిలియన్కు పంపాడు. ఆ తర్వాత వరుసగా వికెట్లు పడ్డా.. మరో ఓపెనర్ జోస్ బట్లర్ నిలకడైన ప్రదర్శన కనబరిచాడు. మిల్లర్ కెప్టెన్ ఇన్నింగ్స్ ఈ వికెట్ కీపర్ బ్యాటర్ 39 బంతుల్లో 51 పరుగులతో రాణించాడు. కెప్టెన్ డేవిడ్ మిల్లర్ 23 బంతుల్లో 4 సిక్స్ల సాయంతో 37 పరుగులతో మెరుపు ఇన్నింగ్స్ ఆడి ఆఖరి వరకు అజేయంగా నిలిచాడు. వీరిద్దరు చెలరేగడంతో రాయల్స్ జట్టు 18.5 ఓవర్లలోనే టార్గెట్ను ఛేజ్ చేసింది. రాయల్స్ సారథి డేవిడ్ మిల్లర్ను ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు వరించింది. ఏ స్థానంలో ఉన్నాయంటే కాగా ఈ ఓటమితో సన్రైజర్స్ ఖాతాలో నాలుగో పరాజయం నమోదైంది. ఇక ఇప్పటి వరకు ఆడిన ఎనిమిది మ్యాచ్లలో రైజర్స్ నాలుగు గెలిచి.. నాలుగు ఓడింది. 17 పాయింట్లతో ప్రస్తుతం పట్టికలో రెండో స్థానంలో ఉంది. ఇక రాయల్స్ సైతం 17 పాయింట్లు సాధించగా.. రైజర్స్(0.508) కంటే రన్రేటు(0.050) పరంగా వెనుకబడి మూడో స్థానంలో ఉంది. చదవండి: మైదానంలో ‘కింగ్’లైనా.. ‘రాణుల’ ప్రేమకు తలవంచిన వాళ్లే! Shubman Gill: 'చాలా క్లిష్టమైన ప్రశ్న.. కోహ్లికే నా ఓటు' 𝙈𝙖𝙟𝙚𝙨𝙩𝙞𝙘 𝙈𝙞𝙡𝙡𝙚𝙧 👀the super hits of the Royal's skipper More action from the #SA20League 👉 LIVE on #JioCinema, #Sports18 & @ColorsTvTamil 📲#SA20 #SA20onJioCinema #SA20onSports18 pic.twitter.com/VsJiM9uyKS — JioCinema (@JioCinema) January 24, 2023 -
బేబీ ఏబీడీ విధ్వంసం.. ముంబై ఇండియన్స్ టీమ్ శుభారంభం
మినీ ఐపీఎల్గా పరిగణించబడే సౌతాఫ్రికా టీ20 లీగ్లో ముంబై ఇండియన్స్ యాజమాన్యం కొనుగోలు చేసిన ఎంఐ కేప్టౌన్ టీమ్ శుభారంభం చేసింది. లీగ్ ఇనాగురల్ మ్యాచ్లో రాజస్థాన్ రాయల్స్ కొనుగోలు చేసిన పార్ల్ రాయల్స్ను ఢీకొట్టిన కేప్టౌన్ జట్టు.. 8 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. ఈ మ్యాచ్లో టాస్ గెలిచి తొలుత బౌలింగ్ చేసిన కేప్టౌన్.. జోఫ్రా ఆర్చర్ (3/27), ఓలీ స్టోన్ (2/31), డుయన్ జన్సెన్ (1/16) విజృంభించడంతో నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 142 పరుగుల నామమాత్రపు స్కోర్కే పరిమితమైంది. రాయల్స్ ఇన్నింగ్స్లో జోస్ బట్లర్ (42 బంతుల్లో 51; 6 ఫోర్లు, సిక్స్), కెప్టెన్ డేవిడ్ మిల్లర్ (31 బంతుల్లో 42; 4 ఫోర్లు, సిక్స్) మాత్రమే రాణించారు. అనంతరం 143 పరుగుల లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన కేప్టౌన్ టీమ్.. బేబీ ఏబీడీ డెవాల్డ్ బ్రెవిస్ (41 బంతుల్లో 70 నాటౌట్; 4 ఫోర్లు, 5 సిక్సర్లు) విధ్వంసం ధాటికి 15.3 ఓవర్లలో కేవలం 2 వికెట్లు మాత్రమే కోల్పోయి లక్ష్యాన్ని ఛేదించింది. ఓపెనర్గా బరిలోకి దిగిన బ్రెవిస్ అజేయమైన అర్ధశతకంతో రాయల్స్ బౌలింగ్ను తునాతునకలు చేయగా.. మరో ఓపెనర్ ర్యాన్ రికెల్టన్ (33 బంతుల్లో 42; 5 ఫోర్లు, సిక్స్) పర్వాలేదనిపించాడు. వన్డౌన్లో బ్యాటింగ్కు దిగిన సామ్ కర్రన్.. 16 బంతుల్లో 2 సిక్సర్లు, ఫోర్ సాయంతో 20 పరుగులు చేసి ఔటయ్యాడు. బ్రెవిస్.. రస్సీ వాన్ డర్ డస్సెన్ (3 బంతుల్లో 8 నాటౌట్; సిక్స్) సాయంతో మ్యాచ్ను ముగించాడు. రాయల్స్ బౌలర్లలో కోడి యుసఫ్, రామోన్ సిమండ్స్కు తలో వికెట్ లభించింది. లీగ్లో తదుపరి మ్యాచ్ డర్బన్ సూపర్ జెయింట్స్ (లక్నో సూపర్ జెయింట్స్)-జొహనెస్బర్గ్ సూపర్ కింగ్స్ (చెన్నై సూపర్ కింగ్స్) జట్ల మధ్య ఇవాళ (జనవరి 11) జరుగనుంది. భారతకాలమానం ప్రకారం ఈ మ్యాచ్ రాత్రి 9 గంటలకు ప్రారంభంకానుంది. -
ప్రొటీస్ పరాజయం.. స్పష్టంగా కనిపించిన మిల్లర్ లోటు
టి20 ప్రపంచకప్లో భాగంగా సూపర్-12 గ్రూఫ్-2లో గురువారం పాకిస్తాన్, సౌతాఫ్రికా మధ్య మ్యాచ్ జరిగిన సంగతి తెలిసిందే. ఈ మ్యాచ్లో సౌతాఫ్రికా డక్వర్త్ లూయిస్ పద్దతిలో 33 పరుగుల తేడాతో పరాజయం పాలైంది. దక్షిణాఫ్రికా ఇన్నింగ్స్లో 9వ ఓవర్ వద్ద మ్యాచ్కు వరుణుడు అడ్డుపడ్డాడు. 20 నిమిషాల పాటు మ్యాచ్ నిలిచిపోవడంతో డక్వర్త్ లూయిస్ ప్రకారం 14 ఓవర్లకు కుదించి 142 పరుగుల టార్గెట్ను నిర్దేశించారు. అయితే 69 పరుగులకే నాలుగు కీలక వికెట్లు కోల్పోయి కష్టాల్లో ఉన్న దక్షిణాఫ్రికా ఒత్తిడిలో మరోసారి చిత్తైంది. క్లాసెన్ 15, ట్రిస్టన్ స్టబ్స్ 18 పరుగులతో కాసేపు పోరాడినప్పటికి రన్రేట్ పెరగడం.. చేయాల్సిన పరుగులు ఎక్కువగా ఉండడంతో ఏ దశలో లక్ష్యం దిశగా సాగలేకపోయింది. చివరకు నిర్ణీత 14 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 108 పరుగులు మాత్రమే చేయగలిగింది. అయితే టీమిండియాతో జరిగిన మ్యాచ్లో ప్రొటిస్ను గెలిపించిన కిల్లర్ మిల్లర్ గాయంతో పాక్తో మ్యాచ్కు దూరమయ్యాడు. అతని స్థానంలో వచ్చిన క్లాసెన్ పెద్దగా ప్రభావం చూపలేకపోయాడు. ఇక మిల్లర్ మ్యాచ్ ఆడి ఉంటే ఫలితం మరోలా ఉండేదని అభిమానులు అభిప్రాయపడ్డారు. సౌతాఫ్రికా గెలుస్తుందో లేదో తెలియదు కానీ ఒంటిచేత్తో మ్యాచ్ ఫలితాన్ని మార్చగల సత్తా మిల్లర్కు ఉందని పేర్కొన్నారు. అతను జట్టులో లేని లోటు స్పష్టంగా కనిపించిందన్నారు. ఈ విజయంతో పాకిస్తాన్ తన సెమీస్ ఆశలను నిలుపుకుంది. అయితే జింబాబ్వేతో మ్యాచ్లో టీమిండియా, నెదర్లాండ్స్తో మ్యాచ్లో సౌతాఫ్రికా ఓడిపోవాలి అదే సమయంలో బంగ్లాదేశ్పై విజయం సాధిస్తేనే పాకిస్తాన్ సెమీస్ చేరుతుంది. చదవండి: Pak Vs SA: పరిగెత్తడంలో బద్దకం; రెండుసార్లు తప్పించుకొని చివరకు -
విరాట్ కోహ్లి తొలిసారిగా.. ప్రతిష్టాత్మక అవార్డు రేసులో.. పోటీగా రజా!
Virat Kohli: అక్టోబర్ నెలకు గానూ ఐసీసీ ప్లేయర్ ఆఫ్ది మంత్ అవార్డుకు నామినేట్ అయిన ఆటగాళ్లను అంతర్జాతీయ క్రికెట్ మండలి గురువారం ప్రకటించింది. ఈ ప్రతిష్టాత్మక అవార్డుకు షార్ట్లిస్ట్ చేసిన జాబితాలో టీమిండియా స్టార్ ఆటగాడు విరాట్ కోహ్లి, దక్షిణాఫ్రికా క్రికెటర్ డేవిడ్ మిల్లర్, జింబాబ్వే ఆల్ రౌండర్ సికిందర్ రజాకు చోటు దక్కింది. విరాట్ కోహ్లి కోహ్లి ప్రస్తుతం అద్భుతమైన ఫామ్లో ఉన్నాడు. టీ20 ప్రపంచకప్-2022లో అర్ధసెంచరీలతో చెలరేగుతున్నాడు. తొలి మ్యాచ్లో పాకిస్తాన్పై 82(నాటౌట్) కీలక ఇన్నింగ్స్ ఆడిన కింగ్.. అనంతరం నెదర్లాండ్స్, బంగ్లదేశ్పై కూడా అర్ధసెంచరీలతో అదరగొట్టాడు. ఇక ఇప్పటి వరకు ఈ మెగా ఈవెంట్లో నాలుగు మ్యాచ్లు ఆడిన విరాట్.. 220 పరుగులతో టోర్నీ టాప్ స్కోరర్గా ఉన్నాడు. అదే విధంగా ఆక్టోబర్లో కోహ్లి 150.73 స్ట్రైక్ రేటుతో 205 పరుగులు సాధించాడు. డేవిడ్ మిల్లర్ డేవిడ్ మిల్లర్ గత నెలలో భారత్తో జరిగిన టీ20 మ్యాచ్లో విధ్వంసం సృష్టించాడు. కేవలం 47 బంతుల్లోనే 106 పరుగులు సాధించి ఆజేయంగా నిలిచాడు. అదే విధంగా టీ20 ప్రపంచకప్లో భాగంగా టీమిండియాతో జరిగిన మ్యాచ్లోను 59 పరుగులు సాధించి ఆజేయంగా నిలిచాడు. గత నెలలో ఓవరాల్గా ఏడు ఇన్నింగ్స్లలో మిల్లర్ 303 పరుగులు చేశాడు. సికిందర్ రజా ఈ జింబాబ్వే స్టార్ ఆల్ రౌండర్ భీకర ఫామ్లో ఉన్నాడు. బ్యాట్తోను బాల్తోను అదరగొడుతున్నాడు. టీ20 ప్రపంచకప్-2022లో భాగంగా ఐర్లాండ్తో జరిగిన మ్యాచ్లో 82 పరుగులతో రజా తుపాన్ ఇన్నింగ్స్ ఆడాడు. అదే విధంగా స్కాట్లాండ్పై కూడా 40 పరుగులతో కీలక ఇన్నింగ్స్ ఆడాడు. ఇక పాకిస్తాన్పై జింబాబ్వే చారిత్రాత్మక విజయం సాధించడంలో రజా కీలక పాత్ర పోషించాడు. ఈ మ్యాచ్లో రజా మూడు వికెట్లు పడగొట్టాడు. అదే విధంగా వెస్టిండీస్తో మ్యాచ్లో కూడా రజా మూడు వికెట్లు సాధించాడు. చదవండి: Ind Vs Ban: కోహ్లి ఫేక్ ఫీల్డింగ్ చేశాడంటూ ఆరోపణలు.. లేదంటే విజయం తమదేనన్న బంగ్లా క్రికెటర్ -
చేజింగ్ మాస్టర్.. 'కిల్లర్' మిల్లర్
టి20 ప్రపంచకప్లో సూపర్-12లో టీమిండియాపై విజయంతో సౌతాఫ్రికా గ్రూఫ్-2లో పాయింట్ల పట్టికలో అగ్రస్థానానికి చేరుకుంది. సౌతాఫ్రికా విజయంలో కీలకపాత్ర కిల్లర్ మిల్లర్దే. కాగా టి20 ప్రపంచకప్కు ముందు టీమిండియా గడ్డపై ఆడిన టి20 సిరీస్లో మిల్లర్ విశ్వరూపం చూపించాడు. తాను ఫామ్లో ఉంటే ఎంత డేంజర్ అనేది అర్థమయ్యేలా చేశాడు. తాజాగా టి20 ప్రపంచకప్లో మిల్లర్తో పాటు మార్క్రమ్ కూడా కీలక ఇన్నింగ్స్ ఆడినప్పటికి చివరి వరకు నాటౌట్గా నిలిచి అర్థసెంచరీతో జట్టును గెలిపించింది మాత్రం మిల్లరే. అందుకే అతన్ని అందరూ కిల్లర్ మిల్లర్ అని అభివర్ణిస్తారు. ►తాజాగా టీమిండియాపై విజయంతో మిల్లర్ టి20 క్రికెట్లో ఒక రికార్డు అందుకున్నాడు. 2022లో ఇప్పటివరకు సౌతాఫ్రికా చేజింగ్కు దిగిన సందర్భాల్లో మిల్లర్ 16 ఇన్నింగ్స్ల్లో 14సార్లు నాటౌట్గా నిలిచి జట్టును గెలిపించడం విశేషం. అందుకే మిల్లర్ను చేజింగ్ మాస్టర్గా పేర్కొన్నారు క్రికెట్ అభిమానులు. ►ఇక 2011 వన్డే వరల్డ్కప్ తర్వాత ఐసీసీ మేజర్ టోర్నీలో సౌతాఫ్రికా టీమిండియాను ఓడించడం మళ్లీ ఇదే. 2011 వన్డే వరల్డ్కప్లో నాగ్పూర్ వేదికగా జరిగిన మ్యాచ్లో టీమిండియాను సౌతాఫ్రికా ఓడించింది. తాజాగా ఐదు వికెట్ల తేడాతో భారత్ను చిత్తు చేసింది. చదవండి: టీమిండియా ఓటమి.. 'Bye-Bye Pakistan' -
అశ్విన్.. మిల్లర్ను వదిలేసి తప్పుచేశావ్
మన్కడింగ్(నాన్స్ట్రైకింగ్ ఎండ్ రనౌట్) అనగానే మొదటగా గుర్తుకువచ్చేది రవిచంద్రన్ అశ్విన్. ఐపీఎల్లో జాస్ బట్లర్ను మన్కడింగ్ చేయడం ద్వారా అశ్విన్ పెద్ద వివాదానికే తెర లేపాడు. ఆ తర్వాత మన్కడింగ్ను చట్టబద్ధం చేస్తూ రూల్ తీసుకురావడంతో అశ్విన్ చర్యను సమర్థించారు. తాజాగా టి20 ప్రపంచకప్లో భాగంగా ఆదివారం సౌతాఫ్రికాతో మ్యాచ్లో టీమిండియా స్పిన్నర్ అశ్విన్కు మరోసారి మన్కడింగ్ చేసే అవకాశం వచ్చింది. అది కూడా ప్రొటిస్ విజయంలో కీలకపాత్ర పోషించిన డేవిడ్ మిల్లర్ది. అయితే ఈసారి రనౌట్ చేయకుండా కేవలం హెచ్చరికతోనే వదిలిపెట్టాడు. ఇన్నింగ్స్ 18వ ఓవర్లో ఇది చోటుచేసుకుంది. ఆ ఓవర్లో అశ్విన్ చివరి బంతిని వేయడానికి ముందే నాన్స్ట్రైక్ ఎండ్లో ఉన్న మిల్లర్ క్రీజు బయట ఉన్నాడు. ఇది గమినించిన అశ్విన్ బంతి వేయడం ఆపేసి మిల్లర్కు..''యూ ఆర్ ఔట్ ఆఫ్ క్రీజ్'' అంటూ వార్నింగ్ ఇచ్చాడు. అయితే రూల్స్ ప్రకారం మిల్లర్ను రనౌట్ చేసే అవకాశం వచ్చినా అశ్విన్ వదిలేశాడు. ఇది క్రీడాస్పూర్తిగా పరిగణించినప్పటికి అశ్విన్ చర్యపై మాత్రం టీమిండియా క్రికెట్ ఫ్యాన్స్ సంతోషంగా లేరు. ఎందుకంటే అప్పటికే మిల్లర్ తన జట్టును విజయంవైపు నడిపిస్తున్నాడు. కిల్లర్ మిల్లర్గా గుర్తింపు పొందిన అతను ఉంటే మ్యాచ్ కచ్చితంగా గెలిపిస్తాడు. ఈ నేపథ్యంలోనే మిల్లర్ను రనౌట్ చేయాల్సింది అని అభిమానులు పేర్కొన్నారు. ఇది కూడా వాస్తవమే. ఎందుకంటే ఆ తర్వాత మిల్లర్ మూడు ఫోర్లు కొట్టి సౌతాఫ్రికాను విజయతీరాలకు చేర్చాడు. ఒకవేళ అశ్విన్ మిల్లర్ను మన్కడింగ్ చేసి ఉంటే ఫలితం కచ్చితంగా వేరుగా ఉండేది. అందుకే ఫ్యాన్స్..'' ఛ.. అశ్విన్ మిల్లర్ను వదిలేసి పెద్ద తప్పు చేశావ్'' అంటూ సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున కామెంట్స్ చేశారు. View this post on Instagram A post shared by ICC (@icc) చదవండి: రోహిత్ మరీ ఇంత బద్దకమా.. -
Ind Vs SA: స్పిన్నర్ల మాయాజాలం.. టీమిండియాదే సిరీస్! గిల్ బ్యాడ్లక్!
South Africa tour of India, 2022 - India vs South Africa, 3rd ODI: సౌతాఫ్రికాతో నిర్ణయాత్మక మూడో వన్డేలో టీమిండియా ఘన విజయం సాధించింది. మూడు మ్యాచ్ల సిరీస్లో భాగంగా ఢిల్లీ వేదికగా జరిగిన ఆఖరి వన్డేలో ఏడు వికెట్ల తేడాతో జయభేరి మోగించింది. తద్వారా 2-1తో ధావన్ సేన ట్రోఫీని కైవసం చేసుకుంది. ఇక అంతకు ముందు టీ20 సిరీస్ను సైతం రోహిత్ సారథ్యంలోని భారత జట్టు సొంతం చేసుకున్న విషయం తెలిసిందే. దీంతో భారత పర్యటనకు వచ్చిన సఫారీలు ఈసారి ఒట్టి చేతులతోనే వెనుదిరిగినట్లయింది. చెలరేగిన బౌలర్లు టాస్ గెలిచి తొలుత ఫీల్డింగ్ ఎంచుకున్న టీమిండియాకు బౌలర్లు శుభారంభం అందించారు. మహ్మద్ సిరాజ్, వాషింగ్టన్ సుందర్ ప్రొటిస్ ఓపెనర్లు జానేమన్ మలన్(15), క్వింటన్ డికాక్(6) వికెట్లు పడగొట్టి ఆదిలోనే షాకిచ్చారు. అదే విధంగా షాబాజ్ అహ్మద్, కుల్దీప్ యాదవ్ సైతం స్పిన్ మాయాజాలంతో సౌతాఫ్రికా బ్యాటర్లకు చుక్కలు చూపించారు. ఈ నలుగురూ చెలరేగడంతో దక్షిణాఫ్రికా 27.1 ఓవర్లకే చేతులెత్తేసింది. కేవలం 99 పరుగులు మాత్రమే చేయగలిగింది. హెన్రిచ్ క్లాసెన్ 34 పరుగులతో దక్షిణాఫ్రికా ఇన్నింగ్స్లో టాప్ స్కోరర్గా నిలిచాడు. పాపం గిల్.. స్వల్ప లక్ష్యంతో బరిలోకి దిగిన టీమిండియా.. తొలుత రనౌట్ రూపంలో ఓపెనర్, కెప్టెన్ శిఖర్ ధావన్ వికెట్ కోల్పోయింది. అయితే, మరో ఓపెనర్ శుబ్మన్ గిల్.. వన్డౌన్ బ్యాటర్ ఇషాన్ కిషన్(10)తో కలిసి స్కోరు బోర్డును పరుగులు పెట్టించాడు. అయితే, దురదృష్టవశాత్తూ లుంగీ ఎంగిడి బౌలింగ్లో 19వ ఓవర్ రెండో బంతికి గిల్ ఎల్బీడబ్ల్యూగా వెనుదిరిగాడు. అప్పటికి అతడు సాధించిన పరుగులు 49. అర్ధ సెంచరీకి అడుగు దూరంలో నిలిచిపోయాడు. సిక్సర్తో లాంఛనం పూర్తి ఇక సంజూ శాంసన్(2, నాటౌట్)తో కలిసి శ్రేయస్ అయ్యర్(28, నాటౌట్) లాంఛనం పూర్తి చేశాడు. సిక్సర్ బాది టీమిండియా విజయం ఖరారు చేశాడు. గిల్(57 బంతుల్లో 49 పరుగులు), శ్రేయస్ అయ్యర్(23 బంతుల్లో 28 పరుగులు) రాణించడంతో 19.1 ఓవర్లలోనే ధావన్ సేన లక్ష్యాన్ని ఛేదించింది. కుల్దీప్ యాదవ్ ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్గా నిలిచాడు. భారత్ వర్సెస్ సౌతాఫ్రికా మూడో వన్డే మ్యాచ్ స్కోర్లు: సౌతాఫ్రికా- 99 (27.1 ఓవర్లు) భారత్- 105/3 (19.1 ఓవర్లు) ఏడు వికెట్ల తేడాతో టీమిండియా విజయం మూడు మ్యాచ్ల వన్డే సిరీస్ ధావన్ సేన కైవసం ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్: కుల్దీప్ యాదవ్(4.1 ఓవర్లలో 18 పరుగులు మాత్రమే ఇచ్చి 4 వికెట్లు) చదవండి: హ్యూమా ఖురేషీతో కలిసి చిందేసిన టీమిండియా కెప్టెన్ Ind Vs SA: వన్డేల్లో సౌతాఫ్రికా సరికొత్త ‘రికార్డు’.. ధావన్ పరిస్థితి ఇదీ అంటూ వసీం జాఫర్ ట్రోల్! Vice-captain @ShreyasIyer15 finishes off in style! 💥 An all-around performance from #TeamIndia to win the final #INDvSA ODI and clinch the series 2⃣-1⃣. 👏👏 Scorecard ▶️ https://t.co/fi5L0fWg0d pic.twitter.com/7PwScwECod — BCCI (@BCCI) October 11, 2022 -
Ind Vs SA: వన్డేల్లో సౌతాఫ్రికా సరికొత్త ‘రికార్డు’.. ధావన్ పరిస్థితి ఇదీ అంటూ!
India vs South Africa, 3rd ODI: ఇప్పటికే టీ20 సిరీస్ను ఆతిథ్య జట్టుకు సమర్పించుకున్న దక్షిణాఫ్రికా.. నిర్ణయాత్మక మూడో వన్డేలో భారత్తో పోరాడుతోంది. మూడు మ్యాచ్ల సిరీస్లో భాగంగా ఢిల్లీలోని అరుణ్జైట్లీ స్టేడియంలో మంగళవారం ధావన్ సేనతో పోటీ పడుతోంది. కాగా ఈ మ్యాచ్లో ప్రొటిస్ జట్టుకు డేవిడ్ మిల్లర్ కెప్టెన్గా వ్యవహరించడం విశేషం. ఇక ఈ సిరీస్లో దక్షిణాఫ్రికా తమ సారథిని మార్చడం ఇది మూడోసారి. ముచ్చటగా మూడో కెప్టెన్ మొదటి వన్డేకు రెగ్యులర్ కెప్టెన్ తెంబా బవుమా సారథ్యం వహించగా.. రెండో వన్డేలో కేశవ్ మహరాజ్ కెప్టెన్సీ చేశాడు. బవుమా అనారోగ్య కారణాల వల్ల మిగిలిన రెండు మ్యాచ్లకు దూరం కాగా.. కేశవ్ మహరాజ్ సైతం విశ్రాంతి కోరుకున్నట్లు సమాచారం. దీంతో మిల్లర్ కెప్టెన్గా వచ్చాడు. ఈ నేపథ్యంలో వన్డే ఫార్మాట్లో సౌతాఫ్రికా పేరిట సరికొత్త రికార్డు నమోదైంది. అంతర్జాతీయ క్రికెట్లో మూడు మ్యాచ్ల వన్డే సిరీస్లో ఒక్కో మ్యాచ్కు ఒక్కో కెప్టెన్ రావడం ఇదే మొదటిసారి. ఇక సౌతాఫ్రికా ఇలా కెప్టెన్లను మార్చడంపై టీమిండియా మాజీ క్రికెటర్ వసీం జాఫర్ తనదైన శైలిలో స్పందించాడు. ‘‘టాస్ సమయంలో.. ఒక్కో గేమ్లో సౌతాఫ్రికాకు ఒక్కో కెప్టెన్ వస్తున్నపుడు శిఖర్ ధావన్ పరిస్థితి ఇది’’ అంటూ ఓ ఫన్నీ వీడియోను షేర్ చేశాడు. Shikhar Dhawan at the toss with a different SA captain every game 😄 #INDvSA pic.twitter.com/28iE883xSW — Wasim Jaffer (@WasimJaffer14) October 11, 2022 కుప్పకూలిన టాపార్డర్ సిరీస్ డిసైడర్ మ్యాచ్లో టాస్ గెలిచిన భారత్ తొలుత బౌలింగ్ ఎంచుకుంది. ఈ క్రమంలో బ్యాటింగ్కు దిగిన మిల్లర్ బృందానికి ఆరంభంలోనే భారత బౌలర్లు చుక్కలు చూపించారు. దీంతో ప్రొటిస్ టాపార్డర్ కుప్పకూలింది. క్లాసెన్ 34 పరుగులతో టాప్ స్కోరర్గా నిలిచాడు. వాషింగ్టన్ సుందర్, మహ్మద్ సిరాజ్, షాబాజ్ అహ్మద్ రెండేసి వికెట్లు పడగొట్టగా.. కుల్దీప్ యాదవ్ 4 వికెట్లు కూల్చి సౌతాఫ్రికా బ్యాటింగ్ ఆర్డరర్ పతనాన్ని శాసించాడు. దీంతో 27.1 ఓవర్లలో 99 పరుగులు మాత్రమే చేసి ప్రొటిస్ జట్టు ఆలౌట్ అయింది. చదవండి: Central Contract for 2022- 23: జాసన్ రాయ్కు షాకిచ్చిన ఇంగ్లండ్ క్రికెట్ బోర్డు Women's Asia Cup 2022: డిఫెండింగ్ చాంపియన్ అవుట్! భారత్, పాక్, శ్రీలంకతో పాటు థాయ్లాండ్.. -
చిన్నారి మరణం.. శోకసంద్రంలో డేవిడ్ మిల్లర్!
సౌతాఫ్రికా విధ్వంసకర బ్యాటర్ డేవిడ్ మిల్లర్ ఇన్స్టాగ్రామ్లో పెట్టిన ఒక వార్త సోషల్ మీడియాలో వైరల్గా మారింది. క్యాన్సర్తో పోరాడుతూ శనివారం మరణించిన చిన్నారితో తన అనుబంధాన్ని గుర్తుచేసుకున్న మిల్లర్ ఒక వీడియోనూ షేర్ చేశాడు.'' మై లిటిల్ రాక్స్టార్.. నీ ఆత్మకు శాంతి చేకూరాలి. నిన్నెప్పుడూ ప్రేమిస్తూనే ఉంటా'' అంటూ క్యాప్షన్ జత చేశాడు. అయితే చనిపోయిన ఆ చిన్నారి డేవిడ్ మిల్లర్ కూతురేనంటూ వార్తలు వస్తున్నాయి. క్యాన్సర్తో పోరాడుతూ మరణించిందని కొన్ని మీడియా సంస్థలు పేర్కొన్నాయి. వాస్తవానికి ఆ చిన్నారి డేవిడ్ మిల్లర్ కూతురు కాదని.. అతడి స్నేహితుడి కూతురు అని మరికొందరు పేర్కొన్నారు. ట్విటర్లోనూ ఒక అభిమాని ఇదే అంశంపై స్పందిస్తూ.. ''చనిపోయింది డేవిడ్ మిల్లర్ కూతురు కాదని.. ఆమె అతడి క్లోజ్ ఫ్రెండ్ కూతురు'' అని ట్వీట్ చేశాడు. అయితే ఆ చిన్నారి మిల్లర్కి వీరాభిమాని కావడం.. పాపతో ఉన్న అనుబంధం కారణంగా డేవిడ్ అతను ఎమోషన్కు గురయ్యాడని తెలుస్తోంది. టీమిండియాతో వన్డే సిరీస్లో భాగంగా ప్రస్తుతం డేవిడ్ మిల్లర్ ఇక్కడే ఉన్నాడు. ఒకవేళ చనిపోయింది తన కూతురు అయితే సౌతాఫ్రికాకు తిరుగు ప్రయాణమవుతున్న విషయాన్ని కచ్చితంగా చెప్పేవాడు. కానీ అలాంటి ప్రకటన ఏదీ రాలేదు కనుక ఆ చిన్నారి డేవిడ్ మిల్లర్ కూతురు కాకపోయే అవకాశాలే ఎక్కువగా ఉన్నాయని చాలా మంది అభిప్రాయపడ్డారు. ఏది ఏమైనా క్యాన్సర్తో పోరాడుతూ తనువు చాలించిన చిన్నారి ఆత్మకు శాంతి చేకూరాలని మనం దేవుడిని కోరుకుందాం. ఇక కిల్లర్ మిల్లర్గా పేరు పొందిన డేవిడ్ మిల్లర్ ప్రస్తుతం తన కెరీర్లోనే అత్యున్నత ఫామ్ను కనబరుస్తున్నాడు. టి20 సిరీస్ను టీమిండియాకు కోల్పోయినప్పటికి ఆఖరి టి20లో మెరుపు సెంచరీతో అదరగొట్టిన మిల్లర్.. అదే ఫామ్ను తొలి వన్డేలోనూ చూపెట్టాడు. ఇక రాంచీలో ఇవాళ భారత్-సఫారీల మధ్య రెండో వన్డే జరగాల్సి ఉంది. తొలి వన్డేలో దక్షిణాఫ్రికా విజయం సాధించి సిరీస్లో 1-0తో ముందంజ వేసింది. కాగా మిల్లర్ పెట్టిన పోస్టుతో సౌతాఫ్రికా జట్టులో విషాద ఛాయలు అలముకున్నాయి. View this post on Instagram A post shared by Dave Miller (@davidmillersa12) One of David Miller's biggest fan, Ane passed away. She was close to Miller. Stay strong, @DavidMillerSA12! pic.twitter.com/4ogIbfzQlm — Mufaddal Vohra (@mufaddal_vohra) October 8, 2022 చదవండి: నిమిషం ఆగి ఉంటే వేరుగా ఉండేది.. ఊహించని ట్విస్ట్ -
సూర్య, మిల్లర్ను కాదని రాహుల్కు.. జుట్టు పీక్కున్న అభిమానులు
టీమిండియా, సౌతాఫ్రికా మ్యాచ్ చూసిన వారెవ్వరైనా ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు ఎవరికి వస్తుందంటే కచ్చితంగా రెండు పేర్లు చెబుతారు. అయితే సూర్యకుమార్.. లేదంటే 'కిల్లర్' మిల్లర్. కానీ అనూహ్యంగా ఈ ఇద్దరికి కాకుండా టీమిండియా వైస్ కెప్టెన్ కేఎల్ రాహుల్కు ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ రావడంతో అంతా ఆశ్చర్యపోయారు. అలా అని రాహుల్ ప్రదర్శనను తీసిపారేయలేము.28 బంతుల్లోనే 5 ఫోర్లు, 4 సిక్సర్లతో 57 పరుగులు సాధించాడు. కానీ రాహుల్ కంటే సూర్యకుమార్ ఇంకా బాగా ఆడాడు. కేవలం 22 బంతుల్లోనే 5 ఫోర్లు, 5 సిక్సర్లతో 61 పరుగులు చేశాడు. అలా కాదనుకుంటే దక్షిణాఫ్రికాను దాదాపు గెలిపించినంత పనిచేసిన మిల్లర్కు అయినా ఇవ్వాల్సింది.. అందునా అతను ఏకంగా సెంచరీతో మెరిశాడు. ఇదే ఇప్పుడు అభిమానుల్లో సందేహం రేకెత్తించింది. ఏ లెక్కన కేఎల్ రాహుల్కు అవార్డు ఇచ్చారో అంతుపట్టడం లేదని జట్టు పీక్కుంటున్నారు. అవార్డు అందుకున్న అనంతరం ఇదే విషయమై కేఎల్ రాహుల్ స్పందించాడు.''నాకు మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ దక్కడం ఆశ్చర్యంగా ఉంది. సూర్యకుమార్ యాదవ్ అద్బుతంగా బ్యాటింగ్ చేశాడు. అతనే ఈ అవార్డుకి అర్హుడు. అతనే మ్యాచ్ స్వరూపాన్ని మార్చేశాడు. మిడిల్ ఓవర్లలో సూర్యలా బ్యాటింగ్ చేయడం చాలా కష్టమైన విషయం. అయితే సూర్యకుమార్ మాత్రం చక్కగా ఆడాడు. ఒకవేళ సూర్యకు ఇవ్వకపోతే.. మిల్లర్కు ఇచ్చినా బాగుండేది. జట్టు ఓడిపోయినా సెంచరీతో ఆకట్టుకున్నాడు. కానీ అవార్డు నాకు ఎందుకు ఇచ్చారో ఇప్పటికి అంతుచిక్కడం లేదని పేర్కొన్నాడు. సూర్యకుమార్ కంటే డేవిడ్ మిల్లర్కు అవార్డు ఇస్తే ఇంకా ఎంతో బాగుండేదని చాలా మంది అభిప్రాయపడ్డారు.చాలా సందర్భాల్లో ఓడిపోయిన టీమ్ ప్లేయర్లకు 'మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్' అవార్డులు ఇవ్వడంచూశాం. ఒకవేళ వీరిద్దరు4 ఓవర్లలో ఓ మెయిడిన్తో 24 పరుగులు మాత్రమే ఇచ్చిన భారత బౌలర్ దీపక్ చాహార్కి 'మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్' ఇచ్చినా బాగుండేదని అంటున్నారు.వీళ్లని కాదని కెఎల్ రాహుల్కి 'ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్' ఎందుకు ఇచ్చారు? అని ప్రశ్నించారు. అయితే కొందరు ఆకతాయిలు మాత్రం 'కేఎల్ రాహుల్ బీసీసీఐ రికమెండేషన్ క్యాండిడేట్ కదా.. అందుకే అతనికి అవార్డు వచ్చిందంటూ మీమ్స్, ట్రోల్స్తో రెచ్చిపోయారు. చదవండి: ఇదొక్కటి చాలు.. కోహ్లి ఏంటో చెప్పడానికి! ఓయ్ చహల్.. ఏంటా పని? -
బట్లర్ సేనకు చుక్కలు చూపించిన షంషి.. మరో సిరీస్ కోల్పోయిన ఇంగ్లండ్
టెస్ట్ల్లో వరుస విజయాలతో అదరగొడుతున్న ఇంగ్లండ్ క్రికెట్ టీమ్ పరిమిత ఓవర్ల ఫార్మాట్లో మాత్రం దారుణంగా విఫలమవుతుంది. జోస్ బట్లర్ కెప్టెన్సీ చేపట్టాక ఆ జట్టు పరిస్థితి మరింత దిగజారింది. ఇటీవల టీమిండియా చేతిలో వన్డే, టీ20 సిరీస్ కోల్పోయిన ఇంగ్లీష్ జట్లు.. తాజాగా దక్షిణాఫ్రికా చేతిలో టీ20 సిరీస్లో కూడా ఓటమిపాలైంది. 3 మ్యాచ్ల ఈ సిరీస్లో తొలి టీ20 గెలిచిన బట్లర్ టీమ్.. ఆతర్వాత వరుసగా రెండు మ్యాచ్ల్లో ఓటమిపాలై 2-1తేడాతో సిరీస్ను చేజార్చుకుంది. ఆదివారం (జులై 31) జరిగిన నిర్ణయాత్మక మూడో టీ20ల్లో సఫారీ జట్టు 90 పరుగుల భారీ తేడాతో ఇంగ్లండ్ను చిత్తు చేసింది. సఫారీ స్పిన్నర్ తబ్రేజ్ షంషి (5/24) తన స్పిన్ మాయాజాలంతో ఇంగ్లండ్ ఆటగాళ్లను ఉక్కిరిబిక్కిరి చేశాడు. టాస్ ఓడినప్పటికీ ప్రత్యర్ధి ఆహ్వానం మేరకు తొలుత బ్యాటింగ్ చేసిన సఫారీ టీమ్.. నిర్ణీత ఓవర్లలో 191 పరుగుల భారీ స్కోర్ చేసింది. రీజా హెండ్రిక్స్ (50 బంతుల్లో 70; 9 ఫోర్లు), ఎయిడెన్ మార్క్రమ్ (36 బంతుల్లో 51 నాటౌట్; 5 ఫోర్లు) అర్ధ సెంచరీలతో రాణించగా.. రొస్సో (18 బంతుల్లో 31; 6 ఫోర్లు), కెప్టెన్ మిల్లర్ (9 బంతుల్లో 22; 3 ఫోర్లు, సిక్స్) మెరుపు ఇన్నింగ్స్ ఆడి జట్టు భారీ స్కోర్ సాధించడంలో కీలకపాత్ర పోషించారు. ఇంగ్లండ్ బౌలర్లలో డేవిడ్ విల్లే (3/25) పొదుపుగా బౌలింగ్ చేయడంతో పాటు వికెట్లు పడగొట్టాడు. అనంతరం ఛేదనలో ఇంగ్లండ్ జట్టుకు షంషి చుక్కలు చూపించాడు. ఫలితంగా ఆ జట్టు 16.4 ఓవర్లలో 101 పరుగులకే చాపచుట్టేసింది. ఇంగ్లండ్ ఇన్నింగ్స్లో జేసన్ రాయ్ (17), జోస్ బట్లర్ (14), జానీ బెయిర్స్టో (27), క్రిస్ జోర్డాన్ (14) మాత్రమే రెండంకెల స్కోర్ చేయగలిగారు. ఆ జట్టులో అరివీర భయంకర హిట్టర్లు ఉన్నా షంషి మాయాజాలం ముందు అంతా తేలిపోయారు. షంషికి మరో ఎండ్లో కేశవ్ మహారాజ్ (2/21), ఫెలుక్వాయో (1/23), మార్క్రమ్ (1/5) సహకరించడంతో సఫారీ టీమ్ వారి స్వదేశంలోనే ఇంగ్లండ్ను మట్టికరిపించింది. కాగా, ఈ సిరీస్కు ముందు జరిగిన 3 మ్యాచ్ల వన్డే సిరీస్ 1-1తో డ్రా ముగిసిన విషయం తెలిసిందే. వర్షం కారణంగా నిర్ణయాత్మక మూడో మ్యాచ్ రద్దు కావడంతో ఫలితం ఎటు తేలకుండా నిలిచిపోయింది. ఈ పర్యటనలో తదుపరి 3 మ్యాచ్ల టెస్ట్ సిరీస్ ప్రారంభంకానుంది. ఆగస్ట్ 17, 25, సెప్టెంబర్ 8 తేదీల్లో మూడు టెస్ట్లు ప్రారంభమవుతాయి. చదవండి: ఐదేసిన మొసద్దెక్.. జింబాబ్వేపై ప్రతీకారం తీర్చుకున్న బంగ్లా -
కరేబియన్ ప్రీమియర్ లీగ్.. బార్బడోస్ రాయల్స్ కెప్టెన్గా మిల్లర్
కరేబియన్ ప్రీమియర్ లీగ్-2022 సీజన్కు ముందు బార్బడోస్ రాయల్స్ కీలక నిర్ణయం తీసుకుంది. తమ జట్టు కెప్టెన్గా దక్షిణాఫ్రికా స్టార్ బ్యాటర్ డేవిడ్ మిల్లర్ను నియమించింది. కాగా వెస్టిండీస్ ఆల్ రౌండర్ జాసన్ హోల్డర్ స్థానంలో బార్బడోస్ నూతన సారథిగా మిల్లర్ బాధ్యతలు చేపట్టనున్నాడు. ఈ ఏడాది సీజన్కు హోల్డర్తో పాటు కైల్ మైర్స్, ఒషానే థామస్, ఒబెడ్ మెక్కాయ్, హేడెన్ వాల్ష్ జూనియర్ వంటి కీలక ఆటగాళ్లను బార్బడోస్ రీటైన్ చేసుకుంది. అదే విధంగా దక్షిణాఫ్రికా స్టార్ ఓపెనర్ క్వింటన్ డికాక్, ఆఫ్టానిస్తాన్ స్పిన్నర్ ముజీబ్ ఉర్ రెహ్మాన్తో బార్బడోస్ ఒప్పందం కుదుర్చుకుంది. ఇక మిల్లర్ చివర సారిగా 2018లో జమైకా తల్లావాస్ తరఫున కరేబియన్ ప్రీమియర్ లీగ్లో ఆడాడు. అదే విధంగా 2016లో సెయింట్ లూసియా జౌక్స్కు ప్రాతినిధ్యం వహించాడు. కరేబియన్ ప్రీమియర్ లీగ్లో 15 మ్యాచ్లు ఆడిన మిల్లర్ 332 పరుగులు సాధించాడు. కాగా కరేబియన్ ప్రీమియర్ లీగ్-2022 ఆగస్టు 31 నుంచి ప్రారంభం కానుంది. ఇక ఐపీఎల్-2022లో గుజరాత్ టైటాన్స్కు ప్రాతినిధ్యం వహించిన మిల్లర్ అద్భుతంగా రాణించాడు. గుజరాత్ టైటాన్స్ టైటిల్ కైవసం చేసుకోవడంలో మిల్లర్ కీలక పాత్ర పోషించాడు. ఇక ఈ ఏడాది ఐపీఎల్ సీజన్కు ముందు మిల్లర్ రాజస్తాన్ రాయల్స్ జట్టులో భాగంగా ఉన్నాడు. కాగా బార్బడోస్ రాయల్స్ ఫ్రాంఛైజీలో కూడా రాజస్తాన్ వాటా కలిగి ఉంది. ఇక కెప్టెన్గా ఎంపికైన మిల్లర్ మాట్లాడుతూ.. "ఐపీఎల్లో రాజస్తాన్ జట్టుతో నాకు ప్రత్యేకమైన అనుబంధం ఉంది. ఇప్పడు అదే జట్టుతో సంబంధం ఉన్న బార్బడోస్ రాయల్స్లో భాగం కావడం చాలా సంతోషంగా ఉంది. అదే విధంగా కెప్టెన్గా ఎంపిక కావడం నాకు దక్కిన అదృష్టంగా భావిస్తున్నాను. కరేబియన్ ప్రీమియర్ లీగ్లో బార్బడోస్ జట్టు యువ ఆటగాళ్లతో కూడి ఉన్నంది. ఈ ఏడాది సీజన్లో జట్టుకు నా వంతు కృషి చేయడానికి ఆతృతగా ఎదురు చూస్తున్నాను" అని మిల్లర్ పేర్కొన్నాడు. చదవండి: IND Vs WI: కొంపముంచిన అత్యుత్సాహం.. గిల్ విషయంలో తప్పుడు ట్వీట్ -
మూడు ఫార్మాట్లకు ముగ్గురు వేర్వేరు కెప్టెన్లు.. గుజరాత్ ప్లేయర్కు బంపర్ ఆఫర్
South Africa Tour Of England: జులై 19 నుంచి దాదాపు మూడు నెలల పాటు ఇంగ్లండ్, ఐర్లాండ్లలో పర్యటించనున్న దక్షిణాఫ్రికా జట్లను (మూడు ఫార్మాట్ల జట్లు) క్రికెట్ సౌతాఫ్రికా మంగళవారం ప్రకటించింది. వచ్చే నెల నుంచి సౌతాఫ్రికా ఈ రెండు దేశాలతో మూడు ఫార్మాట్లలో సిరీస్లు ఆడనుంది. జులై 19 నుంచి 31 వరకు ఇంగ్లండ్తో 3 వన్డేలు, 3 టీ20లు ఆడనున్న సపారీ టీమ్.. మధ్యలో ఆగస్ట్ 3, 5 తేదీల్లో ఐర్లాండ్తో రెండు టీ20లు, ఆతర్వాత ఆగస్ట్ 17-సెప్టెంబర్ 12 వరకు ఇంగ్లండ్తో మూడు టెస్ట్ మ్యాచ్ల సిరీస్ ఆడనుంది. ఈ సుదీర్ఘ పర్యటనల కోసం క్రికెట్ సౌతాఫ్రికా మూడు ఫార్మాట్లకు మూడు వేర్వేరు జట్లతో పాటు ముగ్గురు వేర్వేరు కెప్టెన్లను ప్రకటించింది. ఇటీవల టీమిండియాతో ముగిసిన టీ20 సిరీస్లో గాయపడిన వైట్బాల్ కెప్టెన్ టెంబా బవుమా మూడు జట్లలో స్థానం కోల్పోగా.. గుజరాత్ టైటాన్స్ (ఐపీఎల్) ఆటగాడు డేవిడ్ మిల్లర్, భారత సంతతి ఆటగాడు కేశవ్ మహారాజ్లు బంపర్ ఆఫర్లు కొట్టేశారు. టెస్ట్ల్లో డీన్ ఎల్గర్ను కెప్టెన్గా కొనసాగించిన సీఎస్ఏ.. వన్డేల్లో కేశవ్ మహారాజ్ను, టీ20ల్లో డేవిడ్ మిల్లర్ను కెప్టెన్లుగా నియమించింది. South Africa announced Test, ODI, and T20I squads for the upcoming England tour.#SkyFair #ENGvsSA #SouthAfrica #England #DavidMiller #Cricket #T20I #TestCricket #ODI #CricketTwitter pic.twitter.com/CQrxXoOwVc — SkyFair (@officialskyfair) June 29, 2022 ఇంగ్లండ్, ఐర్లాండ్ దేశాల్లో సౌతాఫ్రికా పర్యటన వివరాలు.. జులై 19 : ఇంగ్లాండ్ తో తొలి వన్డే జులై 22 : రెండో వన్డే జులై 24 : మూడో వన్డే జులై 27 : తొలి టీ20 జులై 28 : రెండో టీ20 జులై 31 : మూడో టీ20 ఆగస్టు 3 : ఐర్లాండ్ తో తొలి టీ20 ఆగస్టు 5 : రెండో టీ20 ఆగస్టు 17-21 : ఇంగ్లాండ్ తో తొలి టెస్టు ఆగస్టు 25-29 : రెండో టెస్టు సెప్టెంబర్ 8-12 : మూడో టెస్టు చదవండి: విరాట్ కోహ్లి రికార్డు బద్దలు కొట్టిన బాబర్ ఆజమ్ -
'కిల్లర్' మిల్లర్ అనగానే ఆ ఎపిక్ ఎంట్రీ గుర్తుకురావడం ఖాయం
సౌతాఫ్రికా విధ్వంసకర ఆటగాడు డేవిడ్ మిల్లర్ ఇవాళ(జూన్ 10న) 33వ పుట్టిరోజు జరుపుకుంటున్నాడు. కిల్లర్ మిల్లర్గా గుర్తింపు పొందిన ఈ విధ్వంసకర బ్యాటర్ లేటు వయసులో అదరగొడుతున్నాడు. అయితే మిల్లర్ అనగానే గుర్తుకువచ్చేది 2015 వన్డే వరల్డ్కప్లో అతనిచ్చిన ఎపిక్ ఎంట్రీ అభిమానుల కళ్ల ముందు కదలాడుతుంది. ఆ వన్డే వరల్డ్కప్లో భాగంగా ఒక మ్యాచ్లో బ్యాటింగ్ రావడానికి సిద్ధమైన మిల్లర్ స్ట్రెయిట్గా కాకుండా బౌండీరీ లైన్పై నుంచి డైవ్ చేస్తూ గ్రౌండ్లోకి అడుగుపెట్టడం ఆసక్తి కలిగించింది. దీనికి సంబంధించిన ఫోటో అప్పట్లో సోషల్ మీడియాలో వైరల్గా మారింది. కాగా మిల్లర్ను డబ్ల్యూడబ్ల్యూఈ స్టార్తో పోలుస్తూ.. మిల్లర్లో ఈరోజు క్రికెటర్ కాకుండా రెజ్లింగ్ స్టార్ కనిపిస్తున్నాడు అంటూ కామెంట్స్ చేశారు. అయితే మిల్లర్ ఇలా ఎందుకు చేశాడా అన్నది తెలియనప్పటికి.. బహుశా తొందరగా గ్రౌండ్లో అడుగుపెట్టాలనే ఉద్దేశంతో ఇలా చేసి ఉంటాడని క్రికెట్ కామెంటేటర్స్ సహా అభిమానులు అప్పట్లో చెవులు కొరుక్కున్నారు. ఇప్పటికి మిల్లర్ అనగానే టక్కున గుర్తుకువచ్చేది ఆ ఎపిక్ ఎంట్రీనే. ఇక మిల్లర్ అంతర్జాతీయ క్రికెట్లో చాలాకాలం క్రితమే(2010లో) ఎంట్రీ ఇచ్చినప్పటికి మొదట్లో అవకాశాలు ఎక్కువగా రాలేదు. దానికి కారణం లేకపోలేదు. మిల్లర్ జట్టులోకి వచ్చే సమయానికి దక్షిణాఫ్రికాలో చాలా మంది సీనియర్ ఆటగాళ్లు ఉన్నారు. పరిమిత ఓవర్ల స్పెషలిస్ట్గా గుర్తింపు పొందిన అతను వెలుగులోకి రావడానికి ఐదేళ్లు పట్టింది. అది 2015 వన్డే వరల్డ్ కప్. ఆ వరల్డ్కప్లో సౌతాఫ్రికా సెమీఫైనల్కు చేరడంలో మిల్లర్ పాత్ర చాలా కీలకమనే చెప్పొచ్చు. ఆ వరల్డ్కప్లో మిల్లర్ 324 పరుగులు సాధించాడు. కాగా 2015 ప్రపంచకప్లో ఒక మ్యాచ్లో మిల్లర్, జేపీ డుమినితో కలిసి ఐదో వికెట్కు 256 పరుగులు జోడించాడు. వన్డే చరిత్రలో ఐదో వికెట్కు అత్యధిక పరుగులు జోడించిన జంటగా మిల్లర్, డుమినీ పేరిట ఉన్న రికార్డు ఇప్పటికి చెక్కు చెదరలేదు. ఆ తర్వాత రెగ్యులర్ సభ్యుడిగా ప్రమోషన్ పొందిన మిల్లర్ ప్రస్తుతం సౌతాఫ్రికా బ్యాటింగ్లో కీలక ఆటగాడిగా మారాడు. ఇక గురువారం రాత్రి టీమిండియాతో జరిగిన టి20 మ్యాచ్లో మ్యాచ్ విన్నింగ్ ఇన్నింగ్స్తో ఆకట్టుకున్నాడు. భారీ లక్ష్యం కళ్ల ముందు కనబడుతున్నా.. ఏ మాత్రం బెదరకుండా డుసెన్తో కలిసి జట్టును గెలిపించాడు. అంతకముందు ఐపీఎల్ 2022 సీజన్లో గుజరాత్ టైటాన్స్ కప్ గెలవడంలోనూ మిల్లర్ది కీలకపాత్రే. 2010లో అంతర్జాతీయ క్రికెట్లో అరంగేట్రం చేసిన మిల్లర్ సౌతాఫ్రికా తరపున 143 వన్డేల్లో 3503 పరుగులు, 96 టి20ల్లో 1850 పరుగులు సాధించాడు. చదవండి: ఐపీఎల్లో దుమ్ము లేపాడు.. ఇక్కడా అదరగొట్టాడు! మొత్తంగా 235 క్యాచ్లు! -
'క్యాచ్ వదిలితే.. అట్లుంటది మనతో మరి'
IND Vs SA T20 Series: ఢిల్లీ వేదికగా టీమిండియాతో జరిగిన తొలి టీ20లో దక్షిణాఫ్రికా 7 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించిన సంగతి తెలిసిందే. అయితే ప్రోటిస్ విజయంలో ఆ జట్టు మిడిలార్డర్ బ్యాటర్లు మిల్లర్, వాన్డెర్ డసెన్ కీలక పాత్ర పోషించారు. 212 పరుగుల భారీ లక్ష్య చేధనలో టాప్ ఆర్డర్ విఫలమైనప్పటికీ.. మిల్లర్(64), వాన్డెర్ డసెన్(75) విజృంభించడంతో దక్షిణాఫ్రికా సునాయసంగా ఛేదించింది. అయితే 29 పరుగుల వద్ద వాన్డెర్ డసెన్ ఇచ్చిన ఈజీ క్యాచ్ను శ్రేయస్ అయ్యర్ జారవిడిచాడు. అదే భారత్ కొంప ముంచింది. అనంతరం వాన్డెర్ డసెన్ ఆకాశమే హద్దుగా చెలరేగిపోయాడు. తొలి 30 బంతుల్లో 29 పరుగులు చేసిన డసెన్.. అఖరి 16 బంతుల్లో 46 పరుగులు చేశాడు. మ్యాచ్ అనంతరం మాట్లాడిన డసెన్.. డ్రాప్ చేసిన క్యాచ్కి టీమిండియా భారీ మూల్యం చెల్లించుకోవలసి ఉంటుందని తనకు తెలుసు అని చెప్పాడు. "ఆరంభంలో బంతులను ఎదర్కొవడానికి కాస్త ఇబ్బంది పడ్డాను. ముందుగా బౌండరీలు కొట్టలేక జట్టును ఒత్తిడికి గురి చేశాను. అయితే నా రిథమ్ను అందుకోవడానికి ఏదో ఒక బౌలర్ను టార్గెట్ చేయాలని అనుకున్నాను. వికెట్ బ్యాటింగ్కు చాలా బాగుంది. కాగా జారవిడిచిన క్యాచ్కు భారత్ భారీ మూల్యం చెల్లించుకోవలసి ఉంటుందని నాకు తెలుసు. కొన్ని సార్లు అదృష్టం మనకు కలిసి వస్తుంది. ఈ రోజు నేను అదృష్టవంతుడిని" అని ఇండియా టూడేకు ఇచ్చిన ఇంటర్వ్యూలో వాన్డెర్ డసెన్ పేర్కొన్నాడు. టీమిండియా వర్సెస్ దక్షిణాఫ్రికా మొదటి టీ20: టాస్- దక్షిణాఫ్రికా- బౌలింగ్ భారత్ స్కోరు: 211/4 (20) దక్షిణాఫ్రికా స్కోరు: 212/3 (19.1) విజేత: ఏడు వికెట్ల తేడాతో భారత్పై దక్షిణాఫ్రికా విజయం ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్: డేవిడ్ మిల్లర్(31 బంతుల్లో 64 పరుగులు) ఈ మ్యాచ్లో డసెన్ స్కోరు: 46 బంతుల్లో 75 పరుగులు(7 ఫోర్లు, 5 సిక్సర్లు) నాటౌట్ చదవండి: Rishabh Pant: మా ఓటమికి కారణం అదే.. అయితే: పంత్ -
ఐపీఎల్లో దుమ్ము లేపాడు.. ఇక్కడా అదరగొట్టాడు! మొత్తంగా 235 క్యాచ్లు!
India Vs South Africa T20 Series: దక్షిణాఫ్రికా విధ్వంసకర బ్యాటర్ డేవిడ్ మిల్లర్ శుక్రవారం(జూన్ 10) 33వ పుట్టినరోజు జరుపుకొంటున్నాడు. ఈ సందర్భంగా సహచర ఆటగాళ్లు, అభిమానుల నుంచి అతడికి శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి. ఇక ప్రొటిస్ జట్టు భారత పర్యటనలో భాగంగా గురువారం నాటి తొలి టీ20 విజయంలో మిల్లర్ కీలక పాత్ర పోషించిన సంగతి తెలిసిందే. 31 బంతుల్లో 64 పరుగులతో అజేయంగా నిలిచి ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు అందుకున్నాడు. హ్యాపీ బర్త్డే మిల్లర్.. ఈ నేపథ్యంలో సెలబ్రేషన్స్ కొనసాగుతూనే ఉంటాయి అంటూ దక్షిణాఫ్రికా క్రికెట్ బోర్డు ట్విటర్ వేదికగా అతడిని విష్ చేసింది. కాగా ఐపీఎల్-2022లో గుజరాత్ టైటాన్స్కు ప్రాతినిథ్యం వహించిన ఈ ఎడమచేతి వాటం బ్యాటర్.. కీలక మ్యాచ్లలో జట్టును విజేతగా నిలిపిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో గుజరాత్ ఫ్రాంఛైజీ ట్విటర్ వేదికగా అతడికి శుభాకాంక్షలు తెలిపింది. రాజస్తాన్ రాయల్స్ సైతం అతడిని విష్ చేసింది. అలా మొదలై.. దక్షిణాఫ్రికాలోని నాటల్లో 1989, జూన్ 10న జన్మించిన డేవిడ్ మిల్లర్ 2010లో అంతర్జాతీయ క్రికెట్లో అడుగుపెట్టాడు. వెస్టిండీస్తో టీ20 మ్యాచ్(మే 20)తో అరంగేట్రం చేసిన ఈ ప్రొటిస్ ఆటగాడు.. ఆ తర్వాత రెండ్రోజులకే వన్డేల్లోనూ ఎంట్రీ ఇచ్చాడు. పరిమిత ఓవర్ల క్రికెట్లో అతడి స్ట్రైకు రేటు 100కు పైగా ఉండటం విశేషం. అయితే, 12 ఏళ్లయినా ఈ హిట్టర్కు టెస్టు జట్టులో చోటు దక్కకపోవడం గమనార్హం. ఉత్తమ బ్యాటర్.. అత్యుత్తమ ఫీల్డర్.. ఇక బ్యాటర్గానే కాకుండా మైదానంలో పాదరసంలా వేగంగా కదిలే ఫీల్డర్గానూ మిల్లర్కు పేరుంది. ఇప్పటి వరకు 96 టీ20 మ్యాచ్లు ఆడిన అతడు 70 క్యాచ్లు పట్టాడు. ఓవరాల్గా పొట్టి ఫార్మాట్లో అత్యధిక క్యాచ్లు పట్టిన క్రికెటర్గా అతడు రికార్డుకెక్కాడు. ఇక మొత్తంగా 378 మ్యాచ్లలో కలిపి మిల్లర్ అందుకున్న క్యాచ్ల సంఖ్య 235. వెస్టిండీస్ ఆటగాళ్లు కీరన్ పొలార్డ్(595 మ్యాచ్లలో 325 క్యాచ్లు), డ్వేన్ బ్రావో(534 మ్యాచ్లలో 252 క్యాచ్లు) అత్యధిక క్యాచ్లు అందుకున్న జాబితాలో ముందు వరుసలో ఉన్నారు. నాలుగో స్థానంలో.. ఐపీఎల్-2022లో అద్భుత ఇన్నింగ్స్తో ఆకట్టుకున్న గుజరాత్ టైటాన్స్ బ్యాటర్ డేవిడ్ 16 ఇన్నింగ్స్లో 481 పరుగులు సాధించాడు. అత్యధిక స్కోరు 94 నాటౌట్. అర్ధ శతకాలు 2. బాదిన బౌండరీలు 32. కొట్టిన సిక్సర్లు 23. అత్యధిక పరుగుల వీరుల జాబితాలో నాలుగో స్థానం. ట్రోఫీ గెలిచిన జట్టులో మిల్లర్ సభ్యుడు. చదవండి: Rishabh Pant: మా ఓటమికి కారణం అదే.. అయితే: పంత్ Rishabh Pant: అయ్యో పంత్! ఒకే మ్యాచ్లో.. అరుదైన ఘనత.. అప్రదిష్ట కూడా! Here’s hoping aapda @DavidMillerSA12 bhai starts the year ahead the way he finished it - in style 😎 pic.twitter.com/dl7voRcO4F — Gujarat Titans (@gujarat_titans) June 10, 2022 Happy birthday, Killer Miller. 😁💗#RoyalsFamily | @DavidMillerSA12 pic.twitter.com/gotrxzBIMr — Rajasthan Royals (@rajasthanroyals) June 10, 2022 The celebrations continue for David Miller 🥳 Happy Birthday and have a smashing day 🎂 pic.twitter.com/iBSzigccuN — Cricket South Africa (@OfficialCSA) June 10, 2022 -
Ind Vs SA: అదే మా కొంప ముంచింది.. అందుకే ఓడిపోయాం: పంత్
Ind Vs SA T20 Series- Rishabh Pant: ‘‘మేము మంచి స్కోరు నమోదు చేశాం. కానీ ఆ తర్వాత మా ప్రణాళికలను పక్కాగా అమలు చేయలేకపోయాం. అయితే, ఒక్కోసారి ప్రత్యర్థి జట్టుకు క్రెడిట్ ఇవ్వాల్సి ఉంటుంది. మిల్లర్, వాన్డెర్ డసెన్ అద్భుతంగా బ్యాటింగ్ చేశారు. నిజానికి మేము బ్యాటింగ్ చేస్తున్న సమయంలో వికెట్ కాస్త స్లోగా ఉంది. ఆ తర్వాత సెకండ్ ఇన్నింగ్స్లో పరిస్థితి మారిపోయింది. మిల్లర్ను కట్టడి చేసేందుకు మేము బాగానే ప్రయత్నించాం. కానీ వికెట్ బ్యాటింగ్కు పూర్తిగా అనుకూలించింది. ఏదేమైనా మా ప్రదర్శన పట్ల సంతృప్తిగానే ఉన్నాము. అయితే, తదుపరి మ్యాచ్లో కచ్చితంగా మెరుగ్గా రాణించాల్సి ఉంది’’ అని టీమిండియా తాత్కాలిక కెప్టెన్ రిషభ్ పంత్ అన్నాడు. కాగా దక్షిణాఫ్రికాతో స్వదేశంలో టీ20 సిరీస్ నేపథ్యంలో పంత్ ఆఖరి నిమిషంలో జట్టు పగ్గాలు చేపట్టిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో గురువారం(జూన్ 9) ఢిల్లీ వేదికగా జరిగిన మ్యాచ్లో భారత్ ఓటమి పాలైంది. టీమిండియా 211 పరుగుల భారీ స్కోరు చేసిన దక్షిణాఫ్రికా బ్యాటర్లు డేవిడ్ మిల్లర్, డసెన్ విజృంభించడంతో పరాజయం తప్పలేదు. ఈ నేపథ్యంలో ఓటమిపై స్పందించిన పంత్.. తమ బ్యాటింగ్ ప్రదర్శన పట్ల సంతృప్తి వ్యక్తం చేశాడు. అయితే, బౌలింగ్లో కాస్త తేలిపోయామని, వికెట్ బ్యాటింగ్కు అనుకూలించిందని పేర్కొన్నాడు. కాగా ఈ పరాజయంతో టీ20 ఫార్మాట్లో భారత్ జైత్రయాత్రకు బ్రేక్ పడింది. వరుసగా 13వసారి గెలుపొంది ప్రపంచ రికార్డు సృష్టించాలన్న కల నెరవేరకుండా పోయింది. ఇక ఈ సిరీస్కు రోహిత్ శర్మ, విరాట్ కోహ్లి, బుమ్రా తదితరులు దూరంగా ఉండగా.. మొదటి మ్యాచ్కు ముందు కేఎల్ రాహుల్ గాయపడ్డాడు. టీమిండియా వర్సెస్ దక్షిణాఫ్రికా మొదటి టీ20: టాస్- దక్షిణాఫ్రికా- బౌలింగ్ భారత్ స్కోరు: 211/4 (20) దక్షిణాఫ్రికా స్కోరు: 212/3 (19.1) విజేత: ఏడు వికెట్ల తేడాతో భారత్పై దక్షిణాఫ్రికా విజయం ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్: డేవిడ్ మిల్లర్(31 బంతుల్లో 64 పరుగులు- నాటౌట్) ఈ మ్యాచ్లో రిషభ్ పంత్ స్కోరు: 16 బంతుల్లో 29 పరుగులు చదవండి: Avesh Khan: వారెవ్వా ఏం స్పీడు భయ్యా.. బ్యాట్ రెండు ముక్కలయ్యింది .@ishankishan51 dazzled & put on an absolute show with the bat! 🔥 🔥 #TeamIndia | #INDvSA | @Paytm Watch his 4⃣8⃣-ball 7⃣6⃣-run blitz 🎥 🔽https://t.co/VUi8n7B8aZ — BCCI (@BCCI) June 9, 2022 ఎప్పటికైనా సరే #𝐁𝐞𝐥𝐢𝐞𝐯𝐞𝐈𝐧𝐁𝐥𝐮𝐞 💙 ఆటలో గెలుపోటములు సహజమే 😊 తిరిగి పుంజుకుని Paytm T20I ట్రోఫీని గెలవటమే లక్ష్యంగా వస్తుంది #TeamIndia 😎 మరి మీరు మీ విషెస్ ను సెండ్ చెయ్యండి 👇🏻 చూడండి #INDvSA 2nd T20I 12 జూన్ 6pm నుంచి మీ #StarSportsTelugu / Disney + Hotstar లో pic.twitter.com/j1YLHFELcr — StarSportsTelugu (@StarSportsTel) June 9, 2022 -
IPL: ఏదో ఒకరోజు నేనూ ఐపీఎల్లో ఆడతా.. కెప్టెన్ అవుతా!
IND Vs SA T20 Series: ఇండియన్ ప్రీమియర్ లీగ్లో తాను భాగస్వామ్యం కావాలనుకుంటున్నానని దక్షిణాఫ్రికా పరిమిత ఓవర్ల కెప్టెన్ తెంబా బవుమా అన్నాడు. ఏదో ఒకరోజు క్యాష్ రిచ్ లీగ్లో తప్పకుండా ఆడతానని ఆశాభావం వ్యక్తం చేశాడు. కాలం కలిసి వస్తే కెప్టెన్గా కూడా వ్యవహరించే అవకాశం రావాలని ఆశిస్తున్నానంటూ మనసులోని మాటను బయటపెట్టాడు. అయితే, అంతకంటే ముందు ఏదో ఒక జట్టులో ఆడే ఛాన్స్ రావాలని పేర్కొన్నాడు. కాగా ఐపీఎల్లో ఇప్పటికే చాలా మంది ప్రొటిస్ ఆటగాళ్లు తమ ప్రతిభను నిరూపించుకున్న విషయం తెలిసిందే. ఏబీ డివిలియర్స్ వంటి స్టార్ల నుంచి బేబీ ఏబీడీ డెవాల్డ్ బ్రెవిస్ వరకు ఈ జాబితాలో చాలా మందే ఉన్నారు. ముఖ్యంగా ఐపీఎల్-2022లో కగిసో రబడ, డేవిడ్ మిల్లర్, ఎయిడెన్ మార్కరమ్, మార్కో జాన్సెన్ తదితరులు తాము ప్రాతినిథ్యం వహించిన జట్ల విజయాల్లో తమ వంతు పాత్ర పోషించారు. ఇక మిల్లర్.. గుజరాత్ టైటాన్స్ ఫైనల్ చేరడంలో కీలకంగా వ్యవహరించాడు. టైటిల్ గెలిచిన జట్టులో భాగమయ్యాడు. ఈ క్రమంలో వీరందరిపై ప్రశంసలు కురిపించిన బవుమా.. ఐపీఎల్లో మంచి ప్రదర్శన నమోదు చేశారని పేర్కొన్నాడు. రబడ వంద వికెట్లు తీయడం గర్వంగా ఉందని పేర్కొన్నాడు. ఈ నేపథ్యంలో తానూ ఏదో ఒకరోజు ఐపీఎల్లో ఆడతానని ఈ 32 ఏళ్ల బ్యాటర్ పేర్కొన్నాడు. ఈ మేరకు.. ‘‘నేను కూడా అక్కడ ఆడతాను. మెరుగ్గా రాణిస్తే అవకాశాలు వాటంతట అవే వస్తాయి. నిజానికి అక్కడ ఓ జట్టుకు కెప్టెన్గా కూడా బాధ్యతలు నిర్వర్తించాలని ఉంది. ఇది నా ఫాంటసీ. అయితే, ముందు ఐపీఎల్లో ఏదో ఒక జట్టుకు ఆడి అనుభవం గడించాలి కదా’’ అని క్రికెట్మంత్లీతో బవుమా చెప్పుకొచ్చాడు. కాగా ఈ ఏడాది ఫిబ్రవరిలో జరిగిన మెగా వేలంలో 33 మంది ప్రొటిస్ ప్లేయర్లు తమ పేరు నమోదు చేసుకున్నారు. వీరిలో బవుమా లేకపోవడం గమనార్హం. ఇక జూన్ 9 నుంచి టీమిండియాతో టీ20 సిరీస్ ఆడేందుకు దక్షిణాఫ్రికా సన్నద్ధమవుతోంది. చదవండి 👇 అమ్మో అదో పీడకల.. ఆ బౌలర్ ఎదురుగా ఉన్నాడంటే అంతే ఇక: జయవర్ధనే Ind Vs SA T20 Series: టీమిండియాను తక్కువగా అంచనా వేయలేం.. కానీ విజయం మాదే: బవుమా Welcome to the #Proteas, Tristan Stubbs 🇿🇦💚#INDvSA #BePartOfIt pic.twitter.com/EJWx8agZKV — Cricket South Africa (@OfficialCSA) June 1, 2022 -
వేలంలో మొదట పట్టించుకోలేదు.. కట్చేస్తే మ్యాచ్ 'కిల్లర్' అయ్యాడు
సౌతాఫ్రికా స్టార్ బ్యాటర్ డేవిడ్ మిల్లర్.. ఐపీఎల్ మెగావేలంలో తొలి రౌండ్లో ఎవరు కొనుగోలు చేయడానికి ఆసక్తి చూపలేదు. అతన్ని కొనుగోలు చేయకపోవడం వెనుక కారణం ఉంది. ఐపీఎల్లో మిల్లర్ చివరిసారి 2013, 2014 సీజన్లలో వరుసగా(418 పరుగులు, 446 పరుగులు) మంచి స్కోర్లు సాధించాడు. అయితే ఆ తర్వాత ఫామ్ కోల్పోయి 2014 తర్వాత మిల్లర్ ఆటతీరు క్రమంగా వెనుకబడింది. ఇక గతేడాది సీజన్(2021లో) మిల్లర్ దారుణ ప్రదర్శన కనబరిచాడు. 10 మ్యాచ్లాడి 124 పరుగులు మాత్రమే చేశాడు. PC: IPL Twitter దీంతో మెగావేలంలో ఏ జట్టు మిల్లర్ను కొనుగోలు చేయడానికి ముందుకు రాలేదు. అయితే చివరి నిమిషంలో మిల్లర్ను రూ.3 కోట్లకు గుజరాత్ టైటాన్స్ దక్కించుకుంది. హార్దిక్ పాండ్యా మిల్లర్పై నమ్మకముంచి వరుస అవకాశాలు ఇచ్చాడు. మొదట్లో కాస్త నెమ్మదిగా ఆడినప్పటికి క్రమక్రమంగా ఫామ్లోకి వచ్చాడు. కట్చేస్తే గుజరాత్ టైటాన్స్ బ్యాటింగ్లో మిల్లర్ ప్రస్తుతం కీలక బ్యాటర్గా ఉన్నాడు. ఎక్కువగా మిడిలార్డర్లో బ్యాటింగ్కు వస్తున్న మిల్లర్ మ్యాచ్ కిల్లర్గా మారాడు. ఇప్పటివరకు 15 మ్యాచ్ల్లో 141 స్ట్రైక్రేటుతో 450 పరుగులు సాధించాడు. ముఖ్యంగా రాజస్తాన్ రాయల్స్తో జరిగిన క్వాలిఫయర్-1 పోరులో 67 పరుగులు నాకౌట్ ఇన్నింగ్స్తో జట్టును ఫైనల్ చేర్చాడు. తనపై గుజరాత్ టైటాన్స్ ఉంచిన నమ్మకాన్ని మిల్లర్ నిలబెట్టుకున్నాడు. తాజాగా రాజస్తాన్ రాయల్స్తో ఫైనల్ ఫైట్కు సిద్దమవుతున్న మిల్లర్.. తన బ్యాటింగ్పై ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. PC: IPL Twitter ''ఐపీఎల్లో నా ఆటతీరు చూస్తుంటే..నాకు నేను రిపీట్ అయినట్లుగా అనిపిస్తుంది. కానీ నా బ్యాటింగ్లో మాత్రం చాలా మార్పు వచ్చిందని కచ్చితంగా చెప్పగలను. అందుకే గుజరాత్ ఆడుతున్న ప్రతీ మ్యాచ్లోనూ నా పేరు ఉంది. గత నాలుగు, ఐదేళ్లలో నా కెరీర్లో అత్యంత చెత్త ఫామ్లో ఉన్నా. ముఖ్యంగా 2016 ఐపీఎల్ సీజన్ నాకు పీడకల లాంటింది. ఆ సీజన్లో నా ప్రదర్శనకు మళ్లీ ఐపీఎల్లో అడుగుపెట్టనేమో అనుకున్నా. క్యాష్ రిచ్ లీగ్ ఐపీఎల్లో తుది జట్టులో నలుగురు విదేశీ ప్లేయర్లకు మాత్రమే చాన్స్ ఉంది. ఆ విషయం మనసులో పెట్టుకొని దేశానికి వెళ్లిపోయి బ్యాటింగ్పై ఫోకస్ పెట్టా.. హార్డ్వర్క్ చేశా. సౌతాఫ్రికా తరపున అంతర్జాతీయ మ్యాచ్ల్లో కొన్ని కీలక ఇన్నింగ్స్లు ఆడాను. అలా ఈ ఏడాది గుజరాత్ టైటాన్స్ తరపున అత్యుత్తమ ఫామ్ను కనబరుస్తున్నా. ఇది నాలో ఒక గొప్ప మార్పుగా భావిస్తున్నా.'' అంటూ చెప్పుకొచ్చాడు. PC: IPL Twitter చదవండి: Karthik Drops Buttler Catch: 'జట్టు గ్రహచారమే బాలేదు.. ఎవర్ని నిందించి ఏం లాభం!' Mathew Wade: 'మా జట్టు ఫైనల్ చేరింది.. అయినా సరే టోర్నమెంట్ చికాకు కలిగిస్తుంది' -
IPL 2022: దీనంతటికీ కారణం వాళ్లే.. ఉప్పొంగిపోను.. నేలమీదే ఉంటా: హార్దిక్ పాండ్యా
IPL 2022 GT Enters Final- Hardik Pandya Comments: ‘‘జీవితంలో ఎన్నో విషయాల్లో సంయమనం పాటించడం నేర్చుకున్నాను. గత రెండేళ్లుగా నన్ను నేను మరింతగా మార్చుకునేలా ప్రయత్నాలు చేశాను. ఇందులో నా కుటుంబం ముఖ్యంగా నా కుమారుడు, నా కొడుకు, నా భార్య.. మా అన్న కీలక పాత్ర పోషించారు. తీవ్ర భావోద్వేగాలకు అతీతంగా పరిణతితో కూడిన జీవితం సాగించేలా ప్రోత్సహించారు. మెరుగైన క్రికెటర్గా ఎదిగేలా మార్పులు తెచ్చారు. ఇప్పటికీ ఈ విజయంతో ఉప్పొంగిపోను. నేలమీదే ఉండేందుకు ప్రయత్నిస్తాను’’ అంటూ గుజరాత్ టైటాన్స్ కెప్టెన్ హార్దిక్ పాండ్యా ఉద్వేగంగా మాట్లాడాడు. కాగా గత ఐపీఎల్ సీజన్లో గడ్డు పరిస్థితులు ఎదుర్కొన్న హార్దిక్ పాండ్యా.. టీ20 ప్రపంచకప్ జట్టులో చోటు దక్కించుకున్నా అక్కడ కూడా విఫలమయ్యాడు. ఫిట్నెస్ లోపాలతో టీమిండియాకూ దూరమయ్యాడు. భార్య నటాషా, కొడుకు అగస్త్యతో హార్దిక్ పాండ్యా ఈ క్రమంలో గుజరాత్ టైటాన్స్ ఫ్రాంఛైజీ రూపంలో అదృష్టం అతడి తలుపు తట్టింది. ముంబై ఇండియన్స్ రిలీజ్ చేయడంతో హార్దిక్ను దక్కించుకున్న గుజరాత్ అతడిపై నమ్మకం ఉంచి కెప్టెన్గా బాధ్యతలు అప్పజెప్పింది. ఐపీఎల్-2022తో ఎంట్రీ ఇచ్చిన ఫ్రాంఛైజీ అంచనాలు నిజం చేస్తూ హార్దిక్ పాండ్యా జట్టును అగ్రస్థానంలో నిలిపాడు. అంతేకాకుండా క్వాలిఫైయర్-1లో భాగంగా రాజస్తాన్ రాయల్స్తో మంగళవారం(మే 24) జరిగిన మ్యాచ్లో గుజరాత్ గెలిచి అరంగేట్రంలోనే ఫైనల్ చేరిన జట్టుగా నిలిచింది. ఈ నేపథ్యంలో విజయానంతరం హార్దిక్ పాండ్యా స్పందిస్తూ.. తన చుట్టూ సానుకూల దృక్పథం ఉన్న ఆటగాళ్లు ఉన్నారని, వారి వల్లే ఈ విజయాలు సాధ్యమయ్యాయని పేర్కొన్నాడు. ‘‘జట్టులో ఉన్న 23 మంది ఆటగాళ్లు.. వేర్వేరు వ్యక్తిత్వాలు కలవాళ్లు. మన చుట్టూ ఉన్నవాళ్లు పాజిటివిటీతో ఉంటే మనకు కూడా బాగుంటుంది. మా విజయానికి కారణం అదే. డగౌట్లో కూర్చున్న ఆటగాళ్లు కూడా తమ వంతు చేయాల్సిన ప్రయత్నాలు చేశారు. సమిష్టి కృషితోనే మేము ఇక్కడిదాకా వచ్చాము. ఏదేమైనా ప్రతి ఒక్కరు ఆటను గౌరవించాల్సిందే. అప్పుడే అంతా బాగుంటుంది. రషీద్ ఖాన్ ఈ టోర్నీ ఆసాంతం అద్భుతమైన ప్రదర్శనతో ఆకట్టుకున్నాడు. ఇక ఈ మ్యాచ్లో.. మిల్లర్ను చూసి నేను గర్వపడుతున్నాను. అదే విధంగా జట్టుకు నా సేవలు అవసరమైన ప్రతిసారీ సిద్ధంగా ఉన్నాను. బ్యాట్ ఝులిపించాను. నా జట్టుతో కలిసి నేను కూడా సక్సెస్ అందుకున్నాను. ప్రతి ఒక్కరు తమ వంతు కృషి చేశారు కాబట్టే మేము ఇక్కడ ఉన్నాం’’ అని సహచర ఆటగాళ్లను హార్దిక్ పాండ్యా అభినందించాడు. ఐపీఎల్ క్వాలిఫైయర్-1: గుజరాత్ టైటాన్స్ వర్సెస్ రాజస్తాన్ రాయల్స్ స్కోర్లు టాస్- గుజరాత్ రాజస్తాన్ రాయల్స్- 188/6 (20) గుజరాత్ టైటాన్స్- 191/3 (19.3) 7 వికెట్ల తేడాతో గుజరాత్ విజయం ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్: డేవిడ్ మిల్లర్(38 బంతుల్లో 3 ఫోర్లు, 5 సిక్సర్లతో 68 పరుగులు-నాటౌట్) ఈ మ్యాచ్లో హార్దిక్ పాండ్యా 27 బంతుల్లో 40 పరుగులు నాటౌట్.. అదే విధంగా 2 ఓవర్లలో 14 పరుగులు ఇచ్చి 1 వికెట్ పడగొట్టాడు. చదవండి👉🏾IPL 2022: ఐపీఎల్లో సంజు శాంసన్ చెత్త రికార్డు.. తొలి కెప్టెన్గా..! చదవండి👉🏾Womens T20 Challenge: ఇదేం బౌలింగ్ యాక్షన్రా బాబు.. చూస్తే వావ్ అనాల్సిందే.. వీడియో వైరల్ Congratulations to the @gujarat_titans as they march into the Final in their maiden IPL season! 👏 👏 Stunning performance by @hardikpandya7 & Co to beat #RR by 7⃣ wickets in Qualifier 1 at the Eden Gardens, Kolkata. 🙌 🙌 Scorecard ▶️ https://t.co/O3T1ww9yVk#TATAIPL | #GTvRR pic.twitter.com/yhpj77nobA — IndianPremierLeague (@IPL) May 24, 2022 var request = 'https://www.sakshi.com/knowwidget/kwstr_4031445617.json'; $.ajaxPrefilter( function (request) { if (request.crossDomain && jQuery.support.cors) { var http = (window.location.protocol === 'http:' ? 'http:' : 'https:'); request.url = http + '//cors-anywhere.herokuapp.com/' + request.url; } }); $.get( request,function (response){ if(response == ''){ $('#frameId').hide(); }else{ $('#frameId').show(); } }); -
IPL 2022: అరంగేట్రంలోనే అదుర్స్.. అహ్మదాబాద్కు చలో చలో!
IPL 2022 GT Vs RR: కోల్కతా- ఐపీఎల్లో తొలిసారి బరిలోకి దిగిన గుజరాత్ టైటాన్స్ పాయింట్ల పట్టికలో అగ్రస్థానంతోనే సరిపెట్టుకోలేదు. తమ ఆటను మరో మెట్టుకు తీసుకెళుతూ మొదటి ప్రయత్నంలోనే ఫైనల్కు చేరింది. సొంతగడ్డపై సొంత అభిమానుల సమక్షంలో అహ్మదాబాద్లో ఈనెల 29న తుది పోరులో తలపడేందుకు అర్హత సాధించింది. మంగళవారం జరిగిన క్వాలిఫయర్–1లో గుజరాత్ 7 వికెట్ల తేడాతో రాజస్తాన్ రాయల్స్పై విజయం సాధించింది. టాస్ ఓడి ముందుగా బ్యాటింగ్కు దిగిన రాజస్తాన్ 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 188 పరుగులు చేసింది. జోస్ బట్లర్ (56 బంతుల్లో 89; 12 ఫోర్లు, 2 సిక్స్లు) మెరుపు ఇన్నింగ్స్ ఆడగా, సామ్సన్ (26 బంతుల్లో 47; 5 ఫోర్లు, 3 సిక్స్లు) రాణించాడు. అనంతరం గుజరాత్ 19.3 ఓవర్లలో 3 వికెట్లకు 191 పరుగులు చేసింది. ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’ డేవిడ్ మిల్లర్ (38 బంతుల్లో 68 నాటౌట్; 3 ఫోర్లు, 5 సిక్స్లు) దూకుడుకు హార్దిక్ పాండ్యా (27 బంతుల్లో 40 నాటౌట్; 5 ఫోర్లు), శుబ్మన్ గిల్ (21 బంతుల్లో 35; 5 ఫోర్లు, 1 సిక్స్), మాథ్యూ వేడ్ (30 బంతుల్లో 35; 6 ఫోర్లు) అండగా నిలిచారు. అయితే ఓడిన రాజస్తాన్కు ఫైనల్ చేరేందుకు మరో అవకాశం ఉంది. బుధవారం జరిగే ఎలిమినేటర్ విజేతతో శుక్రవారం జరిగే క్వాలిఫయర్–2 మ్యాచ్లో గెలిస్తే ఆ టీమ్ ఫైనల్లోకి ప్రవేశిస్తుంది. కీలక భాగస్వామ్యం... ఛేదనలో రెండో బంతికే సాహా (0) అవుట్ కావడం తో గుజరాత్కు షాక్ తగిలింది. అయితే గిల్, వేడ్ కలిసి దూకుడుగా ఆడారు. అశ్విన్ ఓవర్లో గిల్ వరు సగా 6, 4, 4 కొట్టడంతో పవర్ప్లే ముగిసేసరికే స్కోరు 64 పరుగులకు చేరింది. అయితే రెండో పరుగు తీసే ప్రయత్నంలో సమన్వయ లోపంతో గిల్ రనౌట్ కాగా, కొద్ది సేపటికే వేడ్ కూడా వెనుదిరిగాడు. ఈ స్థితిలో రాజస్తాన్ది పైచేయిగా కనిపిం చింది. కానీ గుజరాత్ కెప్టెన్ హార్దిక్ చాలా ప్రశాంతంగా, ఒత్తిడి లేకుండా ఆడుతూ ఇన్నింగ్స్ను నడిపించాడు. మరోవైపు నిలదొక్కుకునే వరకు జాగ్రత్తగా ఆడిన మిల్లర్ కూడా జోరు మొదలు పెట్టడంతో టైటాన్స్ పని సులువుగా మారింది. చివరి ఓవర్లో విజయానికి 16 పరుగులు చేయాల్సి ఉండటంతో కొంత ఉత్కంఠ నెలకొన్నా... ప్రసిధ్ కృష్ణ వేసిన తొలి మూడు బంతులను సిక్సర్లుగా మలచి మిల్లర్ గెలిపించేశాడు. పాండ్యా, మిల్లర్ నాలుగో వి కెట్కు 61 బంతుల్లోనే 106 పరుగులు జోడించారు. బట్లర్ మెరుపులు... సీజన్ తొలి 7 మ్యాచ్లలో 491 పరుగులు... ఆ తర్వాత ఒక్కసారిగా ఫామ్ కోల్పోయి తర్వాతి 7 మ్యాచ్లలో 138 పరుగులు... జోస్ బట్లర్ ఆట తీరిది! అయితే అసలు సమయంలో అతను మళ్లీ తన శైలిని అందుకొని రాజస్తాన్ జట్టులో తన విలువేంటో చూపించాడు. 16 ఓవర్లు ముగిసేసరికి రాయల్స్ స్కోరు 127 పరుగులు కాగా, బట్లర్ స్కోరు 38 బంతుల్లో 39 పరుగులే! అయితే తానాడిన తర్వాతి 18 బంతుల్లో అతను 8 ఫోర్లు, 2 సిక్సర్లతో 60 పరుగులు సాధించడం విశేషం. యశ్ దయాళ్ ఓవర్లో నాలుగు, జోసెఫ్ ఓవర్లో మూడు ఫోర్ల చొప్పున అతను బాదాడు. Congratulations to the @gujarat_titans as they march into the Final in their maiden IPL season! 👏 👏 Stunning performance by @hardikpandya7 & Co to beat #RR by 7⃣ wickets in Qualifier 1 at the Eden Gardens, Kolkata. 🙌 🙌 Scorecard ▶️ https://t.co/O3T1ww9yVk#TATAIPL | #GTvRR pic.twitter.com/yhpj77nobA — IndianPremierLeague (@IPL) May 24, 2022 -
'ఇచ్చినట్టే ఇచ్చి లాగేసుకుంది'.. సీఎస్కే పరిస్థితి ఇదే
టీమిండియా మాజీ క్రికెటర్ వసీం జాఫర్ ట్రోల్స్ చేయడంలో ఎప్పుడు ముందుంటాడు. తాజాగా ఆదివారం సీఎస్కేతో జరిగిన ఉత్కంఠ మ్యాచ్ను గుజరాత్ టైటాన్స్ లాగేసుకున్న విధానాన్ని జాఫర్ తనదైన శైలిలో వివరించాడు. సోషల్ మీడియాలో పాపులర్ అయిన ఒక ఫేమస్ మీమ్ను జాఫర్ ఉపయోగించాడు. ఆ మీమ్ ఏంటంటే.. ఒక యువతి స్లీవ్లెస్ డ్రెస్తో రోడ్డుపై నిల్చొని తన బాయ్ఫ్రెండ్ కోసం ఎదురుచూస్తుంటుంది. అదే సమయంలో ఒక 40 ఏళ్ల వ్యక్తి బుజాన సంచి తగిలించుకొని యువతికి ఎదురుగా వస్తాడు. కాగా ఆ యువతి 40 ఏళ్ల వ్యక్తికి హగ్ ఇచ్చినట్లు సిగ్నల్ ఇచ్చింది. దీంతో సదరు వ్యక్తి ఆ హగ్ తనకే ఇస్తుందేమోనని భ్రమపడి ఆమెను వాటేసుకుంటాడు.. కానీ ఆమె అతని వెనకాల ఉన్న తన బాయ్ఫ్రెండ్కు హగ్ ఇవ్వడానికి వెళుతుంది.. ఇది చూసిన ఆ 40 ఏళ్ల వ్యక్తి.. ''అరె.. మంచి చాన్స్ మిస్ అయిందే'' అన్నట్లుగా నాలుక కరుచుకొని అక్కడి నుంచి వెళ్లిపోతాడు. ఈ మీమ్ అప్పట్లో ట్రెండింగ్గా మారింది. తాజాగా ఇదే మీమ్ను సీఎస్కే, గుజరాత్ టైటాన్స్ మ్యాచ్కు ఉపయోగించాడు. 170 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన గుజరాత్ టైటాన్స్ ఒక దశలో గుజరాత్ 87 పరుగులకే ఐదు వికెట్లు కోల్పోయి ఓటమి దిశగా పయనిస్తోంది. ఇక రెండో గెలుపు ఖాయమని సీఎస్కే భావించింది. కానీ మిల్లర్ ఒంటిచేత్తో మ్యాచ్ను సీఎస్కే నుంచి లాగేసుకున్నాడు. 94* పరుగులు విధ్వంసకర ఇన్నింగ్స్ ఆడిన మిల్లర్కు.. స్టాండిన్ కెప్టెన్ రషీద్ ఖాన్(40) తోడవ్వడంతో మ్యాచ్ చేజారింది. అంతకముందు తొలుత బ్యాటింగ్ చేసిన సీఎస్కే నిర్థీత 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 169 పరుగులు చేసింది. రుతురాజ్ గైక్వాడ్ 73, రాయుడు 48, జడేజా 22* పరుగులతో రాణించారు. కాగా సీఎస్కేపై విజయంతో గుజరాత్ టైటాన్స్ ఆరు మ్యాచ్ల్లో ఐదు విజయాలు, ఒక ఓటమితో పాయింట్ల పట్టికలో టాప్ స్థానంలో నిలవగా.. సీఎస్కే ఆరు మ్యాచ్ల్లో ఒకటి గెలిచి.. మిగతా ఐదు ఓడి తొమ్మిదో స్థానంలో కొనసాగుతుంది. చదవండి: IPL 2022: క్యాచ్ మిస్సవ్వడంతో కోపంతో ఊగిపోయిన జడేజా.. వీడియో వైరల్ IPL 2022: కావ్యా మారన్.. ఆ నవ్వు ఇక ఆగేదే లే! This is exactly how Miller stole the win from CSK! #GTvCSK #IPL2022 pic.twitter.com/ASJHhBOytz — Wasim Jaffer (@WasimJaffer14) April 17, 2022 -
గుజరాత్ గర్జన
పుణే: గుజరాత్ టైటాన్స్ ఛేదనలో డేవిడ్ మిల్లర్ జోరు మీదున్నా... 17 ఓవర్ల దాకా మ్యాచ్ అయితే చెన్నై సూపర్ కింగ్స్ చేతిలోనే ఉంది. 170 పరుగుల లక్ష్యంలో 122/5 స్కోరు విజయానికి దూరం! 18 బంతుల్లో 48 పరుగుల కష్టమైన సమీకరణం. కానీ మిల్లర్ను మించిన రషీద్ ఖాన్ (21 బంతుల్లో 40; 2 ఫోర్లు, 3 సిక్సర్లు) మెరుపులు ఒక్క ఓవర్తో మ్యాచ్ను చెన్నై చేతుల్లోంచి గుజరాత్ లాగేసుకుంది. 18వ ఓవర్ వేసిన జోర్డాన్ను ఇష్టమొచ్చినట్లుగా రషీద్ ఆడేసుకున్నాడు. బంతుల్ని ఎలా వేసినా... విరుచుకుపడటంతో 6, 6, 4, 6, 1, 2లతో 25 పరుగులొచ్చాయి. సమీకరణం కాస్తా 12 బంతుల్లో 23 పరుగులుగా సులభమైంది. తర్వాత ఓవర్లో బ్రేవో... రషీద్ను అవుట్ చేసినా మిగతా కథను ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’ మిల్లర్ (51 బంతుల్లో 94 నాటౌట్; 8 ఫోర్లు, 6 సిక్సర్లు) అజేయంగా ముగించాడు. చెన్నై గెలవాల్సిన మ్యాచ్లో గుజరాత్ గర్జించింది. చివరకు 3 వికెట్ల తేడాతో చెన్నై అనూహ్యంగా ఓటమి పాలైంది. కాగా గాయం కారణంగా గుజరాత్ రెగ్యులర్ కెప్టెన్ హార్దిక్ పాండ్యా ఈ మ్యాచ్లో ఆడలేదు. రషీద్ ఖాన్ గుజరాత్ జట్టుకు కెప్టెన్గా వ్యవహరించాడు. శ్రమించిన రుతురాజ్ మొదట చెన్నై 20 ఓవర్లలో 5 వికెట్లకు 169 పరుగులు చేసింది. రుతురాజ్ గైక్వాడ్ (48 బంతుల్లో 73; 5 ఫోర్లు, 5 సిక్సర్లు) చెలరేగాడు. ఓపెనర్ ఉతప్ప (2), టాపార్డర్లో మొయిన్ అలీ (1) నిరాశ పరిస్తే... రాయుడు (31 బంతుల్లో 46; 4 ఫోర్లు, 2 సిక్సర్లు)తో రుతురాజ్ మూడో వికెట్కు 92 పరుగులు జతచేశాడు. శివమ్ దూబే (19; 2 ఫోర్లు), జడేజా (22 నాటౌట్; 2 సిక్సర్లు) ధాటిగా ఆడారు. తర్వాత గుజరాత్ 19.5 ఓవర్లలో 7 వికెట్లు కోల్పోయి 170 పరుగులు చేసి గెలిచింది. లక్ష్యఛేదనలో ఓపెనింగ్ నుంచి ఆరో వరుస బ్యాటర్ దాకా ఒక్క మిల్లర్ను మినహాయిస్తే ఐదుగురు బ్యాటర్లు అంతా కలిసి చేసిన స్కోరు 29! సాహా (11), గిల్ (0), శంకర్ (0), అభినవ్ (12), తెవాటియా (6) చేతులెత్తేస్తే మిల్లర్ సూపర్ ఆటతో గెలిపించాడు. ఐపీఎల్లో నేడు రాజస్తాన్ రాయల్స్ X కోల్కతా నైట్రైడర్స్ వేదిక: ముంబై, రాత్రి గం. 7:30 నుంచి స్టార్ స్పోర్ట్స్–1లో ప్రత్యక్ష ప్రసారం -
ఏంటి హార్దిక్ అలా అరుస్తున్నావు.. ఔటయ్యానన్న కోపమా.. వైరల్
అఖరి వరకు ఉత్కంఠ భరితంగా జరిగిన మ్యాచ్లో పంజాబ్ కింగ్స్పై గుజరాత్ టైటాన్స్ 6 వికెట్ల తేడాతో విజయం సాధించింది. గుజరాత్ విజయానికి 2 బంతుల్లో 12 పరుగులు అవసరమైన దశలో తెవాటియా రెండు వరుస సిక్స్లు బాది జట్టును విజయ తీరాలకు చేర్చాడు. అయితే గుజరాత్ ఇన్నింగ్స్ అఖరి ఓవర్లో విజయానికి 19 పరుగులు కావాలి. ఈ క్రమంలో బంతిని పంజాబ్ కెప్టెన్ మయాంక్ అగర్వాల్ ఓడియన్ స్మిత్కు అందించాడు. స్మిత్ వేసిన తొలి బంతిని డేవిడ్ మిల్లర్ మిస్ చేశాడు. అయితే బై రూపంలోనైనా పరుగు సాధించాలని మిల్లర్ అనుకున్నాడు. దీంతో నాన్ స్ట్రైకర్ వైపు పరిగెత్తాడు. నాన్ స్ట్రైకర్లో ఉన్న హార్దిక్ పాండ్యా కూడా వికెట్ కీపర్ వైపు పరిగెత్తాడు. ఈ క్రమంలో వికెట్ కీపర్ జానీ బెయిర్స్టో నేరుగా వికెట్లను గిరాటేశాడు. దీంతో కీలక దశలో హార్దిక్ పాండ్యా పెవిలియన్కు చేరాడు. అయితే హార్దిక్ ఆ పరుగు కోసం అంత ఆసక్తి చూపించలేనట్టుగా అనిపించింది. దీంతో ఔటైన కోపంలో అసహానానకి గురైన హార్ధిక్.. మిల్లర్ వైపు చూస్తూ గట్టిగా అరిచాడు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది. ఈ వీడియోపై ఓ నెటిజన్ స్పందిస్తూ.." ఏంటి హార్దిక్ ఔటయ్యాను అన్న కోపమా.. అలా అరుస్తున్నావు" కామెంట్ చేశాడు. చదవండి: IPL 2022: వారెవ్వా తెవాటియా.. ధోని తర్వాత... pic.twitter.com/UerGSWyyYl — Sam (@sam1998011) April 8, 2022 -
ఎవరు కొనరేమో అనుకున్నాం.. చివర్లో అదృష్టం
ఐపీఎల్ మెగావేలం విజయవంతంగా ముగిసింది. రెండు రోజుల పాటు సాగిన లీగ్ వేలంలో క్రికెటర్లను సొంతం చేసుకునేందుకు 10 ఫ్రాంచైజీలు హోరాహోరీగా పోటీ పడ్డాయి. గరిష్టంగా 217 స్థానాలకు ఆటగాళ్లను ఎంచుకునే అవకాశం ఉండగా అన్ని జట్లు కలిపి 204 మందితో సరిపెట్టాయి. ఇందులో భారత్ నుంచి 137 మంది ఉండగా... విదేశీ క్రికెటర్లు 67 మంది ఉన్నారు. ఎప్పటిలాగే కొందరు ఆటగాళ్లకు అంచనాలకు మించిన అనూహ్య ధర పలకగా... మరికొందరు స్టార్లు ఆశ్చర్యకరంగా తక్కువ విలువతో సరిపెట్టుకోవాల్సి వచ్చింది. కాగా ఆశ్చర్యంగా అసలు వేలంలో అమ్ముడుపోతారో లేదో అని అనుకున్న కొందరి ఆటగాళ్లను చివర్లో అదృష్టం వరించింది. వీళ్లది లక్ అనే చెప్పొచ్చు. చదవండి: IPL 2022 Auction: అన్క్యాప్డ్ ప్లేయర్కు అంత ధర.. ఎవరీ యష్ దయాల్ తొలి రోజు అమ్ముడుపోక రెండో రోజు చివర్లో మళ్లీ వేలానికి వచ్చిన వారిలో డేవిడ్ మిల్లర్కు రూ. 3 కోట్ల విలువ పలికింది. అప్పటి వరకు ఒక్క వికెట్ కీపర్ను కూడా తీసుకోని గుజరాత్ టైటాన్స్ వరుసగా వృద్ధిమాన్ సాహా, మాథ్యూ వేడ్లను తీసుకుంది. భారత పేసర్ ఉమేశ్ యాదవ్ను కూడా చివర్లో కోల్కతా బేస్ప్రైస్కే తీసుకోవడం ఊరట కలిగించింది. 333 టి20ల్లో ఏకంగా 146.35 స్ట్రయిక్రేట్తో 9,346 పరుగులు సాధించిన ఘనమైన రికార్డు ఉన్న అలెక్స్ హేల్స్ సుదీర్ఘ విరామం తర్వాత మళ్లీ ఐపీఎల్లోకి అడుగు పెట్టాడు. కోల్కతా తక్కువ మొత్తానికే (రూ.కోటీ 50 లక్షలు) అతడిని దక్కించుకోగలిగింది. ఇంగ్లండ్కు చెందిన డేవిడ్ విల్లీ (బెంగళూరు; రూ. 2 కోట్లు) ఈ సీజన్ వేలంలో అమ్ముడైన చివరి ఆటగాడిగా నిలిచాడు. చదవండి: IPL 2022 Mega Auction: ఎవరీ షెపర్డ్.. 7.75 కోట్లకు సన్రైజర్స్ హైదరాబాద్ సొంతం! -
ఒక్క మ్యాచ్.. నాలుగు రికార్డులు బద్దలయ్యే అవకాశం
ఐపీఎల్ 2021 సెకండ్ఫేజ్లో భాగంగా నేడు ముంబై ఇండియన్స్, రాజస్తాన్ రాయల్స్ మధ్య మ్యాచ్ జరగనుంది. కాగా ఈ మ్యాచ్లో ఇరు జట్ల ఆటగాళ్లకు వ్యక్తిగత రికార్డులు అందుకునే అవకాశం ఉంది. ఆ ఆటగాళ్లు ఎవరు.. వారు అందుకునే రికార్డులు ఏంటో ఒకసారి పరిశీలిద్దాం. రోహిత్ శర్మ: Courtesy: IPL Twitter ముంబై ఇండియన్స్కు విజయవంతమైన కెప్టెన్గా పేరున్న రోహిత్ శర్మ 400 సిక్సర్ల మైలురాయిని అందుకోవడానికి కేవలం రెండు సిక్సర్ల దూరంలో మాత్రమే ఉన్నాడు. రాజస్తాన్తో జరిగే మ్యాచ్లో మరో రెండు సిక్సర్లు కొడితే రోహిత్ ఆ రికార్డును అందుకునే అవకాశం ఉంది. భారీ సిక్సర్లను అలవోకగా బాదే రోహిత్కు ఇదేం పెద్దలెక్క కాదు. ఇక 211 ఐపీఎల్ మ్యాచ్ల్లో 5,571 పరుగులు చేసిన రోహిత్ ముంబై ఇండియన్స్ తరపునే 4,300 పరుగులు సాధించడం విశేషం. చదవండి: Virat Kohli: తగ్గేదే లే.. గుర్తుపెట్టుకొని మరీ కౌంటర్ ఇచ్చాడు ఇషాన్ కిషన్: Courtesy: IPL Twitter ముంబై ఇండియన్స్ యువ ఆటగాడు ఇషాన్ కిషన్ ఈ సీజన్లో అనుకున్నంత స్థాయిలో రాణించడం లేదు. ఫామ్ కోల్పోయి పరుగులు సాధించడానికి కష్టాలు పడుతున్నాడు. అయితే అతను ఐపీఎల్లో ముంబై ఇండియన్స్ తరపున 1000 పరుగుల అందుకోవడానికి కేవలం ఒక్క పరుగు దూరంలో మాత్రమే ఉన్నాడు. ఫామ్లో లేకపోయినప్పటికి ఒక్క పరుగు చేయడం ద్వారా ఇషాన్ కిషన్ వెయ్యి పరుగుల మైలురాయిని అందుకోనున్నాడు. ఇక ముంబై తరపున 39 మ్యాచ్ల్లో 999 పరుగులు సాధించాడు. డేవిడ్ మిల్లర్: Courtesy: IPL Twitter రాజస్తాన్ రాయల్స్ తరపున ఆడుతున్న డేవిడ్ మిల్లర్ 2వేల పరుగుల మైలురాయిని అందుకోవడానికి 41 పరుగుల దూరంలో ఉన్నాడు. ఈ సీజన్లో 8 మ్యాచ్లాడిన మిల్లర్ 109 పరుగులు చేశాడు. ఓవరాల్గా ఈ దక్షిణాఫ్రికా బ్యాటర్ 88 మ్యాచ్ల్లో 1959 పరుగులు చేశాడు. చదవండి: Sehwag- SRH: 'నిద్రమాత్రల్లా కనిపించారు.. ఆ నాలుగు ఓవర్లు నిద్రపోయా' ముస్తాఫిజుర్ రెహమాన్: Courtesy: IPL Twitter ఐపీఎల్లో 50వికెట్ల మైలురాయిని అందుకోవడానికి ముస్తాఫిజుర్ కేవలం రెండు వికెట్ల దూరంలో మాత్రమే ఉన్నాడు. ప్రస్తుత ఫామ్ దృశ్యా ముస్తాఫిజుర్కు ఇది పెద్ద కష్టం కాకపోవచ్చు. ఈ సీజన్లో రాజస్తాన్ రాయల్స్కు ప్రాతినిధ్యం వహిస్తున్న ముస్తాఫిజుర్ 12 మ్యాచ్ల్లో 13 వికెట్లు పడగొట్టాడు. ఐపీఎల్లో ఇప్పటికే ప్లేఆఫ్స్కు సంబంధించి తొలి మూడుస్థానాలు ఖరారు కావడంతో నాలుగో స్థానానికి మూడుజట్లు పోటీ పడుతున్నాయి. 12 మ్యాచ్ల్లో 5 విజయాలు.. ఏడు ఓటములతో ఆరు, ఏడు స్థానాల్లో ఉన్న రాజస్తాన్, ముంబైలకు ఈ మ్యాచ్ కీలకం. ఇక ఐదో స్థానంలో ఉన్న కేకేఆర్ ఒక్క మ్యాచ్ గెలిస్తే ఎలాంటి సమీకరణాలు అవసరం లేకుండా నాలుగో జట్టుగా ప్లేఆఫ్స్కు చేరనుంది. చదవండి: Ziva Singh Dhoni: మరేం పర్లేదు జీవా.. డాడీ ఫైనల్ గెలుస్తాడులే! -
'నీకు హిందీ వచ్చా' అంటూ ప్రశ్న.. డేవిడ్ మిల్లర్ కౌంటర్
కొలంబొ: ఐపీఎల్ 14వ సీజన్ రెండో అంచె పోటీలకు వారం సమయం మాత్రమే మిగిలి ఉంది. ఇప్పటికే లీగ్లో పాల్గొననున్న విదేశీ ఆటగాళ్లంతా యూఏఈకి చేరుకుంటున్నారు. ఈసారి అభిమానుల కోలాహలంతో మైదానాలు హోరెత్తనున్నాయి. ఈ నేపథ్యంలోనే దక్షిణాఫ్రికా సీనియర్ బ్యాట్స్మన్ డేవిడ్ మిల్లర్.. ఒక అభిమాని వేసిన చిలిపి ప్రశ్నకు ధీటుగా కౌంటర్ ఇచ్చాడు. మిల్లర్ ప్రస్తుతం శ్రీలంక పర్యటనలో ఉన్న సంగతి తెలిసిందే. ఐపీఎల్లో రాజస్తాన్ రాయల్స్కు ప్రాతినిధ్యం వహిస్తున్న మిల్లర్ ఆ జట్టు ఫీల్డింగ్ కోచ్ దిశాంత్ యగ్నిక్ ట్విటర్లో వేసిన ప్రశ్నకు తనదైన శైలిలో మీమ్ క్రియేట్ చేశాడు. చదవండి: IPL 2021 Phase 2: ఇయాన్ మోర్గాన్ నా గురించి ఏమనుకుంటున్నాడో.. మిల్లర్ను ఉద్దేశించి దిశాంత్.. ''మీరు రాజస్తాన్ రాయల్స్ అడ్మిన్ ఎవరో చూడాలనుకుంటున్నారా?'' అని అడిగాడు. దీనికి బదులుగా మిల్లర్.. కబీ ఖుషి కబీ గమ్ సినిమాలోని ఫేమస్ డైలాగ్ ''బస్ కీజియే బహుత్ హో గయా''( ఇక చాలు.. ఇక్కడితో ఆపేయ్) అని పెట్టాడు. మిల్లర్ పెట్టిన మీమ్పై ఒక అభిమాని చిలిపి ప్రశ్న వేశాడు. ''నీకసలు హిందీ వచ్చా? అని అడిగాడు. ''ఇట్టూ సా'' అంటూ కామెడీ నైట్స్ విత్ కపిల్ షోలో అలీ సాగర్ పాపులర్ డైలాగ్ను పెట్టాడు. ఇట్టు సా అంటే '' నాకింతే వచ్చు'' అని అర్థం. కాగా ఐపీఎల్ 14వ సీజన్ మలిదశ పోటీలకు ఇంగ్లండ్ స్టార్ ఆటగాళ్లు బెన్ స్టోక్స్, జాస్ బట్లర్ అందుబాటులో లేకపోవడంతో డేవిడ్ మిల్లర్ కీలకం కానున్నాడు. ఈ సీజన్లో మిల్లర్ 6 మ్యాచ్ల్లో 102 పరుగులు చేశాడు. ఇక సంజూ శాంసన్ ఆధ్వర్యంలోని రాజస్తాన్ రాయల్స్ ఈ సీజన్లో పడుతూ లేస్తూ వచ్చింది. ఆడిన ఏడు మ్యాచ్ల్లో మూడు విజయాలు.. నాలుగు ఓటములతో పాయింట్ల పట్టికలో ఐదో స్థానంలో ఉంది. చదవండి: IPL 2021 Second Phase: ఐపీఎల్లో నెట్ బౌలర్లుగా విండీస్ బౌలర్లు... https://t.co/RNlH6g3xun pic.twitter.com/TxAwlOStrG — David Miller (@DavidMillerSA12) September 13, 2021 -
ఇప్పటికీ ఆయనే బెస్ట్ ఫినిషర్: మిల్లర్
దుబాయ్: అంతర్జాతీయ క్రికెట్కు టీమిండియా మాజీ కెప్టెన్ ఎంఎస్ ధోని రిటైర్మెంట్ ప్రకటించినా ఆయన కెప్టెన్సీని అందరు ప్రశంసిస్తున్నారు. తాజాగా రాజస్థాన్ రాయల్స్ ఆటగాడు డేవిడ్ మిల్లర్ ధోని నైపుణ్యాలను గుర్తు చేస్తు ప్రశంసలు కురిపించాడు. ఓ మీడియా చానెల్లో మిల్లర్ మాట్లాడుతూ అంతర్జాతీయ క్రికెట్కు ధోని గుడ్బై చెప్పినప్పటికి ఐపీఎల్ 2020లో ఆయన మెరుపులను ధోని అభిమానులు, క్రికెట్ను ఇష్టపడే వారు చూడవచ్చని తెలిపారు. ప్రపంచ క్రికెట్లో ఇప్పటికి ధోనియే బెస్ట్ ఫినిషర్ అని పేర్కొన్నాడు. గ్రౌండ్లో ఆయన ప్రదర్శించే నైపుణ్యాలు క్రికెటర్లందరికి ఆదర్శమన్నాడు. ఎటువంటి పరిస్థితినైనా తన అధీనంలోకి తెచ్చుకోవడం ఆయనకే సాధ్యమని అన్నారు. ఎంత ఒత్తిడి ఉన్న ప్రశాంతంగా ఎదుర్కొనే తీరు ధోనిని దిగ్గజ క్రికెటర్ల జాబితాలో చేర్చిందని అన్నాడు. ఒత్తిడి సందర్భాల్లో ఆయన ప్రదర్శించే నైపుణ్యాలు తనకు చాలా ఇష్టమని తెలిపాడు. మిల్లర్కు ధోని ఆటతీరు, వ్యక్తిత్వం అంటే విపరీతమైన ఇష్టం. గత ఐపీఎల్లో మిల్లర్ కింగ్స్ లెవన్ పంజాబ్ తరపున ఆడాడు. ప్రస్తుత ఐపీఎల్2020లో డేవిడ్ మిల్లర్ రాజస్థాన్ రాయల్స్ తరపున బరిలో దిగనున్నాడు. అయితే సౌతాఫ్రికా ఆటగాగు డేవిడ్ మిల్లర్ అంతర్జాతీయ క్రికెట్లో మంచి బ్యాట్స్మెన్గా, కెప్టెన్గా గుర్తుంపు తెచ్చుకున్న విషయం తెలిసిందే. (చదవండి: ‘ఆ ఫాస్ట్ బౌలర్పైనే ధోని ఆశలు’) -
విసిరేసి పడిపోతే.. పడిపోయి పట్టేశాడు..!
పోర్ట్ ఎలిజబెత్: ఆస్ట్రేలియాతో మూడు టీ20ల సిరీస్లో భాగంగా రెండో మ్యాచ్లో దక్షిణాఫ్రికా అద్భుతమైన విజయాన్ని అందుకుంది. తొలి టీ20లో ఆసీస్ గెలిస్తే, అందుకు సఫారీలు ఘనంగా ప్రతీకారం తీర్చుకున్నారు. ఆదివారం రాత్రి జరిగిన రెండో టీ20లో ముందుగా బ్యాటింగ్ చేసిన సఫారీలు నిర్ణీత ఓవర్లలో నాలుగు వికెట్ల నష్టానికి 158 పరుగులు చేయగా, ఆసీస్ను 146 పరుగులకే కట్టడి చేసి విజయాన్ని ఖాతాలో వేసుకున్నారు. అయితే ఈ మ్యాచ్లో డుప్లెసిస్-డేవిడ్ మిల్లర్లు పట్టిన క్యాచ్ హైలైట్గా నిలిచింది. లక్ష్య ఛేదనలో భాగంగా లుంగి ఎన్గిడి వేసిన 18 ఓవర్ ఐదో బంతిని ఆసీస్ ఆల్ రౌండర్ మిచెల్ మార్ష్ స్ట్రైట్గా సిక్స్ కొట్టే యత్నం చేశాడు. అయితే ఆ క్యాచ్ కోసం బౌండరీ లైన్ వద్దకు డుప్లెసిస్-మిల్లర్లు ఇద్దరూ పరుగెత్తుకొచ్చారు. ముందుగా డుప్లెసిస్ క్యాచ్ను పట్టేసి బౌండరీ లైన్ లోపల పడే సమయంలో బంతిని గ్రౌండ్లోపలికి వేగంగా విసిరేయగా, దాన్ని మిల్లర్ వృథా కానివ్వ లేదు. ఆ బంతిని ఎంతో చాకచాక్యంతో పట్టేసుకుని గ్రౌండ్లో పడిపోయాడు. క్యాచ్ను పట్టే క్రమంలో ఇలా ఒకరు బంతిని విసిరేసి పడిపోతే, మరొకరు పడిపోయి మరీ ఒడిసి పట్టుకోవడం సఫారీల చురుకైన ఫీల్డింగ్కు అద్దం పడుతోంది. ఇదే మ్యాచ్కు టర్నింగ్ పాయింట్ అయ్యింది. మిచెల్ మార్ష్ ఔటయ్యే సమయానికి ఆసీస్ 138 పరుగులతో ఉంది. ఆ తర్వాత మాథ్యూ వేడ్(1), ఆస్టన్ ఆగర్(1)లు నిరాశపరచడంతో ఆసీస్పై ఒత్తిడి పెరిగింది. డేవిడ్ వార్నర్(67 నాటౌట్) చివరి వరకూ క్రీజ్లో ఉన్నప్పటికీ జట్టును గెలిపించలేకపోయాడు. చివరి ఓవర్లో ఆసీస్ విజయానికి 17 పరుగులు కావాల్సి న తరుణంలో నాలుగు పరుగులు మాత్రమే వచ్చాయి. దాంతో 12 పరుగుల తేడాతో దక్షిణాఫ్రికా గెలిచి సిరీస్ను సమం చేసింది.సిరీస్ నిర్ణయాత్మక మూడో టీ20 బుధవారం జరగనుంది. (ఇక్కడ చదవండి: సమష్టి వైఫల్యం.. 10 వికెట్ల పరాభవం) Wowee! What a catch! #SAvAUS pic.twitter.com/3UPDKpNZuU — Trishan Naidoo (@trishannai) February 23, 2020 -
హార్దిక్ క్యాచ్.. మిల్లర్ ‘హాఫ్ సెంచరీ’
బెంగళూరు: అంతర్జాతీయ టీ20ల్లో అత్యధిక క్యాచ్లు అందుకున్న ఫీల్డర్గా దక్షిణాఫ్రికా క్రికెటర్ డేవిడ్ మిల్లర్ పాకిస్తాన్ సీనియర్ క్రికెటర్ షోయబ్ మాలిక్ సరసన చేరాడు. గురువారం చిన్నస్వామి స్టేడియం వేదికగా టీమిండియాతో జరిగిన మ్యాచ్లో హార్దిక్ పాండ్యా ఇచ్చిన క్యాచ్ను అందుకోవడంతో మిల్లర్ ఈ రికార్డు సాధించాడు. ఇప్పటివరకు మాలిక్ 50 క్యాచ్లతో అగ్రస్థానంలో ఉండగా.. తాజాగా హార్దిక్ క్యాచ్తో మిల్లర్ కూడా అతడి సరసన చేరాడు. మాలిక్ 111 టీ20ల్లో ఈ ఘనత సాధించగా.. మిల్లర్ కేవలం 72 మ్యాచ్ల్లోనే ఈ రికార్డు అందుకోవడం విశేషం. ఇక ఈ జాబితాలో తొలి రెండు స్థానాల్లో మిల్లర్, మాలిక్లు ఉండగా.. డివిలియర్స్(44), రాస్ టేలర్(44), సురేశ్ రైనా(42) తరువాతి స్థానాల్లో ఉన్నారు. ఆదివారం టీమిండియా-దక్షిణాఫ్రికాల మధ్య జరిగిన ఏకపక్షపోరులో కోహ్లి సేన చతికిలపడింది. ఈ మ్యాచ్లో ప్రొటీస్ జట్టు 9 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. దీంతో మూడు టీ20ల సిరీస్ 1-1తో డ్రాగా ముగిసింది. తొలుత బౌలింగ్తో అదరగొట్టిన పర్యాటక జట్టు.. అనంతరం బ్యాటింగ్ లోనూ చెలరేగింది. టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న టీమిండియా దక్షిణాఫ్రికా కట్టుదిట్టంగా బౌలింగ్ చేశారు. దీనికి తోడు బ్యాట్స్మెన్ పూర్తిగా విఫలమవ్వడంతో కోహ్లి సేన నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 134 పరుగులే చేసింది. భారత ఆటగాళ్లలో శిఖర్ ధావన్(36) మినహా ఎవరూ రాణిచంలేదు. ఇక స్వల్ప లక్ష్యంతో బరిలోకి దిగిన దక్షిణాఫ్రికా స్వేచ్చగా బ్యాటింగ్ చేసింది. సారథి డికాక్ (79 నాటౌట్; 59 బంతుల్లో 6ఫోర్లు, 5 సిక్సర్లు) ఆకాశమే హద్దుగా చెలరేగడంతో దక్షిణాఫ్రికా సునాయసంగా విజయాన్ని అందుకుంది. -
రాజస్తాన్ రాయల్స్పై కింగ్స్ ఎలెవన్ పంజాబ్ గెలుపు
-
మిల్లర్ మెరుపు ఫీల్డింగ్
కేప్టౌన్: మైదానంలో నాలుగు క్యాచ్లు...రెండు రనౌట్లు... తొలి టి20లో దక్షిణాఫ్రికా క్రికెటర్ డేవిడ్ మిల్లర్ ప్రదర్శన ఇది. ఆరుగురు పాకిస్తాన్ బ్యాట్స్మెన్ను ఔట్ చేయడంలో కీలక పాత్ర పోషించిన మిల్లర్ ‘మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్’గా నిలిచాడు. అతని ఫీల్డింగ్ నైపుణ్యంతో శుక్రవారం ఇక్కడ జరిగిన మ్యాచ్లో దక్షిణాఫ్రికా 6 పరుగుల తేడాతో పాకిస్తాన్ను ఓడించింది. టాస్ ఓడి ముందుగా బ్యాటింగ్కు దిగిన దక్షిణాఫ్రికా 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 192 పరుగులు చేసింది. కెప్టెన్ ఫాఫ్ డు ప్లెసిస్ (45 బంతుల్లో 78; 6 ఫోర్లు, 4 సిక్సర్లు), రీజా హెన్డ్రిక్స్ (41 బంతుల్లో 74; 8 ఫోర్లు, 2 సిక్సర్లు) అర్ధ సెంచరీలతో సత్తా చాటారు. వీరిద్దరు రెండో వికెట్కు 73 బంతుల్లోనే 131 పరుగులు జోడించడం విశేషం. ఉస్మాన్ షిన్వారికి 3 వికెట్లు దక్కాయి. అనంతరం పాకిస్తాన్ 20 ఓవర్లలో 9 వికెట్లకు 186 పరుగులు చేయగలిగింది. కెప్టెన్ షోయబ్ మాలిక్ (31 బంతుల్లో 49; 5 ఫోర్లు, 1 సిక్స్), హుస్సేన్ తలత్ (32 బంతుల్లో 40; 5 ఫోర్లు), బాబర్ ఆజమ్ (27 బంతుల్లో 38; 3 ఫోర్లు, 1 సిక్స్) రాణించారు. -
చాహల్ మళ్లీ నోబాల్ వేశాడా!!
పోర్ట్ ఎలిజబెత్: ఐదో వన్డేలో లెగ్ స్పిన్నర్ యజువేంద్ర చహాల్ వేసిన బంతిని అంచనా వేయడంలో డేవిడ్ మిల్లర్ మరోసారి విఫలమయ్యాడు. చాహల్ బంతిని కొట్టేందుకు మిల్లర్ ముందుకొచ్చాడు.. అనూహ్యంగా బంతి గింగిరాలు తిరుగుతూ లెగ్ స్టంప్ను ఢీకొట్టింది. అయినా వెంటనే పెవిలియన్ వెళ్లేందుకు మిల్లర్ తటపటాయించాడు. మళ్లీ ఏదైనా లక్కు కలిసివస్తుందన్న ఆశ అతనిలో ఉందేమో.. ఒకింత నిరాశగా, ఒకింత సంశయంగా పదేపదే స్కోరు బోర్డును చూస్తూ అతను పెవిలియన్ బాట పట్టాడు. బౌల్డ్ అయిన మిల్లర్ ఇలా తటపటాయిస్తూ.. సంశయిస్తూ పెవిలియన్కు చేరడం వెనుక కారణం నాలుగో వన్డే. జోహాన్నెస్బర్గ్లో జరిగిన ఈ వన్డేలో మిల్లర్కు అనూహ్యంగా లైఫ్ దొరికింది. చాహల్ వేసిన బంతిని మిల్లర్ అంచనా వేయడంలో ఇలాగే విఫలయ్యాడు. ఏడు పరుగుల వద్ద అతను బౌల్డ్ అయ్యాడు. అయితే, చాహల్ నిర్లక్ష్యం కారణంగా అది నోబాల్ కావడంతో మిల్లర్కు లైఫ్ దొరికింది. టీమిండియాకు మ్యాచ్ పోయింది. ఇలా లైఫ్ అందుకున్న మిల్లర్ చెలరేగి ఆడాడు. 28 బంతుల్లో 39 పరుగులు చేశాడు. అతనికి హెన్రిక్ క్లాసెన్ (27 బంతుల్లో 43) జతకలువడంతో నాలుగో వికెట్కు ఈ జోడీ 41 బంతుల్లో 72 పరుగులు జోడించింది. ఈ భాగస్వామ్యం వర్షంతో కుదించబడిన నాలుగో వన్డేలో దక్షిణాఫ్రికాకు విజయం చేకూర్చింది. మ్యాచ్ కీలక దశలో నోబాల్ వేసి.. వికెట్ అవకాశాన్ని చేజేతులా దూరం చేసుకున్న చాహల్ తీరుపై సర్వత్రా విమర్శలు వ్యక్తమయ్యాయి. సౌరవ్ గంగూలీ, సునీల్ గవాస్కర్ అతని తీరుపై మండిపడ్డారు. ఈ మ్యాచ్ నుంచి గుణపాఠం నేర్చుకున్న చాహల్ ఐదో వన్డేలో చాలా బుద్ధిగా బౌలింగ్ చేశాడు. తప్పులకు తావు ఇవ్వలేదు. ఈ మ్యాచ్లో స్పిన్నర్లు కుల్దీప్ యాదవ్ (4 వికెట్లు), చాహల్ (రెండు వికెట్లు) అద్భుతంగా రాణించారు. గత మ్యాచ్లో మిల్లర్ విషయంలో పొరపాట్లు చేసిన చాహల్ ఈ మ్యాచ్లో మాత్రం అద్భుతంగా అతన్ని బోల్తా కొట్టించాడు. అతన్ని బౌల్డ్ చేసిన చాహల్.. నోరు మూసుకో అన్నట్టుగా ఎక్స్ప్రెషన్స్ ఇచ్చాడు. -
మిల్లర్ విధ్వంసం
పోష్స్ట్రూమ్: దక్షిణాఫ్రికా బ్యాట్స్మన్ డేవిడ్ మిల్లర్ (36 బంతుల్లో 101 నాటౌట్; 7 ఫోర్లు, 9 సిక్సర్లు) విధ్వంసకర బ్యాటింగ్తో అంతర్జాతీయ టి20 క్రికెట్లో సరికొత్త రికార్డును సృష్టించాడు. 35 బంతుల్లోనే శతకాన్ని బాది తమ దేశానికే చెందిన రిచర్డ్ లెవీ (న్యూజిలాండ్పై 45 బంతుల్లో 100) పేరిట ఉన్న రికార్డును తిరగ రాశాడు. మిల్లర్తో పాటు హషీమ్ ఆమ్లా (51 బంతుల్లో 85; 11 ఫోర్లు, 1 సిక్స్) చెలరేగడంతో బంగ్లాదేశ్తో ఆదివారం జరిగిన రెండో టి20లో సఫారీలు 83 పరుగులతో గెలుపొంది 2–0తో సిరీస్ను కైవసం చేసుకున్నారు. మొదట బ్యాటింగ్ చేసిన దక్షిణాఫ్రికా 20 ఓవర్లలో 4 వికెట్లకు 224 పరుగులు చేసింది. బంగ్లా బౌలర్ సైఫుద్దీన్ వేసిన 19వ ఓవర్లో వరుసగా 5 సిక్సర్లు బాదిన మిల్లర్... తను ఆడిన చివరి 15 బంతుల్లోనే 58 పరుగుల్ని పిండుకున్నాడు. అనంతరం బంగ్లాదేశ్ 18.3 ఓవర్లలో 141 పరుగులకు కుప్పకూలింది. -
దక్షిణాఫ్రికా తడబాటు
ఆదుకున్న డేవిడ్ మిల్లర్ రాణించిన పాక్ బౌలర్లు బర్మింగ్హామ్: పాకిస్తాన్ బౌలర్లు సమష్టిగా రాణించారు. దక్షిణాఫ్రికా బ్యాట్స్మెన్ను కట్టడి చేశారు. చాంపియన్స్ ట్రోఫీ గ్రూప్ ‘బి’లో భాగంగా బుధవారం జరిగిన మ్యాచ్లో పాకిస్తాన్ ఘన విజయం సాధించింది. టాస్ గెలిచి మొదట బ్యాటింగ్కు దిగిన సఫారీ తడబడింది. 50 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 219 పరుగులు చేసింది. ఓ వైపు ప్రత్యర్థి పేస్కు, స్పిన్కు సహచరులు బెంబేలెత్తుతుంటే డేవిడ్ మిల్లర్ (104 బంతుల్లో 75 నాటౌట్; 1 ఫోర్, 3 సిక్సర్లు) మొండిగా పోరాడాడు. నిప్పులు చెరిగే బంతులతో హసన్ అలీ 3, జునైద్ ఖాన్ 2 వికెట్లు తీయగా, స్పిన్నర్ వసీమ్ 2 వికెట్లు పడగొట్టాడు. తొలి 8 ఓవర్ల వరకు బాగానే ఉన్నా... తొమ్మిదో ఓవర్ నుంచి దక్షిణాఫ్రికాకు కష్టాలు మొదలయ్యాయి. దీంతో 40 పరుగుల వరకు ఒక్క వికెట్ కోల్పోని జట్టు... ఆ తర్వాత చేసిన మరో 78 పరుగుల వ్యవధిలో ఏకంగా 6 వికెట్లను కోల్పోయింది. ఓపెనర్లు ఆమ్లా (16), డికాక్ (49 బంతుల్లో 33; 2 ఫోర్లు) మొదలుకొని... డు ప్లెసిస్ (26), కెప్టెన్ డివిలియర్స్ (0), డుమిని (8) అంతా పాక్ పేస్, స్పిన్కు కుదేలయ్యారు. దీంతో 118 పరుగులకే 6 వికెట్లు కోల్పోయింది. ఈ దశలో మోరిస్ (28), రబడ (26) అండతో మిల్లర్ జట్టును గట్టెక్కించాడు. చిచ్చర పిడుగల్లే చెలరేగే మిల్లర్ తన స్వభావానికి విరుద్ధంగా నింపాదిగా ఆడాడు. 83 బంతుల్లో అర్ధసెంచరీ సాధించిన మిల్లర్ ఇన్నింగ్స్లో ఒకే ఒక్క ఫోర్ ఉండగా, మూడు సిక్సర్లున్నాయి. ఊరించే లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన పాకిస్తాన్ వర్షం వల్ల మ్యాచ్ నిలిచే సమయానికి 27 ఓవర్లలో 3 వికెట్లకు 119 పరుగులు చేసింది. క్రీజులో బాబర్ ఆజమ్ (31), షోయబ్ మాలిక్ (16) ఉన్నారు. వర్షం వల్ల మిగతా ఆట సాధ్య పడకపోవడంతో డక్ వర్త్ లూయిస్ ప్రకారం 19 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. -
టీమిండియా వైదొలిగితే భారీ నష్టం
బెంగళూరు: చాంపియన్స్ ట్రోఫి నుంచి టీమిండియా వైదొలిగితే భారీ నష్టం ఏర్పడుతుందని దక్షిణాఫ్రికా క్రికెటర్లు హషీం ఆమ్లా, డేవిడ్ మిల్లర్లు ఆందోళన వ్యక్తం చేశారు. ప్రపంచంలోనే భారత్లో అత్యధికమంది క్రికెట్ అభిమానులున్నారని, ఈ టోర్నీలో భారత్ ఆడకపోతే ఆదరణ తగ్గుందని, భారీ నష్టం తప్పదని చెప్పారు. చాంపియన్స్ ట్రోఫీలో టాప్-8 జట్లు ఆడితేనే ఆసక్తిగా ఉంటుందని మిల్లర్, ఆమ్లా అభిప్రాయపడ్డారు. భారత్ రాకుంటే ఆ జట్టు స్థానంలో ఎవరు ఆడుతారన్న విషయం తనకు తెలియదని చెప్పారు. దీనివెనుక రాజకీయాల గురించి తమకు తెలియదన్నారు. చాంపియన్స్ ట్రోఫీలో పాల్గొనే జట్లను గత నెల 25వ తేదీ లోపు ప్రకటించాల్సివుండగా.. బీసీసీఐ గడువులోపు జట్టును ఎంపిక చేయలేదు. దీంతో ఈ టోర్నీలో భారత్ పాల్గొనడంపై సందేహాలు వచ్చాయి. ఐసీసీ, బీసీసీఐ మధ్య విభేదాలే ఇందుకు కారణమన్న వాదనలు తెరపైకి వచ్చాయి. -
డేవిడ్ మిల్లర్ అవుట్
కేప్టౌన్: శ్రీలంకతో జరుగుతున్న వన్డే సిరీస్ నుంచి దక్షిణాఫ్రికా ఆటగాడు డేవిడ్ మిల్లర్ అర్థాంతరంగా వైదొలిగాడు. రెండో వన్డేలో ఫీల్డింగ్ చేస్తున్న సమయంలో డైవ్ కొట్టడంతో మిల్లర్ గాయపడ్డాడు. దాంతో అతని వేలికి కుట్లు పడటంతో విశ్రాంతి అనివార్యమైంది. మిల్లర్ కు సుమారు 10 రోజుల విశ్రాంతి అవసరమని దక్షిణాఫ్రికా క్రికెట్ బోర్డు తెలిపింది. ప్రస్తుతం ఇరు జట్ల మధ్య జరిగే ఐదు వన్డేల సిరీస్లో దక్షిణాఫ్రికా 2-0 ఆధిక్యంలో ఉంది. డర్బన్ లో జరిగిన రెండో వన్డేలో మిల్లర్ 98 బంతుల్లో 117 పరుగులు చేశాడు. -
మురళీ విజయ్కు కింగ్స్ ఎలెవన్ పంజాబ్ పగ్గాలు
ప్రస్తుత ఐపీఎల్ సీజన్లో నిరాశాజనక ప్రదర్శన కనబరుస్తోన్న కింగ్స్ ఎలెవన్ పంజాబ్ జట్టు సారథ్య బాధ్యతల్లో మార్పు చేసింది. ఇప్పటిదాకా కెప్టెన్గా ఉన్న దక్షిణాఫ్రికా ప్లేయర్ డేవిడ్ మిల్లర్ను తప్పించి... అతని స్థానంలో భారత్కు చెందిన మురళీ విజయ్ను కొత్త కెప్టెన్గా నియమించింది. ఈ సీజన్లో మిల్లర్ ఆరు ఇన్నింగ్స్లో కలిసి మొత్తం 76 పరుగులు చేయగా... మురళీ విజయ్ 143 పరుగులు సాధించాడు. -
కింగ్స్ పంజాబ్ కెప్టెన్సీ మార్పు
మొహాలి: ఇండియన్ ప్రీమియర్ లీగ్(ఐపీఎల్)-9వ సీజన్లో పేలవ ప్రదర్శనతో ప్రస్తుతం అట్టడుగు స్థానంలో ఉన్న కింగ్స్ పంజాబ్ కెప్టెన్సీ పదవి నుంచి డేవిడ్ మిల్లర్ను తొలగించారు. అతని స్థానంలో మురళీ విజయ్ కు జట్టు పగ్గాలు అప్పజెప్పుతూ కింగ్స్ పంజాబ్ యాజమాన్యం నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు కింగ్స్ పంజాబ్ శనివారం ఓ ప్రకటన విడుదల చేసింది. 'డేవిడ్ మిల్లర్ కెప్టెన్ గా విఫలమైన కారణంగా ఆ బాధ్యతను మురళీ విజయ్ కు అప్పగిస్తున్నాం. కెప్టెన్సీ భారం వల్ల మిల్లర్ ఆటగాడిగా కూడా సఫలం కావడం లేదు. ఇక నుంచి మిల్లర్ జట్టులో సభ్యుడిగా మాత్రమే కొనసాగుతాడు' అని కింగ్స్ పంజాబ్ ఫ్రాంచైజీ స్పష్టం చేసింది. ఈ టోర్నీలో ఇప్పటివరకూ ఆరు మ్యాచ్లు ఆడిన పంజాబ్ కేవలం ఒకదాంట్లో మాత్రమే విజయం సాధించి పాయింట్ల పట్టికలో వెనుకబడింది. గతేడాది కూడా పంజాబ్ చివరి స్థానంతోనే ఐపీఎల్ సీజన్ ను ముగించడం తెలిసిందే. -
అమిత్ మిశ్రాకు అదృష్టం కలిసిరాలేదా?
న్యూఢిల్లీ: ప్రత్యర్థి బౌలర్ అమిత్ మిశ్రాపై పంజాబ్ కింగ్స్ ఎలెవన్ కెప్టెన్ డేవిడ్ మిల్లర్ ప్రశంసల వర్షం కురిపించాడు. అదే సమయంలో ఈ లెగ్ స్పిన్నర్కు అదృష్టం కలిసిరాలేదని ఒకింత ఆవేదన వ్యక్తం చేశాడు. నిజానికి అమిత్ ఈ మ్యాచ్లో ఐదు వికెట్లు పడగొట్టిన ఘనత సొంతం చేసుకొని ఉండేవాడని, కానీ ఆ అవకాశం అతనికి రాలేదని చెప్పాడు. మూడు ఓవర్లలో 11 పరుగులు ఇచ్చి నాలుగు వికెట్లు పడగొట్టిన అమిత్ మిశ్రా ఢిల్లీ డేర్డెవిల్స్ విజయంలో కీలక పాత్ర పోషించాడు. మిల్లర్తోపాటు ప్రమాదకరమైన బ్యాట్స్మెన్ అయిన షాన్ మార్ష్, గ్లెన్ మాక్స్వెల్ ను తన స్పిన్ బౌలింగ్తో బోల్తా కొట్టించాడు అమిత్. అతని పర్ఫార్మెన్స్పై మిల్లర్ మాట్లాడుతూ 'మిశ్రాకు అదృష్టం కలిసిరాలేదు. అతను ఐదు వికెట్లు లభించలేదు. అతను గ్రేట్ బౌలర్. నన్ను, మాక్స్వెల్ ను, మార్ష్ను ఔట్ చేసి.. గేమ్ ఛేంజర్గా నిలిచాడు' అని చెప్పాడు. ఢిల్లీ ఫిరోజ్షా కోట్లా మైదానంలోని బౌలింగ్ పిచ్పై మిల్లర్ ఎలాంటి అభ్యంతరం వ్యక్తం చేయలేదు. 'నిజానికి లో స్కోరింగ్తో గేమ్ గతి మారిపోయింది. మేం వరుసగా వికెట్లు కోల్పోవడం మ్యాచ్ గమనాన్ని మార్చింది. పిచ్ బాగానే ఉంది' అని చెప్పాడు. -
ఆ వికెటే టర్నింగ్ పాయింట్: అమిత్ మిశ్రా
న్యూఢిల్లీ: అనుభవానికి నైపుణ్యం జోడించి ఢిల్లీ డేర్డెవిల్స్కు ఈ సీజన్లో తొలి విజయాన్ని అందించాడు లెగ్ స్పిన్నర్ అమిత్ మిశ్రా. గింగిరాలు తిరిగే తన బౌలింగ్తో విదేశీ బ్యాట్స్మెన్కు చుక్కలు చూపించిన అమిత్.. పంజాబ్ కెప్టెన్ డేవిడ్ మిల్లర్ వికెట్ను పడగొట్టడం మ్యాచ్లో టర్నింగ్ పాయింట్ అని, అతని వికెట్ పడటంతో మిగతా బ్యాట్స్మెన్ ఒత్తిడిలో కూరుకుపోయారని అభిప్రాయపడ్డాడు. అద్భుతమైన బౌలింగ్తో అమిత్ మిశ్రా నాలుగు వికెట్లు తీయడంతో మొదట బ్యాటింగ్ చేసిన పంజాబ్ కింగ్స్ ఎలెవన్ 111 పరుగులకే పరిమితమైన సంగతి తెలిసిందే. స్వల్ప లక్ష్యాన్ని అలవోకగా ఛేదించి ఢిల్లీ తొలి విజయాన్ని అందుకుంది. ఈ విజయంలో కీలకపాత్ర పోషించిన సీనియర్ బౌలర్ అమిత్ మాట్లాడుతూ 'మాకు కొన్ని ప్లాన్స్ ఉన్నాయి. కొన్ని వీడియోలు కూడా చూశాను. పంజాబ్ బ్యాట్స్మెన్ భారీ షాట్లకు ప్రయత్నిస్తే.. వారిని ఎలా పెవిలియన్కు పంపాలనే దానిపై కెప్టెన్ జాక్ (జహీర్ ఖాన్)తోనూ చర్చించాను. ఆ వ్యూహాలు ఫలించడం ఆనందంగా ఉంది' అని చెప్పాడు. ఈ ప్రదర్శన ద్వారా వందో మ్యాచ్లో పర్పుల్ క్యాప్ పొందడం ఆనందంగా ఉందని తెలిపాడు. శ్రీలంక బౌలర్ లసిత్ మలింగా తర్వాత ఐపీఎల్లో అత్యధిక వికెట్లు తీసిన బౌలర్గా అమిత్ మిశ్రా చరిత్ర సృష్టించాడు. తద్వారా పర్పుల్ క్యాప్ను సొంతం చేసుకున్నాడు. బాడీ లాంగ్వెజ్ ఆధారంగా బ్యాట్స్మెన్ భారీ షాట్లకు దిగుతారా? లేదా? అన్నదానిపై ఫోకస్ చేశామని, అలాంటి డెలివరీస్లోనే తనకు వికెట్లు పడటం ఆనందంగా ఉందని చెప్పారు. అమిత్ మిశ్రా స్పిన్ బౌలింగ్ బాగా పడినప్పటికీ అతనికి ( 3-0-11-4) మూడు ఓవర్లు మాత్రమే లభించాయి. కోటా మరో ఓవర్ ఉన్నా.. అది లభించకపోవడం బాధగా ఉందా? అని ప్రశ్నించగా.. అదేమీ లేదని, ఫాస్ట్ బౌలర్లకు అధిక ఓవర్లు ఇవ్వాల్సిన అవసరం ఉండటంతో తనకు మరో ఓవర్ వేసే అవకాశం రాలేదని సర్దిచెప్పాడు అమిత్. -
మన ఆట...మన దగ్గర.... మనమే గెలవాలి
► రేపటి నుంచి టి20 ప్రపంచకప్ ► బరిలో 10 జట్లు ► తొలి మ్యాచ్లోన్యూజిలాండ్తో భారత్ ఢీ పొట్టి క్రికెట్ పుట్టింది ఇంగ్లండ్లో కావచ్చు... కానీ దానికి పరుగు నేర్పింది మనమే. తొలి ప్రపంచకప్లో భారత్ విజేతగా నిలవడం వల్ల ఈ ఫార్మాట్కు ఊహించని స్థాయిలో అభిమానులు పెరిగిపోయారు. ఫలితంగా ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) పుట్టింది. ఆట రాత మారిపోయింది. ప్రపంచ వ్యాప్తంగా ప్రతి క్రికెటర్ ఈ లీగ్లో ఆడాలని తహతహలాడుతున్నాడు. భారత్లో ఆడాలని కలలుగంటున్నాడు. కానీ వాళ్లలో అందరికీ అవకాశం లేదు. ఎంతోమంది విదేశీ క్రికెటర్లు తమ దేశాల్లో స్టార్లే అయినా భారత్లో వారి ప్రదర్శన చూపించే అవకాశం రాలేదు. దాదాపు ఎనిమిదేళ్ల తర్వాత ఈ విదేశీ స్టార్స్ అంతా భారత గడ్డపై సత్తా చూపించేందుకు సిద్ధమయ్యారు. ధనాధన్ క్రికెట్ను దత్తత తీసుకున్న భారత గడ్డ మీద తొలిసారి విశ్వ సంరంభం జరగబోతోంది. ఐపీఎల్ వల్ల ఈ ఫార్మాట్ మనకే సొంతంలా మారిపోయింది. ఐదు కప్ల నిరీక్షణ తర్వాత... తొలిసారి మనం ఆతిథ్యం ఇచ్చే అవకాశం వచ్చింది. ఐపీఎల్ ద్వారా ఎంత వినోదం లభించినా... భారత అభిమానులు కోరుకునేది మాత్రం మువ్వన్నెల రెపరెపలే. సొంతగడ్డపై ప్రపంచకప్ గెలిస్తే ఆ కిక్కే వేరు. అలాంటి మజాను అందించే అవకాశం ధోని సేనకు లభించింది. ఐపీఎల్ను ఆదరించి క్రికెటర్ల జేబుల్లో కోట్లు నిండటానికి కారణమైన అభిమానుల రుణం తీర్చుకునే అవకాశం లభించింది. అందుకే... భారత్ గెలవాలి... గెలిచి తీరాలి. నాగ్పూర్ నుంచి సాక్షి క్రీడాప్రతినిధి భారతదేశంలో ఐపీఎల్ రూపంలో కొన్ని వందల మ్యాచ్లు జరిగాయి. కానీ ఇప్పటివరకూ ఇక్కడ జరిగిన అంతర్జాతీయ టి20 మ్యాచ్లు కేవలం 15 మాత్రమే. అందుకే భారత అభిమానుల్లో ఏదో ఓ చిన్న వెలితి. ఆ కరువు తీరుస్తూ అసలైన ధనాధన్ క్రికెట్ పండుగ మన దేశానికి వచ్చేసింది. ఆరో టి20 ప్రపంచకప్కు రేపు (మంగళవారం) తెరలేవనుంది. క్వాలిఫయింగ్ మ్యాచ్ల రూపంలో ఇప్పటికే కొంత వినోదం లభించినా... అసలు సిసలు పోరు ఇప్పుడు ప్రారంభం కాబోతోంది. భారత్, న్యూజిలాండ్ల మధ్య నాగ్పూర్లో జరిగే మ్యాచ్తో ఆరంభమయ్యే ఈ టోర్నీ... ఏప్రిల్ 3న కోల్కతాలో జరిగే ఫైనల్తో ముగుస్తుంది. ఈ టోర్నీలో మొత్తం ఏడు వేదికల్లో 23 మ్యాచ్లు జరుగుతాయి. ఈ టోర్నీతో సమాంతరంగా మహిళలకు కూడా టి20 ప్రపంచకప్ జరుగుతుంది. పురుషుల విభాగంలో ఎనిమిది ప్రధాన జట్లు నేరుగా టోర్నీలో బరిలోకి దిగుతుండగా... క్వాలిఫయింగ్ మ్యాచ్ ల ద్వారా బంగ్లాదేశ్, అఫ్ఘానిస్తాన్ అర్హత సాధించాయి. మొత్తం పది జట్లు రెండు గ్రూప్లుగా విడిపోయి మ్యాచ్లు ఆడతాయి. రెండు గ్రూప్ల్లో తొలి రెండు స్థానాల్లో నిలిచిన జట్లు సెమీస్కు చేరతాయి. ఎవరూ తక్కువ కాదు ప్రపంచకప్లో పోటీ పడుతున్న మిగతా జట్ల గురించి ఒక్క మాటలో చెప్పాలంటే స్పిన్ను సమర్థంగా ఎదుర్కోగల లేదా మంచి స్పిన్నర్లు ఉన్న జట్టే ముందుకు వెళ్లవచ్చు. వరల్డ్ క్లాస్ పేస్ బౌలర్లు ఉన్నా వారు ఇక్కడ పెద్దగా ఉపయోగపడకపోవచ్చు. ఇక వివిధ జట్ల బ్యాటింగ్ సామర్థ్యాన్ని చూస్తే మరోసారి ఐపీఎల్ ప్రదర్శనే కీలకంగా కనిపిస్తుంది. ఇక్కడ ఎక్కువగా క్రికెట్ ఆడిన ఆటగాళ్లు ఉన్న జట్లది కాస్త పైచేయిగా కనిపించవచ్చు. వ్యక్తిగతంగా కూడా ఆయా క్రికెటర్ల సత్తాను బట్టే టీమ్ను ఏవైనా సంచలనాలు ఆశించవచ్చు. ఆస్ట్రేలియా: లోటు తీరేనా? ఒక్కసారి కూడా టి20 ప్రపంచకప్ గెలవలేకపోయిన ఆస్ట్రేలియా ఈసారి ఎలాగైనా గెలవాలనే కసితో ఉంది. వార్నర్, వాట్సన్, మ్యాక్స్వెల్ బ్యాటింగ్తో ఫలితాన్ని మార్చగలరు. స్పిన్ను బాగా ఆడగల స్మిత్ కెప్టెన్సీ నైపుణ్యం కూడా ఆ జట్టుకు అనుకూలాంశం. ఆల్రౌండర్గా ఫాల్క్నర్ కీలకం కానున్నాడు. సుదీర్ఘ కాలంగా టి20లను పట్టించుకోకుండా ఎక్కువ మ్యాచ్లు ఆడని ఆసీస్కు అదే సమస్యగా మారింది. భారత్ చేతిలో సొంతగడ్డపై పరాజయానికి అది కూడా కారణం. తాజాగా దక్షిణాఫ్రికాపై టి20 సిరీస్ గెలవడం జట్టు ఆత్మవిశ్వాసాన్ని పెంచింది. దక్షిణాఫ్రికా: అదృష్టం కలిసొస్తే... జట్టులో ఏకంగా 11 మందికి ఐపీఎల్లో ఆడిన అనుభవం ఉంది. ఇది సఫారీలకు చెప్పుకోదగ్గ అనుకూలత. ఎక్కువ మంది ఆల్రౌండర్లతో టీమ్ పటిష్టంగా కనిపిస్తోంది. ఇటీవల ఆసీస్ చేతిలో సిరీస్ ఓడినా... అంతకుముందు భారత్లోనే 2-0తో గెలవడం ఆ జట్టు సామర్థ్యానికి సూచిక. డివిలియర్స్ దూకుడును ఆపాలంటే బౌలర్లు తీవ్రంగా శ్రమించాల్సిందే. డు ప్లెసిస్, డుమిని, డేవిడ్ మిల్లర్, డి కాక్, డేవిడ్ వీస్... ఇలా ‘డి’ గ్యాంగ్ మొత్తానికి టి20ల్లో మంచి హిట్టర్లుగా గుర్తింపు ఉంది. ఐపీఎల్-2016 కోసం భారీ మొత్తానికి అమ్ముడుపోయిన క్రిస్ మోరిస్ ఇప్పుడు అద్భుతమైన ఫామ్లో ఉన్నాడు. అయితే స్టెయిన్లో జోరు తగ్గడం, ఇమ్రాన్ తాహిర్ మినహా నాణ్యమైన స్పిన్నర్ లేకపోవడం.. పెద్ద టోర్నీల్లో కీలక మ్యాచ్ల్లో తడబడే నేపథ్యం ఈ జట్టు బలహీనత. ఇంగ్లండ్: అనుభవజ్ఞులు లేకున్నా... ఈ మాజీ చాంపియన్ ఇటీవలి కాలంలో బాగా పుంజుకుంది. సాంప్రదాయాన్ని వదిలి ఫార్మాట్కు అనుగుణంగా కుర్రాళ్లను, కొత్త తరాన్ని ప్రోత్సహిస్తుండటంతో జట్టు నిలకడగా మంచి ఫలితాలు సాధిస్తోంది. కెప్టెన్ ఇయాన్ మోర్గాన్కు మినహా మరే ఆటగాడికి భారత గడ్డపై ఆడిన కనీస అనుభవం కూడా లేదు. వన్డేల్లో ఏడాది వ్యవధిలో మూడు వేగవంతమైన సెంచరీలు నమోదు చేసిన జోస్ బట్లర్ ప్రభావం చూపగల క్రికెటర్. స్పిన్ ఆల్రౌండర్లు మొయిన్ అలీ, ఆదిల్ రషీద్లపై ఇంగ్లండ్ భారీగా ఆశలు పెట్టుకుంది. న్యూజిలాండ్: సత్తా చాటేనా? భారత్లో జరిగే ప్రపంచకప్లో కచ్చితంగా ముద్ర వేస్తాడనుకున్న బ్రెండన్ మెకల్లమ్ అనూహ్య రిటైర్మెంట్తో షాక్ ఇచ్చాడు. గత రెండేళ్లుగా మూడు ఫార్మాట్లలో కూడా సత్తా చాటిన కెప్టెన్ కేన్ విలియమ్సన్, ఓపెనర్ మార్టిన్ గప్టిల్పై ఆ జట్టు విజయావకాశాలు ఆధారపడి ఉన్నాయి. విలియమ్సన్, రాస్ టేలర్ మాత్రం స్పిన్ను బాగా ఆడగలరు. మున్రోతో పాటు లోయర్ ఆర్డర్లో అండర్సన్, ఇలియట్ కీలకం కానున్నారు. బౌల్ట్ మినహా గుర్తింపు ఉన్న బౌలర్ జట్టులో లేడు. స్పిన్నర్లు నాథన్ మెకల్లమ్, సాన్ ్టనర్, సోధి ఏ మాత్రం ప్రభావం చూపిస్తారనేది సందేహమే. వెస్టిండీస్: మళ్లీ జి‘గేల్’మనాలని... ఒక్కడున్నను చాలు గేల్లాంటి ఆటగాడు. వంద మంది బలగమేల...’ అన్నట్లు వెస్టిండీస్ జట్టు కనిపిస్తోంది. డ్వేన్ బ్రేవో, రసెల్, స్యామీ, శామ్యూల్స్లాంటి ఆల్రౌండర్లు ఉన్నా... ఈ టోర్నీలో గేల్ చూపించగలిగే ప్రభావమే వేరు. నిజంగా గేల్ తనదైన శైలిలో చెలరేగితే ఇతర ఆటగాళ్లంతా పక్క వాయిద్యగాళ్లే. కాబట్టి విండీస్ విజయమైనా, పరాజయమైనా గేల్పైనే అమితంగా ఆధారపడి ఉన్నాయి. గేల్ విఫలమైన చోట 99 శాతం సందర్భాల్లో జట్టు కూడా కుప్పకూలింది. బ్రేవో, రసెల్లకు కూడా ఐపీఎల్ అనుభవం బాగుంది. శ్రీలంక: ఇకనైనా పురోగమించేనా? ఇక డిఫెండింగ్ చాంపియన్ శ్రీలంక గతంలో ఎన్నడూ లేనంత బలహీనంగా కనిపిస్తోంది. కుమార సంగక్కర, మహేల జయవర్ధనేల రిటైర్మెంట్ తర్వాత ఆ జట్టులో కనీసం ప్రదర్శన ఇవ్వగల ఆటగాళ్లు కరువయ్యారు. ఆసియా కప్లో బంగ్లాదేశ్ చేతిలో ఓడిన తీరు లంక తిరోగమనానికి పరాకాష్ట. ఫామ్పరంగా చూస్తే చండీమల్, రంగన హెరాత్ మాత్రమే కాస్త మెరుగ్గా కనిపిస్తున్నారు. ఒకప్పుడు టాప్ క్లాస్ ఆల్రౌండర్గా కనిపించిన మ్యాథ్యూస్ ఇప్పుడు ఎందులోనూ రాణించలేక నిస్సహాయంగా కనిపిస్తున్నాడు. ఇక మలింగ యార్కర్లపై నమ్మకమున్నా, అతను ఏ మ్యాచ్లో ఆడతాడో చెప్పలేని పరిస్థితి. ఓవరాల్గా లంక జట్టును మాత్రం ఎవరూ గట్టి ప్రత్యర్థిగా భావించడం లేదు. బంగ్లాదేశ్, అఫ్ఘానిస్తాన్ ఇటీవల ఆసియాకప్లో ఫైనల్కు చేరిన బంగ్లాదేశ్ను ఏ ప్రత్యర్థీ తక్కువ అంచనా వేయడానికి లేదు. పాకిస్తాన్, శ్రీలంకలాంటి జట్లను ఆసియాకప్లో ఓడించిన బంగ్లాదేశ్... టి 20 ర్యాంకింగ్స్ కారణంగా క్వాలిఫయింగ్ మ్యాచ్లు ఆడాల్సి వచ్చింది. షకీబ్, మొర్తజా, తమీమ్ ఒకే ఓవర్లో ఫలితాన్ని మార్చగల సమర్థులు. ఇటీవల బంగ్లా జట్టు మంచి ఆత్మవిశ్వాసంతో ఉంది. ఇక అఫ్ఘానిస్తాన్ను కూడా తక్కువ అంచనా వేయడానికి లేదు. 2010 నుంచి ప్రతి టి20 ప్రపంచకప్లోనూ ఆడుతున్న ఈ జట్టు ఇటీవల జింబాబ్వేపై సిరీస్ గెలిచింది. అలాగే అర్హత మ్యాచ్ల్లోనూ ఎదురైన ప్రతి ప్రత్యర్థినీ చిత్తు చేసింది. ఈ రెండు జట్లు సెమీస్కు చేరడం కష్టమే అయినా... ఏదో ఒక సంచలనం సృష్టించగల సత్తా ఉంది. పాకిస్తాన్: అంతంత మాత్రమే... భారత్తో మళ్లీ ఓడతామనే భయంతోనే ఆడేందుకు జంకుతున్నారు... ఇటీవల పరిణామాల సందర్భంలో వినిపించిన జోక్ ఇది. ఇది జోకే అయినా పాకిస్తాన్ జట్టు పరిస్థితి కూడా అంతంత మాత్రంగానే ఉంది. ఆసియా కప్లో బంగ్లాదేశ్ చేతిలోనూ ఓడి, యూఏఈతో అదృష్టవశాత్తూ బయటపడిన ఆ జట్టు సామర్థ్యంపై పెద్దగా నమ్మకం లేదు. ముఖ్యంగా జట్టు బ్యాటింగ్ బాగా బలహీనం. ఒక్క బ్యాట్స్మన్ కూడా గట్టిగా నిలబడి మ్యాచ్ను శాసిస్తాడని చెప్పే పరిస్థితే లేదు. ఆ జట్టు ఎన్నో కొన్ని విజయాలు సాధిస్తోందీ అంటే బౌలింగ్ను నమ్ముకునే. ఫామ్ను చూస్తే ఆమిర్ మళ్లీ కీలకం కానున్నాడు. ఉపఖండపు జట్టే అయినా నాణ్యమైన స్పిన్నరే లేడు. ఆటగాడిగాకంటే పీసీబీ రాజకీయాలతోనే కెప్టెన్గా సాగుతున్న షాహిద్ ఆఫ్రిది అటు బ్యాటింగ్, ఇటు బౌలింగ్లో దేనికీ పనికి రావడం లేదు. అనుభవం పరంగా చూస్తే ఈ టోర్నీలో పాక్ తరఫున కాస్తయినా పరువు నిలబెట్టగల ఆటగాడిగా ఒక్క షోయబ్ మాలిక్ మాత్రమే కనిపిస్తున్నాడు. -
మిల్లర్ మెరుపులు
తొలి టి20లో ఆసీస్పై దక్షిణాఫ్రికా విజయం డర్బన్: డేవిడ్ మిల్లర్ (35 బంతుల్లో 53 నాటౌట్; 3 ఫోర్లు; 3 సిక్సర్లు) తుఫాన్ ఇన్నింగ్స్తో ఆస్ట్రేలియాతో జరిగిన తొలి టి20లో దక్షిణాఫ్రికా 3 వికెట్ల తేడాతో నెగ్గింది. 158 పరుగుల లక్ష్య ఛేదనలో సఫారీలు 95కే ఆరు వికెట్లు కోల్పోయిన దశలో మిల్లర్ వీరోచిత ప్రదర్శన చేశాడు. భారీ సిక్సర్లతో విరుచుకుపడి మూడు టి20ల సిరీస్లో జట్టుకు 1-0 ఆధిక్యాన్ని అందించాడు. జాన్ హేస్టింగ్స్ వేసిన ఇన్నింగ్స్ 18వ ఓవర్లో స్క్వేర్ లెగ్లో మిల్లర్ కొట్టిన సిక్సర్ అయితే బంతి స్టేడియం బయటపడింది. క్రీజులో చివరికంటా నిలిచిన మిల్లర్ ఆటతో దక్షిణాఫ్రికా 19.2 ఓవర్లలో 7 వికెట్లకు 158 పరుగులు చేసి నెగ్గింది. డు ప్లెసిస్ (26 బంతుల్లో 40; 4ఫోర్లు; 1 సిక్స్) రాణించాడు. కౌల్టర్ నైల్కు మూడు వికెట్లు దక్కాయి. అంతకుముందు టాస్ నెగ్గి బ్యాటింగ్కు దిగిన ఆసీస్ 20 ఓవర్లలో తొమ్మిది వికెట్లకు 157 పరుగులు చేసింది. ఫించ్ (18 బంతుల్లో 40; 2 ఫోర్లు; 4 సిక్సర్లు) టాప్ స్కోరర్. వేగంగా ఇన్నింగ్స్ ప్రారంభించిన ఆసీస్ పవర్ప్లేలో 69 పరుగులు చేసింది. అయితే 114 పరుగులకే ఏడు వికెట్లు కోల్పోయిన దశలో మిషెల్ మార్ష్ (25 బంతుల్లో 35; 1 ఫోర్; 2 సిక్సర్లు) రాణించడంతో జట్టు భారీ స్కోరు చేయగలిగింది. తాహిర్కు మూడు, రబడా.. వీజ్లకు రెండేసి వికెట్లు దక్కాయి. నేడు (ఆదివారం) జొహన్నెస్బర్గ్లో రెండో టి20 జరుగుతుంది. -
కింగ్స్ ఎలెవన్ కెప్టెన్గా మిల్లర్
ఐపీఎల్-9లో కింగ్స్ ఎలెవన్ పంజాబ్ జట్టుకు దక్షిణాఫ్రికాకు చెందిన డేవిడ్ మిల్లర్ కెప్టెన్గా వ్యవహరిస్తాడు. 2012 సీజన్నుంచి అతను పంజాబ్ జట్టు సభ్యుడిగా కొనసాగుతున్నాడు. గత ఏడాది వరకు కెప్టెన్గా ఉన్న బెయిలీని ఆ జట్టు విడుదల చేయడంతో కొత్త నాయకుడి అవసరం ఏర్పడింది. పంజాబ్ తరఫున 47 ఐపీఎల్ మ్యాచ్లలో మిల్లర్ 147.53 స్ట్రైక్ రేట్తో 1319 పరుగులు చేశాడు. కెప్టెన్గా మిల్లర్ సమర్థంగా జట్టును నడిపిస్తాడని కోచ్ సంజయ్ బంగర్ ఆశాభావం వ్యక్తం చేశారు. -
సిక్స్ కొట్టాడు, కానిస్టేబుల్ కన్ను పోయింది...
కోల్కతా : క్రికెట్లో ఆటగాడు పరుగుల వర్షం కురిసిస్తే అభిమానులకు పండుగే పండుగ. ఇక ఓ సిక్స్ పీకితే ... ఫ్యాన్స్కు సందడే సందడి. అయితే ఆటగాడు కొట్టిన ఓ బంతి తగిలి.. ఓ కానిస్టేబుల్ శాశ్వతంగా కంటిచూపు కోల్పోయాడు. కోల్కతా ఈడెన్ గార్డెన్స్లో శనివారం (మే 9) కోల్కతా నైట్ రైడర్స్, కింగ్స్ ఎలెవన్ పంజాబ్ జట్ల మధ్య జరిగిన మ్యాచ్లో కింగ్స్ ఎలెవెన్ పంజాబ్ ఆటగాడు డేవిడ్ మిల్లర్ కొట్టిన బంతి సిక్స్ వెళ్లింది. విధుల్లో భాగంగా బందోబస్తుకు వచ్చిన అలోక్ అనే పోలీస్ కానిస్టేబుల్ (57)ను తాకింది. బంతి బలంగా అతడి కంటికి తగలడంతో అక్కడే కుప్పకూలిపోయాడు. వెంటనే అలోక్ను ఆస్పత్రికి తరలించారు. వైద్యులు అతడికి కంటిచూపు వచ్చేందుకు ప్రయత్నించినా సాధ్యం కాలేదు. దాంతో అలోక్ తన కుడి కంటి చూపును కోల్పోయాడు. ప్రస్తుతం అతడు ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. కాగా అలోక్ కోల్కతా అయిదో బెటాలియన్ డీఎస్పీ దేబాశిష్ సర్కార్ వాహనానికి డ్రైవర్ గా పని చేస్తున్నాడు. -
'ఏడు రోజుల్లో విశ్వ విజేతలవుతాం'
ఆక్లాండ్: ఏడు రోజుల్లో ప్రపంచ విజేతలుగా అవతరిస్తామని దక్షిణాఫ్రికా క్రికెటర్ డేవిడ్ మిల్లర్ దీమా వ్యక్తం చేశాడు. కొత్త ఉత్సాహంతో ఉన్నామని, నాణ్యమైన క్రికెట్ ఆడుతున్నామని ప్రాక్టీస్ సందర్భంగా ఆదివారం చెప్పాడు. తమ ఆటగాళ్లు సరైన సమయంలో ఫామ్ లోకి వచ్చారని అన్నాడు. తమ జట్టులో పలువురు కొత్త ఆటగాళ్లు ఉన్నారని, వారి వరల్డ్ కప్ లో ఆడిన అనుభవం లేదని గుర్తు చేశాడు. తమపై పెద్దగా ఒత్తిడి లేదని అన్నాడు. తొలిసారి ప్రపంచకప్ ఆడుతున్న తనకు సెమీస్ ఆడాలన్న కోరిక తీరబోతుందని సంతోషం వ్యక్తం చేశాడు. సెమీస్ లో గెలిచేందుకు తమ టీమ్ ఎంతో శ్రమిస్తోందని వెల్లడించాడు. తమ చిరకాల స్వప్నం సాకారమయ్యే సమయం ఆసన్నమైందని పేర్కొన్నాడు. గప్టిల్ డబుల్ సెంచరీ గురించి మాట్లాడుతూ... క్రికెట్ లో ఏదైనా జరగొచ్చని వ్యాఖ్యానించాడు. -
డేవిడ్ మిల్లర్ సెంచరీ
పోర్ట్ ఎలిజబెత్: వెస్టిండీస్ తో జరుగుతున్న నాలుగో వన్డేలో ముందుగా బ్యాటింగ్ చేసిన దక్షిణాఫ్రికా 50 ఓవర్లలో 8 వికెట్లు కోల్పోయి 262 పరుగులు చేసింది. విండీస్ ముందు 263 పరుగుల విజయ లక్ష్యాన్ని ఉంచింది. డేవిడ్ మిల్లర్ ఒంటరి పోరాటం చేసి సెంచరీ సాధించాడు. 133 బంతుల్లో 11 ఫోర్లు, 3 సిక్సర్లతో 130 పరుగులతో అజేయంగా నిలిచాడు. డుమిని 43, వాన్ విక్ 18, డీవిలియర్స్ 19, పార్నెల్ 12, బెహర్ డీన్ 12 పరుగులు చేశారు. విండీస్ బౌలర్లలో హోల్డర్ 4 వికెట్లు నేలకూల్చాడు. కాట్ రెల్ 2 వికెట్లు తీశాడు. రస్సెల్, స్యామీ చెరో వికెట్ దక్కించుకున్నారు. -
‘మ్యాడ్’ మ్యాక్స్
మ్యాక్స్వెల్ సంచలన ఇన్నింగ్స్ రాజస్థాన్పై పంజాబ్ విజయం చెలరేగిన మిల్లర్ సామ్సన్, వాట్సన్ శ్రమ వృథా గత మ్యాచ్లో పంజాబ్ జట్టు 200కు పైగా లక్ష్యాన్ని ఛేదించింది. ఆ రోజు చెన్నైకి చుక్కలు చూపించిన గ్లెన్ మ్యాక్స్వెల్ మరోసారి రీప్లే చూపించాడు. తనదైన శైలిలో భారీ షాట్లతో విరుచుకుపడి దాదాపు అదే స్కోరును ఛేదించడంలో కీలకపాత్ర పోషించాడు. తొలి మ్యాచ్లాగే మ్యాక్స్ సెంచరీ చేజార్చుకున్నా... చివర్లో డేవిడ్ మిల్లర్ మెరుపులతో కింగ్స్ ఎలెవన్కు వరుసగా రెండో విజయం దక్కింది. అంతకుముందు సామ్సన్, వాట్సన్ మెరుపు బ్యాటింగ్ వృథా అయింది. షార్జా: పంజాబ్ విజయలక్ష్యం 192... మ్యాక్స్వెల్ అద్భుత ఇన్నింగ్స్ ఆడినా ఆ తర్వాత తడబడటంతో చివరి 3 ఓవర్లలో 37 పరుగులు చేయాల్సిన స్థితి. ఈ దశలో కూడా రాజస్థాన్కు విజయావకాశాలు ఉన్నాయి. కానీ ధావల్ కులకర్ణి వేసిన ఇన్నింగ్స్ 18వ ఓవర్లో డేవిడ్ మిల్లర్ ఏకంగా 4 సిక్సర్లు బాది ఒక్కసారిగా ఫలితం మార్చేశాడు. తర్వాతి ఓవర్లో మరో 11 పరుగులు రావడంతో... ఎనిమిది బంతులు మిగిలి ఉండగానే కింగ్స్ ఎలెవన్కు అద్భుత విజయం దక్కింది. ముందుగా బ్యాటింగ్ చేసిన రాజస్థాన్ నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 191 పరుగులు చేసింది. సంజు సామ్సన్ (34 బంతుల్లో 52; 3 ఫోర్లు, 4 సిక్స్లు), వాట్సన్ (29 బంతుల్లో 50; 5 ఫోర్లు, 3 సిక్స్లు) అర్ధ సెంచరీలు చేశారు. అనంతరం మ్యాక్స్వెల్ (45 బంతుల్లో 89; 8 ఫోర్లు, 6 సిక్స్లు), మిల్లర్ (19 బంతుల్లో 51 నాటౌట్; 6 సిక్స్లు) అద్భుత బ్యాటింగ్తో పంజాబ్ 18.4 ఓవర్లలో 3 వికెట్లకు 193 పరుగులు చేసి విజయాన్నందుకుంది. పుజారా (38 బంతుల్లో 40 నాటౌట్; 3 ఫోర్లు) ఇన్నింగ్స్కు అండగా నిలిచాడు. భారీ భాగస్వామ్యం టాస్ గెలిచిన పంజాబ్ ఫీల్డింగ్ ఎంచుకుంది. లేని పరుగు కోసం ప్రయత్నించి రహానే (13) అవుట్ కావడంతో రాయల్స్ తొలి వికెట్ కోల్పోయింది. అనంతరం అభిషేక్ నాయర్ (20 బంతుల్లో 23; 2 ఫోర్లు, 1 సిక్స్) మురళీ కార్తీక్ వేసిన తొలి బంతికే వెనుదిరిగాడు. ఈ దశలో సంజు సామ్సన్, షేన్ వాట్సన్ భాగస్వామ్యం రాజస్థాన్కు ఊపు తెచ్చింది. వీరిద్దరు భారీ షాట్లతో చెలరేగారు. ఈ జోడి కేవలం 7 ఓవర్లలో 74 పరుగులు జత చేసింది. 28 బంతుల్లో అర్ధ సెంచరీ పూర్తి చేసుకున్న వాట్సన్, అక్షర్ బౌలింగ్లో అవుట్ కావడంతో మూడో వికెట్ భాగస్వామ్యానికి తెర పడింది. మిల్లర్ చక్కటి క్యాచ్తో బిన్నీ వెనుదిరగ్గా... అవానా బౌలింగ్లో భారీ సిక్సర్తో 34 బంతుల్లో హాఫ్ సెంచరీ మార్క్ అందుకున్న సామ్సన్ అదే ఓవర్లో బౌల్డయ్యాడు. చివర్లో ఫాల్క్నర్ (8 నాటౌట్) అండతో దూకుడు ప్రదర్శించిన స్టీవెన్ స్మిత్ (15 బంతుల్లో 27 నాటౌట్; 5 ఫోర్లు) 19 బంతుల్లోనే 32 పరుగులు జోడించాడు. పంజాబ్ బౌలర్లలో అక్షర్ పటేల్, జాన్సన్ కొంత వరకు కట్టడి చేసినా... అవానా, బాలాజీ, కార్తీక్ కలిసి 12 ఓవర్లలో 137 పరుగులు సమర్పించుకోవడంతో రాజస్థాన్ భారీ స్కోరు సాధించింది. మెరుపు వీరులు వీరేంద్ర సెహ్వాగ్ (2) తన వైఫల్యాన్ని కొనసాగిస్తూ ఆరంభంలోనే వెనుదిరగ్గా... సాహా (2) కూడా అనుసరించడంతో పంజాబ్ 10 పరుగులకే 2 వికెట్లు కోల్పోయింది. ఈ దశలో మ్యాక్స్వెల్ పరుగుల ప్రవాహం మొదలైంది. ఒక పరుగు వద్ద కొద్ది తేడాతో అవుటయ్యే ప్రమాదంనుంచి తప్పించుకున్న అతను ఆ తర్వాత భారీ షాట్లతో చెలరేగాడు. రిచర్డ్సన్ ఓవర్లో ఫోర్, సిక్స్, ఫాల్క్నర్ ఓవర్లో 2 సిక్స్లు, భాటియా ఓవర్లలో 3 ఫోర్లు, 2 సిక్స్లు, కులకర్ణి ఓవర్లో 4 ఫోర్లు... ఇలా ఏ బౌలర్నూ వదిలి పెట్టకుండా మ్యాక్స్వెల్ దూకుడు ప్రదర్శించాడు. 28 బంతుల్లోనే మ్యాక్స్వెల్ అర్ధ సెంచరీ పూర్తయింది. పుజారాతో కలిసి అతను 67 బంతుల్లో 116 పరుగులు జోడించడం విశేషం. చివరకు రిచర్డ్సన్ బౌలింగ్లో భారీ షాట్కు ప్రయత్నించి గ్లెన్ అవుట్ కావడంతో 116 పరుగుల భాగస్వామ్యానికి తెర పడింది. ఈ దశలో రాజస్థాన్ కాస్త సంతోషించినా...మిల్లర్ వారి ఆనందాన్ని ఆవిరి చేశాడు. ధావల్ కులకర్ణి వేసిన ఒక్క ఓవర్లో 26 పరుగులు రాబట్టి పంజాబ్ను గెలిపించాడు. స్కోరు వివరాలు రాజస్థాన్ రాయల్స్ ఇన్నింగ్స్: నాయర్ (ఎల్బీ) (బి) కార్తీక్ 23; రహానే (రనౌట్) 13; సామ్సన్ (బి) అవానా 52; వాట్సన్ (బి) అక్షర్ 50; బిన్నీ (సి) మిల్లర్ (బి) జాన్సన్ 12; స్మిత్ (నాటౌట్) 27; ఫాల్క్నర్ (నాటౌట్) 8; ఎక్స్ట్రాలు 6; మొత్తం (20 ఓవర్లలో 5 వికెట్లకు) 191 వికెట్ల పతనం: 1-22; 2-54; 3-128; 4-144; 5-159 బౌలింగ్: అక్షర్ 4-0-22-1; జాన్సన్ 4-0-29-1; అవానా 4-0-40-1; బాలాజీ 4-0-46-0; కార్తీక్ 4-0-51-1. పంజాబ్ కింగ్స్ ఎలెవన్ ఇన్నింగ్స్: పుజారా (నాటౌట్) 40; సెహ్వాగ్ (సి) బిన్నీ (బి) కులకర్ణి 2; సాహా (సి) కులకర్ణి (బి) ఫాల్క్నర్ 2; మ్యాక్స్వెల్ (సి) స్మిత్ (బి) రిచర్డ్సన్ 89; మిల్లర్ (నాటౌట్) 51; ఎక్స్ట్రాలు 9; మొత్తం (18.4 ఓవర్లలో 3 వికెట్లకు) 193 వికెట్ల పతనం: 1-5; 2-10; 3-126. బౌలింగ్: రిచర్డ్సన్ 3-0-25-1; కులకర్ణి 4-0-50-1; ఫాల్క్నర్ 3.4-0-45-1; తాంబే 4-0-26-0; భాటియా 3-0-38-0; బిన్నీ 1-0-4-0. ఐపీఎల్లో నేడు చెన్నై సూపర్ కింగ్స్ X ఢిల్లీ డేర్డెవిల్స్ వేదిక: అబుదాబి, రాత్రి గం. 8.00 నుంచి సోనీ సిక్స్లో ప్రత్యక్ష ప్రసారం