Vaibhav Suryavanshi: ఫోన్‌ ఆన్‌ చేయగానే 500 మిస్స్‌డ్‌ కాల్స్‌ | Vaibhav comments on his fastest century | Sakshi
Sakshi News home page

Vaibhav Suryavanshi: ఫోన్‌ ఆన్‌ చేయగానే 500 మిస్స్‌డ్‌ కాల్స్‌

May 22 2025 3:37 AM | Updated on May 22 2025 8:14 AM

Vaibhav comments on his fastest century

తన ఫాస్టెస్ట్‌ సెంచరీ ప్రశంసలపై వైభవ్‌ వ్యాఖ్య

ముంబై: ఈ ఐపీఎల్‌ సీజన్‌ నుంచి రాజస్తాన్‌ రాయల్స్‌ నిష్క్రమించి ఉండొచ్చు. కానీ ఒక కుర్రాడి ఆగమనం మాత్రం అద్వితీయంగా మలిచింది ఆ ఫ్రాంచైజీ! 14 ఏళ్ల వైభవ్‌ సూర్యవంశీ 18 ఏళ్ల ఐపీఎల్‌ చరిత్రలో ఫాస్టెస్ట్‌ సెంచరీ చేసిన భారత బ్యాటర్‌గా నిలిచాడు. టీమిండియా మాజీ హెడ్‌ కోచ్‌ రాహుల్‌ ద్రవిడ్‌ ప్రస్తుతం రాజస్తాన్‌కు కోచింగ్‌ ఇవ్వడం... ముఖ్యంగా కుర్రాళ్లను సానబెట్టడంతో దిట్టయిన ద్రవిడ్‌ సూచనలు, హెచ్చరికలు వైభవ్‌పై మంచి ప్రభావమే చూపాయి. 

బ్యాటింగ్‌పైనే ధ్యాస పెట్టమని, ఎప్పుడైనా సరే చురుకుదనంతో అందుబాటులో ఉండాలనే హెచ్చరికలు తనను ఆటపైనే దృష్టి కేంద్రీకరించేలా చేశాయని స్వయంగా వైభవ్‌ చెప్పుకొచ్చాడు. గుజరాత్‌ టైటాన్స్‌పై 35 బంతుల్లో సెంచరీ చేసిన సందర్భంలో తన ఫోన్‌కు ఏకంగా 500 పైచిలుకు మిస్స్‌డ్‌ కాల్స్‌ వచ్చాయని చెప్పాడు. ద్రవిడ్‌ సూచనలతో ఆటపై ఫోకస్‌ చేసేందుకు ఫోన్‌ను స్విచ్ఛాఫ్‌ చేయగా సెంచరీ తర్వాత ప్రశంసించేందుకు అన్ని కాల్స్‌ వచ్చినట్లు వైభవ్‌ చెప్పాడు. 

‘మూణ్నాలుగు నెలలుగా నేను పడుతున్న కష్టానికి ఫలితం వచ్చింది. అదేపనిగా ప్రాక్టీస్‌లో నా బలహీనతల్ని అధిగమించడం వల్లే మ్యాచ్‌ల్లో ఆడటం సులువైంది. ముఖ్యంగా పరిస్థితులకు తగ్గట్లుగా ఆడటం ఎలాగో నేర్చుకున్నాను. జట్టు విజయానికి అవసరమైన బ్యాటింగ్‌ శైలీని అలవర్చుకున్నా. నా బలమెంటో నాకు తెలుసు. జట్టుకేం కావాలనేది అప్పటి పరిస్థితులకు తెలుసు. వీటిని దృష్టిలో ఉంచుకొని రాణించాలి’ అని రాయల్స్‌ హెడ్‌కోచ్‌ ద్రవిడ్‌తో పాల్గొన్న వీడియోలో వైభవ్‌ చెప్పాడు. 

ఈ వీడియోను ఐపీఎల్‌ వెబ్‌సైట్‌లో పోస్ట్‌ చేశారు. ఈ సందర్భంగా టీనేజ్‌ సంచలనాన్ని అభినందించిన ద్రవిడ్‌ అసలైన సవాళ్లు ముందున్నాయని అతనికి గుర్తు చేశాడు. ఈ సీజన్‌లో 7 మ్యాచ్‌లాడిన సూర్యవంశీ 252 పరుగులు సాధించాడు. 206.56 స్ట్రయిక్‌ రేట్‌తో 36 సగటును నమోదు చేశాడు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement