fastest century
-
చరిత్ర సృష్టించిన ఆసీస్ యువ ఓపెనర్.. టీ20 ఫైనల్స్లో ఫాస్టెస్ట్ సెంచరీ
బిగ్బాష్ లీగ్ 2024-25 ఫైనల్స్లో ఆసీస్ యువ ఓపెనర్, హోబర్ట్ హరికేన్స్ ఆటగాడు మిచెల్ ఓవెన్ సరికొత్త చరిత్ర సృష్టించాడు. సిడ్నీ థండర్తో ఇవాళ (జనవరి 27) జరిగిన ఫైనల్లో 39 బంతుల్లో సెంచరీ చేసిన ఓవెన్.. టీ20 టోర్నీల ఫైనల్స్లో ఫాస్టెస్ట్ సెంచరీ చేసిన ఆటగాడిగా రికార్డు నెలకొల్పాడు. గతంలో ఈ రికార్డు కువైట్ ఆటగాడు రవిజ సందరువన్ పేరిట ఉండేది. సందరువన్ గతేడాది జరిగిన మలేసియా ట్రై నేషన్ టీ20 టోర్నీ ఫైనల్లో హాంగ్కాంగ్పై 47 బంతుల్లో సెంచరీ చేశాడు. ఇవాల్టి వరకు టీ20 టోర్నీల ఫైనల్స్లో ఇదే ఫాస్టెస్ట్ సెంచరీగా చలామణి అయ్యింది. సందరువన్ రికార్డును ఇవాళ మిచెల్ ఓవెన్ చెరిపివేశాడు.టీ20 టోర్నీల ఫైనల్స్లో మూడో ఫాస్టెస్ట్ సెంచరీ రికార్డు భారత క్రికెటర్ వృద్దిమాన్ సాహా పేరిట ఉంది. సాహా 2014 ఐపీఎల్ ఫైనల్లో కేకేఆర్పై 49 బంతుల్లో శతక్కొట్టాడు. టీ20 టోర్నీల ఫైనల్స్లో నాలుగు, ఐదో ఫాస్టెస్ట్ సెంచరీల రికార్డులు తమీమ్ ఇక్బాల్, రిలీ రొస్సో పేరిట ఉన్నాయి. తమీమ్ 2019 బంగ్లాదేశ్ ప్రీమియర్ లీగ్ ఫైనల్లో ఢాకా డైనమైట్స్పై 50 బంతుల్లో సెంచరీ చేయగా.. రిలీ రొస్సో 2024 బీపీఎల్ ఫైనల్లో గాలే మార్వెల్స్పై 50 బంతుల్లో శతక్కొట్టాడు.తాజా సెంచరీతో ఓవెన్ బిగ్బాష్ లీగ్లో ఫాస్టెస్ట్ సెంచరీ రికార్డును కూడా సమం చేశాడు. ఓవెన్కు ముందు బీబీఎల్లో ఫాస్టెస్ట్ సెంచరీ రికార్డు క్రెయిగ్ సైమన్స్ పేరిట ఉండేది. సైమన్స్ మూడో బీబీఎల్ సీజన్లో 39 బంతుల్లో సెంచరీ చేశాడు. ఓవెన్ తాజాగా సైమన్స్ రికార్డును సమం చేశాడు. బీబీఎల్లో మూడు, నాలుగో ఫాస్టెస్ట్ సెంచరీల రికార్డులు గ్లెన్ మ్యాక్స్వెల్, జోష్ బ్రౌన్ పేరిట ఉన్నాయి. మ్యాక్సీ బీబీఎల్-11 సీజన్లో 41 బంతుల్లో సెంచరీ చేశాడు. బ్రౌన్ గత సీజన్లో అన్నే బంతుల్లో శతక్కొట్టాడు.ఓవెన్ సునామీ శతకంతో చెలరేగడంతో బీబీఎల్ 2024-25 ఫైనల్లో హోబర్ట్ హరికేన్స్ సిడ్నీ థండర్పై 7 వికెట్ల తేడాతో గెలుపొందింది. ఓవెన్ ఒంటిచేత్తో హరికేన్స్కు తొలి బిగ్బాష్ లీగ్ టైటిల్ను అందించాడు. చిన్నతనంలో స్టాండ్స్లో కూర్చొని హరికేన్స్ను ఎంకరేజ్ చేసిన 23 ఏళ్ల ఓవెన్.. ఇప్పుడు తన జట్టును స్వయంగా గెలిపించాడు. ఓవెన్ శివాలెత్తిపోవడంతో హరికేన్స్ 14 ఏళ్ల సుదీర్ఘ ఎదురుచూపు తర్వాత సొంత ప్రేక్షకుల మధ్య తొలిసారి టైటిల్ గెలిచింది. మిచెల్ ఓవెన్ సునామీ శతకంతో మ్యాచ్ను వన్ సైడెడ్గా చేశాడు. ఓవెన్కు ఈ సీజన్లో ఇది రెండో సెంచరీ. తాజా సెంచరీతో ఓవెన్ ఈ సీజన్లో లీడింగ్ రన్ స్కోరర్గానూ నిలిచాడు. ఈ సీజన్లో 11 మ్యాచ్లు ఆడిన ఓవెన్ 203.60 స్ట్రయిక్ రేట్తో 452 పరుగులు చేశాడు. ఇందులో 35 ఫోర్లు, 36 సిక్సర్లు ఉన్నాయి.థండర్తో జరిగిన ఫైనల్లో 11 సిక్సర్లు బాదిన ఓవెన్ బిగ్బాష్ లీగ్ ఫైనల్స్లో అత్యధిక సిక్సర్లు బాదిన ఆటగాడిగానూ రికార్డు నెలకొల్పాడు. బీబీఎల్లో ఫాస్టెస్ట్ సెంచరీ సాధించే క్రమంలో ఓవెన్ లీగ్ చరిత్రలో మూడో వేగవంతమైన హాఫ్ సెంచరీ రికార్డును కూడా నమోదు చేశాడు. ఈ మ్యాచ్లో ఓవెన్ 16 బంతుల్లో హాఫ్ సెంచరీ పూర్తి చేశాడు. ఈ ఇన్నింగ్స్లో మొత్తంగా 42 బంతులు ఎదుర్కొన్న ఓవెన్ 6 ఫోర్లు, 11 సిక్సర్ల సాయంతో 108 పరుగులు చేసి ఔటయ్యాడు.ఈ మ్యాచ్లో తొలుత బ్యాటింగ్ చేసిన ధండర్ నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 182 పరుగులు చేసింది. ఓపెనర్లు జేసన్ సంఘా (42 బంతుల్లో 67; 5 ఫోర్లు, 2 సిక్సర్లు), డేవిడ్ వార్నర్ (32 బంతుల్లో 48; 5 ఫోర్లు, సిక్స్) థండర్ తరఫున రాణించారు. హరికేన్స్ బౌలర్లలో రిలే మెరిడిత్, కెప్టెన్ నాథన్ ఇల్లిస్ తలో మూడు వికెట్లు తీయడంతో పాటు పొదుపుగా బౌలింగ్ చేసి థండర్ను భారీ స్కోర్ చేయకుండా అడ్డుకున్నారు.అనంతరం లక్ష్య ఛేదనలో హరికేన్స్ ఓపెనర్ మిచెల్ ఓవెన్ దెబ్బకు థండర్ బౌలర్లు బెంబేలెత్తిపోయారు. ఓవెన్ ధాటికి హరికేన్స్ 14.1 ఓవర్లలో 3 వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని ఛేదించింది. ఓవెన్ ఔటయ్యాక మాథ్యూ వేడ్ (17 బంతుల్లో 32 నాటౌట్; 5 ఫోర్లు, సిక్స్), బెన్ మెక్డెర్మాట్ (12 బంతుల్లో 18 నాటౌట్; 2 ఫోర్లు) మ్యాచ్ను లాంఛనంగా ముగించారు. థండర్ బౌలర్లలో తన్వీర్ సంఘా 2, టామ్ ఆండ్రూస్ ఓ వికెట్ పడగొట్టారు. -
వన్డేల్లో ఫాస్టెస్ట్ సెంచరీ.. ‘తొలి ప్లేయర్’గా స్మృతి మంధాన చరిత్ర
టీమిండియా స్టార్ ఓపెనర్ స్మృతి మంధాన(Smriti Mandhana) సరికొత్త చరిత్ర సృష్టించింది. వన్డేల్లో తక్కువ బంతుల్లోనే శతకం బాదిన(Women's ODI Fastest Century) భారత తొలి మహిళా క్రికెటర్గా రికార్డు సాధించింది. ఐర్లాండ్తో జరుగుతున్న మూడో వన్డే సందర్భంగా స్మృతి మంధాన ఈ ఘనత సాధించింది. అంతేకాదు.. మహిళల వన్డే క్రికెట్లో పది సెంచరీలు పూర్తి చేసుకుని మరో అరుదైన రికార్డును కూడా తన ఖాతాలో వేసుకుంది.కెప్టెన్గా, బ్యాటర్గా స్మృతి అదుర్స్ఐసీసీ చాంపియన్షిప్లో భాగంగా ఐర్లాండ్ మహిళా క్రికెట్ జట్టు.. భారత్(India Women Vs Ireland Women)లో పర్యటిస్తోంది. ఈ మూడు వన్డేల సిరీస్కు రెగ్యులర్ కెప్టెన్ హర్మన్ప్రీత్ దూరం కాగా.. వైస్ కెప్టెన్ స్మృతి మంధాన సారథ్య బాధ్యతలు చేపట్టింది. ఈ క్రమంలో కెప్టెన్గానూ, బ్యాటర్గానూ స్మృతి అద్బుత ప్రదర్శన కనబరుస్తోంది.రాజ్కోట్ వేదికగా సాగుతున్న ఈ సిరీస్లో తొలి రెండు వన్డేలు గెలిచిన టీమిండియా ఇప్పటికే సిరీస్ను 2-0తో కైవసం చేసుకుంది. ఇక ఈ మ్యాచ్లలో స్మృతి వరుసగా 41, 73 పరుగులు సాధించి.. గెలుపులో తన వంతు పాత్ర పోషించింది. ఈ క్రమంలో ఇరుజట్ల మధ్య బుధవారం జరుగుతున్న మూడో వన్డేలోనూ స్మృతి సూపర్ ఫామ్ను కొనసాగించింది.వుమెన్ క్రికెట్లో ఫాస్టెస్ట్ సెంచరీఈ మ్యాచ్లో టాస్ గెలిచిన భారత్ తొలుత బ్యాటింగ్ ఎంచుకోగా.. ఓపెనర్లు ప్రతికా రావల్, స్మృతి మంధాన శతక్కొట్టారు. స్మృతి 70 బంతుల్లోనే వంద పరుగుల మార్కు అందుకుని.. వుమెన్ క్రికెట్లో ఫాస్టెస్ట్ సెంచరీ సాధించిన తొలి ఇండియన్గా నిలిచింది. అంతేకాదు.. వన్డేల్లో పది సెంచరీలు సాధించిన భారత తొలి మహిళా క్రికెటర్గా, ఓవరాల్గా నాలుగో ప్లేయర్గా చరిత్రకెక్కింది.Led from the front and how 👏👏What a knock THAT 🙌Updates ▶️ https://t.co/xOe6thhPiL#TeamIndia | #INDvIRE | @IDFCFIRSTBank | @mandhana_smriti pic.twitter.com/4dQVq6JTRm— BCCI Women (@BCCIWomen) January 15, 2025 ఇక స్మృతి మొత్తంగా ఈ మ్యాచ్లో 80 బంతులు ఎదుర్కొని 12 ఫోర్లు, ఏడు సిక్సర్ల సాయంతో 135 పరుగులు చేసింది. ఐరిష్ బౌలర్ ఓర్లా ప్రెండెర్గాస్ట్ బౌలింగ్లో ఈ లెఫ్టాండ్ బ్యాటర్.. అవా కానింగ్కు క్యాచ్ ఇచ్చి పెవిలియన్ చేరింది.వన్డేల్లో ఇదే అత్యధిక స్కోరుఇదిలా ఉంటే.. ఐర్లాండ్తో మూడో వన్డేలో మరో ఓపెనర్ ప్రతికా రావల్ భారీ శతకంతో మెరిసింది. 129 బంతులు ఎదుర్కొని 154 పరుగులు సాధించింది. ప్రతికా ఇన్నింగ్స్లో ఏకంగా 20 ఫోర్లు, ఒక సిక్స్ ఉండటం విశేషం. మిగతా వాళ్లలో రిచా ఘోష్ 59 పరుగులతో రాణించగా.. తేజల్ హెసాబ్నిస్ 28, హర్లీన్ డియోల్ 14 రన్స్ చేశారు. ఇక జెమీమా 4, దీప్తి శర్మ 11 పరుగులతో అజేయంగా నిలిచారు. ఈ క్రమంలో నిర్ణీత 50 ఓవర్లలో ఐదు వికెట్ల నష్టానికి భారత్ 435 పరుగులు స్కోరు చేసింది. భారత్ తరఫున మహిళా, పురుష క్రికెట్లో వన్డేల్లో ఇదే అత్యధిక స్కోరు కావడం విశేషం.మహిళల వన్డే క్రికెట్లో ఫాస్టెస్ట్ సెంచరీ నమోదు చేసిన భారత ప్లేయర్లు1. స్మృతి మంధాన- ఐర్లాండ్ వుమెన్స్పై- రాజ్కోట్(2025)లో- 70 బంతుల్లో శతకం2.హర్మన్ప్రీత్ కౌర్- సౌతాఫ్రికా వుమెన్స్పై- బెంగళూరు(2024)లో- 87 బంతుల్లో శతకం3. హర్మన్ప్రీత్ కౌర్- ఆస్ట్రేలియా వుమెన్స్పై- డెర్బీ(2017)లో- 90 బంతుల్లో శతకం4. జెమీమా రోడ్రిగ్స్- ఐర్లాండ్ వుమెన్స్పై- రాజ్కోట్(2025)లో- 90 బంతుల్లో శతకం5. హర్లీన్ డియోల్- వెస్టిండీస్ వుమెన్స్పై- వడోదర(2024)లో- 98 బంతుల్లో శతకం.మహిళల వన్డేల్లో అత్యధిక శతకాలు బాదిన క్రికెటర్లుమెగ్ లానింగ్- 15సుజీ బేట్స్- 13టామీ బీమౌంట్- 10స్మృతి మంధాన- 10చమరి ఆటపట్టు- 9చార్లెట్ ఎడ్వర్డ్స్- 9నాట్ సీవర్ బ్రంట్- 9.MAXIMUM x 2⃣Captain Smriti Mandhana's elegance on display here in Rajkot!Updates ▶️ https://t.co/xOe6thhPiL#TeamIndia | #INDvIRE | @IDFCFIRSTBank pic.twitter.com/wMlnuoUWIr— BCCI Women (@BCCIWomen) January 15, 2025 చదవండి: పంత్ క్లారిటీ ఇచ్చాడు... కానీ కోహ్లి మాత్రం ఇలా: డీడీసీఏ ఆగ్రహం -
ఫాస్టెస్ట్ సెంచరీ.. కసిదీరా కొట్టేశాడు!
పంజాబ్ బ్యాటర్ అన్మోల్ప్రీత్ సింగ్ విధ్వంసకర సెంచరీతో మెరిశాడు. కేవలం 35 బంతుల్లోనే వంద పరుగుల మార్కు అందుకున్నాడు. తద్వారా లిస్ట్- ‘ఎ’ క్రికెట్లో ఫాస్టెస్ట్ సెంచరీ సాధించిన మూడో భారత క్రికెటర్గా చరిత్ర సృష్టించాడు. అరుణాచల్ ప్రదేశ్తో శనివారం నాటి మ్యాచ్ సందర్భంగా అన్మోల్ప్రీత్ సింగ్ ఈ ఫీట్ నమోదు చేశాడు.దేశవాళీ వన్డే టోర్నమెంట్ విజయ్ హజారే ట్రోఫీ 2024-25 ఎడిషన్లో భాగంగా గ్రూప్-‘ఎ’లో ఉన్న తమ తొలి మ్యాచ్లో పంజాబ్ జట్టు.. అరుణాచల్ప్రదేశ్ తలపడింది. అహ్మదాబాద్లోని నరేంద్ర మోదీ స్టేడియం ‘ఎ’ గ్రౌండ్లో జరిగిన ఈ మ్యాచ్లో టాస్ గెలిచిన పంజాబ్ తొలుత బౌలింగ్ చేసింది.164 పరుగులకే ఆలౌట్ఈ క్రమంలో బ్యాటింగ్కు దిగిన అరుణాచల్ ప్రదేశ్ 164 పరుగులకే కుప్పకూలింది. తెచి నెరి 42 పరుగులతో టాప్ స్కోరర్గా నిలవగా.. హార్దిక్ వర్మ 38, ప్రిన్స్ యాదవ్ 23, దేవాన్ష్ గుప్త 22 పరుగులతో ఫర్వాలేదనిపించగా.. మిగతా బ్యాటర్లంతా చేతులెత్తేశారు. పంజాబ్ బౌలర్లలో మయాంక్ మార్కండే, అశ్వని కుమార్ మూడేసి వికెట్లు తీయగా.. బల్జీత్ సింగ్ రెండు, సన్వీర్ సింగ్, రఘు శర్మ ఒక్కో వికెట్ దక్కించుకున్నారు.అభిషేక్ శర్మ విఫలంఇక స్వల్ప లక్ష్యంతో బరిలోకి దిగిన పంజాబ్కు సరైన ఆరంభం లభించలేదు. ఓపెనర్ అభిషేక్ శర్మ కేవలం పది పరుగులే చేసి నిష్క్రమించాడు. అయితే, మరో ఓపెనర్ ప్రభ్సిమ్రన్ సింగ్(25 బంతుల్లో 35 నాటౌట్)కు తోడైన వన్డౌన్ బ్యాటర్ అన్మోల్ప్రీత్ సింగ్ అరుణాచల్ ప్రదేశ్ బౌలర్లపై విరుచుకుపడ్డాడు.45 బంతుల్లో 115 పరుగులుసుడిగాలి ఇన్నింగ్స్తో కేవలం 35 బంతుల్లోనే శతకం పూర్తి చేసుకున్న అన్మోల్.. మొత్తంగా 45 బంతుల్లో 115 పరుగులతో అజేయంగా నిలిచాడు. అతడి ఇన్నింగ్స్లో ఏకంగా పన్నెండు ఫోర్లు, తొమ్మిది సిక్సర్లు ఉండటం విశేషం. ఈ క్రమంలో 12.5 ఓవర్లలో కేవలం ఒకే ఒక్క వికెట్ కోల్పోయి 167 పరుగులు చేసింది పంజాబ్.కసిదీరా కొట్టేశాడుతద్వారా అరుణాచల్ ప్రదేశ్పై ఏకంగా తొమ్మిది వికెట్ల తేడాతో జయభేరి మోగించి టోర్నీని విజయంతో ఆరంభించింది. తుఫాన్ ఇన్నింగ్స్తో పంజాబ్ను గెలిపించిన అన్మోల్ప్రీత్ సింగ్కు ‘ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్’ అవార్డు దక్కింది. కాగా ఇటీవల జరిగిన ఐపీఎల్-2025 మెగా వేలంలో ఈ పంజాబీ బ్యాటర్ అమ్ముడుపోకుండా మిగిలిపోయిన విషయం తెలిసిందే.ఈ నేపథ్యంలో వన్డేల్లో టీ20 తరహాలో ఊచకోత కోసి తన కసినంతా ఇక్కడ ప్రదర్శించాడంటూ అభిమానులు అన్మోల్పై ప్రశంసలు కురిపిస్తున్నారు. కాగా ముంబై తరఫున క్యాష్ రిచ్ లీగ్లో ఎంట్రీ ఇచ్చిన అన్మోల్ప్రీత్ సింగ్.. చివరగా సన్రైజర్స్ హైదరాబాద్ తరఫున ఆడాడు. ఇప్పటి వరకు ఐపీఎల్లో మొత్తంగా తొమ్మిది మ్యాచ్లు ఆడిన అన్మోల్.. 139 పరుగులు సాధించాడు.చదవండి: శ్రేయస్ అయ్యర్ విధ్వంసకర శతకం.. శివం దూబే మెరుపు ఇన్నింగ్స్A majestic counter-attacking 58-ball 💯 from Anmolpreet Singh 👏👏#SMAT | @IDFCFIRSTBank | #FinalFollow the match ▶️ https://t.co/1Kfqzc7qTr pic.twitter.com/3sdqD7CJvj— BCCI Domestic (@BCCIdomestic) November 6, 2023 -
ఫాస్టెస్ట్ సెంచరీ.. వెస్టిండీస్ బ్యాటర్ ప్రపంచ రికార్డు
వెస్టిండీస్ క్రికెటర్ అమిర్ జాంగూ సరికొత్త చరిత్ర సృష్టించాడు. వన్డే అరంగేట్రంలోనే అత్యంత వేగంగా శతకం బాదిన క్రికెటర్గా ప్రపంచ రికార్డు నెలకొల్పాడు. బంగ్లాదేశ్తో మూడో వన్డే సందర్భంగా ఈ ఫీట్ నమోదు చేశాడు.సొంతగడ్డపై సెయింట్ కిట్స్ వేదికగా బంగ్లాదేశ్తో మూడు మ్యాచ్ల వన్డే సిరీస్ ఆడింది వెస్టిండీస్. ఇందులో భాగంగా తొలి వన్డేలో ఐదు వికెట్ల తేడాతో గెలిచిన ఆతిథ్య జట్టు.. రెండో వన్డేలో ఏడు వికెట్ల తేడాతో జయభేరి మోగించింది. ఇక వార్నర్ పార్క్ స్టేడియంలో గురువారం రాత్రి జరిగిన మూడో వన్డేలో టాస్ గెలిచిన వెస్టిండీస్ తొలుత బౌలింగ్ చేసింది. ఈ క్రమంలో బ్యాటింగ్కు దిగిన బంగ్లాదేశ్ నిర్ణీత 50 ఓవర్లలో ఐదు వికెట్లు నష్టపోయి 321 పరుగులు చేసింది. అదరగొట్టిన మహ్మదుల్లాసౌమ్య సర్కార్(73) హాఫ్ సెంచరీతో రాణించగా.. మెహదీ హసన్ మిరాజ్(77) కెప్టెన్ ఇన్నింగ్స్ ఆడాడు. ఇక మహ్మదుల్లా 84 పరుగులతో టాప్ స్కోరర్గా నిలవగా.. అతడితో కలిసి జాకర్ అలీ(62*) ఆఖరి వరకు అజేయంగా నిలిచాడు. విండీస్ బౌలర్లలో అల్జారీ జోసెఫ్ రెండు, గుడకేశ్ మోటీ, షెర్ఫానే రూథర్ఫర్డ్ ఒక్కో వికెట్ తీశారు.అమిర్ జాంగూ ఆకాశమే హద్దుగాఇక లక్ష్య ఛేదనకు దిగిన వెస్టిండీస్ ఆదిలోనే ఓపెనర్లు బ్రాండన్ కింగ్(15), అలిక్ అథనాజ్(7) వికెట్లు కోల్పోయింది. కెప్టెన్ షాయీ హోప్(3) పూర్తిగా విఫలం కాగా.. షెర్ఫానే రూథర్ఫర్డ్(30) కూడా నిరాశపరిచాడు. ఇలాంటి క్లిష్ట పరిస్థితుల్లో వన్డౌన్ బ్యాటర్ కేసీ కార్టీ జట్టును ఆదుకున్నాడు.ఫాస్టెస్ట్ సెంచరీ.. మొత్తంగా 88 బంతులు ఎదుర్కొన్న కార్టీ 95 పరుగులతో రాణించగా.. అతడికి జతైన అరంగేట్ర బ్యాటర్ అమిర్ జాంగూ ఆకాశమే హద్దుగా చెలరేగాడు. 80 బంతుల్లోనే శతకం పూర్తి చేసుకున్న ఈ వికెట్ కీపర్ బ్యాటర్.. కార్టీతో కలిసి ఐదో వికెట్కు 132 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పాడు.ఆరోస్థానంలో బ్యాటింగ్ చేసిన 27 ఏళ్ల ఈ లెఫ్టాండర్ ఆరు ఫోర్లు, నాలుగు సిక్సర్ల సాయంతో 104 పరుగుల సాధించాడు. గుడకేశ్ మోటీ(31 బంతుల్లో 44 నాటౌట్)తో కలిసి ఆఖరి వరకు అజేయంగా నిలిచి జట్టు విజయంలో కీలక పాత్ర పోషించాడు. కార్టీ, జాంగూ, గుడకేశ్ విజృంభణ కారణంగా వెస్టిండీస్ 45.5 ఓవర్లలోనే లక్ష్యాన్ని ఛేదించింది. ఆరు వికెట్లు నష్టపోయి 325 పరుగులు సాధించి.. నాలుగు వికెట్ల తేడాతో గెలిచింది. సిరీస్ను 3-0తో వైట్వాష్ చేసింది. అమిర్ జాంగూ ‘ప్లేయర్ ఆఫ్ దిమ్యాచ్’, రూథర్ఫర్డ్ ‘ప్లేయర్ ఆఫ్ ది సిరీస్’ అవార్డు అందుకున్నారు. రీజా హెండ్రిక్స్ ప్రపంచ రికార్డు బద్దలుకాగా ట్రినిడాడ్కు చెందిన అమిర్ జాంగూకు అంతర్జాతీయ క్రికెట్లో ఇదే తొలి మ్యాచ్. బంగ్లాదేశ్తో మూడో వన్డే సందర్భంగా అతడు అరంగేట్రం చేశాడు. వచ్చీ రాగానే ఫాస్టెస్ట్ సెంచరీ సాధించి.. సౌతాఫ్రికా స్టార్ రీజా హెండ్రిక్స్ పేరిట ఉన్న ప్రపంచ రికార్డును జాంగూ బద్దలు కొట్టాడు. ఓవరాల్గా ఈ ఘనత సాధించిన 18వ క్రికెటర్గా నిలిచాడు. ఇక వన్డే అరంగేట్రంలో సెంచరీ చేసిన తొలి క్రికెటర్గా ఇంగ్లండ్ బ్యాటర్ డెనిస్ అమీ రికార్డు సాధించాడు. ఆస్ట్రేలియా మీద 134 బంతుల్లో అతడు 103 పరుగుల సాధించాడు.వన్డే అరంగేట్రంలో ఫాస్టెస్ట్ సెంచరీ నమోదు చేసిన టాప్-5 క్రికెటర్లు1. అమిర్ జాంగూ(వెస్టిండీస్)- బంగ్లాదేశ్ మీద- 83 బంతుల్లో 104* రన్స్2. రీజా హెండ్రిక్స్(సౌతాఫ్రికా)- శ్రీలంక మీద- 89 బంతుల్లో 102 రన్స్3. కేఎల్ రాహుల్(ఇండియా)- జింబాబ్వే మీద- 115 బంతుల్లో 100* రన్స్4. మార్క్ చాప్మన్(హాంగ్కాంగ్)- యూఏఈ మీద- 116 బంతుల్లో 124* రన్స్5. మైకేల్ లాంబ్(ఇంగ్లండ్)- వెస్టిండీస్ మీద- 117 బంతుల్లో 106 రన్స్.చదవండి: నా పరిస్థితి బాలేదు.. తాగడం మానేశాను.. వారి సాయం తీసుకుంటా: వినోద్ కాంబ్లీAn unforgettable moment on debut!🔥Amir Jangoo takes today's CG United Moment of the Match!👏🏾#WIvBAN #MatchMoment #WIHomeForChristmas pic.twitter.com/TzNnmWvHwG— Windies Cricket (@windiescricket) December 12, 2024Amazing Amir! 🙌A century on debut, only the second West Indian to do so.#WIvBAN | #WIHomeForChristmas pic.twitter.com/UGWGBiNNmm— Windies Cricket (@windiescricket) December 12, 2024 -
టీ20ల్లో సెకెండ్ ఫాస్టెస్ట్ సెంచరీ.. గేల్, పంత్ రికార్డులు బద్దలు
టీ20ల్లో రెండో వేగవంతమైన సెంచరీ నమోదైంది. సయ్యద్ ముస్తాక్ అలీ టోర్నీలో గుజరాత్ ఆటగాడు ఉర్విల్ పటేల్.. 28 బంతుల్లోనే (త్రిపురతో జరిగిన మ్యాచ్లో) శతక్కొట్టాడు. పొట్టి క్రికెట్ చరిత్రలోనే ఇది సెకెండ్ ఫాస్టెస్ట్ సెంచరీ కాగా.. భారత్ తరఫున పొట్టి ఫార్మాట్లో ఇది ఫాస్టెస్ట్ సెంచరీగా రికార్డైంది.గేల్, పంత్ రికార్డులు బద్దలుటీ20ల్లో రెండో వేగవంతమైన సెంచరీని చేరుకునే క్రమంలో ఉర్విల్.. క్రిస్ గేల్, రిషబ్ పంత్ల రికార్డులను బద్దలు కొట్టాడు. టీ20ల్లో గేల్ 30 బంతుల్లో శతక్కొట్టగా.. పంత్ 32 బంతుల్లో సెంచరీ బాదాడు.సాహిల్ చౌహాన్ పేరిట ఫాస్టెస్ట్ సెంచరీపొట్టి ఫార్మాట్లో ఫాస్టెస్ట్ సెంచరీ రికార్డు ఎస్టోనియా ఆటగాడు సాహిల్ చౌహాన్ పేరిట ఉంది. చౌహాన్ ఈ ఏడాదే సైప్రస్తో జరిగిన మ్యాచ్లో 27 బంతుల్లో శతక్కొట్టాడు. ఉర్విల్ ఫాస్టెస్ట్ సెంచరీ రికార్డును కేవలం ఒక్క బంతితో మిస్ అయ్యాడు.భారత్ తరఫున ఫాస్టెస్ట్ సెంచరీటీ20ల్లో భారత్ తరఫున ఫాస్టెస్ట్ సెంచరీ రికార్డు రిషబ్ పేరిట ఉండగా.. తాజాగా ఉర్విల్ పంత్ రికార్డును బద్దలు కొట్టాడు. త్రిపురతో జరిగిన మ్యాచ్లో 35 బంతులు ఎదుర్కొన్న ఉర్విల్ 7 ఫోర్లు, 12 సిక్సర్ల సాయంతో 113 పరుగులు చేసి అజేయంగా నిలిచాడు.లిస్ట్-ఏ క్రికెట్లోనూ ఫాస్టెస్ట్ సెంచరీభారత్ తరఫున లిస్ట్-ఏ క్రికెట్లోనూ సెకెండ్ ఫాస్టెస్ట్ సెంచరీ రికార్డు ఉర్విల్ పేరిటే ఉంది. 2023 నవంబర్లో అరుణాచల్ ప్రదేశ్తో జరిగిన మ్యాచ్లో ఉర్విల్ 41 బంతుల్లోనే శతక్కొట్టాడు. లిస్ట్-ఏ క్రికెట్లో ఫాస్టెస్ట్ సెంచరీ రికార్డు టీమిండియా మాజీ ఆటగాడు యూసఫ్ పఠాన్ పేరిట ఉంది. 2010లో మహారాష్ట్రతో జరిగిన మ్యాచ్లో యూసఫ్ పఠాన్ 40 బంతుల్లో సెంచరీ బాదాడు.మ్యాచ్ విషయానికొస్తే.. తొలుత బ్యాటింగ్ చేసిన త్రిపుర నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 155 పరుగులు చేసింది. శ్రీదమ్ పాల్ (57) అర్ద సెంచరీతో రాణించాడు. గుజరాత్ బౌలర్లలో నగస్వల్లా అత్యధికంగా 3 వికెట్లు పడగొట్టాడు. 156 పరుగుల లక్ష్యాన్ని ఛేదించేందకు బరిలోకి దిగిన గుజరాత్ 10.2 ఓవర్లలోనే (2 వికెట్లు కోల్పోయి) విజయతీరాలకు చేరింది. ఉర్విల్ సునామీ శతకంతో విరుచుకుపడగా.. ఆర్య దేశాయ్ (38) మరో ఎండ్ నుంచి ఉర్విల్కు సహకరించాడు.ఎవరీ ఉర్విల్ పటేల్..?26 ఏళ్ల ఉర్విల్ బరోడాలోని మెహసానాలో జన్మించాడు. 2018లో అతను బరోడా తరఫున టీ20 అరంగేట్రం చేశాడు. అదే ఏడాది అతను లిస్ట్-ఏ క్రికెట్లోకి కూడా అడుగుపెట్టాడు. అయితే ఆతర్వాత ఉర్విల్కు ఫస్ట్ క్లాస్ అరంగేట్రం చేసేందుకు ఆరేళ్లు పట్టింది. ఉర్విల్ గతేడాదే రంజీల్లోకి అడుగుపెట్టాడు.గుజరాత్ టైటాన్స్ వదిలేసింది..!ఉర్విల్ను 2023 ఐపీఎల్ సీజన్ వేలంలో గుజరాత్ టైటాన్స్ 20 లక్షల బేస్ ధరకు సొంతం చేసుకుంది. అయితే ఆ సీజన్లో ఉర్విల్కు ఒక్క మ్యాచ్ ఆడే అవకాశం కూడా రాలేదు. ఉర్విల్ను గుజరాత్ టైటాన్స్ 2025 మెగా వేలానికి ముందు వదిలేసింది. రెండు రోజుల కిందట జరిగిన మెగా వేలంలో ఉర్విల్ అన్సోల్డ్గా మిగిలిపోయాడు. ఉర్విల్పై ఏ ఫ్రాంచైజీ ఆసక్తి చూపలేదు. తాజా ఇన్నింగ్స్ నేపథ్యంలో ఫ్రాంచైజీలు మనసు మార్చుకుంటాయేమో వేచి చూడాలి. -
ఫాస్టెస్ట్ సెంచరీ
లంక ప్రీమియర్ లీగ్ 2024 ఎడిషన్లో మూడు రోజుల్లోనే ఫాస్టెస్ట్ సెంచరీ రికార్డు బద్దలైంది. జులై 7న కొలొంబో స్ట్రయికర్స్తో జరిగిన మ్యాచ్లో డంబుల్లా సిక్సర్స్ ఆటగాడు కుశాల్ పెరీరా 50 బంతుల్లో శతక్కొట్టగా.. ఇవాళ (జులై 10 అదే కొలొంబో స్ట్రయికర్స్పై జాఫ్నా కింగ్స్ ఆటగాడు రిలీ రొస్సో 44 బంతుల్లో సెంచరీ చేశాడు. జాఫ్నాతో జరిగిన మ్యాచ్లో రొస్సో 50 బంతులు ఎదుర్కొని 12 ఫోర్లు, 6 సిక్సర్ల సాయంతో 108 పరుగులు (నాటౌట్) చేశాడు. లంక ప్రీమియర్ లీగ్లో ఇది మూడో అత్యధిక స్కోర్ కూడా కావడం విశేషం. రొస్సో పేరిట పాకిస్తాన్ సూపర్ లీగ్లో కూడా ఫాస్టెస్ట్ సెంచరీ రికార్డు నమోదై ఉండటం మరో విశేషం.మ్యాచ్ విషయానికొస్తే.. టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన కొలొంబో.. గ్లెన్ ఫిలిప్స్ (32 బంతుల్లో 58; 6 ఫోర్లు, 3 సిక్సర్లు) రాణించడంతో నిర్ణీత ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 188 పరుగులు చేసింది. కొలొంబో ఇన్నింగ్స్లో ఏంజెలో పెరీరా (34), రహ్మానుల్లా గుర్బాజ్ (27) ఓ మోస్తరు స్కోర్లు చేశారు. జాఫ్నా బౌలర్లలో అజ్మతుల్లా, అశిత ఫెర్నాండో చెరో 2 వికెట్లు.. మధుషన్, షంషి, ఫేబియన్ అలెన్ తలో వికెట్ పడగొట్టారు.అనంతరం 189 పరుగుల లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన జాఫ్నా.. రిలీ రొస్సో మెరుపు శతకంతో విజృంభించడంతో 18.3 ఓవర్లలో 3 వికెట్లు మాత్రమే కోల్పోయి విజయతీరాలకు చేరింది. జాఫ్నా ఇన్నింగ్స్లో రొస్సోతో పాటు చరిత్ అసలంక (58) రాణించారు. కొలొంబో బౌలర్లలో వెల్లలగే, తస్కిన్ అహ్మద్, షాదాబ్ ఖాన్ తలో వికెట్ తీశారు. -
టీ20ల్లో ఫాస్టెస్ట్ సెంచరీ.. కేవలం 27 బంతుల్లోనే.. క్రిస్ గేల్ రికార్డు బద్దలు
టీ20 ఫార్మాట్లో ఫాస్టెస్ట్ సెంచరీ నమోదైంది. సైప్రస్తో జరిగిన మ్యాచ్లో ఎస్టోనియా ఆటగాడు సాహిల్ చౌహాన్ 27 బంతుల్లోనే శతక్కొట్టాడు. పొట్టి క్రికెట్ చరిత్రలోనే ఇది వేగవంతమైన శతకం. పురుషులు, మహిళలు, అంతర్జాతీయ స్థాయి.. ఇలా ఏ విభాగంలో చూసినా ఇదే వేగవంతమైన సెంచరీ. అంతర్జాతీయ టీ20ల్లో నమీబియా ఆటగాడు జాన్ నికోల్ లాప్టీ ఈటన్ నమోదు చేసిన ఫాస్టెస్ట్ సెంచరీని సాహిల్ చౌహాన్ కేవలం నాలుగు నెలల్లో బద్దలు కొట్టాడు. లాఫ్టీ ఈటన్ ఈ ఏడాది (2024) ఫిబ్రవరి 27న నేపాల్పై 33 బంతుల్లో శతక్కొట్టాడు. అంతర్జాతీయ టీ20ల్లో సాహిల్ సెంచరీకి ముందు ఇదే ఫాస్టెస్ట్ సెంచరీ. టీ20 ఫార్మాట్ మొత్తంలో చూసినా ఇదే ఫాస్టెస్ట్ సెంచరీ. సాహిల్కు ముందు ఈ రికార్డు విండీస్ దిగ్గజం క్రిస్ గేల్ పేరిట ఉండేది. గేల్ 2013 ఐపీఎల్ సీజన్లో ఆర్సీబీ తరఫున ఆడుతూ పూణే వారియర్స్పై 30 బంతుల్లో శతక్కొట్టాడు. తాజాగా సాహిల్ గేల్ రికార్డును కూడా బద్దలు కొట్టాడు. సైప్రస్తో మ్యాచ్లో ఓవరాల్గా 41 బంతులు ఎదుర్కొన్న సాహిల్ 144 పరుగులు చేశాడు. ఇందులో ఏకంగా 18 సిక్సర్లు ఉన్నాయి. పురుషుల అంతర్జాతీయ టీ20ల్లో (ఓ ఇన్నింగ్స్లో) ఓ బ్యాటర్ సాధించిన అత్యధిక సిక్సర్లు ఇవే. సాహిల్ సునామీ శతకంతో విరుచుకుపడటంతో సైప్రస్పై ఎస్టోనియా ఘన విజయం సాధించింది. -
అభిషేక్ శర్మ ఊచకోత.. 26 బంతుల్లో శతకం.. 14 సిక్సర్లతో విధ్వంసం
ఐపీఎల్ 2024 సెన్సేషన్, సన్రైజర్స్ హైదరాబాద్ ఓపెనర్ అభిషేక్ శర్మ ఐపీఎల్ ఫామ్ను కొనసాగించాడు. గురుగ్రామ్లో జరిగిన ఓ క్లబ్ మ్యాచ్లో అభిషేక్ 26 బంతుల్లో శతక్కొట్టి మరోసారి వార్తల్లో నిలిచాడు. స్థానికంగా జరిగిన ఓ మ్యాచ్లో అభిషేక్ పంటర్స్ అనే క్లబ్కు ప్రాతనిథ్యం వహిస్తూ.. ప్రత్యర్థి మారియో క్రికెట్ క్లబ్ను షేక్ చేశాడు. ఈ ఇన్నింగ్స్లో అభిషేక్ 26 బంతులు ఎదుర్కొని 14 సిక్సర్లు, 4 ఫోర్ల సాయంతో 103 పరుగులు చేసి ఔటయ్యాడు. అభిషేక్ సునామీ ఇన్నింగ్స్తో చెలరేగడంతో అతని జట్టు పంటర్స్.. ప్రత్యర్థిపై 4 వికెట్ల తేడాతో విజయం సాధించింది. మ్యాచ్ వివరాల్లోకి వెళితే.. గురుగ్రామ్లో జరిగిన ఫ్రెండ్షిప్ సిరీస్లో నిన్న పంటర్స్-మారియో జట్లు తలపడ్డాయి. ఈ మ్యాచ్లో మారియో టీమ్ టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ ఎంచుకుంది. కృనాల్ సింగ్ (21 బంతుల్లో 60), నదీమ్ ఖాన్ (32 బంతుల్లో 74) చెలరేగడంతో మారియో టీమ్ నిర్ణీత 20 ఓవర్లలో 249 పరుగుల భారీ స్కోర్ చేసింది. ఓ ఓవర్ బౌల్ చేసిన అభిషేక్ 13 పరుగులు సమర్పించుకున్నాడు.అనంతరం 250 పరుగుల భారీ లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన అభిషేక్ టీమ్ (పంటర్స్) 26 పరుగులకే 2 వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది. ఈ దశలో బరిలోకి దిగిన అభిషేక్.. మారియో బౌలర్లకు చుక్కలు చూపించాడు. ఎడాపెడా సిక్సర్లు బాది మారియో టీమ్ బౌలర్ల భరతం పట్టాడు. ఫలితంగా పంటర్స్ టీమ్ మరో 11 బంతులు మిగిలుండగానే విజయం సాధించింది. పంటర్స్ తరఫున అభిషేక్తో పాటు పునీత్ (21 బంతుల్లో 52), లక్షయ్ (29 బంతుల్లో 44 నాటౌట్) రాణించారు.కాగా, ఈ మ్యాచ్లో సెంచరీతో చెలరేగిన అభిషేక్కు టీమిండియా మాజీ క్రికెటర్, సిక్సర్ల కింగ్ యువరాజ్ సింగ్ మెంటార్గా వ్యవహరిస్తున్న విషయం తెలిసిందే. యూవీ మెంటార్షిప్లో అభిషేక్ గత ఐపీఎల్ సీజన్లో అద్భుతాలు చేశాడు. గత సీజన్లో అభిషేక్ 200కు పైగా స్ట్రయిక్రేట్తో 400 పరుగులు చేసి సన్రైజర్స్ను ఫైనల్స్కు చేర్చడంలో కీలకపాత్ర పోషించాడు. -
సొంత దేశాన్ని వీడి యూఎస్ఏకు ఆడనున్న ఫాస్టెస్ట్ సెంచరీ హీరో
వన్డేల్లో సెకెండ్ ఫాస్టెస్ట్ (36 బంతుల్లో) సెంచరీ వీరుడు, న్యూజిలాండ్ మాజీ ఆల్రౌండర్ కోరె ఆండర్సన్ సొంత దేశాన్ని వీడి అంతర్జాతీయ క్రికెట్లో ఇప్పుడిప్పుడే అడుగులు వేస్తున్న యూఎస్ఏకు ఆడేందుకు సిద్దమయ్యాడు. త్వరలో కెనడాతో జరుగబోయే 5 మ్యాచ్ల టీ20 సిరీస్ కోసం యూఎస్ఏ సెలెక్టర్లు ఆండర్సన్ ఎంపిక చేశారు. 2018 నవంబర్లో చివరిసారిగా న్యూజిలాండ్కు ప్రాతినిథ్యం వహించిన ఆండర్సన్.. వ్యక్తిగత కారణాల చేత 2020లో యూఎస్ఏకు షిఫ్ట్ అయ్యాడు. అప్పటి నుంచి అక్కడే దేశవాలీ క్రికెట్ (మైనర్ లీగ్ క్రికెట్) ఆడుతూ ఐదేళ్ల నిరీక్షణ అనంతరం జాతీయ జట్టుకు ఆడే అవకాశాన్ని దక్కించుకున్నాడు. లోకల్ కేటగిరీలో మేజర్ లీగ్ క్రికెట్ ఆడే అవకాశం దక్కించుకున్న ఆండర్సన్.. ముంబై ఇండియన్స్ న్యూయార్క్ తరఫున మెరుగైన ప్రదర్శనలు చేశాడు. కెనడా సిరీస్ కోసం ఆండర్సన్తో పాటు మరికొందరు నాన్ ఆటగాళ్లు కూడా ఎంపికయ్యారు. భారత అండర్-19 ఫేమ్ హర్మీత్ సింగ్ యూఎస్ఏ దేశవాలీ టోర్నీలతో పాటు మేజర్ లీగ్ క్రికెట్లో సియాటిల్ ఆర్కాస్ తరఫున రాణించి జాతీయ జట్టులో చోటు దక్కించుకున్నాడు. హర్మీత్తో పాటు మరో భారత క్రికెటర్ కూడా యూఎస్ఏ జట్టుకు ఎంపికయ్యాడు. ఢిల్లీ మాజీ ఆటగాడు, ఐపీఎల్లో ఆర్సీబీ ప్లేయర్ మిలింద్ కుమార్ అక్కడి దేశవాలీ క్రికెట్లో సత్తా చాటి జాతీయ జట్టుకు ఎంపికయ్యాడు. వీరితో పాటు కెనడా జాతీయ జట్టు మాజీ కెప్టెన్, భారత మూలాలున్న నితీశ్ కుమార్ కూడా యూఎస్ఏ జట్టుకు ఎంపికైన వారిలో ఉన్నారు. తాజాగా ప్రకటించిన యూఎస్ఏ జట్టులో భారత అండర్-19 మాజీ క్రికెటర్, ఐపీఎల్లో ఢిల్లీ క్యాపిటల్స్ మాజీ బ్యాటర్ ఉన్ముక్త్ చంద్కు చోటు దక్కలేదు. ఉన్ముక్త్కు నితీశ్ కుమార్ నుంచి తీవ్ర పోటీ ఎదురైంది. అంతిమంగా సెలెక్టరు నితీశ్పైపే మొగ్గు చూపారు. కెనడా సిరీస్ కోసం ఎంపిక చేసిన యూఎస్ఏ జట్టు: మోనాంక్ పటేల్ (కెప్టెన్), ఆరోన్ జోన్స్ (వైస్ కెప్టెన్), కోరె అండర్సన్, గజానంద్ సింగ్, జెస్సీ సింగ్, సౌరభ్ నేత్రావల్కర్, నిసర్గ్ పటేల్, స్టీవెన్ టేలర్, ఆండ్రీస్ గౌస్, హర్మీత్ సింగ్, షాడ్లీ వాన్ షాల్క్విక్, నోస్తుష్ కెంజిగే, మిలింద్ కుమార్, నితీష్ కుమార్, ఉస్మాన్ రఫిక్ -
రోహిత్ శర్మకు అరుదైన గౌరవం
టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మకు అరుదైన గౌరవం దక్కింది. తమిళనాడు 11వ తరగతి మ్యాథ్స్ సిలబస్లో హిట్మ్యాన్ పేరిట ఉన్న 35 బంతుల టీ20 సెంచరీని పాఠ్యాంశంగా పొందుపరిచారు. రోహిత్ శతకాన్ని ఉదాహరణగా తీసుకుని గణిత శాస్త్రంలోని ఫంక్షన్స్ అండ్ రిలేషన్స్ కాన్సెప్ట్పై పలు ప్రశ్నలు అడిగారు. రోహిత్ క్రికెటింగ్ కెరీర్లోని ఘనతలను పాఠ్యాంశంగా పొందుపరచడం ఇది కొత్తేమీ కాదు. గతంలోనూ ఓ అప్పర్ ప్రైమరీ స్కూల్ పాఠ్యపుస్తకంలో ఇతనికి సంబంధించిన అంశాలను పాఠ్యాంశంగా చేర్చారు. Captain Rohit Sharma featured in the 11th Class Maths Text book. 👌 pic.twitter.com/mSgDnHm6Ye — Johns. (@CricCrazyJohns) February 26, 2024 కాగా, పాఠ్యాంశంగా మారిన రోహిత్ టీ20 సెంచరీ 2017 డిసెంబర్లో చేసింది. ఇండోర్ వేదికగా శ్రీలంకతో జరిగిన నాటి మ్యాచ్లో హిట్మ్యాన్ 35 బంతుల్లో 10 ఫోర్, 12 సిక్సర్ల సాయంతో సెంచరీ చేశాడు. కొద్ది నెలల కిందటి వరకు ఇది అంతర్జాతీయ టీ20ల్లో జాయింట్ ఫాస్టెస్ట్ సెంచరీగా చలామణి అయ్యింది. గతేడాది చివర్లో జరిగిన ఆసియా క్రీడల్లో నేపాల్ బ్యాటర్ కుశాల్ మల్లా.. రోహిత్, డేవిడ్ మిల్లర్ పేరిట సంయుక్తంగా ఉండిన ఫాస్టెస్ట్ సెంచరీ రికార్డును చెరిపేశాడు. మంగోలియాతో జరిగిన మ్యాచ్లో కుశాల్ 34 బంతుల్లోనే సెంచరీని బాదాడు. అయితే, కుశాల్ పేరిట ఈ రికార్డు ఎక్కువ రోజులు నిలబడలేదు. ఇవాళ (ఫిబ్రవరి 27) నమీబియా ఆటగాడు జాన్ నికోల్ లాఫ్టీ ఈటన్ కుశాల్ రికార్డును బద్దలు కొట్టాడు. నేపాల్తో జరిగిన మ్యాచ్లో లాఫ్టీ కేవలం 33 బంతుల్లోనే శతక్కొట్టి, టీ20 ఫాస్టెస్ట్ సెంచరీ రికార్డును తన పేరిట లిఖించుకున్నాడు. -
విల్ జాక్స్ విధ్వంసం.. ఫాస్టెస్ట్ సెంచరీ నమోదు
సౌతాఫ్రికా టీ20 లీగ్లో భాగంగా డర్బన్ సూపర్ జెయింట్స్తో నిన్న (జనవరి 18) జరిగిన మ్యాచ్లో ప్రిటోరియా క్యాపిటల్స్ ఓపెనర్, ఇంగ్లండ్ ఆటగాడు విల్ జాక్స్ విధ్వంసం సృష్టించాడు. ఈ మ్యాచ్లో జాక్స్ కేవలం 41 బంతుల్లోనే 8 ఫోర్లు, 9 సిక్సర్ల సాయంతో శతక్కొట్టి, లీగ్ చరిత్రలోనే ఫాస్టెస్ట్ సెంచరీని నమోదు చేశాడు. జాక్స్ రెచ్చిపోవడంతో ఈ మ్యాచ్లో ప్రిటోరియా క్యాపిటల్స్ 17 పరుగుల తేడాతో విజయం సాధించి, సీజన్ తొలి విజయాన్ని నమోదు చేసింది. Will Jacks is the King of Centurion 👑#Betway #SA20 #WelcomeToIncredible #PCvDSG pic.twitter.com/TvhnZcI3DN — Betway SA20 (@SA20_League) January 18, 2024 తొలుత బ్యాటింగ్ చేసిన క్యాపిటల్స్.. జాక్స్ శతక్కొట్టడంతో నిర్ణీత ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 204 పరుగులు చేసింది. క్యాపిటల్స్ ఇన్నింగ్స్లో జాక్స్తో పాటు కొలిన్ ఇంగ్రామ్ (23 బంతుల్లో 43), ఫిలిప్ సాల్ట్ (13 బంతుల్లో 23) మెరుపు ఇన్నింగ్స్లు ఆడారు. సూపర్ జెయింట్స్ బౌలర్లలో రీస్ టాప్లే (4-1-34-3) అద్భుతంగా బౌలింగ్ చేయగా.. జూనియర్ డాలా 2, కేశవ్ మహారాజ్, మార్కస్ స్టోయినిస్, కీమో పాల్, ప్రిటోరియస్ తలో వికెట్ పడగొట్టారు. ఛేదనలో తడబడిన సూపర్ జెయింట్స్.. నిర్ణీత ఓవర్లలో 7 వికెట్లు కోల్పోయి 187 పరుగులకే పరిమితమై ఓటమిపాలైంది. బ్యాట్తో విజృంభించిన విల్ జాక్స్.. బంతితోనూ (3-0-18-2) రాణించాడు. అతనితో పాటు వేన్ పార్నెల్ (2/54), విల్యోన్ (2/39), నీషమ్ (1/28) వికెట్లు తీశారు. సూపర్ జెయింట్స్ ఇన్నింగ్స్లో మాథ్యూ బ్రీట్జ్కీ (33) టాప్ స్కోరర్గా నిలువగా.. డికాక్ (25), స్మట్స్ (27), కేశవ్ మహారాజ్ (25 నాటౌట్) ఓ మోస్తరు స్కోర్లు చేశారు. -
IND VS AUS 3rd T20: మ్యాక్స్వెల్ ఊచకోత.. ఫాస్టెస్ట్ సెంచరీ
గౌహతి వేదికగా భారత్తో జరిగిన మూడో టీ20లో ఆసీస్ ఆటగాడు గ్లెన్ మ్యాక్స్వెల్ విధ్వంసం సృష్టించాడు. కేవలం 48 బంతుల్లోనే 8 ఫోర్లు, 8 సిక్సర్ల సాయంతో సుడిగాలి శతకం బాదాడు. ఫలితంగా ఆసీస్ 5 వికెట్ల తేడాతో గెలుపొంది, ఐదు మ్యాచ్లో సిరీస్లో భారత్ ఆధిక్యాన్ని 1-2కు తగ్గించింది. రుతురాజ్ మెరుపు శతకం.. టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన భారత్.. రుతురాజ్ అజేయమైన మెరుపు శతకంతో (57 బంతుల్లో 123 నాటౌట్; 13 ఫోర్లు, 7 సిక్సర్లు) విరుచుకుపడటంతో నిర్ణీత ఓవర్లలో 3 వికెట్ల నష్టానికి 222 పరుగుల భారీ స్కోర్ చేసింది. భారత ఇన్నింగ్స్లో యశస్వి జైస్వాల్ (6), ఇషాన్ కిషన్ (0) నిరాశపర్చగా.. సూర్యకుమార్ యాదవ్ (29 బంతుల్లో 39; 5 ఫోర్లు, 2 సిక్సర్లు), తిలక్ వర్మ (24 బంతుల్లో 31 నాటౌట్; 4 ఫోర్లు) పర్వాలేదనిపించారు. కేన్ రిచర్డ్సన్, బెహ్రెన్డార్ఫ్, ఆరోన్ హార్డీ తలో వికెట్ పడగొట్టారు. మ్యాక్సీ ఊచకోత.. 223 పరుగుల భారీ లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన ఆస్ట్రేలియా.. మ్యాక్స్వెల్ సునామీ శతకంతో చెలరేగడంతో అద్భుత విజయం సాధించింది. ఆసీస్ ఇన్నింగ్స్లో ఆరోన్ హార్డీ (16), జోష్ ఇంగ్లిస్ (10), మార్కస్ స్టోయినిస్ (17) తక్కువ స్కోర్లకే ఔట్ కాగా.. ట్రవిస్ హెడ్ (35) పర్వాలేదనిపించాడు. ఆఖర్లో మ్యాక్స్వెల్.. మాథ్యూ వేడ్ (16 బంతుల్లో 28 నాటౌట్; 3 ఫోర్లు, సిక్స్) సహకారంతో ఆసీస్ను విజయతీరాలకు చేర్చాడు. భారత బౌలర్లలో రవి భిష్ణోయ్ 2 వికెట్లు పడగొట్టగా.. ఆవేశ్ ఖాన్, అక్షర్ పటేల్, అర్షదీప్ సింగ్ తలో వికెట్ దక్కించుకున్నారు. ప్రసిద్ద్ కృష్ణ (4-0-68-0) ధారాళంగా పరుగులు సమర్పించుకున్నాడు. ఆఖరి బంతికి గెలిచిన ఆసీస్.. ఆసీస్ గెలవాలంటే చివరి రెండు ఓవర్లలో 43 పరుగులు అవసరం కావడంతో భారత గెలుపు లాంఛనమే అని అంతా అనుకున్నారు. అయితే మ్యాక్సీ ఒక్కసారిగా మెరుపుదాడికి దిగి భారత్ చేతుల్లో నుంచి మ్యాచ్ను లాగేసుకున్నాడు. అక్షర్ వేసిన 19వ ఓవర్లో 22 పరుగులు, ప్రసిద్ద్ కృష్ణ వేసిన ఆఖరి ఓవర్లో 23 పరుగులు పిండుకున్న మ్యాక్సీ.. ఆఖరి బంతికి ఫోర్ బాది ఆసీస్ను గెలిపించాడు. ఫాస్టెస్ట్ సెంచరీ రికార్డు సమం చేసిన మ్యాక్సీ.. ప్రస్తుత భారత పర్యటనలో భీకర ఫామ్లో ఉన్న మ్యాక్స్వెల్ వరల్డ్కప్ 2023లో రెండు మెరుపు శతకాలు బాదడంతో పాటు నిన్న (నవంబర్ 28) జరిగిన మూడో టీ20లోనూ సుడిగాలి శతకంతో విరుచుకుపడ్డాడు. నిన్నటి మ్యాచ్లో 47 బంతుల్లోనే శతక్కొట్టిన అతను.. ఆస్ట్రేలియా తరఫున పొట్టి క్రికెట్లో ఫాస్టెస్ట్ సెంచరీ రికార్డును సమం చేశాడు. మ్యాక్సీకి ముందు ఆరోన్ ఫించ్, జోష్ ఇంగ్లిస్ కూడా 47 బంతుల్లోనే శతకాలు బాదారు. ఆసీస్ తరఫున టీ20ల్లో టాప్-5 ఫాస్టెస్ట్ శతకాల్లో మ్యాక్స్వెల్వే మూడు ఉండటం విశేషం. దీనికి ముందు మ్యాక్సీ ఓసారి 49 బంతుల్లో, ఓసారి 50 బంతుల్లో టీ20 సెంచరీలు బాదాడు. -
కేఎల్ రాహుల్ సుడిగాలి శతకం.. వరల్డ్కప్ చరిత్రలోనే ఫాస్టెస్ట్
వన్డే వరల్డ్కప్-2023లో భాగంగా నెదర్లాండ్స్తో జరిగిన మ్యాచ్లో టీమిండియా మిడిలార్డర్ బ్యాటర్ కేఎల్ రాహుల్ సుడిగాలి శతకం సాధించాడు. ఈ మ్యాచ్లో 62 బంతుల్లోనే శతక్కొట్టిన రాహుల్.. వన్డే వరల్డ్కప్ చరిత్రలోనే భారత్ తరఫున అత్యంత వేగవంతమైన సెంచరీ సాధించిన ఆటగాడిగా రికార్డుల్లోకెక్కాడు. రాహుల్కు ముందు ఈ రికార్డు రోహిత్ శర్మ పేరిట ఉండేది. ఇదే వరల్డ్కప్ ఎడిషన్లో హిట్మ్యాన్ ఆఫ్ఘనిస్తాన్పై 62 బంతుల్లో సెంచరీ చేశాడు. ఈ మ్యాచ్లో మొత్తంగా 64 బంతులు ఎదుర్కొన్న రాహుల్ 11 ఫోర్లు, 4 సిక్సర్ల సాయంతో 102 పరుగులు చేసి ఔటయ్యాడు. నెదర్లాండ్స్పై సెంచరీతో రాహుల్ మరో రికార్డు కూడా తన ఖాతాలో వేసుకున్నాడు. రాహుల్ ద్రవిడ్ (1999లో శ్రీలంకపై 145 పరుగులు) తర్వాత వరల్డ్కప్లో సెంచరీ సాధించిన భారత వికెట్కీపర్గా రికార్డుల్లోకెక్కాడు. అలాగే వరల్డ్కప్లో భారత్ తరఫున రెండో అత్యధిక స్కోర్ చేసిన వికెట్కీపర్గానూ రికార్డు నెలకొల్పాడు. కాగా, రాహుల్తో పాటు శ్రేయస్ అయ్యర్ (94 బంతుల్లో 128 నాటౌట్; 10 ఫోర్లు, 5 సిక్సర్లు) కూడా మెరుపు శతకంతో విరుచుకుపడటంతో నెదర్లాండ్స్తో జరిగిన మ్యాచ్లో టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ చేసిన భారత జట్టు భారీ స్కోర్ చేసింది. వీరితో పాటు రోహిత్ శర్మ (61), శుభ్మన్ గిల్ (51), విరాట్ కోహ్లి (51) హాఫ్ సెంచరీలతో రాణించడంతో భారత్ నిర్ణీత ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 410 పరుగులు చేసింది. అనంతరం ఛేదనకు దిగిన నెదర్లాండ్స్ భారత్ బౌలర్లు మూకుమ్మడిగా రాణించడంతో 47.5 ఓవర్లలో 250 పరుగులకు ఆలౌటైంది. ఫలితంగా భారత్ 160 పరుగుల తేడాతో గెలుపొంది, ప్రస్తుత వరల్డ్కప్ ఎడిషన్లో వరుసగా తొమ్మిదో విజయాన్ని నమోదు చేసింది. భారత బౌలర్లలో బుమ్రా, సిరాజ్, కుల్దీప్, జడేజా తలో 2 వికెట్లు పడగొట్టగా.. విరాట్, రోహిత్ చెరో వికెట్ దక్కించుకున్నారు. ఈ మ్యాచ్లో రోహిత్, విరాట్తో పాటు శుభ్మన్ గిల్ కూడా బౌలింగ్ చేశాడు. ఈ విజయంతో భారత్ లీగ్ దశలో ఓటమి ఎరుగని జట్టుగా నిలిచింది. నవంబర్ 15న జరిగే తొలి సెమీస్లో భారత్.. న్యూజిలాండ్తో తలపడుతుంది. -
మాక్స్వెల్ విధ్వంసకర ఇన్నింగ్స్.. వరల్డ్కప్ చరిత్రలోనే ఫాస్టెస్ట్ సెంచరీ
WC 2023- #AUSvsNED- #GlennMaxwellFastestCentury: వన్డే వరల్డ్కప్-2023లో నెదర్లాండ్స్తో మ్యాచ్లో ఆస్ట్రేలియా ఆల్రౌండర్ గ్లెన్ మాక్స్వెల్ విధ్వంసకర ఇన్నింగ్స్తో అదరగొట్టాడు. ఢిల్లీలోని అరుణ్జైట్లీ మైదానంలో ఆకాశమే హద్దుగా చెలరేగుతూ ఫోర్లు, సిక్సర్ల వర్షం కురిపించాడు. డచ్ బౌలర్లను ఓ ఆటాడుకున్న మాక్సీ కేవలం 40 బంతుల్లోనే శతకం పూర్తి చేసుకున్నాడు. ఏకంగా 252.50 స్ట్రైక్రేటుతో 101 పరుగులు సాధించి వన్డే వరల్డ్కప్ చరిత్రలో ఫాస్టెస్ట్ సెంచరీ నమోదు చేశాడు. ఈ క్రమంలో సౌతాఫ్రికా వైస్ కెప్టెన్ ఎయిడెన్ మార్కరమ్ పేరిట ఉన్న రికార్డును బద్దలు కొట్టాడు. కాగా ప్రపంచకప్-2023లో ఢిల్లీలోనే మార్కరమ్ 49 బంతుల్లో శతకం సాధించిన విషయం తెలిసిందే. వరల్డ్కప్ చరిత్రలో వేగవంతమైన సెంచరీలు(ఎదుర్కొన్న బంతుల పరంగా) నమోదు చేసింది వీరే ►40 - గ్లెన్ మాక్స్వెల్ నెదర్లాండ్స్ మీద, ఢిల్లీలో-2023 ►49 - ఎయిడెన్ మార్కరమ్ శ్రీలంక మీద, ఢిల్లీలో- 2023 ►50 - కెవిన్ ఓబ్రెయిన్ ఇంగ్లండ్ మీద, బెంగళూరులో- 2011 ►51 -గ్లెన్ మాక్స్వెల్ శ్రీలంక మీద, సిడ్నీలో- 2015 ►52 - ఏబీ డివిలియర్స్ వెస్టిండీస్ మీద, సిడ్నీలో 2015 ఆస్ట్రేలియా భారీ స్కోరు: నెదర్లాండ్స్తో బుధవారం నాటి మ్యాచ్లో డేవిడ్ వార్నర్ 104 , స్టీవ్ స్మిత్ 71, మార్నస్ లబుషేన్ 62 పరుగులతో అదరగొట్టగా.. మాక్సీ సునామీ ఇన్నింగ్స్ కారణంగా ఆస్ట్రేలియా 399 పరుగుల భారీ స్కోరు చేసింది. పసికూన నెదర్లాండ్స్ ముందు కొండంత లక్ష్యాన్ని విధించింది. View this post on Instagram A post shared by ICC (@icc) View this post on Instagram A post shared by ICC (@icc) -
చరిత్ర సృష్టించిన ఆస్ట్రేలియా బ్యాటర్.. ఏబీ డివిలియర్స్ ఫాస్టెస్ట్ సెంచరీ రికార్డు బద్దలు
21 ఏళ్ల ఆస్ట్రేలియా యువ బ్యాటర్ జేక్ ఫ్రేజర్ మెక్గుర్క్ చరిత్ర సృష్టించాడు. లిస్ట్-ఏ క్రికెట్లో (అంతర్జాతీయ వన్డేలు, దేశవాలీ వన్డేలు) ఫాస్టెస్ట్ సెంచరీని నమోదు చేశాడు. ఆస్ట్రేలియా దేశవాలీ వన్డే టోర్నీ మార్ష్ కప్ 2023-24లో భాగంగా టస్మానియాతో ఇవాళ (అక్టోబర్ 8) జరుగుతున్న మ్యాచ్లో ఫ్రేజర్ (సౌత్ ఆస్ట్రేలియా) కేవలం 29 బంతుల్లోనే సెంచరీ పూర్తి చేశాడు. ఈ ఇన్నింగ్స్లో మొత్తంగా 38 బంతులు ఎదుర్కొన్న ఫ్రేజర్ 10 ఫోర్లు, 13 సిక్సర్ల సాయంతో 125 పరుగులు చేసి ఔటయ్యాడు. 21-year-old Jake Fraser-McGurk set a world record by scoring a 29-ball century in Australia's Marsh Cup, breaking Ab de Villiers' record of a 31-ball List A hundred! 🤯👏 pic.twitter.com/z53anVA89r — CricTracker (@Cricketracker) October 8, 2023 ఈ సెంచరీ ద్వారా ఫ్రేజర్ లిస్ట్-ఏ క్రికెట్లో సౌతాఫ్రికా మాజీ ఆటగాడు ఏబీ డివిలియర్స్ పేరిట ఉండిన ఫాస్టెస్ట్ సెంచరీ రికార్డును బద్దలుకొట్టాడు. 2014-15లో జొహనెస్బర్గ్ వేదికగా వెస్టిండీస్తో జరిగిన మ్యాచ్లో డివిలియర్స్ 31 బంతుల్లోనే శతక్కొట్టగా.. ఇవాల్టి మ్యాచ్లో ఫ్రేజర్ దాదాపు 10 సంవత్సరాలుగా చలామణిలో ఉండిన ఆ రికార్డును బద్దలు కొట్టాడు. టస్మానియాతో జరుగుతున్న మ్యాచ్లో ఫ్రేజర్ సృష్టించిన విధ్వంసం ఏ రేంజ్లో ఉండిందంటే.. 436 పరుగులు అతి భారీ లక్ష్యాన్ని ఛేదిస్తున్న అతని జట్టు (సౌత్ ఆస్ట్రేలియా) కేవలం 11.4 ఓవర్లలోనే 172 పరుగులు చేసింది. కేవలం 11.4 ఓవర్లలోనే ఫ్రేజర్ సెంచరీని పూర్తి చేసుకుని ఔటయ్యాడు. కష్టసాధ్యమైన లక్ష్యాన్ని ఛేదించే ప్రయత్నం చేస్తున్న సౌత్ ఆస్ట్రేలియా సక్సెస్ సాధించే దిశగా అడుగులు వేస్తుంది. 35 ఓవర్లలో ఆ జట్టు 3 వికెట్లు కోల్పోయి 314 పరుగులు చేసి లక్ష్యం దిశగా సాగుతుంది. ఈ మ్యాచ్లో సౌతాఫ్రికా గెలవాలంటే 90 బంతుల్లో 122 పరుగులు చేయాల్సి ఉంది. చేతిలో మరో 7 వికెట్లు ఉన్నాయి. నాథన్ మెక్స్వీనీ (47), జేక్ లీమన్ (25) క్రీజ్లో ఉన్నారు. సౌత్ ఆస్ట్రేలియా ఇన్నింగ్స్లో ఫ్రేజర్ విధ్వంసకర శతకంతో విరుచుకుపడగా.. హెన్రీ బ్రంట్ (51), డేనియల్ డ్రూ (52) అర్ధసెంచరీలు నమోదు చేశారు. ఈ మ్యాచ్లో తొలుత బ్యాటింగ్ చేసిన టస్మానియా నిర్ణీత ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 435 పరుగులు చేసింది. టస్మానియా ఇన్నింగ్స్లో కెప్టెన్ జోర్డన్ సిల్క్ (85 బంతుల్లో 116; 12 ఫోర్లు, 2 సిక్సర్లు) మెరుపు శతకంతో విరుచుకుపడగా.. ఓపెనర్ కాలెబ్ జువెల్ (52 బంతుల్లో 90; 14 ఫోర్లు, 2 సిక్సర్లు) విధ్వంసకర హాఫ్ సెంచరీతో మెరిశాడు. రైట్ (51) అర్ధసెంచరీతో రాణించగా... చార్లీ వాకిమ్ (48), వెబ్స్టర్ (42), వెథరాల్డ్ (35) ఓ మోస్తరు స్కోర్లు చేశారు. ఈ మ్యాచ్లో టస్మానియా నిర్ధేశించిన 436 పరుగుల లక్ష్యాన్ని సౌత్ ఆస్ట్రేలియా ఛేదిస్తే.. దేశవాలీ క్రికెట్ అతి భారీ లక్ష్య ఛేదనగా.. లిస్ట్-ఏ క్రికెట్లో రెండో సక్సెస్ఫుల్ రన్ చేజ్గా రికార్డుల్లోకెక్కుతుంది. లిస్ట్-ఏ క్రికెట్లో సక్సెస్ఫుల్ రన్ఛేజ్ రికార్డు సౌతాఫ్రికా పేరిట ఉంది. 2006లో ఆస్ట్రేలియాతో జరిగిన మ్యాచ్లో సౌతాఫ్రికా 435 పరుగుల భారీ లక్ష్యాన్ని ఛేదించి చరిత్ర సృష్టించింది. -
వన్డే ప్రపంచకప్లో ఫాస్టెస్ట్ సెంచరీ ఎవరిదో తెలుసా?
వన్డే వరల్డ్ కప్ 2023 ప్రారంభానికి సమయం ఆసన్నమైంది. మరో 24 గంటల్లో అహ్మదాబాద్లోని నరేంద్ర మోదీ స్టేడియం వేదికగా ఈ మెగా ఈవెంట్కు తెరలేవనుంది. తొలి మ్యాచ్లో ఢిఫెడింగ్ ఛాంపియన్స్ ఇంగ్లండ్, రన్నరప్ న్యూజిలాండ్ జట్లు అమీతుమీ తెల్చుకోనున్నాయి. ఈ మెగా టోర్నీ నేపథ్యంలో వన్డే వరల్డ్కప్లో ఫాస్టెస్ట్ సెంచరీలు చేసిన టాప్-5 ఆటగాళ్లపై ఓ లూక్కేద్దం. కెవిన్ ఓబ్రియన్.. వన్డే ప్రపంచకప్ చరిత్రలో అత్యంత వేగవంతంగా సెంచరీ చేసిన రికార్డు ఐర్లాండ్ మాజీ ఆటగాడు కెవిన్ ఓబ్రియన్ పేరిట ఉంది. భారత్ వేదికగా జరిగిన 2011 వన్డే ప్రపంచకప్లో ఓబ్రియన్ ఈ ఫీట్ నమోదు చేశాడు. ఈ టోర్నీలో భాగంగా ఇంగ్లండ్తో జరిగిన మ్యాచ్లో అతడు కేవలం 50 బంతుల్లోనే సెంచరీ సాధించి రికార్డులకెక్కాడు. 6వ స్ధానంలో బ్యాటింగ్కు వచ్చిన ఓబ్రియన్ బౌండరీల వర్షం కరిపించాడు. ఓవరాల్గా ఈ మ్యాచ్లో 63 బంతులు ఎదుర్కొన్న కెవిన్ 13 ఫోర్లు, 6 సిక్స్లతో 113 పరుగులు చేశాడు. ఇంగ్లండ్పై 328 పరుగుల లక్ష్యాన్ని ఛేదించడంలో అతడు కీలక పాత్ర పోషించాడు. అతడి ఇన్నింగ్స్ ప్రపంచకప్ చరిత్రలోనే చిరస్మరణీయంగా మిగిలిపోనుంది. గ్లెన్ మాక్స్వెల్ ఈ అరుదైన ఘనత సాధించిన జాబితాలో ఓబ్రియన్ తర్వాత ఆస్ట్రేలియా స్టార్ ఆల్రౌండర్ గ్లెన్ మాక్స్వెల్ ఉన్నాడు. సొంతగడ్డపై జరిగిన 2015 వన్డే ప్రపంచకప్లో కేవలం 51 బంతుల్లోనే మాక్సీ సెంచరీ మార్క్ను అందుకున్నాడు. శ్రీలంకతో జరిగిన లీగ్ మ్యాచ్లో మాక్స్వెల్ ఈ ఫీట్ సాధించాడు. ఈ మ్యాచ్లో 53 బంతులు ఎదుర్కొన్న మాక్సీ 10 ఫోర్లు, 4 సిక్స్లతో 102 పరుగులు చేశాడు. ఏబీ డివిలియర్స్ ఇక లిస్ట్లో మాక్స్వెల్ తర్వాత ఈ లిస్ట్లో దక్షిణాఫ్రికా లెజెండ్ ఏబీ డివిలియర్స్ ఉన్నాడు. ఆస్ట్రేలియా వేదికగా జరిగిన 2015 ప్రపంచకప్లో వెస్టిండీస్పై కేవలం 52 బంతుల్లోనే డివిలియర్స్ సెంచరీ చేశాడు. ఈ మ్యాచ్లో 66 బంతులు ఆడిన ఏబీడీ.. 17 ఫోర్లు, 8 సిక్స్లతో 162 పరుగులు చేశాడు. ఇయాన్ మోర్గాన్ ఇక ఈ అరుదైన ఫీట్ సాధించిన జాబితాలో ఇంగ్లండ్ మాజీ కెప్టెన్ ఇయాన్ మోర్గాన్ నాలుగో స్ధానంలో ఉన్నాడు. సొంత గడ్డపై జరిగిన 2019 వన్డే ప్రపంచకప్లో మోర్గాన్ 57 బంతుల్లో తన సెంచరీ మార్క్ను అందుకున్నాడు. ఆఫ్గానిస్తాన్పై ఈ ఘనత సాధించాడు. ఈ మ్యాచ్లో ఓవరాల్గా 71 బంతులు ఆడిన మోర్గాన్ 4 ఫోర్లు, 17 సిక్స్లతో 148 పరుగులు చేశాడు. మాథ్యూ హేడన్ ఇక ఈ జాబితాలో ఐదు స్ధానంలో ఆస్ట్రేలియా క్రికెట్ దిగ్గజం మాథ్యూ హేడన్ ఉన్నాడు. 2007 వన్డే ప్రపంచకప్లో హేడన్.. దక్షిణాఫ్రికాపై 66 బంతుల్లో శతకాన్ని సాధించాడు. మొత్తంగా 68 బంతులు ఎదుర్కొన్న హేడన్ 14 ఫోర్లు, 4 సిక్స్లతో 101 పరుగులు చేశాడు. చదవండి: Asian Games 2023: శ్రీలంక ఘోర పరాజయం.. సెమీఫైనల్లో ఆఫ్గానిస్తాన్ -
ఏషియన్ గేమ్స్లో మరో విధ్వంసకర శతకం.. 13 ఫోర్లు, 9 సిక్సర్లతో ఊచకోత
ఏషియన్ గేమ్స్ 2023లో మరో విధ్వంసకర సెంచరీ నమోదైంది. ఈసారి మలేషియా ఆటగాడు ప్రత్యర్ధి థాయ్లాండ్ బౌలర్లేను ఊచకోత కోసి శతక్కొట్టాడు. కొద్ది రోజుల ముందు మంగోలియాతో జరిగిన మ్యాచ్లో నేపాల్ ఆటగాడు కుషాల్ మల్లా టీ20ల్లోనే ఫాస్టెస్ట్ సెంచరీ (34 బంతుల్లో) బాదగా.. తాజాగా మలేషియా ఆటగాడు సయ్యద్ అజీజ్ 56 బంతుల్లో 13 ఫోర్లు, 9 సిక్సర్లతో శివాలెత్తి 126 పరుగులు చేశాడు. అజీజ్తో పాటు ముహమ్మద్ అమీర్ (25 బంతుల్లో 55; 4 ఫోర్లు, 4 సిక్సర్లు), విరన్దీప్ సింగ్ (12 బంతుల్లో 30 నాటౌట్; 4 సిక్సర్లు) కూడా విజృంభించడంతో మలేషియా నిర్ణీత 20 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి రికార్డు స్థాయిలో 268 పరుగులు చేసింది. ఈ మ్యాచ్లో అజీజ్ చేసిన సెంచరీ అంతర్జాతీయ టీ20ల్లో 12వ ఫాస్టెస్ట్ సెంచరీ కాగా.. మలేషియా చేసిన స్కోర్ అంతర్జాతీయ టీ20ల్లో నాలుగో అత్యధిక టీమ్ స్కోర్గా రికార్డైంది. మ్యాచ్ విషయానికొస్తే.. టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ చేసిన మలేషియా రికార్డు స్కోర్ సాధించగా.. ఛేదనలో చేతులెత్తేసిన థాయ్లాండ్ 20 ఓవర్లలో 9 వికెట్లు కోల్పోయి కేవలం 74 పరుగులు మాత్రమే చేసి ఘోర పరాజయాన్ని మూటగట్టుకుంది. దీంతో థాయ్పై మలేషియా 194 పరుగుల భారీ తేడాతో ఘన విజయం సాధించింది. మలేషియా బౌలర్లలో అహ్మద్ ఫయాజ్, విజయ్ ఉన్ని, విరన్దీప్సింగ్ తలో 2 వికెట్లు పడగొట్టగా.. ముహమ్మద్ అమిర్ అజిమ్ ఓ వికెట్ దక్కించుకుని థాయ్లాండ్ను దెబ్బకొట్టారు. థాయ్లాండ్ ఇన్నింగ్స్లో కేవలం నలుగురు మాత్రం అతికష్టం మీద రెండంకెల స్కోర్ చేయగా.. నొప్పొన్ సేనమోంత్రి చేసిన 15 పరుగులు ఇన్నింగ్స్ టాప్ స్కోర్గా నిలిచింది. ఈ క్రీడల్లో భారత్ మ్యాచ్ రేపు జరుగనుంది. టీమిండియా రేపు క్వార్టర్ ఫైనల్-1లో నేపాల్తో తలపడనుంది. -
ప్రపంచ రికార్డులు కొల్లగొట్టిన టీ20 మ్యాచ్.. ఓ వినూత్న రికార్డు నమోదు
ఏషియన్ గేమ్స్లో పురుషుల క్రికెట్కు తొలిసారి ప్రాతినిథ్యం లభించిన విషయం తెలిసిందే. ఈ క్రీడలకు ఎవరూ ఊహించని విధంగా అదిరిపోయే ఆరంభం లభించింది. టోర్నీ తొలి మ్యాచ్లోనే ప్రపంచ రికార్డులు బద్దలయ్యాయి. మంగోలియాతో జరిగిన మ్యాచ్లో నేపాల్ టీ20 రికార్డులను తిరగరాసింది. మంగోలియాపై రికార్డు స్థాయిలో 273 పరుగుల తేడాతో ఘన విజయం సాధించిన నేపాల్.. అంతర్జాతీయ టీ20ల్లో అత్యధిక టీమ్ స్కోర్తో (314/3) పాటు పరుగుల పరంగా భారీ విజయం (273), ఓ ఇన్నింగ్స్లో అత్యధిక సిక్సర్లు (26).. బౌండరీలు, సిక్సర్ల రూపంలో అత్యధిక పరుగులు (14 ఫోర్లు, 26 సిక్సర్లు కలిపి మొత్తంగా 212 పరుగులు), ఫాస్టెస్ట్ ఫిఫి (దీపేంద్ర సింగ్-9 బంతుల్లో), ఫాస్టెస్ట్ హండ్రెడ్ (కుషాల్ మల్లా-34 బంతుల్లో), మూడో వికెట్కు అత్యధిక పార్ట్నర్షిప్ (193 పరుగులు), అత్యధిక స్ట్రయిక్రేట్ (దీపేంద్ర సింగ్- 520 (10 బంతుల్లో 52 పరుగులు) ఇలా పలు ప్రపంచ రికార్డులను కొల్లగొట్టింది. Dipendra Singh Airee's fastest ever fifty in T20i history: 6,6,6,6,6,2,6,6,6. - A memorable day for Nepal cricket!pic.twitter.com/ih9cvYehCi — Mufaddal Vohra (@mufaddal_vohra) September 27, 2023 పై పేర్కొన్న రికార్డులతో ఈ మ్యాచ్లో మరో వినూత్న రికార్డు కూడా నమోదైంది. మంగోలియా చేసిన 41 పరుగుల స్కోర్లో ఎక్స్ట్రాలే (23 పరుగులు, 16 వైడ్లు, 5 లెగ్ బైలు, 2 నోబాల్స్) టాప్ స్కోర్ కావడం. ఓ జట్టు స్కోర్లో 50 శాతానికి పైగా పరుగులు ఎక్స్ట్రాల రూపంలో రావడం టీ20 చరిత్రలో ఇదే మొదటిసారి. మంగోలియా స్కోర్లో 56 శాతం పరుగులు ఎక్సట్రాల రూపంలో వచ్చాయి. ఎక్స్ట్రాల తర్వాత మంగోలియన్ ఇన్నింగ్స్లో అత్యధిక స్కోర్ దవాసురెన్ జమ్యసురెన్ (10) చేశాడు. ఇతనొక్కడే మంగోలియా ఇన్నింగ్స్లో రెండంకెల స్కోర్ చేశాడు. మిగిలిన 10 బ్యాటర్లు సింగిల్ డిజిట్ స్కోర్లకే పరిమితమయ్యారు. నేపాల్ బౌలర్లు కరణ్, అభినాశ్, సందీప్ లామిచ్చెన్ తలో 2 వికెట్లు పడగొట్టగా.. సోంపాల్, కుశాల్ భుర్టెల్, దీపేంద్ర సింగ్ తలో వికెట్ దక్కించకున్నారు. తొలుత బ్యాటింగ్ చేసిన నేపాల్ నిర్ణీత 20 ఓవర్లలో 3 వికెట్ల నష్టానికి 314 పరుగులు చేసింది. ఓపెనర్లు కుషాల్ భుర్టెల్ (19), ఆసిఫ్ షేక్ (16) విఫలం కాగా.. కుషాల్ మల్లా (50 బంతుల్లో 137 నాటౌట్; 8 ఫోర్లు, 12 సిక్సర్లు), దీపేంద్ర సింగ్ (10 బంతుల్లో 52 నాటౌట్; 8 సిక్సర్లు), కెప్టెన్ రోహిత్ పౌడెల్ (27 బంతుల్లో 61; 2 ఫోర్లు, 6 సిక్సర్లు) ఆకాశమే హద్దుగా చెలరేగి చరిత్రపుటల్లో చిరకాలం మిగిలుండిపోయే పలు రికార్డులను తమ పేరిట లిఖించుకున్నారు. -
40 బంతుల్లో శతక్కొట్టిన టీమిండియా ట్రిపుల్ సెంచూరియన్
వీరేంద్ర సెహ్వాగ్ తర్వాత టెస్ట్ల్లో భారత్ తరఫున ట్రిపుల్ సెంచరీ సాధించిన కరుణ్ నాయర్.. కర్ణాటక క్రికెట్ అసోసియేషన్ ఆధ్వర్యంలో జరుగుతున్న మహారాజా టీ20 టోర్నీలో ఆకాశమే హద్దుగా చెలరేగిపోతున్నాడు. ఈ టోర్నీలో ఇప్పటికే లీడింగ్ రన్స్కోరర్గా కొనసాగుతున్న నాయర్.. గుల్భర్గా మిస్టిక్స్తో ఇవాళ (ఆగస్ట్ 28) జరుగుతున్న రెండో సెమీఫైనల్లో 40 బంతుల్లోనే శతక్కొట్టి, తన జట్టు (మైసూర్ వారియర్స్) భారీ స్కోర్ సాధించడంలో ప్రధానపాత్ర పోషించాడు. ఈ మ్యాచ్లో మొత్తంగా 42 బంతులు ఎదుర్కొన్న నాయర్.. 7 ఫోర్లు, 9 సిక్సర్ల సాయంతో 107 పరుగులు చేసి, అజేయంగా నిలిచాడు. నాయర్కు ఆర్ సమర్థ్ (50 బంతుల్లో 80; 10 ఫోర్లు, 2 సిక్సర్లు), ఎస్ కార్తీక్ (23 బంతుల్లో 41; 2 ఫోర్లు, 3 సిక్సర్లు) తోడవ్వడంతో తొలుత బ్యాటింగ్ చేసిన మైసూర్ వారియర్స్ నిర్ణీత 20 ఓవర్లలో 2 వికెట్ల నష్టానికి 248 పరుగుల భారీ స్కోర్ చేసింది. Karun Nair continues his dream run in the Maharaja T20 League 2023. pic.twitter.com/MojOUiPtim — CricTracker (@Cricketracker) August 28, 2023 నాయర్ విధ్వంసం ధాటికి గుల్భర్గా బౌలర్లు అభిలాష్ షెట్టి (4-0-63-1), విజయ్కుమార్ వైశాక్ (4-0-45-0), అవినాశ్ (3.4-0-44-1), నొరోన్హా (2-0-36-0) ధారాళంగా పరుగులు సమర్పించుకున్నారు. అనంతరం 249 పరుగుల కష్టసాధ్యమైన లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన గుల్భర్గా.. 9 ఓవర్లు ముగిసే సమయానికి 4 వికెట్ల నష్టానికి 106 పరుగులు చేసింది. గుల్భర్గా ఇన్నింగ్స్లో చేతన్ 28, ఆనీశ్ 23, నొరోన్హా 39 నాటౌట్, స్మరణ్ 0, అమిత్ వర్మ 11, హసన్ ఖలీద్ 4 నాటౌట్ పరుగులు చేశారు. మైసూర్ బౌలర్లలో జగదీశ సుచిత్ 2, మోనిశ్ రెడ్డి, గౌతమ్ మిశ్రా తలో వికెట్ పడగొట్టారు. ఇదిలా ఉంటే, టెస్ట్ల్లో భారత్ తరఫున సెహ్వాగ్ 2, కరుణ్ నాయర్ ఓసారి ట్రిపుల్ సెంచరీలు సాధించిన విషయం తెలిసిందే. సెహ్వాగ్ 2004లో పాకిస్తాన్పై తన తొలి ట్రిపుల్ సెంచరీని (309) (భారత్ తరఫున మొట్టమొదటిది), 2008లో సౌతాఫ్రికాపై తన రెండో ట్రిపుల్ హండ్రెడ్ను (319) బాదాడు. ఆ తర్వాత 2016లో కరుణ్ నాయర్ ఇంగ్లండ్పై చెన్నైలో ట్రిపుల్ సెంచరీని (303 నాటౌట్) సాధించి, భారత్ తరఫున టెస్ట్ల్లో సెహ్వాగ్ తర్వాత ఆ ఘనత సాధించిన రెండో క్రికెటర్గా రికార్డుల్లోకెక్కాడు. -
హ్యారీ బ్రూక్ ఊచకోత.. ఫాస్టెస్ట్ సెంచరీ నమోదు
హండ్రెడ్ లీగ్లో ఫాస్టెస్ట్ సెంచరీ నమోదైంది. నార్త్రన్ సూపర్ ఛార్జర్స్ ఆటగాడు, ఇంగ్లండ్ స్టార్ ప్లేయర్ హ్యారీ బ్రూక్ ఈ ఫీట్ సాధించాడు. వెల్ష్ ఫైర్తో నిన్న (ఆగస్ట్ 22) జరిగిన మ్యాచ్లో బ్రూక్ 41 బంతుల్లోనే శతక్కొట్టాడు. హండ్రెడ్ లీగ్ హిస్టరీలోనే ఇదే ఫాస్టెస్ట్ సెంచరీ. బ్రూక్ తన ఇన్నింగ్స్లో మొత్తంగా 42 బంతులు ఎదుర్కొని 11 ఫోర్లు, 7 సిక్సర్ల సాయంతో 105 పరుగులు చేశాడు. కేవలం ముగ్గురు మాత్రమే.. హండ్రెడ్ లీగ్లో చరిత్రలో (పురుషుల ఎడిషన్లో) ఇప్పటివరకు కేవలం ముగ్గురు మాత్రమే సెంచరీ మార్కును అందుకోగా.. బ్రూక్దే ఫాస్టెప్ట్ సెంచరీగా రికార్డైంది. 2022 సీజన్లో విల్ జాక్స్ (47 బంతుల్లో) (48 బంతుల్లో 108 నాటౌట్; 10 ఫోర్లు, 8 సిక్సర్లు), విల్ స్మీడ్ (49 బంతుల్లో) (50 బంతుల్లో 101 నాటౌట్; 8 ఫోర్లు, 6 సిక్సర్లు) సెంచరీలు చేయగా, బ్రూకే అతి తక్కువ బంతుల్లో సెంచరీ నమోదు చేశాడు. హండ్రెడ్ లీగ్లో అత్యధిక స్కోర్.. హండ్రెడ్ లీగ్లో బ్రూక్ ఫాస్టెస్ట్ సెంచరీ నమోదు చేసినప్పటికీ, ఈ లీగ్లో అత్యధిక స్కోర్ (ఏకైక సెంచరీ) రికార్డు మాత్రం మహిళా క్రికెటర్ పేరిట నమోదై ఉంది. ప్రస్తుత సీజన్లో వెల్ష్ ఫైర్ ప్లేయర్ ట్యామీ బేమౌంట్ ట్రెంట్ రాకెట్స్తో జరిగిన మ్యాచ్లో 61 బంతుల్లో 20 ఫోర్లు, 2 సిక్సర్ల సాయంతో 118 పరుగులు చేసింది. ఓవరాల్గా హండ్రెడ్ లీగ్లో ఇదే అత్యుత్తమ స్కోర్గా రికార్డైంది. Every. Ball. Counts. Harry Brook has done it 💥#TheHundred pic.twitter.com/iCC6FbKVkG — The Hundred (@thehundred) August 22, 2023 బ్రూక్ సెంచరీ వృధా.. వెల్ష్ ఫైర్పై బ్రూక్ ఫాస్టెస్ట్ సెంచరీతో విరుచుకుపడినా ప్రయోజనం లేకుండా పోయింది. అతను ప్రాతినిథ్యం వహించిన నార్త్రన్ సూపర్ ఛార్జర్స్.. వెల్ష్ ఫైర్ చేతిలో ఓటమిపాలై లీగ్ నుంచి నిష్క్రమించింది. ఈ మ్యాచ్లో తొలుత బ్యాటింగ్ చేసిన సూపర్ ఛార్జర్స్.. బ్రూక్ శతక్కొట్టడంతో నిర్ణీత 100 బంతుల్లో 7 వికెట్ల నష్టానికి 158 పరుగులు చేసింది. సూపర్ ఛార్జర్స్ ఇన్నింగ్స్లో బ్రూక్ (మూడంకెల స్కోర్), ఆడమ్ హోస్ (15) మినహా మిగతావారు కనీసం రెండంకెల స్కోర్ కూడా చేయలేకపోయారు. వెల్ష్ ఫైర్ బౌలర్లలో డేవిడ్ విల్లీ 2, మ్యాట్ హెన్రీ, డేవిడ్ పెయిన్, వాన్ డర్ మెర్వ్, వెల్స్ తలో వికెట్ పడగొట్టారు. What a knock! 💥 Stephen Eskinazi scored the third-fastest fifty of the men's competition. 👏#TheHundred pic.twitter.com/pJqc1hXspG — The Hundred (@thehundred) August 23, 2023 విధ్వంసం సృష్టించిన వెల్ష్ ఫైర్ ప్లేయర్లు.. 159 పరుగుల లక్ష్య ఛేదనలో వెల్ష్ ఫైర్ ప్లేయర్లు విధ్వంసం సృష్టించారు. స్టెఫెన్ ఎస్కినాజీ (28 బంతుల్లో 58; 5 ఫోర్లు, 3 సిక్సర్లు), జానీ బెయిర్స్టో (39 బంతుల్లో 44; ఫోర్, 3 సిక్సర్లు), జో క్లార్క్ (22 బంతుల్లో 42 నాటౌట్; 5 ఫోర్లు, 2 సిక్సర్లు) ఆకాశమే హద్దుగా చెలరేగి, తమ జట్టును 90 బంతుల్లోనే (2 వికెట్లు కోల్పోయి) విజయతీరాలకు చేర్చారు. ఫలితంగా వెల్ష్ ఫైర్ 8 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. బ్రూక్ విధ్వంసకర శతకం బూడిదలో పోసిన పన్నీరైంది. -
జింబాబ్వే తరపున ఫాస్టెస్ట్ సెంచరీ.. రెండు రోజుల్లోనే చెరిపేసి
జింబాబ్వే ఆల్రౌండర్ సికందర్ రజా చరిత్ర సృష్టించాడు. వన్డే క్రికెట్లో జింబాబ్వే తరపున అత్యంత వేగంగా సెంచరీ చేసిన క్రికెటర్గా రికార్డులకెక్కాడు. ఐసీసీ క్రికెట్ వరల్డ్కప్ క్వాలిఫయింగ్ టోర్నీలో భాగంగా మంగళవారం నెదర్లాండ్స్తో జరిగిన లీగ్ మ్యాచ్లో సికందర్ రజా 54 బంతుల్లో ఆరు ఫోర్లు, 8 సిక్సర్లతో 102 పరుగులు నాటౌట్ సుడిగాలి శతకంతో మెరిశాడు. కేవలం 54 బంతుల్లోనే భారీ శతకం బాదిన సికందర్ రాజా జింబాబ్వే తరపున వన్డే క్రికెట్లో అత్యంత వేగవంతమైన సెంచరీ రికార్డును కూడా సొంతం చేసుకున్నాడు. ఇంతకు ముందు ఈ రికార్డు సీన్ విలియమ్స్ పేరిట ఉండేది. జూన్ 18న నేపాల్పై విలియమ్స్ కేవలం 70 బంతుల్లోనే సెంచరీ సాధించాడు. ఇప్పుడు ఈ రికార్డును సికందర్ రాజా కేవలం రెండు రోజుల్లోనే చెరిపేసి కొత్త చరిత్ర సృష్టించాడు. కాగా 37 ఏళ్ల వయసులో శతకం బాదిన సికందర్ రజా.. వన్డేల్లో ఫాస్టెస్ట్ సెంచరీ బాదిన పెద్ద వయస్కుడిగా క్రెయిగ్ ఎర్విన్తో కలిసి సంయుక్తంగా నిలిచాడు. ఇక వన్డే క్రికెట్ చరిత్రలో అత్యంత వేగవంతమైన శతకం దక్షిణాఫ్రికా దిగ్గజం ఏబీ డివిలియర్స్ పేరిట ఉంది. డివిలియర్స్ కేవలం 31 బంతుల్లోనే శతకం మార్క్ అందుకోగా.. ఆ తర్వాతి స్థానంలో న్యూజిలాండ్ బ్యాటర్ కోరె అండర్సన్ (36 బంతుల్లోనే శతకం), షాహిద్ అఫ్రిది 37 బంతుల్లో, జాస్ బట్లర్ 46 బంతుల్లో, సనత్ జయసూర్య 48 బంతుల్లో అందుకున్నారు. ఇక టీమిండియా తరపున విరాట్ కోహ్లి 52 బంతుల్లో సెంచరీ సాధించాడు. చదవండి: చావుదెబ్బ కొట్టిన ఆసీస్.. రికార్డులు బద్దలైన వేళ సికందర్ రజా ఆల్రౌండ్ ప్రదర్శన.. ఎదురులేని జింబాబ్వే -
సికందర్ రజా ఆల్రౌండ్ ప్రదర్శన.. ఎదురులేని జింబాబ్వే
వన్డే ప్రపంచకప్ క్వాలిఫయింగ్ క్రికెట్ టోర్నీలో(ICC CWC 2023)ఆతిథ్య జట్టు జింబాబ్వే ఎదురులేకుండా దూసుకెళుతుంది. టోర్నీలో జింబాబ్వే వరుసగా రెండో విజయాన్ని నమోదు చేసింది. నెదర్లాండ్స్తో మంగళవారం జరిగిన గ్రూప్-ఎ లీగ్ మ్యాచ్లో జింబాబ్వే ఆరు వికెట్ల తేడాతో విజయాన్ని అందుకుంది. సికందర్ రజా (54 బంతుల్లోనే 102 పరుగులు) వీరోచిత సెంచరీ చేయడంతో పాటు బౌలింగ్లోనూ నాలుగు వికెట్లు తీసి ఆల్రౌండ్ ప్రదర్శనతో జట్టు విజయంలో కీలకపాత్ర పోషించాడు. ఈ క్రమంలో వన్డేల్లో జింబాబ్వే తరపున వన్డేల్లో వేగవంతమైన సెంచరీ సాధించిన ప్లేయర్గా సికందర్ రజా గుర్తింపు పొందాడు. కాగా మ్యాచ్లో తొలుత బ్యాటింగ్ చేసిన నెదర్లాండ్స్ నిర్ణీత 50 ఓవర్లలో ఆరు వికెట్ల నష్టానికి 315 పరుగులు చేసింది. విక్రమ్జిత్ సింగ్(88 పరుగులు), మాక్స్ ఒడౌడ్(59 పరుగులు), స్కాట్ ఎడ్వర్డ్స్(83 పరుగులు) రాణించగా.. సికందర్ రజా 55 పరుగులిచ్చి నాలుగు వికెట్లు తీశాడు. అనంతరం 316 టార్గెట్తో బరిలోకి దిగిన జింబాబ్వే కేవలం 40.5 ఓవర్లలోనే 4 వికెట్లు కోల్పోయి చేధించింది. క్రెయిగ్ ఇర్విన్(50 పరుగులు), సీన్ విలియమ్స్(91 పరుగులు) రాణించగా.. సికందర్ రజా(54 బంతుల్లో 102 నాటౌట్, ఆరు ఫోర్లు, 8 సిక్సర్లు) అజేయ సెంచరీతో జట్టును గెలిపించాడు. Hosts Zimbabwe make it two wins out of two after Sikandar Raza's heroics ✌️ 📝: #ZIMvNED: https://t.co/6sP9VYrxb0 | #CWC23 pic.twitter.com/u52nPJgmF6 — ICC Cricket World Cup (@cricketworldcup) June 20, 2023 చదవండి: బజ్బాల్ అంటూ విర్రవీగారు.. అణిచివేసిన ఆసీస్ -
వన్డేల్లో ఫాస్టెస్ట్ సెంచరీ సాధించిన సీన్ విలియమ్స్
వరల్డ్కప్ క్వాలిఫయర్స్ 2023లో భాగంగా నేపాల్తో ఇవాళ (జూన్ 18) జరిగిన మ్యాచ్లో జింబాబ్వే ఆటగాడు సీన్ విలియమ్స్ మెరుపు శతకం బాదాడు. కేవలం 70 బంతుల్లో 13 ఫోర్లు, సిక్సర్ సాయంతో 102 పరుగులు చేసి అజేయంగా నిలిచిన విలియమ్స్.. జింబాబ్వే తరఫున వన్డేల్లో ఫాస్టెస్ట్ సెంచరీ (70 బంతుల్లో) నమోదు చేశాడు. గతంలో ఈ రికార్డు రెగిస్ చకబ్వా పేరిట ఉండేది. చకబ్వా.. 2022లో బంగ్లాదేశ్తో జరిగిన మ్యాచ్లో 73 బంతుల్లో సెంచరీ చేశాడు. జింబాబ్వే తరఫున వన్డేల్లో అత్యంత వేగంగా సెంచరీలు చేసిన ఆటగాళ్ల జాబితాలో విలియమ్స్, చకబ్వా తర్వాత బ్రెండన్ టేలర్ (2015లో ఐర్లాండ్పై 79 బంతుల్లో), సికందర్ రజా (2022లో బంగ్లాదేశ్పై 81 బంతుల్లో) ఉన్నారు. కాగా, నేపాల్తో ఇవాళ జరిగిన వరల్డ్కప్ క్వాలిఫయర్ మ్యాచ్లో విలియమ్స్తో పాటు క్రెయిగ్ ఎర్విన్ (128 బంతుల్లో 121 నాటౌట్; 15 ఫోర్లు, సిక్స్) అజేయ సెంచరీతో చెలరేగడంతో జింబాబ్వే 8 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. ఈ మ్యాచ్లో తొలుత బ్యాటింగ్ చేసిన నేపాల్.. కుశాల్ భూర్టెల్ (99), ఆసిఫ్ షేక్ (66), కుశాల్ మల్లా (41), కెప్టెన్ రోహిత్ పౌడెల్ (31) రాణించడంతో నిర్ణీత ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 290 పరుగులు చేయగా.. అనంతరం బరిలోకి దిగిన జింబాబ్వే మరో 35 బంతులు మిగిలుండగానే కేవలం 2 వికెట్లు మాత్రమే కోల్పోయి విజయతీరాలకు చేరింది. ఇవాలే జరిగిన మరో మ్యాచ్లో యూఎస్ఏపై వెస్టిండీస్ 39 పరుగుల తేడాతో గెలుపొందింది. ఈ మ్యాచ్లో తొలుత బ్యాటింగ్ చేసిన విండీస్.. జాన్సన్ ఛార్లెస్ (66), షాయ్ హోప్ (54), రోప్టన్ ఛేజ్ (55), జేసన్ హోల్డర్ (56), నికోలస్ పూరన్ (43) రాణించగా 49.3 ఓవర్లలో 297 పరుగులకు ఆలౌటైంది. అనంతరం బరిలోకి దిగిన యూఎస్ఏను గజానంద్ సింగ్ (101 నాటౌట్) వీరోచిత శతకం సాయంతో గెలిపించేందుకు విఫలయత్నం చేశాడు. గజానంద్తో పాటు ఆరోన్ జోన్స్ (23), షయాన్ జహంగీర్ (39), నోస్తుష్ కెంజిగే (34) పోరాడటంతో విండీస్కు విజయం అంత సులువుగా దక్కలేదు. యూఎస్ఏ నిర్ణీత ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 258 పరుగులు చేసి ఓటమిపాలైంది. -
బౌలర్ బ్యాటర్గా మారిన వేళ.. ఊచకోత.. టీ20ల్లో ఫాస్టెస్ట్ సెంచరీ
ఇంగ్లండ్ వేదికగా జరుగుతున్న టీ20 బ్లాస్ట్లో అత్యద్భుతం చోటు చేసుకుంది. 76 మ్యాచ్ల్లో కనీసం హాఫ్ సెంచరీ కూడా చేయని ఓ బౌలర్ ఏకంగా ఇంగ్లండ్ టీ20 చరిత్రలో ఫాస్టెస్ట్ హండ్రెడ్ను, ఓవరాల్గా టీ20 చరిత్రలో నాలుగో వేగవంతమైన శతకాన్ని బాదాడు. కెంట్తో నిన్న (మే 26) జరిగిన మ్యాచ్లో సర్రే బౌలింగ్ ఆల్రౌండర్, ఆస్ట్రేలియా బౌలర్ సీన్ అబాట్ కేవలం 34 బంతుల్లోనే సెంచరీ సాధించాడు. తద్వారా 19 ఏళ్ల క్రితం తన దేశానికే చెందిన ఆండ్రూ సైమండ్స్ పేరిట ఉన్న ఫాస్టెస్ట్ సెంచరీ రికార్డును సమం చేశాడు. #ICYMI: Sean Abbott smashed the joint-fastest century in T20 Blast history.pic.twitter.com/HItU4rVxA4— CricTracker (@Cricketracker) May 27, 2023 ఈ మ్యాచ్లో మొత్తం 41 బంతులు ఎదుర్కొన్న అబాట్.. 11 సిక్సర్లు, 4 బౌండరీల సాయంతో 110 పరుగులతో అజేయంగా నిలిచాడు. అతనికి జట్టులో మరెవరి నుంచి సహకారం లభించకపోయినా ఒక్కడే రాణించి, జట్టు స్కోర్ను 200 పరుగులు దాటించాడు. తొలుత బ్యాటింగ్ చేసిన సర్రే.. అబాట్ విధ్వంసకర శతకంతో విరుచుకుపడటంతో నిర్ణీత ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 223 చేయగా.. ఛేదనలో తడబడిన కెంట్ నిర్ణీత ఓవర్లలో 7 వికెట్లు కోల్పోయి 182 పరుగులు మాత్రమే చేయగలిగింది. ఫలితంగా 41 పరుగుల తేడాతో ఓటమిపాలైంది. కెంట్ ఓపెనర్లు తవాండ ముయేయే (37 బంతుల్లో 59), డేనియల్ బెల్ డ్రమ్మండ్ (27 బంతుల్లో 52) జోడీ తొలి వికెట్కు 108 పరుగులు జోడించి శుభారంభం అందించినప్పటికీ, ఆతర్వాత వచ్చిన మిగతా ఆటగాళ్లంతా విఫలం కావడంతో కెంట్ లక్ష్యానికి సుదూరంలో నిలిచిపోయింది. సర్రే బౌలర్లలో సునీల్ నరైన్, విల్ జాక్స్, టామ్ లేవ్స్ తలో 2 వికెట్లు.. సామ్ కర్రన్ ఓ వికెట్ పడగొట్టారు. చదవండి: శుబ్మన్ సూపర్ సెంచరీ.. ఫైనల్లో గుజరాత్ టైటాన్స్ -
36 బంతుల్లో 99 పరుగులు; ఒక్క పరుగు చేసుంటే చరిత్రలో
వుమెన్స్ ప్రీమియర్ లీగ్లో భాగంగా ఆర్సీబీ వుమెన్ తొలిసారి తమ బ్యాటింగ్ పవర్ ఏంటో చూపించారు. అయితే ఆర్సీబీ వరుసగా ఐదు మ్యాచ్ల్లో ఓడడంతో పాయింట్ల పట్టికలో ఆఖరి స్థానంలో ఉండడంతో పాటు రన్రేట్ కూడా చాలా దారుణంగా ఉంది. రన్రేట్ మెరుగుపరుచుకోవాలన్నా.. ప్లేఆఫ్ ఆశలు సజీవంగా ఉండాలన్న కచ్చితంగా గెలవాల్సిన పరిస్థితి ఆర్సీబీది. అందుకే కీలకమ్యాచ్లో తొలిసారి జూలు విదిల్చింది. ముఖ్యంగా సోఫీ డివైన్ ఆడిన ఇన్నింగ్స్ చరిత్రలో నిలిచిపోవడం ఖాయం. ఆమె విధ్వంసానికి ముంబైలోని బ్రబౌర్న్ స్టేడియం పరుగుల వర్షంతో తడిసిపోయింది. బంతి పడిందే మొదలు బాదుడే లక్ష్యంగా పెట్టుకున్న డివైన్ 36 బంతుల్లోనే 9ఫోర్లు, 8 సిక్సర్లతో 99 పరుగులు చేసింది. అయితే సెంచరీకి కేవలం ఒక్క పరుగు దూరంలో ఔటైన డివైన్ ఆ ఒక్క పరుగు పూర్తి చేసి ఉంటే చరిత్రకెక్కేది. ఎందుకంటే మహిళల క్రికెట్లో అత్యంత ఫాస్టెస్ట్ సెంచరీ డీజెఎస్ డొట్టిన పేరిట ఉంది. ఆమె 38 బంతుల్లోనే శతకం మార్క్ను అందుకుంది. ఆ తర్వాత అలీసా హేలీ 46 బంతుల్లో సెంచరీ సాధించి రెండో స్థానంలో ఉంది. మూడో స్థానంలో బ్యూమౌంట్ 47 బంతుల్లో, నాలుగో స్థానంలో హర్మన్ప్రీత్ కౌర్ 49 బంతుల్లో సెంచరీ మార్క్ను అందుకుంది. కానీ సెంచరీకి ఒక్క పరుగు దూరంలో ఆగిపోయిన సోఫీ డివైన్ అరుదైన ఫీట్ను మిస్ చేసుకుంది. ఇక మ్యాచ్ విషయానికి వస్తే గుజరాత్ జెయింట్స్ నిర్దేశించిన 189 పరుగుల లక్ష్యాన్ని బెంగళూరు 15.3 ఓవర్లలో 2 వికెట్లు కోల్పోయి ఛేదించింది. మహిళల ఫ్రాంచైజీ క్రికెట్లో ఇదే అత్యధిక ఛేదన కావడం విశేషం.సోఫీ డివైన్ (36 బంతుల్లో 99; 9 ఫోర్లు, 8 సిక్స్లు) మెరుపు ఇన్నింగ్స్ ఆడింది. కేవలం పరుగు తేడాతో సెంచరీని కోల్పోయింది. స్మృతి (31 బంతుల్లో 37; 5 ఫోర్లు, 1 సిక్స్), సోఫీ తొలి వికెట్కు 9.2 ఓవర్లలో 125 పరుగులు జోడించడం విశేషం. సోఫీ అవుటయ్యాక ఎలీస్ పెరీ (12 బంతుల్లో 19 నాటౌట్; 3 ఫోర్లు), హీథెర్ నైట్ (15 బంతుల్లో 22 నాటౌట్; 4 ఫోర్లు) దూకుడు కొనసాగిస్తూ బెంగళూరు జట్టును విజయతీరానికి చేర్చారు. అంతకుముందు గుజరాత్ జెయింట్స్ 20 ఓవర్లలో 4 వికెట్లకు 188 పరుగులు చేసింది. లౌరా వోల్వార్ట్ (42 బంతుల్లో 68; 9 ఫోర్లు, 2 సిక్స్లు), యాష్లే గార్డ్నర్ (26 బంతుల్లో 41; 6 ఫోర్లు, 1 సిక్స్) రాణించారు. Devine power at play ⚡ #GGvRCB #CheerTheW | @RCBTweets pic.twitter.com/YOi84P4tLB — JioCinema (@JioCinema) March 18, 2023 .@RCBTweets register their second win in a row 😍#CheerTheW #TATAWPL #GGvRCB pic.twitter.com/SHz3eh9sRA — JioCinema (@JioCinema) March 18, 2023 చదవండి: ఉత్కంఠ.. ఆఖరి బంతికి రనౌట్; టైటిల్ నిలబెట్టుకున్న లాహోర్ సూపర్ సోఫీ... ఆర్సీబీ వరుసగా రెండో విజయం -
చరిత్ర సృష్టించిన యూఏఈ క్రికెటర్.. వన్డేల్లో ఫాస్టెస్ట్ సెంచరీ రికార్డు
ICC WC League Two UAE VS NEP: యూఏఈ క్రికెటర్ ఆసిఫ్ అలీ ఖాన్ చరిత్ర సృష్టించాడు. వన్డే క్రికెట్లో ఫాస్టెస్ట్ సెంచరీ చేసిన అసోసియేట్ దేశ ఆటగాడిగా రికార్డు నెలకొల్పాడు. ఐసీసీ క్రికెట్ వరల్డ్ కప్ లీగ్ టు 2019-23లో భాగంగా ఇవాళ (మార్చి 16) నేపాల్తో జరుగుతున్న మ్యాచ్లో 41 బంతుల్లోనే శతక్కొట్టిన ఆసిఫ్.. ఆసోసియేట్ దేశాల క్రికెట్ చరిత్రలో సరికొత్త అధ్యాయాన్ని లిఖించాడు. 7వ నంబర్ ఆటగాడిగా బరిలోకి దిగి 11 సిక్సర్లు, 4 ఫోర్ల సాయంతో సెంచరీ పూర్తి చేసిన ఆసిఫ్ మొత్తంగా 42 బంతులు ఎదుర్కొని 101 పరుగులతో (240.48 స్ట్రయిక్రేట్) అజేయంగా నిలిచాడు. అంతర్జాతీయ వన్డే క్రికెట్లో ఓవరాల్గా చూసినా ఫాస్టెస్ట్ సెంచరీ చేసిన క్రికెటర్ల జాబితాలో ఆసిఫ్ ఖాన్ నాలుగో స్థానంలో నిలిచాడు. వన్డేల్లో వేగవంతమైన సెంచరీ రికార్డు సౌతాఫ్రికా విధ్వంసకర వీరుడు ఏబీ డివిలియర్స్ పేరిట ఉంది. ఏబీడీ 31 బంతుల్లోనే సెంచరీ పూర్తి చేశాడు. ఇతని తర్వాత వేగవంతమైన సెంచరీ రికార్డు న్యూజిలాండ్ ఆటగాడు కోరె ఆండర్సన్ పేరిట ఉంది. ఆండర్సన్ 36 బంతుల్లో శతకం బాదాడు. ఆతర్వాత పాక్ మాజీ ఆల్రౌండర్ షాహిద్ అఫ్రిది (37 బంతుల్లో ), ఆసిఫ్ ఖాన్, మార్క్ బౌచర్ (44 బంతుల్లో), బ్రియాన్ లారా (45), జోస్ బట్లర్ (46), విరాట్ కోహ్లి (52) 3 నుంచి 8 స్థానాల్లో ఉన్నారు. పాక్లో పుట్టి యూఏఈ తరఫున అంతర్జాతీయ క్రికెట్ ఆడుతున్న 33 ఏళ్ల ఆసిఫ్.. తన కెరీర్లో 16 వన్డేలు ఆడి సెంచరీ, 3 అర్ధసెంచరీల సాయంతో 439 పరుగులు చేశాడు. మ్యాచ్ విషయానికొస్తే.. నేపాల్తో జరుగుతున్న మ్యాచ్లో తొలుత బ్యాటింగ్ చేసిన యూఏఈ.. ఆసిఫ్ ఖాన్ (101 నాటౌట్) శతక్కొట్టుడు, అర్వింద్ (94), ముహమ్మద్ వసీం (63) బాధ్యతాయుత హాఫ్ సెంచరీల సాయంతో నిర్ణీత ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 310 పరుగులు చేసింది. నేపాల్ బౌలర్లు దీపేంద్ర సింగ్ (8-2-19-2) ఒక్కడే పొదుపుగా బౌలింగ్ చేయడంతో పాటు వికెట్లు పడగొట్టాడు. రాజ్బన్సీ (10-0-27-1), సోమ్పాల్ కమీ (9-1-74-1), సందీప్ లామిచ్చెన్ (10-0-80-1) వికెట్లు దక్కించుకున్నారు. అనంతరం 312 పరుగుల భారీ లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన నేపాల్ 29 ఓవర్లు ముగిసే సమయానికి 4 వికెట్లు కోల్పోయి 172 పరుగుల వద్ద ఇన్నింగ్స్ను కొనసాగిస్తుంది. కుశాల్ భుర్టెల్ (50) హాఫ్ సెంచరీతో రాణించగా.. భీమ్ షార్కీ (62 నాటౌట్), ఆరిఫ్ షేక్ (30 నాటౌట్) క్రీజ్లో ఉన్నారు. నేపాల్ ఈ మ్యాచ్ గెలవాలంటే 21 ఓవర్లలో 139 పరుగులు చేయాల్సి ఉంది. చేతిలో 6 వికెట్లు ఉన్నాయి. -
41 బంతుల్లోనే శతకం.. అతిపెద్ద టార్గెట్ను చేధించి ప్లేఆఫ్స్కు
పాకిస్తాన్ సూపర్ లీగ్లో సంచలనాలు నమోదవుతన్నాయి. మ్యాచ్ స్కోర్లు 250 దరిదాపుల్లో నమోదవుతున్నా చేజింగ్ జట్లు అవలీలగా టార్గెట్నే చేధిస్తున్నాయి. తాజాగా ముల్తాన్ సుల్తాన్స్, పెషావర్ జాల్మీల మధ్య జరిగిన మ్యాచ్ అందుకు ఉదాహరణ. తొలుత బ్యాటింగ్ చేసిన ముల్తాన్ సుల్తాన్స్ నిర్ణీత 20 ఓవర్లలో ఆరు వికెట్ల నష్టానికి 242 పరుగుల భారీ స్కోరు చేసింది. కెప్టెన్ బాబర్ ఆజం 39 బంతుల్లోనే 9 ఫోర్లు, 2 సిక్సర్ల సాయంతో 73 పరుగులు చేయగా.. సయామ్ అయుబ్ 33 బంతుల్లో 58 పరుగులు చేశాడు. ఇక మహ్మద్ హారిస్(11 బంతుల్లో ఒక ఫోర్, 4 సిక్సర్లతో 35 పరుగులు), కొహ్లెర్ కాడ్మెర్(18 బంతుల్లో 4 ఫోర్లు, 2 సిక్సర్లతో 38 పరుగులు) మెరుపులు మెరిపించడంతో భారీ స్కోరు నమోదైంది. అనంతరం కష్టసాధ్యమైన లక్ష్యంతో బరిలోకి దిగిన ముల్తాన్ సుల్తాన్స్కు ఆదిలోనే షాక్ తగిలింది. ఓపెనర్లు ఇద్దరు తక్కువ స్కోరుకే వెనుదిరిగారు. అయితే ఆ తర్వాత వచ్చిన రిలీ రొసౌ(51 బంతుల్లోనే 121 పరుగులు, 12 ఫోర్లు, 8 సిక్సర్లు) విధ్వంసం సృష్టించగా.. కీరన్ పొలార్డ్ (25 బంతుల్లో 52, 3ఫోర్లు, 5 సిక్సర్లు) సుడిగాలి ఇన్నింగ్స్ ఆడాడు. దీంతో ముల్తాన్ సుల్తాన్స్ లక్ష్యం దిశగా సాఫీగా సాగిపోయింది. అయితే చివర్లో ఇద్దరు స్వల్ప తేడాతో ఔటైనప్పటికి అన్వర్ అలీ(8 బంతుల్లో 24 నాటౌట్), ఉస్మా మీర్(3 బంతుల్లో 11 నాటౌట్) జట్టును విజయతీరాలకు చేర్చారు. కాగా పీఎస్ఎల్ చరిత్రలోనే అతిపెద్ద టార్గెట్ను చేధించిన ముల్తాన్ సుల్తాన్స్ విజయంతో ప్లేఆఫ్స్కు క్వాలిఫై అయింది. Name: Riley Rossouw Game: Hitting the fastest 100s in the HBL PSL RECORD-HOLDER ROSSOUW#SabSitarayHumaray l #HBLPSL8 l #PZvMS @Rileerr pic.twitter.com/JJtHoomWt3 — PakistanSuperLeague (@thePSLt20) March 10, 2023 చదవండి: 'వెళ్లి క్షమాపణ చెప్పు'.. కేఎస్ భరత్కు కోహ్లి ఆదేశం -
శివాలెత్తిన శుభ్మన్ గిల్.. 11 ఫోర్లు, 9 సిక్సర్లతో విధ్వంసకర శతకం
SMAT 2022 Quarter Final 1 PUN VS KAR: సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీ-2022లో భాగంగా ఇవాళ (నవంబర్ 1) జరిగిన తొలి క్వార్టర్ ఫైనల్లో పంజాబ్-కర్ణాటక జట్లు తలపడ్డాయి. ఈ మ్యాచ్లో పంజాబ్ 9 పరుగుల తేడాతో గెలుపొంది సెమీఫైనల్కు చేరుకుంది. టాస్ ఓడి ప్రత్యర్ధి ఆహ్వానం మేరకు తొలుత బ్యాటింగ్ చేసిన పంజాబ్.. శుభ్మన్ గిల్ (55 బంతుల్లో 126) విధ్వంసకర శతకంతో రెచ్చిపోవడంతో నిర్ణీత ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 225 పరుగులు భారీ స్కోర్ చేసింది. గిల్కు జతగా అన్మోల్ప్రీత్ సింగ్ (43 బంతుల్లో 59; 9 ఫోర్లు) బాధ్యతాయుతమైన హాఫ్ సెంచరీతో రాణించాడు. కేవలం 49 బంతుల్లోనే కెరీర్లో తొలి టీ20 శతకం బాదిన గిల్.. 11 ఫోర్లు, 9 సిక్సర్ల సాయంతో విధ్వంసం సృష్టించాడు. కర్ణాటక బౌలర్లలో విధ్వత్ కావేరప్ప 3 వికెట్లు పడగొట్టగా.. కృష్ణప్ప గౌతమ్ ఓ వికెట్ దక్కించుకున్నాడు. 💯 for @ShubmanGill! 👏 👏 What a cracking knock this has been from the right-hander in the #QF1 of the #SyedMushtaqAliT20! 👌 👌 #KARvPUN | @mastercardindia Follow the match ▶️ https://t.co/be91GGi9k5 pic.twitter.com/OaECrucM6g — BCCI Domestic (@BCCIdomestic) November 1, 2022 అనంతరం 226 పరుగుల భారీ లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన కర్ణాటక.. ఆరంభంలో వరుసగా వికెట్లు కోల్పోయినప్పటికీ, ఆతర్వాత గెలిచేందుకు విశ్వప్రయత్నాలు చేసింది. అభినవ్ మనోహర్ (29 బంతుల్లో 62 నాటౌట్; 5 ఫోర్లు, 5 సిక్సర్లు), మనీశ్ పాండే (29 బంతుల్లో 45; 5 ఫోర్లు, 2 సిక్సర్లు), మనోజ్ భాండగే (9 బంతుల్లో 25; ఫోర్, 3 సిక్సర్లు), కృష్ణప్ప గౌతమ్ (14 బంతుల్లో 30 నాటౌట్; 2 ఫోర్లు, 2 సిక్సర్లు), చేతన్ (25 బంతుల్లో 33; 4 ఫోర్లు, సిక్స్) జట్టును గెలిపించేందుకు విఫలయత్నం చేశారు. వీరి పోరాటంతో కర్ణాటక 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 216 పరుగులు చేయగలిగింది. పంజాబ్ బౌలర్లలో రమన్దీప్ సింగ్ 2 వికెట్లు పడగొట్టగా.. సిద్ధార్ధ్ కౌల్, బల్తేజ్ సింగ్, అశ్వనీ కుమార్ తలో వికెట్ దక్కించుకున్నారు. కాగా, ఇవాళే జరిగిన మరో రెండు క్వార్టర్ ఫైనల్స్లో ఢిల్లీపై విధర్భ.. బెంగాల్పై హిమాచల్ ప్రదేశ్ గెలుపొందాయి. హిమాచల్.. బెంగాల్పై 4 వికెట్ల తేడాతో గెలుపొందగా.. ఢిల్లీపై విధర్భ ఒక్క పరుగు తేడాతో విజయం సాధించింది. సాయంత్రం 4:30 గంటలకు ముంబై-సౌరాష్ట్ర జట్ల మధ్య నాలుగో క్వార్టర్ ఫైనల్ మ్యాచ్ జరుగనుంది. -
ఇంగ్లండ్ యువ బ్యాటర్ విధ్వంసం.. ఫాస్టెస్ సెంచరీ రికార్డు బద్దలు
ద హండ్రెడ్ లీగ్ 2022లో స్థానిక ఇంగ్లీష్ యువ బ్యాటర్లు ఆకాశమే హద్దుగా చెలరేగిపోతున్నారు. లీగ్ రెండో ఎడిషన్లో శతకాల మోత మోగిస్తూ బౌలర్లను బెంబేలెత్తిస్తున్నారు. ఆగస్ట్ 10న సథరన్ బ్రేవ్తో జరిగిన మ్యాచ్లో బర్మింగ్హామ్ ఫీనిక్స్కు చెందిన 20 ఏళ్ల ఓపెనింగ్ బ్యాటర్ విల్ స్మీడ్ 50 బంతుల్లో 8 ఫోర్లు, 6 సిక్సర్ల సాయంతో శతక్కొట్టి, లీగ్లో తొట్ట తొలి సెంచరీ సాధించిన ఆటగాడిగా రికార్డుల్లోక్కెగా.. తాజాగా అదే ప్రత్యర్ధిపై ఓవల్ ఇన్విన్సిబుల్స్కు చెందిన 23 ఏళ్ల యువ ఓపెనర్ విల్ జాక్స్ ఏకంగా 47 బంతుల్లోనే శతక్కొట్టి ఔరా అనిపించాడు. జాక్స్ మొత్తం 48 బంతుల్లో 10 ఫోర్లు, 8 భారీ సిక్సర్ల సాయంతో అజేయమైన 108 పరుగులు సాధించి తన జట్టును మరో 18 బంతులు మిగిలుండగానే విజయతీరాలకు చేర్చాడు. జాక్స్ ప్రత్యర్ధి బౌలర్లపై విరుచుకుపడిన వైనం ప్రస్తుతం నెట్టింట వైరలవుతోంది. తమ జట్టుకు మరో విధ్వంసకర బ్యాటర్ దొరికాడని ఇంగ్లీష్ అభిమానులు తెగ సంబురపడిపోతున్నారు. జాక్స్ 2019లో జరిగిన ఓ టీ10 లీగ్లో 25 బంతుల్లోనే సెంచరీ సాధించి రికార్డుల్లోకెక్కాడు. ఆదివారం (ఆగస్ట్ 14) సథరన్ బ్రేవ్తో జరిగిన మ్యాచ్లో టాస్ గెలిచి తొలుత బౌలింగ్ చేసిన ఓవల్ ఇన్విన్సిబుల్స్ ప్రత్యర్ధిని 137 పరుగులకే (100 బంతుల్లో 6 వికెట్ల నష్టానికి) కట్టడి చేసింది. మార్కస్ స్టోయినిస్ (27 బంతుల్లో 37; 2 ఫోర్లు, 2 సిక్సర్లు) ఇన్నింగ్స్ టాప్ స్కోరర్గా నిలువగా.. రీస్ టాప్లే 20 బంతుల్లో 3 వికెట్లు పడగొట్టి సథరన్ బ్రేవ్ పతనాన్ని శాసించాడు. అనంతరం నామమత్రపు లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన ఇన్విన్సిబుల్స్.. జాక్స్ విధ్వంసం ధాటికి 82 బంతుల్లోనే 3 వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని చేరుకుంది. జాక్స్ ఒక్కడే అన్నీ తానై తన జట్టును ఒంటిచేత్తో గెలిపించాడు. జాక్స్ 48 బంతుల్లో 108 పరుగులు సాధిస్తే.. బ్యాటింగ్ అవకాశం వచ్చిన మిగతా నలుగురు 35 బంతుల్లో 29 పరుగులు మాత్రమే చేసి తుస్సుమనిపించారు. ఓపెనర్ జేసన్ రాయ్ లీగ్లో మూడోసారి డకౌట్ కాగా, రిలీ రుస్సో (13 బంతుల్లో 10; సిక్స్), కెప్టెన్ సామ్ బిలింగ్స్ (8) దారుణంగా నిరాశపరిచారు. జాక్స్ వరుసగా రెండు భారీ సిక్సర్లు బాది తన జట్టుకు ప్రస్తుత ఎడిషన్లో మూడో విజయాన్ని (4 మ్యాచ్ల్లో) అందించాడు. తాజా ఓటమితో డిఫెండింగ్ ఛాంనియన్ సథరన్ బ్రేవ్ పరాజయాల సంఖ్య మూడుకు (4 మ్యాచ్ల్లో) చేరింది. 4 మ్యాచ్ల్లో 4 విజయాలతో లండన్ స్పిరిట్ పాయింట్ల పట్టికలో అగ్రస్థానంలో నిలిచింది. చదవండి: చరిత్ర సృష్టించిన ఇంగ్లండ్ బ్యాటర్.. హండ్రెడ్ లీగ్లో శతక్కొట్టిన తొలి ఆటగాడిగా రికార్డు -
ఒక్క ఓవర్ 34 పరుగులు.. 64 బంతుల్లో సెంచరీ; ఇంగ్లండ్ కొత్త కెప్టెన్ విధ్వంసం
ఇంగ్లండ్ టెస్టు జట్టు నూతన కెప్టెన్ బెన్ స్టోక్స్ కౌంటీ క్రికెట్లో దుమ్మురేపాడు. ఒక ఓవర్లో 34 పరుగులు పిండుకోవడంతో పాటు 64 బంతుల్లోనే సెంచరీ మార్క్ను అందుకున్నాడు. కౌంటీ చాంపియన్షిప్ డివిజన్-2లో డర్హమ్ తరపున ప్రాతినిధ్యం వహిస్తున్న స్టోక్స్ వోర్సెస్టర్షైర్పై ఈ ఫీట్ నమోదు చేశాడు. ఆరు బంతుల్లో ఆరు సిక్సర్లు కొట్లే అవకాశం తృటిలో కోల్పోయినప్పటికి ప్రత్యర్థి బౌలర్కు మాత్రం చుక్కలు చూపించాడు. ఇన్నింగ్స్ 117వ ఓవర్కు ముందు స్టోక్స్ 59 బంతుల్లో 70 పరుగులతో ఆడుతున్నాడు. జోష్ బేకర్ వేసిన ఆ ఓవర్లో తొలి ఐదు బంతులకు ఐదు సిక్సర్లు బాదిన స్టోక్స్.. చివరి బంతిని బౌండరీ తరలించి 34 పరుగులు రాబట్టడంతో పాటు 64 బంతుల్లో శతకం అందుకున్నాడు. ఈ విధ్వంసం ఇక్కడితో ముగిసిపోలేదు. డర్హమ్ ఇన్నింగ్స్ డిక్లేర్ చేసే సమయానికి స్టోక్స్ 88 బంతుల్లో 8 ఫోర్లు, 17 సిక్సర్లతో 161 పరుగులు చేసి ఔటయ్యాడు. 161 పరుగుల్లో 134 పరుగులు కేవలం సిక్సర్లు, ఫోర్ల ద్వారానే వచ్చాయంటే స్టోక్స్ విధ్వంసం ఏ రేంజ్లో సాగిందో అర్థమయి ఉండాలి. ఇక రెండోరోజు లంచ్ విరామం తర్వాత డర్హమ్ 6 వికెట్ల నష్టానికి 580 పరుగుల వద్ద ఇన్నింగ్స్ను డిక్లేర్ చేసింది. బెన్ స్టోక్స్(161 పరుగులు), బెండిగమ్(135 పరుగులు), సీన్ డిక్సన్(104 పరుగులు) ఆ తర్వాత బ్యాటింగ్ ఆరంభించిన వోర్సెస్టర్షైర్ టీ విరామ సమయానికి 4 వికెట్ల నష్టానికి 110 పరుగులు చేసింది.ఇక గతేడాది కాలంగా టెస్టుల్లో ఇంగ్లండ్ దారుణ ప్రదర్శన కనబరిచింది. వరుస సిరీస్ వైఫల్యాలకు బాధ్యత వహిస్తూ జో రూట్ కెప్టెన్సీ పదవికి రాజీనామా చేశాడు. దీంతో ఇంగ్లండ్ క్రికెట్ బోర్డు బెన్ స్టోక్స్ను కొత్త టెస్టు కెప్టెన్గా నియమించింది. చదవండి: Brendon Mccullum: ఇంగ్లండ్ వైట్బాల్ కోచ్గా న్యూజిలాండ్ మాజీ క్రికెటర్! 6️⃣ 6️⃣ 6️⃣ 6️⃣ 6️⃣ 4️⃣ What. An. Over. 34 from six balls for @benstokes38 as he reaches a 64 ball century 👏#LVCountyChamp pic.twitter.com/yqPod8Pchm — LV= Insurance County Championship (@CountyChamp) May 6, 2022 -
జేసన్ రాయ్ విధ్వంసం.. 36 బంతుల్లోనే శతకం
వెస్టిండీస్తో ఐదు మ్యాచ్ల టీ20 సిరీస్కు ముందు జరిగిన వార్మప్ మ్యాచ్లో ఇంగ్లండ్ బ్యాటర్ జేసన్ రాయ్ విధ్వంసం సృష్టించాడు. 36 బంతుల్లో 10 సిక్సర్లు, 9 ఫోర్లతో శతక్కొట్టాడు. బార్బడోస్ ప్రెసిడెంట్స్ ఎలెవన్తో జరిగిన మ్యాచ్లో జేసన్ ఈ ఫీట్ను సాధించాడు. కెన్సింగ్టన్ ఓవల్ వేదికగా జరిగిన ఈ మ్యాచ్లో మొత్తం 47 బంతులను ఎదుర్కొన్న జేసన్.. 115 పరుగులు చేశాడు. ఈ క్రమంలో అతను పొట్టి ఫార్మాట్లో పదో వేగవంతమైన శతకాన్ని సాధించాడు. ఫలితంగా ఇంగ్లండ్ నాలుగు వికెట్ల నష్టానికి 231 పరుగులు చేసింది. అనంతరం ఛేదనలో ప్రత్యర్ధి కేవలం 137 పరుగులకే చేతులెత్తేయడంతో పర్యాటక జట్టు విజయం సాధించింది. ఈ సునామీ ఇన్నింగ్స్తో జేసన్ రాయ్ ఐపీఎల్ జట్లకు ఛాలెంజ్ విసిరాడు. మరి కొద్ది రోజుల్లో ఐపీఎల్ మెగా వేలం ప్రారంభంకానున్న నేపథ్యంలో ఈ ఇన్నింగ్స్ అతనికి భారీ ధర సమకూర్చి పెట్టే అవకాశం ఉంది. కాగా, రాయ్.. గత ఐపీఎల్లో సన్రైజర్స్ హైదరాబాద్కు ప్రాతినిధ్యం వహించిన సంగతి తెలిసిందే. చదవండి: టీమిండియా క్రికెటర్లకు మరో అవమానం.. పాక్ ఆటగాళ్లకే అందలం -
ఇంగ్లండ్ బ్యాటర్ ఊచకోత.. 31 బంతుల్లోనే శతకం
England Batsman Dan Lincoln Stormy Century Of 31 Balls: డ్రీమ్ ఎలెవెన్ యూరోపియన్ ఛాంపియన్షిప్ క్రికెట్ టోర్నీలో భాగంగా ఇంగ్లండ్ ఎలెవెన్, ఇటలీ జట్ల మధ్య జరిగిన టీ10 మ్యాచ్లో విధ్వంసకర శతకం నమోదైంది. ఇంగ్లీష్ ఆటగాడు డ్యాన్ లింకన్ 31 బంతుల్లో 11 సిక్సర్లు, 8 ఫోర్ల సాయంతో మెరుపు శతకం(105 నాటౌట్) సాధించాడు. 26 ఏళ్ల లింకన్ 338.70 స్ట్రయిక్ రేట్తో ప్రత్యర్ధి బౌలర్లను ఊచకోత కోశాడు. అతని విధ్వంసం ధాటికి ప్రత్యర్ధి నిర్ధేశించిన 142 పరుగుల భారీ లక్ష్యం చిన్నబోయింది. వివరాల్లోకి వెళితే.. యూరోపియన్ ఛాంపియన్షిప్ గ్రూప్ సి ఫైనల్ మ్యాచ్లో తొలుత బ్యాటింగ్ చేసిన ఇటలీ జట్టు 10 ఓవర్లలో 6 వికెట్లకు 141 పరుగులు చేసింది. ఇటలీ కెప్టెన్ బల్జిత్ సింగ్ 62 పరుగులతో టాప్ స్కోరర్గా నిలిచాడు. అనంతరం 142 పరుగుల లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో ఇంగ్లండ్ కెప్టెన్ డ్యాన్ లింకన్ ప్రత్యర్ధి బౌలర్లపై సిక్సర్లు, బౌండరీలతో విరుచుకుపడ్డాడు. దీంతో ఇంగ్లీష్ జట్టు కేవలం 9.3 ఓవర్లలోనే లక్ష్యాన్ని ఛేదించి సూపర్ విక్టరీని నమోదు చేసింది. లింకన్ బుల్లెట్ ఇన్నింగ్స్లో 98 పరుగులు సిక్సర్లు, బౌండరీల రూపంలో రావడం విశేషం. చదవండి: వచ్చే ఏడాది ఆ కేకేఆర్ ఆటగాడు 12-14 కోట్ల ధర పలుకుతాడు..! -
చంద్రపాల్ సునామీ శతకం.. గయానా ఘన విజయం
సెయింట్ కిట్స్: కరీబియన్ ప్రిమియర్ లీగ్ 2021లో భాగంగా బార్బడోస్ రాయల్స్తో జరిగిన మ్యాచ్లో గయానా అమెజాన్ వారియర్స్ ఓపెనింగ్ బ్యాట్స్మెన్ చంద్రపాల్ హేమరాజ్(56 బంతుల్లో 105 నాటౌట్; 14 ఫోర్లు, 5 సిక్సర్లు) సెంచరీతో చెలరేగిపోయాడు. ప్రత్యర్ధి నిర్ధేశించిన లక్ష్యాన్ని ఒంటిచేత్తో ఛేదించాడు. టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ చేసిన బార్బడోస్ రాయల్స్.. నిర్ణీత ఓవర్లలో 130 పరుగులకు ఆలౌటైంది. గయానా వారియర్స్ బౌలర్లు ఇమ్రాన్ తాహిర్(3/34), రోమారియో షెపర్డ్(2/33), మోటీ(1/15), ఓడియన్ స్మిత్(1/22) దెబ్బకు బార్బడోస్ జట్టు పేకమేడలా కూలింది. An amazing performance by Chandrapaul Hemraj sees the Warriors star receive our @Dream11 MVP for match 16. #CPL21 #GAWvBR #Dream11 @CricketPlayedLouder pic.twitter.com/STQ2xb6N0r— CPL T20 (@CPL) September 4, 2021 ఈ ఇన్నింగ్స్లో బార్బడోస్ ఆటగాళ్లు ముగ్గురు రనౌట్ కాగా, వికెట్కీపర్ అజామ్ ఖాన్(28) టాప్ స్కోరర్గా నిలిచాడు. అనంతరం 131 పరుగుల ఛేదనలో హేమరాజ్ ఒక్కడే అజేయమైన 105 పరుగులు సాధించడంతో గయానా జట్టు 14.2 ఓవర్లలో ఒక్క వికెట్ మాత్రమే కోల్పోయి లక్ష్యాన్ని చేరుకుంది. ఫలితంగా ప్రత్యర్ధిపై 9 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. గయానా మరో ఓపెనర్ బ్రెండన్ కింగ్(17 బంతుల్లో 19; 2 ఫోర్లు) వికెట్ బార్బడోస్ బౌలర్ యంగ్కు దక్కింది. వన్డౌన్ బ్యాట్స్మెన్ షోయబ్ మాలిక్(13 బంతుల్లో 8 నాటౌట్; ఫోర్)తో కలసి హేమరాజ్ గయానాను విజయతీరాలకు తీర్చాడు. Take a bow Chandrapaul Hemraj what a performance 👏👏👏 #CPL21 #GAWvBR #CricketPlayedLouder pic.twitter.com/FA9xjmN7GU— CPL T20 (@CPL) September 4, 2021 చదవండి: వైరలవుతున్న రోహిత్ ఐదేళ్ల కిందటి ట్వీట్.. ‘చెప్పాడంటే చేస్తాడంతే’ -
డుప్లెసిస్ ఊచకోత.. 51 బంతుల్లోనే శతక్కొట్టుడు..
సెయింట్ కిట్స్: కరీబియన్ ప్రిమియర్ లీగ్ 2021లో భాగంగా సెయింట్ కిట్స్ అండ్ నెవిస్ పేట్రియాట్స్తో జరిగిన మ్యాచ్లో సెయింట్ లూసియా కింగ్స్ ఓపెనర్, దక్షిణాఫ్రికా మాజీ కెప్టెన్ ఫాప్ డుప్లెసిస్ ఉగ్రరూపం దాల్చాచాడు. 51 బంతుల్లోనే శతక్కొట్టి ప్రత్యర్ధి బౌలర్లను ఊచకోత కోశాడు. ఈ ఇన్నింగ్స్లో డుప్లెసిస్.. 60 బంతుల్లో 13 ఫోర్లు, 5 భారీ సిక్సర్ల సాయంతో 120 పరుగులతో అజేయంగా నిలిచాడు. మరో ఎండ్లో రోస్టన్ ఛేజ్(31 బంతుల్లో 64 నాటౌట్; 7 ఫోర్లు, 3 సిక్సర్లు) కూడా చెలరేగడంతో సెయింట్ లూసియా జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 2 వికెట్లు కోల్పోయి 224 పరుగుల భారీ స్కోర్ చేసింది. 100 for @faf1307 but the skippa still thinks there is work to be done‼️ #SLKvSKNP #CPL21 #CricketPlayedLouder #BiggestPartyInSport pic.twitter.com/cqPzGFnTAg — CPL T20 (@CPL) September 4, 2021 అనంతరం ఛేదనలో సెయింట్ కిట్స్ 16.5 ఓవర్లలో కేవలం 124 పరుగులు మాత్రమే చేసి చాప చాట్టేయడంతో ప్రత్యర్ధి 100 పరుగుల తేడాతో భారీ విజయాన్ని నమోదు చేసింది. ఇటీవలే రాజస్థాన్ రాయల్స్ ఎంచుకున్న విధ్వంసకర వీరుడు ఎవిన్ లూయిస్(42 బంతుల్లో 73; 5 ఫోర్లు, 6 సిక్సర్లు) ఒంటిరి పోరాటం చేశాడు.సెయింట్ లూసియా బౌలర్లు అల్జరీ జోసఫ్(3/27), కీమో పాల్(3/23) ప్రత్యర్ధి పతనాన్ని శాసించగా, వాహబ్ రియాజ్, రోస్టన్ ఛేజ్, కెస్రిక్ విలియమ్స్ తలో వికెట్ పడగొట్టారు. ఇదిలా ఉంటే, ఐపీఎల్లో చెన్నై సూపర్ కింగ్స్కు ప్రాతినిధ్యం వహించే డుప్లెసిస్.. శతక్కొట్టడంతో సీఎస్కే ఆభిమానులు తెగ సంబరపడిపోతున్నారు. సెప్టెంబర్ 19 నుంచి మొదలయ్యే ఐపీఎల్ సెకెండ్ లెగ్ మ్యాచ్ల్లో కూడా డుప్లెసిస్ ఇదే తరహాలో రాణించాలని ఆశిస్తున్నారు. దుబాయ్ వేదికగా సెప్టెంబర్ 19న జరిగే మ్యాచ్లో సీఎస్కే.. ముంబై ఇండియన్స్తో తలపడనుంది. చదవండి: గాయం వేధిస్తున్నా పెయిన్ కిల్లర్ తీసుకుని మరీ ఆడాడు.. -
పొట్టి క్రికెట్లో పెను విధ్వంసం.. 28 బంతుల్లోనే శతకం
యూరోపియన్ క్రికెట్ సిరీస్లో ఓ అనామక ఆటగాడు పెను విధ్వంసం సృష్టించాడు. 13 సిక్సర్లు, ఏడు ఫోర్ల సాయంతో 33 బంతుల్లో ఏకంగా 115 పరుగులు సాధించాడు. ఈ క్రమంలో అతను 28 బంతుల్లోనే సెంచరీ పూర్తి చేసి, యూరోపియన్ క్రికెట్ సిరీస్ చరిత్రలో భారత సంతతికి చెందిన గౌహర్ మనన్(29 బంతుల్లో) పేరిటఉన్న ఫాస్టెస్ట్ సెంచరీ రికార్డును బద్దలు కొట్టాడు. కమ్మర్ఫెల్డర్ స్పోర్ట్వెరిన్ జట్టు తరఫున ఓపెనర్గా బరిలోకి దిగిన 32 ఏళ్ల అహ్మద్ ముస్సాదిక్.. టిహెచ్సిసి హాంబర్గ్ జట్టుపై వీరవిహారం చేయడంతో ఆ జట్టు నిర్ణీత 10 ఓవర్లలో 2 వికెట్లు కోల్పోయి 198 పరుగులు చేసింది. ఈ మ్యాచ్లో ముస్సాదిక్ తొలి బంతి నంచే బౌలర్లపై ఎదురుదాడికి దిగాడు. స్పిన్నర్లు, పేసర్లు అన్న తేడా లేకుండా బంతి బాదడమే లక్ష్యంగా పెట్టుకుని, ఆకాశమే హద్దుగా చెలరేగిపోయాడు. ఈ క్రమంలో 13 బంతుల్లో అర్ధ శతకం, 28 బంతుల్లో శతకాన్ని పూర్తి చేసి ఇన్నింగ్స్ ఆఖరి బంతికి వెనుదిరిగాడు. అనంతరం 199 పరుగలు లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన ప్రత్యర్థి జట్టు.. 10 ఓవర్లలో ఏడు వికెట్లు కోల్పోయి కేవలం 53 పరుగులు మాత్రమే చేయగలిగింది. దీంతో ముస్సాదిక్ ప్రాతినిధ్యం వహిస్తున్న జట్టు 145 పరుగుల తేడాతో అద్భుత విజయాన్ని నమోదు చేసింది. చదవండి: టీమిండియా క్రికెటర్లు లేకుండానే ఐసీసీ అవార్డులు -
పాపం టీ20 తరహాలో ఆడాడు.. ట్విస్ట్ ఏంటంటే
కరాచీ: టెస్టు మ్యాచ్ అంటేనే జిడ్డు ఆటకు మారుపేరు.బ్యాట్స్మెన్లు గంటలకొద్ది క్రీజులో నిలబడి బౌలర్ల ఓపికను పరీక్షిస్తూ మ్యాచ్లను ఓటమి నుంచి గట్టెక్కించిన సందర్భాలు చాలానే ఉన్నాయి. కానీ టెస్టు క్రికెట్లో వన్డే తరహా ఇన్నింగ్స్లను చూడడం అరుదు.. అలాంటిది పాకిస్తాన్ బ్యాట్స్మన్ మాత్రం టీ20 తరహా ఇన్నింగ్స్తో అదుర్స్ అనిపించాడు. అయితే ఇక్కడ ట్విస్ట్ ఏంటంటే.. ఆ బ్యాట్స్మన్ అంత ధాటిగా ఆడినా జట్టును గెలిపించలేకపోయాడు. విజయానికి ఒక్క పరుగు అవసరమైన దశలో చివరి వికెట్ పడడంతో మ్యాచ్ డ్రాగా ముగిసింది. దీంతో ట్రోపిని ఇరుజట్లు పంచుకున్నాయి. అయితే ఇదంతా పాక్ దేశవాళి ఫస్ట్క్లాస్ క్రికెట్ చోటుచేసుకుంది.(చదవండి : బెట్టింగ్ కోసం ఏకంగా ఐపీఎల్ ఆటగాడికే ఫోన్?) క్వాయిడ్-ఎ-అజామ్ టోర్నీలో భాగంగా ఖైబర్ పఖ్తున్ఖ్వా, సెంట్రల్ పంజాబ్ల మధ్య ఫైనల్ మ్యాచ్ జరిగింది. ఈ మ్యాచ్లో ఖైబర్ పఖ్తున్ఖ్వా సెంట్రల్ పంజాబ్ ముందు 355 పరుగులు లక్ష్యాన్ని ఉంచింది. భారీ లక్ష్యంతో బరిలోకి సెంట్రల్ జట్టు 202 పరుగులకే ఆరు వికెట్లు కోల్పోయి పీకల్లోతు కష్టాల్లో పడి ఓటమి దిశగా పయనిస్తుంది. ఈ దశలో క్రీజులోకి వచ్చిన కెప్టెన్ హసన్ అలీ ఆరంభం నుంచి ధాటిగా ఆడాడు. టీ20 తరహాలో 61 బంతుల్లోనే 106 పరుగులు సాధించాడు. అతని ఇన్నింగ్స్లో 10 ఫోర్లు, 7 సిక్సర్లు ఉన్నాయి. ఒకవైపు సహచరులు ఒక్కొక్కరుగా వెనుదిరుగుతున్నా అలీ మాత్రం సిక్సర్ల వర్షంతో స్టేడియాన్ని హోరెత్తించాడు. అతని విధ్వంసం ధాటికి కొండంత లక్ష్యం చూస్తుండగానే కరిగిపోయింది. సెంట్రల్ పంజాబ్ 319 పరుగుల వద్ద 9వ వికెట్ కోల్పోయినా.. జట్టు చివరి బ్యాట్స్మన్ వకాస్ మసూద్ సహకారంతో అలీ తన బ్యాటింగ్ కొనసాగిస్తూ.. 355 పరుగుల దాకా తీసుకొచ్చి స్కోరును సమం చేశాడు. ఇంకా ఒక్క పరుగు చేస్తే సెంట్రల్ పంజాబ్ చారిత్రాత్మక విజయాన్ని నమోదు చేసి ఉండేది. కానీ ఇక్కడే పెద్ద ట్విస్టు చోటుచేసుకుంది. (చదవండి: టెస్టు సిరీస్: కేఎల్ రాహుల్ అవుట్) ఇన్నింగ్స్ 118వ ఓవర్ను సాజిద్ ఖాన్ వేశాడు. తొలి రెండు బంతులను సమర్థంగా ఎదుర్కొన్న వకాస్ మసూద్ను సాజిద్ తన మూడో బంతితో బోల్తా కొట్టించాడు. దీంతో సెంట్రల్ పంజాబ్ 355 పరుగుల వద్ద చివరి వికెట్ కోల్పోవడంతో వారి ఇన్నింగ్స్ ముగిసింది. దీంతో సెంచరీ చేసి కూడా జట్టును గెలిపించలేకపోయాననే భావనతో హసన్ అలీ నిరాశగా మైదానంలో కూలబడ్డాడు. కేవలం ఒక్క పరుగు చేసుంటే సెంట్రల్ పంజాబ్ విజయం దక్కడంతో పాటు కెప్టెన్ ఇన్నింగ్స్తో అలరించిన అలీ మ్యాచ్ ఆఫ్ ది స్టార్గా నిలిచేవాడు.కాగా ఈ వీడియోనూ ఐసీసీ ట్విటర్లో షేర్ చేయగా.. సోషల్ మీడియాలో వైరల్గా మారింది.'అలీ కెప్టెన్ ఇన్నింగ్స్ ఆడి సెంచరీ చేసినా జట్టును గెలిపించలేకపోయాడు.. పాపం తాను ఒకటి తలిస్తే.. దైవం ఒకటి తలవడం అంటే ఇదేనేమో.. ఏ గ్రేట్ షో బై హసన్ అలీ ' అంటూ కామెంట్లు పెడుతూ అలీని పొగడ్తలలో ముంచెత్తారు. 🇵🇰 INCREDIBLE SCENES 🤯 Central Punjab captain Hasan Ali smoked 106* from 61 on the last day of the Quaid-e-Azam Trophy final 🔥 With scores level, Khyber Pakhtunkhwa's Sajid Khan snared the final wicket to leave the match tied and the trophy shared! 🏆pic.twitter.com/x1GSZIa4ks — ICC (@ICC) January 5, 2021 -
సచిన్, రిచర్డ్స్లకు ఇది మరిచిపోలేని రోజు
క్రికెట్ ప్రపంచంలో ఈ ఇద్దరి పేర్లకు పెద్దగా పరిచయం అక్కర్లేదనిపిస్తుంది. ఎందుకంటే వారిద్దరు క్రికెట్ ప్రపంచంలో తమ ముద్రను ఎప్పుడో వేశారు. అందులో ఒకరు మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్ అయితే మరొకరు విండీస్ దిగ్గజం వివ్ రిచర్డ్స్. ఈ ఇద్దరు కలిసి మ్యాచ్లు తక్కువే ఆడినా ఎవరికి వారు సాటి అనే విషయం ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఇప్పటికే వీరిద్దరు తమ జీవితంలో ఎన్నో మైలురాళ్లను అందుకున్నారు. అయితే సచిన్, రిచర్డ్స్లకు ఏప్రిల్ 15 ప్రత్యేకమైన రోజుగా మిగిలిపోతుంది. ఒకరు ఐపీఎల్లో తన మెయిడెన్ సెంచరీ సాధిస్తే, మరొకరు 34 ఏళ్ల క్రితం టెస్టు మ్యాచ్లో 56 బంతుల్లోనే ఫాస్టెస్ట్ సెంచరీ మైలురాయిని అందుకున్నాడు.(‘ధోని.. అయామ్ ఈగర్లీ వెయిటింగ్’) వివరాల్లోకి వెళితే.. ఐపీఎల్లో ముంబై ఇండియన్స్ తరపున ప్రాతినిధ్యం వహించిన సచిన్ టెండూల్కర్ అంతర్జాతీయ మ్యాచ్ల్లో అత్యధిక సెంచరీలు చేసిన బ్యాట్స్మెన్గా నిలిచిన విషయం తెలిసిందే. అయితే అప్పటికే మూడేళ్ల నుంచి ఐపీఎల్లో ఆడుతన్నా సెంచరీ సాధించలేకపోయాననే లోటు మాత్రం సచిన్కు అలాగే ఉండేది. కానీ అది ఏప్రిల్ 15, 2011తో తీరిపోయిందనే చెప్పాలి. కొచ్చి టస్కర్స్ కేరళతో జరిగిన లీగ్ మ్యాచ్లో 66 బంతుల్లోనే 100 పరుగులు చేసి మునుపటి సచిన్ను గుర్తు చేశాడు. ఆ మ్యాచ్లో డేవిస్ జాకబ్స్, అంబటి రాయుడులు సచిన్కు మంచి సహకారం అందించారు. అయితే ఈ మ్యాచ్లో ముంబై ఓటమిపాలైంది. కాగా సచిన్ తన ఐపీఎల్ కెరీర్లో 78 మ్యాచ్లాడి 2334 పరుగులు చేశాడు. ఇందులో 13 అర్థ సెంచరీలు, ఒక సెంచరీ ఉన్నాయి. సచిన్ టెండూల్కర్ 2013లో ఐపీఎల్కు వీడ్కోలు పలికాడు. ఇక మరొక అద్బుతం 1986లో ఇంగ్లండ్తో జరిగిన టెస్టు సిరీస్లో చోటుచేసుకుంది. ఐదో టెస్టులో మొదటి ఇన్నింగ్స్లో కేవలం 26 పరుగులు చేసిన వివ్ రిచర్డ్స్ రెండో ఇన్నింగ్స్లో మాత్రం పూనకం వచ్చినట్లుగా ఆడాడు. వన్డే మ్యాచ్ను తలపిస్తూ సాగిన ఇన్నింగ్స్లో 58 బంతుల్లోనే 110 పరుగులతో నాటౌట్గా నిలిచాడు. అతని దాటికి ఇంగ్లండ్ ముంగిట 401 పరుగుల విజయలక్ష్యం వచ్చి చేరింది. అయితే విండీస్ భీకర బౌలింగ్ దాటికి 170 పరుగులకే ఆలౌట్ అయిన ఇంగ్లండ్ మ్యాచ్తో పాటు 5-0 తేడాతో సిరీస్ను విండీస్కు అప్పగించేసింది. ఈ మ్యాచ్ తన కెరీర్లో ఎప్పటికి గుర్తుండిపోతుందని రిచర్డ్స్ ఇప్పటికే చాలా ఇంటర్య్వూల్లో చెప్పుకొచ్చాడు. విండీస్ దిగ్గజం తన కెరీర్ మొత్తం ఆద్యంతం దూకుడుగానే ఆడడం విశేషంగా చెప్పుకోవచ్చు. 121 టెస్టుల్లో 8540 పరుగులు చేసిన విండీస్ దిగ్గజం వన్డేల్లో 6721 పరుగులు చేశాడు. కాగా, టెస్టుల్లో రిచర్డ్స్ వేగవంతమైన శతకం రికార్డును న్యూజిలాండ్ ఆటగాడు మెక్కలమ్ బద్దలుకొట్టాడు. 2016లో క్రైస్ట్చర్చ్ వేదికగా ఆస్ట్రేలియాపై జరిగిన టెస్టులో 54 బంతుల్లోనే మెక్కలమ్ శతకాన్ని పూర్తి చేసుకున్నాడు. -
వరల్డ్ కప్లో ఆ రికార్డు గుర్తుందా?
-
వరల్డ్ కప్లో ఆ రికార్డు గుర్తుందా?
సాక్షి, స్పోర్ట్స్ : వరల్డ్ కప్లో నమోదైన ఓ రికార్డుకు నేటితో సరిగ్గా 7 ఏళ్లు పూర్తయ్యింది. ఐర్లాండ్ ఆటగాడు కెవిన్ ఓబ్రెయిన్ వీర విహారంతో వరల్డ్ కప్లో వేగవంతంగా సెంచరీ చేసిన ఆటగాడిగా ఓబ్రెయిన్ తన పేరిట రికార్డు లిఖించుకున్నాడు. మార్చి 2, 2011 బెంగళూర్ చిన్నస్వామి స్టేడియంలో ఇంగ్లాండ్తో ఐర్లాండ్ మ్యాచ్ జరిగింది. ఐర్లాండ్ బౌలర్లను ఆటాడుకున్న ఇంగ్లాండ్ బ్యాట్స్మెన్ 328 లక్ష్యాన్ని ప్రత్యర్థికి నిర్దేశించారు. అనంతరం బ్యాటింగ్కు దిగిన ఐర్లాండ్ కెవిన్ ఓబ్రెయిన్ ఊచకోతతో చరిత్రాత్మక విజయాన్ని అందుకుంది. మొత్తం 63 బంతుల్లో 113 పరుగులు సాధించిన ఓబ్రెయిన్ 13 ఫోర్లు, 6 సిక్స్లు బాదాడు. ఈ క్రమంలో 50 బంతుల్లోనే అతను సెంచరీ పూర్తి చేసుకున్నాడు. ఇప్పటిదాకా ప్రపంచ కప్లో నమోదైన ఫాస్టెస్ట్ సెంచరీ ఇదే కావటం విశేషం. ఓబ్రెయిన్ రికార్డును గుర్తు చేస్తూ ఐసీసీ తన ట్విట్టర్ ఖాతాలో అతని ఇన్నింగ్స్ను పోస్టు చేసింది. 100 runs off just 50 balls! 🔥#OnThisDay in 2011, @KevinOBrien113 blasted the fastest ever @cricketworldcup century as Ireland recorded the biggest successful chase in the tournament's history in a famous win against England! pic.twitter.com/EyADIj3jdx — ICC (@ICC) 2 March 2018 -
క్రికెట్ లో ఫాస్టెస్ట్ సెంచరీ
బెంగళూరు:బెంగళూరు బ్యాట్స్మన్ ప్రోలు రవీంద్ర క్రికెట్ లో ఫాస్టెస్ట్ సెంచరీ రికార్డును నెలకొల్పాడు. కర్ణాటక రాష్ట్ర క్రికెట్ అసోసియేషన్ నిర్వహించిన మ్యాచ్ లో జింఖానా తరుపున బరిలోకి దిగిన రవీంద్ర 29 బంతుల్లో శతకం సాధించి సరికొత్త రికార్డును సాధించాడు. రెండు రోజుల క్రితం రాజేశ్వరినగర్ లో జైదుర్ క్లబ్ తో జరిగిన మ్యాచ్ లో రవీంద్ర ఈ ఘనతను సొంతం చేసుకున్నాడు. తద్వారా వెస్టిండీస్ విధ్వంసకర ఆటగాడు క్రిస్ గేల్ నెలకొల్పిన ఫాస్టెస్ సెంచరీ రికార్డును రవీంద్ర బ్రేక్ చేశాడు. ట్వంటీ 20 మ్యాచ్ లో గేల్ 30 బంతుల్లో సెంచరీ చేసిన సంగతి తెలిసిందే. ఓవరాల్ గా రవీంద్ర 58 బంతుల్లో 13 సిక్సర్లు, 4 ఫోర్లతో 144 పరుగులు నమోదు చేశాడు. దాంతో ఈ 50 ఓవర్ల మ్యాచ్ లో జింఖానా 403 పరుగులు భారీ స్కోరు సాధించింది. అనంతరం జైదుర్ క్లబ్ 229 పరుగులకే పరిమితమై భారీ ఓటమి పాలైంది.ఈ మ్యాచ్ అనంతరం రవీంద్ర మాట్లాడుతూ.. తన ఫాస్టెస్ సెంచరీని తన ఆదర్శ క్రికెటర్ వీరేంద్ర సెహ్వాగ్ కు అంకితమిస్తున్నట్లు పేర్కొన్నాడు. -
ఫాస్టెస్ట్ సెంచరీ రికార్డ్ బద్దలు
క్రైస్ట్ చర్చ్: టెస్ట్ క్రికెట్ చరిత్రలో ఫాస్టెస్ట్ సెంచరీ రికార్డు బద్దలైంది. తన చిట్టచివరి టెస్ట్ మ్చాచ్ ఆడుతోన్న కివీస్ విధ్వంసకారుడు మెకల్లమ్ 54 బంతుల్లో 100 పరుగులుచేసి 34 ఏళ్ల రికార్డులను తిరగరాశాడు. క్రైస్ట్ చర్చ్ వేదికగా ఆస్ట్రేలియాతో జరుగుతున్న రెండో టెస్ట్ లో బ్రెండన్ ఈ ఘనత సాధించాడు. మొదట ఆస్ట్రేలియా టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకుంది. లంచ్ విరామంకంటే ముందే న్యూజిలాండ్ స్కోరు 32/3. ఆ దశలో క్రీజ్ లోకి వచ్చిన మెకల్లమ్.. కంగారూలపై వీరప్రతాపం చూపాడు. ఎదుర్కొన్న తొలి ఓవర్లోనే 21 పరుగులు పిండుకుని షాన్ మార్ష్ కు చుక్కలుచూపాడు. మెకల్లం 37 పరుగుల వ్యక్తిగత స్కోరువద్ద అంపైర్ లంచ్ విరామం ప్రకటించాడు. ఆట మళ్లీ మొదలయిన తర్వాత చూడాలీ.. బ్రెండన్ బాదుడే బాదుడు! సరిగ్గా 54 పరుగుల వద్ద 100 పరుగులు పూర్తిచేసుకున్న మెకల్లం.. టెస్టుల్లో ఫాస్టెస్ట్ సెంచరీ కొట్టిన ధీరుడిగా కొత్త రికార్డు నెలకొల్పాడు. ఇంతకుముందు ఈ రికార్డు ఇద్దరిపేరిట ఉండేది. 1986లో విండీస్ దిగ్గజం వివ్ రిచర్డ్స్.. ఇంగ్లాండ్ పై వివ్.. 56 బంతుల్లో సెంచరీ కొట్టారు. ఆ తర్వాత 2014లో పాకిస్థానీ బ్యాట్స్ మన్ మిస్బాఉల్ హక్.. ఆస్ట్రేలియాపై 56 బంతుల్లోనే 100 పరుగులు చేశారు. మళ్లీ ఇన్నాళ్లకు మెకల్లమ్ ఆ రికార్డులను తిరగరాశాడు. 96 పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద బౌండరీ బాదిమరీ రికార్డు సెంచరీ చేసిన మెకల్లమ్ ఈ మ్చాచ్ లో రెండు సార్లు ఔటయ్యే ప్రమాదం నుంచి తప్పించుకున్నాడు. టెస్టుల్లో అతనికిది 12వ సెంచరీకాగా, బ్యాటింగ్ లో అత్యధిక సిక్సులు(100) కొట్టిన వికెట్ కీపర్ గా మెకల్లమ్.. ఆడమ్ గిల్ క్రిస్ట్ సరసన నిలిచాడు. 79 బంతుల్లో 21 ఫోర్లు, 6 సిక్సర్ల సహాయంతో 145 పరుగులు చేసిన మెకల్లమ్ ఆరోవికెట్ గా వెనుదిరిగాడు. జేమ్స్ అండర్సన్ 66 బంతుల్లో 72 పరుగులు) మెకల్లమ్ కు చక్కటి సహకారం అందించాడు. చివర్లో వాట్లింగ్(57 బంతుల్లో 58 పరుగులు) ధాటిగా ఆడటంతో కివీస్ తొలి ఇన్నింగ్స్ లో 370 పరుగులకు ఆలౌటైంది. ఆసీస్ బౌలర్లలో లియాన్ 3, హాజిల్ వుడ్, పాటిన్సన్, బర్డ్ లు తలో రెండు వికెట్లు పడగొట్టారు. మిచెల్ మార్ష్ కు ఒక వికెట్ దక్కింది. ఇన్నింగ్స్ ప్రారంభించిన ఆస్ట్రేలియా నిలకడగా ఆడుతోంది. -
‘డివి’లయతాండవం
-
‘డివి’లయతాండవం
4, 2, 1, 1, 4, 6, 4, 6, 6, 0, 2, 2, 0, 1, 6, 6 6, 4, 6, 1, 4, 1, 1, 0, 4, 4, 0, 6, 4, 6, 6 6, 0, 6, 1, 6, 6, 4, 6, 6, 2, 2, 0, తొలి 16 బంతుల్లో అర్ధ సెంచరీ (0-51) తర్వాతి 15 బంతులకు సెంచరీ పూర్తి (52-104) మిగిలిన 13 బంతుల్లో 45 పరుగులు (105-149) 31 బంతుల్లోనే సెంచరీతో ప్రపంచ రికార్డు క్రికెట్ మానవమాత్రుల క్రీడ. కానీ ఇంత అమానవీయంగా బౌలర్లపై విరుచుకు పడటం చూస్తే మానవ హక్కుల సంఘాలు కూడా కేసు పెట్టేందుకు సిద్ధమైపోతాయేమో! ఈ ఊచకోత గురించి గిల్క్రిస్ట్కు అప్పుడే తెలిసినట్లుంది. అందుకే నాలుగు రోజుల ముందే ప్రమాద హెచ్చరిక జారీ చేశాడు. అద్భుతం, అద్వితీయం, అసాధారణం, అనితరసాధ్యం లాంటి విశేషణాలు కూడా అబ్రహం బెంజమిన్ (ఏబీ) డివిలియర్స్ ఆటను చూస్తే చిన్నబుచ్చుకుంటాయి. వాటన్నింటికీ అతీతమైన ప్రదర్శన ఇది. తన బ్యాట్తో అతను విలయ తాండవం చేసిన తీరు క్రికెట్ ప్రేమికులకు పండగ చూపిస్తే, విండీస్కు చుక్కలు చూపించింది. వేగంగా ఆడితే రికార్డు, అతి వేగంగా ఆడితే రికార్డు బద్దలు, ఇవన్నీ పాత మాటలు... ఇప్పుడు డివిలియర్స్ ఎలా ఆడినా అదో కొత్త రికార్డుకు నాందిగా నిలుస్తోంది. మైదానంలో అతను వేసిన ప్రతీ అడుగు, తీసిన ప్రతీ పరుగు సంచలనంగా మారింది. కొత్త సంవత్సరంలో క్రికెట్ చరిత్రను తిరగరాసింది. జొహన్నెస్బర్గ్: ఏబీ డివిలియర్స్ (44 బంతుల్లో 149; 9 ఫోర్లు, 16 సిక్సర్లు) ప్రపంచ క్రికెట్లో సరికొత్త అధ్యాయాన్ని లిఖించాడు. వన్డే చరిత్రలోనే అత్యంత వేగవంతమైన సెంచరీతో కొత్త రికార్డు సృష్టించాడు. ఆదివారం జరిగిన రెండో వన్డేలో వెస్టిండీస్ బౌలర్లను భయభ్రాంతులకు గురి చేస్తూ 31 బంతుల్లోనే శతకం బాదాడు. ఈ సెంచరీలో 8 ఫోర్లు, 10 సిక్సర్లు ఉన్నాయి. దాదాపు ఏడాది క్రితం న్యూజిలాండ్ ఆటగాడు అండర్సన్ (36 బంతుల్లో, వెస్టిండీస్పై) నెలకొల్పిన రికార్డును డివిలియర్స్ బద్దలు కొట్టాడు. ఐదు బంతుల తేడాతో అతను పాత రికార్డును సవరించడం విశేషం. ఈ క్రమంలో ఏబీ అనేక మైలురాళ్లు దాటాడు. 16 బంతుల్లోనే అర్ధ సెంచరీ సాధించడంతో 1996 నాటి జయసూర్య (17 బంతుల్లో) రికార్డు కూడా డివిలియర్స్కు దాసోహమంది. అగ్నికి వాయువు తోడైనట్లు ఇదే మ్యాచ్లో దక్షిణాఫ్రికా తరఫున మరో ఇద్దరు ఆటగాళ్లు కూడా శతకాలు బాది రికార్డు స్కోరులో తామూ భాగం పంచుకున్నారు. హషీమ్ ఆమ్లా (142 బంతుల్లో 153 నాటౌట్; 14 ఫోర్లు), రిలీ రోసో (115 బంతుల్లో 128; 11 ఫోర్లు, 2 సిక్సర్లు) సెంచరీలు చేయడంతో దక్షిణాఫ్రికా 148 పరుగులతో వెస్టిండీస్ను చిత్తుగా ఓడించింది. దక్షిణాఫ్రికా నిర్ణీత 50 ఓవర్లలో 2 వికెట్ల నష్టానికి 439 పరుగులు చేయగా, అనంతరం విండీస్ 50 ఓవర్లలో 7 వికెట్లకు 291 పరుగులకే పరిమితమైంది. సరిగ్గా వారం క్రితం ఈ మైదానంలో టి20ల్లో అత్యధిక ఛేదనతో దక్షిణాఫ్రికాకు వెస్టిండీస్ షాక్ ఇవ్వగా... ఇప్పుడు సఫారీలు వన్డేలో దానికి బదులు తీర్చుకున్నారు. 2006లో ఆసీస్ (434/4), దక్షిణాఫ్రికా(438/9)ల మధ్య ఇదే వాండరర్స్లో రసవత్తర పోరు జరిగింది. విధ్వంసం సాగిందిలా: దక్షిణాఫ్రికా స్కోరు 38.3 ఓవర్లలో 247... అప్పుడు బరిలోకి దిగాడు డివిలియర్స్. 11.3 ఓవర్లు మిగిలిన ఈ దశలో కొత్త బ్యాట్స్మన్ సెంచరీ సాధించగలడని ఊహించడం కూడా అసాధ్యం. కానీ డివిలియర్స్ 40 నిమిషాల విధ్వంసానికి ఆ 69 బంతుల్లో 44 బంతులే సరిపోయాయి. తొలి బంతికి మిడాన్ మీదుగా ఫోర్తో ఆ పరుగుల ప్రవాహం మొదలైంది. తర్వాతి ఓవర్లో 5 బంతులు ఆడితే 21 పరుగులు... మరుసటి ఓవర్లో ఒక సిక్స్ కొట్టినా కాస్త ప్రశాంతత. అయితే ఆ వెంటనే మరో ఓవర్లో 5 బంతుల్లో 23 పరుగులు... కొద్ది సేపటికి 4 బంతులు ఆడితే మరో 22 పరుగులు... ఈ క్రమంలో అర్ధ సెంచరీ దాటినా, సెంచరీని పూర్తి చేసినా ఎక్కడా తగ్గని జోరు... ఫినిషింగ్ టచ్ అన్నట్టుగా డ్వేన్ స్మిత్ వేసిన ఓవర్లో 4 సిక్సర్లు, ఒక ఫోర్ సహా ఏకంగా 30 పరుగులు! ఆఫ్ స్టంప్ వైపుగా కాస్త జరిగి స్క్వేర్లెగ్ మీదుగా సిక్స్, మోకాలిపై కూర్చొని ఆఫ్ స్టంప్ నుంచి ఆడితే బ్యాక్వర్డ్ స్క్వేర్ వైపు సిక్సర్, లాంగాన్, లాంగాఫ్, డీప్ మిడ్ వికెట్ మీదుగా స్లాగ్ స్వీప్, డీప్ పాయింట్ వైపుగా మరో ఛక్కా... ఒకటా రెండా, ఎన్ని అద్భుతమైన షాట్లు, ఎన్ని కొత్త తరహా షాట్లు... అవన్నీ డివిలియర్స్కు మాత్రమే సాధ్యమనేలా అతని ఇన్నింగ్స్ సాగింది. చివరి 10 ఓవర్లలో దక్షిణాఫ్రికా 16.3 రన్రేట్తో 163 పరుగులు చేయగా, డివిలియర్స్, ఆమ్లా భాగస్వామ్యంలో 67 బంతుల్లోనే 192 పరుగులు వచ్చాయి. ఇందులో ఏబీ 149 పరుగులు చేస్తే, ఆమ్లా చేసినవి 39 పరుగులే. ఎట్టకేలకు 50వ ఓవర్లో నాలుగో బంతికి డివిలియర్స్ వెనుదిరగ్గా, తర్వాతి రెండు బంతులకు పరుగులు రాలేదు. రొమ్ము క్యాన్సర్పై ప్రచారం, నిధుల సేకరణలో భాగంగా ఈ వన్డేలో దక్షిణాఫ్రికా ఆటగాళ్లు గులాబీ దుస్తులతో బరిలోకి దిగి తమ సంఘీభావం తెలిపారు. ఇందులో ఆటగాడు కొట్టే ప్రతీ సిక్సర్కు రూ. 10 వేల ర్యాండ్ల (దక్షిణాఫ్రికా కరెన్సీ) చొప్పున సేవాసంస్థకు వెళుతుంది. 16 సిక్సర్లు బాదిన డివిలియర్స్ అలా ఒకే మ్యాచ్తో 1 లక్షా 60 వేల ర్యాండ్లు (దాదాపు రూ. 85 లక్షలు) తన తరఫున అందించడం విశేషం. 1 ఒకే ఇన్నింగ్స్లో ముగ్గురు బ్యాట్స్మెన్ సెంచరీలు చేయడం వన్డే చరిత్రలో ఇదే తొలిసారి. 1 ఈ ఇన్నింగ్స్లో డివిలియర్స్ 338.63 స్ట్రయిక్ రేట్తో పరుగులు చేశాడు. ఒక బ్యాట్స్మన్ ఇన్నింగ్స్లో కనీసం 50 పరుగులు చేసిన సందర్భాల్లో ఇదే ఎక్కువ స్ట్రయిక్ రేట్ కాగా, 300కు పైగా స్ట్రయిక్ రేట్తో సెంచరీ నమోదు కావడం ఇదే మొదటిసారి. 1 ఒకే ఇన్నింగ్స్లో 16 సిక్సర్లు కొట్టిన రోహిత్ శర్మ (ఆస్ట్రేలియాపై) రికార్డును డివిలియర్స్ సమం చేశాడు. 2 వన్డేల్లో ఒక జట్టు చేసిన అత్యధిక స్కోరు శ్రీలంక (443/9, నెదర్లాండ్స్పై) పేరిట ఉండగా, ఇప్పుడు దక్షిణాఫ్రికా రెండో స్థానంలో నిలిచింది. 12 వన్డేల్లో 400కు పైగా స్కోరు నమోదు కావడం ఇది 12వ సారి. భారత్ ఐదుసార్లు... దక్షిణాఫ్రికా మూడుసార్లు 400 పరుగులు దాటాయి. స్కోరు వివరాలు దక్షిణాఫ్రికా ఇన్నింగ్స్: ఆమ్లా (నాటౌట్) 153; రోసో (సి) బెన్ (బి) టేలర్ 128; డివిలియర్స్ (సి) కార్టర్ (బి) రసెల్ 128; మిల్లర్ (నాటౌట్) 0; ఎక్స్ట్రాలు 9; మొత్తం (50 ఓవర్లలో 2 వికెట్లకు) 439. వికెట్ల పతనం: 1-247; 2-439. బౌలింగ్: టేలర్ 10-0-95-1; హోల్డర్ 9-0-91-0; బెన్ 10-0-49-0; రసెల్ 10-0-78-1; డారెన్ స్యామీ 4-0-26-0; శామ్యూల్స్ 3-0-28-0; డ్వేన్ స్మిత్ 4-0-68-0. వెస్టిండీస్ ఇన్నింగ్స్: స్మిత్ (సి) డుమిని (బి) బెహర్దీన్ 64; గేల్ (సి) బెహర్దీన్ (బి) మోర్కెల్ 19; జాన్సన్ (ఎల్బీ) (బి) ఫిలాండర్ 1; శామ్యూల్స్ (సి) బెహర్దీన్ (బి) ఫిలాండర్ 40; రామ్దిన్ (సి) డు ప్లెసిస్ (బి) మోర్కెల్ 57; కార్టర్ (సి) (సబ్) పార్నెల్ (బి) స్టెయిన్ 40; రసెల్ (సి) డు ప్లెసిస్ (బి) తాహిర్ 0; స్యామీ (నాటౌట్) 25; హోల్డర్ (నాటౌట్) 21; ఎక్స్ట్రాలు 24; మొత్తం (50 ఓవర్లలో 7 వికెట్లకు) 291. వికెట్ల పతనం: 1-36; 2-63; 3-122; 4-148; 5-231; 6-232; 7-253. బౌలింగ్: మోర్నీ మోర్కెల్ 10-0-43-2; ఫిలాండర్ 10-0-69-2; స్టెయిన్ 10-0-29-1; డుమిని 4-0-39-0; ఇమ్రాన్ తాహిర్ 10-0-60-1; బెహర్దీన్ 6-0-39-1. ఓపెనర్లు మంచి ఆరంభం ఇవ్వడంతో నేను చెలరేగడానికి అవకాశం దక్కింది. మరోవైపు ఆమ్లా చక్కగా ఆడి నాపై ఒత్తిడి తగ్గించాడు. క్రీజ్లోకి రాకముందే నా ఆట గురించి ఆలోచిస్తూ డ్రెస్సింగ్ రూమ్లో చాలా సేపు వార్మప్ చేశాను. నిజానికి మూడో స్థానంలో మిల్లర్ను పంపాలని నేను భావిస్తే, కోచ్ మాత్రం నన్నే వెళ్లమన్నారు. అది అద్భుతంగా పని చేసింది. ఈ రోజు దూకుడుగా ఆడాలని ముందే అనుకున్నా. 92 వద్ద ఉన్నప్పుడు రికార్డు గురించి ఆలోచన ఉంది. కాబట్టి ఆ దశలో సింగిల్స్ తీయవద్దని నిర్ణయించేసుకున్నా. - ఏబీ డివిలియర్స్ ఐదు వన్డేల సిరీస్లో దక్షిణాఫ్రికా 2-0తో ఆధి క్యంలో ఉంది. మూడో వన్డే 21న జరుగుతుంది. వన్డేల్లో టాప్-5 ఫాస్టెస్ట్ సెంచరీలు ఆటగాడు జట్టు బంతులు ప్రత్యర్థి డి విలియర్స్ దక్షిణాఫ్రికా 31 విండీస్ కోరె అండర్సన్ న్యూజిలాండ్ 36 విండీస్ షాహిద్ ఆఫ్రిది పాకిస్తాన్ 37 శ్రీలంక బౌచర్ దక్షిణాఫ్రికా 44 జింబాబ్వే లారా వెస్టిండీస్ 45 బంగ్లాదేశ్ వన్డేల్లో టాప్-5 ఫాస్టెస్ట్ అర్ధ సెంచరీలు ఆటగాడు జట్టు బంతులు ప్రత్యర్థి డి విలియర్స్ దక్షిణాఫ్రికా 16 విండీస్ జయసూర్య శ్రీలంక 17 పాకిస్తాన్ ఒడెనల్ ఆసీస్ 18 శ్రీలంక షాహిద్ ఆఫ్రిది పాకిస్తాన్ 18 శ్రీలంక షాహిద్ ఆఫ్రిది పాకిస్తాన్ 18 నెదర్లాండ్స్ వన్డేల్లో టాప్-5 జట్టు స్కోర్లు జట్టు స్కోరు ఎవరిపై ఎప్పుడు శ్రీలంక 443/9 నెదర్లాండ్స్ 2006 దక్షిణాఫ్రికా 439/2 వెస్టిండీస్ 2015 దక్షిణాఫ్రికా 438/9 ఆస్ట్రేలియా 2006 ఆస్ట్రేలియా 434/4 దక్షిణాఫ్రికా 2006 దక్షిణాఫ్రికా 418/5 జింబాబ్వే 2006 -
మెకల్లమ్ మెరుపులు
షార్జా: కెప్టెన్ బ్రెండన్ మెకల్లమ్ మెరుపు సెంచరీ (145 బంతుల్లో 153 బ్యాటింగ్; 17 ఫోర్లు, 8 సిక్స్లు) సాధించడంతో పాకిస్తాన్తో జరుగుతున్న మూడో టెస్టు తొలి ఇన్నింగ్స్లో న్యూజిలాండ్ జట్టు భారీ స్కోరు దిశగా పయనిస్తోంది. రెండో రోజు ఆట ముగిసే సమయానికి న్యూజిలాండ్ 45 ఓవర్లలో వికెట్ నష్టానికి 249 పరుగులు చేసింది. లాథమ్ (13) అవుటయ్యాడు. మెకల్లమ్తో పాటు కేన్ విలియమ్సన్ (76 బ్యాటింగ్) క్రీజ్లో ఉన్నాడు. 78 బంతుల్లోనే సెంచరీ చేసిన మెకల్లమ్ న్యూజిలాండ్ తరఫున టెస్టుల్లో వేగంగా శతకం చేసిన ఆటగాడిగా నిలిచాడు. అంతకు ముందు ఓవర్నైట్ స్కోరు 281/3తో తొలి ఇన్నింగ్స్ను మొదలెట్టిన పాక్ 351 పరుగులకే ఆలౌటైంది. హఫీజ్ (197) తృటిలో డబుల్ సెంచరీని కోల్పోయాడు. కివీస్ యువ స్పిన్నర్ మార్క్ క్రెయిగ్ 7 వికెట్లు తీసి పాక్ పతనాన్ని శాసించాడు. ప్రస్తుతం న్యూజిలాండ్.. తొలి ఇన్నింగ్స్లో 102 పరుగులు వెనుకబడి ఉంది. -
అభిరథ్ మెరుపు శతకం
జింఖానా, న్యూస్లైన్: హెచ్పీఎస్ (రామంతాపూర్) బ్యాట్స్మన్ అభిరథ్ రెడ్డి (81 బంతుల్లో 128 బ్యాటింగ్; 18 ఫోర్లు, 6 సిక్సర్లు) మెరుపు సెంచరీతో కదం తొక్కాడు. దీంతో ఆ జట్టు 8 వికెట్ల తేడాతో కన్సల్ట్ సీసీపై విజయం సాధించింది. ఎ-డివిజన్ వన్డే లీగ్లో మొదట బ్యాటింగ్ చేసిన కన్సల్ట్ సీసీ 202 పరుగుల వద్ద ఆలౌటైంది. సునీల్ (104) సెంచరీతో రాణించాడు. హెచ్పీఎస్ బౌలర్ జయంత్ రావు 5 వికెట్లు తీశాడు. అనంతరం హెచ్పీఎస్ రెండే వికెట్లు కోల్పోయి 203 పరుగులు చేసింది. మరో మ్యాచ్లో భారతీయ సీసీ బౌలర్లు భార్గవ్ (5/34), అశోక్ కుమార్ (5/18) విజృంభించి ప్రత్యర్థి బ్యాట్సమెన్ను కట్టడి చేసినప్పటికీ జట్టుకు విజయం చేకూరలేదు. తొలుత కాస్మోస్ సీసీ 216 పరుగులకు ఆలౌటైంది. గురుప్రసాద్ (61) అర్ధసెంచరీ చేశాడు. తర్వాత భారతీయ సీసీ 156 పరుగులకే కుప్పకూలింది. చంద్రశేఖర్ (54) అర్ధ సెంచరీతో రాణించగా... అశోక్ కుమార్ 47 పరుగులు చేశాడు.