మచ్చలేని నాయకుడు గౌతమ్‌రెడ్డి | - | Sakshi
Sakshi News home page

మచ్చలేని నాయకుడు గౌతమ్‌రెడ్డి

Published Sat, Feb 22 2025 12:21 AM | Last Updated on Sat, Feb 22 2025 12:21 AM

మచ్చల

మచ్చలేని నాయకుడు గౌతమ్‌రెడ్డి

నెల్లూరు (బారకాసు): దివంగత మంత్రి మేకపాటి గౌతమ్‌రెడ్డి రాజకీయాలకు అతీతంగా అందరివాడుగా, నిష్పక్ష పాతిగా, మచ్చలేని నాయకుడిగా ఎదిగారని మాజీ మంత్రులు, ఎమ్మెల్యేలు, నాయకులు కొనియాడారు. నెల్లూరు నగరంలోని డైకస్‌రోడ్డు సెంటర్‌లోని మేకపాటి స్వగృహంలో శుక్రవారం ఆయన తృతీయ వర్ధంతి కార్యక్రమాన్ని నిర్వహించారు. గౌతమ్‌రెడ్డి చిత్రపటం వద్ద తల్లిదండ్రులు మాజీ ఎంపీ రాజమోహన్‌ రెడ్డి, మణిమంజరి దంపతులు, కుటుంబ సభ్యులు ఉదయగిరి వైఎస్సార్‌సీపీ సమన్వయకర్త మేకపాటి రాజగోపాల్‌రెడ్డి, అభినవ్‌రెడ్డి, మేకపాటి విక్రమ్‌రెడ్డి బంధుమిత్రులు నివాళులర్పించారు. రాజమోహన్‌రెడ్డి మాట్లాడుతూ గౌతమ్‌రెడ్డి మరణం అత్యంత విషాదకరమన్నారు. తన కుమారుడు గౌతమ్‌రెడ్డి అకాల మరణం ఆత్మకూరు, ఉదయగిరి నియోజకవర్గాలకు తీరని లోటన్నారు. మూడేళ్లు అయినా ఆ బాధ నుంచి ఇంకా కోలుకోలేని పరిస్థితుల్లో ఉన్నామన్నారు.

నిష్పక్ష పాతిగా, అందరివాడుగా ఎదిగారు

తృతీయ వర్ధంతి సందర్భంగా ఘన నివాళి

భారీగా తరలివచ్చిన మాజీ మంత్రులు, మాజీ ఎమ్మెల్యేలు, వైఎస్సార్‌సీపీ నేతలు, అభిమానులు

No comments yet. Be the first to comment!
Add a comment
మచ్చలేని నాయకుడు గౌతమ్‌రెడ్డి 1
1/1

మచ్చలేని నాయకుడు గౌతమ్‌రెడ్డి

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement