గాయపడిన యువకుడి మృతి | - | Sakshi
Sakshi News home page

గాయపడిన యువకుడి మృతి

Published Sun, Feb 16 2025 12:43 AM | Last Updated on Sun, Feb 16 2025 12:43 AM

-

పెద్దవడుగూరు/ గుంతకల్లు రూరల్‌: రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడి ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న యువకుడు పరిస్థితి విషమించి శుక్రవారం మృతి చెందాడు. పోలీసులు తెలిపిన వివరాలిలా ఉన్నాయి. గుంతకల్లు మండలం కదిరంపల్లికి చెందిన నరేష్‌ (32) ఈ నెల 12న పెద్దవడుగూరు మండలం లక్షుంపల్లికి ద్విచక్రవాహనంపై వెళ్తుండగా మార్గం మధ్యలో అడవిపందుల గుంపు అడ్డు వచ్చింది. దీంతో అదుపుతప్పి బైక్‌పై నుంచి కిందపడ్డాడు. తీవ్రంగా గాయపడిన నరేష్‌ను అనంతపురం ప్రభుత్వాస్పత్రికి తరలించగా.. శుక్రవారం అర్ధరాత్రి మృతి చెందాడు. మృతుడి తండ్రి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు పెద్దవడుగూరు ఎస్‌ఐ ఆంజనేయులు తెలిపారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement