రోడ్డు ప్రమాదంలో ముగ్గురికి తీవ్రగాయాలు | - | Sakshi
Sakshi News home page

రోడ్డు ప్రమాదంలో ముగ్గురికి తీవ్రగాయాలు

Published Sun, Mar 2 2025 1:50 AM | Last Updated on Sun, Mar 2 2025 1:50 AM

-

నల్లమాడ: అరవవాండ్లపల్లి తండా సమీపాన నల్లమాడ–పుట్టపర్తి రహదారిలో శనివారం జరిగిన రోడ్డు ప్రమాదంలో ముగ్గురు గాయపడ్డారు. వివరాలు.. మండలంలోని తిప్పయ్యగారిపల్లికి చెందిన రామప్ప, రమేష్‌బాబు, కిరణ్‌కుమార్‌ బైక్‌పై నల్లమాడ మీదుగా పుట్టపర్తి బయలుదేరారు. అరవవాండ్లపల్లి సమీపానికి వెళ్లగానే బైక్‌పై అదుపుతప్పి కింద పడటంతో ముగ్గురికీ ముఖం, చేతులు, కాళ్లు, ఛాతీపై బలమైన రక్తగాయాలయ్యాయి. స్థానికులు 108లో క్షతగాత్రులను నల్లమాడలోని కమ్యూనిటీ హెల్త్‌ సెంటర్‌కు తరలించారు. ప్రాథమిక చికిత్స అనంతరం 108లో కదిరి ఏరియా ఆస్పత్రికి తరలించారు. ప్రమాదంపై తమకు ఎలాంటి ఫిర్యాదు అందలేదని పోలీసులు తెలిపారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement