పోస్టల్‌ బీమా ఏజెంట్లకు దరఖాస్తుల ఆహ్వానం | - | Sakshi
Sakshi News home page

పోస్టల్‌ బీమా ఏజెంట్లకు దరఖాస్తుల ఆహ్వానం

Published Sun, Apr 27 2025 12:59 AM | Last Updated on Sun, Apr 27 2025 12:59 AM

పోస్ట

పోస్టల్‌ బీమా ఏజెంట్లకు దరఖాస్తుల ఆహ్వానం

హిందూపురం: హిందూపురం డివిజన్‌లో గ్రామీణ తపాలా జీవిత బీమా(ఆర్‌పీఎల్‌ఐ)డైరెక్ట్‌ ఏజెంట్లుగా పని చేసేందుకు దరఖాస్తులు ఆహ్వానిస్తున్నారు. ఈమేరకు శనివారం తపాలా శాఖ హిందూపురం సూపరింటెండెంట్‌ విజయ్‌కుమార్‌, డెవలప్‌మెంట్‌ ఆఫీసర్‌ నరసింహమూర్తి శనివారం తెలిపారు. ఆసక్తి గల అభ్యర్థులు ఎస్‌వీడి రోడ్డులోని సూపరింటెండెంట్‌ కార్యాలయంలో ఈనెల 28 నుంచి 30(ఉదయం 10 నుంచి సాయంత్రం 5 గంటలు) వరకు జరిగే ఇంటర్వ్యూలకు ఒరిజినల్‌ సర్టిఫికెట్లతో హాజరుకావాలన్నారు. టెన్త్‌ విద్యార్హత కల్గి 18 నుంచి 50ఏళ్ల లోపు ఉన్నవారు అర్హులన్నారు. ఎంపికై న ఏజెంట్లు సెక్యూరిటీ డిపాజిట్‌ రూ.5 వేలు కెవీపీ, ఎన్‌ఎస్‌సీ రూపంలో చెల్లించాలన్నారు. వివరాలకు తపాలా శాఖ హిందూపురం సూపరింటెండెంట్‌ కార్యాలయం, తపాలా జీవిత బీమా డివిజన్‌ ఆఫీసులో సంప్రదించాలని సూచించారు.

గుర్తు తెలియని యువకుడి

మృతదేహం లభ్యం

చెన్నేకొత్తపల్లి: న్యామద్దెల పంచాయతీలోని చిన్నంపేట గ్రామ సమీపంలో శనివారం సాయంత్రం గుర్తు తెలియని యువకుడి మృతదేహం లభ్యమైంది. చిన్నంపేట సమీపంలోని పొలంలో రాళ్ల మధ్యన యువకుడి మృతదేహం ఇరుక్కున్నట్లు సమాచారం రావడంతో ఎస్‌ఐ సత్యనారాయణ సిబ్బందితో కలిసి ఘటన స్థలాన్ని పరిశీలించారు. మృతుడు 25 నుంచి 30 ఏళ్లుండి ఎరుపు రంగు టీషర్ట్‌, బ్లూకలర్‌ జీన్స్‌ ప్యాంట్‌ ధరించి ఉన్నాడని ఎస్‌ఐ తెలిపారు. మృతదేహం కుళ్లిపోయి గుర్తు పట్టని విధంగా ఉందన్నారు., ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టినట్లు ఎస్‌ఐ పేర్కొన్నారు.

‘హంద్రీ–నీవా’ బ్లాస్టింగ్‌ రాయి తగిలి బాలుడికి తీవ్రగాయాలు

పుట్టపర్తి: హంద్రీ–నీవా కాలువ లైనింగ్‌ పనుల్లో భాగంగా బ్లాస్టింగ్‌ చేయడంతో రాయి తగిలి ఓ బాలుడు తీవ్రంగా గాయపడ్డాడు. వివరాలు..బుక్కపట్నం మండలం జానకంపల్లి సమీపంలో హంద్రీ–నీవా కాలువ లైనింగ్‌ పనులు జరుగుతున్నాయి. శనివారం కాలువలో రాయి ఉండటంతో దానిని పగులగొట్టేందుకు కాంట్రాక్టర్లు బ్లాస్టింగ్‌ చేశారు. ఈ క్రమంలో 8 నుంచి 10 కేజీల బరువున్న ఓ రాయి జానకంపల్లి ప్రధాన రహదారి వద్దకు వచ్చి తిరుమలసాయి అనే బాలుడి కాలికి తగిలింది. తీవ్రగాయాలపాలైన బాలుడిని కాంట్రాక్టర్లు మెరుగైన వైద్యం కోసం ఆస్పత్రికి తరలించినట్లు తెలిసింది. కాలువకు జానకంపల్లికి 200 మీటర్ల దూరం ఉందని, బ్లాస్టింగ్‌ సమయంలో కాంట్రాక్టర్‌ నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నట్లు గ్రామస్తులు, బాధితుడి తల్లి దండ్రులు పేర్కొన్నారు.

పోస్టల్‌ బీమా ఏజెంట్లకు దరఖాస్తుల ఆహ్వానం 1
1/2

పోస్టల్‌ బీమా ఏజెంట్లకు దరఖాస్తుల ఆహ్వానం

పోస్టల్‌ బీమా ఏజెంట్లకు దరఖాస్తుల ఆహ్వానం 2
2/2

పోస్టల్‌ బీమా ఏజెంట్లకు దరఖాస్తుల ఆహ్వానం

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement