
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ (ఆరెస్సెస్) అఖిల భారత కార్యకారిణి సమావేశాల్లో పాల్గొనేందుకు బీజేపీ జాతీయ అధ్యక్షుడు జగత్ ప్రకాష్ నడ్డా నేడు హైదరాబాద్కు వస్తున్నారు. బుధవారం నుంచి 7వ తేదీ వరకు మేడ్చల్ జిల్లా ఘట్కేసర్ సమీపంలోని అన్నోజిగూడలో ఈ సమావేశాలు జరగనున్నాయి.
ఆరెస్సెస్ సర్సంఘ్చాలక్ మోహన్ భగవత్, వివిధ అనుబంధ విభాగాలకు చెందిన నాయకులు సమావేశంలో పాల్గొంటారు. ఆరెస్సెస్ ఆధ్వర్యంలో ఏడాదిలో చేపట్టిన కార్యక్రమాలు, నిర్వహణ, వాటిలో ఏబీవీపీ, బీఎంఎస్, బీకేఎస్, తదితర సంఘాల భాగస్వామ్యం, భవిష్యత్ కార్యాచరణపై ఈ సమావేశాల్లో చర్చిస్తారు.
Comments
Please login to add a commentAdd a comment