బిర్యానీలో కప్ప.. ట్రిపుల్‌ ఐటీ విద్యార్థుల ఆగ్రహం | Frog Found In IIIT Hyderabad Kadamba Mess Biryani, Students Demanded Action Against Organizers | Sakshi
Sakshi News home page

HYD: బిర్యానీలో కప్ప.. ట్రిపుల్‌ ఐటీ విద్యార్థుల ఆగ్రహం

Published Sun, Oct 20 2024 3:16 PM | Last Updated on Sun, Oct 20 2024 4:58 PM

Frog In IIIT Hyderabad Mess Biryani

సాక్షి,హైదరాబాద్‌: గచ్చిబౌలి ట్రిపుల్‌ఐటీలోని కదంబ మెస్‌లో విద్యార్థులకు ఇటీవల పెట్టిన బిర్యానీలో కప్ప ప్రత్యక్షమైంది. దీంతో విద్యార్థులు ఆగ్రహం వ్యక్తం చేశారు. బిర్యానీలో కప్ప రావడానికి మెస్‌ నిర్వాహకుల నిర్ల‍క్ష్యమే కారణమని విద్యార్థులు మండిపడుతున్నారు. 

మెస్ నిర్వాహకులపై చర్యలు తీసుకోవాలని విద్యార్థులు డిమాండ్‌ చేశారు. బిర్యానీలో కప్ప ప్రత్యక్షమైన ఫొటోను విద్యార్థులు ట్విటర్‌లో షేర్‌ చేశారు. మెస్‌ నిర్వాహకులపై చర్యలు తీసుకోవాలని తెలంగాణ ఫుడ్‌సేఫ్టీ కమిషనర్‌కు ఫిర్యాదు చేశారు.

 ఇదీ చదవండి: అశోక్‌నగర్‌లో మరోసారి ఉద్రిక్తత

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement