Gachibowli
-
గచ్చిబౌలి: ఆర్టీసీ బస్సు కింద పడి టెన్త్ విద్యార్థి మృతి
సాక్షి, హైదరాబాద్: నగరంలో విషాదం చోటు చేసుకుంది. గచ్చిబౌలి ఫ్లై ఓవర్పై రోడ్డు ప్రమాదం జరిగింది. ఆర్టీసీ బస్సు కింద పడి టెన్త్ విద్యార్థి మృతి చెందింది. టెన్త్ పరీక్ష రాయించి చెల్లిని అన్న బైక్పై తీసుకెళ్తుండగా ఆర్టీసీ బస్సు ఢీకొట్టింది. ప్రమాదంలో అన్నకు తీవ్ర గాయాలు కాగా, ఆసుపత్రికి తరలించారు.గచ్చిబౌలి టీఎన్జీవో కాలనీకి చెందిన విద్యార్థిని టెలికాం నగర్లో 10వ తరగతి పరీక్షలు రాస్తుంది. నిన్నటి (శుక్రవారం) నుంచి టెన్త్ పరీక్షలు ప్రారంభమవ్వగా, ఇవాళ రెండో రోజైన శనివారం తన అన్న బైక్ పై పరీక్షకు వెళ్లింది. పరీక్ష రాసిన అనంతరం తిరిగి ఇంటికి వస్తున్న క్రమంలో గచ్చిబౌలి ఫ్లైఓవర్ వద్ద వారు ప్రయాణిస్తున్న బైక్ ఆర్టీసీ బస్సు చక్రాల కింద పడింది. ఈ ఘటనలో బైక్పై వెనుక కూర్చున్న విద్యార్థిని అక్కడికక్కడే మృతి చెందగా.. అన్న తీవ్రంగా గాయపడ్డారు. -
ఆ భూమి రాష్ట్ర ప్రభుత్వానిదే..
సాక్షి, హైదరాబాద్: కంచ గచ్చిబౌలిలోని సర్వేనంబర్ 25లోని 400 ఎకరాల భూమి ప్రభుత్వానిదేనని, దీంతో కేంద్రీయ విశ్వవిద్యాలయానికి సంబంధం లేదని ప్రభుత్వం స్పష్టం చేసింది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం.. క్రీడా మౌలిక సదుపాయాల కల్పన కోసం ఐఎంజీ అకాడమీస్ భారత్ ప్రైవేట్ లిమిటెడ్కు 2004లో జనవరి 13న 400 ఎకరాల భూమిని కేటాయించిందని వివరించింది. అయితే ప్రాజెక్టు ముందుకు వెళ్లకపోవడంతో 2006 నవంబర్ 21న అప్పటి ప్రభుత్వం ఈ భూమిని వెనక్కి తీసుకుందని పేర్కొంది.దీన్ని సవాల్ చేస్తూ ఐఎంజీ భారత్ హైకోర్టును ఆశ్రయించిందని తెలిపింది. సుదీర్ఘ న్యాయపోరాటం అనంతరం హైకోర్టు ప్రభుత్వానికి అనుకూలంగా తీర్పునిచ్చిందని తెలిపింది. ఆ తరువాత ఐఎంజీ భారత్ సుప్రీంకోర్టులో లీవ్ పిటిషన్ దాఖలు చేయగా.. అక్కడా కొట్టేయడంతో ప్రభుత్వ అధీనంలోకి వచ్చిందని వివరించింది. ఆ తరువాత అక్కడ ఐటీ, ఐటీయేతర పరిశ్రమల కోసం కేటాయించాలని టీజీఐఐసీ విజ్ఞప్తి మేరకు.. ఆ సంస్థకు భూమి కేటాయించినట్లు తెలిపింది. ఈ 400 ఎకరాల పరిధిలోకి బఫెల్లో లేక్, పీకాక్ లేక్ రావని స్పష్టం చేశారు. -
హైదరాబాద్ సిటీలో మరిన్ని ఫ్లై ఓవర్లు, అండర్పాస్లు
సాక్షి, సిటీబ్యూరో: హై సిటీ (హైదరాబాద్ సిటీ ఇన్నోవేటివ్ అండ్ ట్రాన్స్ఫార్మేటివ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్) పనుల్లో భాగంగా రెండు జంక్షన్ల వద్ద నాలుగు ఫ్లై ఓవర్లు.. రెండు అండర్పాస్లు.. రెండు రహదారుల విస్తరణ, అభివృద్ధి పనుల కోసం జీహెచ్ఎంసీ (GHMC) జాతీయ స్థాయి టెండర్లను పిలిచింది. ఈ పనుల నిర్మాణ వ్యయం దాదాపు రూ. 650 కోట్లు. టెండర్ల దాఖలుకు చివరి తేదీ వచ్చే నెల 9. గ్రేటర్ నగరంలో సిగ్నల్ ఫ్రీ (Signal Free) ప్రయాణం కోసం ఇప్పటికే ఎన్నో ఫ్లై ఓవర్లు, అండర్పాస్లు (Underpass) తదితర వసతులు అందుబాటులోకి వచ్చాయి. పెరుగుతున్న ట్రాఫిక్ సమస్య పరిష్కారానికి మరిన్ని ఫ్లై ఓవర్లు, అండర్పాస్లు నిర్మించేందుకు సిద్ధమైన ప్రభుత్వం దాదాపు రూ.2,400 కోట్ల మేర పనులు చేపట్టాల్సిందిగా ఇటీవల జీహెచ్ఎంసీని ఆదేశించింది.అందుకనుగుణంగా ఇప్పటికే కేబీఆర్ పార్కు (KBR Park) పరిసరాల్లో కొన్ని స్టీల్ ఫ్లై ఓవర్లు, అండర్పాస్లు, ఫాక్స్ సాగర్ నాలా వద్ద ఫ్లై ఓవర్ పనులకు టెండర్లు ఆహ్వానించిన జీహెచ్ఎంసీ.. తాజాగా ఖాజాగూడ జంక్షన్, ట్రిపుల్ ఐటీ జంక్షన్ల వద్ద మరికొన్ని ఫ్లై ఓవర్లు, అండర్పాస్లకు టెండర్లు ఆహ్వానించింది. వీటితో పాటు సైబరాబాద్ సీపీ కార్యాలయం నుంచి గచ్చిబౌలి జంక్షన్ వరకు 215 అడుగుల వెడల్పుతో రోడ్డు విస్తరణ, అంజయ్యనగర్ నుంచి రాంకీ టవర్ రోడ్ వరకు 150 అడుగుల వెడల్పుతో రోడ్డు విస్తరణ పనులకు టెండర్లు పిలిచింది. జీహెచ్ఎంసీ నుంచి కానీ, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నుంచి కానీ నిధులు చెల్లించనున్నట్లు పేర్కొంది. ఈ పనుల్ని రెండేళ్లలో పూర్తి చేయాల్సిందిగా టెండరు నిబంధనల్లో పేర్కొంది. పనులు పూర్తయ్యాక రెండేళ్లపాటు అవసరాన్ని బట్టి మరమ్మతులు వంటివి చేయాల్సి ఉంటుంది. తాజాగా టెండర్లు పిలిచిన పనులు ట్రిపుల్ ఐటీ జంక్షన్ వద్ద.. → ఐఎస్బీ నుంచి డీఎల్ఎఫ్ రోడ్ వరకు రెండు వైపులా ప్రయాణానికి మొదటి వరుస ఫ్లై ఓవర్. నాలుగు లేన్లు. క్యారేజ్ వే వెడల్పు 7.5 మీటర్లు. → ఐఎస్బీ నుంచి గచ్చిబౌలి వెళ్లేందుకు రెండో వరుసలో మరో ఫ్లై ఓవర్. మూడు లేన్లుగా ప్రయాణం. క్యారేజ్వే వెడల్పు 11 మీటర్లు. → డీఎల్ఎఫ్ నుంచి బీహెచ్ఈఎల్ రోడ్ వైపు వెళ్లేందుకు రెండో వరుసలో మూడు లేన్ల ఫ్లై ఓవర్. క్యారేజ్వే వెడల్పు 11 మీటర్లు. → గచ్చిబౌలి నుంచి బీహెచ్ఈఎల్ వరకు రెండు వైపులా ప్రయాణానికి ఆరు లేన్లతో అండర్ పాస్. 11 మీటర్ల క్యారేజ్వే. వరద నీరు పోయే మార్గాలతో పాటు 2 లక్షల నీటి సామర్థ్యంతో సంప్ నిర్మాణం. ఖాజాగూడ జంక్షన్ వద్ద.. → నానక్రామ్గూడ – టోలిచౌకి రోడ్ వరకు మూడు లేన్లతో ఫ్లై ఓవర్. క్యారేజ్వే 9.5 మీటర్లు. → టోలిచౌకి రోడ్– బయోడైవర్సిటీ వరకు మూడు లేన్లతో అండర్పాస్. క్యారేజ్వే 11 మీటర్లు. రెండు వైపులా ఫుట్పాత్లతో పాటు వాటి కింద డక్ట్ నిర్మాణం. వరదనీరు పోయే మార్గాలతో పాటు సంప్ నిర్మాణం. → ఈ పనులతో పాటు ఆయా జంక్షన్ల వద్ద రోడ్ల పునరుద్ధరణ, ఫుట్పాత్లు, లైటింగ్, ఇతరత్రా సదుపాయాలతో ఆధునికీకరణ. సైబరాబాద్ సీపీ కార్యాలయం – గచ్చిబౌలి జంక్షన్ వరకు, అంజయ్యనగర్ –రాంకీ టవర్ రోడ్ వరకు రోడ్లను వెడల్పు చేసి సాఫీగా ప్రయాణం సాగేలా ఆధునికీకరించాలి. ఇదివరకే టెండర్లు పిలిచిన పనులుప్యాకేజీ – 1 కింద రూ. 580 కోట్ల అంచనా వ్యయంతో.. → జూబ్లీహిల్స్ చెక్పోస్ట్ జంక్షన్ వద్ద అండర్పాస్. → జూబ్లీహిల్స్ రోడ్ నంబర్ 36 నుంచి కేబీఆర్ పార్కు ఎంట్రన్స్ వరకు మొదటి వరుస ఫ్లై ఓవర్. → యూసుఫ్గూడ రోడ్ నుంచి రోడ్ నంబర్ 45 వరకు రెండో వరుస ఫ్లై ఓవర్. → కేబీఆర్ పార్కు ఎంట్రన్స్ జంక్షన్ వద్ద జూబ్లీహిల్స్ చెక్పోస్ట్ జంక్షన్ నుంచి క్యాన్సర్ హాస్పిటల్ రోడ్ వరకు అండర్పాస్. → బంజారాహిల్స్ రోడ్ నంబర్ 2 నుంచి జూబ్లీహిల్స్ చెక్పోస్ట్ రోడ్ వరకు ఫ్లై ఓవర్. → ముగ్ధ జంక్షన్ వద్ద కేబీఆర్ ఎంట్రన్స్ రోడ్ నుంచి పంజగుట్ట రోడ్ వరకు అండర్పాస్. ప్యాకేజీ–2 కింద.. రూ. 510 కోట్ల అంచనా వ్యయంతో.. → రోడ్ నంబర్–45 జంక్షన్ వద్ద ఫిల్మ్నగర్ రోడ్ నుంచి జూబ్లీహిల్స్ చెక్పోస్ట్ రోడ్ వరకు అండర్పాస్. → జూబ్లీహిల్స్ చెక్పోస్ట్ రోడ్ నుంచి రోడ్ నంబర్ 45 వరకు ఫ్లై ఓవర్. → ఫిల్మ్నగర్ జంక్షన్ వద్ద మహారాజా అగ్రసేన్ జంక్షన్ రోడ్ నుంచి రోడ్ నంబర్ 45 జంక్షన్ వరకు అండర్పాస్. → ఫిల్మ్నగర్ రోడ్ నుంచి మహారాజా అగ్రసేన్ జంక్షన్ రోడ్ వరకు ఫ్లై ఓవర్. → మహారాజా అగ్రసేన్ జంక్షన్ వద్ద కేన్సర్ హాస్పిటల్ రోడ్ నుంచి ఫిల్మ్నగర్ రోడ్ వరకు అండర్పాస్. → ఫిల్మ్నగర్ రోడ్ నుంచి బంజారాహిల్స్ రోడ్ నంబర్ 12 వరకు ఫ్లై ఓవర్. → కేన్సర్ హాస్పిటల్ జంక్షన్ వద్ద కేబీఆర్ ఎంట్రన్స్ జంక్షన్ నుంచి మహారాజా అగ్రసేన్ జంక్షన్ రోడ్ వరకు అండర్పాస్. → మహారాజా అగ్రసేన్ జంక్షన్ నుంచి బంజారాహిల్స్ రోడ్ నంబర్ 10 వరకు ఫ్లై ఓవర్.→ ఆయా ఫ్లై ఓవర్ల నిర్మాణాలు పూర్తయితే కోర్ సిటీలోని వివిధ ప్రాంతాల నుంచి పశ్చిమం వైపు.. ఐటీ కారిడార్లకు రాకపోకలు చేసేవారికి సమయం, వ్యయ ప్రయాసలు తప్పుతాయని అధికారులు పేర్కొన్నారు. -
తెలంగాణ సర్కార్ కీలక నిర్ణయం.. 400 ఎకరాల వేలంపాట
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. గచ్చిబౌలిలో 400 ఎకరాల వేలంపాటకు నోటిఫికేషన్ విడుదల చేసింది. కన్సల్టెంట్ నియామకానికి టెండర్లు పిలిచింది. ఈ నెల 15 వరకు బిడ్ దాఖలుకు గడువు ఇచ్చింది.కాగా, భూముల అమ్మకానికి రేవంత్ సర్కార్ కుట్రలు చేస్తోందంటూ మాజీ మంత్రి, బీఆర్ఎస్ ఎమ్మెల్యే, హరీష్రావు ఆరోపించారు. రూ. 30 వేల కోట్ల విలువైన భూములు అమ్మేందుకు యత్నిస్తున్నారు. నాడు భూములు అమ్మొద్దని రేవంత్ సుద్దులు చెప్పారు. పీసీసీ చీఫ్గా ఒక మాట.. సీఎం రాగానే మరో మాట అంటూ హరీష్రావు దుయ్యబట్టారు.ప్రభుత్వ భూములంటే పెద్దలిచ్చిన ఆస్తి అని, తెలంగాణ జాతి సంపద అని, ఆ భూములను అమ్మితే భవిష్యత్తులో స్మశానాలు నిర్మించాలంటే కూడా భూమి లేకుండా పోతుందంటూ పీసీసీ అధ్యక్షుడి హోదాలో రేవంత్ మొసలి కన్నీరు కార్చారని హరీష్రావు గుర్తుచేశారు. ప్రభుత్వ భూములను అమ్మబోంటూ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి అసెంబ్లీలో ప్రకటించి మూడు నెలలైనా గడవక ముందే విలువైన ఆస్తులను కొల్లగొట్టేందుకు కుట్ర పన్నారంటూ కాంగ్రెస్ సర్కార్ని హరీష్రావు నిలదీశారు. -
ఐటీ ఉద్యోగుల ప్రేమ పెళ్లి.. ఇంతలోనే దేవిక ఆత్మహత్య
సాక్షి, గచ్చిబౌలి: ఇద్దరూ సాఫ్ట్వేర్ ఉద్యోగులే.. ఆరు నెలల కిందటే ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. ఇంతలోనే దంపతుల మధ్య మనస్పర్థలు రావడంతో.. నవ వధువు ఆత్మహత్య చేసుకుంది. ఈ ఘటన హైదరాబాద్లోని రాయదుర్గం పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. అయితే, వరకట్న వేధింపుల కారణంగానే తన కుమార్తె ఆత్మహత్య చేసుకుందని మృతురాలి తల్లి పోలీసులకు ఫిర్యాదు చేసింది.వివరాల ప్రకారం.. వికారాబాద్ జిల్లా, తోర్మామిడికి చెందిన కమలాపురం దేవిక(25) మాదాపూర్లోని ఓ ఐటీ కంపెనీలో సాఫ్ట్వేర్ ఉద్యోగిగా పని చేస్తోంది. మంచిర్యాల మార్కెట్ రోడ్డుకు చెందిన సద్గుర్తి శరత్ చంద్రతో ఏర్పడిన పరిచయం ప్రేమకు దారితీయడంతో పెద్దల అంగీకారంతో వారిద్దరూ గతేడాది ఆగస్టు 23న గోవాలో పెళ్లి చేసుకున్నారు. రాయదుర్గంలోని ప్రశాంత్ హిల్స్లో నివాసం ఉంటున్నారు.అయితే, కొద్ది రోజులుగా భార్యా భర్తల మధ్య గొడవలు జరుగుతున్నాయి. ఆదివారం రాత్రి కూడా వారి మధ్య గొడవ జరగడంతో దేవిక గదిలోకి వెళ్లి గడియ పెట్టుకుంది. బయటికి వెళ్లి తిరిగి వచ్చిన శరత్చంద్ర తలుపు తట్టినా దేవిక స్పందించకపోవడంతో నిద్రపోయి ఉంటుందని భావించాడు. సోమవారం ఉదయం 10 గంటలైనా దేవిక బయటికి రాకపోవడంతో అనుమానం వచ్చిన శరత్ చంద్ర తలుపు విరగ్గొట్టి చూడగా ఆమె ఉరి వేసుకుని కనిపించింది.ఈ క్రమంలో ఇరుగు పొరుగు సహాయంతో కిందకు దించి చూడగా అప్పటికే మృతి చెందింది. వరకట్నం కోసం శరత్చంద్ర తన కుమార్తెను వేధిస్తున్నాడని, ఈ కారణంగానే ఆమె ఆత్మహత్యకు పాల్పడి ఉండవచ్చునని మృతురాలి తల్లి రామలక్ష్మి రాయదుర్గం పోలీసులకు ఫిర్యాదు చేసింది. పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాన్ని ఉస్మానియా ఆస్పత్రికి తరలించిన పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. -
హైదరాబాద్ : గచ్చిబౌలిలో ఉత్సాహంగా 10కె రన్ (ఫొటోలు)
-
మన జీవితంలో సైన్స్ కీలక పాత్ర పోషిస్తుంది: రాజ్నాథ్సింగ్
సాక్షి, గచ్చిబౌలి: కేంద్ర రక్షణమంత్రి రాజ్నాథ్ సింగ్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. జాతీయ సైన్స్డే సందర్భంగా తాను కొన్నాళ్లు సైన్స్ అధ్యాపకుడిగా పనిచేసినట్టు చెప్పుకొచ్చారు. మానవ పరిణామాన్ని, సైన్స్ అభివృద్ధిని విద్యార్థులు అధ్యయనం చేయాలని కోరారు. మరోవైపు.. దేశ రక్షణ బాధ్యత యువతీయువకులపైన ఉందని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు.హైదరాబాద్లోని గచ్చిబౌలిలో జాతీయ సైన్స్డే సందర్భంగా డీఆర్డీవో విజ్ఞాన్ వైభవ్ ప్రదర్శన జరుగుతోంది. ఈ ప్రదర్శనకు కేంద్రమంత్రి రాజ్నాథ్ సింగ్, సీఎం రేవంత్రెడ్డి హాజరయ్యారు. ఈ సందర్భంగా కేంద్రమంత్రి రాజ్నాథ్ సింగ్ మాట్లాడుతూ.. సర్ సీవీరామన్.. ఫిబ్రవరి 28న రామన్ ఎఫెక్ట్ను కనుగొన్నారు. నోబెల్ గ్రహీత రామన్ గౌరవార్థం ఫిబ్రవరి 28ని జాతీయ సైన్స్ దినోత్సవంగా నిర్వహించుకుంటున్నాం. నేను కూడా సైన్స్ విద్యార్థినే.. కొన్నాళ్లు సైన్స్ అధ్యాపకుడిగా పనిచేశాను. ఇంతటి విద్యార్థి సందోహాన్ని ఉద్దేశించి ప్రసంగించడం సంతోషంగా ఉంది. మానవ పరిణామాన్ని, సైన్స్ అభివృద్ధిపై విద్యార్థులు అధ్యయనం చేయాలి. రక్షణ రంగంలో కూడా అనేక మార్పులు. మన జీవితంలో సైన్స్ కీలక పాత్ర పోషిస్తుంది అని చెప్పుకొచ్చారు.ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాట్లాడుతూ.. దేశ రక్షణ బాధ్యత యువతీయువకులపైన ఉంది. దేశ రక్షణలో హైదరాబాద్ దశాబ్దాలుగా కీలక పాత్ర పోషిస్తోంది. బీడీఎల్, హెచ్ఏఎల్, మిధాని వంటి కీలక సంస్థలు హైదరాబాద్ చుట్టుపక్కల ఉన్నాయి. ఈ సైన్స్ ప్రదర్శన ద్వారా విద్యార్థులకు దేశ రక్షణ పట్ల అవగాహన కలుగుతుంది. ప్రస్తుతం యువత ఐటీ ఉద్యోగాలవైపే మొగ్గు చూపుతోంది. సంప్రదాయ ఇంజినీరింగ్ విద్యపై కూడా విద్యార్థులకు అవగాహన పెంచాలి అంటూ కామెంట్స్ చేశారు. -
అగ్ని, బ్రహ్మోస్లను చూసొద్దాం రండి
గచ్చిబౌలి: శత్రు దేశాల్లోని లక్ష్యాలను ఛేదించే అగ్ని, బ్రహ్మోస్ రకం క్షిపణులతోపాటు వివిధ యుద్ధట్యాంకులు, శతఘ్నులు, రాకెట్ లాంచర్లను దగ్గర నుంచి చూసే అవకాశం హైదరాబాద్వాసులకు లభించనుంది. నేషనల్ సైన్స్ డేను పురస్కరించుకొని విజ్ఞాన్ వైభవ్–2025 పేరిట గచ్చిబౌలి స్టేడియంలో రక్షణరంగ ఆయుధాలు, విడిభాగాల ప్రదర్శన శుక్రవారం రక్షణ మంత్రి రాజ్నాథ్సింగ్ చేతుల మీదుగా ప్రారంభం కానుంది. ఈ కార్యక్రమంలో సీఎం రేవంత్రెడ్డి పాల్గొననున్నారు. అందుకు సంబంధించిన ఏర్పాట్లపై రంగారెడ్డి జిల్లా కలెక్టర్ నారాయణరెడ్డి గురువారం ఉన్నతస్థాయిలో సమీక్షించారు.త్రివిధ దళాల అవసరాల కోసం స్వదేశీ పరిజ్ఞానంతో కేంద్ర ప్రభుత్వరంగ సంస్థలైన డీఆర్డీఎల్, డీఆర్డీఓ, ఇస్రో, మిధాని, బీడీఎల్, బీఈఎల్, ఈసీఐఎల్ రూపొందించిన ఆయుధాలు, పరికరాలు, విడిభాగాలను విద్యార్థులు, సామాన్య ప్రజలు మూడు రోజులపాటు తిలకించవచ్చు. ఇందుకోసం 200 స్టాళ్లను ఏర్పాటు చేశారు. సుమారు 20 వేల మంది విద్యార్థులు ఈ వేడుకలను సందర్శిస్తారని అంచనా వేస్తున్నట్లు డీఆర్ఎడీఎల్ డైరెక్టర్ జనరల్ (మిస్సైల్స్ అండ్ స్ట్రాటజిక్ సిస్టమ్స్) రాజబాబు, డీఆర్డీఎల్ డైరెక్టర్æ జీఏ శ్రీనివాసమూర్తి గురువారం విలేకరుల సమావేశంలో తెలిపారు.ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు ప్రదర్శన ఉంటుందన్నారు. అయితే తొలి రోజైన శుక్రవారం మాత్రం రిజిస్ట్రేషన్ చేసుకున్న వారికే ప్రదర్శనను తిలకించే అవకాశం ఉంటుందని, మార్చి 1, 2 తేదీల్లో విద్యార్థులతోపాటు సామాన్య ప్రజలు చూడవచ్చని తెలిపారు.యువతను ఆకర్షించే లక్ష్యంతో..: రక్షణ, ఏరోస్పేస్ టెక్నాలజీ రంగాల వైపు విద్యార్థులు, యువతను ఆకర్షించే లక్ష్యంతో డీఆర్డీఓ, ఏరోనాటికల్ సొసైటీ ఆఫ్ ఇండియా, కలాం ఇన్స్టిట్యూట్ ఆఫ్ యూత్ ఎక్సలెన్స్ హైదరాబాద్లో తొలిసారి ఈ కార్యక్రమం ఏర్పాటు చేశాయి. రక్షణరంగ పరిశ్రమలు ఎలా ఆధునిక సాంకేతికతను అందిపుచ్చుకుంటున్నాయన్న వివరాలను సైన్స్ డే ద్వారా విద్యార్థులకు వివరించనున్నాయి.ప్రదర్శనలోని క్షిపణులు ఇవే..అగ్ని–5: అణ్వస్త్ర సామర్థ్యంగల ఖండాంతర క్షిపణి. 5 వేల కిలోమీటర్ల దూరంలోని లక్ష్యాలను ఛేదించగలదు.రుద్రం–3 : 550 కిలోమీటర్ల దూరంలోని లక్ష్యాలను ఛేదించేందుకు ఉపయోగపడుతుంది.ప్రళయ్ : ఉపరితలం నుంచి ఉపరితలంపై లక్ష్యాలను ఛేదించేందుకు ఉపయోగించే క్షిపణి. 400 కిలోమీటర్ల దూరంలోని లక్ష్యాలను ఛేదిస్తుంది. బ్రహ్మోస్ : 10 మీటర్ల నుంచి 15 కిలోమీటర్ల ఎత్తు వరకు ప్రయాణిస్తూ 290 కిలోమీటర్ల దూరంలోని టార్గెట్లను నాశనం చేసే సామర్థ్యం ఉంది.వరుణాస్త్ర : యుద్ధనౌకల నుంచి ప్రయోగించే యాంటీ సబ్మెరైన్ టోర్పెడో. సుమారు 40 కిలోమీటర్ల దూరంలోని లక్ష్యాలను ఛేదిస్తుంది. వీటితోపాటు ఎంబీటీ అర్జున్, నాగ్ రకానికి చెందిన యుద్ధట్యాంకర్లు, పలు శతఘ్నులు, రాకెట్ లాంచర్లు, తుపాకులు, వాటి విడిభాగాలను ప్రదర్శించనున్నారు.స్ఫూర్తి కలిగించేందుకే..కేంద్ర ప్రభుత్వం మేకిన్ ఇండియా, వికసిత్ భారత్ 2047 లక్ష్యంలో భాగంగా సైన్స్ను ప్రమోట్ చేస్తోంది. హైదరాబాద్లో రక్షణరంగ పరిశోధన సంస్థలు చాలా ఉన్నాయి. వాటిలో తయారయ్యే యుద్ధ సామగ్రిని విద్యార్థులు తిలకిస్తే స్ఫూర్తి పొంది శాస్త్ర, సాంకేతిక రంగాల వైపు మళ్లుతారని ఆశిస్తున్నాం. భవిష్యత్తులో భారత్ను ఈ రంగంలో లీడర్గా తీర్చిదిద్దే ఆవిష్కరణలతో ముందుకొస్తారని భావిస్తున్నాం. అందుకే ఎప్పుడూలేని విధంగా ఈ ప్రదర్శన ఏర్పాటు చేశాం. –డాక్టర్ జి. సతీష్రెడ్డి, అధ్యక్షుడు, ఏరోనాటికల్ సొసైటీ ఆఫ్ ఇండియావికసిత్ భారత్ కోసంరక్షణ రంగంలో స్వదేశీ ఉత్పత్తులు పెరిగితేనే వికసిత్ భారత్ కల సాకారమవుతుంది. అందుకోసం విద్యార్థులు, పరిశ్రమలను మరింతగా ప్రోత్సహించే ఉద్దేశంతో ఎగ్జిబిషన్ ఏర్పాటు చేశాం. – యు.రాజబాబు, డైరెక్టర్ జనరల్, డీఆర్డీఎల్క్షిపణుల తయారీకి ఏఐ సాయంక్షిపణుల తయారీలో ఏఐ టెక్నాలజీని వాడుతున్నాం. ఒకసారి తయారు చేసిన మిసైల్ను మారుతున్న టెక్నాలజీకి అనుగుణంగా అప్గ్రేడ్ చేస్తాం. హైపర్సోనిక్ టెక్నాలజీలో రెండు నెలల క్రితం ఒక మిసైల్ను తయారు చేశాం. దాదాపు 20 ప్రాజెక్ట్లు పురోగతిలో ఉన్నాయి. – జి.ఎ. శ్రీనివాసమూర్తి, డైరెక్టర్, డీఆర్డీఎల్ -
Hyderabad: హైదరాబాద్ లో స్పా ముసుగులో వ్యభిచారం
గచ్చిబౌలి: స్పా ముసుగులో వ్యభిచారం నిర్వహిస్తున్న నిర్వాహకుడు, ముగ్గురు విటులను అదుపులోకి తీసుకున్న సంఘటన గచ్చిబౌలి పోలీస్స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. శ్రీరాంనగర్ కాలనీలో స్టైలిష్ బ్యూటీ స్పా పేరిట వ్యభిచారం నిర్వహిస్తున్నట్లు సమాచారం అందడంతో యాంటి హ్యూమన్ ట్రాఫికింగ్, గచ్చిబౌలి పోలీసులు బుధవారం దాడులు చేశారు. నిర్వాహకుడు సత్యనారాయణ, విటులు శ్రీకాంత్, గోవిందరావు, అప్పారావులను అదుపులోకి తీసుకున్నారు. నలుగురు యువతులను రెస్క్యూ హోంకు తరలించారు. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. వేర్వేరు కారు ప్రమాదాలు.. నలుగురికి గాయాలుమణికొండ: బుధవారం జరిగిన వేర్వేరు కారు ప్రమాదాల్లో నలుగురు గాయపడ్డారు. నార్సింగి పోలీసులు తెలిపిన మేరకు.. రామచంద్రాపురం మండలం, తెల్లాపూర్కు చెందిన విజయ్కుమార్ ఐటీ ఉద్యోగిగా పనిచేస్తున్నారు. తన స్నేహితురాలితో కలిసి బుధవారం తెల్లవారు జామున సుజికీ ఫ్రాంక్స్ కారులో కోకాపేట మూవీటవర్ వైపు లాంగ్ డ్రైవ్కు వచ్చారు. కారును వేగంగా నడపటం, ముందు లారీ వెళుతున్న విషయాన్ని గమనించకపోవటంతో వెనక నుంచి ఢీకొట్టాడు. దాంతో విజయ్కుమార్తో పాటు అతని స్నేహితురాలికి గాయాలయ్యాయి. వారిని సమీపంలోని కాంటినెంటల్ ఆసుపత్రికి చికిత్స కొరకు తరలించారు. మరో సంఘటనలో వోక్స్ వ్యాగన్ కారులో వికారాబాద్ నుంచి నార్సింగికి వస్తుండగా సీబీఐటీ కళాశాల ముందుకు రాగానే అదుపు తప్పిన కారు రోడ్డు మధ్యలో డివైడర్పై ఉన్న హోర్డింగ్ పోల్ను ఢీ కొట్టింది. దాంతో కారు ముందు బాగం పూర్తిగా నుజ్జు,నుజ్జు అయ్యింది. అందులో ఉన్న కార్తీక్, అభిõÙక్రెడ్డిలకు స్వల్పగాయాలు కావటంతో వారు కారును అక్కడే వదిలి పారిపోయారు. రెండు కారు ప్రమాదాల కేసులను నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్టు పోలీసులు తెలిపారు. -
తోపుడు బండిలో 92 విస్కీ క్వార్టర్ బాటిల్స్
హైదరాబాద్: రోడ్డుపై వ్యాపారం చేస్తున్న ఓ మహిళకు చెందిన తోపుడు బండిలో 92 విస్కీ క్వార్టర్ బాటిళ్లు స్వాధీనం చేసుకున్న సంఘటన గురువారం గచ్చిబౌలి (Gachibowli) పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళితే.. జేవీజీహిల్స్లో ఫుట్పాత్పై ఉన్న డబ్బాలో మద్యం అమ్మకాలు జరుగుతున్నట్లు స్థానికులు శేరిలింగంపల్లి (Serilingampally) సర్కిల్ ఉప వైద్యాధికారి శ్రీకాంత్కు ఫిర్యాదు చేశారు. దీంతో అక్కడికి వెళ్లిన ఆయన తనిఖీలు చేయగా 10 క్వార్టర్ బాటిల్స్ లభించాయి. వాటిని ధ్వంసం చేసి డబ్బాను తొలగించారు. రాజరాజేశ్వరీ కాలనీలోనూ ఇదే తరహాలో ఉదయం నుంచి మద్యం విక్రయాలు జరుగుతున్నట్లు సమాచారం అందడంతో సిబ్బందితో అక్కడికి వెళ్లిన ఆయన సోదా చేయగా, తోపుడు బండిలో ఏకంగా వివిధ కంపెనీలకు చెందిన 92 క్వార్టర్ బాటిళ్లు గుర్తించి నివ్వెరపోయారు. అంతే కాకుండా పక్కనే ఉన్న గుడిసెలో పలువురు మద్యం సేవిస్తున్నట్లు గుర్తించి డయల్ 100 (Dial 100), గచ్చిబౌలి పోలీసులకు సమాచారం అందించారు. మద్యం విక్రయిస్తున్న మహిళతో పాటు మద్యం బాటిళ్లను పోలీసులకు అప్పగించారు. బెల్ట్ షాప్ నిర్వహిస్తున్న మహిళపై కేసు నమోదు చేసినట్లు ఇన్స్పెక్టర్ హబీబుల్లాఖాన్ తెలిపారు. గత కొన్ని నెలలుగా ఉదయం 6 గంటల నుంచే మద్యం అమ్మకాలు జరుగుతుండటంతో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని స్థానికులు పేర్కొన్నారు.చదవండి: ఆ అవయవాన్ని పునః సృష్టించారు..! -
టార్గెట్ రూ.333 కోట్లు!.. 100 మంది యువతులతో సన్నిహితంగా..
గచ్చిబౌలి: ఎప్పటికైతే తాను రూ.333 కోట్లు సంపాదిస్తాడో అప్పటి నుంచి నేరాలు మానేయాలని భావించాడు బత్తుల ప్రభాకర్ అలియాస్ బిట్టూ. దీంతో పాటు తన జీవితంలో 100 మంది యువతులతో సన్నిహితంగా ఉండాలనీ లక్ష్యంగా నిర్దేశించుకున్నాడు. ఈ మేరకు కొన్నేళ్ల క్రితమే తన ఛాతీపై రెండు వైపులా పచ్చబొట్లు పొడిపించుకున్నాడు. శనివారం గచ్చిబౌలిలోని ప్రిజం పబ్ వద్ద పోలీసులపై కాల్పులు జరిపింది ఇతగాడే. సైబరాబాద్ సీసీఎస్ పోలీసుల విచారణలో అనేక కోణాలు వెలుగులోకి వస్తున్నాయి. విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారం వివరాలు ఇలా.. చదివింది ఎనిమిదో తరగతి.. పెద్ద పెద్ద కాలేజీలను టార్గెట్గా చేసుకుని చోరీలు చేసే బత్తుల ప్రభాకర్ చదివింది మాత్రం ఎనిమిదో తరగతే. ఏపీలోని చిత్తూరు జిల్లా ఇరికిపెంటకు చెందిన ఇతగాడు 7, 8 తరగతులు విజయవాడలో చదివాడు. తల్లిదండ్రులకు దూరంగా ఉంటూ 17 ఏళ్ల వయసు నుంచే చోరీల బాట పట్టాడు. దాదాపు 15 ఏళ్లుగా ఇంజినీరింగ్ కాలేజీలు, కార్పొరేట్ స్కూల్స్లో చోరీలు చేస్తూ మోస్ట్ వాంటెడ్ క్రిమినల్గా మారాడు. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, తమిళనాడు రాష్ట్రాల్లో కేసులున్న ఇతడికి బిట్టూ, రాహుల్ రెడ్డి, సర్వేశ్వర్ రెడ్డి, రాజు తదితర మారుపేర్లు ఉన్నాయి. స్నేహితులు, సన్నిహితంగా ఉండే యువతుల వద్ద, షాపింగ్కు వెళ్లినప్పడు మృదు స్వభావిగా ఉంటాడు. ఎక్కడా ఎవరితోనూ గొడవలు పడిన దాఖలాలు లేవని పోలీసులు చెబుతున్నారు. రూ.3 వేల చోరీతో మొదలుపెట్టి... బత్తుల ప్రభాకర్ ఛాతీ భాగంలో కుడి వైపు 3, ఎడమ వైపు 100 అంకెలు, మధ్యలో సిలువ టాటూలు ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. వీటిపై పోలీసులు అతగాడిని ప్రశ్నించారు. కొన్నేళ్ల క్రితం తన నేర జీవితం రూ.3 వేల నుంచి చోరీ మొదలైందని, అప్పట్లో ఒకే రోజు రూ.3 లక్షలు, మొత్తమ్మీద రూ.33 లక్షలు చోరీ చేయాలని లక్ష్యంగా నిర్దేశించుకుని ‘3’ టాటూ వేయించుకున్నానని చెప్పాడు. ప్రస్తుతం ఉన్న పరిస్థితుల నేపథ్యంలో రూ.333 కోట్ల సంపాదన లక్ష్యంగా చేసుకున్నానని బయటపెట్టాడు. అలాగే 100 మంది యువతులతో సన్నిహితంగా ఉండాలన్నది మరో లక్ష్యమని, విలాస వంతమైన జీవితం గడుపుతున్న తాను ఇప్పటికే 40 అలా ఉన్నట్లు చెప్పాడు. గేటెడ్ కమ్యూనిటీలో నివాసం.. అత్యంత విలాసవంతమైన జీవితం గడిపే ఇతగాడు గతంలో సాఫ్ట్వేర్ ఇంజినీర్ ముసుగులో ఆ రంగానికి చెందిన వారితో కలిసి మైండ్స్పేస్ సమీపంలోని ఫ్లాట్లో ఉన్నాడు. ప్రస్తుతం నార్సింగి పరిధిలో ఉన్న ఓ గేటెడ్ కమ్యూనిటీలో స్నేహితుల పేరిట ఫ్లాట్ తీసుకొని ఉంటూ ఒడిశాకు చెందిన ఓ యువతితో సహజీవనం చేస్తున్నాడు. కొద్ది రోజుల క్రితం ఆమె సొంత ఊరుకు వెళ్లింది. పోలీసులు నిందితుడి ఫ్లాట్ను తనిఖీ చేసినప్పుడు రూ.50 వేలు ఖరీదు చేసే మద్యం బాటిల్ లభించింది. ప్రతిరోజూ ఉదయం జిమ్కు వెళ్లడం, వీకెండ్స్లో పబ్స్లో జల్సాలు చేయడం ఇతడి నైజం. కేవలం హైఎండ్ కార్లు మాత్రమే వాడే ప్రభాకర్.. సెకండ్ హ్యాండ్ వాటిని స్నేహితుల పేరిట కొంటాడు. కొన్నాళ్లు వాడిన తర్వాత ఆ వాహనాన్ని ఆ స్నేహితుడికే వదిలేసి తన మకాం మార్చేస్తాడు. పోలీసులకు చిక్కకుండా ఉండటానికే ఇలాంటి జాగ్రత్తలు తీసుకున్నాడు. స్నేహితులకూ భారీగా ముట్టచెబుతూ... ఫ్లాట్లో కలిసి ఉండే క్రమంతో తనకు స్నేహితులుగా మారిన వారికి తన గతం తెలియకుండా జాగ్రత్తపడతాడు. అనుకోకుండా ఎవరికైనా తెలిస్తే వారికి భారీ మొత్తం ఇచ్చి నోరు మూయిస్తాడు. చోరీ చేసిన నగదును స్నేహితుల అకౌంట్లలో వేసి, వారి యూపీఐలు తన ఫోన్లో యాక్టివేట్ చేసుకుని విచ్చలవిడిగా ఖర్చు చేస్తాడు. జిమ్, పబ్స్తో పాటు గోల్ఫ్, బౌలింగ్ ఆటలు, సినిమాలు ఇతడి హాబీ. వీటిలో ఎక్కడికి వెళ్లినా తన ముఖం సీసీ కెమెరాల్లో రికార్డు కాకుండా కచ్చితంగా మాస్క్ ధరిస్తాడు. గచ్చిబౌలి కాల్పుల కేసు.. వెలుగులోకి కీలక విషయాలు -
గచ్చిబౌలి కాల్పుల కేసు.. వెలుగులోకి కీలక విషయాలు
సాక్షి, హైదరాబాద్: గచ్చిబౌలి కాల్పుల కేసులో కీలక విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. బత్తుల ప్రభాకర్ నుంచి మూడు తుపాకులను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. బీహార్ గ్యాంగ్ నుంచి తుపాకులు కొనుగోలు చేసినట్లు పోలీసులు గుర్తించారు. ప్రిజం పబ్బులో పోలీసులపై కాల్పులు జరిపి తప్పించుకునే ప్రయత్నం చేసిన ప్రభాకర్ నుంచి ఘటన స్థలంలోనే రెండు తుపాకులు స్వాధీనం చేసుకున్నారు.గచ్చిబౌలిలోని ప్రభాకర్ గదిలో తనిఖీలు చేయగా మరొక తుపాకీని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. మల్టీ నేషనల్ కంపెనీలో పనిచేస్తున్న స్నేహితుడి రూమ్లో బస చేసిన ప్రభాకర్.. వైజాగ్ జైలులో తనతో పాటు ఉన్న ఖైదీని చంపేందుకు ప్రభాకర్ తుపాకులు కొనుగోలు చేసినట్లు పోలీసులు నిర్థారించారు. జైలులో తనను చిత్రహింసలు పెట్టినందుకు తోటి ఖైదీని చంపేందుకు ప్రభాకర్ కుట్ర పన్నినట్లు సమాచారం.కాగా, కరడుగట్టిన నేరస్థుడు బత్తుల ప్రభాకర్ హైదరాబాద్ గచ్చిబౌలిలోని ప్రిజం పబ్ వద్ద పోలీసులపై కాల్పులకు తెగబడ్డాడు. ఈ కాల్పుల్లో మాదాపూర్ సీసీఎస్ హెడ్కానిస్టేబుల్ వెంకట్రెడ్డికి బుల్లెట్ గాయమైంది. ఏపీలోని చిత్తూరు జిల్లా సోముల గ్రామానికి చెందిన బత్తుల ప్రభాకర్.. ఏపీ, తెలంగాణలో అనేక దోపిడీలకు పాల్పడ్డాడు. అతడిపై రెండు రాష్ట్రాలలో 70కి పైగా కేసులు నమోదయ్యాయి.ఇదీ చదవండి: 13 ఏళ్లకు పట్టుబడ్డాడు!సైబరాబాద్, హైదరాబాద్, రాచకొండ కమిషనరేట్ల పరిధిలోనే 16 చోరీ కేసులున్నాయి. 2023 నుంచి పోలీసులకు చిక్కకుండా తప్పించుకు తిరుగుతున్నాడు. ప్రభాకర్ తరచు ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్లోని ప్రిజం పబ్కు వెళ్తున్నాడని గుర్తించిన పోలీసులు.. అతడిని పట్టుకునేందుకు స్కెచ్ వేశారు. మాదాపూర్ హెడ్ కానిస్టేబుళ్లు వెంకట్రెడ్డి, వీరస్వామి, ప్రదీప్రెడ్డి ప్రిజం పబ్ వద్ద కాపు కాశారు. ప్రభాకర్ పబ్ వద్దకు రాగానే నిర్బంధించేందుకు ప్రయత్నించాడు.దీంతో అతడు తనవద్ద ఉన్న దేశీయ తుపాకీతో రెండు రౌండ్లు కాల్పులు జరిపాడు. ఒక బుల్లెట్ వెంకట్రెడ్డి ఎడమ పాదంలోంచి దూసుకెళ్లింది. అయినా వెనుకడుగు వేయకుండా పబ్లోని బౌన్సర్ల సాయంతో మిగిలిన ఇద్దరు హెడ్కానిస్టేబుళ్లు ప్రభాకర్ను పట్టుకున్నారు. అతని వద్ద నుంచి రెండు తుపాకులు, 23 బుల్లెట్లను స్వా«దీనం చేసుకున్నట్లు డీసీపీ వినీత్ తెలిపారు. -
గచ్చిబౌలి ప్రిజం పబ్ లో కాల్పుల కలకలం
-
HYD: గచ్చిబౌలిలో కాల్పుల కలకలం
సాక్షి,హైదరాబాద్: నగరంలో ఐటీకి పేరుగాంచిన గచ్చిబౌలిలో శనివారం సాయంత్రం (ఫిబ్రవరి1) కాల్పలు కలకలం రేపాయి. ఇక్కడున్న ఒక పబ్కు వెళ్లిన పాత నేరస్తుడిని పట్టుకునేందుకు పోలీసులు పక్కా సమాచారంతో పబ్కు వెళ్లారు. పోలీసుల రాకను గమనించిన నేరస్తుడు తన వద్దనున్న తుపాకీతో పోలీసులపైకి కాల్పులు జరిపాడు. మొత్తం రెండు రౌండ్లు పాత నేరస్తుడు కాల్పులు జరిపాడు. ఈ కాల్పుల్లో పబ్లో పనిచేసే బౌన్సర్కు, కానిస్టేబుల్ వెంకట్రామ్రెడ్డికి గాయాలయ్యాయి. అయితే చివరకు ఆ పాత నేరస్తుడిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. గాయపడ్డ కానిస్టేబుల్ను ఆస్పత్రికి తరలించారు. కాల్పులు జరిపిన నేరస్తుడు పలు దొంగతనం కేసుల్లో నిందితుడిగా ఉన్నట్లు తెలుస్తోంది. -
Gachibowli: విదేశీ యువతులతో వ్యభిచారం
గచ్చిబౌలి: విదేశీ యువతులతో వ్యభిచారం నిర్వహిస్తున్న ముఠా గుట్టురట్టయ్యింది. మంగళవారం రాత్రి టీఎన్జీవోస్ కాలనీలోని ఓ ఇంట్లో గచ్చిబౌలి పోలీసులు, ఎస్ఓటీ పోలీసులు దాడి చేశారు. ఒక విటుడు, 9 మంది యువతులను అదుపులోకి తీసుకున్నారు. టాంజానియా, కజికిస్తాన్కు చెందిన యువతులతో వ్యభిచారం నిర్వహిస్తున్నట్లు విశ్వసనీయ సమాచారం అందడంతో పోలీసులు దాడులు చేశారు. నిర్వాహకులు పరారైనట్లు పోలీసులు తెలిపారు. కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. -
హైదరాబాద్ లో విదేశీ గంజాయి కలకలం
-
వేడి నీళ్లు మీద పడి బాలుడి మృతి
గచ్చిబౌలి: తల్లి స్నానం కోసం పెట్టుకున్న వేడి నీళ్ల బకెట్ను పట్టుకోవడంతో ప్రమాదవశాత్తు నీళ్లు మీదపడి తీవ్ర గాయాలపాలై చికిత్స పొందుతూ బాలుడు మృతి చెందిన సంఘటన రాయదుర్గం పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. ఇన్స్పెక్టర్ సీహెచ్ వెంకన్న తెలిపిన ప్రకారం వివరాలు ఇలా ఉన్నాయి. వికారాబాద్ జిల్లా దోమ మండలం గొడుగోనిపల్లికి చెందిన దంపతులు మైసం రాజు, సోనీ బతుకు దెరువు కోసం వచ్చి మణికొండలోని శివపురి కాలనీలో నివాసం ఉంటున్నారు. రాజు వాచ్మెన్గా పని చేస్తూనే కారు డ్రైవింగ్ చేస్తుంటాడు. ఈ నెల 6న సాయంత్రం 4.40 గంటల సమయంలో సోనీ స్నానం చేసేందుకు బకెట్లో హీటర్ పెట్టి నీళ్లను వేడి చేసింది. ఆమె కొడుకు ధీరజ్ (04) ఆడుకుంటూ బకెట్ను పట్టుకున్నాడు. బకెట్ కిందపడటతో నీళ్లన్నీ శరీరంపై పడి బాలుడికి 60 శాతం కాలిన గాయాలయ్యాయి. వెంటనే గమనించిన తల్లి హుటాహుటిని సమీపంలోని ఓ ప్రైవేట్ అస్పత్రికి తరలించింది. అక్కడి నుంచి నిలోఫర్కు వెళ్లగా ఉస్మానియా ఆస్పత్రికి పంపించారు. ఉస్మానియా ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ధీరజ్ శుక్రవారం రాత్రి 11 గంటలకు మృతి చెందాడు. వేడి నీళ్లు మీదపడి ఒక్కగానొక్క మృతి చెందడంతో తల్లిదండ్రులు గుండెలవిసేలా విలపించారు. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
గచ్చిబౌలిలో ఫిన్ స్విమ్మింగ్ 2024
గచ్చిబౌలి: ఆలిండియా ఫిన్ స్విమ్మింగ్ ఫెడరేషన్ కప్–2024 పోటీలను అట్టహాసంగా నిర్వహించారు. గచ్చిబౌలిలోని జీఎంసీ బాలయోగి స్టేడియంలోని స్విమ్మింగ్పూల్లో ఈ పోటీలను బాలురు, బాలికల విభాగాల్లో వేర్వేరుగా నిర్వహించారు. ఇందులో 50 మీటర్లు, 100, 200, 400 మీటర్లు, 800 మిడ్ రిలే పోటీలను నిర్వహించారు. ఈ పోటీలను అండర్ వాటర్ స్పోర్ట్స్ అసోసియేషన్ ఇండియా ప్రధాన కార్యదర్శి మయూర్పటేల్, యూఎస్ఏఐ చీఫ్ జనరల్ సెక్రెటరీ కుల్దీప్పాటిల్, యూఎస్ఎఫ్ఏటీ అధ్యక్షురాలు జ్యోతి, ప్రధాన కార్యదర్శి దినేషరాజోరియా ప్రారంభించారు. ఈ పోటీలను మొదటిసారి నిర్వహిస్తున్నామని, దక్షిణ భారతదేశంలో నిర్వహణకు అవకాశం కల్పించడానికి ప్రభుత్వ సహకారం మరువలేనిదని జ్యోతి అన్నారు. మూడు రోజులపాటు గచి్చ»ౌలి స్టేడియంలో నిర్వహించే ఈ పోటీలు 11తో ముగుస్తాయన్నారు. 17 రాష్ట్రాల నుంచి క్రీడాకారులు పాల్గొంటున్నారని, పోటీలో ప్రతిభ చాటిన వారికి సర్టిఫికెట్లు, మెడల్స్ అందిస్తామని తెలిపారు. -
గచ్చిబౌలి పోలీస్ స్టేషన్ దగ్గర బీఆర్ఎస్ నేతల ఆందోళన
-
ఇటీవలే గోవాకు వెళ్లిన శోభిత, సుదీర్
గచ్చిబౌలి: కన్నడ నటి శోభిత మృతదేహానికి సోమవారం ఉస్మానియా హాస్పిటల్లో పోస్టుమార్టం పూర్తి చేసి కుటుంబ సభ్యులకు అప్పగించారు. గచ్చిబౌలి పీఎస్ పరిధిలోని శ్రీరాంనగర్లో భర్త సు«దీర్ రెడ్డితో కలిసి నివాసం ఉంటున్న శోభిత ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడిన విషయం తెలిసిందే. ఆమె కుటుంబసభ్యులు గచ్చిబౌలి పీఎస్కు వచ్చి వివరాలు అడిగి తెలుసుకున్నారు. అనంతరం ఉస్మానియా ఆస్పత్రికి వెళ్లి పోస్టు మార్టం పూర్తయిన తర్వాత శోభిత మృతదేహాన్ని బెంగళూర్కు తీసుకెళ్లారు. శోభిత ఆత్మహత్యకు పాల్పడినట్లు పోస్టుమార్టంలో నిర్ధారణ అయినట్లు ఉస్మానియా వైద్యులు పేర్కొన్నట్లు పోలీసులు తెలిపారు. ఆత్మహత్య చేసుకున్న రోజు రాత్రి 10 గంటల సమయంలో శోభిత తన సోదరితో ఫోన్లో మాట్లాడిందని, తాము సంతోషంగా ఉన్నామని, కొద్ది రోజుల్లోనే ఇద్దరం కలిసి ఊరికి వస్తామని చెప్పినట్లు పోలీసులు తెలిపారు. కాగా ‘ఎవ్రీ థింగ్ ఫర్ఫెక్ట్, చావాలనుకుంటే డూఇట్’ అని శోభిత రూమ్లో నోట్ రాసి ఉందని ఇన్స్పెక్టర్ హభీబుల్లాఖాన్ తెలిపారు. ఆత్మహత్యకు గల కారణాలు వెల్లడి కాలేదని, శోభిత బంధువులు అనుమానాలు వ్యక్త చేయలేదని ఆయన పేర్కొన్నారు. భర్త అనుమానంతో డోర్ పగులగొట్టి లోపలికి వెళ్లి చూడగా శోభిత ఉరి వేసుకుని కనిపించిందని, ఆ సమయంలోనూ గదిలో భక్తి పాటలు ప్లే అవుతున్నట్లు తెలిసింది. ఇటీవలే గోవాకు వెళ్లారు కొద్ది రోజుల క్రితమే గోవాలో జరిగిన ఫిల్మ్ ఫెస్టివల్కు శోభిత, సుదీర్ వెళ్లినట్లు తెలిసింది. తిరిగి వచ్చిన తర్వాత కూడా భార్యాభర్తలు బాగానే ఉన్నారని ఇరుగు పొరుగు వారితో పాటు వారి కుటుంబ సభ్యులు పేర్కొనడం గమనార్హం. నటనకు అభ్యంతరం చెప్పలేదు: బుచ్చిరెడ్డి మ్యాట్రిమోని ద్వారా ఇరు కుటుంబాల అంగీకారంతోనే వివాహం చేశామని శోభిత మామ(భర్త తండ్రి) బుచ్చిరెడ్డి పేర్కొన్నారు. సినిమాలు, సీరియల్స్లో నటించేందుకు తాము ఎప్పడు అభ్యంతరం చెప్పలేదన్నారు. ఆమె ఎప్పుడు భగవంతుని ధ్యానంలో ఉండేదని, తమ ఇంట్లో కూతురి లాగా మెలిగిందని ఆయన పేర్కొన్నారు. కుటుంబ సభ్యురాలిని కోల్పోయామని, సుధీర్ రెడ్డి డిప్రెషన్లో ఉన్నాడన్నారు. శోభిత కుటుంబసభ్యుల కోరిక మేరకు బెంగళూర్లో అంత్యక్రియలు నిర్వహించనున్నట్లు తెలిపారు. -
సెల్ఫ్ డ్రైవ్ పేరిట ఘరానా మోసం
గచ్చిబౌలి: సెల్ఫ్ డ్రైవ్ పేరుతో కార్లు అద్దెకు తీసుకుని మరొకరి వద్ద కుదవపెట్టిన మహిళతో పాటు మరో ముగ్గురిని రాయదుర్గం పోలీసులు అరెస్ట్ చేశారు. సోమవారం గచ్చిబౌలిలోని మాదాపూర్ డీసీపీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో డీసీపీ డాక్టర్ వినీత్ వివరాలు వెల్లడించారు. గచ్చిబౌలి టెలికాంనగర్లో నివాసం ఉంటున్న జుపూడి ఉషా సెల్ఫ్ డ్రైవ్ కోసం కార్లు అద్దెకు ఇస్తే రోజుకు రూ.2 నుంచి రూ.5 వేల వరకు అద్దె చెల్లిస్తానని ప్రచారం చేసుకుంది. దీంతో పలువురి నుంచి కార్లు తీసుకున్న ఆమె డ్రైవర్ తుడుముల మల్లేష్తో కలిసి వాటిని బీదర్కు చెందిన సాగర్ పాటిల్, అనీల్ జమానే వద్ద తనఖా పెట్టి రూ.50 లక్షలు తీసుకుంది. ఆవే కార్లను సాగర్, అనీల్ బీదర్, బల్కీ జిల్లాల్లో ఇతర వ్యక్తుల వద్ద కుదువపెట్టి ఎక్కువ మొత్తంలో డబ్బులు తీసుకున్నారు. మూడు నెలలైనా అద్దె డబ్బులు ఇవ్వక పోవడంతో కార్ల యజమానులు ఉషాను నిలదీయగా ఇప్పుడు, అప్పుడు అంటూ కాలయాపన చేస్తుంది. అద్దె ఇవ్వక పోవడం, కార్ల ఆచూకీ తెలియకపోవడంతో ఆందోళనకు గురైన బాధితులు రాయదుర్గం పోలీసులను ఆశ్రయించారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టిన పోలీసులు జియో ట్యాగ్ను తొలగించి కార్లను కర్నాటకలోని బీదర్, బల్కీ జిల్లాలకు తరలించినట్లు గుర్తించారు. నిందితులను అదుపులోకి తీసుకుని విచారించగా వివరాలు వెల్లడించారు.దీంతో నిదితులు ఉషా, మల్లేష్, సాగర్, అనిల్ను అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించిన పోలీసులు వారి నుంచి రూ.2.5 కోట్ల విలువైన 21 వాహనాలను స్వా«దీనం చేసుకున్నారు. స్వా«దీనం చేసుకున్న వాహనాల్లో 4 మహీంద్రా థార్, 10 ఎర్టిగా, ఒక ఇన్నోవా క్రిస్టా, 3 స్విఫ్ట్ కార్లు, పది ఐ–10 , ఒక ఐ–20, ఒక వెన్యూ కార్లు ఉన్నాయి. సమావేశంలో మాదాపూర్ ఏడీసీపీ జయరాం, ఏసీపీ శ్రీకాంత్, రాయదుర్గం ఇన్స్పెక్టర్ వెంకన్న, డీఐ సతీష్, తదితరులు పాల్గొన్నారు. -
బుల్లితెర నటి శోభిత పోస్టుమార్టం పూర్తి.. వైద్యులు ఏమన్నారంటే?
కన్నడ బుల్లితెర నటి శోభిత మృతదేహానికి పోస్టుమార్టం పూర్తయింది. హైదరాబాద్లోని ఉస్మానియా ఆస్పత్రిలో ఆమె మృతదేహానికి పోస్టుమార్టం నిర్వహించారు. అనంతరం శోభిత కుటుంబ సభ్యులకు మృతదేహాన్ని పోలీసులు అప్పగించారు. ఆమె స్వస్థలం కర్ణాటక కావడంతో అక్కడికి తరలించనున్నారు. అయితే పోస్టుమార్టం నివేదికలో ఆమె మరణం ఆత్మహత్యగానే వైద్యులు నిర్ధారించారు. ఒంటిపై ఎలాంటి గాయాలు లేవని నివేదికలో వైద్యులు స్పష్టం చేశారు. ఇవాళ ఆమె అంత్యక్రియలు కర్ణాటకలోని స్వగ్రామంలో నిర్వహించనున్నారు. కాగా.. అంతకుముందు కన్నడ నటి శోభిత తాను నివాసముంటున్న ఇంట్లోనే ఆత్మహత్యకు పాల్పడింది. ఫ్యాన్కు ఉరేసుకుని సూసైడ్ చేసుకుంది. కన్నడలో పలు సీరియల్స్తో పాటు సినిమాల్లోనూ నటించింది. అయితే గతేడాది హైదరాబాద్ తుక్కుగూడకు చెందిన సుధీర్రెడ్డికి అనే సాఫ్ట్వేర్ ఇంజినీర్ను పెళ్లాడింది. బెంగళూరులో సాఫ్ట్వేర్ ఇంజినీర్గా పనిచేస్తున్న సుధీర్.. పెళ్లి తర్వాత హైదరాబాద్కు షిఫ్ట్ అయ్యాడు. ప్రస్తుతం గచ్చిబౌలి శ్రీరాంనగర్ కాలనీలో ఉన్న సీ బ్లాక్లో ఆమె నివాసముంటున్నారు. అయితే శోభిత పెళ్లి తర్వాతే సినిమాలకు, సిరీయల్స్కు దూరమైంది. సూసైడ్ నోట్ స్వాధీనం..శోభిత ఆత్మహత్యకేసులో సూసైడ్ నోట్ను గచ్చిబౌలి పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. సూసైడ్ చేసుకోవాలంటే యు కెన్ డూ ఇట్ అంటూ ఆ లేఖలో ఆమె పేర్కొంది. అయితే, ఎవరిని ఉద్దేశించి శోభిత అలా రాసిందో తెలుపలేదు. ఈ కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. డిప్రెషన్ వల్లే శోభిత మృతికి కారణమై ఉంటుందా అని కూడా పోలీసులు అనుమానిస్తున్నారు. సీరియల్స్, మూవీస్కి దూరంగా ఉండటమా..? తన భర్త సుధీర్ రెడ్డితో ఏమైనా గొడవలు ఉన్నాయా..? అనే వివిధ కోణాల్లో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. -
నటి శోభిత ఆత్మహత్యకేసులో సూసైడ్ నోటు స్వాధీనం
కన్నడ సినీ, టీవీ నటి నటి శోభిత శివన్న (32) అనుమానాస్పద స్థితిలో మృతిచెందడంతో పోలీసుల విచారణ కొనసాగుతుంది. హైదరాబాద్లోని గచ్చిబౌలి శ్రీరాంనగర్ కాలనీలో ఉన్న సీ బ్లాక్లో తన భర్తతో ఆమె ఉంటున్నారు. డిసెంబర్ 1న తన ఇంట్లోనే ఫ్యాన్కు ఉరేసుకుని ఆత్మహత్య చేసుకోవడంతో అందరూ షాక్ అయ్యారు. అయితే, తాజాగా ఆమె రాసిన ఒక నోట్ బయట పడింది.శోభిత ఆత్మహత్యకేసులో సూసైడ్ నోట్ను గచ్చిబౌలి పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. సూసైడ్ చేసుకోవాలంటే యు కెన్ డూ ఇట్ అంటూ ఆ లేఖలో ఆమె పేర్కొంది. అయితే, ఎవరిని ఉద్దేశించి శోభిత అలా రాసిందో తెలుపలేదు. ఈ కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.డిప్రెషన్ వల్లే శోభిత మృతికి కారణమై ఉంటుందా అని కూడా పోలీసులు అనుమానిస్తున్నారు. సీరియల్స్, మూవీస్కి దూరంగా ఉండటమా..? తన భర్త సుధీర్ రెడ్డితో ఏమైనా గొడవలు ఉన్నాయా..? అనే వివిధ కోణాల్లో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.గచ్చిబౌలి ఇన్స్పెక్టర్ హబీబుల్లాఖాన్ తెలిపిన వివరాల ప్రకారం.. హైదరాబాద్ తుక్కుగూడకు చెందిన సుధీర్రెడ్డికి మ్యాట్రిమోని ద్వారా శోభిత పరిచయం ఏర్పడింది. ఏడాదిన్నర క్రితం పెద్దల అంగీకారంతో వారు పెళ్లి చేసుకున్నారు. బెంగళూరులో సాఫ్ట్వేర్ ఇంజినీర్గా పనిచేస్తున్న సుధీర్.. పెళ్లి తర్వాత హైదరాబాద్కు షిఫ్ట్ అయ్యాడు. ఆపై పెళ్లి తర్వాత ఆమె సినిమాలకు, సిరీయల్స్కు దూరమైంది. శనివారం రాత్రి భర్తతో కలిసి భోజనం చేసిన ఆమె నిద్రపోయేందుకు ఓ గదిలోకి వెళ్లింది. అయితే, సుధీర్ మరో గదిలోకి వెళ్లి డ్యూటీ(వర్క్ ఫ్రమ్ హోం) చేస్తున్నాడు. ఉదయం 10 గంటల అయినా ఆమె డోర్ తియకపోవడంతో శోభిత గది తలుపును పనిమనిషి తట్టింది. ఆమె ఎంతసేపటికీ డోర్ ఓపెన్ చేయకపోవడంతో.. సుధీర్రెడ్డికి విషయం చెప్పి తలుపులు విరగ్గొట్టారు. శోభిత ఫ్యాన్కు ఉరివేసుకొని వేలాడుతూ కనిపించింది.' పోలీసులు తెలిపారు. విచారణ తర్వాత శోభిత మరణానికి కారణాలు తెలుపుతామని ఇన్స్పెక్టర్ తెలిపారు. -
గచ్చిబౌలిలో గంజాయి కలకలం
-
సిద్దిక్ నగర్ లో ఒరిగిపోయిన భవనాన్ని కూల్చేస్తున్న GHMC అధికారులు
-
5 అంతస్థుల భవనం కూల్చేందుకు హైడ్రా రెడీ..
-
ఉద్రిక్తతల నడుమే.. ఒరిగిన బిల్డింగ్ కూల్చివేత ప్రారంభం
హైదరాబాద్, సాక్షి: గచ్చిబౌలి సిద్ధిఖ్ నగర్లో గత రాత్రి ప్రమాదకర స్థాయిలో ఒరిగిపోయిన భవనాన్ని కూల్చివేత ప్రారంభమైంది. బుధవారం ఉదయమే హైడ్రాలిక్ ‘బాహుబలి’క్రేన్తో అక్కడికి చేరుకున్న జీహెచ్ఎంసీ అధికారులు.. ఉద్రిక్త వాతావరణంలోనే తమ పనిని ప్రారంభించారు. సదరు భవనం ముందు కేవలం పదిఫీట్ల రోడ్డు మాత్రమే ఉండడంతో.. చుట్టుపక్కల మరే నష్టం జరగకుండా కూల్చివేస్తున్నారు.ఈ ఉదయం ఆ భవనం పక్కన ఇళ్లను ఖాళీ చేయించిన అధికారులు.. బిల్డింగ్ కుంగడానికి ప్రధాన కారణమైన పిల్లర్లను పూడ్చేశారు. డీఆర్ఎఫ్ సిబ్బంది కూల్చివేతలో పాల్గొంటున్నారు. పోలీసులు, ఫైర్ సిబ్బందితో పాటు ఆంబులెన్స్ను అందుబాటులో ఉంచారు. గుంతలు తవ్విన భవన యాజమానిపై కేసు నమోదు చేసినట్లు సమాచారం. ఇక..ఎలాంటి సెట్ బ్యాక్ లేకుండా గుంతలు తవ్వడం వల్లే పక్కన ఉన్న భవనం కుంగిందని, అలాగే కుంగిన ఆ భవనాన్ని కూడా నిబంధనలకు లోబడి కట్టలేదని, నాణ్యతా ప్రమాణాలు పాటించలేదని అధికారులు చెబుతున్నారు. మరోవైపు ఒరిగిన బిల్డింగ్ యాజమాని మాత్రం తమ వెర్షన్ వినిపిస్తున్నారు. ‘‘ముందస్తు సమాచారం ఇవ్వకుండానే తవ్వకాలు చేపట్టారు. సెల్లార్ గుంతలు తవ్వడం వల్లే మా బిల్డింగ్ కుంగిపోయింది. మాకు ఆ ఓనర్తో నష్టపరిహారం ఇప్పించాలి’’ అని డిమాండ్ చేస్తున్నారు.వసుకుల లక్ష్మణ్ అనే పేరిట ఈ ప్లాట్ ఉంది. జీప్లస్ ఫోర్లో రెండు పోర్షన్ల చొప్పున నాలుగు ఫ్లోర్లు నిర్మాణం చేశారు. ఆ భవనంలో మొత్తం 48 మంది అద్దెకు ఉంటున్నారు. చుట్టుపక్కల ఐటీ కారిడార్లో పని చేసేవాళ్లంతా. మంగళవారం సాయంత్రం 7 గంటల సమయంలోనే గోడ కూలినట్లు శబ్దం వచ్చినా.. ఎవరూ పట్టించుకోలేదు. రాత్రి 8.30 గంటల సమయంలో పెద్దగా శబ్దం వచ్చి భవనం ఒరిగిపోతోందని అరుపులు వినిపించడంతో అందరూ భయాందోళనలకు గురయ్యారు. ప్రాణాలు అరచేతిలో పట్టుకొని ఆదరాబాదరాగా కిందకు వచ్చేశారు. ఇంతలోనే మూడో అంతస్తులో ఉండే సాదిక్ హుస్సేన్ కిందికి దూకగా అతనికి తీవ్ర గాయాలయ్యాయి. -
తప్పిన పెను ప్రమాదం
-
పక్కకు ఒరిగిన భవనం
గచ్చిబౌలి (హైదరాబాద్): రాజధాని నగరంలోని మాదాపూర్ ఐటీ కారిడార్కు చెంతనే ఉన్న సిద్దిఖీనగర్లో నాలుగు అంతస్తుల భవనం పక్కకు ఒరిగిన ఘటన కలకలం రేపింది. వసుకుల లక్ష్మణ్ అనే వ్యక్తి ప్లాట్ నం. 1639లో 70 గజాల స్థలంలో జీప్లస్ ఫోర్ భవనాన్ని నిర్మిచారు. ఫ్లోర్కు రెండు పోర్షన్ల చొప్పున నాలుగు ఫ్లోర్లు నిర్మాణం చేశారు. ఆ భవనంలో మొత్తం 48 మంది అద్దెకు ఉంటున్నారు. వారంతా చెంతనే ఉండే ఐటీ కంపెనీల్లో హౌజ్కీపింగ్ పనులు చేస్తూ జీవనం సాగిస్తున్నారు. మంగళవారం సాయంత్రం 7 గంటల సమయంలో గోడ కూలినట్లు శబ్దం వచి్చనా ఎవరూ పట్టించుకోలేదు. కానీ రాత్రి 8.30 గంటల సమయంలో పెద్దగా శబ్దం వచ్చి భవనం ఒరిగిపోతోందని అరుపులు వినిపించడంతో అందరూ భయాందోళనలకు గురయ్యారు. ప్రాణాలు అరచేతిలో పట్టుకొని ఆదరాబాదరాగా కిందకు వచ్చేశారు. ఇంతలోనే మూడో అంతస్తులో ఉండే సాదిక్ హుస్సేన్ కిందికి దూకగా అతనికి తీవ్ర గాయాలయ్యాయి. ఈలోగా అందరూ కిందకు వచ్చేయడంతో అంతా ఊపిరిపీల్చుకున్నారు. ఎలాంటి అనుమతులు లేకుండానే భవనం నిర్మించినట్లు తెలుస్తోంది. పక్క స్థలంలో గుంతలు తీయడంతోనేనా.. ఈ భవనం పక్కనే ఉండే 1605, 1638 ప్లాట్లను కలిపి భవనం నిర్మించేందుకు పిల్లర్లు వేయడానికి గుంతలు తవ్వారు. వీటితో భవనానికి ఇబ్బంది వస్తుందని ఈ భవన యజమాని వారిని హెచ్చరించారు. అయినా వారు వినలేదు. దీనివల్లే ఈ భవనం పరిస్థితి ఇలా మారిందని కొందరు అంటున్నారు. ఘటనా స్థలాన్ని జీహెచ్ఎంసీ వెస్ట్జోన్ జోనల్ కమిషనర్ ఉపేందర్రెడ్డి, శేరిలింగంపల్లి టౌన్ప్లానింగ్ ఏసీపీ వెంకటరమణ, మాదాపూర్ ఏసీపీ శ్రీకాంత్, డీఆర్ఎఫ్ సిబ్బంది పరిశీలించారు.పక్కకు ఒరిగిన భవనం చుట్టూ ఉండే పది భవనాల్లో నివాసం ఉండేవారిని ముందు జాగ్రత్త చర్యగా ఖాళీ చేయించి వేరేచోటికి తరలించారు. ఈ భవనం ముందు కేవలం పదిఫీట్ల రోడ్డు మాత్రమే ఉంది. భవనాన్ని ఇంజనీర్లు పరిశీలించి నాణ్యతను నిర్ణయిస్తారని, వారి నివేదిక ఆధారంగా ఒరిగిన భవనాన్ని తొలగిస్తామని ఉపేందర్రెడ్డి వెల్లడించారు. అలాగే ఈ భవనం వెనుక లోతైన గుంతలు తీసిన బిల్డర్పైనా చర్యలు తీసుకుంటామని చెప్పారు. భవనం విరిగిందని అరుపులు వినిపించడంతో వచ్చేశా.. ‘మేము మొదటి అంతస్తులో ఉంటున్నాం. రాత్రి 8.30 గంటల సమయంలో శబ్దం వచ్చింది. కొద్దిసేపటికే ఇంట్లోని సామాన్లు కిందపడిపోవడం ప్రారంభమైంది. అదే సమయంలో భవనం విరిగిందని అరుపులు వినిపించడంతో వంట చేస్తున్న స్టవ్ ఆర్పకుండానే భయంతో కిందికి వచ్చేశా’ అని జహారుల్ చెప్పారు. -
PKL 11: దుమ్ములేపిన టైటాన్స్.. ఉత్కంఠ పోరులో ఆఖరి నిమిషంలో గెలుపు
సాక్షి, హైదరాబాద్: ప్రొ కబడ్డీ లీగ్(PKL) పదకొండో సీజన్లో భాగంగా.. సొంతగడ్డపై తమ చివరి మ్యాచ్లో తెలుగు టైటాన్స్ జట్టు అదరగొట్టింది. టేబుల్ టాపర్, డిఫెండింగ్ చాంపియన్ పుణెరి పల్టాన్కు ఊహించని షాకిచ్చింది. ఆఖరి వరకు ఉత్కంఠగా సాగిన పోరులో ఒక్క పాయింట్ తేడాతో విజయం సాధించింది. ఆట ఆఖరి నిమిషాల్లో విజయ్ మాలిక్ ప్రతిభతో పుణెరికి చెక్ పెట్టి వరుసగా నాలుగో గెలుపు నమోదు చేసింది.కాగా గచ్చిబౌలి ఇండోర్ స్టేడియం వేదికగా శనివారం రాత్రి జరిగిన లీగ్ మ్యాచ్లో తెలుగు టైటాన్స్ 34–33 తేడాతో పుణెరిని ఓడించింది. టైటాన్స్ జట్టులో విజయ్ 13 పాయింట్లతో టాప్ స్కోరర్గా నిలవగా.. కెప్టెన్ పవన్ సెహ్రావత్ 12 పాయింట్లతో మరో సూపర్ టెన్ సాధించాడు.ఇక పుణెరి జట్టులో పంకజ్ మోహితే 9 పాయింట్లతో సత్తా చాటగా.. అతడికి తోడుగా అజిత్ కుమార్ ఆరు,మోహిత్ గోయత్ ఐదు పాయింట్లతో రాణించారు. అయినప్పటికీ ఆఖరికి ఓటమి నుంచి పుణెరి తప్పించుకోలేకపోయింది.ఆధిపత్యం చేతులు మారగాకాగా ఆట ఆరంభంలోనే తెలుగు టైటాన్స్ అదరగొట్టింది. కెప్టెన్ పవన్ సెహ్రావత్ వరుస రెయిడ్ పాయింట్లకు తోడు డిఫెండర్లు కూడా రాణించారు. ఇక తన మూడు రెయిడ్స్ లో పవన్ నాలుగు పాయింట్లు రాబట్టగా.. టైటాన్స్ 5–0 ఆధిక్యంతో ఆటలో ఆధిపత్యం కనబరిచింది. ఈ క్రమంలో పుణెరి జట్టులో ఇద్దరు ఆటగాళ్లే మిగిలిపోవడంతో ఆ జట్టు ఆలౌట్ ప్రమాదం ముంగిట నిలిచింది.ఇలాంటి దశలో పంకజ్ బోనస్ పాయింట్తో పుణెరి ఖాతా తెరిచాడు. పవన్ మరో టచ్ పాయింట్ట రాబట్టగా.. పుణెరి కోర్టులో పంకజ్ ఒక్కడే మిగిలాడు. తీవ్ర ఒత్తిడిలో కూతకు వెళ్లిన పంకజ్ బోనస్, సూపర్ రెయిడ్తో మూడు పాయింట్లతో జట్టును ఆదుకున్నాడు. ఆ వెంటనే పవన్ను సూపర్ ట్యాకిల్ చేసిన పుణెరి 6–6తో స్కోరు సమం చేసింది.తొలి అర్ధభాగం 20–20తో సమంగా అస్లాం, పంకజ్ చెరో పాయింట్ రాబట్టగా.. కోర్టులో మిగిలిన విజయ్ను ట్యాకిల్ చేసిన పుణెరి డిఫెండర్లు తెలుగు టైటాన్స్ను ఆలౌట్ చేశారు. దాంతో పుణెరి 13–9తో ఆధిక్యంలోకి వెళ్లింది. జట్టు మొత్తం కోర్టుపైకి వచ్చిన తర్వాత టైటాన్స్ తిరిగి పుంజుకుంది. పవన్ తన జోరు కొనసాగిస్తూ సూపర్ టెన్ పూర్తి చేసుకున్నాడు.మరో రెయిడర్ విజయ్ మాలిక్ కూడా ఆకట్టుకోగా.. డిఫెన్స్ విభాగం కూడా మెరుగవ్వడంతో పుణెరిని ఆలౌట్ చేసి ప్రతీకారం తీర్చుకున్న తెలుగు జట్టు 20–18తో తిరిగి ఆధిక్యం సాధించింది. కానీ, విరామం ముంగిట పవన్ ప్రత్యర్థి డిఫెండర్లకు దొరికిపోవడంతో తొలి అర్ధభాగం 20–20తో సమంగా ముగిసింది.ఆఖరికి టైటాన్స్ పైచేయిరెండో అర్ధభాగంలో ఇరు జట్లు నువ్వా నేనా అన్నట్టు పోరాడాయి. ఇరు జట్లూ చెరో పాయింట్ నెగ్గుతూ ముందుకెళ్లడంతో ఆట సమంగా సాగింది. విరామం తర్వాత పది నిమిషాల్లో చెరో నాలుగు పాయింట్లు మాత్రమే రాబట్టాయి. అటు టైటాన్స్, ఇటు పల్టాన్ ఏ మాత్రం తప్పిదానికి తావివ్వకుండా ఆడే ప్రయత్నం చేశాయి.ఇరు జట్ల డిఫెన్స్ బలంగా ఉండటంతో ఎక్కువగా ఎమ్టీ రెయిడ్స్ వచ్చాయి. టైటాన్స్ ఒక్కో పాయింట్ ఆధిక్యంతో ముందుకెళ్లే ప్రయత్నం చేసినా పుణెరి వెంటనే స్కోరు సమం చేయడంతో ఆట ఉత్కంఠగా సాగింది. అయితే రెండో భాగంలో పవన్ సెహ్రావత్ వేగం తగ్గింది. విజయ్ సూపర్ టెన్ పూర్తి చేసుకున్నా.. టైటాన్స్ కోర్టులో తక్కువ మంది ఉండటంతో ఆతిథ్య జట్టుపై ఒత్తిడి పెరిగింది. ఓ దశలో 31–29తో ఆధిక్యంలో ఉన్న టైటాన్స్ మరో రెండు నిమిషాల్లో ఆట ముగుస్తుందనగా ఆలౌట్ అయింది. దాంతో పుణెరి 33–32తో ఒక పాయింట్ ఆధిక్యంలోకి వచ్చింది. చివరి నిమిషంలో విజయ్ ఒక రెయిడ్ పాయింట్తో పాటు అజిత్ కుమార్ను ట్యాకిల్ చేయడంతో టైటాన్స్ ఒక్క పాయింట్ తేడాతో ఉత్కంఠ విజయం అందుకుంది. -
ఉత్సవ్ దీక్షిత్ అరెస్టు
బంజారాహిల్స్: రోడ్డు ప్రమాదానికి కారకుడైన స్టాండప్ కమెడియన్ ఉత్సవ్ దీక్షిత్ (33)ను ఆదివారం బంజారాహిల్స్ పోలీసులు అరెస్టు చేసి రిమాండ్కు తరలించారు. పోలీసులు చెప్పిన వివరాల ప్రకారం.. బంజారాహిల్స్ రోడ్డునంబర్–6లో నివసించే ఉత్సవ్ దీక్షిత్ గత నెల 31వ తేదీ అర్ధరాత్రి తన భార్యతో గొడవపడి పోర్షే కారులో బయటకు వచ్చి రాత్రంతా నగరంలో చక్కర్లు కొట్టాడు. కారులో మితిమీరిన వేగంతో బంజారాహిల్స్, జూబ్లీహిల్స్, గచ్చిబౌలి, మణికొండ ప్రాంతాల్లో తిరిగాడు. 1వ తేదీ తెల్లవారుజామున 5.45 గంటల ప్రాంతంలో తిరిగి ఇంటికి వెళ్లే క్రమంలో బంజారాహిల్స్ రోడ్డు నంబర్–12 నుంచి వెళ్తుండగా బసవతారకం కేన్సర్ ఆస్పత్రి సమీపంలో కారు అదుపుతప్పి స్టీరింగ్ లాక్ కావడంతో డివైడర్ను ఢీకొట్టి కేబీఆర్ పార్కు ఫెన్సింగ్ను దాటుకుని చెట్టు పైకి వెళ్లి కిందపడింది. స్వల్ప గాయాలతో ఉత్సవ్ బయటపడి పారిపోయాడు. కారు ముందు భాగం నుజ్జునుజ్జయ్యింది. నిందితుడిపై ఎంవీ యాక్ట్ కింద కేసు నమోదు చేసుకున్న పోలీసులు డ్రైవింగ్ లైసెన్స్ను సీజ్ చేసి రద్దు చేయాల్సిందిగా ఆర్డీఓకు లేఖ రాశారు. పోలీసుల విచారణలో నిర్లక్ష్యంగా డ్రైవింగ్ చేయడంతోనే కారు అదుపు తప్పినట్లు తేలింది. కాగా.. ఉత్సవ్ దీక్షిత్ స్టాండప్ కమెడియన్గా సుపరిచితుడు. పలు కార్యక్రమాల్లో కమెడియన్గా గుర్తింపు పొందాడు. ప్రేమ వివాహం చేసుకున్న ఉత్సవ్ దీక్షిత్ ఇంట్లో భార్యతో గొడవ పడి ఆ కోపాన్ని కారు మీద చూపించినట్లుగా నిర్ధారణ అయింది. బంజారాహిల్స్ పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు. -
PKL 11: యూ ముంబా మెరుపు విజయం.. మాజీ చాంపియన్కు షాక్
సాక్షి, హైదరాబాద్: ప్రొ కబడ్డీ లీగ్ పదకొండో సీజన్లో యూ ముంబా రెండో విజయం నమోదు చేసింది. జైపూర్ పింక్ పాంథర్స్పై 39-37తో గెలుపొందింది. గచ్చిబౌలిలోని జిఎంసీ బాలయోగి ఇండోర్ స్టేడియంలో గురువారం మాజీ చాంపియన్లు యు ముంబా- జైపూర్ పింక్ పాంథర్స్ తలపడ్డాయి.ఈ ఆద్యంతం హోరాహోరీగా సాగిన ఈ మ్యాచ్లో యూ ముంబా రెయిడర్ అజిత్ చౌహాన్ (14 పాయింట్లు) సూపర్ టెన్ షోతో అదరగొట్టాడు. మరోవైపు.. పింక్ పాంథర్స్ తరఫున నీరజ్ నర్వాల్ (12 పాయింట్లు) సూపర్ టెన్ ప్రదర్శనతో ఆకట్టుకున్నాడు. అయితే, ఆట తొలి పది నిమిషాల వరకు ఏ జట్టుకు స్పష్టమైన ఆధిక్యం లభించలేదు.ఫస్టాఫ్ చివర్లో యూ ముంబా ముందంజఇటు జైపూర్, అటు యూ ముంబా రెయిడర్లు, డిఫెండర్లు వరుసగా పాయింట్లు సాధించారు. ఆట మొదలైన పది నిమిషాల అనంతరం 9-9తో ఇరు జట్లు సమంగా నిలిచాయి. అయితే, ఫస్టాఫ్ చివర్లో యూ ముంబా ముందంజ వేసింది. జైపూర్ పింక్ పాంథర్స్ను ఆలౌట్ చేసి విలువైన పాయింట్లు ఖాతాలో వేసుకుంది.ప్రథమార్థం ముగిసే సరికి యూ ముంబా 19-16తో మూడు పాయింట్ల ఆధిక్యంలోకి వెళ్లింది. కాగా.. రెయిడింగ్లో ఇరు జట్లు పదేసి పాయింట్లు సాధించగా.. ట్యాకిల్స్లో యూ ముంబా ఐదు, జైపూర్ ఆరు పాయింట్లు ఖాతాలో వేసుకున్నాయి. కానీ అదనపు పాయింట్లు యూ ముంబాను ఆధిక్యంలో నిలబెట్టాయి.ద్వితీయార్థం మరింత ఉత్కంఠఇక ఇరుజట్ల మధ్య ద్వితీయార్థం ఆట మరింత ఉత్కంఠ రేపింది. యూ ముంబా ముందంజలో కొనసాగినా.. జైపూర్ పింక్ పాంథర్స్ పట్టు వదల్లేదు. ఆఖరు వరకు యూ ముంబాను తిప్పలు పెట్టింది. మరో మూడు నిమిషాల ఆట మిగిలి ఉండగా నీరజ్ నర్వాల్ సూపర్ రెయిడ్తో 32-32తో జైపూర్ పింక్ పాంథర్స్.. యూ ముంబా స్కోరును సమం చేసింది.కానీ ఆ తర్వాతి రెయిడ్లోనే రోహిత్ రాఘవ్ సూపర్ రెయిడ్తో మూడు పాయింట్లు తీసుకొచ్చాడు. దీంతో యూ ముంబా మళ్లీ ఆధిక్యంలోకి దూసుకెళ్లింది. ఆఖరు వరకు ఆధిక్యం నిలుపుకున్న యూ ముంబా మెరుపు విజయం సాధించింది. ఇదిలా ఉంటే.. ఈ సీజన్లో ఇప్పటి వరకు ఐదు మ్యాచ్లు ఆడిన జైపూర్కు ఇది రెండో ఓటమి.చదవండి: హర్యానా స్టీలర్స్ హ్యాట్రిక్ విజయం -
PKL 11: తమిళ్ తలైవాస్ దూకుడు.. గుజరాత్ చిత్తు
సాక్షి, హైదరాబాద్: గుజరాత్ జెయింట్స్పై తమిళ్ తలైవాస్ ఘన విజయం సాధించింది. ప్రత్యర్థిని ఏకంగా 44-25తో చిత్తు చేసింది. తద్వారా ఏకంగా 19 పాయింట్ల భారీ తేడాతో గుజరాత్పై తమిళ్ తలైవాస్ గెలుపొందింది. సీజన్లో మూడో విజయం సాధించి పాయింట్ల పట్టికలో అగ్ర స్థానానికి ఎగబాకింది. మరోవైపు..ఈ సీజన్లోనాలుగు మ్యాచ్లు ఆడిన గుజరాత్ జెయింట్స్కు ఇది మూడో పరాజయం.కాగా గచ్చిబౌలిలోని జిఎంసీ బాలయోగి ఇండోర్ స్టేడియంలో బుధవారం జరిగిన ప్రొ కబడ్డీ లీగ్ 11వ సీజన్ లీగ్ దశ మ్యాచ్లో తమిళ్ తలైవాస్.. గుజరాత్తో తలపడింది అదరగొట్టింది. తలైవాస్ స్టార్ రెయిడర్ నరేందర్ 20 సార్లు కూతకెళ్లి 15 పాయింట్లు సాధించగా.. సచిన్ (5 పాయింట్లు), డిఫెండర్ నితేశ్ కుమార్ (4 పాయింట్లు), ఆమీర్ ( 4 పాయింట్లు) రాణించారు. గుజరాత్ జెయింట్స్ ఆటగాళ్లలో గుమన్ సింగ్ ఏడు పాయింట్లు సాధించగా, రాకేశ్ మూడు పాయింట్లతో మెరిశాడు.ఆకట్టుకున్న తలైవాస్..మ్యాచ్ప్రథమార్థం తొలి పది నిమిషాల్లో ఆధిపత్యం కోసం ఇరు జట్లు గట్టిగా పోటీపడ్డాయి. అయితే, 11-9తో తమిళ్ తలైవాస్ పైచేయి సాధించింది. కానీ గుజరాత్ జెయింట్స్ రెట్టించిన ఉత్సాహంతో పోరాడింది. డిఫెన్స్లో తలైవాస్తో సమవుజ్జీగా నిలిచినా.. రెయిడింగ్లో జెయింట్స్ వెనుకంజ వేసింది. తలైవాస్ స్టార్ రెయిడర్ నరేందర్, సచిన్ మెరువగా.. గుజరాత్ జెయింట్స్ రెయిడర్లలో గుమన్ సింగ్ మాత్రమే మెప్పించాడు. దీంతో ప్రథమార్థం ఆట ముగిసేసరికి తమిళ్ తలైవాస్ 18-14తో నాలుగు పాయింట్ల ఆధిక్యం దక్కించుకుంది.తలైవాస్ దూకుడు..విరామం అనంతరం తమిళ్ తలైవాస్ దూకుడు పెంచింది. తొలి 20 నిమిషాల్లో సాధించిన ఆధిక్యాన్ని.. ద్వితీయార్థంలో తొలి పది నిమిషాల్లోనే సొంతం చేసుకుంది. ప్రథమార్థంలో ఆలౌట్ కాకుండా జాగ్రత్త పడిన గుజరాత్ జెయింట్స్ సెకండ్ హాఫ్లో చేతులెత్తేసింది.జెయింట్స్ కోర్టు ఖాళీ చేసిన తలైవాస్ విలువైన ఆలౌట్ పాయింట్లను ఖాతాలో వేసుకుంది. ఆఖరు నిమిషంలో గుజరాత్ జెయింట్స్ను మరోసారి ఆలౌట్ చేసిన తమిళ్ తలైవాస్ ఏకపక్ష ప్రదర్శన చేసింది. చివరి 20 నిమిషాల ఆటలో తమిళ్ తలైవాస్ 26 పాయింట్లు సాధించగా, గుజరాత్ జెయింట్స్ కేవలం 11 పాయింట్లే సొంతం చేసుకుంది. -
ఐటీ కారిడార్లో.. రెడ్ హార్ట్ ట్రాఫిక్ సిగ్నల్
గచ్చిబౌలి: గుండెను పదిలంగా ఉంచుకుంటే పది కాలాల పాటు ఆరోగ్యంగా ఉండవచ్చనే నినాదంతో ప్రధాన కూడళ్లలో రెడ్ హార్ట్ సిగ్నల్ ఏర్పాటు చేశారు. స్టార్ హాస్పిటల్ సైబరాబాద్ ట్రాఫిక్ పోలీసులతో కలిసి ప్రధాన కూడళ్లలో రెడ్ సిగ్నల్కు బదులు రెడ్హార్ట్ సింబల్ ఏర్పాటు చేశారు. హృద్రోగాలపై వాహనదారులకు మరింత అవగాహన కలి్పంచేందుకు తమ వంతు ప్రయత్నంగా వీటిని ఏర్పాటు చేశారు. వయసుతో నిమిత్తం లేకుండా ఎంతో మంది గుండె సంబంధిత వ్యాధులతో తీవ్ర ఇబ్బందులకు గురవుతున్న విషయం తెలిసిందే. ఐటీ కారిడార్లోని రెడ్ సిగ్నల్ వచి్చనప్పుడు హార్ట్ సింబల్ కనిపిస్తోంది. దీంతో వాహనదారులు గుండె ఆరోగ్యం గురించి ఆలోచించే వీలుంటుంది. గచి్చ»ౌలి ట్రాఫిక్ డివిజన్ పరిధిలోని గచి్చ»ౌలి, మాదాపూర్, రాయదుర్గం, నార్సింగి ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ల పరిధిలోని ప్రధాన కూడళ్లలో రెడ్ సిగ్నల్కు బదులు హార్ట్ సింబల్ కనిపిస్తోంది. వినూత్న రీతిలో హార్ట్ సింబల్ కనిపించడంతో వాహనదారులు ఆసక్తిగా తిలకిస్తున్నారు. దీంతోపాటు సిగ్నల్స్కి సంబంధించిన ఫొటోలు, వీడియోలు నెట్టింట్లో వైరల్గా మారాయి. -
బిర్యానీలో కప్ప.. ట్రిపుల్ ఐటీ విద్యార్థుల ఆగ్రహం
సాక్షి,హైదరాబాద్: గచ్చిబౌలి ట్రిపుల్ఐటీలోని కదంబ మెస్లో విద్యార్థులకు ఇటీవల పెట్టిన బిర్యానీలో కప్ప ప్రత్యక్షమైంది. దీంతో విద్యార్థులు ఆగ్రహం వ్యక్తం చేశారు. బిర్యానీలో కప్ప రావడానికి మెస్ నిర్వాహకుల నిర్లక్ష్యమే కారణమని విద్యార్థులు మండిపడుతున్నారు. మెస్ నిర్వాహకులపై చర్యలు తీసుకోవాలని విద్యార్థులు డిమాండ్ చేశారు. బిర్యానీలో కప్ప ప్రత్యక్షమైన ఫొటోను విద్యార్థులు ట్విటర్లో షేర్ చేశారు. మెస్ నిర్వాహకులపై చర్యలు తీసుకోవాలని తెలంగాణ ఫుడ్సేఫ్టీ కమిషనర్కు ఫిర్యాదు చేశారు.Shocked and horrified! Found a frog in my friend's meal today at Kadamba Mess (IIIT Hyderabad). This is completely unacceptable and poses a serious health risk! @cfs_telangana, please take immediate action! #FoodSafety #Unhygienic #Hyderabad #IIITHyderabad pic.twitter.com/VCCKM0kuob— ram manohar (@manoharrocksss) October 17, 2024 ఇదీ చదవండి: అశోక్నగర్లో మరోసారి ఉద్రిక్తత -
వస్త్రం బై సింఘానియాస్ను ప్రారంభించిన ఏపీ మిస్ యూనివర్స్ (పోటోలు)
-
యువతిపై ఆటోలో లైంగిక దాడి..
-
గచ్చిబౌలిలో దారుణం.. ప్రైవేట్ ఉద్యోగినిపై ఆటోలో లైంగికదాడి
సాక్షి, హైదరాబాద్: గచ్చిబౌలిలో దారుణం చోటుచేసుకుంది. ఓ ప్రైవేట్ ఉద్యోగినిపై ఇద్దరు యువకులు లైంగికదాడికి పాల్పడ్డారు. గచ్చిబౌలి పోలీస్ స్టేషన్ పరిధిలోని మసీద్ బండ ప్రాంతంలో ఆటోలో యువతిపై అత్యాచారం చేశారు. ఆ యువతి పోలీసులను ఆశ్రయించి ఫిర్యాదు చేసింది. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు.. యువకుల కోసం గాలింపు చర్యలు చేపట్టారు. ఆర్సీపురం నుంచి గచ్చిబౌలికి ఆటోలో యువతి వెళ్తుండగా ఆ ఘటన జరిగింది.కోడలిపై అత్త, ఆడపడుచు దాడికోడలిపై అత్త, ఆడపడుచు వేడి నీళ్లు పోవడంతో తీవ్రంగా గాయపడిన సంఘటన పోలీస్స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. పోలీసుల కథనం మేరకు వివరాలిలా ఉన్నాయి. నిజామాబాద్ జిల్లాకు చెందిన నజియా బేగంకు సంతోష్నగర్ ఓవైసీ కాలనీకి చెందిన షేక్ షబ్బీర్తో వివాహం జరిగింది. షేక్ షబ్బీర్ ప్రస్తుతం ఉద్యోగం నిమిత్తం దుబాయ్లో ఉంటున్నాడు. నజియా బేగంకు నలుగురు సంతానం.అత్త మహ్మదియా బేగంతో తరుచూ గొడవలు జరుగుతుండటంతో నజియాబేగం కొద్ది రోజుల క్రితం అదే ప్రాంతంలో పిల్లలతో కలిసి వేరుగా నివాసముంటోంది. ఆదివారం పిల్లలు నానమ్మ ఇంటికి వెళ్లడంతో వారిని తీసుకొచ్చేందుకు నజియా బేగం అత్తగారింటికి వెళ్లింది. ఈ సందర్భంగా అత్త, ఆడపడుచుల మధ్య వాగ్వాదం జరగడంతో ఆగ్రహానికి లోనైన అత్త మహ్మదియా బేగం, ఆమె కుమార్తె కలిసి నజియా బేగంపై వేడి నీళ్లు పోయడంతో తీవ్ర గాయాలయ్యాయి. ప్రస్తుతం బాధితురాలు నజియా బేగం ఆసుపత్రిలో చికిత్స పొందుతుంది. బాధితురాలి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. -
గచ్చిబౌలిలో పింక్ పవర్ రన్
-
‘పింక్ పవర్ రన్’ను ప్రారంభించిన మంత్రి రాజనర్సింహ
సాక్షి, హైదరాబాద్: బ్రెస్ట్ క్యాన్సర్ గురించి ప్రజల్లో అవగాహన కల్పించేందుకు సుధారెడ్డి ఫౌండేషన్ ఆధ్వర్యంలో ‘పింక్ పవర్ రన్ 2024’ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమాన్ని మంత్రి దామోదర రాజనర్సింహ ప్రారంభించారు.ఆదివారం ఉదయం 5.30 గంటలకు గచ్చిబౌలి స్టేడియంలో నిర్వహించిన ఈ మారథాన్లో సుమారు ఐదు వేల మంది పాల్గొన్నారు. ఒకేసారి 3కే, 5కే, 10కే రన్ను నిర్వహించారు. పింక్ మారథాన్లో గెలిచిన వారికి మెడల్స్ పంపిణీ చేయనున్నారు.ఈ కార్యక్రమంలో పెద్దఎత్తున ఐటీ, ఇతర ప్రైవేటు ఉద్యోగులు పాల్గొన్నారు. గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్లో స్థానం సంపాదించేందుకు ఈ కార్యక్రమాన్ని పెద్దఎత్తున ఏర్పాటు చేశారు. -
HYD: శ్రుతి కేసులో వీడిన మిస్టరీ
సాక్షి, హైదరాబాద్: గచ్చిబౌలిలోని ఓ హోటల్లో నర్సింగ్ విద్యార్థిని అనుమానాస్పద రీతిలో మృతి చెందడడం తెలిసిందే. అయితే ఈ కేసులో మిస్టరీ వీడింది. శృతిది రేప్ అండ్ మర్డర్ కాదని.. ఆమె బలవన్మరణానికి పాల్పడిందని పోలీసులు తేల్చేశారు.జడ్చర్లకు చెందిన శ్రుతి (23).. మూడు రోజుల కిందట గచ్చిబౌలి రెడ్ స్టోన్ హోటల్లో ఫ్యాన్కు శవమై వేలాడుతూ కనిపించింది. సమాచారం అందుకున్న పోలీసులు క్లూస్ టీంతో ఆధారాలు సేకరించారు. గదిలో బీర్ బాటిల్స్ ఉండడం, అంతా చిందరవందరగా ఉండడంతో గొడవ జరిగి ఉంటుందని అనుమానించారు. మరోవైపు.. మృతదేహాన్ని తరలించకుండా ఆమె బంధువులు అడ్డుకున్నారు. ఆమెపై హత్యాచారం జరిగిందన్నది వాళ్ల ప్రధాన ఆరోపణ. దీంతో పోలీసులు వాళ్లకు సర్ధిజెప్పి ఉస్మానియాకు బాడీని పోస్ట్మార్టం నిమిత్తం పంపించారు.ఈలోపు కేసు దర్యాప్తు ముమ్మరం చేసిన పోలీసులు.. ఆమెది ఆత్మహత్యగానే తేల్చారు. ‘‘శ్రుతి గత కొంతకాలంగా జీవన్ అనే వ్యక్తితో ప్రేమలో ఉంది. అయితే పెళ్లికి ఆ యువకుడు నిరాకరించాడు. దీంతో మాట్లాడుకునేందుకు ఇద్దరూ హోటల్కు వెళ్లారు. అక్కడ మాటామాటా పెరిగి.. ఇద్దరూ గొడవ పడ్డారు. జీవన్ తన తన ఫ్రెండ్ గదికి వెళ్లిపోయాడు. శ్రుతి పక్కనే ఉన్న మరో గదిలోకి వెళ్లి ఉరేసుకుంది’’ అని వివరాలను తెలిపారు. ప్రేమ వ్యవహారం బెడిసి కొట్టడంతోనే ఆమె ఆత్మహత్య చేసుకుందని చెబుతున్న పోలీసులు.. జీవన్ను కస్టడీలోకి తీసుకుని విచారణ జరుపుతున్నారు. -
HYD: నర్సింగ్ విద్యార్థినిపై హత్యాచారం?
సాక్షి, హైదరాబాద్: నగరంలోని ఓ ప్రముఖ హోటల్లో దారుణం చోటు చేసుకుంది. ఓ నర్సింగ్ విద్యార్థిని అనుమానాస్పద రీతిలో మృతి చెందగా.. ఆమెపై హత్యాచారం జరిగిందని బంధువులు ఆరోపిస్తూ ధర్నాకు దిగారు.గచ్చిబౌలి రెడ్స్టోన్ హోటల్లోని ఓ గదిలో ఓ యువతి ఉరికొయ్యకు వేలాడుతుండడంతో పోలీసులకు సమాచారం వెళ్లింది. వెంటనే క్లూస్ టీం, ఫోరెన్సిక్ బృందం ఘటనా స్థలానికి చేరుకుని ఆధారాలు సేకరించాయి. గదిలో అంతా రక్తపు మరకలు ఉండగా, మరోవైపు మద్యం బాటిల్స్ పడి ఉన్నాయి. మృతిరాలిని నర్సింగ్ చదువుతున్న శృతిగా పోలీసులు నిర్ధారించారు. అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసుకుని విచారణ చేపట్టారు. గది మొత్తం చెల్లాచెదురుగా పడి ఉండడంతో గొడవ జరిగి ఉండొచ్చని అనుమానం వ్యక్తం చేస్తున్నారు పోలీసులు. ఈ ఘటనకు సంబంధించి ఇద్దరిని అదుపులోకి తీసుకున్నట్లు సమాచారం. అయితే ఘటన గురించి తెలిశాక హోటల్ వద్దకు చేరుకున్న మృతురాలి బంధువులు ఆందోళనకు దిగారు. తమ బిడ్డపై అఘాయిత్యానికి ఒడిగట్టి, ఆపైనే ఉరి వేసి హత్య చేశారని తల్లిదండ్రులు ఆరోపించారు. పోలీసులను అడ్డుకుని హోటల్ ముందు ధర్నాకు దిగారు. ఇదీ చదవండి: ప్రియుడి మోజుతో ఆ కూతురు చేసిన పనికి.. -
HYD: టెకీల ‘రేవ్’ పార్టీ భగ్నం..!
సాక్షి,హైదరాబాద్: నగరంలో డ్రగ్స్పై పోలీసులు ఉక్కుపాదం మోపుతున్నారు. తాజాగా ఐటీ ఏరియా గచ్చిబౌలిలో ఎస్ఓటీ పోలీసులు రేవ్ పార్టీని భగ్నం చేశారు. ఐటీ ఉద్యోగులే ఓ గెస్ట్హౌజ్లో రేవ్పార్టీని నిర్వహించినట్లు తెలుస్తోంది. పార్టీలో పాల్గొన్నవారిలో 8 మంది అమ్మాయిలు,12 మంది అబ్బాయిలు ఉన్నారు. వీరి వద్ద నుంచి స్వల్పంగా గంజాయి, మద్యం స్వాధీనం చేసుకున్నారు. అనంతరం పార్టీలో పాల్గొన్న వారిని ఎస్ఓటీ పోలీసులు గచ్చిబౌలి పోలీసులకు అప్పగించారు. రేవ్ పార్టీపై గచ్చిబౌలి పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. పార్టీ నిర్వహించిన వారికి, పాల్గొన్న వారికి పోలీసులు నోటీసులు ఇచ్చారు. కాగా, తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత డ్రగ్స్పై ప్రత్యేక ఫోకస్ పెట్టిన విషయం తెలిసిందే. ఇందులో భాగంగా ఇప్పటికే ఎన్నో రేవ్ పార్టీలను అడ్డుకుని కేసులు నమోదు చేశారు. ఇదీ చదవండి.. వ్యభిచారం చేసైనా డబ్బులు తెమ్మన్నాడు -
#Football : హైదరాబాద్ లో ఫుట్బాల్ కిక్ మొదలైంది (ఫొటోలు)
-
గచ్చిబౌలిలో దారుణం.. ప్రేమోన్మాది దాడిలో యువతి మృతి
సాక్షి, హైదరాబాద్: నగరంలోని గచ్చిబౌలి పోలీస్ స్టేషన్ పరిధిలో గోపన్పల్లి తండాలో దారుణ ఘటన చోటుచేసుకుంది. ప్రియురాలిపై ప్రేమోన్మాది దాడి ఘటనలో యువతి మృతిచెందింది. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టినట్టు తెలిపారు.వివరాల ప్రకారం.. పశ్చిమ బెంగాల్కు చెందిన దీపన తమాంగ్(25) నల్లగండ్లలో బ్యూటీషియన్గా పనిచేస్తోంది. తన స్నేహితులతో కలిసి గచ్చిబౌలిలోని గోపన్పల్లి తండా సమీపంలో నివాసం ఉంటుంది. ఇక, కర్ణాటకలోని బీదర్కు చెందిన రాకేష్ అనే యువకుడు కూడా అక్కడే ఉంటున్నాడు. అయితే, కొద్దిరోజులుగా రాకేష్.. దీపన వెంటపడుతూ తనను ప్రేమిస్తున్నానని, పెళ్లి చేసుకోవాలని వేధింపులకు గురిచేశాడు. రాకేష్ ప్రపోజల్ను ఆమె నిరాకరించడంతో దీపనపై కోపం పెంచుకున్నాడు.ఈ క్రమంలో బుధవారం రాత్రి దీపన ఇంటికి వెళ్లిన రాకేష్.. ఆవేశంతో ఆమెపై కత్తితో దాడి చేశాడు. అక్కడే ఉన్న దీపన స్నేహితులు.. రాకేష్ను అడ్డుకోబోతుండగా వారిపైనా దాడికి పాల్పడ్డాడు. రాకేష్ దాడిలో దీపన మృతిచెందగా.. ముగ్గురు స్నేహితులు తీవ్రంగా గాయపడ్డారు. ఈ ఘటన తర్వాత రాకేష్ అక్కడి నుంచి పారిపోయాడు. మొయినాబాద్ సమీపంలో విద్యుత్ స్థంభం ఎక్కి కరెంట్ తీగలు పట్టుకుని రాకేష్ ఆత్మహత్యకు పాల్పడగా.. స్థానికులు గుర్తించి అతడిని వెంటనే స్థానిక ఆసుపత్రికి తరలించారు. ఈ దారుణ ఘటనపై కసు నమోదు చేసుకున్న పోలసులు.. దర్యాప్తు చేపట్టినట్టు తెలిపారు. -
భావితరాల కోసం..
ఒకప్పుడు ప్రజలంతా చేదుడుబావి, మెట్ల బావుల నీటిని తాగేవారు. కాలక్రమంలో వాటిని పక్కన పెట్టి చెరువులు, వాగులు, బోర్లు, కులాయిల నీటిని తాగుతున్నారు. ఓ దేవాలయం ఉందంటే దానికి చుట్టుపక్కల ఓ బావిని తవ్వి కోనేరుగా వాడే వారు. కాల క్రమంలో వాటి నిర్వహణ భారం కావడం, ఆ నీటిని వాడకపోవడంతో అవన్నీ పూడుకుపోయాయి. అలాంటి మెట్ల బావుల విశిష్టతను నేటి తరానికి తెలియజేయటంతో పాటు వాటిని ఎన్నో జీవరాశులకు కేంద్రంగా మార్చేందుకు సాహే అనే ఎన్జీఓ సంస్థ కృషి చేస్తుంది. అందులో భాగంగా గత ప్రభుత్వ హయాంలో బన్సీలాల్పేట మెట్ల బావిని పునరుద్ధరించి రంగురంగుల విద్యుత్ దీపాలతో అలంకరించి ఓ పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్ది ప్రారంభించిన విషయం తెలిసిందే. – మణికొండబన్సీలాల్పేట మెట్ల బావి తరహాలోనే రాష్ట్రంలోని గచ్చిబౌలి, బైబిల్హౌస్, కోకాపేట, నారాయణపేట, గద్వాల్, వనపర్తి, మంచిరేవుల లాంటి 25 చోట్ల బావులను పునరుద్ధరించారు. పనికిరాని వాటిగా మరుగున పడిన వాటికి జీవం పోసి తిరిగి ఉపయోగంలోకి తేవటం, ఏకంగా వాటిని పర్యాటక, సాంస్కృతిక కేంద్రాలుగా తీర్చిదిద్దడం అందరినీ ఆకర్షిస్తున్నాయి. జీవరాశులకు ఉపయుక్తంగా.. వందల సంవత్సరాల పాటు ప్రజలకు ఉపయోగపడిన బావులను పునరుద్ధరిస్తే మరో వంద సంవత్సరాల పాటు ప్రజలకు జీవరాశులకు ఉపయోగపడతాయనే ఉద్దేశంతో చేపడుతున్న పనులు మన్ననలు పొందుతున్నాయి. బావులను పునురుద్ధరించడంతో పాటు వాటి చుట్టూరా లైటింగ్, పార్కులు ఏర్పాటు చేస్తుండటంతో వాటి వద్ద గడిపేందుకు ప్రజలు ఇష్టపడుతున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా వాగులు, చెరువులు, కాలువలు, నదులను పునరుద్ధరించి, వాటిని భావితరాలకు అందించాలనే ఉద్దేశంతో సాహే సంస్థ 12 సంవత్సరాలుగా కృషి చేస్తోంది. అదే క్రమంలో ఇలాంటి మూతబడిన బావులను పునరుద్ధరిస్తే ప్రజలకు ఉపయోగపడతాయని పలువురు సలహా ఇవ్వడంతో వాటి పునరుద్ధరణ పనులను గత మూడు సంవత్సరాలుగా చేపడుతున్నారు. అందులో భాగంగా 25వ బావిగా మంచిరేవుల వేణుగోపాలస్వామి దేవాలయం ఆవరణలో ఉన్న బావిని పునరుద్ధరించారు. దేవాలయానికి ఆగ్నేయంలో వాస్తుకు విరుద్ధంగా ఉందనే ఉద్దేశంతో దాన్ని గతంలో పూర్తిగా పూడ్చివేశారు. సాహే ప్రతినిధులు అలాంటి బావుల విశిష్టతను తెలపడంతో తిరిగి తెరిచేందుకు ఆలయ పూజారులు అంగీకరించటంతో నెల రోజులుగా శ్రమించి పునరుద్ధరించారు. దానిని మరింత అందంగా తీర్చి దిద్దేందుకు చుట్టూరా గోడకట్టడం, లైటింగ్, పార్కు ఏర్పాటు పనులను కొనసాగిస్తున్నారు. ఈ పనులన్నింటికీ రూ.38 లక్షలను వెచి్చస్తున్నారు. కామారెడ్డిలోనూ మరో బావిని, చందానగర్లోని భక్షికుంట బావిని పునరుద్ధరించే పనులను చేపడుతున్నారు.జల భాండాగారాలుగా.. పురాతన బావులను పునరుద్ధరిస్తే దాని కేంద్రంగా అనేక జీవరాశులు జీవనం ఏర్పాటు చేసుకుంటాయి. వాటిని కాస్త తీర్చిదిద్దితే పర్యాటక కేంద్రాలుగా ఉపయోగపడతాయి. వాటిల్లో చెత్తా చెదారం వేసి మూసివేసి నిరుపయోగంగా మార్చారు. ఒక్క బావి ఉంటే దాని చుట్టుపక్కల భూగర్భ జలం పెరుగుతుంది. దీంతో ప్రజలు నీటి బాదల నుంచి కొంతైనా ఉపశమనం పొందవచ్చు. రాష్ట్ర స్థాయిలో ఇలాంటి బావులు ఎక్కడ ఉన్నా వాటిని పునరుద్ధరిస్తాం. ఇలాంటి కార్యక్రమాలకు అవసరమైన నిధులను పలు సంస్థల నుంచి సీఎస్ఆర్గా తీసుకుంటున్నాం. – కల్పన రమేష్ సాహే సంస్థ నిర్వాహకురాలు -
Hyderabad: రన్.. సిటీ రన్! త్వరలో నగరంలో మారథాన్..
సాక్షి, సిటీబ్యూరో: అది ముంబై మహానగరం.. ఉరుకులు పరుగుల జీవితం.. ఎవరి పనుల్లో వారు ఫుల్ బిజీ.. కానీ ఆ ఒక్క రోజు మాత్రం ముంబై నగరం మొత్తం పండుగ. కులం, మతం తేడా ఉండదు. చిన్నా పెద్ద బేధాలు ఉండవు. నగర వీధుల్లోకి వచ్చి పూలు చల్లుతూ కొందరు.. ఎనర్జీ డ్రింక్స్ ఇస్తూ ఇంకొందరు.. తినుబండారాలు ఇస్తూ మరికొందరు అలా ఉండిపోతారు. ఇంతకీ ఇలా ముంబైకర్లు ఎందుకు చేస్తారనే కదా మీ సందేహం..ముంబై మారథాన్ రోజున ఇలా అందరూ ఏకమై ఓ పెద్ద పండుగలా సంబరాలు చేసుకుంటారు. ముంబై మారథాన్ను తమదిగా ముంబైవాసులు అంతలా ఓన్ చేసుకుంటారన్న మాట. ఇదంతా ఎందుకు చెప్పుకోవడం అంటే అదే రీతిలో మన హైదరాబాద్ నగరంలో కూడా కొద్దిరోజుల్లోనే ఎన్ఎండీసీ హైదరాబాద్ మారథాన్ నిర్వహించనున్నారు. హైదరాబాద్ రన్నర్స్ సొసైటీ ఆధ్వర్యంలో జరిగే ఈ మారథాన్ను కూడా నగరం సెలబ్రేట్ చేసుకోవాలి. ఎందుకంటే ఈసారి ఈ మారథాన్కు ఓ అరుదైన గౌరవం దక్కింది. వరల్డ్ అథ్లెటిక్ గుర్తింపు పొందింది. ముంబై మారథాన్కు మాత్రమే ఇప్పటి వరకు ఈ గుర్తింపు ఉండేది. దేశంలో ఆ గుర్తింపు పొందిన మారథాన్ హైదరాబాద్ మారథాన్ కావడం విశేషం.రూ.44 లక్షల ప్రైజ్మనీ.. ఈ మారథాన్లో మొత్తం రూ.44 లక్షల ప్రైజ్మనీ ఇవ్వనున్నారు. తొలిస్థానంలో నిలిచిన వారికి రూ.5 లక్షలు, రెండోస్థానంలో పూర్తిచేసిన వారికి రూ.2.5 లక్షలు, మూడో స్థానంలో నిలిచిన వారికి రూ.2 లక్షల పురస్కారం అందించనున్నారు. ఇక, కోర్సు రికార్డు సాధించిన రన్నర్కు రూ.10 లక్షల నగదు పురస్కారం, జాతీయ రికార్డు బద్దలు కొట్టిన వారికి రూ.5 లక్షల పారితోషికం అందజేస్తారు.దేశంలోనే రెండో అతిపెద్దది.. మరో 15 రోజుల్లో ప్రారంభమయ్యే హైదరాబాద్ మారథాన్లో వేల సంఖ్యలో రన్నర్లు పాల్గొంటారు. ఈ ఏడాది 27 వేలకు పైగా మంది మారథాన్లో పాల్గొనేందుకు రిజిస్టర్ చేసుకున్నారు. ఈ మారథాన్లో పాల్గొనే రన్నర్ల సంఖ్య పరంగా చూసుకుంటే.. భారత్లోనే అతిపెద్ద రెండో పరుగు ఇది. ఈ మారథాన్లో 42 కిలోమీటర్ల దూరం రన్నర్లు పరుగెత్తనున్నారు. ఫుల్ మారథాన్తో పాటు హాఫ్ మారథాన్, 10 కిలోమీటర్లు, 5 కిలోమీటర్ల పరుగు కూడా ఉంటుంది. ఇటీవలే ఈ మారథాన్ డ్రైరన్ను విజయవంతంగా పూర్తి చేశారు. ఫన్ రన్తో ప్రారంభమై..మారథాన్ మొదటి రోజైన 24వ తేదీన ఫన్ రన్ పేరుతో 5కే రన్ ఉంటుంది. ఇది అసలు మారథాన్కు కర్టెన్ రైజర్ లాంటిది. ప్రతిఒక్కరూ రన్నింగ్ను సెలబ్రేట్ చేసుకునేందుకు ఈ ఫన్ రన్ ఏర్పాటు చేశారు. ఇది హైటెక్స్ ఎగ్జిబిషన్ సెంటర్ క్యాంపస్లో ఉంటుంది. ఇక మరుసటి రోజు అసలు మారథాన్ (42 కి.మీ.) ప్రారంభం అవుతుంది. పీపుల్స్ ప్లాజా వద్ద ఉదయం మారథాన్ ప్రారంభం అవుతుంది. రాజ్భవన్ రోడ్డు, పంజాగుట్ట ఫ్లైఓవర్, కేబీఆర్ పార్కు, దుర్గం చెరువు కేబుల్ బ్రిడ్జి, మైండ్ స్పేస్ జంక్షన్, బయోడైవర్సిటీ జంక్షన్, గచ్చిబౌలి ఫ్లైఓవర్, హెచ్సీయూ మీదుగా గచ్చిబౌలి అథ్లెటిక్ స్టేడియం వద్ద ముగుస్తుంది. హాఫ్ మారథాన్ పీపుల్స్ ప్లాజా వద్ద ప్రారంభమై.. 21 కి.మీ. దూరం ఉండేలా నిర్దేశించిన మార్గంలో రన్ ఉంటుంది. ఇది కూడా గచ్చిబౌలి స్టేడియం వద్ద ముగుస్తుంది. -
మృతి చెందిన వ్యక్తికి ట్రీట్మెంట్?.. కేర్ ఆసుపత్రి దగ్గర ఉద్రిక్తత
సాక్షి, హైదరాబాద్: గచ్చిబౌలి కేర్ ఆసుపత్రి వద్ద ఉద్రిక్తత చోటుచేసుకుంది. మెదక్ నర్సాపూర్కు చెందిన వెంకటేష్ అనే వ్యక్తి అనారోగ్యంతో ఆసుపత్రిలో చేరారు. ఇప్పటివరకు వైద్య ఖర్చులు కోసం పేషెంట్ బంధువులు రూ.5 లక్షలు చెల్లించారు.నిన్నటి వరకు ఆరోగ్యంగా ఉన్న వెంకటేష్ తెల్లారేసరికే మృతిచెందారు. విషయం చెప్పకుండా మరో రూ.4 లక్షలు చెల్లించాలని వైద్యులు తెలిపారు. అనుమానంతో ఐసీయూలోకి దూసుకెళ్లిన బంధువులు.. వెంకటేష్ మృతిచెంది ఉండటంతో కోపోద్రిక్తులయ్యారు. మృతి చెందిన వ్యక్తికి ట్రీట్మెంట్ చేశారంటూ బంధువులు ఆరోపిస్తున్నారు. ఆసుపత్రి వద్ద బాధిత బంధువులు ఆందోళనకు దిగారు. -
Hyderabad: నగరంలో క్రేజ్గా మారిన జిప్లైన్
ఎగిరే.. ఎగిరే.. చూపే ఎగిరెనే చీకటి ఎరగని దారిలో.. పాదం ఎగిరెనే భయమే తెలియని బాటలో.. ప్రాయం ఎగిరెనే పరిచయమవ్వని త్రోవలో.. ఫ్లై హై.. ఇన్ ది స్కై.. కలలే అలలై పైకెగిరే.. పలుకే స్వరమై పైకెగిరే.. ప్రతి అడుగు స్వేచ్ఛ కోరగా.. పాట చాలా మందికి తెలిసిందే.. ఈ తరహా వినోదాన్వేషణలో భాగంగా సాహసకృత్యాలు నగర యువతకు నిత్యకృత్యాలయ్యాయి. పబ్బులు, క్లబ్బుల్లో ఒళ్లు మరచిపోయే వీకెండ్ రొటీన్కు భిన్నంగా ఒళ్లు గగుర్పొడిచే సాహసాలకు వారు ఓటేస్తున్నారు. ఆ క్రమంలోనే ఇప్పుడు నగరంలో అత్యధికులను ఆకర్షిస్తోంది జిప్లైన్.. ప్రపంచవ్యాప్తంగా కూడా మంచి పాపులారిటీ ఉన్న ఈ సాహస క్రీడ నగర యువతకు క్రేజ్గా మారింది. దీనిని దృష్టిలో పెట్టుకుని పలు అడ్వెంచరస్ క్లబ్స్ అడ్వెంచర్ ఔత్సాహికుల కోసం తమ థ్రిల్లింగ్ అవుట్డోర్ యాక్టివిటీలకు జిప్లైన్ను జత చేస్తున్నాయి. గగనాన పయనాన...అనిపించేలా చేస్తుంది ఈ సాహసక్రీడ జిప్లైన్. రోప్వే తరహాలో ఒక నిరీ్ణత దూరానికి ఒక కేబుల్ ఆధారంగా గాల్లో వేలాడుతూ ప్రయాణించే ఈ జిప్లైన్ దశాబ్దకాలంగా దేశవ్యాప్తంగా ప్రాచుర్యంలోకి వచి్చంది. ఈ క్రీడను ఒకప్పుడు నగరవాసులు విభిన్న టూర్ల సందర్భంగా మాత్రమే ఎంజాయ్ చేసేవారు. అయితే పెరుగుతున్న క్రేజ్ను దృష్టిలో పెట్టుకుని నగరంలోని అడ్వెంచర్ యాక్టివిటీ సెంటర్లలో కూడా అందుబాటులోకి తెచ్చారు. దాదాపు రూ.500 మొదలుకుని రూ.1000లోపు రుసుముతో ఈ క్రీడను ఆనందించడానికి అవకాశం ఇస్తున్నారు. ఎక్కడెక్కడ ఎంజాయ్ అంటే... ⇒ గచ్చిబౌలి ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్లో ఉన్న ఫ్లిప్సైడ్ అడ్వెంచర్ పార్క్ జిప్లైనింగ్కి ఒక మంచి ప్లేస్. అంతేకాక విభిన్న రకాల అడ్వెంచర్ కార్యకలాపాలతో ఒక రోజంతా సరదాగా గడపడానికి కూడా. ఇక్కడ జిప్లైన్ ఎత్తులో థ్రిల్లింగ్ రైడ్ను అందిస్తుంది. ⇒ లియోనియా రిసార్ట్స్ సమీపంలో ఉన్న డి్రస్టిక్ట్ గ్రావిటీ సిటీలో మరొక సాహసాల కేంద్రం. ఇదొక అతిపెద్ద అడ్వెంచర్ పార్కు. ఇది విభిన్న రకాల థ్రిల్లింగ్ యాక్టివిటీస్ అందిస్తుంది. కింద పచ్చని పచ్చిక పైన 60 అడుగుల ఎత్తుతో 500 మీటర్ల జిప్లైన్ సెట్తో ఆకట్టుకుంటుంది. అయితే ఇక్కడ కనీస బరువు 35 కిలోలుగా నిర్ణయించారు. కాబట్టి ఇది చిన్న పిల్లలకు తగినది కాదు. ⇒ ఖైరతాబాద్లోని పిట్ స్టాప్ అడ్వెంచర్ పార్క్ ఆటలకు ప్రసిద్ధి. ఇది పిల్లలు, పెద్దలు ఇద్దరికీ సరిపోయే జిప్లైన్ను అందిస్తుంది. ⇒ శంకర్పల్లిలోని వైల్డ్ వాటర్స్ థీమ్ పార్క్ కూడా జిప్లైనింగ్ను అందిస్తుంది. ఉదయం 11గంటల నుంచి సాయంత్రం 6గంటల వరకూ ఇది పనిచేస్తుంది. ⇒ వికారాబాద్లో ఉన్న అనంత అడ్వెంచర్ క్లబ్ 24–గంటల అడ్వెంచర్ హబ్. జిప్లైన్తో సహా సాహసికుల కోసంæ వివిధ కార్యకలాపాలను అందిస్తుంది. ⇒ జూబ్లీ హిల్స్లో పచ్చని ప్రకృతి అందాల మధ్య ఉన్న ఫ్రీకౌట్స్ అడ్వెంచర్ జోన్లోనూ జిప్ లైన్ ఉంది. ]జాగ్రత్తలు ⇒ భద్రతా ప్రమాణాలకు అనుగుణంగా యాక్టివిటీ ఉందా లేదా చూసుకోవాలి. ⇒ ఎంత కాలంగా జిప్లైన్ నిర్వహిస్తున్నారో కూడా తెలుసుకోవాలి. ⇒ ఇవి పూర్తి సురక్షితంగా ఉన్నప్పటికీ.. అందరికీ నప్పవు.. కాబట్టి ముందస్తుగా తమ ఆరోగ్యంపై కూడా అవగాహన అవసరమైతే వైద్య సలహా కూడా తీసుకోవాలి. -
నేటి నుంచి ఆర్ట్–ఫొటోగ్రఫీ ఎగ్జిబిషన్..
గచ్చిబౌలి: మాదాపూర్లోని స్టేట్ ఆర్ట్ గ్యాలరీలో మూడు రోజులపాటు ఆర్ట్–ఫొటోగ్రఫీ ఎగ్జిబిషన్ నిర్వహించేందుకు ఏర్పాట్లు చేశారు. 50 మంది ప్రముఖ ఫొటోగ్రాఫర్లు రూపొందించిన ఫొటోలను ప్రదర్శిస్తారు. శుక్రవారం ఉదయం 10 గంటలకు ప్రారంభమై ఆదివారం వరకూ ఈ ఎగ్జిబిషన్ నిర్వహిస్తారు.ముఖ్యఅతిథిగా రాష్ట్ర ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్ డైరెక్టర్, కార్యదర్శి శృతిఓజా, సాంస్కృతిక, భాషాశాఖ డైరెక్టర్ మామిడి హరికృష్ణ ప్రారంభిస్తారు. ఇంటరీ్మడియట్ ఎడ్యుకేషన్ ఎగ్జామినేషన్ కంట్రోలర్, ఆర్జేడీ బి జయప్రదబాయి, ఎస్ఐవీఈ ప్రిన్సిపల్ డాక్టర్ ఆర్ జ్యోష్ణారాణి పాల్గొంటారు. 10 గంటల నుంచి 6 గంటల వరకు ఈ ప్రదర్శన ఉంటుంది. -
షావోమీ కొత్త 5జీ స్మార్ట్ఫోన్ లాంచ్ చేసిన సినీనటి వర్షిణి (ఫోటోలు)
-
హైదరాబాద్: గచ్చిబౌలిలో బోర్డు తిప్పేసిన సాఫ్ట్వేర్ కంపెనీ
సాక్షి, హైదరాబాద్: గచ్చిబౌలిలో ఓ సాప్ట్వేర్ కంపెనీ బోర్డు తిప్పేసింది. కంపెనీ క్లోజ్ చేశామంటూ నిరుద్యోగులకు షాకిచ్చింది. ఉద్యోగులు నుంచి డిపాజిట్ ఫీజులు వసూలు చేసి బిచాణా ఎత్తేసింది. రైల్ వరల్డ్ ఇండియా పేరుతో దేశవ్యాప్తంగా ఐదు బ్రాంచ్లు ఏర్పాటు చేసి ఉద్యోగాలు ఇస్తామంటూ 800 మంది వద్ద డబ్బులు వసూలు చేసింది.సుమారు రూ.5 కోట్లు వసూలు చేసిన రైల్ వరల్డ్ కంపెనీ బోర్డు తిప్పేసింది. ఒక్క గచ్చి బౌలిలోనే దాదాపుగా 40 లక్షల రూపాయల వసూలు చేసినట్లు సమాచారం. రాయదుర్గం పోలీస్స్టేషన్లో బాధితులు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. -
బాహుబలి బఫెట్
గచ్చిబౌలి: భారతదేశంలోనే అతిపెద్ద ఫ్యామిలీ ‘బఫెట్’ రెస్టారెంట్ గచ్చిబౌలిలో అందుబాటులోకి వచి్చంది. మాస్టర్ పీస్ ఇండియా ఆధ్వర్యంలో దీన్ని నూతనంగా ఏర్పాటు చేశారు. ఇక్కడి ప్రత్యేకత ఏమిటంటే...300 రకాల విభిన్న వంటకాలు అందుబాటులో ఉండడం. 500 మంది కూర్చునే సామర్థ్యంతో సీటింగ్ ఏర్పాట్లు చేశారు. ఈ రెస్టారెంట్లో భారతీయ వంటకాలతోపాటు పాశ్చాత్య దేశాల రుచులను భోజన ప్రియులకు అందుబాటులో ఉంచారు. హైదరాబాద్ దమ్ బిర్యానీతోపాటు కరేబియన్ ఫుడ్డింగ్, రాజస్థానీ కోఫ్తా కర్రీ, థాయ్ రెడ్కర్రీ, జపనీస్ సకానా కుట్సు, డచ్ చికెన్తో పాటు అనేక రకాల వెజ్, నాన్వెజ్ వంటకాలు అందుబాటులో ఉండేలా నిర్వాహకులు ఏర్పాట్లు చేశారు. వెరైటీ స్టార్టర్స్, డెజర్ట్స్, ఇతర అన్ని రుచులు కలిపి 300 రకాల వంటకాలు అందుబాటులోకి తీసుకొచ్చారు. టేస్ట్కు టేస్ట్.. ఎన్నో వెరైటీలు అందుబాటులోకి రావడంతో ఫుడ్లవర్స్ ఖుషీ అవుతున్నారు. మరెందుకు ఆలస్యం.. మాస్టర్ పీస్ వైపు ఓ లుక్కేయండి మరి. -
గచ్చిబౌలి: ఓఘ వెల్నెస్ సెంటర్ ను ప్రారంభించిన డింపుల్ హాయతి
-
రాడిసన్ డ్రగ్స్ కేసు: పరారీలో ఉన్న మరో డ్రగ్ పెడ్లర్ అరెస్ట్
సాక్షి,హైదరాబాద్: రాడిసన్ హోటల్ డ్రగ్స్ కేసులో అబ్దుల్ రెహమాన్ అనే నిందితుడిని అరెస్ట్ చేశామని మాదాపూర్ డీసీపీ వినీత్ తెలిపారు. అతనితో పాటు నరేందర్ అనే ఢిల్లీకి చెందిన మరొక నిందితుడిని అరెస్ట్ చేశామని పేర్కొన్నారు. ‘వారి వద్ద నుంచి 11 గ్రాముల ఎండిఎంఏ, జాగ్వార్ కారు స్వాధీనం చేసుకున్నాం. నిందితులు ఢిల్లీ నుంచి డ్రగ్స్ తీసుకొచ్చి హైదరబాద్లో విక్రయిస్తున్నారు. హైదరబాద్లో ఏజెంట్ల సాయంతో యువత టార్గెట్గా డ్రగ్స్ విక్రయిస్తున్నారు. హైదరాబాదులో 15 మంది ఏజెంట్లను నియమించుకున్నారు. పబ్బులకు వెళ్లే యూత్ను టార్గెట్ చేసుకుని డ్రగ్స్ విక్రయించారు. హైదరబాద్తో పాటు గోవా, బెంగళూరు వంటి మెట్రో నగరాలు పబ్ కల్చర్ ఉన్న ప్రాంతాల్లో విక్రయిస్తున్నారు. సయ్యద్ అబ్దుల్ రెహ్మాన్పై నగరంలో డ్రగ్స్ కేసులో ఆరు కేసులు ఉన్నాయి. గచ్చిబౌలి, మలక్పేట్, చాదర్ఘాట్, యాదగిరిగుట్ట పీఎస్లో కేసులు ఉన్నాయి. డ్రగ్స్ అమ్మగా వచ్చిన ఆదాయాన్ని రెహమాన్ విలాసవంతమైన కార్ల కొనుగోలుకు వెచ్చించాడు. రెహమాన్ ఫైజల్ అనే డ్రగ్ పెడ్లర్ అండర్లో పనిచేస్తాడు. డ్రగ్స్ కింగ్ ఫిన్ పైజల్ గోవా జైల్లో ఉన్నాడు.. అతని ఆదేశాల మేరకు రెహమాన్ డ్రగ్స్ విక్రయిస్తున్నారు. ఫైజాల్ను పిటీ వారింట్పై హైదరాబాద్కు తీసుకుని వస్తాం. రాడిసన్ పబ్ కేసులో వహీద్ అనే వ్యక్తి సయ్యద్ రహ్మన్తో డ్రగ్స్ కొనుగోలు చేశాడు. రాడిసన్ కేసులో ఇద్దరు పరారీలో ఉన్నారు’ అని డీసీపీ వినీత్ వెల్లడించారు. -
గచ్చిబౌలి డ్రగ్స్ కేసులో నిందితుల డ్రామాలు!
సాక్షి, హైదరాబాద్: గచ్చిబౌలి రాడిసన్ హోటల్ డ్రగ్స్ కేసులో నిందితులు పోలీసులకు చుక్కలు చూపిస్తున్నారు. కేసు నుంచి తప్పించుకునేందుకు నిందితులు కొత్త ఎత్తుగడలు వేస్తున్నట్లు పోలీస్ వర్గాలు భావిస్తున్నాయి. అధునాతన డ్రగ్స్ టెస్టులకు సైతం చిక్కకుండా ఉండేందుకు చేస్తున్న ప్రయత్నాల్ని చూసి అధికారులు నివ్వెరపోతున్నట్లు తెలుస్తోంది. హెయిర్ శాంపిల్స్ టెస్టు.. యూరిన్ టెస్ట్.. రెండింటిలోనూ నెగెటివ్ ఫలితం గచ్చిబౌలి పోలీసులను కంగుతినేలా చేస్తోంది. ఈ క్రమంలో ఇక చివరగా నిందితుల బ్లడ్ శాంపిల్స్ నివేదికలపైనే పోలీసులు ఆధారపడుతున్నారు. అయితే.. అలా ఎలా?.. గచ్చిబౌలి డ్రగ్స్ కేసులో.. నీల్ అనే నిందితుడు మినహా మిగతా 12 మంది విచారణకు హాజరయ్యారు. అయితే వాళ్లకు నిర్వహిస్తున్న టెస్టుల్లో నెగెటివ్ రావడంతో దర్యాప్తు అధికారులు కంగుతింటున్నారు. వాస్తవానికి.. డ్రగ్స్ పార్టీ జరిగిన మరుసటి రోజే ముగ్గురు నిందితుల శాంపిల్స్లో పాజిటివ్గా తేలింది. అయితే వారం రోజుల గడువుతో మళ్లీ విచారణకు వచ్చారు నిందితులు. ఈలోపు పూర్తి డైట్ పాటించడంతోనే ఇప్పుడు ఫలితం నెగెటివ్గా వచ్చి ఉండొచ్చని అధికారులు భావిస్తున్నారు. మరోవైపు హెయిర్శాంపిల్స్లోనూ నెగెటివ్ ఫలితంపై అధికారులు విశ్లేషణ జరుపుతున్నారు. హెయిర్ శాంపిల్స్ టెస్టుల్లో బయటపడకుండా ఉండేందుకు డై వేసుకుని వస్తున్నట్లు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. చివరగా.. వాళ్ల నుంచి బ్లడ్ శాంపిల్స్ను పోలీసులు సేకరించారు. త్వరలోనే వాటి ఫలితం వచ్చే అవకాశం ఉంది. అయితే అందులో పాజిటివ్ వచ్చినా కన్జూమర్స్ పేరుతో వాళ్లు బయటపడేందుకు యత్నాలు చేసే అవకాశం లేకపోలేదని పోలీసులు వర్గాలు చెబుతున్నాయి. -
గజ్జల వివేకానంద గుట్టు విప్పుతున్న పోలీసులు
-
అన్నపూర్ణమ్మకు కౌంటర్.. సింగర్ చిన్మయికి షాక్..!
సింగర్ చిన్మయి శ్రీపాద చేసిన కామెంట్స్పై వివాదాస్పదంగా మారాయి. ఇటీవల ప్రముఖ సీనియర్ నటి అన్నపూర్ణమ్మ వ్యాఖ్యలకు కౌంటర్గా ఓ వీడియోను రిలీజ్ చేసింది. అయితే చిన్మయి వ్యాఖ్యలపై గచ్చిబౌలి పోలీసులకు ఓ విద్యార్థి ఫిర్యాదు చేశారు. దీంతో చిన్మయి శ్రీపాదపై కేసు నమోదు చేశారు. అసలేం జరిగిందంటే.. ప్రస్తుతం బామ్మ పాత్రలతో ప్రేక్షకులను ఎంటర్టైన్ చేస్తున్న అన్నపూర్ణమ్మ ఇటీవల ఓ ఇంటర్వ్యూలో ఆడవాళ్లను కించపరుస్తూ మాట్లాడిన మాటలు సోషల్ మీడియాలో వైరల్గా మారాయి. అర్ధరాత్రి స్వతంత్రం అనగానే ఆరోజుల్లో ఆడవాళ్లు బయటకు వచ్చేవాళ్లా? ఆడదానికి ఎందుకు స్వాతంత్య్రం కావాలి? రాత్రి 12 గంటల తర్వాత ఏం పని? అంటూ మాట్లాడింది. మహిళలపై జరుగుతున్న ఆకృత్యాలపై ఎప్పటికప్పుడు స్పందించే చిన్మయి శ్రీపాద.. అన్నపూర్ణమ్మ చేసిన కామెంట్స్కు రియాక్ట్ అయింది. ఈ మేరకు తన ఇన్స్టాలో ఓ వీడియోను షేర్ చేసింది. అమ్మాయిలుగా పుట్టడం మన కర్మ.. చిన్మయి వీడియో మాట్లాడుతూ..' ఇప్పటికీ చాలా ఊర్లలో బాత్రూమ్సే లేవు. ఇలాంటి సందర్భాల్లో కూడా ఆడవాళ్లు ఎప్పుడు వస్తారా? వాళ్లపై ఎప్పుడు అఘాయిత్యానికి పాల్పడుదామా? అని ఎదురుచూస్తున్నవాళ్లు ఈ సమాజంలో ఉన్నారు. అయినా అమ్మాయిల వేషధారణ వల్లే ఈ అఘాయిత్యాలు జరుగుతున్నాయని చెప్తున్నారు. భారత్లో అమ్మాయిలుగా పుట్టడం మన కర్మ' అని ఆగ్రహం వ్యక్తం చేసింది. తాజాగా ఆమె వ్యాఖ్యలపై పోలీసులకు ఫిర్యాదు చేయడంతో కేసు నమోదైంది. View this post on Instagram A post shared by Chinmayi Sripada (@chinmayisripaada) -
రోజుకో మలుపు..భారీ ట్విస్ట్
-
Drugs Case: గచ్చిబౌలి రాడిసన్ హోటల్ డ్రగ్స్ కేసులో ట్విస్ట్
హైదరాబాద్: గచ్చిబౌలిలోని రాడిసన్ హోటల్లో శనివారం రాత్రి జరిగిన డ్రగ్స్ పార్టీలో మరో సంచలన విషయం వెలుగులోకి వచ్చింది. రాడిసన్ హోటల్లో 200 సీసీ కెమెరాలు ఉండగా కేవలం 16 కెమెరాలు మాత్రమే పని చేస్తున్నట్లు నిర్ధారించారు. డ్రగ్స్ పార్టీ నిర్వహణ కోసమే కెమెరాలు మాయం చేసినట్లు తెలిసింది. కాగా డ్రగ్స్ తీసుకున్న అనుమానితుల జాబితాలో డైరెక్టర్ క్రిష్ ఉన్న సంగతి తెలిసిందే! ఈయన డ్రగ్స్ పార్టీ జరిగిన గదిలో అరగంట పాటు ఉన్నట్టు తెలుస్తోంది. ఇక ఈ పార్టీ కోసం డ్రగ్ సరఫరా చేసిన (పెడ్లర్) సయ్యద్ అబ్బాస్ అలీ జెఫ్రీని అరెస్ట్ చేసిన పోలీసులు విచారణ చేపడుతున్నారు. -
డ్రగ్ పార్టీలో డైరెక్టర్ క్రిష్
గచ్చిబౌలి: గచ్చిబౌలిలోని రాడిసన్ హోటల్లో శనివారం రాత్రి జరిగిన డ్రగ్ పార్టీలో ప్రముఖ సినీ దర్శకుడు క్రిష్ పాల్గొన్నట్లు మాదాపూర్ డీసీపీ వినీత్ కుమార్ తెలిపారు. అయితే కొకైన్ వాడారా? లేదా? అనేది తెలియాల్సి ఉందన్నారు. ఈ పార్టీ కోసం డ్రగ్ సరఫరా చేసిన (పెడ్లర్) సయ్యద్ అబ్బాస్ అలీ జెఫ్రీని అరెస్టు చేశామని చెప్పారు. రాడిసన్ హోటల్లో గజ్జల వివేకానంద్కు 10 సార్లు మాదకద్రవ్యాలు సప్లయ్ చేసినట్లుగా అబ్బాస్ తన వాంగ్మూలంలో పేర్కొన్నాడని వివరించారు. చాలాసార్లు డ్రగ్ పార్టీలు చేసుకున్నట్లు చెప్పాడని మంగళవారం విలేకరులతో మాట్లాడుతూ డీసీపీ తెలిపారు. రెండురోజుల్లో క్రిష్ను విచారిస్తాం క్రిష్ రెండురోజుల్లో విచారణకు వస్తారని, ఆయనకు వైద్య పరీక్షలు నిర్వహిస్తామని డీసీపీ చెప్పారు. వివేకానంద్ను కలిసేందుకు మాత్రమే వచ్చినట్లు క్రిష్ చెబుతున్నాడని, వైద్య పరీక్షలు చేస్తేనే స్పష్టత వచ్చే అవకాశం ఉందన్నారు. కేదార్, నిర్భయ్ అనే కామన్ ఫ్రెండ్స్ ద్వారా సినిమా వాళ్లు వివేకానంద్కు పరిచయం అయ్యి ఉండవచ్చని తెలిపారు. డ్రగ్కు బానిస కావడంతోనే తరచుగా పార్టీలు నిర్వహించి ఉండవచ్చని అన్నారు. డ్రగ్ హైదరాబాద్లోనే కొనుగోలు చేసినట్లు అబ్బాస్ చెబుతున్నాడని, అయితే ఎక్కడి నుంచి సరఫరా అయ్యిందో విచారణలో తేలుతుందని చెప్పారు. కొకైన్ సరఫరా చేసిన ప్రతిసారీ రెండు నుంచి నాలుగు గ్రాములు వివేకానంద్కు అందించాడన్నారు. వివేకానంద్ ఎంత మొత్తంలో డబ్బులు చెల్లించాడో త్వరలో చెబుతామని చెప్పారు. పరారీలో శ్వేత, సందీప్ కేసులో అనుమానితులుగా ఉన్న శ్వేత, సందీప్లు పరారీలో ఉండగా బెంగళూరులో ఉన్న చరణ్ అక్కడే విచారణకు వస్తున్నట్లు తెలిపారు. డ్రగ్ పార్టీ నిర్వహించిన వారితో పాటు హోటల్ నిర్వాహకులపై కేసులు నమోదు చేస్తామని డీసీపీ స్పష్టం చేశారు. హోటల్లో కొన్ని సీసీ కెమెరాలు పని చేయడం లేదని, శనివారం రాత్రి 12.30 గంటలకు వెళ్లే సరికే అందరూ పార్టీ నుంచి వెళ్లిపోయారని వివరించారు. డ్రగ్ పార్టీలకు రెగ్యులర్గా ఎవరు వస్తున్నారు, డ్రగ్ సప్లయ్ చైన్ తదితర అంశాలపై విచారణ చేపడతామన్నారు. ఇప్పటికి పార్టీలో 10 మంది ఉన్నట్లు గుర్తించగా ముగ్గురికి డ్రగ్ పాజిటివ్గా వచ్చిందని, మిగిలిన వారిని కూడా విచారించి వైద్య పరీక్షలు నిర్వహిస్తామని చెప్పారు. శ్వేత బెంగళూరు డ్రగ్ కేసులో కూడా నిందితురాలిగా ఉందంటూ మీడియా ప్రతినిధులు ప్రస్తావించగా, ఆ వివరాలు సేకరిస్తామని, గతంలో రాడిసన్ హోటల్ మేనేజర్ డ్రగ్తో పట్టుబడిన కేసు వివరాలు కూడా సేకరిస్తామని అన్నారు. సయ్యద్ అరెస్టుతో రాడిసన్ డ్రగ్ పార్టీ కేసులో ఇప్పటివరకు నలుగురిని అరెస్టు చేసినట్లయ్యింది. -
డ్రగ్ పార్టీ.. అరెస్ట్
గచ్చిబౌలి (హైదరాబాద్): హైదరాబాద్లో మరోసారి డ్రగ్స్ కలకలం రేగింది. గచ్చిబౌలిలోని రాడిసన్ హోటల్లో డ్రగ్ వినియోగించిన కేసులో హైదరాబాద్కు చెందిన బీజేపీ సీనియర్ నాయకుడు, మంజీరా గ్రూప్ చైర్మన్ గజ్జల యోగానంద్ కుమారుడు, ఆ సంస్థ డైరెక్టర్ గజ్జల వివేకానంద్ను సైబరాబాద్ పోలీసులు అరెస్టు చేశారు. రాడిసన్ హోటల్ ఈ గ్రూప్దే కావడం గమనార్హం. కాగా ఇదే కేసులో నిర్భయ్, శెలగంశెట్టి కేదార్ అనే మరో ఇద్దరు ప్రముఖులను కూడా అదుపులోకి తీసుకున్నట్లు సైబరాబాద్ పోలీస్ కమిషనర్ అవినాష్ మహంతి తెలిపారు. పలువురు వ్యాపారవేత్తలు, సినీ సెలబ్రిటీలపై కేసులు నమోదు చేసినట్లు చెప్పారు. కేదార్కు పలువురు సినీ ప్రముఖులతో సంబంధాలు ఉన్నట్లు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. సోమవారం గచ్చిబౌలిలోని కార్యాలయంలో సీపీ మహంతి వివరాలు వెల్లడించారు. సొంత హోటల్లో 10 మందితో కలిసి..‘శనివారం రాత్రి రాడిసన్ హోటల్లో కొకైన్తో పార్టీ నిర్వహించినట్లు సమాచారం అందింది. దీంతో సైబరాబాద్ ఎస్ఓటీ, గచ్చిబౌలి పోలీసులు హోటల్లో సోదాలు చేశారు. అయితే డ్రగ్ పార్టీలో పాల్గొన్నవారు అప్పటికే అక్కడి నుంచి వెళ్ళిపోయారు. అయితే సీసీ టీవీ ఫుటేజ్ ఆధారంగా గజ్జల వివేకానంద్తో పాటు మరో 9 మంది డ్రగ్ పార్టీలో పాల్గొన్నట్లు పోలీసులు గుర్తించారు. దీంతో జూబ్లీహిల్స్లోని నివాసంలో వివేకానంద్ను అదుపులోకి తీసుకుని ప్రశ్నించారు. వివేకానంద్, నిర్భయ్, కేదార్.. ముగ్గురికీ మెడికల్ ఎగ్జామినేషన్లో భాగంగా మూత్ర పరీక్షలు చేయగా డ్రగ్ పాజిటివ్ వచ్చింది.హోటల్లో కొకైన్ కోసం ఉపయోగించిన ప్లాస్టిక్ కవర్లు 3, డ్రగ్ వినియోగానికి ఉపయోగించిన వైట్ పేపర్లు, మూడు సెల్ఫోన్లను స్వాదీనం చేసుకున్నారు. మంజీరా గ్రూప్లో పనిచేసిన సయ్యద్ అబ్బాస్ అలీ జెఫ్రీ డ్రగ్ సరఫరా చేసినట్లుగా పోలీసులు గుర్తించారు..’అని మహంతి తెలిపారు. హోటల్పై కేసు నమోదు చేయనున్నట్లు చెప్పారు. మాదాపూర్ డీసీపీ వినీత్ కుమార్, అదనపు డీసీపీ జయరాం, గచ్చిబౌలి సీఐ జేమ్స్బాబు తదితరులు సోదాల్లో పాల్గొన్నారు. వీఐపీలపై కేసు నమోదు రాడిసన్ హోటల్లోని 1200, 1204 గదుల్లో డ్రగ్ పార్టీ నిర్వహించారు. ఇందులో పాల్గొన్నవారిలో బడా బాబులు, వ్యాపారవేత్తల పిల్లలు, సెలబ్రిటీలు ఉన్నట్లు తెలుస్తోంది. కాగా రఘుచరణ్, సందీప్, క్రిష్, శ్వేత, లిషీ అనే వారిపై కూడా కేసు నమోదు అయ్యింది. కేదార్ ఏవియేషన్ కంపెనీ నిర్వాహకుడిగా, జూబ్లీహిల్స్లోని హైలైఫ్, బఫెల్లో వింగ్స్ పబ్లకు డైరెక్టర్గా ఉన్నట్టు సమాచారం. డ్రగ్స్ పార్టీలకు అడ్డాగా రాడిసన్! గచ్చిబౌలిలోని రాడిసన్ హోటల్ డ్రగ్స్ పార్టీలకు అడ్డాగా మారిందనే ఆరోపణలు విన్పిస్తున్నాయి. ఈ హోటల్లో కొంతకాలంగా డ్రగ్స్ పార్టీలు నిర్వహిస్తున్నట్లుగా పోలీసులు కూడా గుర్తించినట్లు తెలిసింది. కొద్ది నెలల క్రితం రాడిసన్ హోటల్లో మేనేజర్గా పనిచేసిన ఓ వ్యక్తి డ్రగ్స్ కేసులో పట్టుబడిన విషయం తెలిసిందే. స్టార్ హోటళ్ళు, పబ్లు, ప్రైవేట్ పార్టీలలో డ్రగ్స్ వినియోగించవద్దని సైబరాబాద్ పోలీసులు ఇటీవల అవగాహన కార్యక్రమాలు నిర్వహించారు. ఈ సూచనలను పట్టించుకోకుండా రాడిసన్ హోటల్ యధేచ్చగా డ్రగ్ పార్టీలు నిర్వహిస్తున్నట్లు ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. గచ్చిబౌలి (హైదరాబాద్): హైదరాబాద్లో మరోసారి డ్రగ్స్ కలకలం రేగింది. గచ్చిబౌలిలోని రాడిసన్ హోటల్లో డ్రగ్ వినియోగించిన కేసులో హైదరాబాద్కు చెందిన బీజేపీ సీనియర్ నాయకుడు, మంజీరా గ్రూప్ చైర్మన్ గజ్జల యోగానంద్ కుమారుడు, ఆ సంస్థ డైరెక్టర్ గజ్జల వివేకానంద్ను సైబరాబాద్ పోలీసులు అరెస్టు చేశారు. రాడిసన్ హోటల్ ఈ గ్రూప్దే కావడం గమనార్హం. కాగా ఇదే కేసులో నిర్భయ్, శెలగంశెట్టి కేదార్ అనే మరో ఇద్దరు ప్రముఖులను కూడా అదుపులోకి తీసుకున్నట్లు సైబరాబాద్ పోలీస్ కమిషనర్ అవినాష్ మహంతి తెలిపారు. పలువురు వ్యాపారవేత్తలు, సినీ సెలబ్రిటీలపై కేసులు నమోదు చేసినట్లు చెప్పారు. కేదార్కు పలువురు సినీ ప్రముఖులతో సంబంధాలు ఉన్నట్లు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. సోమవారం గచ్చిబౌలిలోని కార్యాలయంలో సీపీ మహంతి వివరాలు వెల్లడించారు. సొంత హోటల్లో 10 మందితో కలిసి..‘శనివారం రాత్రి రాడిసన్ హోటల్లో కొకైన్తో పార్టీ నిర్వహించినట్లు సమాచారం అందింది. దీంతో సైబరాబాద్ ఎస్ఓటీ, గచ్చిబౌలి పోలీసులు హోటల్లో సోదాలు చేశారు. అయితే డ్రగ్ పార్టీలో పాల్గొన్నవారు అప్పటికే అక్కడి నుంచి వెళ్ళిపోయారు. అయితే సీసీ టీవీ ఫుటేజ్ ఆధారంగా గజ్జల వివేకానంద్తో పాటు మరో 9 మంది డ్రగ్ పార్టీలో పాల్గొన్నట్లు పోలీసులు గుర్తించారు. దీంతో జూబ్లీహిల్స్లోని నివాసంలో వివేకానంద్ను అదుపులోకి తీసుకుని ప్రశ్నించారు.వివేకానంద్, నిర్భయ్, కేదార్.. ముగ్గురికీ మెడికల్ ఎగ్జామినేషన్లో భాగంగా మూత్ర పరీక్షలు చేయగా డ్రగ్ పాజిటివ్ వచ్చింది. హోటల్లో కొకైన్ కోసం ఉపయోగించిన ప్లాస్టిక్ కవర్లు 3, డ్రగ్ వినియోగానికి ఉపయోగించిన వైట్ పేపర్లు, మూడు సెల్ఫోన్లను స్వా«దీనం చేసుకున్నారు. మంజీరా గ్రూప్లో పనిచేసిన సయ్యద్ అబ్బాస్ అలీ జెఫ్రీ డ్రగ్ సరఫరా చేసినట్లుగా పోలీసులు గుర్తించారు..’అని మహంతి తెలిపారు. హోటల్పై కేసు నమోదు చేయనున్నట్లు చెప్పారు. మాదాపూర్ డీసీపీ వినీత్ కుమార్, అదనపు డీసీపీ జయరాం, గచ్చిబౌలి సీఐ జేమ్స్బాబు తదితరులు సోదాల్లో పాల్గొన్నారు. వీఐపీలపై కేసు నమోదు రాడిసన్ హోటల్లోని 1200, 1204 గదుల్లో డ్రగ్ పార్టీ నిర్వహించారు. ఇందులో పాల్గొన్నవారిలో బడా బాబులు, వ్యాపారవేత్తల పిల్లలు, సెలబ్రిటీలు ఉన్నట్లు తెలుస్తోంది. కాగా రఘుచరణ్, సందీప్, క్రిష్, శ్వేత, లిషీ అనే వారిపై కూడా కేసు నమోదు అయ్యింది. కేదార్ ఏవియేషన్ కంపెనీ నిర్వాహకుడిగా, జూబ్లీహిల్స్లోని హైలైఫ్, బఫెల్లో వింగ్స్ పబ్లకు డైరెక్టర్గా ఉన్నట్టు సమాచారం. డ్రగ్స్ పార్టీలకు అడ్డాగా రాడిసన్! గచ్చిబౌలిలోని రాడిసన్ హోటల్ డ్రగ్స్ పార్టీలకు అడ్డాగా మారిందనే ఆరోపణలు విన్పిస్తున్నాయి. ఈ హోటల్లో కొంతకాలంగా డ్రగ్స్ పార్టీలు నిర్వహిస్తున్నట్లుగా పోలీసులు కూడా గుర్తించినట్లు తెలిసింది. కొద్ది నెలల క్రితం రాడిసన్ హోటల్లో మేనేజర్గా పనిచేసిన ఓ వ్యక్తి డ్రగ్స్ కేసులో పట్టుబడిన విషయం తెలిసిందే. స్టార్ హోటళ్ళు, పబ్లు, ప్రైవేట్ పార్టీలలో డ్రగ్స్ వినియోగించవద్దని సైబరాబాద్ పోలీసులు ఇటీవల అవగాహన కార్యక్రమాలు నిర్వహించారు. ఈ సూచనలను పట్టించుకోకుండా రాడిసన్ హోటల్ యధేచ్చగా డ్రగ్ పార్టీలు నిర్వహిస్తున్నట్లు ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. -
HYD: భారీగా డ్రగ్స్ సీజ్.. బీజేపీ నేత కుమారుడు అరెస్ట్!
సాక్షి, హైదరాబాద్: నగరంలోని గచ్చిబౌలిలో భారీగా డ్రగ్స్ను స్వాధీనం చేసుకున్నారు పోలీసులు. ఈ క్రమంలో డ్రగ్స్తో సంబంధం ఉన్న బీజేపీ నేత కుమారుడితో సహా మరో ఇద్దరిని కూడా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వివరాల ప్రకారం.. గచ్చిబౌలిలోని రాడిసన్ హోటల్లో భారీగా డ్రగ్స్ను పట్టుకున్నారు పోలీసులు. కాగా, ఓ బీజేపీ నేత కుమారుడు నిన్న రాత్రి కొందరికి విందు ఏర్పాటు చేశాడు. ఈ క్రమంలో విందులో కొకైన్ తీసుకున్నట్టు గుర్తించారు. ఇక, హోటల్లో కొకైన్ను స్వాధీనం చేసుకున్నారు. దీంతో బీజేపీ కుమారుడితో సహా మరో ఇద్దరిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ప్రస్తుతం వారు ముగ్గురు గచ్చిబౌలి పోలీసు స్టేషన్లో ఉన్నారు. -
హైదరాబాద్ లో గచ్చిబౌలి డ్రగ్స్ కేసులో మరొకరి పట్టివేత
-
గచ్చిబౌలిలో ది సాగా బిగ్గెస్ట్ కార్నివాల్ పోస్టర్ లాంచ్(ఫొటోలు)
-
హైదరాబాద్ గచ్చిబౌలిలో భారీగా నగదు పట్టివేత
-
ఎన్నికల వేళ కరెన్సీ కలకలం.. మరో ఐదు కోట్లు స్వాధీనం
సాక్షి, హైదరాబాద్: తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికలకు ఈనెల 30వ తేదీన పోలింగ్ జరుగనుంది. మరోవైపు.. ఎన్నికల నేపథ్యంలో పోలీసులు విస్తృతంగా తనిఖీలు చేపడుతున్నారు. ఇక, తనిఖీలో భాగంగా భారీగా నగదు పట్టుబడుతున్నది. తాజాగా మరో ఐదు కోట్ల నగదును పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. దీంతో, ఇప్పటి వరకు పట్టుబడిన నగదు ఏకంగా రూ.650 కోట్లకు పైగానే చేరుకున్నట్టు సమాచారం. వివరాల ప్రకారం.. ఎన్నికల సందర్బంగా గచ్చిబౌలి పరిధిలో మాదాపూర్ ఎస్ఓటీ పోలీసులు తనిఖీలు నిర్వహించారు. ఈ సందర్భంగా భారీగా నగదును పట్టుకున్నారు. రెండు కార్లలో రూ.5కోట్ల సొత్తును పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. కొండాపూర్ బొటానికల్ రోడ్డు నుంచి చిరెక్ పబ్లిక్ స్కూల్ వైపుగా కారులో గుర్తు తెలియని వ్యక్తులు నగదును తరలిస్తున్నట్లు పోలీసులకు సమాచారం అందింది. దీంతో పోలీసులు రంగంలోకి దిగి సోదాలు నిర్వహించారు. ఈ క్రమంలో కార్లలో రూ.5కోట్లను తరలిస్తున్నట్లు గుర్తించి.. నగదును సీజ్ చేశారు. అయితే, పట్టుబడిన నగదు ఓ వ్యాపారవేత్తదిగా సమాచారం. పోలీసులు పట్టుకున్న నగదును ఐటీశాఖకు అప్పగించారు. ఇది కూడా చదవండి: పవన్ కంటే బర్రెలక్క నూరుపాళ్లు నయం! -
చంద్రబాబుకు కొత్త టెన్షన్.. సన్నిహితులపై ఆక్రోశం!
ఫార్టీ ఇయర్స్ పొలిటికల్ ఇండస్ట్రీ. పదనాలుగేళ్ల పాటు సీఎంగా ఉన్న అనుభవం. మరో పదిహేనేళ్లు ప్రతిపక్ష నేతగా వ్యవహారం. అన్నీ ఉండీ కూడా చంద్రబాబు నాయుడు జైలుకు వెళ్తే ఏ ఒక్క వర్గం నుంచీ కూడా ఎందుకు స్పందన లభించలేదు? చంద్రబాబును అరెస్ట్ చేసి జైలుకు పంపితే తప్పు చేశారు కాబట్టే జైలుకు పంపారని అంటున్న వాళ్లే ఎక్కువ మంది ఉన్నారు. బాబు కుటుంబ సభ్యులు మినహా ఏ ఒక్కరూ కూడా అరెస్ట్ అన్యాయం అన్న మాటే అనడం లేదు. ప్రజల నుండి స్పందన ఉందని అనిపించుకోవడం కోసం కోట్లకు కోట్లు ఖర్చు పెట్టి గచ్చిబౌలిలో సంగీత కచేరి తరహా కార్యక్రమం నిర్వహించారే తప్ప ప్రజలు తమంతటగా తాము బాబును విడదల చేయాలని కూడా కోరలేదు. ఇదే చంద్రబాబును తీవ్రంగా కలచి వేసిందట. రూ.371 కోట్ల లూటీ కేసులో చంద్రబాబును సెప్టెంబరు తొమ్మిదో తేదీన అరెస్ట్ చేసి జైలుకు పంపిన సంగతి తెలిసిందే. 52 రోజుల పాటు చంద్రబాబు జైల్లో ఉన్నా అయ్యో పాపం అన్న వారే లేకుండా పోయారు. రాష్ట్రంలో ఏ ఒక్క వర్గమూ చంద్రబాబుకు అన్యాయం జరిగిందని భావించడం లేదు. ఆయన దోపిడీకి సంబంధించి.. దర్యాప్తు సంస్థల వద్ద సాక్ష్యాలు ఉన్నాయి కాబట్టే న్యాయస్థానం ఆయన్ను జైలుకు పంపిందని వారు నమ్ముతున్నారు. ఒక్క నారా, నందమూరి కుటుంబాలు .. సినీరంగంలోని ఓ నలుగురు టీడీపీ కార్యకర్తలు, బాబు కేబినెట్లో పదవులు అనుభవించిన వారు తప్ప ఎవ్వరూ కూడా బాబును అన్యాయంగా జైలుకు పంపారని ఆరోపించడం లేదు. చట్టం తన పని తాను చేసుకుపోతుందనే అంతా అంటున్నారు. ఏ తప్పూ చేయకపోతే చంద్రబాబు అండ్ కో ఎందుకంత ఫ్రస్ట్రేషన్లో కూరుకుపోయారో చెప్పాలని వారంటున్నారు. చంద్రబాబు జైల్లో ఉంటే మా నాయకుణ్ని అరెస్ట్ చేయడం కరెక్ట్ కాదని ఏ వర్గమూ అనలేదు. ఎవ్వరూ పట్టించుకోవడం లేదని.. ఏ ఒక్క వర్గమూ అండగా నిలబడటంలేదని కుత కుతలాడిపోతూనే.. గచ్చిబౌలిలో ఐటీ ఉద్యోగుల పేరిట ఓ మ్యూజికల్ కాంసెర్ట్ తరహా షో ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమాన్ని కూడా చంద్రబాబు సామాజిక వర్గ పెద్దలే కోట్లు ఖర్చు పెట్టి వివిధ రంగాలకు చెందిన వారిని ఐటీ ఉద్యోగుల ముసుగులో గచ్చిబౌలి స్టేడియానికి తరలించారు. చంద్రబాబు వల్ల లబ్ధిపొందాం కాబట్టే ఆయనకు మద్దతుగా స్టేడియానికి వచ్చి షో చేశామని ఐటీ ఉద్యోగులమని చెప్పుకుంటున్న వారు అన్నారు. లాజిక్ మిస్.. ఒక వేళ అదే నిజం అనుకున్నా ఇక్కడే టీడీపీ నేతలు చంద్రబాబు తరఫున హడావిడి చేస్తోన్న కొద్దిమంది ఓ లాజిక్ మిస్ అయిపోతున్నారు. 14ఏళ్ల చంద్రబాబు పాలనలో లబ్ధి పొందింది కేవలం కొద్ది మంది ఉద్యోగులే అని వారికి వారే చెప్పుకుంటున్నారు. ఆయన గురించి రైతులు కానీ.. విద్యార్ధులుకానీ.. కార్మికులుకానీ.. మహిళలు కానీ.. బీసీ, ఎస్సీ, ఎస్టీ వర్గాల వారు కానీ ఎందుకు గచ్చిబౌలి తరహా కార్యక్రమాలు నిర్వహించలేదు. ఎక్కడా ఆందోళనలు చేపట్టలేదు. కనీసం నినాదాలు కూడా చేసింది లేదు. చంద్రబాబు మధ్యంతర బెయిల్పై జైలు నుండి విడుదలైనప్పుడు తనకు ప్రపంచవ్యాప్తంగా మద్దతు లభించిందని చెప్పుకున్నారు. అయితే, అక్కడి నుంచి ఇంటికి వెళ్లిన తర్వాత మాత్రం సన్నిహితులతో మాట్లాడుతూ చంద్రబాబు చాలా నిర్వేదంగా మాట్లాడినట్లు సమాచారం. ఇదేంటి? ఏ ఒక్క వర్గానికీ మనం అక్కర్లేదన్నమాట.. మనల్ని అరెస్ట్ చేస్తే ఎవరికీ ఏమీ కాదన్నమాట అని తన వాళ్లతో చెప్పుకుని బాధపడ్డారని తెలుస్తోంది. గచ్చిబౌలి కార్యక్రమం అయినా మనంతట మనం చొరవ తీసుకుని డబ్బులు ఖర్చు పెడితేనే అయ్యిందని సన్నిహితులు చెప్పడంతో చంద్రబాబు మొహం వివర్ణం అయిపోయిందని భోగట్టా. ప్రజలంతా ఒక విధంగా తనని బాయ్ కాట్ చేసేశారని చంద్రబాబు తీవ్రంగా ఆందోళన చెందుతున్నట్లు పార్టీ వర్గాలే చెప్పుకుంటున్నాయి. అధికారంలో ఉన్నప్పుడు మనం వారిని పట్టించుకోలేదు.. ఇపుడు వారు మనల్ని పట్టించుకోవడం లేదని ఓ సీనియర్ నేత అనడంతో చంద్రబాబు ఏం మాట్లాడలేక శూన్యంలోకి చూస్తూ ఉండిపోయారట. నాలుగు వారాల్లో కంటి ఆపరేషన్ చేయించుకుని మళ్లీ జైలుకు వెళ్లాల్సి ఉన్న నేపథ్యంలో జనాన్ని ఆకర్షించడానికి ఇక మార్గమే లేదా అని ఆయన మదనపడుతున్నట్లు చెబుతున్నారు. -కుర్చీ కింద కృష్ణయ్య. -
బండ్ల బాజాతో మూడు గుళికలు.. ఎంత ఊదినా అంతే!
తెదేపా అధినేత చంద్రబాబు హైదరాబాద్ను ఏదో చేసి 25 సంవత్సరాలైందని గచ్చిబౌలి స్టేడియంలో ఓ కార్యక్రమం ఏర్పాటు చేశారు. ప్రస్తుత పరిస్థితిలో మామూలు సభలకే జనాలు రావడం లేదు. అలాంటిది ఈ సభకు జనాలను తరలించడంలో మ్యూజికల్ నైట్ అనేది ఒకటి ఏర్పాటు చేసి మొత్తానికి కాస్త జనాలను రప్పించారు నిర్వాహకులు. ఇదే సభలో ఏతా వాతా లేని టాలీవుడ్ నిర్మాత అయిన బండ్ల గణేష్ చంద్రబాబు గురించి బాకా ఊదుతూ ఓ రెండు, మూడు బ్రాండింగ్ గుళికలను వదిలారు. అదేమిటో ఇప్పుడు చూద్దాం. వాటిలో మొదట ప్రముఖంగా చెప్పుకోదగినది బండ్లగణేష్ చేసిన విచిత్ర ప్రతిపాదన.. అదే ఖైదీ మార్పిడి... అదేంటని విస్తుపోయారా? మీరే కాదు సభలో ఉన్న వారితో పాటు ఈ విషయం విన్న వారందరూ ఒక్కసారిగా అవాక్కయ్యారు. ప్రస్తుతం అవినీతి కేసులో జైల్లో ఉన్న చంద్రబాబుకు బదులు తనను జైల్లో పెట్టమని అభ్యర్ధించాడు. చంద్రబాబు వీరాభిమానిగా చెప్పుకుని బాకాలూదే బండ్ల గణేశుడు. జైల్లో పెట్టడం సరే అభిమానంతో అన్నాడని అనుకోవచ్చు. కానీ ఆ తరువాత అన్న మాటే విన్న వారందరూ విస్తుపోయారు. తనను జైల్లో పెట్టినా నా భార్య ఏమీ అనుకోదు అని గొప్ప గుళిక వదిలారు బండ్ల గణేశ్. ఇక బండ్ల గణేష్ వదిలిన రెండో గుళిక ఏంటంటే.. ఊర్లలో ఉన్న వాళ్లందరూ హైదరాబాద్లో సాఫ్ట్వేర్ జాబులకు వెళ్తూ ఉంటే మన బండ్లకు కడుపు తరుక్కుపోయిందట. ఎందుకంటే చంద్రబాబు అనే వాడు లేకపోతే సాఫ్ట్వేర్ అనేది లేకుండా లక్షలాది మందికి ఇప్పటికీ ఉద్యోగాలు వచ్చేవి కాదట. అసలు హైదరాబాదే ఉండేది కాదంట. అంతేకాదు వీరందరికీ చంద్రబాబు ఆదర్శప్రాయుడని బాగా బజాయించాడు బాకాలూదే బండ్లగణేశుడు. చిట్టచివరి బండ్ల గుళిక ఏంటంటే... మహానటి సినిమా మీకందరికీ గుర్తు ఉండే వుంటుంది. ఆ సినిమా మొదట్లో దర్శకుడు సావిత్రి వేషధారికి ఓ సన్నివేశం వివరిస్తూ ఈ సీన్లో ఓ కంట మాత్రం కన్నీరు రావాలి అని చెబితే మహానటి సావిత్రి ఆ సన్నివేశంలో ఓ కంట మాత్రం కన్నీరు కార్చి యూనిట్ సభ్యులనందరినీ ఆశ్చర్యపరిచింది. ఇదే విధంగా చంద్రబాబు సభలో బండ్ల గణేష్ ఆవేదనతో గొంతు వణుకుతూ తన ఏడుపును వినిపించాడు కాని కనిపించలేదు. అదేమిటి ఏడుపు కనిపించలేదు అనుకుంటున్నారా? మీరే చెప్పండి ఎదుటి వ్యక్తి ఏడుస్తున్నాడు అని మనం ఎప్పుడు అనుకుంటాం? వచ్చే కన్నీళ్లని బట్టి అని కచ్చితంగా ఎవరైనా చెప్తారు. కాని మన నటనిర్మాత అయిన బండ్ల గణేష్ తన ఏడుపును గొంతుతోనే వినిపించి కంట చుక్క కన్నీరు కూడా కనిపించకుండా చేసిన ఆయన నిజంగా మహానటుడు. ఆఖరుగా ఒక్క మాట బండ్ల బాకా ఊదినా.. గచ్చిబౌలిలో గోల రేగినా.. అవినీతి కేసులో ఇరుక్కున్న చంద్రబాబు మీద జనాలకి వచ్చేది సింపతీకాదు, సీ(చి)రాకు మాత్రమే. -
గచ్చిబౌలిలో 25 ఏసీ ఎలక్ట్రిక్ బస్సుల ప్రారంభం
హైదరాబాద్: హైదరాబాద్ రోడ్లపై ఇకనుంచి ఎలక్ట్రిక్ బస్సులు నడవనున్నాయి. గచ్చిబౌలిలో 25 ఏసీ ఎలక్ట్రిక్ బస్సులు నేడు ప్రారంభం అయ్యాయి. రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్, ఆర్టీసీ ఎండీ సజ్జనర్లు ఈ బస్సులను ప్రారంభించారు. వేవ్ రాక్, బాచుపల్లి, సికింద్రబాద్, కొండాపూర్, మియాపూర్, శంషాబాద్ ఎయిర్ పోర్ట్, జేబీఎస్, హైటెక్ సిటీ, ఎల్బీ నగర్ మధ్య ఈ బస్సులు నడవనున్నాయి. సీసీ కెమెరాలు, ప్రయాణికులకు ఛార్జింగ్ సదుపాయం వంటి అధునాతన సౌకర్యాలు ఇందులో ఉన్నాయి. 'రాబోయే తరాలకు పర్యావరణ కాలుష్యం లేకుండా సౌకర్యాలను అందించాలి. ఎంత కష్టాల్లో tsrtc ఉన్నా ప్రయాణికుల సంక్షేమమే మాకు ముఖ్యం. 550 బస్సులు హైదరాబాద్ లో నడపాలని నిర్ణయించాం. ముందుగా 50 బస్సులు వచ్చాయి. అందులో 25 ఇవాళ ప్రారంభిస్తున్నాం. వచ్చే కొన్ని ఏసీ లేని బస్సులు వస్తున్నాయి. వాటిని కూడా ఏసీగా మార్చి నడిపించాలనుకుంటున్నాం. మెట్రో వీటిన్నింటిని అనుసంధానం చేయాలి.' అని మంత్రి పువ్వాడ అజయ్ అన్నారు. 'కొత్త 25 ఎలక్ట్రిక్ బస్సులను తీసుకొచ్చాం. కాలుష్య ప్రభావం కొంత తగ్గుతుంది. ఎయిర్ పోర్టుకు గతంలో నడిచేవి. అందుకే మరిన్ని కొత్త బస్సులను నడుపుతున్నాం. ప్రయాణికుల ఆదరణ పెరుగుతోంది. ఐటీ కారిడార్ తో పాటు, శంషాబాద్ ఎయిర్ పోర్ట్ కు తిప్పుతున్నాం. 470 బస్సులు వచ్చే ఆరునెలల్లో నడుపుతాం. సీసీ కెమెరాలు ఏర్పాటు చేశాం.' అని ఆర్టీసి ఎండీ సజ్జనార్ అన్నారు. కేంద్రం నుంచి గతంలో సబ్సిడీ వచ్చేది కానీ ఇప్పుడు అదికూడా రాట్లేదని మంత్రి పువ్వాడ అన్నారు. ప్రస్తుతం ఇందులో 35 సీట్ల సామర్ధ్యం మాత్రమే ఉంది.. కానీ త్వరలో సీటింగ్ కెపాసిటీ కూడా పెంచేలా చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు. రాష్ట్ర ప్రభుత్వం uv పాలసీ తీసుకొచ్చి ఎలక్ట్రికల్ వాహనాల వైపు మొగ్గు చూపుతుందని చెప్పారు. కోటి 52 లక్షల వాహనాలు తెలంగాణ లో ఉన్నాయి.. వీటన్నింటినీ ఎలక్ట్రిక్ దిశగా మార్చాలని అన్నారు. ఆర్టీసి ఉద్యోగుల ప్రధాన సమస్య తీరింది వారిని ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించామని పేర్కొన్న మంత్రి పువ్వాడ.. మరో నెలలో ఈ ప్రాసెస్ కూడా పూర్తవుతుందని చెప్పారు. ఇదీ చదవండి: యాదాద్రి జిల్లాలో విషాదం.. ఆర్టీసీ బస్సు బోల్తా.. ఇద్దరు మృతి.. -
గచ్చిబౌలిలో మహిళపై హత్యాచారం.. గవర్నర్ ఆవేదన
సాక్షి, హైదరాబాద్: గచ్చిబౌలి పోలీస్ స్టేషన్ పరిధిలో దారుణం వెలుగు చూసింది. నానక్రాంగూడ ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్లో ఓ నిర్మాణ సంస్థలో మహిళపై గుర్తు తెలియని వ్యక్తులు అత్యాచారం చేసి హత్య చేశారు. అఘాయిత్యానికి ఒడిగట్టిన అనంతరం బండరాయితో తలపై మోది చంపేశారు. మృతురాలిని గౌలిదొడ్డి కేశవనగర్ వడ్డెర బస్తీకి చెందిన మహిళ (38)గా పోలీసులు గుర్తించారు. మృతురాలికి ఇద్దరు కొడకుడు, ఒక కూతురు ఉన్నారు. బాధితురాలు వేస్ట్ మెటీరియల్ను తీసుకునేందుకు నిర్మాణ సంస్థలోకి వచ్చినట్లు భావిస్తున్నారు. ఒంటరిగా ఉన్న మహిళను బంధించి నిందితులు ఈ దారుణానికి ఒడిగట్టినట్లు తెలుస్తోంది. నిర్మాణ సంస్థలో నిర్మానుష్య ప్రాంతంలో దుస్తులు లేకుండా పడి ఉన్న మహిళ మృతదేహాన్ని చూసి కూలీలు పోలీసులకు సమాచారం ఇచ్చారు. కాగా శుక్రవారం గచ్చిబౌలి పోలీస్ స్టేషన్లో మిస్సింగ్ కేసు నమోదు అవ్వగా.. నేడు ఆలస్యంగా మహిళ హత్య ఘటన వెలుగులోకి వచ్చింది. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. గవర్నర్ ఆవేదన గచ్చిబౌలి పోలీస్స్టేషన్ పరిధిలోని నానక్రామ్గూడలో జరిగిన అత్యాచారం, హత్య ఘటనపై గవర్నర్ డాక్టర్ తమిళిసై సౌందరరాజన్ తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. ఘటనపై 48 గంటల్లోగా సమగ్ర నివేదిక ఇవ్వాలని సీఎస్, డీజీపీ, సైబరాబాద్ సీపీలను ఆదేశించారు. చదవండి: ఎన్టీఆర్ జిల్లా: రన్నింగ్ కారులో మంటలు.. ఒక్కసారిగా -
కస్టోడియల్ మరణంపై సీసీటీవీ ఫుటేజీ అందజేయండి
సాక్షి, హైదరాబాద్: కస్టోడియల్ మరణం చోటుచేసుకున్న హైదరా బాద్ గచ్చిబౌలి పోలీస్స్టేషన్లోని జూలై 7వ తేదీ నాటి సీసీటీవీ ఫుటేజీని అందజేయాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని హైకోర్టు ఆదేశించింది. ఆ ఫుటేజీని చాంబర్లోగానీ, లేదా వీలైతే కోర్టుహాల్లోగానీ పరిశీలించి నిర్ణయం తీసుకుంటామని స్పష్టం చేసింది. సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు రాష్ట్రవ్యాప్తంగా పోలీస్స్టేషన్లలో ఎన్ని సీసీ కెమెరాలు ఏర్పాటు చేశారు.. ఎన్నిచోట్ల పనిచేస్తున్నాయి.. ఎన్నిచోట్ల పనిచేయడంలేదు.. లాంటి వివరాలతో నివేదిక అందజేయాలని అధికారులకు ఆదేశాలు జారీ చేసింది. గచ్చిబౌలి పోలీస్స్టేషన్లో భవన నిర్మాణకార్మికుడు గత నెల 7న అనుమానాస్పదంగా మృతి చెందిన విషయం తెలిసిందే. బిహార్కు చెందిన నితీశ్ నానక్రాంగూడలో భవన నిర్మాణకార్మికుడిగా పనిచేస్తున్నాడు. ఈ క్రమంలో అక్కడి భద్రతాసిబ్బంది, కార్మికులు రెండువర్గాలుగా విడిపోయి దాడులకు దిగారు. పోలీసులు ఘటనాస్థలానికి చేరుకుని గాయపడిన ఇద్దరిని ఆసుపత్రికి తరలించారు. పోలీసులు నితీశ్ని అదుపులోకి తీసుకొని గచ్చిబౌలి పోలీస్స్టేషన్కు తరలించగా అనుమానాస్పదస్థితిలో మృతి చెందారు. పత్రికల్లో వచ్చిన నితీశ్ మృతి వార్తపై న్యాయవాది రాపోలు భాస్కర్ స్పందించి కస్టోడియల్ మరణంపై న్యాయ విచారణ జరపాలని హైకోర్టు ప్రధాన న్యాయమూర్తికి లేఖ రాశారు. 15 రోజులు గడువు కావాలి.. ‘మద్యం సేవించేందుకు అర్థరాత్రి భవన నిర్మాణకార్మికులు బయటకు వెళ్లకుండా ఆంక్షలు విధించారు. ఈ క్రమంలో గొడవ జరిగింది. ఈ వివాదంలో నితీశ్ను పోలీసుస్టేషన్కు తీసుకువెళ్లిన పోలీసులు మూడు రోజులపాటు లాకప్లో ఉంచి విచారణ చేశారు. తీవ్ర అస్వస్థతకు గురైన నితీశ్ను ఆస్పత్రికి తరలించగా మృతిచెందాడు. పోలీసుల చిత్రహింసల వల్లే అతడు చనిపోయా డని పత్రికల్లో వచ్చింది. అయితే ఆయన గుండెపోటుతోనే చని పోయాడని పోలీసులు పేర్కొంటున్నారు’అని న్యాయవాది లేఖలో పేర్కొన్నారు. ఈ లేఖను సుమోటో రిట్ పిటిషన్గా హైకోర్టు విచారణకు స్వీకరించింది. దీనిపై ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ అలోక్ అరాధే, జస్టిస్ వినోద్కుమార్ ధర్మాసనం గురువా రం విచారణ చేపట్టింది. ప్రభుత్వం తరఫున ఏఏజీ రామచందర్రావు వాదనలు వినిపిస్తూ.. గచ్చిబౌలి పోలీస్స్టేషన్లో సీసీ కెమెరాలు ఉన్నాయని, ఫుటేజీ సమర్పిస్తామని చెప్పారు. దీనికి 15 రోజుల గడువు కావాలని కోరారు. గుండెపోటు కారణంగానే బాధితుడు మృతి చెందాడన్నారు. సీసీటీవీ ఫుటేజీని సమర్పించేలా ఆదేశాలు ఇవ్వాలని పిటిషనర్ తరఫు న్యాయవాది విజ్ఞప్తి చేశారు. వాదనలు విన్న ధర్మాసనం ఆ ఫుటేజీని సమర్పించాలని ఆదేశిస్తూ విచారణ వాయిదా వేసింది. -
గచ్చిబౌలి బయోడైవర్సిటీ ఫ్లైఓవర్ పై రోడ్డు ప్రమాదం
-
బయోడైవర్సిటీ ఫ్లైఓవర్పై స్పోర్ట్స్ బైక్ ప్రమాదం.. యువకుడు మృతి
సాక్షి, హైదరాబాద్: నగరంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో ఓ యువకుడు మృతిచెందగా మరో యువకుడు తీవ్రంగా గాయపడ్డారు. ఈ ఘటన గచ్చిబౌలిలో చోటుచేసుకుంది. మితి మీరిన వేగంతో బైక్పై వెళ్తూ అదుపు తప్పి రెయిలింగ్ను ఢీకొట్టి ఫ్లై ఓవర్పై నుంచి పడి మృతి చెందాడు. వివరాల ప్రకారం.. ఆదివారం అర్ధరాత్రి ఇద్దరు యువకులు ద్విచక్ర వాహనంపై ప్రయాణిస్తూ ఫ్లైఓవర్పైనున్న డివైడర్ను ఢీకొన్నారు. దీంతో ఒక ఫ్లైఓవర్ నుంచి మరో ఫ్లైఓవర్ మీదకు పడిపోయారు. కాగా, మెదక్ జిల్లా కకునూరుపల్లికి చెందిన బండి మధు(26), సూర్యాపేట జిల్లాకు చెందిన మచ్చగిరి (24) గచ్చిబౌలి టిమ్స్ ఆస్పత్రిలో ఎంఆర్ఐ టెక్నీషియన్లుగా పనిచేస్తూ మధురానగర్లో నివాసం ఉంటున్నారు. వీరు బైకుపై ఆస్పత్రికి బయలుదేరారు. బయోడైవర్సిటీ ఫ్లై ఓవర్పై షాగౌస్ సమీపంలో ఫ్లై వర్పై కుడి వైపు రెయిలింగ్కు ఢీ కొట్టడంతో ఫ్లై ఓవర్ నుంచి కింద పడ్డారు. కాగా, తీవ్ర గాయాలతో మధు అక్కడికక్కడే మృతి చెందగా, తీవ్ర గాయాలతో గిరి కేర్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు. ఇద్దరు మద్యం మత్తులో ఉన్నారని పోలీసులు పేర్కొంటున్నారు. టిమ్స్ ఆస్పత్రికి వెళ్లాలంటే బయోడైవర్సిటీ ఫ్లై ఓవర్ పైకి వెళ్లాల్సిన అవసరం లేదు. ఎందుకు అటు వైపు వెళ్లారో అర్థం కావడం లేదని పోలీసులు తెలిపారు. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. మధు మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఉస్మానియాకు తరలించారు. ఇది కూడా చదవండి: టమాటా దొంగలు అరెస్ట్ -
HYD: పోలీసు స్టేషన్లో కస్టోడియల్ డెత్!.. కారణం అదేనా?
సాక్షి, హైదరాబాద్: ఓ గొడవకు సంబంధించిన వ్యవహారంలో విచారించేందుకు తీసుకువచ్చిన సెక్యూరిటీ గార్డు పోలీస్స్టేషన్లోనే మృతి చెందాడు. ఆదివారం ఉదయం హైదరాబాద్లోని గచ్చిబౌలి పోలీస్స్టేషన్లో ఈ ఘటన జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల మేరకు.. నానక్రాంగూడలోని ఓ లేబర్ క్యాంపులో బిహార్కు చెందిన నితీశ్(32), బిట్టు, వికాస్లు సెక్యూరిటీ గార్డులుగా పనిచేస్తున్నారు. అయితే, క్యాంపులోని కూలీలు శనివారం రాత్రి 11 గంటలకు బయటికి వెళ్లేందుకు ప్రయత్నించగా.. వీరు అడ్డుకోవడంతో గొడవ జరిగింది. ఈ క్రమంలో ఇద్దరు కూలీలకు గాయాలయ్యాయి. బాధితులు డయల్ 100కు కాల్ చేయడంతో గచ్చిబౌలి పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. గాయాలైన కూలీలను ఆస్పత్రికి తరలించి.. ముగ్గురు సెక్యూరిటీ గార్డులను అదుపులోకి తీసుకుని, విచారణ కోసం పోలీస్స్టేషన్కు తీసుకెళ్లారు. అయితే వీరిలో నితీశ్ ఆదివారం ఉదయం 7.55 గంటల సమయంలో ఒక్కసారిగా అపస్మారక స్థితికి వెళ్లాడు. పోలీసు సిబ్బంది అది గమనించి తొలుత సీపీఆర్ చేశారు. తర్వాత సమీపంలోని హిమగిరి ఆస్పత్రికి తరలించారు. కొద్దిసేపు చికిత్స చేసిన వైద్యులు నితీశ్ మృతి చెందాడని ప్రకటించారు. ఈ ఘటనపై మాదాపూర్ డీసీపీ శిల్పవల్లి వివరణ ఇస్తూ.. కూలీలు, సెక్యూరిటీ గార్డులకు మధ్య గొడవ జరగడంతో అదుపులోకి తీసుకున్నామని, ఛాతీలో తీవ్రనొప్పితో నితీశ్ మృతి చెందాడని తెలిపారు. ఘటనపై విచారణ జరుపుతామని పేర్కొన్నారు. ఇది కూడా చదవండి: జర జాగ్రత్త.. నెలలో రెండు లక్షల మందికి జ్వరాలు -
Hyderabad: గూబ గుయ్మంటోంది.. నిద్రపోని మహానగరం
అర్ధరాత్రి ఒంటి గంట.. రెండు గంటలు.. ఎప్పుడైనా జూబ్లీహిల్స్, బంజారాహిల్స్ మెయిన్రోడ్లు చూశారా.. బంపర్ లైట్లు వేసుకుంటూ.. గట్టిగా హారన్లు కొట్టుకుంటూ కార్లు, టూవీలర్లు లెక్కకు మించి అతివేగంగా వెళ్తుంటాయి. ఏదో ఒక్క రోజు.. రెండు రోజులో కాదు.. ప్రతిరోజూ ఇదే వరస.. వాస్తవానికి సగటున పగటిపూట కంటే కూడా ఆయా రోడ్లపై రాత్రి పూట తిరిగే వాహనాలే ఎక్కువని ఓ అంచనా. హైదరాబాద్ మహానగరంలో రాత్రిళ్ల ఉద్యోగాలు, ప్రజల జీవనశైలి అలవాట్లలో వచ్చిన మార్పులకు పగలు, రాత్రి అనే తేడాలు చెరిగిపోయాయి. అయితే వచ్చిన చిక్కల్లా ఏమిటంటే విపరీతమైన శబ్దకాలుష్యం. చెవులకు చిల్లులు పడే ధ్వనుల మోత. పెరిగిన వాహనాలతోపాటు పెద్దఎత్తున సాగుతున్న గృహనిర్మాణ, మౌలిక సదుపాయాల కల్పన పనులు, పరిశ్రమలు.. డీజే సౌండ్లు, హడావుడితో అర్ధరాత్రి ఫంక్షన్లు తదితర రూపాల్లో పరిమితులకు మించి శబ్దాలు వెలువడుతున్నాయి. సాక్షి, హైదరాబాద్ : తాజాగా తెలంగాణ కాలుష్య నియంత్రణబోర్డు (పీసీబీ) గణాంకాలను పరిశీలిస్తే... పగలు కంటే కూడా రాత్రి సమయాల్లోనే మోతాదుకు మించి శబ్దాలు వెలువడుతున్నట్టు వెల్లడైంది. ఎప్పటి లెక్కో కాదు...తాజాగా ఈ నెల 1 నుంచి 14వ తేదీల మధ్య వెలువడిన శబ్దాలకు సంబంధించిన సమాచారం గమనిస్తే... జూబ్లీహిల్స్, జేఎన్టీయూ, తార్నాక, జూ పార్కు, గచ్చిబౌలిలలో పగటిపూట కంటే కూడా రాత్రిళ్లు ధ్వనులు ఎక్కువగా వెలువడుతున్నట్టు స్పష్టమవుతోంది. ఈ ఏడాది ప్రారంభం జనవరి 1 నుంచి జూన్ 30 వరకు దాదాపుగా ఇదే ట్రెండ్ కొనసాగిందంటే వాస్తవ పరిస్థితి అర్ధం చేసుకోవచ్చు. మారిన జీవనశైలి అలవాట్లతో... పగలు, రాత్రి అనే తేడా లేకుండా వాహనాలు, ఇతర రూపాల్లో అంతకంతకూ పెరుగుతున్న విపరీతమైన ధ్వనులతో ప్రజలకు ఇబ్బందులు తప్పడం లేదు. నిర్ణీత పరిమితులకు మించి వెలువడుతున్న శబ్దాలతో చిన్నపిల్లలు మొదలు వృద్ధుల వరకు ప్రభావితమవుతున్నారు. జీవనశైలి అలవాట్లలో వచ్చిన మార్పు చేర్పులతో పగటి కంటే కూడా రాత్రిపూట పొద్దుపోయే దాకా వాహనాల రాకపోకలు, పెద్దశబ్దంతో హారన్లు మొగించడం, ఫంక్షన్లు, ఇతర కార్యకలాపాలు శబ్దాల పెరుగుదలకు కారణమవుతున్నాయి. ఉదయం 9 నుంచి సాయంత్రం 7 లోపు నిర్ణీత ఆఫీస్ పనివేళల్లో పనిచేసే వారితోపాటు అమెరికా, యూరప్, బ్రిటన్ వేళలను బట్టి పనిచేసేవారు కూడా ఉంటున్నారు. రోజుకు మూడు, నాలుగు షిఫ్టుల్లో ఉద్యోగ విధులు, బాధ్యతల నిర్వహణలో నిమగ్నమవుతున్నవారి సంఖ్య పెరుగుతోంది. ఉద్యోగాలు, వ్యాపారాలు, చదువు, ఇతర విధులు, బాధ్యతల్లో నిమగ్నమైనవారు పనిచేసే సమయాలు కూడా మారిపోతున్నాయి. అధిక ధ్వనులతో ఆరోగ్యంపై దుష్ప్రభావం రాత్రిపూట విశ్రాంతి తీసుకునే సమయంలో వాహనాలు, ఇతర రూపాల్లో ధ్వనులు పెరగడం వంటివి వివిధ సమస్యలకు పరోక్షంగా కారణమవుతున్నట్టుగా నిపుణులు చెబుతున్నారు. మోతాదుకు మించి అధికంగా వెలువడే ధ్వనులతో ఆరోగ్యం, మానసికస్థితి తదితరాలపై తమకు ఎలాంటి దుష్ఫలితాలు కలుగుతాయన్న దానిపై ప్రజలకు ఇంకా పూర్తిస్థాయి అవగాహన ఏర్పడలేదు. వాయుకాలుష్యం కారణంగా ఎలాంటి సమస్యలు వస్తాయో తెలిసినంతగా శబ్దకాలుష్యం గురించి అంత అవగాహన కలగకపోవడంతో వివిధ రూపాల్లో రోజువారీ జీవితంలో సమస్యలు ఎదుర్కోవాల్సి వస్తోందని నిపుణులు చెబుతున్నారు. ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి ప్రస్తుతం సోషల్లైఫ్లోనూ ఎంటర్టైన్మెంట్ పేరుతో బర్త్డేలు, ఇతర ఫంక్షన్లను పెద్ద శబ్దాలతో డీజేలు వంటివి నిర్వహిస్తున్నారు. 80 డెసిబుల్స్కు మించి వెలువడే శబ్దాలకు 8 గంటలపాటు ఎక్సోపోజ్ అయితే వినికిడి శక్తిపై ప్రభావం పడుతుంది. చెవుల్లో గింగురమనే శబ్దాల(టినిటస్)తో మానసిక ఒత్తిళ్లు పెరిగేందుకు కారణమవుతున్నాయి. ఏకాగ్రత దెబ్బతింటోంది. ఉదయం నుంచి రాత్రి దాకా పరిమితులకు మించి వెలువడే శబ్దాలు మనుషుల ‘హ్యుమో డైనమిక్స్’ పైనా ప్రభావం చూపి రక్తపోటు రావొచ్చు. గుండె సంబంధిత సమస్యలకు దారి తీయొచ్చు. రాత్రిళ్లు విశ్రాంతి తీసుకోవాల్సిన సమయాల్లో వెలువడే శబ్దాలు వృద్ధులు, పిల్లలు, విద్యార్థులపై ప్రభావం చూపుతాయి. ప్రస్తుతం ప్రజల జీవనశైలి అలవాట్లు మారినందున దానికి తగ్గట్టుగా ప్రభుత్వం అధిక«శబ్దాల నియంత్రణకు కట్టుదిట్టమైన చర్యలు తీసుకోవాలి. – డాక్టర్ ఎం.మోహన్రెడ్డి -
నేడు రాష్ట్రపతి రాక.. గచ్చిబౌలిలో ట్రాఫిక్ ఆంక్షలు
అల్లూరి సీతారామరాజు 125 జయంతి వేడుకల్లో పాల్గొనేందుకు మంగళవారం గచ్చిబౌలిలోని జీఎంసీ బాలయోగి స్టేడియంకు భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము రానున్నారు. ఈ నేపథ్యంలో గచ్చిబౌలి స్టేడియం పరిధిలోని ప్రధాన రోడ్లపై ట్రాఫిక్ ఆంక్షలు విధించినట్లు సైబరాబాద్ ట్రాఫిక్ జాయింట్ కమిషనర్ నారాయణ్నాయక్ సోమవారం తెలిపారు. మంగళవారం మధ్యాహ్నం 2 గంటల నుంచి రాత్రి 7 గంటల వరకు ఈ ఆంక్షలు అమలులో ఉంటాయన్నారు. లింగంపల్లి నుంచి గచ్చిబౌలి వరకు, విప్రో సర్కిల్ నుంచి గచ్చిబౌలి స్టేడియం వరకు, గచ్చిబౌలి కూడలి నుంచి స్టేడియం వరకు ఉన్న రోడ్లపై ఈ ఆంక్షలు అమలులో ఉంటాయని, ఇందుకోసం వాహనదారులంతా ప్రత్యామ్నాయ మార్గాలలో రాకపోకలు సాగించాలని ఆయన సూచించారు. పోలీసులకు వాహనదారులంతా సహకరించాలని ఆయన కోరారు. –గచ్చిబౌలి -
రాష్ట్రపతి రాక.. హైదరాబాద్లో రేపు ట్రాఫిక్ ఆంక్షలు
సాక్షి,హైదరాబాద్: నగరానికి రేపు(మంగళవారం, జులై 4) రాష్ట్రపతి ద్రౌపది ముర్ము రానున్నారు. గచ్చిబౌలి స్టేడియంను సందర్శించనున్నారామె. ఈ నేపథ్యంలో రేపు సైబరాబాద్ పరిధిలో ట్రాఫిక్ ఆంక్షలు విధించారు. గచ్చిబౌలి నుంచి లింగంపల్లి వరకు ట్రాఫిక్ ఆంక్షలు అమలు చేయనున్నారు. గచ్చిబౌలి స్టేడియం వైపు వాహనాల మళ్లింపు ఉండనుంది. మధ్యాహ్నం రెండు గంటల నుంచి సాయంత్రం 7 గంటల దాకా ఆంక్షలు అమలులో ఉంటాయి. ప్రత్యామ్నాయ మార్గాల్లో వెళ్లాలని వాహనదారులకు పోలీసులు సూచిస్తున్నారు. -
Hyderabad: పెళ్లైన నెలకే.. పారిపోయిన యువతి
సాక్షి, హైదరాబాద్: పెళ్లైయిన నెల రోజులకు తల్లిగారింటికి వచ్చిన యువతి కుటుంబ సభ్యుల కళ్లుగప్పి పరారైన సంఘటన గచ్చిబౌలి పోలీస్స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. కర్నాటక బీదర్కు చెందిన పార్వతి ఇద్దరు కూతుళ్లు, కొడుకుతో కలిసి గోపన్పల్లి తండాలో నివాసం ఉంటోంది. పెద్ద కూతురు జగ్దేవికి ఔరత్కు చెందిన పవార్తో మే నెల 29న వివాహం జరిగింది. కొద్ది రోజుల క్రితం జగ్దేవి తల్లి గారింటికి వచ్చింది. జూన్ 29న సాయంత్రం 4 గంటల సమయంలో తల్లి, కూతుళ్లు బయటకు వచ్చారు. వారి కళ్లు గప్పి జగ్ధేవి పారిపోయింది. సమీప ప్రాంతాలలో వెతికినా ఆచూకీ లభ్యం కాలేదు. తల్లి ఫిర్యాదు మేరకు పోలీసులు మిస్సింగ్ కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. -
హైదరాబాద్లో జాతీయ సీనియర్ స్విమ్మింగ్ పోటీలు
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ స్విమ్మింగ్ సంఘం ఆధ్వర్యంలో జూలై 2 నుంచి 5 వరకు హైదరాబాద్ వేదికగా జాతీయ సీనియర్ స్విమ్మింగ్ చాంపియన్షిప్ పోటీలు జరగనున్నాయి. గచ్చిబౌలి స్టేడియం స్విమ్మింగ్ కాంప్లెక్స్లో జరిగే ఈ పోటీల్లో దేశం నలుమూలల నుంచి 500 మందికిపైగా స్విమ్మర్లు బరిలోకి దిగనున్నారు. తెలంగాణ తరఫున 22 మంది స్విమ్మర్లు పోటీపడనుండగా... పురుషుల బృందానికి సూర్యాన్షు, మహిళల బృందానికి వ్రితి అగర్వాల్ నాయకత్వం వహిస్తారు. జాన్ సిద్దిఖి, ఆయూశ్ యాదవ్ కోచ్లుగా వ్యవహరిస్తారు. ఒలింపియన్ స్విమ్మర్లు శ్రీహరి నటరాజ్, సజన్ ప్రకాశ్, మానా పటేల్ ప్రధాన ఆకర్షణగా నిలువనున్నారు. కేటీ లెడెకీ ఆరోసారి... అమెరికా మహిళా స్టార్ స్విమ్మర్ కేటీ లెడెకీ వరుసగా ఆరోసారి ప్రపంచ స్విమ్మింగ్ చాంపియన్షిప్లో బరిలోకి దిగనుంది. గతంలో మైకేల్ ఫెల్ప్స్, రియాన్ లోచ్టె, నటాలీ కులిన్, ఎలిజబెత్ బీసెల్, నాథన్ అడ్రియన్ మాత్రమే ఈ ఘనత సాధించారు. అమెరికా జాతీయ పోటీల్లో లెడెకీ 800 మీటర్ల ఫ్రీస్టయిల్ ఈవెంట్లో విజేతగా నిలిచింది. లెడెకీ ఇప్పటివరకు ఒలింపిక్స్లో 7 స్వర్ణాలు, ప్రపంచ చాంపియన్షిప్లో 19 స్వర్ణాలు గెలిచింది. అల్పైన్ వారియర్స్కు ఐదో విజయం గ్లోబల్ చెస్ లీగ్లో ప్రపంచ నంబర్వన్ కార్ల్సన్ ప్రాతినిధ్యం వహిస్తున్న ఎస్జీ అలై్పన్ వారియర్స్ జట్టు ఐదో విజయం సాధించింది. భారత దిగ్గజం విశ్వనాథన్ ఆనంద్ సభ్యుడిగా ఉన్న గ్యాంజస్ గ్రాండ్మాస్టర్స్ జట్టుతో దుబాయ్లో బుధవారం జరిగిన ఏడో రౌండ్లో అలై్పన్ వారియర్స్ 10–8తో గెలిచింది. ఆనంద్తో జరిగిన గేమ్లో కార్ల్సన్ 72 ఎత్తుల్లో నెగ్గాడు. వారియర్స్కే చెందిన ప్రజ్ఞానంద 42 ఎత్తుల్లో ఇసిపెంకోను ఓడించగా... అర్జున్, ఎలిజబెత్ పాట్జ్ తమ గేమ్లను ‘డ్రా’ చేసుకున్నారు. గుకేశ్, ఇరీనా ఓడారు. -
హైదరాబాద్లో ఈదురు గాలులతో కూడిన భారీ వర్షం
సాక్షి, హైదరాబాద్: హైదరాబాద్తోపాటు తెలంగాణలోని పలు జిల్లాలో ఆదివారం భారీ వర్షం కురుస్తోంది. హైదరాబాద్లో వాతావరణం ఒక్కసారిగా మారిపోయింది. పలు ప్రాంతాల్లో వాతావరణం పూర్తిగా చల్లబడగా మరికొన్నిచోట్ల ఈదురుగాలులతో కూడిన భారీ వర్షం పడుతోంది. మాదాపూర్, హైటెక్ సిటీ, గచ్చిబౌలి, మియాపూర్, రాయదుర్గం, కుత్బుల్లాపూర్, జీడిమెట్ల, సుచిత్ర, కొంపల్లి, సురారం, గాజులరామారం, కూకట్పల్లి, చింతల్, బాలానగర్, నార్సింగి, కోకాపేట్, కొండాపూర్, కొంపల్లి, అల్వాల్, రాజేంద్రనగర్, శేరిలింగంపల్లి, పటాన్చెరు, లింగంపల్లి, నిజాంపేట, నేరెడ్మెట్తో పాటు పలు ప్రాంతాల్లో ఈదురు గాలులతో కూడిన వర్షం కురుస్తోంది. View in Gachibowli pic.twitter.com/3Ume7WqYOL — Suman Amarnath (@sumanva) June 4, 2023 సంగారెడ్డి జిల్లా పటాన్చెరు, రామచంద్రపురం, అమీన్పూర్ మండలాల్లో ఈదురుగాలులతో కూడిన భారీ వర్షం పడుతుండగా విద్యుత్ అంతరాయం ఏర్పడింది. నిజామాబాద్ నగరంలో వాన దంచికొడుతోంది. ఉరుములు మెరుపులతో కూడిన భారీ వర్షం పడుతోంది. సంగారెడ్డి, మెదక్, సిద్ధిపేట, వికారాబాద్ జిల్లాల్లోని పలు చోట్ల ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులతో వర్షం కురిసింది. Heavy winds and rains in Gachibowli side of Hyderabad. pic.twitter.com/GhC2msC98D — N Jagannath Das_TT (@dassport_TT) June 4, 2023 మరోవైపు తెలంగాణలో రాగల మూడు రోజులు ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు అక్కడక్కడ కురిసే అవకాశముందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది.ఆదివారం నుంచి సోమవారం ఉదయం వరకు పలు ప్రాంతాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు సూచనలున్నాయని పేర్కొంది. ఆదిలాబాద్, కుమురంభీం ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్, నిజామాబాద్, యాదాద్రి భువనగిరి, రంగారెడ్డి, హైదరాబాద్, మేడ్చల్ మల్కాజ్గిరి, వికారాబాద్, మహబూబ్నగర్, నాగర్ కర్నూల్, వనపర్తి, నారాయణపేట, జోగులాంబ గద్వాల జిల్లాల్లో ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులతో వానపడే అవకాశాలున్నాయని, మిగతా చోట్ల అక్కడక్కడ జల్లులు కురుస్తాయని తెలిపింది. Storm! #Hyderabad #Hyderabadrains pic.twitter.com/AUbuVyhlmv — krishna karthik (@krishnakarthik1) June 4, 2023 @balaji25_t @HYDWeatherMan HeavyRains at alwal #Hyderabad #Rains pic.twitter.com/G2SacYLIbM — Mahesh MK (@ursmaheshmk) June 4, 2023 -
దేశంలో నంబర్వన్ బిజినెస్ స్కూల్ ‘ఐఎస్బీ’
సాక్షి, రాయదుర్గం: గచ్చిబౌలిలోని ఇండియన్ స్కూల్ ఆఫ్ బిజినెస్(ఐఎస్బీ) దేశంలోనే నంబర్ వన్ బిజినెస్ స్కూల్గా మరోసారి గుర్తింపు పొందింది. అదేవిధంగా ప్రపంచంలో 29వ స్థానాన్ని సొంతం చేసుకుంది. ఫైనాన్షియల్ టైమ్స్ ఎగ్జిక్యూటివ్ ఎడ్యుకేషన్ కస్టమ్ ర్యాంకింగ్–2023ని సోమవారం ప్రకటించారు. గతేడాది ప్రపంచస్థాయిలో 38వ స్థానంలో ఉన్న ఐఎస్బీ ఈసారి 29వ స్థానంలో నిలవడం విశేషం. ఈ ర్యాంకులతో ఐఎస్బీ అసాధారణమైన ఎగ్జిక్యూటివ్ ఎడ్యుకేషన్ ప్రోగ్రామ్లకు మరోసారి జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు వచ్చినట్లయింది. ఇక భవిష్యత్లో అనుకూలించే ప్రోగ్రామ్ల విభాగంలో ప్రపంచంలోనే నెంబర్ వన్ ర్యాంకు పొందిన ఐఎస్బీ.. ఎఫ్టీ ఎగ్జిక్యూటివ్ ఎడ్యుకేషన్ ఓపెన్ ర్యాంకింగ్ 2023లో దేశంలో మూడవ స్థానం, ప్రపంచంలో 65వ స్థానంలో నిలిచింది. కాగా గ్రోత్ పారామీటర్లో ప్రపంచంలోనే నంబర్ వన్ స్థానంలో ఉండడం విశేషం. ఈ సందర్భంగా ఐఎస్బీ డిప్యూటీ డీన్, ఎగ్జిక్యూటివ్ ఎడ్యుకేషన్ అండ్ డిజిటల్ లెర్నింగ్ ప్రొఫెసర్ దీపామణి మాట్లాడుతూ ఎఫ్టీ ర్యాంకింగ్లో ఉన్నతస్థానంతో పాటు భవిష్యత్తు ఉపయోగం పారామీటర్లో నంబర్ వన్ స్థానంలో నిలవడం ఆనందంగా ఉందన్నారు. ప్రస్తుత ర్యాంకింగ్ తాము మరింతగా కష్టించి పనిచేసేందుకు ప్రోత్సాహాన్ని ఇస్తుందని చెప్పారు. సమిష్టి కృషికి ఇది నిదర్శనమన్నారు. ఇది కూడా చదవండి: బీఆర్ఎస్తో భేటీ అసెంబ్లీ ఎన్నికల తర్వాతే! -
Gachibowli హోటల్లో.. పంజాబ్, పశ్చిమ బెంగాల్ యువతులతో...
హైదరాబాద్: వ్యభిచారం నిర్వహిస్తున్న హోటల్పై దాడి చేసిన ఘటన రాయదుర్గం పోలీస్స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. అంజయ్యనగర్లోని రాయల్ పామ్ హోటల్లో వ్యభిచారం నిర్వహిస్తున్నట్లు యాంటీ హ్యుమన్ ట్రాకింగ్ యూనిట్ మాదాపూర్ ఇన్స్పెక్టర్ శ్రీనివాస్ బృందానికి సమాచారం అందింది. దీంతో ఈ బృందం హోటల్లోని 208, 406లపై దాడులు చేశారు. పంజాబ్, పశి్చమబెంగాల్ యువతులతో జార్కండుకు చెందిన ఆర్గనైజర్ విజయకుమార్, సబ్ ఆర్గనైజర్ అలీవర్డాంగ్లు వ్యభిచారం నిర్వహిస్తున్నారు. ప్రధాన నిందితుడు విజయకుమార్ పరారవగా డాంగ్ను పోలీసులు అదుపులోకి తీసుకొని రాయదుర్గం పోలీసులకు అప్పగించారు. ఘటనా స్థలంలో రెండు స్మార్ట్ ఫోన్లు, ఆరు కండోమ్లు, రూ.670 నగదు, ఒక డైరీ, రెండు గదుల తాళం చెవులను స్వాధీనం చేసుకున్నారు. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. -
ఒక్క ఆధార్.. 11,000 సిమ్ కార్డులు!
సాక్షి, హైదరాబాద్: గచ్చిబౌలికి చెందిన మహేశ్వర్ (పేరు మార్చాం) ప్రముఖ ఐటీ కంపెనీలో ఉద్యోగి. ఒక రోజు నో యువర్ కస్టమర్ (కేవైసీ) అప్డేట్ చేసుకోవాలని, లేకపోతే బ్యాంకు ఖాతా బ్లాక్ అవుతుందని అతని సెల్ఫోన్కు సందేశం వచ్చింది. దీంతో నిజమేనని నమ్మిన మహేశ్వర్.. మెసేజ్లోని లింక్పై క్లిక్ చేసి, అందులో బ్యాంకు ఖాతా నంబరు, ఇతరత్రా వ్యక్తిగత వివరాలు నమోదు చేశాడు. అంతే.. ఆ తర్వాత కొన్ని సెకన్లకే తన ఖాతాలో సొమ్ము విత్డ్రా అయినట్టు బ్యాంకు నుంచి సందేశం వచ్చింది. అతను కంగారు నుంచి తేరుకునేలోపు ఖాతా మొత్తం ఖాళీ చేసేశారు సైబర్ నేరస్తులు. దీంతో లబోదిబోమంటూ సైబరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులను ఆశ్రయించాడు. దీంతో బాధితుడికి సందేశం వచ్చిన ఫోన్ నంబర్, దానికి అనుసంధానించిన గుర్తింపు కార్డును, బ్యాంకు ఖాతా వివరాలను సైబరాబాద్లోని సెంటర్ ఆఫ్ ఎక్స్లెన్స్ ఫర్ సైబర్ సేఫ్టీ (సీఓఈసీఎస్)లో విశ్లేషించగా.. విస్తుపోయే విషయాలు వెలుగులోకి వచ్చాయి. సైబర్ మోసాలు, డేటా లీకు, నకిలీ వెబ్సైట్లు వంటి సైబర్ నేరాలకు సంబంధించిన కేసులను గచ్చిబౌలిలోని సైబరాబాద్ కమిషనరేట్లో ఉన్న తెలంగాణ పోలీసులకు చెందిన సెంటర్ ఆఫ్ ఎక్స్లెన్స్ ఫర్ సైబర్ సెక్యూరిటీ సేఫ్టీ (సీఓఈసీఎస్) విశ్లేషిస్తుంటుంది. ఇదే క్రమంలో కేవైసీ మోసం కేసును కూడా విశ్లేషించింది. ఉత్తరప్రదేశ్లోని మీరట్ జిల్లాలో నెల రోజుల వ్యవధిలో కేవలం ఒక్క ఆధార్ కార్డు గుర్తింపుతో 11 వేల సిమ్ కార్డులు జారీ అయినట్లు సీఓఈసీఎస్ పోలీసులు గుర్తించారు. రెండు సిమ్లు నేరస్తుల చేతుల్లో.. సాధారణంగా కొత్త సిమ్కార్డు తీసుకోవాలంటే ధ్రువీకరణ పత్రంగా ఆధార్ కార్డును సమర్పించాల్సి ఉంటుంది. టెలీకమ్యూనికేషన్ విభాగం (డీఓటీ) మార్గదర్శకాల ప్రకారం ఒక్క ఆధార్ కార్డుతో గరిష్టంగా 9 సిమ్ కార్డులను జారీ చేయవచ్చు. కానీ ఈ కేసులో థర్డ్ పార్టీ ఏజెన్సీలు డీఓటీ నిబంధనలను ఉల్లంఘించి ఏకంగా 11 వేలు సిమ్ కార్డులు జారీ చేశారు. కాగా ఇందులో రెండు సిమ్ కార్డులను సైబర్ నేరస్తులు వినియోగించారని, ఈ ఫోన్ నంబర్ల నుంచే బాధితుడిని మోసం చేసినట్లు పోలీసులు గుర్తించారు. ఈ మేరకు టెలీకమ్యూనికేషన్ విభాగాన్ని సైబరాబాద్ పోలీసులు అప్రమత్తం చేశారు. నిబంధనలను ఉల్లంఘించి సిమ్ కార్డులను జారీ చేసిన వారిపై చర్యలు తీసుకోవాలని సూచించినట్లు ఓ పోలీసు అధికారి తెలిపారు. -
Hyderabad: లిఫ్ట్ విషయంలో గొడవ.. స్విగ్గీ డెలివరీ బాయ్పై దాడి
సాక్షి, హైదరాబాద్: ఓ స్విగ్గీ డెలివరీ బాయ్పై సెక్యూరిటీ గార్డులు విచక్షణారహితంగా దాడికి పాల్పడ్డ ఘటన రాయదుర్గం పోలీస్స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. సీఐ మహేష్ తెలిపిన వివరాల ప్రకారం.. ఉదయం 8.58 గంటల సమయంలో స్విగ్గీ డెలివరీ బాయ్ శాంతకుమార్ గచ్చిబౌలిలోని ఎన్సీసీ నాగార్జున రెసిడెన్సీ గేటెడ్ కమ్యూనిటీలో ఫుడ్ డెలివరీకి వెళ్లాడు. తిరిగి వస్తుండగా అక్కడ విధులు నిర్వర్తిస్తున్న సెక్యూరిటీ గార్డులు ఆపి నువ్వు ఏ లిఫ్ట్లో వెళ్లావని అడగ్గా, స్విగ్గీ బాయ్ సర్వీస్ లిఫ్ట్లో వెళ్లానని చెప్పగా, లేదు నువ్వు మెయిన్ లిఫ్ట్లో వెళ్లావంటూ గొడవకు దిగారు. ఆరుగురు సెక్యూరిటీ గార్డులు దాడి చేయగా, గాయపడిన శాంతకుమార్ అక్కడి నుంచి తప్పించుకొని రాయదుర్గం పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు సీసీ పుటేజీ ఆధారంగా దాడికి పాల్పడిన ముగ్గురు సెక్యూరిటీ గార్డులను అరెస్ట్ చేశారు. మరో ముగ్గురి కోసం గాలిస్తున్నట్టు సీఐ తెలిపారు. చదవండి: జనవరిలో పెళ్లి.. నెల రోజులుగా గొడవలు.. ఉన్నట్టుండి భర్త మాయం! -
సీఎం కేసీఆర్కు స్వల్ప అస్వస్థత.. ఏఐజీ ఆస్పత్రిలో వైద్య పరీక్షలు
సాక్షి, హైదరాబాద్: సీఎం కేసీఆర్ స్వల్ప అస్వస్థతకు గురయ్యారు. ఈ ఉదయం నుంచి గ్యాస్ట్రిక్ సమస్యతో బాధపడుతున్న ఆయనను.. కుటుంబ సభ్యులు హుటాహుటిన గచ్చిబౌలిలోని ఏఐజీ ఆస్పత్రికి తరలించారు. ఏఐజీ వైద్యులు పలు రకాల పరీక్షలు నిర్వహించారు. కడుపునొప్పితో పాటు ఇతర అనారోగ్య సమస్యలతో ఆయన బాధపడుతున్నట్లు సమాచారం. అయితే ముందు రెగ్యులర్ చెకప్ లో భాగంగానే వైద్య పరీక్షలకోసం ఆస్పత్రికి వచ్చినట్లు బీఆర్ఎస్ వర్గాలు చెబుతున్నా.. గ్యాస్ట్రిక్ సమస్యతోనే ఆస్పత్రికి వచ్చినట్లు సమాచారం. కేసీఆర్ వెంట ఆయన సతీమణి శోభ, ఇతర కుటుంబ సభ్యులు, ఎంపీ సంతోష్ కుమార్, ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడు బోయిన్ పల్లి వినోద్ రావు, మాజీ స్పీకర్ మధుసూదనాచారి ఇతర బీఆర్ఎస్ నాయకులు ఉన్నారు. చదవండి: కేంద్ర మంత్రి అమిత్ షా విమానంలో సాంకేతిక సమస్య.. -
హాస్టళ్లలో భద్రత కట్టుదిట్టం చేయాలి
గచ్చిబౌలి: ఐటీ కారిడార్లో కొనసాగుతున్న వర్కింగ్ పీజీ హాస్టళ్లలో పటిష్టమైన భద్రతా చర్యలు చేపట్టాలని సైబరాబాద్ కమిషనర్ స్టీఫెన్ రవీంద్ర హాస్టళ్ల నిర్వాహకులు, పోలీసులకు సూచించారు. శనివారం గచ్చిబౌలిలోని టీసీఎస్ క్యాంపస్లో నిర్వహించిన ‘ప్రాజెక్ట్ సేఫ్ స్టే’ కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ పీజీ హాస్టల్స్లో ఉంటున్న వారికి భద్రత కల్పించడం నిర్వాహకుల బాధ్యత అన్నారు. 24 గంటలు పని చేసేలా హాస్టల్ ఎగ్జిట్, ఎంట్రీలలో సీసీ కెమెరాలను ఏర్పాటు చేయాలన్నారు. కాంపౌండ్ వాల్ ఐదు అడుగులు ఉండాలని, వాచ్మెన్లను నియమించాలన్నారు. విజిటర్స్ వివరాలపై రిజిస్టర్ నమోదు చేయాలన్నారు. ఫైర్సేఫ్టీ నిబంధనలు పాటించాలని, నోటీసు బోర్డులు ఏర్పాటు చేసుకోవాలని సూచించారు. సజేషన్స్ బాక్స్, ఫస్ట్ ఎయిడ్ కిట్, వ్యక్తిగత లాకర్ల సదుపాయం ఉండాలన్నారు. స్టాఫ్ ఐడీ ప్రూఫ్లతో పాటు కొత్తగా వచ్చే వారి ఐడీ ప్రూఫ్లు తీసుకోవాలన్నారు. హాస్టళ్లలో అసాంఘిక కార్యకలాపాలు నిర్వహిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. నిబంధనలు అతిక్రమిస్తే రూ.ఐదు వేల జరిమానా లేదా సీజ్ చేస్తామన్నారు. అనంతరం ప్రాజెక్ట్ సేఫ్ స్టే పోస్టర్ను ఆవిష్కరించారు. కార్యక్రమంలో డీసీపీలు కవిత, శిల్పవల్లీ, ఎస్సీఎస్సీ సెక్రటరీ కృష్ణ ఏదుల, మహిళా ఫోరం జాయింట్ సెక్రటరీ ప్రత్యూష, ట్రాఫిక్ ఫోరం కార్యదర్శి శ్రీనివాస్, ఐటీ కారిడార్ హాస్టల్స్ అసోసియేషన్ అధ్యక్షులు పి.అమరనాథ్ రెడ్డి, ప్రదాన కార్యదర్శి కరుణాకర్, కోశాధికారి రఘు నాయుడు, గౌరవ అధ్యక్షులు చంద్ర శేఖర్, సంజయ్ చౌదరీ పాల్గొన్నారు. -
వాటర్ పోలో చాంపియన్ పోటీల్లో విజేత వెస్ట్రన్ రైల్వే
గచ్చిబౌలి: తెలంగాణ స్విమ్మింగ్ అసోసియేషన్ ఆధ్వర్యంలో కొనసాగుతున్న 2వ ఆల్ ఇండియా ఇంటర్ క్లబ్ వాటర్ పోలో చాంపియన్ షిప్ పోటీలు శనివారం ముగిశాయి. ఈ పోటీల్లో విజేతగా నిలిచిన వెస్ట్రన్రైల్వే మొదటి బహుమతి అందుకుంది. రెండో బహుమతి ఇండియన్ నేవీ, మూడవ బహుమతి ఆర్మీ రెడ్ జట్లు అందుకున్నాయి. విజేతలకు చేవెళ్ల ఎంపీ రంజిత్ రెడ్డి, ప్రభుత్వ విప్, శేరిలింగంపల్లి ఎమ్మెల్యే ఆరెకపూడి గాంధీ బహుమతులు అందజేశారు. కార్యక్రమంలో తెలంగాణ స్విమ్మింగ్ అసోసియేషన్ అధ్యక్షులు చంద్రశేఖర్ రెడ్డి, చీఫ్ ప్యాట్రన్ కొండా విజయ్ తదితరులు పాల్గొన్నారు. -
హైదరాబాద్: ట్రాఫిక్ అలర్ట్.. ఆ రూట్లలో వెళ్లకపోవడమే మంచిది!
సాక్షి,గచ్చిబౌలి(హైదరాబాద్): గచ్చిబౌలి ట్రాఫిక్ పోలీస్స్టేషన్ పరిధిలో ట్రాఫిక్ మళ్లింపు, భారీ వాహనాల రాకపోకలపై ఆంక్షలు ఉంటాయని సైబరాబాద్ ట్రాఫిక్ జాయింట్ సీపీ నారాయణ నాయక్ ఒక ప్రకటనలో తెలిపారు. ఆదివారం గచ్చిబౌలి స్టేడియంలో ప్రముఖ సంగీత దర్శకులు ఇళయరాజా లైవ్ కన్సర్ట్కు 17,520 మంది హాజరయ్యే అవకాశం ఉందన్నారు. ఈ నేపథ్యంలో మధ్యాహ్నం 2 గంటల నుంచి రాత్రి 11 గంటల వరకు ట్రాఫిక్ మళ్లింపు ఉంటుందన్నారు. లింగంపల్లి నుంచి గచ్చిబౌలి జంక్షన్కు వచ్చే వాహనాలను హెచ్సీయూ బస్ డిపో వద్ద ఎస్ఎంఆర్ వినయ్సిటీ, మసీద్బండ, బొటానికల్ గార్డెన్, గచ్చిబౌలి వైపు వెళ్లాల్సి ఉంటుంది. గచ్చిబౌలి సర్కిల్ నుంచి లింగంపల్లికి వెళ్లే వాహనాలు బొటానికల్ గార్డెన్, మసీద్బండ, హెచ్సీయూ బస్ డిపో వైపు వెళ్లాల్సి ఉంటుందన్నారు. రాయదుర్గం నుంచి లింగంపల్లి వైపు వచ్చే వాహనాలను ట్రిపుల్ ఐటీ జంక్షన్ నుంచి గోపీచంద్ అకాడమీ, విప్రో సర్కిల్, క్యూసిటీ, గోపన్పల్లి, నల్లగండ్ల ఫ్లై ఓవర్ నుంచి వెళ్లాలన్నారు. లింగంపల్లి నుంచి గచ్చిబౌలి జంక్షన్, గచ్చిబౌలి నుంచి లింగంపల్లి వైపు భారీ వాహనాల రాకపోకలపై నిషేధం విధించినట్లు పేర్కొన్నారు. ట్రక్కులు, లారీలు, వాటర్ ట్యాంకర్లు, డీసీఎంలు, ఆర్ఎంసీ వాహనాలపై ఆంక్షలు ఉంటాయన్నారు. వాహనదారులు ప్రత్యామ్నాయ మార్గాల్లో ప్రయాణించి ట్రాఫిక్ పోలీసులకు సహకరించాలని కోరారు. చదవండి: లవర్ విషయంలో ఇంజనీరింగ్ విద్యార్థుల మధ్య గొడవ.. మందు తాగుదామని రూమ్కి పిలిచి దారుణంగా.. -
నారాయణ కుమార్తెలు శరణి, సింధూర ఇళ్లలో సీఐడీ సోదాలు
-
గచ్చిబౌలి పీఎస్ పరిధిలో సినీ నటుడు నరేష్ ఇంటిపై దాడి
-
ఇండియాలోనే బిగ్గెస్ట్ బిర్యానీ ప్లేట్.. ఒకేసారి 15-20 మంది తినేయొచ్చు
సాక్షి, హైదరాబాద్: శాకాహారం మాత్రమే తినే తనపేరిట మాంసాహార బిర్యానీ రావడం సంతోషంగా ఉందని నటుడు సోనూసూద్ పేర్కొన్నారు. కొండాపూర్లోని జిస్మత్ జైల్ మండి రెస్టారెంట్లో శనివారం సోనూసూద్ ఇండియాస్ బిగ్గెస్ట్ బిర్యానీ ప్లేట్ను ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎనిమిది అడుగుల విస్తీర్ణంలో ఉండే బిగ్గెస్ట్ ప్లేట్ బిర్యానీని ఒకేసారి 15 నుంచి 20 మంది తినవచ్చన్నారు. ఈ సందర్భంగా జిస్మత్ మండి నిర్వాహకులు గౌతమి, ధర్మ, గౌతమ్లను ఆయన అభినందించారు. త్వరలో విజయవాడ, గుంటూరు, నెల్లూరు, బెంగళూరులో బిగ్గెస్ట్ బిర్యానీ ప్లేట్ను సోనూసూద్తో అందుబాటులోకి తెస్తామని నిర్వాహకులు తెలిపారు. వృద్ధాశ్రమం ఏర్పాటు చేస్తా.. రాష్ట్రంలో ఒక వృద్ధాశ్రమం ఏర్పాటు చేస్తానని సినీ/చారిటీ స్టార్ సోనూసూద్ వెల్లడించారు. హైదరాబాద్తో తనకు దగ్గర అనుబంధం ఉందనీ, తన భార్య తెలుగు మహిళని తెలిపారు. నగరానికి చెందిన ఫిక్కీ లేడీస్ క్లబ్ ఆర్గనైజేషన్ (ఎఫ్ఎల్ఓ) ఆధ్వర్యంలో సోమాజిగూడలోని ఓ హోటల్లో ఏర్పాటు చేసిన ముఖాముఖిలో ఆయన మహిళా వ్యాపారవేత్తలతో మాట్లాడారు. ఆయనేమన్నారంటే.. ‘కరోనా తీవ్రత తగ్గిపోయినా సమస్యలతో మమ్మల్ని సంప్రదించేవారు తగ్గలేదు. ప్రస్తుతం షిరిడీలో ఒక వృద్ధాశ్రమం ఏర్పాటు చేస్తున్నాం. అలాగే తెలంగాణలో మరొకటి రానుంది. పంజాబ్లో దీనికి సంబంధించిన పనులు ప్రారంభమయ్యాయి సమీప భవిష్యత్తులో ప్రతి రాష్ట్రంలోనూ వృద్ధాశ్రమం, ఓ ఉచిత పాఠశాల ఉండేలా చూడాలనేది మా కోరిక. చాలా రాజకీయ పార్టీలు నన్ను తమవైపు తిప్పుకునేందుకు శాయశక్తులా ప్రయత్నించిన మాట వాస్తవమే. ఇప్పటికిప్పుడు రాజకీయాల్లోకి వచ్చే ఆసక్తి నాకు లేదు. చిత్ర పరిశ్రమలో ఇంకా చాలా చేయాల్సి ఉంది. చెక్లు అందించి సాయం చేయడం మాత్రమే కాదు.. చెక్లు అందించి, చారిటీలు చేసే వారు చాలా మంది ఉన్నారు. అయితే పర్సనల్ టచ్ చాలా ముఖ్యం. ఊపిరితిత్తుల సమస్యతో బాధపడుతున్న బాలికను నాగ్పూర్ నుంచి హైదరాబాద్కు విమానంలో తరలించాం. ఆమె సోదరుడు తోడుగా వచ్చాడు. కానీ, దురదృష్టవశాత్తూ ఆమెను రక్షించలేకపోయాం. ఆ తర్వాత ఆమె సోదరుడు కూడా మృతి చెందాడు. ఆమె తల్లిదండ్రులు తమ ఇద్దర్నీ కోల్పోయారు. దీంతో వీలైనప్పుడల్లా నాగ్పూర్లోని వారి తల్లిదండ్రులను కలవడం అలవాటు చేసుకున్నా. ఇదే నేను ఇష్టపడే పర్సనల్ టచ్.. అని సోనూసూద్ చెప్పారు. చదవండి: పబ్లు, ఫామ్హౌజ్లపై పోలీస్ రైడ్స్ -
Prime Volleyball League: హైదరాబాద్లో మ్యాచ్లు ఎప్పుడంటే!
Prime Volleyball League 2023- మాదాపూర్: వాలీబాల్ ప్రేమికులకు ఉత్కంఠతోపాటు ఉల్లాసాన్ని నింపేందుకు ప్రైమ్ వాలీబాల్ లీగ్ (పీవీఎల్) రెండో సీజన్లో హైదరాబాద్ అంచె మ్యాచ్లకు గచ్చిబౌలి ఇండోర్ స్టేడియం సిద్ధమైంది. బుధవారం నుంచి హైదరాబాద్ అంచె మ్యాచ్లు మొదలుకానున్నాయి. ఈనెల 21 వరకు హైదరాబాద్లో మ్యాచ్లు జరుగుతాయి. ఇక బుధవారం నాటి మ్యాచ్లో కొచ్చి బ్లూ స్పైకర్స్తో హైదరాబాద్ బ్లాక్హాక్స్ జట్టు తలపడుతుంది. బెంగుళూరులో తొలి అంచె మ్యాచ్లు ఈనెల 4 నుంచి 12 వరకు జరిగాయి. చదవండి: Virat Kohli: రోహిత్పై ప్రేమ లేదు.. కానీ కోహ్లికి వ్యతిరేకం! బీసీసీఐ చీఫ్ సెలక్టర్ చేతన్ శర్మ కామెంట్స్ వైరల్ WPL 2023: ఆర్సీబీ మెంటార్గా భారత టెన్నిస్ స్టార్ సానియా మీర్జా -
‘ఒమేగా’లో ఏఐ కేన్సర్ రేడియేషన్ మెషీన్
సాక్షి, హైదరాబాద్: ఒమేగా ఆధ్వర్యంలో హైదరాబాద్ గచ్చిబౌలిలో కొత్తగా మరో మల్టీస్పెషాలిటీ ఆసుపత్రి ఆదివారం ప్రారంభమైంది. 500 పడకలతో ఈ ఆసుపత్రిని తీర్చిదిద్దారు. ఇక్కడ కేన్సర్ చికిత్సతోపాటు ఇతర అన్ని రకాల స్పెషాలిటీ వైద్య సేవలను అత్యాధునిక వైద్య సేవలతో అందుబాటులోకి తెచ్చినట్లు ఆసుపత్రి చైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్ డాక్టర్ మోహన వంశీ మీడియా సమావేశంలో వెల్లడించారు. దేశంలోనే తొలిసారిగా కృత్రిమ మేధ(ఏఐ)తో పనిచేసే కేన్సర్ రేడియేషన్ మెషీన్ (ఎథోస్)ను అందుబాటులోకి తెచ్చినట్లు ఆయన తెలిపారు. ప్రజలకు తక్కువ ఖర్చుతో ప్రపంచ స్థాయి వైద్యం అందించాలనే లక్ష్యంతో గచ్చి బౌలిలో ఆసుపత్రిని అందుబాటులోకి తెచ్చామన్నారు. ఏఐతో పనిచేసే ‘ఎథోస్’ రోగుల చికిత్సను ప్రారంభ దశ నుంచి చివరి వరకు పూర్తిస్థాయిలో పర్యవేక్షిస్తుందని చెప్పారు. ఇది కేన్సర్ రేడియేషన్ చికిత్సలో ఒక విప్లవమని చెప్పారు. కొన్ని నిమిషాల వ్యవధిలోనే వ్యాధిని పూర్తిగా విశ్లేషించి చికిత్స అందించగలగడం దీని ప్రత్యేకత అన్నారు. దేశంలో డిజిటల్ పెట్ ఎంఆర్, డిజిటల్ పెట్ సీటీ పరికరాలతో కూడిన అత్యుత్తమ న్యూక్లియర్ మెడిసిన్ డిపార్ట్మెంట్ను ప్రారంభించిన మొదటి ఆసుపత్రిగా ఒమేగా నిలిచిందని డాక్టర్ వంశీ వెల్లడించారు. ఐసీయూ, హై ఎండ్ క్యాథ్ల్యాబ్ సదుపాయాలతో 24 గంటలూ అత్యవసర సేవలను అందించడానికి అందుబాటులో ఉంటుందన్నారు. ఈ సమావేశంలో సీఈవో శ్రీకాంత్ నంబూరి, స్పెషాలిటీ వైద్యులు డాక్టర్ రవి రాజు, డాక్టర్ గణేష్ మాథన్, డాక్టర్ విక్రమ్ శర్మ, డాక్టర్ ఆదిత్య కపూర్ పాల్గొన్నారు. -
హైదరాబాద్తో పాటు దేశవ్యాప్తంగా భారీగా ఐటీ రైడ్స్
-
HYD: భారీ స్థాయిలో ఐటీ రైడ్స్ కలకలం
సాక్షి, హైదరాబాద్: తెలంగాణలో మరోసారి ఐటీ దాడుల పర్వం మొదలైంది. ఇందులో భాగంగా రాజధాని నగరంలో భారీ స్థాయిలో సోదాలకు ఇన్కమ్ ట్యాక్స్ శాఖ సిద్ధమైనట్లు తెలుస్తోంది. బుధవారం వేకువ జామునే ఐటీ రైడ్స్తో ఉత్కంఠకు తెర తీసింది ఆర్థిక విభాగం. హైదరాబాద్లోని ఐటీ ఆఫీస్ నుంచి బయల్దేరారు ఐటీ అధికారులు. సుమారు 40 కార్లు, మూడు సీఆర్పీఎఫ్ వెహికిల్స్ లో ఐటీ బృందాలు రైడ్స్కు బయలుదేరాయి. తాజా సమాచారం ప్రకారం.. ఎక్సెల్ గ్రూప్ ఆఫ్ కంపెనీ లక్ష్యంగా దాడులకు దిగినట్లు తెలుస్తోంది. గచ్చిబౌలిలోని ఐకియా షోరూం పక్కన ఉన్న ఎక్సెల్ కార్యాలయంలో సోదాలు కొనసాగుతున్నాయి. 10:25AM ► ఎక్సెల్ గ్రూప్ ఆఫ్ కంపెనీస్పై ఐటీ దాడులు సాగుతున్నాయి. బాచుపల్లిలోనూ ఐటీ తనిఖీలు కొనసాగుతున్నట్లు సమాచారం. అలాగే ఆరుగురు డైరెక్టర్ల ఇళ్లలోనూ సోదాలు కొనసాగుతున్నాయి. 10:36AM ► 20 చోట్ల కొనసాగుతున్నాయి ఐటీ సోదాలు. ఆరుగురు డైరెక్టర్ల ఇళ్లతోపాటు చైర్మన్ సీఈఓ ఇళ్లలో సోదాలు కొనసాగుతున్నట్లు సమాచారం. ఎక్సెల్ గ్రూప్ కి అనుబంధంగా ఉన్న మరొక 10 కంపెనీలోనూ ఐటీ సోదాలు కొనసాగుతున్నాయి. గచ్చిబౌలితో పాటు మాదాపూర్ బాచుపల్లిలోని కార్యాలయాల్లో సోదాలు సాగుతున్నాయి. మరోవైపు రబ్బర్ ఇంపోర్ట్ ఎక్స్పోర్ట్లో భారీగా తేడాలతో పాటు ట్యాక్స్ చెల్లింపు లో అవకతవకలు జరిగినట్లు సమాచారం అందుతోంది. 10:45AM ► సంగారెడ్డి లోని నాలుగు కంపెనీలో సోదాలు కొనసాగుతున్నాయి. నార్సింగ్ లోని ఆరు చోట్ల, బాచుపల్లి దుండిగల్ లోని 4 కంపెనీలలో సోదాలు నడుస్తున్నాయి. 11:31AM ► లండన్ నుంచి 500 కోట్ల ఫండ్ exel కంపెనీలలో పెట్టుబడి పెట్టినట్లు ఐటీ శాఖ గుర్తించింది. ఈ క్రమంలో.. ఆ లెక్కపై ఆరా తీస్తున్నారు ఐటీ అధికారులు. -
రెండ్రోజుల క్రితం విప్రో సర్కిల్ వద్ద టిప్పర్ బీభత్సం.. ఒళ్లు గగుర్పొడిచే దృశ్యాలు
-
విప్రో జంక్షన్లో టిప్పర్ బీభత్సం.. స్విగ్గీ డెలివరీ బాయ్ మృతి
సాక్షి, హైదరాబాద్: బండరాళ్ల లోడ్తో వెళ్తున్న టిప్పర్ వాహనం ఆదివారం అర్ధరాత్రి ఐటీ కారిడార్లో బీభత్సం సృష్టించింది. ఫైనాన్షియల్ డిస్టిక్ట్లోని విప్రో జంక్షన్లో సిగ్నల్ వద్ద నిలిచి ఉన్న 3 కార్లను, 3 బైక్లను ఢీకొట్టింది. ఆ తర్వాత ఓ టిప్పర్ను ఢీకొని అది ఆగిపోయింది. ఈ ప్రమాదంలో స్విగ్గీ డెలివరీ బాయ్ మృతి చెందాడు. బైక్లపై వెళుతున్న ఇద్దరు, టిప్పర్ సూపర్వైజర్ తీవ్రంగా గాయపడ్డారు. గచ్చిబౌలి సీఐ గోనె సురేష్ చెప్పిన వివరాల ప్రకారం.. ఖానామెట్లోని ఓ సైట్లో బండరాళ్లు లోడ్ చేసుకున్న టిప్పర్.. వట్టినాగులపల్లిలోని క్రషర్లో అన్లోడ్ చేసేందుకు బయలుదేరింది. ఆదివారం అర్ధరాత్రి ట్రిపుల్ ఐటీ జంక్షన్ నుంచి విప్రో జంక్షన్కు చేరుకుంది. రెడ్ సిగ్నల్ పడటంతో అప్పటికే కార్లు బైక్లు ఆగి ఉన్నాయి. టిప్పర్ అతివేగంతో దూసుకువచ్చి మొదట స్విఫ్ట్ కారు ఢీకొట్టింది. దీంతో స్విఫ్ట్ కారు ముందున్న ఐ20 కారు, ఇండిగో కార్లను బలంగా తాకడంతో అవి నుజ్జునుజ్జయ్యాయి. కార్లను ఢీకొట్టిన టిప్పర్ ఎడమ వైపు దూసుకెళ్లి మూడు బైక్లను ఢీకొంది. అంతటితో ఆగకుండా గౌలిదొడ్డి వైపు నుంచి వస్తున్న మరో టిప్పర్ను ఢీకొని ఆగిపోయింది. ఈ ప్రమాదంలో స్కూటీపై ఉన్న నాంపల్లికి చెందిన స్విగ్గీ డెలివరీ బాయ్ నసీర్ హుస్సేన్ (30) తలకు గాయాలు కావడంతో అక్కడికక్కడే మృతిచెందాడు. ఆస్పత్రులకు క్షతగాత్రుల తరలింపు.. యమహా బైక్పై ఉన్న బీటెక్ విద్యార్థి అబ్దుల్ రజాక్ కుడి కాలు విరిగింది. వెనకాల ఉన్న యువకుడు సురక్షితంగా బయపడ్డాడు. మరో బైక్పై ఉన్న సుబెందుదాస్ ఎడమ కాలు విరగడంతో కాంటినెంటల్ హాస్పిటల్కు తరలించారు. టిప్పర్లో ఉన్న ఖలీం అందులోనే ఇరుక్కుపోవడంతో కాలు విరిగింది. కొండాపూర్ ఏరియా ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. వీళ్లు సురక్షితం.. నుజ్జునుజ్జయిన స్విఫ్ట్ కారులో ఉన్న ఇంటీరియర్ డిజైనర్ మురళి రెండు బెలూన్లు తెరుచుకోవడంతో ప్రమాదం నుంచి బయటపడ్డారు. ఐ 20 కారులో గౌలిదొడ్డి వైపు వస్తున్న దంపతులు సాయి చైతన్య, పల్లవి, కుటుంబ సభ్యులు సాహితి, సుదీప్తిలు ప్రమాదం నుంచి త్రుటిలో తప్పించుకున్నారు. ధ్వంసమైన ఇండిగో కారు క్యాబ్ డైవర్కు ఎలాంటి గాయాలు కాలేదని పోలీసులు తెలిపారు. మూడు రోజుల క్రితమే విధుల్లో చేరిన టిప్పర్ డ్రైవర్.. టిప్పర్ బీభత్సానికి కారణమైన డ్రైవర్ కాసీంను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. బిహార్ చెందిన ఇతను మూడు రోజుల క్రితమే నగరానికి వచ్చి డ్రైవర్ విధుల్లో చేరినట్లు సమాచారం. ఖానామెట్ నుంచి వట్టినాగులపల్లికి వెళ్లే దారి తెలియకపోవడంతో అతని వెంట సూపర్వైజర్ ఖలీం వచ్చారు. రాత్రి సమయంలో ట్రాఫిక్ తక్కువగా ఉంటడం, విప్రో జంక్షన్లో ఏటవాలు ఎక్కువగా ఉన్న విషయంపై అవగాహన లేకపోవడంతో టిప్పర్ అదుపు తప్పినట్లు తెలుస్తోంది. ఘటనా స్థలాన్ని, ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న క్షతగాత్రుల పరిస్థితిని మాదాపూర్ ఏసీపీ రఘునందన్ రావు, సీఐ గోనె సురేష్లు పరిశీలించారు. కేసు దర్యాప్తు చేస్తున్నట్లు చెప్పారు. ప్రమాదానికి టిప్పర్ డ్రైవర్ నిర్లక్ష్యమే కారణమని సీఐ గోనె సురేష్ స్పష్టం చేశారు. -
అధిక వేగంతో టిప్పర్ బీభత్సం
-
Hyderabad: ఐటీ కారిడార్కు మళ్లీ కోవిడ్ భయం!
సాక్షి, హైదరాబాద్: హైదరాబాద్లోని ఐటీ కారిడార్ను మళ్లీ కోవిడ్ భయం వణికిస్తోంది. శివారులోని గచ్చిబౌలి ఫైనాన్షియల్ డిస్ట్రిక్స్లోని మాదాపూర్, గచ్చిబౌలి, కొండాపూర్, నానక్రాంగూడలో సుమారు మూడు వేల ఎకరాల్లో 14 ఐటీ జోన్లు ఉన్నాయి. ఇక్కడ ప్రతిష్టాత్మక అమెజాన్, గుగూల్, ట్విట్టర్, ఫేస్బుక్, మహేంద్ర వంటి ఐటీ, అనుబంధ కంపెనీలు, స్టార్ హోటళ్లు, అనేక వ్యాపార వాణిజ్య సంస్థలు వెలిశాయి. వీటిలో ప్రత్యక్షంగా ఏడు లక్షల మంది ఉద్యోగులు, పరోక్షంగా మరో పది లక్షలమంది పనిచేస్తున్నట్లు అంచనా. వీరిలో చాలామంది ఉద్యోగులు ప్రాజెక్టుల పేరుతో తరచూ విదేశాలకు వెళ్లి వస్తుంటారు. చైనా, బ్రెజిల్, బ్రిటన్ సహా పలు దేశాల్లో బీఎఫ్–7 వేరియంట్ వైరస్ విజృంభిస్తున్న నేపథ్యంలో ఇటీవల ఆయా దేశాలకు వెళ్లి వచ్చిన ఉద్యోగులు కూడా ఉన్నారు. వీరిలో ఎవరు ఏ వేరియంట్ వైరస్ను వెంట తీసుకొచ్చారో? తెలియక తోటి ఉద్యోగులు, వారి కుటుంబసభ్యులు ఆందోళన చెందుతున్నారు. తోటి ఉద్యోగుల్లో ఎవరైనా ఇటీవల విదేశాలకు వెళ్లివచ్చినట్లు తెలిస్తే చాలు వారికి దూరంగా ఉంటున్నారు. ఇప్పుడు ‘బీఎఫ్7’ వేరియెంట్ నగరంలో 2020 మార్చి 2న తొలి కోవిడ్ కేసు నమోదైంది. సికింద్రాబాద్కు చెందిన ఓ యువకుడికి తొలుత కరోనా సోకింది. అప్పట్లో ‘ఆల్ఫా’వేరియెంట్ హల్చల్ చేసింది. అనతికాలంలోనే అనేకమంది ఈ వైరస్ గుప్పిట్లో చిక్కుకుని విలవిల్లాడిపోయారు. ఆ తర్వాత ‘డెల్టా’వేరియెంట్, మూడోదశలో ‘ఒమిక్రాన్’ రూపంలో విజృంభించింది. ఫలితంగా గ్రేటర్ జిల్లాల్లో సుమారు ఏడు లక్షల మంది ఈ వైరస్ బారిన పడగా, పదివేల మందికిపైగా మృత్యువాతపడ్డారు. గత మూడు దశల్లో కోవిడ్ సృష్టించిన నష్టాల బారి నుంచి ఇప్పుడిప్పుడే కోలుకుంటున్నారు. గత ఏడాదికాలంగా కోవిడ్ పీడ పూర్తిగా పోయిందని భావించి స్వేచ్ఛగా ఊపిరి తీసుకుంటున్న సమయంలో తాజాగా ‘బీఎఫ్7’వేరియంట్ రూపంలో ఫోర్త్ వేవ్ మొదలైంది. బూస్టర్డోసుకు మళ్లీ డిమాండ్ తాజా వేరియంట్ హెచ్చరికలతో ఉద్యోగులు, సాధారణ ప్రజలు మళ్లీ టీకా కేంద్రాలకు పరుగులు తీస్తున్నారు. బూస్టర్ డోసు వేయించుకుంటున్నారు. ఒంట్లో ఏ కొంచెం నలతగా అన్పించినా వెంటనే వ్యాధి నిర్ధారణ పరీక్షలు చేయించుకుంటున్నారు. ఆరోగ్య కేంద్రాలకు అనుమానితుల తాకిడి పెరుగు తుండటంతో జిల్లా అధికార యంత్రాంగం అప్రమత్తమైంది. ఈ మేరకు శుక్రవారం రంగారెడ్డి జిల్లా కలెక్టర్ అమయ్కుమార్ అధికారులతో ఏర్పాట్లపై చర్చించారు. ఎయిర్పోర్ట్లో అలెర్ట్ దేశవిదేశాలకు చెందిన ప్రయాణికులంతా శంషాబాద్ విమానాశ్రయం మీదుగా రాకపోకలు సాగిస్తుంటారు. ఈ విమానాశ్రయం నుంచి రోజుకు సగటున 14 నుంచి 15 వేల మంది ప్రయాణికులు వచ్చిపోతుంటారు. ప్రస్తుతం స్వదేశంతో పోలిస్తే విదేశాల్లో వైరస్ ఉధృతి ఎక్కువగా ఉంది. అటు నుంచి ఇటు, ఇటు నుంచి అటు వచ్చి పోయే ప్రయాణికుల ద్వారా ఈ కొత్త వేరియంట్ దేశంలో విస్తరించే ప్రమాదం ఉండటంతో ఎయిర్పోర్టు యంత్రాంగం అప్రమత్తమైంది. శంషాబాద్ ఇంటర్నేషనల్ ఎయిర్ పోర్టులో మళ్లీ ఆంక్షలు అమలు చేయాలని నిర్ణయించి, ఆ మేరకు థర్మల్ స్క్రీనింగ్ టెస్టులు నిర్వహిస్తోంది. దగ్గు, జలుబు, జ్వరం వంటి లక్షణాలతో బాధపడుతున్న ప్రయాణికులను గుర్తించి ఐసోలేషన్కు తరలించేందుకు ఏర్పాట్లు చేస్తోంది. ఇండియన్ మెడికల్ అసోసియేషన్ సూచనలు ఇవే.. ► మార్కెట్లు, హోటళ్లు, సినిమా హాళ్లు, పార్కులు, ఫంక్షన్హాళ్లు, రైల్వే, బస్స్టేషన్లు, గుళ్లు గోపురాలు, విద్యా సంస్థలు, ప్రభుత్వ, ప్రైవేటు ఆఫీసులు, ఇతర సందర్శనీయ ప్రదేశాలు, రాజకీయ సభలు, సమావేశాల్లో రద్దీ ఎక్కువగా ఉంటోంది. ఇలాంటి ప్రదేశాల్లో వైరస్ ఒకరి నుంచి మరొకరికి సులభంగా, వేగంగా విస్తరించే అవకాశం ఉంది. ► రోగ నిరోధకశక్తి తక్కువగా ఉన్న వృద్ధులు, ఇప్పటివరకు కోవిడ్ టీకాలు తీసుకోని చిన్నారులు, గర్భిణులు, బాలింతలు త్వరగా వైరస్ బారినపడే ప్రమాదం ఉంది. ప్రస్తుత పరిస్థితుల్లో వీరు సాధ్యమైనంత వరకు ఈ రద్దీ ప్రదేశాలకు వెళ్లకపోవడమే ఉత్తమం. విదేశీ ప్రయాణాలతోపాటు దైవదర్శనాలను వాయిదా వేసుకోవాలి. ► రద్దీ ప్రదేశాల్లో ప్రతి ఒక్కరూ విధిగా మాస్క్లు ధరించాలి. చేతులను తరచూ శానిటైజర్, సబ్బుతో శుభ్రం చేసుకోవాలి. షేక్ హ్యాండ్కు బదులు రెండు చేతులతో నమస్కారం చేయడం ఉత్తమం. దగ్గు, జలుబు, ఒంటి నొప్పులు, జ్వరం లక్షణాలు కన్పిస్తే వెంటనే వైద్యులను సంప్రదించి, వ్యాధి నిర్ధారణ పరీక్షలు చేయించుకోవాలి. ► వ్యక్తిగతంగా రోగ నిరోధకశక్తిని పెంచుకోవాలి. ఇందుకు ఇప్పటికే ఒకటి, రెండు డోసుల టీకాలతో సరిపెట్టుకున్న వారు బూస్టర్ డోసు కూడా తీసుకోవాలి. తాజా మాంసం, మద్యపానం, ధూమపానం వంటి దురాలవాట్లకు దూరంగా ఉండాలి. నూనెలో వేయించిన ప్యాక్డ్ మసాల ఆహారానికి బదులు, తాజాగా వండివార్చిన పౌష్టికాహారం తీసుకోవడం ద్వారా కొత్త వేరియంట్ను విజయవంతంగా ఎదుర్కోవచ్చు. (క్లిక్ చేయండి: పాండెమిక్ నుంచి ఎండెమిక్ దశకు కరోనా వైరస్.. బూస్టర్ డోస్ తప్పనిసరి) -
Hyderabad: ఐటీ కారిడార్లో దారుణం.. మీద నీళ్లు చల్లినందుకు
సాక్షి, హైదరాబాద్: మీద నీళ్లు చల్లినందుకు సారీ చెప్పాలని కోరిన ఇద్దరు యువకులను బెంజ్కారుతో ఢీకొట్టాడు మరో యువకుడు. తమ వారిపై అలా ఎలా ప్రవర్తిస్తావని అడిగేందుకు బైకుపై వెళ్లిన దంపతులను కూడా బెంజ్ కారుతో ఢీ కొట్టాడు. సారీ చెప్పేందుకు ఇష్టపడని యువకుని ఇగో ఓ నిండు ప్రాణాన్ని బలి తీసుకుంది. ఈ ఘటనలో ఎగిరి కిందపడ్డ ఓ యువతి తీవ్ర గాయాలతో చికిత్స పొందుతూ మృతి చెందింది. ఈ సంఘటన రాయదుర్గం పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. ఎర్రగడ్డకు చెందిన దంపతులు సయ్యద్ సయీఫుద్దీన్ జావీద్, మరియా మీర్(25) ఒక బైక్పై, జావీద్ సోదరులు సయ్యద్ మినాజుద్దీన్, రషద్ మిష్బా ఉద్దీన్లు ఒక బైక్పై ఈ నెల 17 రాత్రి కేబుల్ బ్రిడ్జి చూసేందుకు మాదాపూర్ వచ్చారు. కేబుల్ చూసిన తరువాత 18న అర్థరాత్రి 1 గంట సమయంలో ఫుడ్ కోసం గచ్చిబౌలి వైపు వచ్చారు. తిరిగి వెళుతుండగా పక్కనుంచి వెళ్లిన బెంజ్ కారు నుంచి నీళ్లు మీదపడ్డాయి. దీంతో బైక్పై ఉన్న మినాజుద్దీన్, రషీద్లు కారును వెంబడించి నీళ్లు పోసి..సారీ చెప్పకుండా వెళుతున్నావని అడిగారు. దీంతో కారు డ్రైవింగ్ సీట్లో కూర్చున్న వ్యక్తి వీరిని దుర్భాషలాడుతూ బెంజ్ కారు ఢీ కొట్టడంతో ఇద్దరు కిందపడి పోయారు. దీనిని గమనించిన సయీఫుద్దీన్ బైక్పై కారును వెంబడించగా...వీరి బైకును కూ డా గచ్చిబౌలోని అట్రియం మాల్ వద్ద ఢీ కొట్టాడు. దీంతో బైక్పై ఉన్న మరియా మీర్ ఎగిరి కింద పడటంతో తలకు గాయాలయ్యాయి. గచ్చిబౌలి కేర్ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ బుధవారం ఉదయం మృతి చెందింది. మృతురాలికి 8 నెలల కూతురు ఉన్నట్లు పోలీసులు తెలిపారు. బెంజ్ కారు నడిపిన యువకుడు రెండు సార్లు కారుతో ఢీ కొట్టాడని చెప్పడంతో పోలీసులు విచారణ చేపట్టారు. సీసీ పుటేజీలను పరిశీలించగా ఒకసారి బైక్ను ఢీ కొట్టడంతో ఇద్దరు యువకులు కింద పడ్డారని, మరో బైక్ను ఢీ కొట్టడంతో మరియా మీర్, సయీఫుద్దీన్లు ఎగిరి పడ్డట్లు గుర్తించారు. కారులో ప్రయాణించిన వ్యక్తి జూబ్లీహిల్స్కు చెందిన ఓ వ్యాపారవేత్త కొడుకు రాజసింహారెడ్డిగా గుర్తించి పోలీసులు అరెస్ట్ చేశారు. కారును సీజ్చేశారు. ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
హైదరాబాద్ అంటే హైటెక్సిటీ, గచ్చిబౌలి, కొండాపూర్ కాదు!
ముషీరాబాద్ (హైదరాబాద్): హైదరాబాద్ అంటే హైటెక్ సిటీ, గచ్చిబౌలి, కొండాపూర్ కాదని హైద రాబాద్ నగరం పేదలు నివసించే బస్తీల్లో, కాలనీల్లో ఉందని కేంద్ర మంత్రి కిషన్రెడ్డి వ్యాఖ్యానించారు. వీటి అభివృద్ధిపై దృష్టి కేంద్రీకరించాలని రాష్ట్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. బుధవారం ముషీరా బాద్ నియోజకవర్గంలోని అడిక్మెట్, రాంనగర్ డివిజన్లలోని పలు బస్తీలు, కాలనీల్లో అధికారు లతో కలిసి పాదయాత్ర నిర్వహించారు. ఈ సంద ర్భంగా విలేకరులతో మాట్లాడుతూ.. పేదలు, చిన్ని చిన్న ఉద్యోగులు నివసించే కాలనీలు, బస్తీలు నిర్ల క్ష్యానికి గురవుతున్నాయని ఆవేదన వ్యక్తంచేశారు. హైదరాబాద్ నగర అభివృద్ధి అంటే హైటెక్సిటీ అభివృద్ధి అనే విధంగా ప్రభుత్వం వ్యవహరిస్తోందని ధ్వజమెత్తారు. నిజమైన హైదరాబాద్ అంటే ఓల్డ్సిటీ, ఖైరతాబాద్, ముషీరాబాద్, అంబర్పేట్, సికింద్రాబాద్, సనత్నగర్లతోపాటు అనేక ప్రాంతాలున్నాయన్నారు. మెయిన్రోడ్లమీద రంగులు పూసి హైదరాబాద్ అభివృద్ధి జరిగిందని ప్రజలను మభ్యపెట్టే ప్రయత్నం చేస్తున్నారని మండిపడ్డారు. ఎక్కడికి వెళ్లినా డ్రైనేజీ, వర్షపునీరు, కలుషిత మంచినీరు, రోడ్లపై గుంతలు, వీధిలైట్ల సమస్యలను చెబుతున్నారన్నారు. రాష్ట్రంలో ఒక్క హైదరాబాద్ నుంచే 80 శాతం రెవెన్యూ వస్తోంటే.. నగర అభివృద్ధికి 8 శాతం నిధులు కూడా ఖర్చుపెట్టడం లేదని చెప్పారు. హైదరాబాద్లోని రెండు ప్రధాన శాఖ లైన జీహెచ్ఎంసీ, జలమండలి అప్పుల ఊబిలో చిక్కి చిన్న చిన్న పనులకు సైతం నిధులు విడుదల చేయలేని దుస్థితి నెలకొందని దుయ్యబట్టారు. అందువల్ల ప్రభుత్వం బస్తీల్లో ఉండే నిజమైన హైద రాబాద్ అభివృద్ధికి కృషిచేయాలని కోరారు. చదవండి: నాడు టీడీపీలో.. నేడు కాంగ్రెస్లో.. చంద్రబాబుతో మాకు సంబంధం లేదు -
PKL 2022: సెమీస్లో జైపూర్, పుణె.. పట్నాకు పరాభవం!
Pro Kabaddi League 2022- సాక్షి, హైదరాబాద్: ప్రొ కబడ్డీ లీగ్లో పుణేరి పల్టన్, జైపూర్ పింక్ పాంథర్స్ జట్లు సెమీఫైనల్ బెర్త్లను ఖరారు చేసుకున్నాయి. గచ్చిబౌలి ఇండోర్ స్టేడియంలో సోమవారం జరిగిన లీగ్ మ్యాచ్ల్లో పుణేరి పల్టన్ 44–30తో పట్నా పైరేట్స్పై, జైపూర్ పింక్ పాంథర్స్ 44–30తో హరియాణా స్టీలర్స్పై గెలిచాయి. మరో లీగ్ మ్యాచ్ ఆడాల్సి ఉన్న పుణేరి, జైపూర్ జట్లు 79 పాయింట్లతో సంయుక్తంగా అగ్రస్థానంలో ఉన్నాయి. మిగతా జట్లు తమ తదుపరి రెండు మ్యాచ్ల్లో గెలిచినా పుణేరి, జైపూర్ జట్లను దాటే అవకాశం లేదు. కాగా టాప్–6లో తొలి రెండు స్థానాల్లో నిలిచిన జట్లు నేరుగా సెమీఫైనల్ చేరుకుంటాయి. మిగతా రెండు సెమీఫైనల్ బెర్త్ల కోసం నాలుగు జట్లు ఎలిమినేటర్–1, ఎలిమినేటర్–2 మ్యాచ్ల్లో తలపడతాయి. చదవండి: FIFA WC 2022: విజేతపై మెస్సీ జోస్యం.. ఆశ్చర్యపోవడం ఖాయం! IND Vs Ban ఓటమి బాధలో ఉన్న టీమిండియాకు ఐసీసీ షాక్ The 🔝 2⃣ teams in the #vivoProKabaddi Season 9 league stage are now just 2⃣ steps away from getting their hands on the 🏆#FantasticPanga #JaipurPinkPanthers #PuneriPaltan pic.twitter.com/27Gg62sKMB — ProKabaddi (@ProKabaddi) December 5, 2022 -
అలా నేను సినిమాల్లోకి వచ్చాను: అక్కినేని అమల
ఏషియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ గ్యాస్ట్రోఎంట్రాలజీ ఆధ్వర్యంలో జరిగిన 'ఉమెన్ ఇన్ మెడిసిన్ కాంక్లేవ్' కార్యక్రమంలో అక్కినేని అమల ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆమె మహిళలు అన్ని రంగాల్లో రాణించగలరని, ప్రస్తుతం వారికి ఎన్నో అవకాశాలు ఉన్నాయంటూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఎలాంటి మూవీ బ్యాగ్రౌండ్ లేకుండా సినిమాల్లోకి వచ్చిన ఆమె చలనచిత్ర రంగంలో రాణించాలంటే ముందుగా ఆ పాత్రకు మనం ఫిట్ అవ్వాలని, అందుకోసం మనల్ని మనం మేకోవర్ చేసుకోవాలన్నారు. అంతేకాదు ఇండస్ట్రీలో తనకంటూ ఓ ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకోవాలని చెప్పారు. అనంతరం ఆమె మాట్లాడుతూ.. ‘నేను క్లాసికల్ డ్యాన్సర్ని. దాంతో డైరెక్టర్స్, నిర్మాతలు సినిమాల్లో క్లాసికల్ డ్యాన్సర్ పాత్రల కోసం నన్ను సంప్రదించారు. అలా నాకు సినిమాల్లో నటించే అవకాశం వచ్చింది. కానీ అది అంత ఈజీ కాదు. మనకు ఇక్కడ గుర్తింపు రావాలంటే ఆ పాత్రకు మనం ఫిట్ అవ్వాలి. ఒకవేళ మనం ఆ పాత్రకి ఫిట్ కాకపోతే దురదృష్టవశాత్తు సినీ రంగంలో ఓ మహిళ మూస పద్దతిలో వెళ్లాల్సి వస్తుంది. కానీ అదృష్టం కొద్ది ఇప్పుడు వారికి చాలా అవకాశాలున్నాయి. తమని తాము ప్రూవ్ చేసుకోవడానికి ఎన్నో ప్లాట్ఫాంలు వచ్చాయి. యంగ్ ఫిలిం మేకర్స్ ఉన్నారు, ఉమెన్ ఫిలిం మేకర్స్ కూడా వస్తున్నారు. ఇప్పుడు మహిళలు పురుషులకు సమానంగా ఏ రంగంలోనైనా రాణించగలిగేందుకు ఎన్నో అవకాశాలు ఉన్నాయి’ అని చెప్పుకొచ్చారు. ఎలాంటి పరిశ్రమలోనైనా పురుషాధిక్యం ఉంటుంది. అలాగే సినీ రంగంలో కూడా. అలాంటప్పుడు ఓ ఫిమేల్ ఆర్టిస్ట్ ఇక్కడ రాణించడం అంటే అంత ఈజీ కాదు. ఆమె సినిమాను ప్రమించాలి, తన నటనను మెరుగుపెరుచుకోవాలి. ఏలాంటి లేవల్లో ఉన్న మనల్ని మనం ప్రూవ్ చేసుకునేందుకు ఓ మహిళ ఎప్పుడు ప్రయత్నిస్తూనే ఉండాలి’ అని ఆమె సూచించారు. -
'దేశానికి గోల్డ్ మెడల్ తీసుకురా అన్నప్పుడు నవ్వుకున్నా'
గచ్చిబౌలిలోని ఏషియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ గ్యాస్ట్రోఎంట్రాలజీ ఆధ్వర్యంలో జరిగిన 'ఉమెన్ ఇన్ మెడిసిన్ కాంక్లేవ్' కార్యక్రమంలో స్టార్ షట్లర్ సైనా నెహ్వాల్ ముఖ్య అతిథిగా పాల్గొంది. ఈ సందర్భంగా మహిళలు క్రీడల్లో రాణించడంపై ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది.'' దేశంలో పాపులర్ క్రీడగా పేరున్న క్రికెట్తో బ్యాడ్మింటన్ను పోల్చలేము. అయితే చిన్నప్పటి నుంచి బ్యాడ్మింటన్పై ఇష్టం పెంచుకున్న నాకు తల్లిదండ్రుల నుంచి మంచి సపోర్ట్ లభించింది. అయితే బ్యాడ్మింటన్లోనూ మహిళలు, పురుషులకు సెపరేట్ ఫ్యాన్ బేస్ ఉంటుంది. మాతో పోలిస్తే పురుషుల బ్యాడ్మింటన్కు కాస్త క్రేజ్ ఎక్కువ. అలాంటి స్థితిలోనూ నేను బ్యాడ్మింటన్లో రాణించడం సంతోషంగా అనిపించింది. తొమ్మిది, పదేళ్ల వయస్సు నుంచి రెగ్యులర్గా బ్యాడ్మింటన్ టోర్నీల్లో పాల్గొనేదాన్ని. ఆ టోర్నమెంట్లో ఇచ్చిన రూ.500, 1000 ప్రైజ్మనీ.. ఇలా ఒక్క రూపాయి వచ్చిన ఇంట్లోనే ఇచ్చేదాన్ని. అంతర్జాతీయ స్థాయిలో బ్యాడ్మింటన్లో పతకాలు అనగానే మొదటగా కొరియా,చైనా, జపాన్ పేర్లు ఎక్కువగా వినిపిస్తాయి. ఎందుకంటే ఆయా దేశాల్లో బ్యాడ్మింటన్ ఆటలో కత్తిలాంటి ప్లేయర్లు తయారవుతున్నారు. కానీ మన దేశంలో అలా కాదు. క్రికెట్ లాంటి పాపులర్ గేమ్ వెనుక బ్యాడ్మింటన్ లాంటివి చిన్న గేమ్స్గా చూస్తారు. అయితే నా తండ్రి ఒలింపిక్స్లో గోల్డ్ మెడల్ కొడితే చూడాలని ఉందని ఒకరోజు అన్నాడు. అది విన్న నాకు నవ్వు వచ్చింది. కానీ ఈ విషయాన్ని సీరియస్గా తీసుకొని బ్యాడ్మింటన్లో రాణించాలని నా తండ్రి బలంగా కోరుకున్నాడు. అలా ఇవాళ మీ ముందు ఉన్న సైనా నెహ్వాల్ ఈరోజు స్టార్ బ్యాడ్మింటన్గా పేరు సంపాదించింది. ఇక కెరీర్లో ఎన్నో టైటిల్స్ గెలిచినప్పటికి ఒలింపిక్స్, కామన్వెల్త్ గేమ్స్లో పతకం సాధించడం గర్వంగా అనిపించేది. ఈరోజు మహిళలు పురుషులతో సమానంగా రాణించడం చూస్తే ప్రపంచంతో పోటీ పడి పరుగులు తీస్తున్నామన్న విషయం స్పష్టమవుతోంది'' అంటూ చెప్పుకొచ్చింది. చదవండి: తన ముఖం కూడా చూడను! నాడు భోరున ఏడ్చేసిన సైనా! రూ. 2500 కూడా.. -
క్లైమాక్స్ సీన్ ను తలపించేలా స్మగ్లర్ లను పట్టుకున్న పోలీసులు
-
శిల్ప లేఅవుట్ ఫ్లై ఓవర్.. 20 నిమిషాల్లో పంజాగుట్ట నుంచి ఓఆర్ఆర్కు
సాక్షి, గచ్చిబౌలి: శంషాబాద్ విమానాశ్రయానికి వెళ్లే ప్రయాణికులకు మరో సౌకర్యం అందుబాటులోకి వచ్చింది. ఇక నుంచి గచచ్చిబౌలి ఔటర్ రింగ్ రోడ్డుకు రయ్.. రయ్మని వెళ్లవచ్చు. శిల్పా లేవుట్లో అందుబాటులోకి వచ్చిన ఫ్లైఓవర్తో విమానాశ్రయానికి వెళ్లే ప్రయాణికులు తక్కువ సమయం పడుతుంది. సిగ్నల్ ఫ్రీ రవాణా వ్యవస్థను నెలకొల్పడంలో భాగంగా ఏర్పాటు చేస్తున్న ఫ్లైఓవర్లతో వాహనదారులకు ఎంతో ఊరట లభిస్తుంది. జీహెచ్ఎంసీ పరిధిలో ఎస్ఆర్డీపీ నిర్మించిన 17వ ఫ్లైఓవర్గా శిల్ప లేఅవుట్ ఫ్లై ఓవర్ అందుబాటులోకి వచ్చింది. ఏర్పాట్లు ఇలా.. ♦ మైండ్ స్పేస్ ఫ్లైఓవర్ దిగగానే, ఐకియా వెనుక రోడ్డులో శిల్ప లేఅవుట్ ఫ్లై ఓవర్కు చేరుకోవాలి. ♦ ఫ్లై ఓవర్ ఎక్కిన వాహనాలు ఓల్డ్ ముంబై జాతీయ రహదారిపై దిగొచ్చు. దిగువ ర్యాంప్ ద్వారా ఔటర్పై కూడా దిగవచ్చు. ♦ ఔటర్ నుంచి వచ్చే వాహనాలు ఎగువ ర్యాంప్ ద్వారా నేరుగా ఫ్లై ఓవర్ పైకి వెళతాయి. గచ్చిబౌలి జంక్షన్లోనూ ఫ్లై ఓవర్ పైకి వాహనాలు వెళ్లేందుకు ర్యాంప్ ఏర్పాటు చేశారు. ♦ ఫ్లై ఓవర్ ముగియగానే, లెఫ్ట్ తీసుకొని డెలాయిట్ రోడ్డులో మైండ్ స్పేస్ ఫ్లైఓవర్పైకి చేరుకోవచ్చు. సాఫీగా ప్రయాణం.. సికింద్రాబాద్, కూకట్పల్లి, పంజాగుట్ట, అమీర్పేట్ తదితర ప్రాంతాల నుంచి వాహనాలు పంజాగుట్ట నాగార్జున సర్కిల్ నుంచి ప్రసాద్ ఐ హాస్పిటల్, జూబ్లీహిల్స్ చెక్ పోస్టు జంక్షన్ నుంచి రోడ్ నంబర్ 45కు వెళతాయి. ♦ అక్కడ కేబుల్ బ్రిడ్జి నుంచి నేరుగా కోహినూర్ హోటల్ , మైండ్ స్పేస్ ఫ్లైఓవర్ దిగిన వెంటనే లెఫ్ట్ తీసుకోవాలి. ఐకియా వెనుక నుంచి వెళ్లి రైట్ టర్న్ తీసుకుంటే శిల్ప లేఅవుట్లోని ఫ్లై ఓవర్ పై నుంచి నేరుగా ఔటర్ రింగ్ రోడ్డుకు చేరుకోవచ్చు. ♦ జూబ్లీహిల్స్ వైపు నుంచి వచ్చే వాహనదారులు శంషాబాద్ విమానాశ్రయం, బెంగళూర్ జాతీయ రహదారితో పాటు నానక్రాంగూడ ఫైనాన్షియల్ డి్రస్టిక్ట్, కోకాపేట్, శంకర్పల్లి, తెల్లాపూర్, కొల్లూరు, పటాన్చెరు వైపు వెళ్లవచ్చు. ♦ ఫ్లైఓవర్ నుంచి ఓల్డ్ ముంబయ్ జాతీయ రహదారికి దిగే వెసులుబాటు కల్పించారు. దీంతో రాయదుర్గం, మెహిదీపట్నం వైపు వెళ్లేందుకు వీలుంటుంది. ♦ శంషాబాద్ విమానాశ్రయం, పటాన్చెరు, కోకాపేట్, ఫ్లైనాన్షియల్ డిస్ట్రిక్ట్, లింగంపల్లి, గచ్చిబౌలి నుంచి వాహనదారులు నేరుగా శిల్పా లేఅవుట్ ఫ్లై ఓవర్ ద్వారా ఇట్టే జూబ్లీహిల్స్ చేరుకోవచ్చు. జంక్షన్లపై తగ్గనున్న ఒత్తిడి ♦ ఔటర్ రింగ్ రోడ్డు నుంచి జూబ్లీహిల్స్ వెళ్లే వాహనాలు గచి్చ»ౌలి జంక్షన్ నుంచి బయోడైవర్సిటీ జంక్షన్, మైండ్ స్పేస్ జంక్షన్కు వెళుతుంటాయి. లేదా గచి్చ»ౌలి జంక్షన్ నుంచి అంజయ్యనగర్లో రైట్ టర్న్ తీసుకొని రాంకీ రోడ్డులో వెళ్లి మైండ్ స్పేస్ ప్లై ఓవర్కు చేరుకునేవి. ♦ శిల్ప లేఅవుట్ ఫ్లై ఓవర్ అందుబాటులోకి రావడంతో అటు బయోడైవర్సిటీ, ఇటు అంజయ్యనగర్ వైపు వెళ్లాల్సిన పని లేదు. ♦ దీంతో గచ్చిబౌలి జంక్షన్లో వాహనాల తాకిడి తగ్గనుంది. అంతే కాకుండా బయోడైవర్సిటీ జంక్షన్లోనూ తగ్గే అవకాశం ఉంది. ప్రాజెక్ట్ వ్యయం రూ.466 కోట్లు ►పొడవు 2,810 మీటర్లు (2.81 కిలోమీటర్లు) ►లైన్లు నాలుగు లేన్ల బై డైవర్షనల్ ఫ్లై ఓవర్ ►మెయిన్ ఫ్లైఓవర్ 956 మీటర్లు ►ఎగువ ర్యాంప్ 456.64 మీటర్లు ►దిగువ ర్యాంప్ 399.95 మీటర్లు (ఫొటో గ్యాలరీ కోసం ఇక్కడ క్లిక్ చేయండి) -
మాదాపూర్ గుర్తుందా.. మళ్లీ అదే తరహా డెవలప్మెంట్ అక్కడ మొదలైంది, ఎగబడుతున్న జనం!
‘అభివృద్ధిని ముందుగా ఊహించిన వాళ్లే ఫలాలను అందుకుంటారు’ స్థిరాస్తి రంగంలో ఇది అక్షర సత్యం. ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ (ఐటీ) కంపెనీల రాకతో మొదలైన మాదాపూర్ అభివృద్ధి.. 2007లో రియల్ బూమ్తో చుట్టూ 20 కి.మీ. వరకూ విస్తరించింది. సేమ్ ఇదే తరహా డెవలప్మెంట్ ఉత్తర హైదరాబాద్లో మొదలైంది. కండ్లకోయలో ఐటీ పార్క్ స్థల కేటాయింపుతో మొదలైన ఈ ప్రాంతం అభివృద్ధి.. సమీప భవిష్యత్తులోనే గచ్చిబౌలి, ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ లాగా అభివృద్ధి చెందుతుందని రియల్టీ నిపుణులు అంచనా వేస్తున్నారు. ఎన్హెచ్–44, ఓఆర్ఆర్, రైల్వే, ఎంఎంటీఎస్ కనెక్టివిటీలతో పాటూ పశ్చిమ హైదరాబాద్తో పోలిస్తే ఉత్తరాదిలో స్థలాల ధరలు చౌకగా ఉండటం ఈ ప్రాంతానికి అదనపు బలాలు. సాక్షి, హైదరాబాద్: ఐటీ, వాణిజ్య సముదాయాలతో కిక్కిరిసిపోయిన మాదాపూర్ ప్రాంతం క్రమంగా ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్కు విస్తరించింది. అయితే ప్రస్తుతం ఈ ప్రాంతం ఖరీదైన పెట్టుబడి మార్కెట్గా మారడంతో పెట్టుబడిదారులు, కొనుగోలుదారులు క్రమంగా ఉత్తర హైదరాబాద్ వైపు మళ్లుతున్నారు. గచ్చిబౌలి, మాదాపూర్ వంటి పశ్చిమ హైదరాబాద్తో పోలిస్తే ఉత్తరాదిలో స్థిరాస్తి ధరలు అందుబాటులో ఉంటాయి. దీంతో పెట్టుబడిదారులు, కొనుగోలుదారులు ఈ ప్రాంతంలో భూములు, అపార్ట్మెంట్లను కొనుగోలు చేసేందుకు ఆసక్తి కనబరుస్తున్నారు. ఇక్కడ అపార్ట్మెంట్లలో చ.అ. ధర రూ.4,500–5,000, గేటెడ్ కమ్యూనిటీలో అయితే రూ.5,500 నుంచి రూ.6,000లుగా ఉన్నాయి. ఓపెన్ ప్లాట్లయితే గజం రూ.60 వేల నుంచి రూ.80 వేలుగా చెబుతున్నారు. కనెక్టివిటీ బాగుంది.. హైదరాబాద్ – నాగ్పూర్ జాతీయ రహదారి–44 ఉత్తర హైదరాబాద్ మీదుగా వెళుతుంది. ముంబై, నాందేడ్, షిర్డీ వైపు వెళ్లే రైలు మార్గం ఈ ప్రాంతం మీదుగానే ప్రయాణిస్తాయి. బొల్లారం, మేడ్చల్కు ఎంఎంటీఎస్ సదుపాయం కూడా ఉంది. సుచిత్ర నుంచి డెయిర్ ఫాం జంక్షన్, సినీ ప్లానెట్ నుంచి జీడిమెట్ల జంక్షన్, కొంపల్లి నుంచి దూలపల్లి కూడలి వరకు మొత్తం 10 కి.మీ. మేర మూడు ఎలివేటెడ్ కారిడార్లు నిర్మించాలని నేషనల్ హైవేస్ అథారిటీ ఆఫ్ ఇండియా ప్రతిపాదించింది. జీనోమ్వ్యాలీ, నల్సార్తో సహా ఇతర అంతర్జాతీయ విద్యా, వైద్య సంస్థలు, వినోద కేంద్రాలు ఈ ప్రాంతంలో కొలువుదీరాయి. నగరంలోని ఇతర జాతీయ రహదారులతో పోలిస్తే మేడ్చల్ హైవేలో రద్దీ తక్కువగా ఉంటుంది. 30 నిమిషాల ప్రయాణ వ్యవధిలో ప్రధాన నగరానికి చేరుకోవచ్చు. కండ్లకోయలో సైబర్ టవర్స్ను మించి.. పశ్చిమ ప్రాంతానికే పరిమితమైన ఐటీని నగరం నలువైపులా విస్తరించాలని భావించిన తెలంగాణ ప్రభుత్వం.. ఉత్తర హైదరాబాద్లో ఐటీ పార్క్ను ఏర్పాటు చేస్తున్నట్లు ప్రకటించింది. ఇందులో భాగంగా కండ్లకోయలో 6 లక్షల చ.అ. బిల్టప్ ఏరియాలో ఐటీ పార్క్ను ఏర్పాటు చేయనున్నారు. ఇది సైబర్ టవర్స్ కంటే విస్తీర్ణమైన స్థలం. ఇప్పటికే కండ్లకోయలో స్థలం కోసం దరఖాస్తు చేసుకున్న 90కి పైగా కంపెనీలకు అనుమతి పత్రాలను కూడా మంత్రి జారీ చేశారు. భవిష్యత్తులో ఈ ఐటీ పార్క్లో 50 వేల ఉద్యోగ అవకాశాలుంటాయని అంచనా. దీంతో ఈ ప్రాంతంలో ఒక్కసారిగా స్థిరాస్తి జోరందుకుంది. పెద్ద ఎత్తున అపార్ట్మెంట్లు, వ్యక్తిగత భవనాలు, గేటెడ్ కమ్యూనిటీలు నిర్మాణంలో ఉన్నాయి. ఈ ప్రాంతాలు హాట్స్పాట్స్.. ప్రధానంగా జీడిమెట్ల, దూలపల్లి, అల్వాల్, బొల్లారం, కొంపల్లి, కండ్లకోయ, శామీర్పేట, మేడ్చల్ వంటి ప్రాంతాలలో స్థిరాస్తి వ్యాపారం జోరుగా సాగుతోంది. నిజామాబాద్, బోధన్, ఆర్మూర్, కామారెడ్డి వంటి జిల్లావాసులు ఉత్తర హైదరాబాద్లో పెద్ద ఎత్తున భూములను కొనుగోలు చేసేందుకు ఆసక్తిని చూపిస్తున్నారు. అపర్ణా, సాకేత్, భువనతేజ వంటి ప్రముఖ నిర్మాణ సంస్థలు మేడ్చల్ జాతీయ రహదారిలో భారీ ఓపెన్ ప్లాట్లు, అపార్ట్మెంట్లు, విల్లా ప్రాజెక్ట్లను చేపడుతున్నాయి. అలాగే పశ్చిమాదిలో ఆకాశహర్మ్యాలను నిర్మిస్తున్న పలు బడా నిర్మాణ సంస్థలు మేడ్చల్ హైవేలో పెద్ద ఎత్తున స్థల సమీకరణ చేస్తున్నట్లు తెలిసింది. చదవండి: అదిరే లుక్తో కొత్త ఎలక్ట్రిక్ ఎస్యూవీ.. ఒకసారి చార్జింగ్ చేస్తే 500 కి.మీ -
Hyderabad: వ్యభిచార గృహంపై దాడి.. ఐదుగురి అరెస్ట్
సాక్షి, హైదరాబాద్: వ్యభిచార గృహంపై పోలీసులు దాడి చేసి ఐదుగురిని అరెస్ట్ చేసిన సంఘటన గచ్చిబౌలి పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. సీఐ గోనె సురేష్ కథనం మేరకు వివరాలు ఇలా ఉన్నాయి. రాఘవేంద్ర కాలనీలోని వైట్ హౌస్ ఓ హోటల్లో వ్యభిచారం నిర్వహిస్తున్నట్లు సమాచరం అందడంతో గచ్చిబౌలి పోలీసులు, యాంటీ హ్యూమన్ ట్రాకింగ్ యూనిట్ సభ్యులు హోటల్పై దాడి చేశారు. ఈ సందర్భంగా పంజాబ్, ఉత్తరప్రదేశ్కు చెందిన చెందిన ఇద్దరు యువతులను రెస్క్యూ హోంకు తరలించారు. నిర్వాహకులు మహ్మద్ అదీమ్, మహ్మద్ సమీర్, హర్బిందర్ కౌర్ అలియాస్ అనికా, మహ్మద్ సల్మాన్, మహ్మద్ అబ్దుల్ కరీంలను అరెస్ట్ చేశారు. మహ్మద్ అదీమ్ పలు రాష్ట్రాల నుంచి యువతులను రప్పించి వ్యభిచారం నిర్వహిస్తున్నట్లు తెలిపారు. నిందితులపై సైబరాబాద్లో పది కేసులు నమోదై ఉన్నట్లు ఆయన వివరించారు. చదవండి: Warangal: బర్త్డే వేడుకల్లో గొడవ.. శానిటైజర్ తాగిన విద్యార్థినులు -
అమెరికాలో 1.99 లక్షల మంది భారతీయ విద్యార్థులు
సాక్షి, హైదరాబాద్: అమెరికాలో చదుకునేందుకు భారతీయ విద్యార్థుల సంఖ్య ఏటేటా గణనీయంగా పెరుగుతోందని అమెరికా రోవాన్ యూనివర్శిటీ సీనియర్ వైస్ ప్రెసిడెంట్ డారెన్ వాగ్నర్ పేర్కొన్నారు. గచ్చిబౌలిలోని స్కైవ్యూలోని ఇండో గ్లోబల్ స్టడీస్ ఆఫ్ హైదరాబాద్ కార్యాలయాన్ని ఆయన గ్లోబల్ స్టూడెంట్ రిక్రూట్మెంట్ అడ్వైజర్ సీఈఓ డాక్టర్ మార్క్ ఎస్ కోపెన్క్సి, ఐజీఎస్ వ్యవస్థాపకుడు చైర్మన్ అశోక్ కల్లం కూడా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... భారతదేశం నుంచి ఏడాది 18.9 శాతం విద్యార్థుల పెరుగుదల కనిపిస్తోందని, ప్రస్తుతం అమెరికాలో 1.99 లక్షల మంది భారతీయ విద్యార్థులు చదువుతున్నారన్నారు. ప్రస్తుతం 80 శాతం విద్యార్థులు గ్రాడ్యుయేషన్, 20 శాతం అండర్ గ్రాడ్యుయేషన్కు వెళ్ళుతున్నారని, 78 శాతం విద్యార్థులు స్టెమ్ ప్రోగ్రామ్లను తీసుకుంటున్నారన్నారు. ప్రస్తుతం అమెరికాలో 1.6 మిలియన్ ఉద్యోగాలు ఉన్నాయన్నారు. రోవాన్ విశ్వవిద్యాలయం 800 ఎకరాల్లో విస్తరించి ఉన్న ప్రభుత్వ సంస్థ అని దీన్ని 1923లో స్థాపించారని ఆయన గుర్తు చేశారు. అమెరికాలో అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న మూడవ విశ్వవిద్యా లయంగా గుర్తింపు సాధించిందన్నారు. అనంతరం నూతన అడ్మిఫన్ల ప్రక్రియపై వారు చర్చించారు. (క్లిక్ చేయండి: సాఫ్ట్వేర్ కొలువు.. ఇక సో ఈజీ!) -
సూపర్ స్టార్ కృష్ణ ఆరోగ్యంపై వైద్యుల తాజా అప్డేట్..
సూపర్ స్టార్ కృష్ణ ఆరోగ్యం ఇంకా విషమంగానే ఉందని కాంటినెంటల్ ఆస్పత్రి ఛైర్మన్ డాక్టర్ గురునాథ్ రెడ్డి వెల్లడించారు. ఆయన పరిస్థితిపై ఇప్పుడేం ఏం మాట్లాడాలేమని ఆయన మరోసారి స్పష్టం చేశారు. ఆయనకు వెంటిలేటర్పైనే వైద్యం కొనసాగుతోందని పేర్కొన్నారు. కిడ్నీ, లంగ్స్, బ్రెయిన్ బాగా ఎఫెక్ట్ అయినట్లు డాక్టర్ గురునాథ్ రెడ్డి తెలిపారు. అన్ని విభాగాలకు చెందిన 8 మంది వైద్యుల బృందం ఆయనను పర్యవేక్షిస్తోందని స్పష్టం చేశారు. ఉదయం నుంచి ఇప్పటివరకు ఆయన పరిస్థితిలో ఎలాంటి మార్పు లేదన్నారు. ఇలాంటి క్లిష్ట పరిస్థితుల్లో దయచేసి వారి కుటుంబ సభ్యులను డిస్టర్బ్ చేయవద్దని కోరారు. (చదవండి: అత్యంత విషమంగా కృష్ణ ఆరోగ్యం, ఇప్పుడే ఏం చెప్పలేం: వైద్యులు) ఆయనకు మల్టీ ఆర్గాన్ ఫెయిల్యూర్ అయ్యాయని వైద్యులు చెబుతున్నారు. బ్రెయిన్లో చాలా వరకు ఎఫెక్ట్ అయినట్లు వెల్లడించారు. మా దగ్గర అంతర్జాతీయ స్థాయి వైద్య సదుపాయాలు ఉన్నాయని.. ప్రపంచంలో ఎక్కడికి తీసుకెళ్లిన ఇంతకు మించి ఏమి చేయలేమని స్పష్టం చేశారు. ఆయన మా ఆస్పత్రిలోనే చాలా ఏళ్లుగా చికిత్స తీసుకుంటున్నారని గురునాథ్ రెడ్డి పేర్కొన్నారు. మంగళవారం మధ్యాహ్నం ఒంటి గంటకు ఆయన పరిస్థితిపై బులెటిన్ విడుదల చేస్తామని వెల్లడించారు. కాగా.. ఆయనకు తెల్లవారుజామున కార్డియాక్ అరెస్ట్ కావడంతో గచ్చిబౌలిలోని కాంటినెంటల్ ఆస్పత్రిలో చేరారు. -
హైదరాబాద్లో మరో ఫ్లైఓవర్.. ఎయిర్పోర్ట్కు సాఫీగా జర్నీ
సాక్షి, హైదరాబాద్: శిల్ప లేఅవుట్ ఫ్లైఓవర్ పనులు పూర్తయ్యాయని, తుది మెరుగులు దిద్ది ఈ నెలాఖరులో ప్రారంభానికి సిద్ధం చేయనున్నట్లు జీహెచ్ఎంసీ కమిషనర్ లోకేశ్ కుమార్ సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఈ ఫ్లైఓవర్ అందుబాటులోకి వచ్చాక ఐటీ ప్రాంతానికి రాకపోకలు మరింత సులభం కానున్నాయని పేర్కొన్నారు. ప్రస్తుతం అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ వరకు, ఔటర్ రింగు రోడ్డు ద్వారా గచ్చిబౌలి వరకు ఎలాంటి సమస్యలు లేకపోగా, కొత్త ఫ్లై ఓవర్ అక్కడ నుంచి ఇతర ప్రాంతాలకు సైతం సాఫీ ప్రయాణం సాధ్యం కానుందని పేర్కొన్నారు. (క్లిక్ చేయండి: కదిలే ఇల్లు! ధర తక్కువ...ఎక్కడికైనా తీసుకుపోవచ్చు) దీనివల్ల జూబ్లీహిల్స్, పంజగుట్టల నుంచి గచ్చిబౌలి మీదుగా పటాన్చెరు కోకాపేట్, నార్సింగి, అంతర్జాతీయ విమానాశ్రయం వరకు వెళ్లేందుకు.. అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి జూబ్లీహిల్స్, పంజాగుట్ట, కూకట్పల్లి, మాదాపూర్ తదితర ప్రాంతాలకు వెళ్లేందుకు సాఫీ ప్రయాణం సాధ్యం కానుందని పేర్కొన్నారు. -
Hyderabad: భర్తతో సినిమాకు వెళ్లి.. కనిపించకుండా పోయిన భార్య
సాక్షి, హైదరాబాద్: భర్తతో కలిసి సినిమాకు వెళ్లిన ఓ మహిళ అదృశ్యమైన సంఘటన గచ్చిబౌలి పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. ఏఎస్ఐ సాయులు కథనం మేరకు వివరాలు ఇలా ఉన్నాయి. సంగారెడ్డి జిల్లాకు చెందిన భాస్కర్ రెడ్డి ప్రైవేట్ కంపెనీలో ఉద్యోగం చేస్తున్నాడు. ఈ నెల 21న సాయంత్రం భార్య శైలజతో కలిసి కొత్తగూడలోని ఏఎంబీ మాల్లో సినిమాకు వచ్చాడు. సినిమా చూస్తుండగా శైలజ వాష్రూమ్కు వెళుతున్నట్లు చెప్పి బయటికి వెళ్లి తిరిగి రాలేదు. దీంతో అతను మహిళా సిబ్బందితో వాష్ రూమ్లో వెతికించినా జాడ తెలియలేదు. పరిసర ప్రాంతాల్లో గాలించినా ఆచూకీ లభ్యం కాలేదు. శైలజతో గత మే నెలలో భాస్కర్ రెడ్డికి వివాహం జరిగింది. తన భార్య వద్ద సెల్ఫోన్ కూడా లేదని, జాడ తెలియడం లేదని ఆదివారం ఆమె భర్త గచ్చిబౌలి పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశాడు. ఈ మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు ఏఎంబీ మాల్లో సీసీ పుటేజీలను పరిశీలిస్తున్నారు. చదవండి: రైళ్లలో ప్రీమియం తత్కాల్ దోపిడీ..రూ.450 టికెట్ రూ.1000పైనే -
న్యూడ్ కాల్స్ పేరుతో యువకులను ట్రాప్ చేస్తున్న యువతి
సాక్షి, హైదరాబాద్: రెండు రోజుల క్రితం ఇన్స్టాగ్రామ్లో పరిచయమైన యువతి న్యూడ్ వీడియోను సోషల్ మీడియాలో పెడతానంటూ బెదిరింపులకు పాల్పడిన ఘటన గచ్చిబౌలి పోలీస్స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. ఇన్స్పెక్టర్ సురేష్ తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. ఐసీఐసీఐ బ్యాంక్లో పనిచేసే ఓ ఉద్యోగి గచ్చిబౌలిలోని డీఎల్ఎఫ్ సమీపంలోని హాస్టల్లో నివాసముంటున్నాడు. రెండు రోజుల క్రితం ఇన్స్టాగ్రామ్లో ఓ యువతితో పరిచయం అయింది. ఈ క్రమంలో వీడియో కాల్ మాట్లాడిన యువతి కాల్ను రికార్డు చేసి రూ.10వేలు పంపాలని లేకపోతే దాన్ని న్యూడ్ వీడియోగా మార్చి సోషల్ మీడియాలో పెట్టడమే కాకుండా ఫ్రెండ్స్ అందరికీ పంపిస్తానని డిమాండ్ చేసిందని గచ్చిబౌలి పోలీస్స్టేషన్లో ఆయన ఫిర్యాదు చేశారు. డబ్బులు పంపితే వీడియోకాల్ను డిలీట్ చేస్తానని స్పష్టం చేసిందని ఫిర్యాదులో పేర్కొన్నారు. కాగా ఆ యువతి న్యూడ్ కాల్స్ పేరుతో యువకులను ట్రాప్ చేస్తున్నట్లు తెలిసింది. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు ప్రారంభించారు. చదవండి: ‘నా డెత్ సర్టిఫికెట్ పొగొట్టుకున్నాను’.. వైరలవుతోన్న పేపర్ యాడ్ -
Gachibowli: ఓయో రూమ్లో వ్యభిచారం.. నలుగురు అరెస్ట్
సాక్షి, హైదరాబాద్: ఓయో రూమ్లో వ్యభిచారం జరుగుతుందనే సమాచారం మేరకు దాడి చేసి నలుగురు నిందితులను అరెస్ట్ చేసినట్టు రాయదుర్గం పోలీసులు తెలిపారు. పోలీసులు తెలిపిన∙వివరాలు ఇలా ఉన్నాయి .. గచ్చిబౌలి పీజేఆర్నగర్లోని గ్యాస్ గోడౌన్ రోడ్డులోని ఓయో హోటల్లో వ్యభిచారం నిర్వహిస్తున్నారనే విశ్వసనీయ సమాచారం మేరకు పోలీసులు మంగళవారం సాయంత్రం ఆకస్మిక దాడులు నిర్వహించారు. కమలాకర్రెడ్డి అనే వ్యక్తి ఓయో హోటల్లో గదులు తీసుకొని వ్యభిచార కేంద్రం నిర్వహిస్తున్నాడని అతనికి ఎండీ రఫీక్(32), అమిత్కుమార్ అనే వ్యక్తులు సహాయకులుగా ఉంటూ ఇతర రాష్ట్రాల నుంచి తీసుకొస్తున్నారని, వీరితోపాటు వ్యభిచారానికి పాల్పడుతున్న 9 మంది బెంగాల్, ఆంధ్రప్రదేశ్, ముంబాయి, కర్నాటక రాష్ట్రాలకు చెందిన అమ్మాయిలను రెస్క్యూ హోమ్లకు తరలించారు. ఇదిలా ఉండగా ప్రధాన నిందితుడు కమలాకర్రెడ్డి, అతని సహాయకుడు అమిత్కుమార్ పరారీలో ఉన్నారు. నిందితుల నుంచి 5 సెల్ఫోన్లు, 29 కండోమ్ ప్యాకెట్లు, రూ.15,050 నగదు, ఇతర సామగ్రిని స్వాధీనం చేసుకున్నారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకొని పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. చదవండి: ‘నువ్వంటే ఇష్టం... నాతో ఉండిపో’.. వివాహితకు సినీ కెమెరామెన్ వేధింపులు -
Gachibowli: గచ్చిబౌలిలో దారుణం..
సాక్షి, గచ్చిబౌలి: ఓ నిండు గర్భిణి దారుణ హత్యకు గురైన సంఘటన గచ్చిబౌలి పోలీస్ స్టేషన్ పరిధిలో ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. సీఐ గోనె సురేష్ కథనం మేరకు వివరాలు ఇలా ఉన్నాయి. సాఫ్ట్వేర్ ఇంజినీర్గా పనిచేస్తున్న వాసుశెట్టి వెంకట రామకృష్ణ, భార్య స్రవంతి(32)తో కలిసి కొండాపూర్లోని జేవీజీహిల్స్ డీఆర్ టవర్స్లో నివాసం ఉంటున్నాడు. వీరికి ఒక కుమార్తె కాగా, ప్రస్తుతం స్రవంతి 8 నెలల గర్భవతి. అతడి చిన్నమ్మ కూతురు లక్ష్మీప్రసన్న కూడా సాఫ్ట్వేర్ ఇంజినీర్గా పని చేస్తోంది. ఆమెకు రెండేళ్ల క్రితం పశ్చిమగోదావరి జిల్లా, పేరుపాలెం గ్రామానికి చెందిన కావూరు శ్రీరామ కృష్ణతో వివాహం జరిగింది. పెళ్లైన కొద్ది రోజుల నుంచే భార్య ప్రవర్తనపై అనుమానం వ్యక్తం చేస్తూ ఆమెను వేధించేవాడు. దీంతో పెళ్లికి మధ్యవర్తిగా వ్యవహరించిన వెంకట రామకృష్ణ బంధువులతో కలిసి అతడి స్వగ్రామానికి వెళ్లి పంచాయితీ చేశాడు. దీంతో అప్పటి నుంచి వెంకట రామకృష్ణపై శ్రీరామకృష్ణ కోపం పెంచుకున్నాడు. దీనికితోడు అతడి భార్య లక్ష్మీ ప్రసన్న చందానగర్కు మకాం మార్చి వేరుగా ఉంటోంది. నెల రోజుల క్రితం తన భర్త వేధింపులకు పాల్పడుతున్నాడని చందానగర్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయడంతో కేసు నమోదు చేసిన పోలీసులు శ్రీరామ కృష్ణను పీఎస్కు పిలిపించి నోటీసు ఇచ్చారు. అప్పటి నుంచి బామ్మర్ది వెంకట రామకృష్ణను హత్య చేయాలని నిర్ణయించుకున్నాడు. ఈ నేపథ్యంలో ఈ నెల 6న సాయంత్రం ఎర్రగడ్డలో వేట కొడవలి కొనుగోలు చేసి వెంకట రామకృష్ణ ఇంటికి వచ్చి కాలింగ్ బెల్ కొట్టడంతో స్రవంతి తలుపు తీసింది. అతను మాట్లాడే విధానం చూసి భయపడిన ఆమె పక్కింటి వారిని పిలిచేందుకు కేకలు వేస్తూ బయటికి వెళ్లగా వెనక నుంచి వచ్చిన శ్రీ రామకృష్ణ వేట కొడవలితో ఆమెపై దాడి చేయడంతో కుప్పకూలింది. స్థానికులు ఆమెను సమీపంలోని ప్రైవేట్ ఆస్పత్రికి తీసుకెళ్లగా చికిత్స పొందుతూ అదే రోజు రాత్రి మృతి చెందింది. -
కాకినాడ నుంచి స్విగ్గీలో స్వీట్లు ఆర్డర్.. 3 గంటలు డెలివరీ ఆలస్యం కావడంతో
సాక్షి, హైదరాబాద్: కాకినాడ నుంచి స్విగ్గీలో ఆర్డర్ చేసిన స్వీటు.. నానక్రాంగూడకు డెలివరీ ఆలస్యం కావడంతో ఇద్దరు పరస్పరం దాడి చేసుకున్న సంఘటన గచ్చిబౌలి పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. సీఐ సురేష్ తెలిపిన ప్రకారం వివరాలు ఇలా.. కాకినాడలో ఉండే సాయిశ్రీ స్విగ్గీలో గురువారం మధ్యాహ్నం 3.30 గంటలకు స్వీట్ ఆర్డర్ చేయగా నానక్రాంగూడలో గోల్ప్ ఎడ్జ్ ఫ్లాట్ నెంబర్ 1804లో ఉంటున్న భాస్కర్కు చేరాల్సి ఉంది. స్విగ్గీ డెలివరీ బాయ్గా ఫస్ట్లాన్సర్కు చెందిన షేక్ అమీర్ బైక్పై బయలుదేరాడు. వర్షం పడటంతో రాంగ్ లొకేషన్ చూపించడంతో ఆర్టీసీ క్రాస్ రోడ్డుకు వెళ్లాడు. అక్కడి నుంచి యువతికి ఫోన్ చేయగా డెలివరీ అడ్రస్ లొకేషన్ పంపించింది. దీంతో గోల్ప్ ఎడ్జ్కు చేరుకునే సరికి సాయంత్రం 6 గంటలైంది. డెలివరీ తీసుకోమని స్నేహితుడు చెఫ్ శివ ప్రసాద్కు చెప్పి భాస్కర్ బయటకు వెళ్లాడు. డెలివరీ ఆలస్యమైందని చెఫ్ దురుసుగా మాట్లాడటంతో ఇద్దరి మధ్య గొడవ మొదలైంది. దీంతో శివప్రసాద్ ఇంట్లో నుంచి కత్తి తెచ్చి దాడి చేయగా ప్రతిఘటించిన షేక్ అమీర్ కుడి చేతిపై గాయమైంది. అమీర్ అదే కత్తిలో శివప్రసాద్ మెడ, ఛాతి, చేతిపై దాడి చేసి అక్కడి నుంచి పరారయ్యాడు. ఈ ఘటనలో చెఫ్ శివప్రసాద్, డెలివరీ బాయ్ షేక్ అమీర్పై కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు. చదవండి: స్విగ్గీలో ఐస్క్రీం, చిప్స్ ఆర్డర్ చేస్తే.. డెలీవరీ చూసి షాక్ అయిన వ్యక్తి -
మహిళపై జాత్యాంహకార వివక్ష కలకలం! కేటీఆర్ ఆగ్రహం!
ప్రపంచంలోనే అతి పెద్ద ఫర్నీచర్ అమ్మకాల సంస్థ ఐకియా వివాదంలో చిక్కుకుంది. ఐకియా సిబ్బంది జాత్యంహకార వ్యాఖ్యలకు పాల్పడ్డారు. ఈ ఘటనపై మంత్రి కేటీఆర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఐకియా తీరును తప్పుబట్టారు. ఐకియా బాధితులకు క్షమాపణలు చెప్పాలని ఆదేశించారు. నితిన్ సేథి జర్నలిస్ట్గా పనిచేస్తున్నారు. ఈ తరుణంలో ఆదివారం రోజు నితిన్ సేథి భార్య, మణిపూర్కు చెందిన అకోలిజం సునీతా గచ్చిబౌలీ ఐకియా స్టోర్కి వచ్చారు. కావాల్సిన వస్తువుల్ని కొనుగోలు చేసి తిరిగి వెళుతుండగా కౌంటర్లో ఉన్న సిబ్బంది తమపై జాత్యంహకార వ్యాఖ్యలు చేసినట్లు బాధితురాలు ట్వీట్ చేసింది. I was one of the many who bought stuffs at @IKEAIndia Hyderabad today. but i was the only one whose purchased items were checked one by one. if this is not #racism then what is it? the senior staffs there were far from helpful. does @IKEA endorse such behavior? https://t.co/DAeYW6hP2E — akoijam sunita (@akoi_Jam) August 28, 2022 'ఈరోజు హైదరాబాద్ ఐకియా స్టోర్ సిబ్బంది నేను మాత్రమే కొనుగోలు చేసిన వస్తువులను ఒక్కొక్కటిగా తనిఖీ చేశారు. అక్కడి సిబ్బంది సాయం చేసేందుకు ఎవరూ ముందుకు రాలేదు. ఇది జాత్యహంకారం కాకపోతే అది ఏమిటి? అని ప్రశ్నించారు.పైగా పేరుతో పిలిచి అవమానించారని అన్నారు. @IKEA ఇటువంటి సిబ్బంది ప్రవర్తనను సమర్థిస్తారా? అంటూ ట్వీట్లో పేర్కొన్నారు. నాభార్యకు అవమానం జరిగింది నితిన్ సేథి సైతం ఐకియా స్టోర్లో తన భార్య సునీతాకు జరిగిన అవమానంపై ట్వీట్ చేశారు. నా భార్య షాపింగ్ బ్యాగ్లను తనిఖీ చేసే వ్యక్తి..ఈ వస్తువుల్ని మేం కూడా కొన్నాం అంటూ నవ్వాడు. మమ్మల్ని ఒంటరిగా ఉంచారు. అడిగితే సమాధానం ఇవ్వలేదు. పట్టించుకోలేదు. పైగా ఐకియా స్టోర్లో పనిచేసే సూపర్ వైజర్లు..అవునా కావాలంటే పోలీసుల్ని పిలవండి. మేం వారితో మాట్లాడతామని అన్నారు. ఇది ఇక్కడితో ముగియలేదు. ప్రజలు ఎదుర్కొంటున్న రోజువారీ జాత్యహంకారం అంటూ ట్వీట్ చేశారు. This is appalling and absolutely unacceptable @IKEAIndia Please ensure a proper apology is issued & more importantly educate, sensitise & train your staff to respect all your customers graciously Hope you will make amends asap https://t.co/l84GimoIrM — KTR (@KTRTRS) August 29, 2022 కేటీఆర్ ఆగ్రహం ఈ ట్వీట్ వైరల్ కావడంతో మంత్రి కేటీఆర్ స్పందించారు. ఐకియా సిబ్బంది తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు. వెంటనే నితిన్ సేథికి క్షమాణలు చెప్పాలని, కస్టమర్లతో ఎలా వ్యవహరించాలో సిబ్బందికి అవగాహన కల్పించాలని యాజమాన్యానికి సూచిస్తూ ట్వీట్ చేశారు. కేటీఆర్ ట్వీట్, నితిన్ సేథి ట్వీట్పై ఐకియా యాజమాన్యం స్పందించింది. స్టోర్ల వద్ద సమానత్వం మానవ హక్కుగా భావిస్తాం. ఇక్కడ జాత్యహంకారం, పక్షపాతాలకు తావులేదని తెలిపింది. బాధితులకు కలిగిన అసౌకర్యానికి చింతిస్తున్నామని ట్వీట్ చేసింది. -
T-Hub: అంకుర సంస్థలకు ‘సింగిల్ విండో’
ఎన్నో సరికొత్త ఆలోచనలు చేయగల, అధునాతన ఉత్పత్తులను రూపొందించగల సత్తా మన యువతలో ఉంది. వారి ఆలోచనలు ఆచరణలోకి తెచ్చే ప్రోత్సాహం వారికి అవసరం. ఈ ప్రోత్సాహాన్ని అందించాలనీ, ఔత్సాహిక యువతను వ్యాపారవేత్త లుగా, పారిశ్రామికవేత్తలుగా తీర్చిదిద్దాలనీ తెలంగాణ ప్రభుత్వం 2015లో టీ–హబ్ను ప్రారంభించింది. ఒక ఆలోచనతో వస్తే... దానిని ఆచరణలోకి తేవడం, వస్తువు లేదా సర్వీస్గా మల్చడం టీ–హబ్ ఉద్దేశ్యం. ఇది స్టార్టప్ల జమానా. ఒక విజయవంతమైన స్టార్టప్ను స్థాపించాలనే పట్టుదల చాలామందికి ఉంటుంది. కానీ, ఇందుకు కావాల్సిన ప్రోత్సాహం, సదుపాయాలు, పెట్టుబడి, మార్గనిర్దేశం ఉండదు. ఇది గుర్తించిన తెలంగాణ ప్రభుత్వం టీ–హబ్ ద్వారా... ఒక ఆలోచనను అమలు చేయడానికి కావాల్సిన పెట్టుబడి పెట్టించడం, ఎలాంటి పద్ధతులను ఆచరించాలో అవగాహన కల్పించడం, మార్కెట్లోకి తీసుకెళ్లడం, నిపుణుల సలహాలు ఇప్పించడం, స్ఫూర్తి నింపడం, అవసరమైన నైపుణ్యత కలిగిన మానవ వనరులను అందివ్వడం వంటివి చేస్తోంది. ఇక ఒక స్టార్టప్ స్థాపించడానికి పాటించాల్సిన నియమ నిబంధనలపై సూచనలు ఇవ్వడం, స్టార్టప్లు వృద్ధి చెందడానికి కావాల్సిన భాగస్వామ్యాన్ని కల్పించడానికీ ప్రభుత్వం బాధ్యత తీసుకుంది. ఈ ఏడేళ్లలో దాదాపు పదకొండు వేల స్టార్టప్లకు టీ–హబ్ సహకారాన్ని అందించింది. వీటిల్లో 10 వేల కోట్ల పెట్టుబడులు పెట్టారు. టీ–హబ్ నుంచి 3 స్టార్టప్లు యూనికార్న్ (1 బిలియన్ డాలర్ల విలువ) కంపెనీలుగా ఎదిగాయి. మరో 8 కంపెనీలు సూని కార్న్ (త్వరలో యూనికార్న్గా మారనున్న) కంపెనీలుగా వృద్ధి చెందాయి. టీ–హబ్ను మరింత విస్తృతం చేయడానికి గానూ తెలంగాణ ప్రభుత్వం ‘టీ–హబ్ 2.0’ను నిర్మించింది. గచ్చిబౌలి ట్రిపుల్ ఐటీలో ఏర్పాటైన టీ–హబ్ కంటే ఇది దాదాపుగా ఐదు రెట్లు పెద్ద ప్రాంగణం. ప్రపంచ దిగ్గజ ఐటీ సంస్థలు నెలకొని ఉన్న హైదరాబాద్ ఐటీ హబ్ మధ్యలోని రాయదుర్గంలో రూ. 700 కోట్లతో ‘టీ–హబ్ 2.0’ నిర్మాణం జరిగింది. ఇటీవలే ముఖ్యమంత్రి కేసీఆర్ కొత్త టీ–హబ్ను ఘనంగా ప్రారంభించారు. మొత్తం 3.14 ఎకరాలలో 5.82 లక్షల చదరపు అడుగుల బిల్డప్ ఏరియా, 3.62 చదరపు అడుగుల కార్పెట్ ఏరియాలో నిర్మించిన టీ–హబ్ 2.0 ప్రపంచం లోనే అతిపెద్ద ఇన్నోవేషన్ క్యాంపస్. ఇప్పటివరకు ప్యారిస్లోని ‘స్టేషన్ ఎఫ్’ ప్రపంచంలో అతిపెద్ద ఇన్నొవేషన్ క్యాంపస్గా ఉండేది. 2 వేల స్టార్టప్లకు ఆశ్రయం ఇవ్వగల సామర్థ్యం ఉన్న 10 అంతస్తుల భవనాన్ని ప్రభుత్వం నిర్మించింది. ఇంతకాలం ట్రిపుల్ ఐటీలో ఉన్న టీహబ్ కార్యకలాపాలన్నీ ఇప్పుడు ఈ కొత్త భవనంలోనే జరుగుతున్నాయి. ఇప్పటివరకూ బెంగళూరు, ఢిల్లీ, ముంబయిలలో వెంచర్ క్యాపిటల్ సంస్థలు ఎక్కువగా ఉండేవి. ఇప్పుడు ఈ కార్యాలయాలు కూడా టీ–హబ్లోనే ఏర్పాటవుతున్నాయి. స్టార్టప్లను ప్రోత్సహించేందుకు కేంద్ర ప్రభుత్వం ఏర్పాటుచేసిన స్టార్టప్ ఇండియా, అటల్ ఇన్నొవేషన్ మిషన్ సెంటర్ కార్యాలయాలూ ఇక్కడే ఉంటాయి. తెలంగాణ స్టేట్ ఇన్నోవేషన్ సెల్ కూడా ఉంటుంది. ప్రపంచాన్ని మార్చే, భవిష్యత్తు ఉన్న వాటిగా భావిస్తున్న బ్లాక్ చెయిన్, ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ), బిగ్ డేటా, మెషిన్ లెర్నింగ్ (ఎంఎల్), ఐఓటీ (ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్) వంటి వాటికి టీ–హబ్లో ప్రాముఖ్యం ఇస్తున్నారు. దీన్ని మరింత విస్తృతం చేయాలనేది కూడా తెలంగాణ ప్రభుత్వం ఆలోచన. ఇందుకుగానూ రాష్ట్రంలో వరంగల్, కరీంనగర్, ఖమ్మం, నిజామాబాద్, మహబూబ్నగర్ వంటి నగరాల్లోనూ టీ–హబ్ రీజినల్ సెంటర్లు ఏర్పాటు చేయాలని భావిస్తోంది. (క్లిక్: ఈ పతనం ఏ తీరాలకు చేరుస్తుందో!) - డాక్టర్ ఎన్. యాదగిరిరావు అదనపు కమిషనర్, జీహెచ్ఎంసీ -
‘దొంగ’ తెలివితేటలు
సాక్షి,గచ్చిబౌలి: బైక్ దొంగలు, చైన్ స్నాచర్ల తెలివితేటలు అంతా ఇంతా కాదు. ఒక వైపు చోరీలు చేస్తూనే పోలీసులకు చిక్కకుండా చతురత ప్రదర్శిస్తున్నారు. ఐటీ కారిడార్లో చోటు చేసుకున్న చోరీలు నివ్వెర పరుస్తున్నాయి. కొండాపూర్లో నివాసం ఉండె బీహర్కు చెందిన ఓ వ్యక్తి ఆరు రోజుల క్రితం కూకట్పల్లిలో చైన్ స్నాచింగ్కు పాల్పడ్డాడు. ఆ సమయంలో స్థానికులు వెంటపడగా సెల్ ఫోన్ కిందపడిపోయింది. సెల్ ఫోన్ను కూకట్పల్లి పోలీసులకు అప్పగించారు. సెల్ ఫోన్ అడ్రస్ తెలుసుకున్న పోలీసులు ఆరువాత ఫోన్ స్విచ్చాఫ్ చేసి ఉంచారు. ఆ తరువాత స్నాచర్.. కొండాపూర్లో కూరగాయల మార్కెట్కు వెళ్లగా తన సెల్ ఫోన్ పోయిందని గచ్చిబౌలి పోలీస్స్టేషన్కు వెళ్లాడు. అది తమ ప్రాంతం కాదని పోలీసులు చెప్పడంతో దాపూర్ పీఎస్కు భార్యతో కలిసి వెళ్లాడు. క్రైం పోలీసులు సెల్ ఫోన్కు ఫోన్ చేయగా స్విచ్చాఫ్ ఉండటంతో దర్యాప్తు చేస్తామని చెప్పారు. ఆ తరువాత కూకట్పల్లి పోలీసుల వద్దకు వెళ్లగా.. ఈ ఫోన్ ఎవరిదని అడగగా తనదేనని చెప్పాడు. అదుపులోకి తీసుకొని తమదైన శైలిలో విచారించగా చైన్ స్నాచింగ్కు పాల్పడినట్లు ఒప్పుకొని కటకటాల పాలయ్యాడు. చదవండి: Hyderabad: కుండపోత.. సిటీలో రోజంతా వర్షం -
హైదాబాద్లో రోడ్డు ప్రమాదాలు.. ఇద్దరు సాఫ్ట్వేర్ ఉద్యోగుల మృతి
చందానగర్, గచ్చిబౌలి పోలీస్ స్టేషన్ల పరిధిలో వేర్వేరు చోట్ల జరిగిన రెండు రోడ్డు ప్రమాదాల్లో ఇద్దరు సాఫ్ట్వేర్ ఉద్యోగులు మృతి చెందారు. బుధవారం రాత్రి ఈ ప్రమాదాలు చోటు చేసుకున్నాయి. సాక్షి, హైదరాబాద్: ద్విచక్ర వాహనాన్ని ఆటో ఢీకొనడంతో ఓ సాఫ్ట్వేర్ ఉద్యోఓగి అక్కడికక్కడే మృతి చెందాడు. చందానగర్ ఎస్ఐ శ్రీధర్ తెలిపిన మేరకు.. వరంగల్ జిల్లా హన్మకొండకు చెందిన మూలపల్లి చంద్రమోహన్కు ఇద్దరు కుమారులు. చిన్న కుమారుడు దిలీప్ (27) నెల క్రితం ఓ సాప్ట్వేర్ కంపెనీలో చేరాడు. అమీన్పూర్లో బావ రాకేష్ ఇంటిలో నివాసముంటూ గచ్చిబౌలికి ఉద్యోగానికి వెళ్తున్నాడు. బుధవారం రాత్రి 10.30 గంటలకు దిలీప్ కుమార్ అతని స్నేహితుడు సూర్యతో కలిసి ఫల్సర్ బైక్పై అమీన్పూర్ నుంచి చందానగర్ వైపు భోజనం చేసేందుకు వెళ్తున్నారు. దారిలో రెయిన్బో స్కూల్ వద్దకు చేరుకోగానే ఆటో టీటీడీ లాజిస్టిక్స్ ప్రైవేటు లిమిటెడ్ త్రివీర్ వాహనం వేగంగా వచ్చి దిలీప్కుమార్ వెళ్తున్న బైక్ను ఢీకొట్టింది. దీంతో బైక్ పై ఉన్న దిలీప్ కుమార్ సూర్య కిందపడగా దిలీప్కుమార్ తలకు తీవ్ర గాయాలై అక్కడికక్కడే మృతి చెందాడు. పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొని కుటుంబ సభ్యులకు సమాచారం అందించారు. మృతుడు దిలీప్కుమార్ను పోస్టుమార్టం నిమిత్తం గాంధీ ఆస్పత్రికి తరలించారు. సూర్యకు స్వల్ప గాయాలు కావడంతో చికిత్స నిమిత్తం పీఆర్కే ఆస్పత్రికి తరలించారు. చదవండి: సైబరాబాద్: ఖాకీలపై మూడో కన్ను గచ్చిబౌలిలో.. మద్యం మత్తులో ర్యాష్ డ్రైవింగ్కు ఓ సాఫ్ట్వేర్ ఇంజనీర్ బలయ్యాడు. ఈ ఘటన గచ్చిబౌలి పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. అనంతపురం జిల్లా జిల్లాకు చెందిన బోయపాటి అశోక్ కుమార్(26) గువా రెసిడెన్సీ, మియాపూర్లో నివాసం ఉంటూ మాస్ మ్యూచ్వల్ కంపెనీలె సాఫ్ట్వేర్ ఇంజనీర్గా పని చేస్తున్నారు. అదే రెసిడెన్సీలో నివాసం ఉంటే మదన్ మోహన్ రెడ్డి(24) జావా ఎజ్డీ బైక్పై వెళ్లి బధవారం అర్థరాత్రి దాటిన తరువాత ఒంటి గంటకు అశోక్ పికప్ చేసుకున్నారు. విప్రో జంక్షన్ నుంచి గచ్చిబౌలి వైపు వస్తుండగా తెల్లవారు జామున 2.30 గంటల సమయంలో ట్రిపుల్ ఐటీ సబ్స్టేషన్ వద్ద ఫుట్పాత్ను అతి వేగంగా ఢీ కొట్టాడు. తలకు తీవ్ర గాయాలై వెనక కూర్చున్న అశోక్ అక్కడికక్కడే మృతి చెందాడు. బైక్ నడిపిస్తున్న మదన్ మోహన్ రెడ్డి స్వల్ప గాయాలతో బయటçపడి ఓ ప్రైవేట్ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు. ఒక్కగానొక్క కొడుకు కొడుకు రోడ్డు ప్రమాదంలో మృతి చెందడం రామాంజనేయులు దంపతులు కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు. -
Hyderabad: పబ్లో మైనర్లతో పార్టీ నిర్వహణ.. బడా నేత ప్రమేయం!
సాక్షి, హైదరాబాద్: వరుస ఘటనలు వెలుగులోకి వస్తున్నా.. విమర్శలు వెల్లువెత్తుతున్నా.. హైదరాబాద్లో పబ్ల తీరు మారడం లేదు. తాజాగా.. జూహ్లీహిల్స్ అమ్నీషియా పబ్ తరహాలో ఓ పబ్లో మైనర్ల పార్టీ నిర్వహించారు. గచ్చిబౌలిలోని ఓ పబ్లో రెండ్రోజుల పాటు మైనర్ల పార్టీ నిర్వహించినట్లు తెలుస్తోంది. సైబర్ హవర్స్ వాల్యూమ్-11 పేరుతో ఈవెంట్ను నిర్వహించారు. మైనర్ల పార్టీకి ఎక్సైజ్ శాఖ అనుమతి నిరాకరించింది. అయితే ఒక బడా నేత ప్రమేయంతో మైనర్ల పార్టీ ఎరేంజ్ చేసినట్లు సమాచారం. ఇన్స్టాగ్రామ్ ద్వారా మైనర్ల పార్టీకి కొందరు ఆహ్వానాలు పంపించారు. ఇక నిర్వాహకులేమో పబ్లో మద్యం సరఫరా చేయలేదని చెప్తున్నారు. దీనికి సంబంధించి పూర్తి వివరాలను పోలీసులు తెలియాల్సి ఉంది. -
ఇక వీకెండ్ షీ టీమ్స్.. ఈ ప్రాంతాల్లో ఫోకస్
సాక్షి, హైదరాబాద్: ఐటీ కంపెనీలు వర్క్ ఫ్రం హోమ్ నుంచి ఆఫీస్ వైపు క్రమంగా మొగ్గుచూపుతున్నాయి. దీంతో ఉద్యోగుల రాక పెరిగిపోయింది. ఇదే సమయంలో మహిళా ఉద్యోగులకు రక్షణ, భద్రత కల్పించేందుకు సైబరాబాద్ షీ టీమ్ బృందాలు సిద్ధమయ్యాయి. బృందాల సంఖ్యను పెంచడంతో పాటు, మఫ్టీలో గస్తీ కాస్తూ పోకిరీల ఆట కట్టిస్తున్నాయి. విదేశీ సంస్థలకు సేవలందించే చాలా వరకు ఐటీ కంపెనీలు 24 గంటలు పని చేస్తుంటాయి. దీంతో రాత్రి వేళలో విధులు నిర్వర్తించే ఉద్యోగులకు రక్షణ కల్పించేందుకు షీ టీమ్ స్పెషల్ ఫోకస్ పెట్టాయి. కీలక ప్రాంతాల్లో తిష్ట వేసుకునే అల్లరి మూకల ఆగడాలను కట్టించేందుకు ఉమెన్ అండ్ చైల్డ్ సేఫ్టీ విభాగం ప్రత్యేకంగా వీకెండ్ షీ టీమ్స్ను ఏర్పాటు చేసింది. పెరిగిన షీ టీమ్స్.. మహిళల భద్రత, రక్షణకు అత్యంత ప్రాధాన్యత ఇస్తున్న సైబరాబాద్ పోలీసులు గతంలో నాలుగు షీ టీమ్స్ ఉండగా.. వాటి సంఖ్యను 11కు పెంచారు. ఆన్లైన్లో, ఆఫ్లైన్ ఫిర్యాదు అందిన క్షణాల్లోనే పోలీసులు సంఘటనా స్థలానికి వచ్చి చర్యలు తీసుకుంటున్నారు. జన సమ్మర్థం ఎక్కువగా ఉన్న ప్రాంతాలలో వీకెండ్ షీ టీమ్స్ మఫ్టీలో గస్తీ కాస్తున్నారు. మహిళలను కామెంట్ చేసినా, అసభ్యకరంగా ప్రవర్తించినా రెడ్ హ్యాండెడ్గా పట్టుకొని చర్యలు తీసుకుంటున్నారు. షీ టీమ్స్కు తోడుకు పెట్రోలింగ్ సిబ్బంది ఉంటూ అర్ధరాత్రి హల్చల్ చేసే పోకిరీల ఆటకట్టిస్తున్నారు. ఈ ప్రాంతాల్లో ఫోకస్.. ఐటీ కారిడార్లో షీ టీమ్స్ ఎక్కువగా ఫోకస్ పెట్టాయి. గచ్చిబౌలి, రాయదుర్గం, కూకట్పల్లి, మియాపూర్, చందానగర్, మాదాపూర్ ప్రాంతాల్లోని ఫుడ్ కోర్ట్లు, లేడిస్ హాస్టల్స్, మెట్రో స్టేషన్లు, షాపింగ్ మాల్స్ వంటి పలు ప్రాంతాలలో షీ టీమ్స్ ప్రత్యేక దృష్టిసారించాయి. (క్లిక్: ఆమ్నీషియా పబ్ కేసు.. మరో అమ్మాయిపైనా వేధింపులు!) -
సచిన్.. నాకు బతకాలని లేదు: కృతి సంభ్యాల్
సాక్షి, హైదరాబాద్: మంచి కంపెనీలో మంచి ఉద్యోగం. అయినవాళ్లను విడిచిపెట్టి.. ఊరు కానీ ఊరులో ఉంటూ ఉద్యోగం చేస్తోంది. ఏం కష్టం వచ్చిందో ఏమో.. ఉరి వేసుకుని ప్రాణం తీసుకుంది!. గచ్చిబౌలిలో సాఫ్ట్వేర్ ఉద్యోగిణి కృతి సంభ్యాల్ సూసైడ్ స్థానికంగా విషాదం నింపింది. గచ్చిబౌలిలో ఉంటూ ఓ సాఫ్ట్వేర్ కంపెనీలో పనిచేస్తోంది కృతి సంభ్యాల్. ఆమె స్వస్థలం జమ్ముకశ్మీర్. ఇద్దరిలో కలిసి ఓ అపార్ట్మెంట్ ఫ్లాట్లో ఉంటోంది కృతి. ఈ క్రమంలో రూమ్ మేట్స్ లేని టైం చూసి ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. చనిపోయే ముందు తన స్నేహితుడు సచిన్ కుమార్కు ‘నాకు బతకాలని లేదు’ ఓ మెసేజ్ పంపింది. అది చూసి అప్రమత్తమయ్యాడు సచిన్. సచిన్ హుటాహుటిన ప్లాట్కు వచ్చాడు. కానీ, అప్పటికే ఆమె ఉరికి వేలాడుతూ కనిపించింది. స్థానికుల సాయంతో కృతిని ఆస్పత్రికి తరలించగా.. అప్పటికే ఆమె మృతి చెందినట్లు తెలిపారు వైద్యులు. కృతి ఆత్మహత్యకు గల కారణాలు తెలియాల్సి ఉంది. కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్న చేపట్టారు గచ్చిబౌలి పోలీసులు. -
గాయత్రి ఇల్లు కబ్జాకు కుటుంబీకుల యత్నం
గచ్చిబౌలి: సివిల్స్ పరీక్షలకు సిద్ధమవుతున్న యువతిపట్ల అమానుషంగా ప్రవర్తించిన గాయత్రి ఇల్లును కబ్జా చేయడానికి ఆమె కుటుంబీకులు యత్నించారు. ఆమె భర్త శ్రీకాంత్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు గచ్చిబౌలి పోలీసులు తల్లి కృష్ణవేణి, సోదరి సౌజన్యసహా మరికొందరిపై ఆదివారం కేసు నమోదు చేశారు. వివిధ ప్రాంతాల్లో ఉన్న స్థిరాస్తులకు సంబంధించి గాయత్రికి, ఆమె తల్లి కృష్ణవేణి, సోదరి సౌజన్య మధ్య కొన్నేళ్లుగా వివాదాలు నడుస్తున్నాయి. వీటిలో కొన్ని ఆస్తులకు సంబంధించి రిజిస్ట్రేషన్ ఒకరి పేరిట ఉండగా, పొజిషన్లో వేరొకరు ఉన్నారు. యువతిపై లైంగిక దాడి ఘటనలో కేసు నమోదు చేసుకున్న పోలీసులు శనివారం గాయత్రిసహా ఆరుగురు నిందితులను అరెస్టు చేసి రిమాండ్కు తరలించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో శ్రీకాంత్ సైతం అజ్ఞాతంలోకి వెళ్లిపోయి ఉంటాడని భావించిన కుటుంబసభ్యులు ఆదివారం మధ్యాహ్నం తల్లి, సోదరి, సోదరుడు ప్రదీప్ రాజు, సమీప బంధువులు మల్లికార్జున్, అఖిల్ తదితరులు గాయత్రి ఇంటి వద్దకు వచ్చారు. ఆ సమయంలో వాచ్మన్ గేటుకు తాళం వేయగా అతడిపై దాడి చేసి తాళం పగులకొట్టారు. కృష్ణవేణి, సౌజన్య లోపలికి వెళ్లగా, మిగిలినవారు గేటు వద్దే ఉన్నారు. ఆ సమయంలో ఇంట్లోనే ఉన్న శ్రీకాంత్ను అక్కడి నుంచి వెళ్లిపోవాలని బెదిరించారు. దీంతో ఆయన ‘డయల్–100’కు ఫోన్కాల్ చేయడంతో గచ్చిబౌలి ఠాణాకు చెందిన మహిళా ఎస్సై, కానిస్టేబుళ్లు గాయత్రి ఇంటి వద్దకు చేరుకుని అక్కడ ఉన్నవారిని బయటకు పంపేశారు. అద్దెకున్నవారికి బెదిరింపులు గాయత్రి నుంచి ఇల్లు అద్దెకు తీసుకున్న హేమంత్ వద్దకు ఈ ఏడాది మార్చి 30న సౌజన్య వెళ్లారు. ఆ ఇల్లు తనదని వెంటనే ఖాళీ చేయాలని హేమంత్ను బెదిరించి కరెంట్ కనెక్షన్ తొలగించడంతో ఆమెపై కేసు నమోదైంది. గాయత్రి తన ఇంటికి సమీపంలో ఉన్న కొన్ని దుకాణాలను అద్దెకు ఇవ్వగా, వీటిల్లో వ్యాపారాలు చేసుకుంటున్న అమిత్సింగ్, జేమ్స్, పాండు, మధుసూదన్ల వద్దకు సౌజన్య వెళ్లి హంగామా చేసింది. వారి సామాన్లను పగులకొట్టడంతోపాటు సూసైడ్ నోట్లో వారి పేర్లు రాసి ఆత్మహత్య చేసుకుంటానని బెదిరింపులకు దిగడంతో ఆమెపై మరో కేసు నమోదైంది. (చదవండి: సినిమా స్టోరీని తలపిస్తున్న గచ్చిబౌలి గాయత్రి కేసు.. ట్విస్టులే ట్విస్టులు) -
సినిమా స్టోరీని తలపిస్తున్న గచ్చిబౌలి గాయత్రి కేసు.. ట్విస్టులే ట్విస్టులు
సాక్షి, హైదరాబాద్: గచ్చిబౌలి శ్రీరామ్నగర్లో యువతిపై నలుగురిచేత అత్యాచారయత్నం చేయించిన నిందితురాలు గాయత్రి బాగోతం ఒక్కొక్కటిగా వెలుగు చూస్తోంది. సినిమా స్టోరీని తలపిస్తోన్న ఈ కథలో గాయత్రితో పాటు ఆమె భర్తగా చెబుతున్న శ్రీకాంత్ ప్రమేయం కూడా ఉందని పోలీసులు అనుమానిస్తున్నారు. బాధితురాలు సివిల్స్కు ప్రిపేర్ అవుతోందని చెప్పి.. శ్రీకాంత్ ఆమెను ఇంటికి తీసుకొచ్చాడు. ఆ క్రమంలోనే వారిమధ్య సన్నిహిత సంబంధం ఉందని అనుమానించి.. వారిద్దరిపై గాయత్రి కేసు పెట్టినట్లు పోలీసులు చెబుతున్నారు. అయితే, కేసు విత్ డ్రా పేరుతో బాధితురాలిని ఇంటికి పిలిపించి.. నలుగురు యువకుల చేత గాయత్రి అత్యాచారయత్నం చేయించినట్లు గచ్చిబౌలి సీఐ సురేష్ తెలిపారు. చదవండి: భర్తపై అనుమానం .. యువతిపై కిరాతకం! మరోవైపు గాయత్రి కేసులో గచ్చిబౌలి సీఐ సురేష్పై తీవ్ర ఆరోపణలు వస్తున్నాయి. సీఐ సురేష్ ప్రోద్బలంతోనే గాయత్రి తమపై అక్రమ కేసులు పెట్టిందని గాయత్రి తల్లి, సోదరి ఆరోపిస్తున్నారు. తాము ఫిర్యాదు చేస్తే సీఐ పట్టించుకోలేదన్నారు. మా ఇంట్లో మమ్మల్నే ఉండొద్దంటూ సీఐ వేధిస్తున్నారని గాయత్రి సోదరి ఆరోపించారు. చాలా కాలంగా గాయత్రికి సీఐ సురేష్ అండగా ఉంటున్నారని ఆరోపించారు. -
గాయత్రి కేసులో గచ్చిబౌలి సీఐ సురేష్పై ఆరోపణలు
-
Hyderabad: రాయదుర్గం గ్రీన్ బావర్చి హోటల్లో భారీ అగ్ని ప్రమాదం
-
రాయదుర్గం గ్రీన్ బావర్చి హోటల్లో భారీ అగ్ని ప్రమాదం
-
హైదరాబాద్: రాయదుర్గం గ్రీన్ బావర్చిలో అగ్ని ప్రమాదం
సాక్షి, హైదరాబాద్: నగరంలో భారీ అగ్ని ప్రమాద ఘటన చోటుచేసుకుంది. రాయదుర్గంలోని గ్రీన్బవార్చి హోటల్లో ఐమాక్ ఛాంబర్లోని 2వ అంతస్తులో అగ్ని ప్రమాదం జరిగింది. ఎగిసిపడుతున్న మంటల కారణంగా బిల్డింగ్లో దట్టమైన పొగలు అలుముకున్నాయి. కాగా, భవనం లోపల 20 మంది చిక్కుకున్నట్టు తెలుస్తోంది. బాధతులు తమను రక్షించాలంటూ భవనం పై నుంచి కేకలు వేస్తున్నారు. ప్రమాద సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది వెంటనే ఘటనా స్థలానికి చేరుకుని మంటలను అదుపు చేస్తున్నారు. భారీ క్రేన్లో సాయంతో రక్షించే ప్రయత్నాలు కొనసాగుతున్నాయి. మొదటి అంతస్తులో గ్రీన్ బావర్చి, 2,3 అంతస్తుల్లో ఐటీ కంపెనీలు ఉన్నాయి. ఐటీ కంపెనీలు ఉన్న అంతస్తులో పొగ అలుముకుంది. కాగా, హోటల్ వద్ద రెస్క్యూ ఆపరేషన్ కొనసాగుతోంది. ఇందులో భాగంగా ఇప్పటికే భవనం పైన ఉన్న 14 మందిని కాపాడారు. భవనం లోపల ఇంకా కొంతమంది ఉన్నట్టు తెలుస్తోంది. -
హెచ్సీయూలో 29 వరకు ‘సుకూన్–2022’
గచ్చిబౌలి: హైదరాబాద్ సెంట్రల్ యూనివర్శిటీలో శుక్రవారం నుంచి సందడి నెలకొననుంది. ప్రతిష్టాత్మకమైన ‘సుకూన్’ కార్యక్రమాన్ని నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు చేశారు. హెచ్సీయూ క్యాంపస్లోని సుకూన్ గ్రౌండ్స్, కొమ్రమ్ భీమ్ ఓపెన్ డయాస్లో మూడు రోజులపాటు కార్యక్రమం కొనసాగనుంది. కార్యక్రమంలో భాగంగా కొలేజ్ పోటీలు, డ్యాన్స్ పోటీలు, పాటల పోటీలు, ఫేస్ పెయింటింగ్ పోటీలు, బైత్బాజీ కార్యక్రమం, వ్యాసరచన, ఉపన్యాస పోటీలు, రంగోలి, ముగ్గుల పోటీలను నిర్వహించనున్నారు. పోస్టర్ మేకింగ్ పోటీలు, మెహిందీ పోటీ, మొబైల్ ఫోటోగ్రఫీ, క్విజ్ పోటీలను నిర్వహించేందుకు ఏర్పాట్లు చేశారు. గురువారం హెచ్సీయూ విద్యార్థి సంఘం అధ్యక్షులు అభిషేక్నందన్ మాట్లాడుతూ ఈనెల 27,28,29 తేదీల్లో ‘సుకూన్–2022’ నిర్వహించేందుకు ఏర్పాట్లు పూర్తి చేశామన్నారు. మొదటి రోజు డప్పు చందు కార్యక్రమం, ట్రైబల్ ఫోక్ షో, సూఫీ ఖవ్వాలీ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశామన్నారు. రెండో రోజు ఆర్కెస్ట్రా, రాక్ షోను నిర్వహించడం జరుగుతుందన్నారు. చివరిరోజైన మూడో రోజు డీజే నైట్ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినట్లు ఆయన వివరించారు. -
ISB Hyderabad: అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు.. అరుదైన ఘనతలు
సాక్షి, హైదరాబాద్: జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో తనకంటూ ప్రత్యేక గుర్తింపు సాధించుకుంది నగరంలోని ‘ఇండియన్ స్కూల్ ఆఫ్ బిజినెస్’ (ఐఎస్బీ). దేశంలోనే నెంబర్ 1 స్థానంలో నిలిచింది ఈ కళాశాల. గురువారం ఐఎస్బీ స్నాతకోత్సవం, వార్షికోత్సవాలకు ప్రధాని నరేంద్ర మోదీ విచ్చేయనుండటం దీని ప్రాధాన్యాన్ని తేటతెల్లం చేస్తోంది. ఐఎస్బీ విశిష్టతలపై ప్రత్యేక కథనం ఇదీ.. స్థాపన ఇలా.. ► ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ సహకారంతో పలువురు వ్యాపారవేత్తలు నగరంలోని గచ్చిబౌలిలో 260 ఎకరాల విస్తీర్ణంలో 1999 డిసెంబర్ 20న ఐఎస్బీని ఏర్పాటు చేశారు. ఇండియన్ బిజినెస్ స్కూల్కు అప్పటి ప్రధాన మంత్రి అటల్ బిహారీ వాజ్పేయీ శంకుస్థాపన చేశారు. ఇది లండన్ బిజినెస్ స్కూల్, వార్టన్ బిజినెస్ స్కూల్, కెల్లాగ్ స్కూల్ ఆఫ్ మేనేజ్ మెంట్, లండన్ బిజినెస్ స్కూళ్లతో భాగస్వామ్య సంబంధాలు కలిగి ఉంది. ► ఐఎస్బీకి దేశంలో హైదరాబాద్లోని గచ్చిబౌలి, పంజాబ్లోని మొహలీలో క్యాంపస్లు ఏర్పాటు చేశారు. ఇది ఏఎంబీఏ, ఈక్యూయూఐఎస్, ఏఏసీఎస్బీల ద్వారా అక్రిడిటేషన్ల ‘ట్రిపుల్ క్రౌన్’ పొందిన ప్రపంచంలోని 100వ కళాశాలల్లో ఐఎస్బీ ఒకటి. గచ్చిబౌలిలోని ఐఎస్బీ క్యాంపస్కు ఈ నెల 26న ప్రధాని నరేంద్రమోదీ రానున్నారు. 930 మంది విద్యార్థులకు డిగ్రీ పట్టాలను ప్రదానం చేయనున్నారు. అప్పట్లో ప్రముఖుల సందర్శన.. ఐఎస్బీ గచ్చిబౌలి క్యాంపస్ను డిసెంబర్ 2, 2001న అప్పటి ప్రధాని అటల్ బిహారీ వాజ్పేయీ ప్రారంభించారు. 2006 డిసెంబర్ 5న డాక్టర్ మన్మోహన్సింగ్ క్యాంపస్కు విచ్చేశారు. 2006 మార్చి 1న అమెరికా అధ్యక్షుడు జార్జి బుష్ సందర్శించారు. 2002 జనవరి 2న సింగపూర్ అధ్యక్షుడు ఎస్ఆర్ నాథన్ పరిశీలించారు. 2002 జనవరి 2న అప్పటి రాష్ట్రపతి ఏపీజే అబ్దుల్ కలామ్ ఐఎస్బీ క్యాంపస్ను సందర్శించారు. (క్లిక్: బేగంపేటలో మోదీ స్వాగత సభ?) ప్రపంచంలో 38వ స్థానం.. ఐఎస్బీ తాజాగా 2022లో ఫైనాన్షియల్ టైమ్స్ ఎగ్జిక్యూటివ్ ఎడ్యుకేషన్ కస్టమ్స్ ప్రోగ్రామ్స్ ర్యాంకింగ్స్ను తాజాగా విడుదల చేశారు. ఎగ్జిక్యూటివ్ ఎడ్యుకేషన్లో ప్రపంచంలోనే 38వ స్థానం పొందింది. ఇండియాలోనే నెంబర్ వన్ బిజినెస్ స్కూల్గా కూడా ర్యాంకింగ్ను సాధించింది. ఎఫ్టీ ర్యాంకింగ్, అధిక– నాణ్యత పరిశోధన, విద్య కోసం భారతదేశాన్ని ప్రపంచ మ్యాప్లో ఉంచింది. ఇదిలావుండగా ఐఎస్బీ ఫ్యూచర్ యూస్ పారామీటర్లో అంతర్జాతీయంగా 7వ స్థానంలో నిలిచింది. ‘డీ ల్యాబ్స్’తో నూతన ఆవిష్కరణలు.. ఐఎస్బీలోని గచ్చిబౌలి క్యాంపస్లో డీ ల్యాబ్స్ పేరిట నూతన ఆవిష్కరణలకు ప్రోత్సహించేందుకు ప్రత్యేకంగా ఇంక్యుబేషన్ కేంద్రాన్ని 2015లో ప్రారంభించారు. దీంట్లో ఇప్పటి వరకు 125కు పైగా స్టార్టప్లను వివిధ రంగాలలో ఏర్పాటు చేశారు. దీనికి అంతర్జాతీయ ఇంక్యుబేటర్ నుంచి మద్దతు లభిస్తోంది. ఇటీవలే కేంద్రం రూ.5 కోట్ల నిధులను స్టార్టప్ ఇండియా సీడ్ ఫండ్ స్కీమ్కింద మంజూరు చేసింది.70 స్టార్టప్లకు దాదాపు 350 కోట్ల నిధుల సేకరణ కోసం స్టార్టప్లు ముందంజ వేశాయి. ప్లేస్మెంట్స్లోనూ టాపే.. ► ప్లేస్మెంట్స్లోనూ ఐఎస్బీ దేశంలోనే టాప్గా నిలుస్తోంది. ప్రతియేటా 100 శాతం విద్యార్థులు ఉద్యోగాలు పొందడం విశేషం. 2019–20లో ఏడాదికి సరాసరి వేతనం రూ.42 లక్షలు, అత్యల్పంగా రూ.24.10 లక్షల వేతనం, 20–21లో సరాసరి వేతనం రూ.72 లక్షలు, అత్యల్పంగా రూ.27 లక్షల వేతనం లభించింది. 2021–22లో సరాసరి వేతనం రూ.34.07 లక్షలుగా పొందారు. ► 2019–20లో 1,504 ఆఫర్లు, 20–21లో 1,195 ఆఫర్లు, 2021–22లో 2,066 ఆఫర్లను విద్యార్థులు పొందారు. (క్లిక్: మోదీ హైదరాబాద్ టూర్; ఉద్యోగులకు వర్క్ ఫ్రం హోమ్) ► అమెజాన్, ఫ్లిప్కార్ట్, బోస్టన్ కన్సల్టింగ్ గ్రూప్, హనీవెల్, యాక్సిస్ బ్యాంక్, గోద్రేజ్ ఇండస్ట్రీస్, జెన్ప్యాక్ట్, విప్రో, సీకే బిర్లా గ్రూపు, కేపీఎంజీ, హిందుస్తాన్ యూనిలీవర్ లిమిటెడ్, టెక్ మహీంద్ర, డీబీఎస్ బ్యాంక్, డిలాయిట్ యూఎస్ఐ, రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ వంటి ప్రధాన కంపెనీలు ప్లేస్మెంట్లో పాల్గొన్నాయి. ఐఎస్బీ–20 ఏళ్ల వేడుకల్లో ప్రధాని పాల్గొనడం విశేషం.. ఐఎస్బీ 20 ఏళ్ల వేడుకల్లో ప్రధాని నరేంద్ర మోదీ పాల్గొనడం మాకు ఎంతో గౌరవంగా ఉంది. ఆయన హైదరాబాద్, మొహాలీ క్యాంపస్ల విద్యార్థులనుద్దేశించి ప్రసంగిస్తారు. హైదరాబాద్ క్యాంపస్లో మొక్కను నాటి స్మారక ఫలకాన్ని ఆవిష్కరిస్తారు. ఐఎస్బీ మై స్టాంప్, ప్రత్యేక కవర్ను విడుదల చేస్తారు. అకడమిక్ స్కాలర్స్ ఆఫ్ ఎక్స్లెన్స్ పతకాలను కూ డా ప్రధాని చేతుల మీదుగా పంపిణీ చేస్తాం. – ప్రొఫెసర్ మదన్ పిల్లుట్ల, ఐఎస్బీ డీన్ -
గచ్చిబౌలిలో సినీనటి ప్రగ్యా జైస్వాల్ సందడి
హఫీజ్పేట్: గచ్చిబౌలిలోని ర్యాడిసన్ హోటల్లో బ్లెండర్స్ ప్రైడ్ ఫ్యాషన్ నైట్స్ కార్యక్రమంలో ప్రముఖ ఫ్యాషన్ డిజైనర్ అర్చన రావుతో కలిసి సినీనటి ప్రగ్యా జైస్వాల్ సందడి చేశారు. ఆమె మాట్లాడుతూ.. హైదరాబాద్ నగరం నాకు రెండవ ఇల్లు అన్నారు. నటిగా నా ప్రయాణం అనేది అపారమైన ప్రైడ్ని అనుసరించి, నా హృదయం చెప్పినట్లు అభిరుచితో నటిస్తున్నానన్నారు. -
ఐఎఫ్ఎస్ అధికారులతో కేటీఆర్ భేటీ
గచ్చిబౌలి: ఇండియన్ ఫారిన్ సర్వీస్ (ఐఎఫ్ఎస్) అధికారులతో సోమవారం రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖల మంత్రి కేటీఆర్ సమావేశమయ్యారు. గచ్చి బౌలిలోని ఇండియన్ స్కూల్ ఆఫ్ బిజినెస్ (ఐఎస్బీ) అందుకు వేదికైంది. తెలంగాణ ప్రభుత్వం రాష్ట్రంలో అమలు చేస్తున్న ప్రగతిశీల పారిశ్రామిక విధానాలు, ఐటీ రంగం అభివృద్ధికి తీసుకుంటున్న చర్యలు, సాధించిన ప్రగతి, ఎకో సిస్టమ్ను ఆయన వారికి వివరించారు. టీహబ్, వీహబ్, ఇంక్యుబేటర్ల గురించి టీహబ్ రెండోఫేజ్ గురించి కూడా వారికి వివరించారు. ఐఎఫ్ఎస్ అధికారుల మిడ్ కేరీర్ శిక్షణ కార్యక్రమంలో భాగంగా ఆయన వారితో భేటీ కావడంతోపాటు వారిని ఉద్దేశించి ప్రసంగించారు. కార్యక్రమంలో ఐఎస్బీ డీన్ ప్రొఫెసర్ మదన్ పిల్లుట్ల, రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖల ముఖ్య కార్యదర్శి జయేశ్ రంజన్, ఐఎస్బీ ఫ్యాకల్టీ ప్రతినిధులు, ఐఎఫ్ఎస్ అధికారులు పాల్గొన్నారు. -
రెండేళ్ల క్రితం ప్రేమ వివాహం.. అమ్మగారింటికి వెళుతున్నానని చెప్పి
సాక్షి, హైదరాబాద్: భర్తతో గొడవపడి మనస్తాపానికి గురైన ఓ యువతి అదృశ్యమైన సంఘటన గచ్చిబౌలి పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది.ఏఎస్సై సాయన్న తెలిపిన ప్రకారం వివరాలు ఇలా ఉన్నాయి. గచ్చిబౌలి స్ట్రీట్నెంబర్ 2లో నివాసం ఉండె సాయి కృష్ణ సెక్యూరిటీ గార్డుగా పని చేస్తున్నాడు. రెండు సంవత్సరాల క్రితం మమత(21)ను ప్రేమ వివాహం చేసుకున్నాడు. ఈ నెల 12 ఇద్దరూ చిన్న విషయంలో గొడవ పడ్డారు. 13వ తేదీన డ్యూటీలో ఉన్న భర్తకు ఫోన్ చేసి రంగారెడ్డి జిల్లా పరిగిలో ఉంటున్న అమ్మగారింటికి వెళుతున్నానని చెప్పింది. మరుసటి రోజు నుంచి ఫోన్ స్విచ్చాఫ్ రావడంతో భార్య సోదరికి ఫోన్ చేసి అడగగా ఇంటికి రాలేదని చెప్పారు. దీంతో సాయి కృష్ణ ఫిర్యాదు చేయడంతో మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. చదవండి: హైదరాబాద్ ఇరానీ చాయ్: ఇలా పెంచేశారేం‘టీ’..? -
కొత్త రాష్ట్రమైనా అన్ని రంగాల్లో అభివృద్ది సాధిస్తోంది: కేసీఆర్
-
గచ్చిబౌలిలో న్యాయాధికారుల సమావేశం ప్రారంభం
-
సీజేఐ ఎన్వీ రమణకు ధన్యవాదాలు: సీఎం కేసీఆర్
సాక్షి హైదరాబాద్: సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి ఎన్వీ రమణ చొరవతో హైకోర్టు న్యాయమూర్తుల సంఖ్య పెరిగిందని సీఎం కేసీఆర్ అన్నారు. ఈ మేరకు సీజేఐ ఎన్వీ రమణకు కేసీఆర్ హృదయపూర్వక ధన్యవాదాలు తెలిపారు. గచ్చిబౌలిలో శుక్రవారం న్యాయాధికారుల సదస్సు జరిగింది. రాష్ట్ర వ్యాప్తంగా కింది కోర్టుల్లోని జిల్లా న్యాయమూర్తులతో నిర్వహించిన ఈ సమావేశంలో భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వీ రమణ, ముఖ్యమంత్రి కేసీఆర్ హైకోర్టు చీఫ్ జస్టిస్ సతీష్ చంద్రశర్మ పాల్గొన్నారు. ఈ సందర్భంగా కేసీఆర్ మాట్లాడుతూ.. సీజేఐ సూచనతో 850 అదనపు పోస్టులు మంజూరు చేశామని వెల్లడించారు. జిల్లా కోర్టులకు 1730 అదనపు పోస్టులు మంజూరు చేశామన్నారు. హైకోర్టు విడిపోయిన తర్వాత బెంచీల సంఖ్య పెంచాలని కేంద్రానికి లేఖ రాశామని, హైకోర్టు బెంచీల సంఖ్య పెరిగింది కాబట్టి సిబ్బంది ఏర్పాటు చేయాలని సీజేఐ చెప్పారని తెలిపారు. కోర్టుల మీద ఉన్న అపారమైన గౌరవంతో రెవెన్యూ కోర్టులు రద్దుచేశామన్నారు. ‘జిల్లా కోర్టు భవనాల నిర్మాణం కోసం స్థలాల ఎంపిక జరుగుతోంది. హైకోర్టు న్యాయమూర్తుల కోసం ఫైనాన్షియల్ డిస్ట్రిక్ క్వార్టర్స్ నిర్మిస్తాం. 42 మంది న్యాయమూర్తులకు ఒకేచోట క్వార్టర్స్. క్వార్టర్స్ నిర్మాణం కోసం 30 ఎకరాల స్థలం సిద్ధంగా ఉంది. ఈ ఏడాదే నిధులు మంజూరు చేసి పనులు ప్రారంభిస్తాం.’ అని తెలిపారు. -
ఈ అమ్మను విడిచి ఎలా వెళ్లాలనిపించింది: సురేఖ వాణి భావోద్వేగం
ప్రముఖ యూట్యూబ్ స్టార్, నటి గాయత్రి శుక్రవారం రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన సంగతి తెలిసిందే. హోలీ వేడుకలో భాగంగా స్నేహితులతో కలిసి సరదాగా గడిపిన ఆమె మరికొద్ది క్షణాల్లోనే జీవచ్చవంలా మారడంతో ఆమె సన్నిహితులు, సహానటినటులు జీర్ణించుకోలేకపోతున్నారు. ఆమె మరణవార్త తెలిసి యూట్యూబర్, బిగ్బాస్ ఫేం షణ్ముక్ జస్వంత్, శ్రీహాన్ సహా పలువురు సోషల్ మీడియా వేదిక దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. అలాగే నటి సురేఖ వాణి సైతం ఆమె మృతి పట్ల తీవ్ర ఆవేదన వ్యక్తం చేసింది. గాయత్రితో తనకు ఉన్న అనుబంధాన్ని గుర్తు చేసుకుంటూ సోషల్ మీడియా వేదికగా భావోద్వేగానికి లోనయ్యింది. చదవండి: రోడ్డు ప్రమాదంలో నటి మృతి.. ప్రమాదానికి కారణం అదేనా ? ఈ మేరకు సురేఖ తన ఇన్స్టాగ్రామ్లో పోస్ట్ చేస్తూ.. ‘ఈ అమ్మని విడిచి వెళ్లాలని ఎలా అనిపించింది. నేను ఇప్పటికి నమ్మలేకపోతున్నా. ప్లీజ్ తిరిగి రా గాయత్రి. మనం మంచి పార్టీ చేసుకుందాం. నీతో ఇంకా ఎన్నో షేర్ చేసుకోవాలి. ఇద్దరం కలిసి ఇంకా ఎన్నో ఎన్నో జ్ఞాపకాలను పోగు చేసుకోవాలి. తిరిగి రా తల్లి..! ఇంత త్వరగా మమ్మల్ని వదిలి వెళ్లలేవు. ఇది సరైన సయమం కాదు. ఎప్పటికీ నిన్ను ప్రేమిస్తూనే ఉంటా. మిస్ యూ.. డాలీ’ అంటూ సురేఖ తన పోస్ట్లో రాసుకొచ్చింది. కాగా సురేఖ, ఆమె కూతురు సుప్రితలు సోషల్ మీడియాలో ఎంత యాక్టివ్ ఉంటారో తెలిసిందే. తరచూ రిల్స్ చేస్తూ, పార్టీలు, పబ్లు, టూర్స్కు వెళుతూ ఉంటారు. ఈ మధ్య గాయత్రి సురేఖ, సుప్రితలతో క్లోజ్ అయ్యింది. చదవండి: ఎన్నో రకాలుగా మోసపోయాను: మోహన్ బాబు భావోద్వేగం దీంతో వారితో కలిసి పార్టీలు చేసుకోవడం, రిల్స్ చేస్తూ కనిపించింది. ఈ నేపథ్యంలో ఇటీవల తన ఇన్స్టాగ్రామ్లో లైవ్లోకి వచ్చిన గాయత్రిని ఓ నెటిజన్ సురేఖ వాణి గురించి అడగ్గా.. ‘తను నాకు సెకండ్ మదర్ లాంటిది’ అంటూ చెప్పుకొచ్చింది. ఇక అదే ఫొటో పోస్ట్ను సురేఖ పంచుకుంటూ ఎమోషనల్ అయ్యింది. కాగా గాయంత్రి శుక్రవారం సాయంత్రం తన స్నేహితుడు రోహిత్తో కలిసి కారులో విప్రో జంక్షన్ నుంచి గచ్చిబౌలి వైపు వస్తుండగా కారు అదుపు తప్పి ఫుట్పాత్పై పల్టీ కొట్టింది. దీంతో గాయత్రి ఆ పక్కనే రెస్టారెంట్లో గార్డెనింగ్ పనులు చేస్తున్న మహేశ్వరి అనే మహిళను కారు ఢీకొట్టగా ఇద్దరూ అక్కడికక్కడే మరణించారు. డ్రైవింగ్ చేస్తున్న రోహిత్కు తీవ్ర గాయాలు కావడంతో ఆస్పత్రికి తరలించారు. ఈ ఘటనపై పోలీసులు ముమ్మర దర్యాప్తు చేపట్టారు. మద్యం సేవించి కారు నడపడం, అతి వేగం వల్లే ఈ ప్రమాదం జరిగినట్లు పోలీసులు పేర్కొన్నారు. View this post on Instagram A post shared by Surekhavani (@artist_surekhavani) -
రోడ్డు ప్రమాదంలో నటి మృతి.. ప్రమాదానికి కారణం అదేనా ?
ప్రముఖ యూట్యూబర్, నటిగా గుర్తింపు పొందిన గాయత్రి శుక్రవారం (మార్చి 18) రాత్రి రోడ్డు ప్రమాదంలో కన్ను మూసింది. హోలీ వేడుకలను సెలబ్రేట్ చేసుకున్న అనంతరం విప్రో జంక్షన్ నుంచి గచ్చిబౌలి వైపు వస్తుండగా కారు అదుపు తప్పి ఫుట్పాత్పై పల్టీలు కొట్టింది. దీంతో కారులో ఉన్న గాయత్రి, ఆ దగ్గర్లోనే గార్డెనింగ్ పనులు చేస్తున్న మహేశ్వరిని కారు ఢీకొట్టగా ఇద్దరూ అక్కడికక్కడే మరణించారు. కారులో గాయత్రితోపాటు ఉన్న రోహిత్కు తీవ్ర గాయాలు కావడంతో ఆస్పత్రికి తరలించారు. ఈ ఘటనపై పోలీసులు ముమ్మర దర్యాప్తు చేపట్టారు. ఈ క్రమంలో పోలీసులకు పలు కీలక విషయాలు తెలిశాయి. ఈ ఘటనకు ముందు పబ్కు వెళ్లిన యువుకులు కొబ్బరి బొండాల్లో ఆల్కహాల్ కలుపుకున్నట్లు పోలీసులు గుర్తించారు. హోలీ పండుగకు ముందు రోజే యువకులు మద్యం కొనుగోలు చేసినట్లు పోలీసుల దర్యాప్తులో వెల్లడైనట్లు సమాచారం. మద్యం కలుపుకున్న కొబ్బరి బొండాలతో యువకులు పబ్కు వెళ్లినట్లిగా గుర్తించారు. మద్యం అనుమతి లేదని కొబ్బరి బొండాల్లో మద్యం నింపినట్లు తెలుస్తోంది. కాగా శుక్రవారం (మార్చి 18) హోలీ పండుగ సందర్భంగా గాయత్రి ఇంటికి వెళ్లి పిక్ చేసుకున్న రోహిత్ అటు నుంచి ఆమెను ప్రిసం పబ్కి తీసుకెళ్లాడు. అక్కడ పార్టీ అనంతరం ఇద్దరూ కారులో బయలుదేరి వస్తుండగా ఈ ప్రమాదం జరిగింది. -
రోడ్డు ప్రమాదంలో నటి మృతి, గంటల్లోనే తారుమారైన జీవితం
Actress Dolly D Cruze Aka Gayathri Died In Gachibowli Road Accident: ప్రముఖ యూట్యూబర్, నటి గాయత్రి గత రాత్రి గచ్చిబౌలి రోడ్డు ప్రమాదంలో కన్నుమూసింది. హోలీ వేడుకల్లో పాల్గొన్న అనంతరం విప్రో జంక్షన్ నుంచి గచ్చిబౌలి వైపు వస్తుండగా కారు అదుపు తప్పి ఫుట్పాత్పై బోల్తా పడింది. ఈ ఘటనలో గాయత్రి అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోగా, కారులో ఆమెతో పాటు ప్రయాణిస్తున్న రోహిత్ అనే వ్యక్తి తీవ్ర గాయాలతో ఆసుపత్రి పాలయ్యాడు. ప్రస్తుతం అతని ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉన్నట్లు పోలీసులు పేర్కొన్నారు. (ఫొటో గ్యాలరీ కోసం ఇక్కడ క్లిక్ చేయండి) నిన్న(శుక్రవారం)హోలీ పండగ నేపథ్యంలో గాయత్రి ఇంటికి వెళ్లి పిక్ చేసుకున్న రోహిత్ అటు నుంచి ఆమెను ప్రిసంపబ్కి తీసుకెళ్లాడు. అక్కడ పార్టీ అనంతరం ఇద్దరూ కారులో బయలుదేరి వస్తుండగా ఈ ప్రమాదం జరిగింది. ఆ సమయంలో రోహిత్ కారును డ్రైవ్ చేయగా, అతివేగమే ప్రమాదానికి కారణమని పోలీసులు చెబుతున్నారు. కాగా గాయత్రి మృతిపై పలువురు టాలీవుడ్ నటులు విషాదం వ్యక్తం చేస్తున్నారు. ప్రముఖ క్యారెక్టర్ ఆర్టిస్ట్ సురేఖ వాణి తన ఇన్స్టా స్టోరీలో ఓ ఫోటోను షేర్ చేస్తూ.. 'ఇది చాలా అన్యాయం. నమ్మడానికి కష్టంగా ఉంది. నీతో నాకు ఎన్నో అద్భుతమైన జ్ఞాపకాలు ఉన్నాయి. అసలు మాటలు రావడం లేదు' అంటూ తీవ్ర భావోద్వేగానికి లోనయ్యింది. షణ్నూ సైతం గాయత్రితో కలిసి దిగిన ఫోటోను షేర్ చేస్తూ హార్ట్ బ్రేక్ సింబల్ను జతచేశాడు. -
రోడ్డు ప్రమాదంలో యూట్యూబర్ గాయత్రి మృతి.. ప్రమాదానికి ముందేం జరిగింది?
సాక్షి, హైదరాబాద్: గచ్చిబౌలి రోడ్డు ప్రమాదం కేసులో దర్యాప్తు కొనసాగుతోందని మాదాపూర్ డీసీపీ శిల్పవల్లి తెలిపారు. హోలీ సందర్భంగా జూనియర్ ఆర్టిస్ట్ గాయత్రి తన స్నేహితుడు రోహిత్తో కలిసి ప్రిసమ్ పబ్కు వెళ్లినట్లు తెలిసిందని పేర్కొన్నారు. అయితే ప్రీసమ్ పబ్లోకి వెళ్లి పార్టిసిపేట్ చేశారా లేదా అన్నది క్లారిటీ లేదని తెలిపారు. గచ్చిబౌలి ఏఐజీ అసుపత్రిలో వెంటిలేటర్పై రోహిత్ చికిత్స పొందుతున్నాడని తెలిపారు. అతి వేగంగా కారు నడపడం వల్లే ప్రమాదానికి కారణామని తమ ప్రాథమిక విచారణలో తెలిసినట్లు పేర్కొన్నారు. (ఫొటో గ్యాలరీ కోసం ఇక్కడ క్లిక్ చేయండి) కాగా గచ్చిబౌలి ఐటీ కారిడార్లో శుక్రవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇద్దరు మహిళలు మృతిచెందిన విషయం తెలిసిందే. అతివేగంగా వచ్చిన వీరి కారు ఎల్లా హోటల్ ముందు ఫుట్పాత్ను ఢీ కొట్టి గాల్లోకి ఎగిరిపడింది. ఈ ప్రమాదంలో ఆ దగ్గర్లోనే గార్డెనింగ్ పనులు చేస్తున్న మహేశ్వరి(38)ని ఢీకొట్టడంతో ఆమె అక్కడికక్కడే మృతి చెందింది. తీవ్రంగా గాయపడిన రోహిత్, జూనియర్ ఆర్టిస్ట్, యూట్యూబర్ గాయత్రిని గచ్చిబౌలిలోని ఏఐ జీ ఆస్పత్రికి తరలించగా అప్పటికే గాయత్రి మృతి చెందినట్లు వైద్యులు ధ్రువీకరించారు. ఫుట్పాత్ను కారు ఢీ కొట్టడంతో రెండు చక్రాలు ఊడిపడ్డాయి. కారు పల్టీ కొట్టగానే అందులోంచి గాయత్రి బయట పడిపోయినట్లుగా సీసీ పుటేజీలో పోలీసులు గుర్తించినట్లు తెలుస్తోంది. అయితే గత కొన్నాళ్లుగా గాయత్రి, రోహిత్ మధ్య స్నేహం నడుస్తున్నట్లు తెలుస్తోంది. ఈ క్రమంలోనే శుక్రవారం హోలీ పండగ సందర్భంగా గాయత్రి ఇంటికి వెళ్లిన రోహిత్ తనను పికప్ చేసుకున్నాడు. తరువాత ఇద్దరు కలిసి ప్రిసమ్ పబ్లో పార్టీ చేసుకున్నారు. పార్టీ అనంతరం ఇద్దరూ ఇంటికి బయలుదేరగా ప్రమాదం జరిగింది. గాయత్రి కారును డ్రైవ్ చేయగా, అతివేగమే ప్రమాదానికి కారణమని పోలీసులు చెబుతున్నారు. రోహిత్ కూకట్పల్లిలోని హెచ్ఎంటీ హిల్స్లో నివాసం ఉంటున్నారు. చదవండి: ఇంటి నుంచి బయటికి వెళ్లిన యువతి అదృశ్యం మరోవైపు రోడ్డు ప్రమాదంపై గాయత్రి తల్లి స్పందించారు. తన కూతుకు అన్యాయం చేసి వెళ్లిపోయిందని ఆవేదన వ్యక్తం చేశారు. శుక్రవారం రోహిత్తో కలిసి కూతురు బయటకు వెళ్లిందని తెలిపారు. న్యాయ వ్యవస్థ, పోలీసులు తమకు న్యాయం చేయాలని కోరారు. -
గచ్చిబౌలిలో మద్యం మత్తు వల్లే ప్రమాదం జరిగినట్లు అనుమానం
-
గచ్చిబౌలి రోడ్డు ప్రమాదంలో జూనియర్ ఆర్టిస్ట్ గాయత్రి మృతి
గచ్చిబౌలి(హైదరాబాద్): గచ్చిబౌలి ఐటీ కారిడార్లో శుక్రవారం సాయంత్రం కారు అదుపు తప్పి ఫుట్పాత్పై బోల్తా పడిన ఘటనలో ఇద్దరు మహిళలు మృత్యువాతపడ్డారు. తీవ్రంగా గాయపడిన ఓ యువకుడి పరిస్థితి విషమంగా ఉంది. కూకట్పల్లిలోని హెచ్ఎంటీ హిల్స్ ఆదిత్య హోమ్స్లో నివాసముండే దాదు వి రోహిత్ (25) ఎంబీఏ పూర్తి చేసిన తరువాత బియ్యం గోదాంలు నిర్వహిస్తున్నాడు. కేపీహెచ్బీ కాలనీ ఈడబ్ల్యూస్ 1175లో నివాసముండే ఎస్.గాయత్రి (26) షార్ట్ ఫిల్మ్స్లో జూనియర్ ఆర్టిస్టు. ఇద్దరూ కలసి హోలీ వేడుకల్లో పాల్గొని సాయంత్రం విప్రో జంక్షన్ నుంచి గచ్చిబౌలి వైపు కో స్పోర్ట్స్ కారులో వస్తున్నారు. అతివేగంగా వచ్చిన వీరి కారు ఎల్లా హోటల్ ముందు ఫుట్పాత్ను ఢీ కొట్టి గాల్లోకి ఎగిరిపడింది. ఆ దగ్గర్లోనే గార్డెనింగ్ పనులు చేస్తున్న మహేశ్వరి(38)ని ఢీకొట్టడంతో ఆమె అక్కడికక్కడే మృతి చెందింది. మహేశ్వరి, గాయత్రి తీవ్రంగా గాయపడిన రోహిత్, గాయత్రిని గచ్చిబౌలిలోని ఏఐ జీ ఆస్పత్రికి తరలించగా అప్పటికే గాయత్రి మృతి చెందినట్లు వైద్యులు ధ్రువీకరించారు. రోహిత్ ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉందని పోలీసులు పేర్కొన్నారు. ఫుట్పాత్ను కారు ఢీ కొట్టడంతో రెండు చక్రాలు ఊడిపడ్డాయి. కారు పల్టీ కొట్టగానే అందులోంచి గాయత్రి బయట పడిపోయినట్లుగా సీసీ పుటేజీలో పోలీసులు గుర్తించినట్లు తెలుస్తోంది. వెంటాడిన విధి.. 18 ఏళ్ల క్రితం నారాయణపేట జిల్లా నర్వా మండలం లంకాల గ్రామానికి చెందిన నాయకుని చిన్న రాములు, మహేశ్వరి దంపతులు గచ్చిబౌలికి వలస వచ్చారు. ఎల్లా హోటల్ నిర్మాణంలో కూలీగా పనిచేస్తున్న చిన్నరాములుపై 2005లో గోడ కూలడంతో అతడు చనిపోయాడు. కూతురు అనిత, కొడుకు శివరామ్లతో కలసి ఎల్లా హోటల్ సమీపంలోనే మహేశ్వరి రేకుల షెడ్డులో ఉంటూ అక్కడే గార్డెన్ పనులు చేస్తోంది. నిర్మాణ సమయంలో భర్త హోటల్ లోపల చనిపోగా, భార్య మహేశ్వరి హోటల్ గేట్ ముందే ప్రమాదంలో చనిపోవడం అందరినీ కలచివేస్తోంది. విధి వెంటాడి తనను ఒంటరిని చేసిందని కుమారుడు శివరాం గుండెలవిసేలా విలపించాడు. -
ఆన్లైన్ హార్స్ రేస్ బెట్టింగ్ గుట్టురట్టు.. లక్షల్లో నగదు స్వాధీనం
గచ్చిబౌలి: చెన్నైలో జరుగుతున్న గుర్రపు పందేలపై నిర్వహిస్తున్న ఆన్లైన్ హార్స్ రేస్ బెట్టింగ్ గుట్టును మాదాపూర్ ఎస్ఓటీ పోలీసులు రట్టు చేశారు. ఇద్దరు నిందితులను అదుపులోకి తీసుకొని రూ.8 లక్షలు స్వాధీనం చేసుకున్నారు. ఆదివారం మాదాపూర్ డీసీపీ శిల్పవల్లితెలిపిన మేరకు.. శుక్రవారం చెన్నైలో జరిగే గుర్రపు పందేలపై బెట్టింగ్ నిర్వహిస్తున్నట్లు విశ్వసనీయ సమాచారం అందింది. దీంతో ఎస్వోటీ పోలీసులు మాదాపూర్, గుట్టలబేగంపేట్లోని ఓ ఇంట్లో సోదాలు నిర్వహించారు. బెట్టింగ్ నిర్వహిస్తుండగా ఇద్దరి అదుపులోకి తీసుకొని మాదాపూర్ పోలీలకు అప్పగించారు. నిందితులు నెల్లూరుకు చెందిన వాకా వెంకటేశ్వర్ రెడ్డి(34), కర్నూల్కు చెందిన పందింటి ప్రదీప్(34)గా గుర్తించారు. -
పోస్టాఫీస్లో భారీ చోరీ.. నిందితుడు స్వీపర్
గచ్చిబౌలి: పన్పెండేళ్లుగా స్వీపర్గా పని చేస్తున్న ఓ వ్యక్తి పని చేస్తున్న సంస్థకే కన్నం వేశాడు. రాత్రి ఆఫీస్లోకి ప్రవేశించి రూ.33.29 లక్షలు చోరీ చేశాడు. ఆదివారం గచ్చిబౌలిలో మాదాపూర్ డీసీపీ శిల్పవల్లి ఈ వివరాలు వెల్లడించారు. ఈ నెల 13న అర్ధరాత్రి బీహెచ్ఈఎల్లోని సబ్ పోస్టాఫీస్లో అగ్నిప్రమాదం జరిగింది. మంటలు ఆర్పిన అనంతరం గ్రిల్స్ తొలగించి ఉండటం గమనించారు. దీంతో అక్కడ చోరీ జరిగినట్లు గుర్తించారు. పోస్టుమాస్టర్ చౌహన్ శంకర్ ఆర్సీపురం పీఎస్లో ఫిర్యాదు చేశారు. ఇదిలా ఉండగా చోరీ జరిగిన రోజు నుంచి 12 ఏళ్లుగా స్వీపర్గా పని చేస్తున్న జహీర్(25) విధులకు రాలేదు. దీంతో అతనిపై నిఘా ఉంచారు. అతను గోవాకు వెళ్లి మూడు రోజులు ఉన్నట్లుగా కనుగొన్నారు. నగరానికి తిరిగి రాగానే అదుపులోకి తీసుకున్నారు. నిందితుడు నుంచి రూ.28,52,170 నగదు, బైక్ స్వాధీనం చేసుకున్నారు. ఆర్థిక ఇబ్బందులతో ఉన్న జహీర్ చోరీ చేయడాన్ని ట్యూబ్లో చూసి దొంగతనం చేశాడు. నగదు ఎక్కువ డిపాజిట్ అయిన రోజు రాత్రి వాచ్మెన్ లేడనుకొని నిర్ధారించుకొని ఈ చోరీ చేశాడు. మియాపూర్ ఏసీపీ కృష్ణ ప్రసాద్, సీఐ సంజయ్ కుమార్ పాల్గొన్నారు. -
గచ్చిబౌలి: సాఫ్ట్వేర్ ఇంజనీర్ ఆత్మహత్య.. సహోద్యోగికి ఫోన్ చేసి..
సాక్షి, రాయదుర్గం: సాఫ్ట్వేర్ ఇంజనీర్ ఆత్మహత్యకు పాల్పడిన ఘటన గచ్చిబౌలి పోలీస్స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ఒడిశా రాష్ట్రం భువనేశ్వర్కు చెందిన స్మృతిరేఖా ఫరీదా(26) సాఫ్ట్వేర్ ఇంజనీర్. గౌలిదొడ్డిలో సాయిసదన్ పీజీ విమెన్స్ హాస్టల్లో నివాసముంటోంది. సోమవారం ఉదయం సహచర ఉద్యోగి జాన్కు ఫోన్ చేసింది. నాకు బతకాలని లేదంటూ ఉరేసుకొని ఆత్మహత్యకు పాల్పడింది. దీంతో హాస్టల్ నిర్వాహకులు పోలీసులకు సమాచారమిచ్చారు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని మృతదేహాన్ని ఉస్మానియా ఆస్పత్రికి తరలించారు.ఆమె ఆత్మహత్యకు గల కారణాలు తెలియాల్సి ఉంది. చదవండి: విషాదం నింపిన పుట్టినరోజు వేడుకలు.. 4 కార్లు ధ్వంసం.. ముగ్గురు మృతి -
నా బాధ మీతోగాని, స్నేహితులతో గాని, టీచర్లతోగాని పంచుకోలేను..
గచ్చిబౌలి: ‘లైంగిక వేధింపులతో ఆత్మహత్య చేసుకుంటున్నాను.. అమ్మా.. నాన్నా నన్ను క్షమించండి’ అంటూ సూసైడ్ నోట్ రాసి ఓ ఇంటర్ విద్యార్థి ప్రాణాలు తీసుకున్న ఘటన కలకలం రేపింది. గచ్చిబౌలి సీఐ గోనె సురేష్ తెలిపిన ప్రకారం వివరాల ప్రకారం.. నాగర్కర్నూల్ జిల్లా చారకొండ గ్రామానికి చెందిన లింగారం లక్ష్మణ్ గౌడ్, సువర్ణల రెండో కుమారుడు వంశీకృష్ణ (17) నగరంలోని గౌలిదొడ్డి గురుకుల కళాశాలలో ఇంటర్ ఫస్టియర్ బైపీసీ చదువుతున్నాడు. కోవిడ్తో మూతపడిన కళాశాల ఈ నెల 2న పునఃప్రారంభమైంది. జనవరి 31న ఇంటి నుంచి వెళ్లిన వంశీకృష్ణ 2న కళాశాలలో చేరాడు. శుక్రవారం రాత్రి 10 గంటలకు వసతి గృహంలో తోటి విద్యార్థులతో కలిసి నిద్రకు ఉపక్రమించాడు. అప్పటికే స్నేహితుని వాచ్ తీసుకొని రాత్రి 12.30 గంటలకు అలారం పెట్టించుకున్నాడు. ఉదయం 5 గంటలకు వ్యాయామ డ్రిల్కు వంశీ గైర్హాజరయ్యాడు. దీంతో ఉదయం 6.30 గంటలకు వెతకగా క్లాస్ రూమ్ వెనక నుంచి గడియ ఉండటం గమనించి తలుపులను గట్టిగా తోసి చూడగా.. పైకప్పు కొక్కేనికి చున్నీతో ఉరి వేసుకొని వంశీకృష్ణ ఆత్మహత్యకు పాల్పడ్డట్లు గుర్తించారు. పోలీసులకు సమాచారం అందించడంతో మృతదేహన్ని ఉస్మానియా ఆస్పత్రికి తరలించారు. కళాశాల ఎదుట మృతుడి బంధువుల ఆందోళన లైంగిక దాడి జరిగిందంటూ.. వంశీకృష్ణ బ్యాగ్లో రెండు సూసైడ్ నోట్లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ‘పూజ్యులైన నాన్న, అమ్మకు క్షమాపణలు. ఈ జన్మలో మీ రుణం తీర్చుకోలేకపోతున్నాను. నేను లైంగిక వేధింపులకు గురయ్యాను. నా బాధ మీతోగాని, స్నేహితులతో గాని, టీచర్లతోగాని పంచుకోలేను. మనస్తాపానికి, ఒత్తిడికి గురవుతున్నాను. బాధను భరించలేక ఈ నిర్ణయం తీసుకుంటున్నా క్షమించాలి’ అని సూసైడ్ నోట్ను ఇంగ్లిష్, తెలుగులో భాషల్లో రాశాడని సీఐ సురేష్ తెలిపారు. ‘ఓ దేవుడా నిన్ను మణులు, మాణిక్యాలు అడిగానా, పెద్ద ఉద్యోగం అడిగానా, చిన్న కోరికను తీర్చలేకపోతున్నావు’ అంటూ మరో లేక రాశాడని, ఐయామ్ సఫరింగ్ ఫ్రమ్ బ్లడ్ క్యాన్సర్’ అంటూ మరో చోట రాశాడని పోలీసులు తెలిపారు. లైంగిక దాడి కోణంలోనూ విచారణ చేస్తామని, సూసైడ్ నోట్లు వంశీ కృష్ణ రాశాడా లేదా అనేది తేలాల్సి ఉందన్నారు. కళాశాల ఎదుట ఆందోళన.. మీ అబ్బాయికి ఆరోగ్యం బాగాలేదని శనివారం ఉదయం 6 గంటలకు కాలేజీ నుంచి ఫోన్ వచ్చిందని.. ఆ తర్వాత సూసైడ్ చేసుకున్నాడని చెప్పినట్లు వంశీకృష్ణ తండ్రి లక్ష్మణ్గౌడ్ రోదిస్తూ తెలిపారు. హాస్టల్లో నిద్రించిన విద్యార్థి దూరంలో ఉన్న క్లాస్ రూమ్కు వెళ్లి సూసైడ్ చేసుకుంటే అక్కడున్న సిబ్బంది ఏం చేస్తున్నారని ఆయన ప్రశ్నించారు. మృతదేహాన్ని తాము రాకముందే తరలించాల్సిన అవసరం ఏముందని, ఆత్మహత్యగల కారణాలు వెల్లడించాలని విద్యార్థి తల్లిదండ్రులు, బంధువులు కళాశాల ఎదుట ఆందోళనకు దిగారు. వంశీ కృష్ణ చదువులో చురుగ్గా ఉండేవాడని.. అందరూ నిద్రలో ఉండగా క్లాస్రూమ్కు వెళ్లి ఆత్మహత్యకు పాల్పడి ఉంటాడని ప్రిన్సిపాల్ సత్యనారాయణ చెప్పారు. -
పోరాడి ఓడిన బ్లాక్ హాక్స్
సాక్షి, హైదరాబాద్: ప్రైమ్ వాలీబాల్ లీగ్లో హైదరాబాద్ బ్లాక్ హాక్స్ జట్టు వరుసగా రెండో పరాజయం చవిచూసింది. గచ్చిబౌలి ఇండోర్ స్టేడియంలో శుక్రవారం జరిగిన మ్యాచ్లో బ్లాక్ హాక్స్ జట్టు 2–3 (12–15, 15–14, 12–15, 15–11, 13–15) సెట్ల తేడాతో బెంగళూరు టార్పోడస్ జట్టు చేతిలో పోరాడి ఓడిపోయింది. లవ్మీత్, పంకజ్ శర్మ బెంగళూరు జట్టు గెలుపులో కీలకపాత్ర పోషించారు. మరో మ్యాచ్లో కోల్కతా థండర్బోల్ట్స్ 4–1తో (10–15, 15–11, 15–10, 15–12, 15–13) చెన్నై బ్లిట్జ్ జట్టుపై గెలిచింది. -
Hyderabad: సాఫ్ట్వేర్ ఇంజనీర్ అదృశ్యం.. గుర్తు తెలియని వ్యక్తి ఫోన్ చేసి
సాక్షి, గచ్చిబౌలి: ఓ సాఫ్ట్వేర్ ఇంజనీర్ అదృశ్యమైన సంఘటన గచ్చిబౌలి పోలీస్స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. ఏఎస్ఐ సాయిలు తెలిపిన ప్రకారం వివరాలు ఇలా ఉన్నాయి. గుంటూరు జిల్లా అచ్చంపేటకు చెందిన జి.నిరీషా(27) గచ్చిబౌలిలోని ఇన్ఫోసిస్లో సాఫ్ట్వేర్ ఇంజనీర్గా పని చేస్తోంది. గుంటూరులోనే ఉంటూ వర్క్ ఫ్రం హోం చేస్తున్న ఆమె ల్యాప్టాప్ కంపెనీలో ఇవ్వాలని తల్లిదండ్రులను గంగసాని వెంకటేశ్వర్రెడ్డి, అనురాధలను కంపెనీ వద్దకు తీసుకొచ్చింది. చదవండి: (దేవుడా ఎందుకీ కడుపుకోత.. నేనేం పాపం చేశా..) సోమవారం ఉదయం తల్లిదండ్రులు గేట్ ముందు ఉండగా లోపలికి వెళ్లి రెండు గంటలైనా తిరిగి రాలేదు. గుర్తు తెలియని ఓ వ్యక్తి ఫోన్ చేసి మీ కూతురు లింగంపల్లిలో ఉందని చెప్పి ఆమెతో మాట్లాడించారు. అక్కడికి వెళ్లిన కొద్ది సేపటికే మళ్లీ ఫోన్ చేసి జేఎన్టీయూ వద్ద ఉందని చెప్పడంతో అక్కడికి వెళ్లారు. అక్కడ కూడా కనిపించ లేదు. ఫోన్ చేయగా స్విచ్చాఫ్ ఉంది. దీంతో మంగళవారం గచ్చిబౌలి పీఎస్లో తల్లి అనురాధ ఫిర్యాదు చేయగా కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. చదవండి: (పెళ్లయ్యాక స్వాతితో పీకల్లోతు ప్రేమ.. ట్యూషన్కి వెళ్లి..)