Hyd:గుడిమల్కాపూర్‌లో కాల్పుల కలకలం | Gun Fire At Gudimalkapur Kings Palace Expo, Details Inside | Sakshi
Sakshi News home page

Hyd: గుడిమల్కాపూర్‌లో కాల్పుల కలకలం

Mar 29 2025 3:12 PM | Updated on Mar 29 2025 3:59 PM

Gun Fire At Gudimalkapur Kings Palace Expo

గుడిమల్కాపూర్‌లోని కింగ్స్ ప్యాలెస్‌లో నిర్వహించిన ఆనం మీర్జా ఎక్స్‌పోలో కాల్పుల కలకలం రేగింది.

సాక్షి, హైదరాబాద్: గుడిమల్కాపూర్‌లోని కింగ్స్ ప్యాలెస్‌లో నిర్వహించిన ఆనం మీర్జా ఎక్స్‌పోలో కాల్పుల కలకలం రేగింది. ఎక్స్‌పోలో ఇద్దరు షాప్ యజమానుల మధ్య ఘర్షణ జరిగింది. దీంతో వారిలో ఓ షాపు యజమాని గాలిలో కాల్పులు జరిపాడు. దీంతో ఎక్స్‌లో ఉన్నవారు భయాందోళనలకు గురయ్యారు.

ఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు.. కాల్పులు జరిపిన వ్యక్తిని అదుపులోకి తీసుకున్నారు. ఎక్స్‌పో నిర్వాహకులు, ప్రత్యక్ష సాక్షుల నుంచి వివరాలు సేకరించి విచారణ చేపట్టారు. ఈ ఘటన నేపథ్యంలో ఎక్స్‌పో ప్రాంతంలో భద్రతను పెంచినట్లు పోలీసులు వెల్లడించారు.

Gudimalkapur:  కింగ్స్‌ ప్యాలెస్‌లో కాల్పుల కలకలం

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement