Expo
-
రెక్కల గుర్రంపై... విశాఖకు ఎగిరొచ్చిన జల కన్యలు
చందమామ కథల్లో విన్న జలకన్యలు కళ్ల ముందు ప్రత్యక్షమై ‘హాయ్’ అని పలకరిస్తే ఎలా ఉంటుంది? సినిమాల్లోనే చూసిన రంగుల వెలుగుల జలకన్యలు ‘పదండి మా లోకంలోకి’ అని ఆహ్వానిస్తే ఎలా ఉంటుంది? ఆశ్చర్యం, ఆనందం, అద్భుతం సొంతమై మరో ప్రపంచంలోకి తీసుకువెళుతుంది. విశాఖ ఎక్స్పో– 2025 మెర్మైడ్స్ (జల కన్యలు) ప్రదర్శన ప్రత్యేక ఆకర్షణగా మారింది. ఎక్కడెక్కడి నుంచో విశాఖకు రెక్కలతో ఎగిరొచ్చిన జలకన్యల పరిచయం...చిన్నతనంలో కథలు, కార్టూన్లలో జలకన్యలను చూసి తెగ సంతోషించేది ఫిలిప్పీన్స్కి చెందిన కినా. ‘జలకన్యలు’ నిజం అనే భావనతోనే పెరిగింది. తాను కూడా వారిలా మారాలని బలంగా అనుకుంది. తరువాత కాలంలో స్కూబా డైవింగ్లో శిక్షణ తీసుకుంది. సముద్రంలో కూడా ఈద గలిగే నైపుణ్యాన్ని సొంతం చేసుకున్న కినా మెర్మైడ్ప్రొఫెషన్ ఎంచుకుంది. ‘శ్వాసను మన ఆధీనంలో ఉంచుకోవడం ఎంతో ప్రధానం’ అంటున్న కినా నాలుగు సంవత్సరాలుగా ఈ రంగంలో ఉంది. మెర్మైడ్ ఇన్స్ట్రక్టర్గా విద్యార్థులకు శిక్షణ ఇస్తోంది.‘మెర్మైడ్గా నీటిలో ఈదుతూ ప్రేక్షకులను అలరించాలంటే ఎప్పుడూ చిరునవ్వుతో ఉండాలి. దీనికి మంచినిద్ర, తగినంత వ్యాయాయం అవసరం. నిత్యం ఉదయంవేళల్లో స్ట్రెచ్చింగ్ ఎక్సర్సైజ్లు, యోగా చేస్తాము. దీనివల్ల నీటిలో ఎక్కువ సమయం శ్వాస తీసుకోకుండా ఉండటం సాధ్యపడుతుంది. ప్రత్యేకమైన మాస్క్, ఇయర్ ప్లగ్స్, ప్రత్యేకమైన సూట్, నడుముకి 2 నుంచి 4 కేజీల బరువుండే బెల్ట్, ఫిన్ వంటివి ధరిస్తాము’ అంటుంది ఫిలిప్పీన్స్ కు చెందిన రుత్.ఇటలీకి చెందిన క్లియోప్రొఫెషనల్ సింగర్. చిన్నప్పటి నుంచి మెర్మైడ్స్ అంటే ఇష్టం. ఆ ఇష్టంతోనే పాటకు వీడ్కోలు చెప్పి శిక్షణ తరువాత మెర్మైడ్ ప్రొషెషన్లోకి వచ్చింది. ‘మమ్మల్ని చూసిన తరువాత చిన్నారుల మోముల్లో కనిపించే చిరునవ్వులు ఎంతోసంతోషాన్ని, వృత్తిపరమైన సంతృప్తిని ఇస్తాయి. మా వృత్తిలో గౌరవప్రదమైన వేతనం ఉంటుంది’ అంటుంది క్లియో.ఫిజికల్ థెరపిస్ట్గా ఫిలిప్పీన్స్లోని హాస్పిటల్స్లో రెండేళ్లు పనిచేసిన విరోనికకు మెర్మైడ్ప్రొఫెషన్ అనేది చిన్ననాటి కల. తన కలను సాకారం చేసుకోవడమే కాదు రెండువృత్తులను సమన్వయం చేసుకుంటూ ముందుకు వెళుతోంది. ‘భారత్లో మమ్మల్ని బాగా ఆదరించారు’ అంటుంది విరోనిక.మూవీ థియేటర్ ఆర్టిస్ట్గా పేరు తెచ్చుకున్న ఇటలీకి చెందిన క్లియో మెర్మైడ్ ప్రొఫెషన్లోకి రావడం ద్వారా తన చిన్నప్పటి కలను నెరవేర్చుకుంది. ప్రేక్షకుల నుంచి వచ్చే స్పందన, వృత్తిపరమైన సంతృప్తి, సంతోషాల మాట ఎలా ఉన్నా....ఇది ఆషామాషీ వృత్తేమీ కాదు. నిత్యం రెండు నుంచి నాలుగు గంటల సమయం నీటిలో ఉండాల్సి ఉంటుంది. దీనివల్ల శరీర ఉష్ణోగ్రత తగ్గిపోతుంది.హైపోథేమియా, హైకోక్సియావంటి ఆరోగ్య సమస్యలు ఎదురవుతాయి. దీన్ని దృష్టిలో పెట్టుకొని తగిన జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది. పరిశుభ్రమైన నీరు లేని పక్షంలో చర్మసమస్యలు వస్తాయి. చర్మ, కేశ సంరక్షణకు ఎక్కువ శ్రద్ధ వహిస్తూ ఖర్చు చేయాల్సి వస్తుంది. నీటిలో దిగే సమయంలో శరీరానికి వివిధ లోషన్లు పూసుకుంటారు. పైభాగంలో ఉంచే లైట్ల నుంచి వచ్చే వేడిని దృష్టిలో పెట్టుకొని సన్స్క్రీన్ వాడతారు. కాళ్లకు ఉపయోగించే ప్రత్యేకమైన తోక వంటి పరికరం వల్ల కాళ్లపై గాయాలు కావడం అనేది సర్వసాధారణం.నాలుగు దశల శిక్షణమెర్మైడ్ప్రొఫెషన్ కోసం ప్రాథమిక స్థాయి, ఓషన్ మెర్మైడ్, అడ్వాన్స్డ్, ఇన్స్ట్రక్టర్...నాలుగు దశల్లో శిక్షణ ఉంటుంది. తొలి దశలో ఈత కొట్టడంలోప్రాథమిక సూత్రాలు, రెండోదశలో సముద్రంలో, ద్వీపాలలో ఈత కొట్టడం, మూడోదశలో మరింత నైపుణ్యంతో ఈత కొట్టడం నేర్పిస్తారు. నాల్గవ దశలో ఈతలో, మెర్మైడ్స్గా ఉపాధిని పొందడానికి వచ్చే వారికి అవసరమైన శిక్షణ అందించే ఇన్స్ట్రక్టర్గా మారడానికి అవసరమైన శిక్షణ ఇస్తారు.– వేదుల నరసింహంఎ.యూ. క్యాంపస్, సాక్షి, విశాఖపట్నంఫోటోలు: ఎం.డి. నవాజ్ -
మాదాపూర్ : పెటెక్స్ భారతదేశంలో అతిపెద్ద ఎక్స్పో (ఫొటోలు)
-
హైటెక్స్.. పెటెక్స్..
సాక్షి, హైదరాబాద్: దేశంలోనే అతిపెద్ద పెట్ ఎక్స్పో నిర్వహణకు హైదరాబాద్ వేదికగా నిలవనుంది. జనవరి 31 నుండి ఫిబ్రవరి 2 వరకూ మూడు రోజుల పాటు పెటెక్స్, తొలి కిడ్స్ బిజినెస్ కారి్నవాల్, కిడ్స్ ఫెయిర్లను ఏకకాలంలో హైటెక్స్లో నిర్వహించనున్నారు. దీనికి సంబంధించిన అంశాలను హైటెక్స్ వాణిజ్య ఉన్నతాధికారి టీజీ శ్రీకాంత్ శుక్రవారం వివరించారు. కారి్నవెల్ మద్దతుతో పెటెక్స్ భారత్, టర్కీ, చెక్ రిపబ్లిక్, సింగపూర్, జపాన్, జర్మనీ తదితర దేశాలకు చెందిన 60కిపైగా ఎగ్జిబిటర్లు ఉన్నారన్నారు. పెంపుడు జంతు ప్రేమికులు, ఔత్సాహికులను ఒక చోట చేర్చుతుందన్నారు. ఈ ప్రదర్శనలో 70కిపైగా అలంకారప్రాయమైన చేపల జాతులు ఉంటాని తెలిపారు. వివిధ బ్రీడ్ల గుర్రాలు, పక్షులు, కుక్కల ఫ్యాషన్ షో, కే–9 స్కూల్ కుక్కల ప్రదర్శన, స్కూపీ స్క్రబ్ వారి ఉచిత బేసిక్ గ్రూమింగ్ వంటివి ప్రదర్శించనున్నారు. కిడ్స్ బిజినెస్ కార్నివాల్ తొలి ఎడిషన్లో 85 మంది ఔత్సాహిక విద్యార్థులు ఉన్నారన్నారు. పలు ఉత్పత్తులు, ఆవిష్కరణలను ఈ ఎక్స్పోలో ప్రదర్శించనున్నారని తెలిపారు. క్యాట్ఛాంపియన్ షిప్ ను ఇండియన్ క్యాట్ క్లబ్ నిర్వహిస్తోంది. 200 రకాల పిల్లులు, అందులోనూ కొన్ని అరుదైన జాతులను సందర్శించొచ్చని పేర్కొన్నారు. మొదటిసారి కిడ్స్ కార్నివాల్ .. మొట్టమొదటిసారి కిడ్స్ బిజినెస్ కార్నివాల్ నిర్వహించనున్నామని, పిల్లల్లోని వ్యవస్థాపక స్ఫూర్తిని ప్రదర్శించేందుకు ఈ ఎక్స్పో వేదికగా నిలుస్తుందని పేర్కొన్నారు. వ్యాపార ప్రణాళిక, పోటీ, ఉత్పత్తుల ప్రదర్శన మొదలైనవి ఇందులో ఉంటాయని వివరించారు. ఎల్రక్టానిక్స్, రోబోటిక్ ప్రాజెక్ట్లు, పెబుల్ ఆర్ట్, అయస్కాంత బుక్ మార్క్స్, విద్యార్థులు రాసిన పుస్తకాలు, 85 మంది విద్యార్థులు తయారు చేసిన హాండీ క్రాఫ్టŠస్ మొదలైనవి ఎక్స్పోలో చూడొచ్చని తెలిపారు. కిడ్స్ రన్.. ఫిబ్రవరి 1న సాయంత్రం 5 గంటలకు హైటెక్స్లో 4కిలో మీటర్లు, 2–కే, 1–కే వంటి మూడు విభిన్న కేటగిరీల్లో కిడ్స్ రన్ నిర్వహించనున్నారు. ఐదేళ్ల నుంచి 13 ఏళ్ల వయసు పిల్లలు ఇందులో పాల్గొన వచ్చన్నారు.పది రెట్లు ఎక్కువగా.. పెంపుడు జంతువుల దత్తత ప్రక్రియ భారత్ కంటే పాశ్చాత్య దేశాల్లో పది రెట్లు ఎక్కువని నిర్వాహకులు చెబుతున్నారు. 12 రాష్ట్రాలు, ఐదు దేశాల ప్రదర్శనకారులు ఈ మూడు ఎక్స్పోలో పాల్గొంటారని, సుమారు 25 వేలకు పైగా సందర్శకులు వస్తారని అంచనా వేస్తున్నామని తెలిపారు. దేశంలో పెట్ కేర్ పరిశ్రమ ప్రారంభ దశలో ఉందని, క్రమంగా పురోగమిస్తోందని, పెంపుడు జంతువుల దత్తత క్రమంగా పెరుగుతోందన్నారు. -
ఈవీ రంగం @ 8 రెట్లు..!
న్యూఢిల్లీ: ఈ దశాబ్దం చివరినాటికి ఎలక్ట్రిక్ వెహికిల్స్ (ఈవీ) పరిశ్రమ దేశంలో ఎనిమిది రెట్లు దూసుకెళ్తుందని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ తెలిపారు. దశాబ్ద కాలంలో ఈవీల విక్రయాలు 640 రెట్లు పెరిగాయని అన్నారు. 10 ఏళ్ల క్రితం ఏటా 2,600 యూనిట్ల ఈవీలు అమ్ముడయ్యాయని, గత ఏడాది ఈ సంఖ్య 16.8 లక్షల యూనిట్లు దాటిందని వివరించారు. భారత్ మొబిలిటీ గ్లోబల్ ఎక్స్పో–2025ను ప్రారంభించిన సందర్భంగా శుక్రవారం ఆయన ప్రసంగించారు. ఏడాదికి 2.5 కోట్ల వాహనాల అపూర్వ అమ్మకాలను చూసిందని, కేవలం నాలుగు సంవత్సరాలలో ఈ పరిశ్రమ 36 బిలియన్ డాలర్ల విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులను ఆకర్షించిందని వెల్లడించారు. పర్యావరణ అనుకూల సాంకేతికత, ఎలక్ట్రిక్ వాహనాలు, హైడ్రోజన్ ఇంధనం, జీవ ఇంధనాల అభివృద్ధిపై భారత్ దృష్టి సారిస్తోందని మోదీ అన్నారు. మేక్ ఇన్ ఇండియా చొరవతో.. మొబిలిటీ రంగంలో భవిష్యత్తును రూపొందించుకోవాలని చూస్తున్న ప్రతి పెట్టుబడిదారుడికి అత్యుత్తమ గమ్యస్థానంగా భారత్ నిలుస్తుందని ప్రధాని తెలిపారు. పెట్టుబడిదారులకు ప్రభుత్వం నుంచి పూర్తి మద్దతు ఉంటుందని ఈ సందర్భంగా హామీ ఇచ్చారు. బ్యాటరీ స్టోరేజ్ వ్యవస్థలో పెట్టుబడులకు ఇదే సరైన సమయమని చెప్పారు. మేక్ ఇన్ ఇండియా చొరవ దేశ ఆటో పరిశ్రమ వృద్ధి అవకాశాలకు ఆజ్యం పోస్తోందని, ఈ రంగం అభివృద్ధిలో భారీ పాత్ర పోషించిందని గుర్తు చేశారు. ఆర్థిక వ్యవస్థకు, పర్యావరణానికి తోడ్పడే మొబిలిటీ వ్యవస్థ కోసం ప్రభుత్వం కృషి చేస్తోందని చెప్పారు. భారతీయ ఆటో రంగం వృద్ధికి, మధ్యతరగతి కుటుంబాల కలలను నెరవేర్చడంలో రతన్ టాటా, ఒసాము సుజుకీ సహకారం ఎంతో ఉందని మోదీ అన్నారు.టాటా.. 32 కొత్త వాహనాలు టాటా మోటార్స్ ఆటో ఎక్స్పో వేదికగా ప్యాసింజర్, కమర్షి యల్ విభాగంలో 32 కొత్త వాహనాలతోపాటు వివిధ ఇంటెలిజెంట్ సొల్యూషన్స్ను ఆవిష్కరించింది. వీటిలో ఆరు ఎలక్ట్రిక్ వాహనాలు ఉన్నాయి. టాటా సియర్రా ఎస్యూవీ, హ్యారియర్ ఈవీతోపాటు అవిన్యా కాన్సెప్ట్ ఈవీ సైతం కొలువుదీరింది. అవిన్యా శ్రేణిలో తొలి మోడల్ 2026లో రంగ ప్రవేశం చేసే అవకాశం ఉంది.సుజుకీ ఈ–యాక్సెస్ 95 కిలోమీటర్లు సుజుకీ తాజాగా భారత్ వేదికగా అంతర్జాతీయ మార్కెట్లో యాక్సెస్ ఎలక్ట్రిక్ వర్షన్ను ఆవిష్కరించింది. ఒకసారి చార్జింగ్ చేస్తే 95 కిలోమీటర్లు ప్రయాణించడం ఈ–యాక్సెస్ ప్రత్యేకత. 3.07 కిలోవాట్ అవర్ ఎల్ఎఫ్పీ బ్యాటరీ ప్యాక్ను పొందుపరిచారు. గరిష్ట వేగం గంటకు 71 కిలోమీటర్లు. చార్జింగ్ పూర్తి కావడానికి 240 వాట్ పోర్టబుల్ చార్జర్తో 6 గంటల 42 నిముషాలు, ఫాస్ట్ చార్జర్తో 2 గంటల 12 నిమిషాలు పడుతుంది. పండుగ సీజన్ మార్కెట్లోకి రానుంది. కాగా, యాక్సెస్ 125 అప్గ్రేడెడ్ వెర్షన్తోపాటు జిక్సర్ ఎస్ఎఫ్ 250 ఫ్లెక్స్ ఫ్యూయల్ మోడళ్లను పరిచయం చేసింది.ఇక జేఎస్డబ్ల్యూ బ్రాండ్ వాహనాలు విభిన్న రంగాల్లో ఉన్న జేఎస్డబ్ల్యూ గ్రూప్ సొంత బ్రాండ్లో కార్స్, ట్రక్స్, బస్ల తయారీలోకి ప్రవేశించనున్నట్టు ప్రకటించింది. ఇందుకోసం ఒక బిలియన్ డాలర్ల పెట్టుబడులు చేయనున్నట్టు జేఎస్డబ్ల్యూ ఎంజీ మోటార్ ఇండియా డైరెక్టర్ పార్థ్ జిందాల్ వెల్లడించారు. సాంకేతిక భాగస్వామ్యం కోసం వివిధ కంపెనీలతో చర్చలు జరుపుతున్నట్టు జిందాల్ చెప్పారు. జేఎస్డబ్ల్యూ బ్రాండ్ తొలి వాహనం 2027–2028లో రోడ్లపైకి వస్తుందన్నారు.మారుతీ ఈ–విటారా రేంజ్ 500 కి.మీమారుతీ సుజుకీ ఇండియా నుంచి ఎట్టకేలకు తొలి ఎలక్ట్రిక్ ఎస్యూవీ ఈ–విటారా కొలువుదీరింది. 49, 61 కిలోవాట్ అవర్ బ్యాటరీ ఆప్షన్స్లో ఇది లభిస్తుంది. 61 కిలోవాట్ అవర్ బ్యాటరీ వేరియంట్ ఒకసారి చార్జింగ్ చేస్తే 500 కిలోమీటర్లకుపైగా పరుగుతీయనుందని కంపెనీ వెల్లడించింది. ఫ్లోటింగ్ డ్యూయల్ స్క్రీన్స్, లెవెల్–2 అడాస్, ఏడు ఎయిర్బ్యాగ్స్ పొందుపరిచారు. 300 ఎన్ఎం టార్క్ అందించే ఆల్ వీల్ డ్రైవ్ వర్షన్ సైతం ఉంది. ప్రపంచ మార్కెట్కు ఈ–విటారా కార్లను మారుతీ సుజుకీ వచ్చే 10 ఏళ్లపాటు ప్రత్యేకంగా సరఫరా చేయనుండడం విశేషం. ఈ–విటారా తయారీ, ప్రత్యేకంగా ఈవీ ప్రొడక్షన్ లైన్ కోసం రూ.2,100 కోట్లకుపైగా పెట్టుబడి చేసినట్టు మారుతీ సుజుకీ ఇండియా ఎండీ హిసాటీ టాకేయూచీ వెల్లడించారు. కాగా, ‘ఈ ఫర్ మీ’ పేరుతో పూర్థిస్థాయిలో ఈవీ వ్యవస్థ ఏర్పాటుకు మారుతీ శ్రీకారం చుట్టింది. టాప్–100 నగరాల్లోని డీలర్షిప్స్ వద్ద ఫాస్ట్ చార్జింగ్ స్టేషన్లు అందుబాటులోకి తెస్తారు. ప్రతి 5–10 కిలోమీటర్లకు ఒక చార్జింగ్ స్టేషన్ ఉండాలన్నది కంపెనీ లక్ష్యం. అలాగే 1,000కిపైగా నగరాల్లో ఈవీల కోసం ప్రత్యేకంగా 1,500ల పైచిలుకు సరీ్వస్ సెంటర్లను నెలకొల్పుతారు. కొత్తగా 1.5 లక్షల మందికి.. మేక్ ఇన్ ఇండియా కార్యక్రమానికి ఉత్పత్తి ఆధారిత ప్రోత్సాహకాల (పీఎల్ఐ) పథకం వెన్నుదన్నుగా నిలిచిందని, తద్వారా పరిశ్రమకు అదనంగా రూ.2.25 లక్షల కోట్ల అమ్మకాలు తోడయ్యాయని నరేంద్ర మోదీ అన్నారు. వాహన రంగంలో కొత్తగా 1.5 లక్షల మందికి ప్రత్యక్ష ఉపాధి అవకాశాలను ఈ పథకం తెచి్చపెట్టిందని వెల్లడించారు. శిలాజ ఇంధనాల దిగుమతిపై దేశ వ్యయాలను తగ్గించే వ్యవస్థను రూపొందిస్తున్నట్టు తెలిపారు. ప్రయాణ సౌలభ్యం భారత్కు అతిపెద్ద ప్రాధాన్యతగా ఉందని, గత బడ్జెట్లో మౌలిక సదుపాయాల అభివృద్ధికి రూ.11 లక్షల కోట్లకు పైగా నిధులు కేటాయించామన్నారు. భారత ఆటోమొబైల్ రంగం గత ఏడాది 12% వృద్ధి చెందిందని వివరించారు. భారత్ మొబిలిటీ గ్లోబల్ ఎక్స్పో జనవరి 22 వరకు కొనసాగనుంది. ఆటోమొబైల్, విడిభాగాలు, సాంకేతికతల్లో 100కుపైగా నూతన ఆవిష్కరణలకు ఎక్స్పో వేదిక కానుంది. -
తిరుపతిలో ఇంటర్నేషనల్ టెంపుల్స్ కన్వెన్షన్ అండ్ ఎక్స్పో
ఆంధ్రప్రదేశ్లోని ప్రసిద్ధ పుణ్యక్షేత్రం తిరుపతిలో ప్రపంచంలోనే అతిపెద్ద అంతర్జాతీయ దేవాలయాల కన్వెన్షన్ అండ్ ఎక్స్పో ((ITCX) జరగనుంది. 2025 ఫిబ్రవరి 17 -19 తేదీల మధ్య అంతర్జాతీయ దేవాలయాల సదస్సు మరియు ప్రదర్శన (ఐటీసీఎక్స్) ఉంటుందని నిర్వాహకులు ఒక ప్రకటనలో తెలిపారు.ఆలయ నిర్వాహకులు, ప్రతినిధులు జనవరి 31, 2025లోపు ఉచితంగా నమోదు చేసుకోవచ్చు. ఒక్కో ఆలయానికి ఇద్దరు ప్రతినిధులకు వసతి కూడా ఉంటుంది. అదనపు ట్రస్టీలు నామమాత్రపు రుసుము చెల్లించాల్సి ఉంటుంది. 111 మంది నిపుణులైన వక్తలతో సెమినార్లు, ఇంటరాక్టివ్ వర్క్షాప్లు, ప్రత్యేక మాస్టర్క్లాస్లు, ప్రెజెంటేషన్లు, వర్క్షాప్లు , మాస్టర్క్లాస్లు - ఆలయ చర్చలు ఉంటాయి. ఈ సమావేశాలకు 58కి పైగా దేశాల నుండి హిందూ,సిక్కు, బౌద్ధ, జైన మత సంస్థల నుండి కీలక ప్రతినిధులు పాల్గొననున్నారు. మూడు రోజుల స్మారక కార్యక్రమంలో ప్రపంచ వ్యాప్తంగా 1581కి పైగా ప్రతిష్టాత్మక దేవాలయాల ప్రముఖులు సమావేశమవుతారు.టెంపుల్ కనెక్ట్ వ్యవస్థాపకుడు గిరేష్ కులకర్ణి నేతృత్వంలో జరుగుతున్న ఈ మైలురాయి కార్యక్రమానికి ప్రసాద్ లాడ్ (ఐటీసీఎక్స్ 2025 చైర్మన్,మహారాష్ట్ర శాసన మండలి సభ్యుడు) సహ-నాయకత్వం వహిస్తున్నారు "ఇన్క్రెడిబుల్ ఇండియా" కార్యక్రమం కింద భారత ప్రభుత్వ పర్యాటక మంత్రిత్వ శాఖసహకారంతో ఆలయాల కుంభమేళా నిర్వహిస్తున్నామని గిరేష్ కులకర్ణి ఒక ప్రకటనలో తెలిపారు. తొలి ఎడిషన్ 2023లో వారణాసిలో ఘనంగా జరిగిన సంగతి తెలిసిందే. -
ప్రపంచానికి నాయకత్వం వహించే దిశగా భారత్ పయనం
ఆటోమోటివ్ పరిశ్రమలో ప్రపంచానికి భారత్ నాయకత్వం వహించే దిశగా పయనిస్తుందని ప్రధాని నరేంద్ర మోదీ(PM Modi) ప్రశంసించారు. భవిష్యత్తులో ఈ పరిశ్రమ వృద్ధి చెందేందుకు ఎంతో అవకాశం ఉందన్నారు. ఢిల్లీలోని భారత్ మండపంలో ఏర్పాటు చేసిన భారత్ మొబిలిటీ గ్లోబల్ ఎక్స్ పో 2025(రెండో ఎడిషన్-Bharat Mobility Global Expo 2025)ను ప్రధాని మోదీ శుక్రవారం ప్రారంభించారు. జనవరి 17 నుంచి 22 వరకు జరిగే ఈ ఎక్స్పో భారత్ మండపం, ద్వారకాలోని యశోభూమి, గ్రేటర్ నోయిడాలోని ఇండియా ఎక్స్పో సెంటర్ అండ్ మార్ట్ అనే మూడు వేదికల్లో జరగనుంది. 5,100 మందికి పైగా అంతర్జాతీయ ఆవిష్కర్తలు, 5 లక్షలకుపైగా సందర్శకులు, ఔత్సాహికులు ఈ కార్యక్రమంలో పాల్గొంటారని అంచనా.ఈ కార్యక్రమాన్ని ప్రారంభించిన సందర్భంగా ప్రధాని మాట్లాడుతూ..‘భారతదేశ ఆటోమోటివ్ పరిశ్రమ(automotive industry) అద్భుతమైంది. భవిష్యత్తులో ఈ పరిశ్రమ ఎదిగేందుకు ఎన్నో అవకాశాలున్నాయి. దేశంలోని తయారీదారులు స్థానిక డిమాండ్ను తీర్చడమే కాకుండా ప్రపంచ వేదికలపై తమదైన ముద్ర వేస్తున్నారు. సుస్థిర పద్ధతులను అవలంబించడంలో, అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని సమ్మిళితం చేయడంలో ఈ రంగం చాలా కృషి చేస్తోంది. దేశీయ తయారీదారులు అనుసరిస్తున్న విధానాలు ప్రపంచ ఆటోమోటివ్ రంగంలో భారతదేశాన్ని కీలకంగా మార్చనున్నాయి. ఈ రంగంలో ప్రపంచానికి నాయకత్వం వహించే దిశగా భారత్ పయనిస్తుంది. భవిష్యత్తులో ఎలక్ట్రిక్ వాహనాల (ఈవీ)కు మరింత డిమాండ్ పెరుగుతుంది. విధానపరమైన కార్యక్రమాలు, మౌలిక సదుపాయాల అభివృద్ధి ద్వారా ఎలక్ట్రిక్ వాహనాల పర్యావరణ వ్యవస్థకు మద్దతు ఇవ్వడానికి ప్రభుత్వం కట్టుబడి ఉంది’ అన్నారు.ఇదీ చదవండి: బాసులు లేని వర్క్ కల్చర్భారత్ మొబిలిటీ గ్లోబల్ ఎక్స్పో 2025 ‘బియాండ్ బోర్డర్స్: కో-క్రియేటింగ్ ఫ్యూచర్ ఆటోమోటివ్ వాల్యూ చైన్’ అనే థీమ్తో ప్రారంభమైంది. ఆటోమోటివ్, మొబిలిటీ రంగాల్లో సహకారం, సృజనాత్మకతను పెంపొందించడం ఈ కార్యక్రమం లక్ష్యంగా పెట్టుకుంది. ఈ ఈవెంట్ లో ఆటోమొబైల్స్, కాంపోనెంట్ ప్రొడక్ట్స్, అడ్వాన్స్డ్ మొబిలిటీ టెక్నాలజీలతో సహా 100కు పైగా కొత్త లాంచ్లు ఉండబోతున్నాయని మార్కెట్ వర్గాలు భావిస్తున్నాయి. -
రూ.20 లక్షల కోట్లకు ఈవీ మార్కెట్
న్యూఢిల్లీ: ఎలక్ట్రిక్ వెహికల్స్ (ఈవీ) మార్కెట్ విలువ భారత్లో 2030 నాటికి రూ.20 లక్షల కోట్లకు చేరుకునే అవకాశం ఉందని కేంద్ర రోడ్డు, రవాణా, రహదారుల శాఖ మంత్రి నితిన్ గడ్కరీ గురువారం తెలిపారు. ఆ సమయానికి మొత్తం ఈవీ పర్యావరణ వ్యవస్థలో దాదాపు 5 కోట్ల మందికి ఉద్యోగావకాశాలు లభిస్తాయని అన్నారు. ఎలక్ట్రిక్ వాహన పరిశ్రమ సుస్థిరతపై 8వ సదస్సు ఈవీఎక్స్పో 2024 సందర్భంగా ఆయన మాట్లాడారు. 2030 నాటికి ఎలక్ట్రిక్ వాహనాల ఫైనాన్స్ మార్కెట్ పరిమాణం దేశంలో దాదాపు రూ.4 లక్షల కోట్లుగా ఉంటుందని అంచనాగా వెల్లడించారు. భారత్లో 40 శాతం వాయు కాలుష్యం రవాణా రంగం వల్లే అని మంత్రి ఈ సందర్భంగా తెలిపారు. సౌర విద్యుత్ 44 శాతం.. భారత్ రూ. 22 లక్షల కోట్ల విలువైన శిలాజ ఇంధనాలను దిగుమతి చేసుకుంటోందని, ఇది పెద్ద ఆర్థిక సవాలుగా మారిందని గడ్కరీ అన్నారు. ఈ శిలాజ ఇంధనాల దిగుమతి మన దేశంలో చాలా సమస్యలను సృష్టిస్తోందని తెలిపారు. భారత్లో ఉత్పత్తి అవుతున్న మొత్తం విద్యుత్లో 44 శాతం సౌరవిద్యుత్ కైవసం చేసుకున్నందున ప్రభుత్వం పర్యావరణ అనుకూల శక్తి వనరులపై దృష్టి పెడుతోందని వివరించారు.లక్ష ఈ–బస్లు అవసరం.. ఎలక్ట్రిక్ బస్ల కొరతను భారత్ ఎదుర్కొంటోందని ఈ సందర్భంగా మంత్రి గుర్తు చేశారు. ‘మన దేశానికి లక్ష ఎలక్ట్రిక్ బస్లు అవసరం. అయితే ప్రస్తుతం మన సామర్థ్యం 50,000 ఈ–బస్లు. మీరు మీ ఫ్యాక్టరీని విస్తరించుకోవడానికి ఇదే సరైన సమయం. ఎలక్ట్రిక్ వాహనాల తయారీదారులు నాణ్యత విషయంలో రాజీ పడొద్దు’ అని తయారీ కంపెనీలను ఉద్దేశించి అన్నారు. -
ఆగస్టు 29 నుంచి ఎలక్ట్రిక్ ఎక్స్పో
హైదరాబాద్: సికింద్రాబాద్ ఎలక్ట్రిక్ ట్రేడర్స్ అసోసియేషన్(సెటా) ఆగస్టు 29 నుంచి 31వ తేదీ వరకు హైటెక్స్లో ఎలక్ట్రిక్ ఎక్స్పో నిర్వహిస్తున్నదని, జాతీయ స్థాయిలో పేరొందిన ఎలక్ట్రిక్ కంపెనీలు బ్రాండ్లు ఇందులో తమ ఉత్పత్తులను ప్రదర్శిస్తాయని సెటా అధ్యక్షుడు సురేష్జైన్ తెలిపారు. బంజారాహిల్స్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వారు ఈ ఎక్స్పోకు సంబంధించిన వివరాలు వెల్లడించారు. ఈ ఎక్స్పోలో సుమారు 180 స్టాల్స్ ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. దేశంలోని ఇది అతిపెద్ద ఎక్స్పో కాబోతున్నదని తెలిపారు. -
హైదరాబాద్లో ‘బిర్లా ఓపస్’ ఎక్స్పో
హైదరాబాద్: పెయింట్స్ పరిశ్రమలోకి అడుగుపెట్టిన ఆదిత్య బిర్లా గ్రూప్ ‘బిర్లా ఓపస్’ పేరుతో దేశంలోని వివిధ నగరాలకు తమ ఉత్పత్తులను పరిచయం చేస్తూ విస్తరించే ప్రయత్నం చేస్తోంది.దేశవ్యాప్తంగా కీలక మార్కెట్లలో విజయవంతమైన ఎక్స్పోలను అనుసరించి, బిర్లా ఓపస్ దేశవ్యాప్తంగా తన వాణిజ్య సంబంధాలను బలోపేతం చేసుకునేందుకు 180 పైగా ప్రాంతాలకు దీన్ని మరింత విస్తరిస్తోంది. ఇందులో భాగంగా బిర్లా ఓపస్ ఎక్స్పో జూన్ 24, 25 తేదీల్లో హైదరాబాద్లో జరగనుంది.వ్యాపార భాగస్వాములు ముఖ్యంగా డీలర్లు, పెయింటర్లు, కాంట్రాక్టర్లు, ఆర్కిటెక్ట్లు, ఇంటీరియర్ డిజైనర్లతో సంబంధాలను పెంపొందించుకోవడం, బలోపేతం చేసుకోవడమే లక్ష్యంగా నిర్వహిస్తున్న ఈ ఎక్స్పోలో బిర్లా ఓపస్ ఉత్పత్తుల శ్రేణిని ప్రదర్శిస్తారు. -
హైదరాబాద్: టైమ్స్ హోమ్ హంట్ ప్రాపర్టీ ఎక్స్ పో ప్రారంభించిన మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి (ఫొటోలు)
-
తాజ్ కృష్ణ లో ప్రీమియర్ మల్టీసిటీ ఫ్రాంచెస్ ఎక్స్పో (ఫొటో గ్యాలరీ)
-
హైదరాబాద్ తాజ్ డెక్కన్ లో బ్యూటెక్ కాస్మెటిక్ అండ్ సెలూన్ ఎక్స్పో (ఫోటోలు)
-
మెడ్టెక్ జోన్లో మెగా ఎక్స్పో సిటీ
సాక్షి, విశాఖపట్నం: కోవిడ్ సమయంలో ర్యాపిడ్ టెస్ట్ కిట్ల తయారీ... భారత వైద్యరంగంలో ప్రపంచస్థాయి గామా రేడియేషన్ సెంటర్... ప్రపంచంలోనే మొదటి డేటా సెంటర్ ఏర్పాటు.. ఇలా వైద్యరంగంలో విప్లవాత్మక ఆవిష్కరణలకు కేంద్రంగా మారిన విశాఖపట్నంలోని ఏపీ మెడ్ టెక్ జోన్ మరో రికార్డును సొంతం చేసుకుంది. తాజాగా ఇండియా ఎక్స్పో సిటీ పేరుతో భారీ ఎగ్జిబిషన్ సెంటర్ను నిర్మించింది. కేవలం 150 రోజుల్లోనే లక్షకు పైగా చదరపు అడుగుల విస్తీర్ణం కలిగిన ఎగ్జిబిషన్ సెంటర్ను ఏర్పాటుచేసి రికార్డు సృష్టించింది. ఈ ఇండియా ఎక్స్పో సిటీని శుక్రవారం ప్రారంభించారు. ఇక్కడ తొలి రోజే 5వ ఇంటర్నేషనల్ క్లినికల్ ఇంజినీరింగ్ అండ్ హెల్త్ టెక్నాలజీ మేనేజ్మెంట్ కాంగ్రెస్ ప్రారంభం కావడం విశేషం. ఇవీ ప్రత్యేకతలు... మెడ్టెక్ జోన్లోని ప్రగతి మైదాన్లో 1,03,951 చదరపు అడుగుల విస్తీర్ణం కలిగిన ఇండియా ఎక్స్పో సిటీ నిర్మాణ పనులు జూన్ 14న ప్రారంభించారు. శుక్రవారం పూర్తిచేసి అందుబాటులోకి తీసుకువచ్చారు. మొత్తం 5.40లక్షల పని గంటల్లో నిర్మాణం పూర్తిచేశారు. ఈ ఎక్స్పో సిటీ నిర్మాణం కోసం 3,577 క్యూబిక్ మీటర్ల కాంక్రీట్, 718 మెట్రిక్ టన్నుల స్టీల్ వినియోగించారు. రోజుకు 10వేల మంది సందర్శించేలా ఎక్స్పో సిటీని నిర్మించారు. లోపల భాగంలో ఒక్క కోలమ్ కూడా నిర్మించకుండా దీనిని పూర్తి చేయడం విశేషం. ఎక్స్పో సిటీలో నాలుగు కాన్ఫరెన్స్ హాల్స్, బోర్డ్రూమ్లు ఉన్నాయి. 16 వేల చదరపు అడుగుల విస్తీర్ణంలో డిస్ప్లే షాప్స్ ఏర్పాటుచేసుకోవచ్చు. తొలి రోజే అంతర్జాతీయ సదస్సు ఇండియా ఎక్స్పో సిటీ అందుబాటులోకి వచ్చిన తొలి రోజే అసోసియేషన్ ఫర్ ది అడ్వాన్స్మెంట్ ఆఫ్ మెడికల్ ఇన్స్ట్రుమెంటేషన్(ఏఏఎంఐ), గ్లోబల్ క్లినికల్ ఇంజినీరింగ్ అలయెన్స్(జీసీఈఏ) ఆధ్వర్యంలో 5వ ఇంటర్నేషనల్ క్లినికల్ ఇంజినీరింగ్ అండ్ హెల్త్ టెక్నాలజీ మేనేజ్మెంట్ కాంగ్రెస్ (ఐసీఈహెచ్టీఎంసీ) ప్రారంభమైంది. ఈ నెల 13వ తేదీ వరకు నిర్వహించనున్న సదస్సులో కోవిడ్–19 అనంతర పరిణామాలతోపాటు వైద్య పరికరాల వినియోగం, అందుబాటులో ఉన్న అత్యాధునిక వైద్య పరికరాలు, హెల్త్ మేనేజ్మెంట్ తదితర అంశాలపై చర్చిస్తారు. అమెరికా, చైనా, వెనుజులా, మెక్సికో, స్కాట్లాండ్, బ్రెజిల్, స్పెయిన్, కొలంబియా తదితర దేశాలకు చెందిన ప్రతినిధులు హాజరయ్యారు. ఈ కాంగ్రెస్లో భాగంగానే 14 నుంచి 16వ తేదీ వరకు ప్రపంచ ఆరోగ్య సంస్థ(డబ్ల్యూహెచ్వో) ఆధ్వర్యంలో ఇన్నోవేషన్ ఫోరం సమావేశం కూడా మెట్టెక్ జోన్లో నిర్వహించనున్నట్లు ఏఏఎంఐ చీఫ్ లెర్నింగ్ అండ్ డెవలప్మెంట్ ఆఫీసర్ రాబర్ట్ బరోస్ తెలిపారు. ఈ కార్యక్రమంలో 80కి పైగా దేశాలకు చెందిన జాతీయ ఆరోగ్య మంత్రిత్వ శాఖల ప్రతినిధులు హాజరవుతారని వెల్లడించారు. -
Live Stock Expo : పశు సంపద రంగానికి తగినంత గుర్తింపు రావాలి
ఎల్డిఎఫ్ ఇండియా, పశువులు, పాడి పరిశ్రమ మరియు మత్స్య పర్యావరణ వ్యవస్థలన్నింటిని ఒకే పైకప్పు కిందకు తీసుకువచ్చే భారతదేశపు మొట్టమొదటి ఎక్స్పో గురువారం హైటెక్స్లో ప్రారంభమైంది. ఆదివారం వరకు మూడురోజుల పాటు జరిగే ఈ ఎక్స్పోలో సుమారు 80 స్టాల్స్ హైలైట్గా నిలవనున్నాయి. ఈ కార్యక్రమాన్ని హైటెక్స్, ఆక్వా ఫార్మింగ్ టెక్నాలజీస్ అండ్ సొల్యూషన్స్ (AFTS) సంయుక్తంగా నిర్వహిస్తున్నాయి. డాక్టర్ తరుణ్ శ్రీధర్, మాజీ యూనియన్ సెక్రటరీలతో పాటు పలువురు సీనియర్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్లు ఈ వేడుకలో పాల్గిన్నారు. ఈ సందర్భంగా డా. తరుణ్ శ్రీధర్ మాట్లాడుతూ.. పశుసంపద సరైన గుర్తింపుకు నోచుకోలేదని, భారత్లో ఇప్పటికే చాలామంది గ్రామాల్లోనే నివసిస్తున్నారని తెలిపారు. అసలు పశువులతో సంబంధం లేకుండా ఏ రైతును చూడలేరన్నారు. భారతదేశం గణనీయమైన పశువుల జనాభాను కలిగి ఉందని, ప్రపంచ చేపల ఉత్పత్తి సహా పాల ఉత్పత్తి వినియోగంలో భారత్ ముందుందని పేర్కొన్నారు. ఎల్డిఎఫ్పై అంకితమైన ఎక్స్పో చాలా అవసరం. ఇది త్వరలో ప్రపంచ స్థాయిలో బోస్టన్ సీఫుడ్స్తో సమానంగా ఎదుగుతుందనన్నారు.ఇలాంటి ఎక్స్పోలు మన బలాన్ని ప్రదర్శించడమే కాకుండా విధి విధానాలను నిర్మించే ప్రభుత్వ అధికారులను మేల్కొల్పుతాయని అన్నారు డాక్టర్ తరుణ్ శ్రీధర్. 2022-23లో రికార్డు స్థాయిలో 174 లక్షల టన్నుల చేపల ఉత్పత్తిని సాధించింది. ఇది రూ.63,960 కోట్ల సీఫుడ్ ఎగుమతులను సాధించిందని, ఇంకా, భారతదేశం ప్రపంచంలోనే రెండవ అతిపెద్ద ఆక్వాకల్చర్ ఉత్పత్తిదారు అని భారతదేశంలోని చేపలలో 68% ఆక్వాకల్చర్ రంగం నుండి వస్తుందని తెలిపారు. పశువులు శక్తి. పశువులు ఎల్లప్పుడూ వ్యవసాయంలో అంతర్భాగంగా ఉంటాయి. కానీ ఇది చాలా మంచి సామర్థ్యాన్ని కలిగి ఉన్నప్పటికీ, యువతకు ఆకర్షణీయంగా కనిపించదు. అయితే ప్రపంచం మొత్తం సహజ, సేంద్రియ, పున రుత్పత్తి వ్యవసాయం గురించి మాట్లాడుతున్నందున మంచి రోజులు వచ్చాయి. పశుసంవర్ధక రంగం ఇప్పుడు ఆహార భద్రత నే కాక, పోషకాహార భద్రతగానూ గొప్ప సంభావ్యత కలిగిన చాలా పెద్ద రంగంగా పరిగణించబడుతుంది. ప్రపంచ ఆకలి సూచీలో 121 స్థానాల్లో భారతదేశం 107 స్థానాల్లో ఉన్న నేపథ్యంలో పశు సంపదకు సంబంధించిన ఉత్పత్తులకు ఎక్కువ ప్రాముఖ్యత ఉంది. మాంసం తినే జనాభాలో 70% కంటే ఎక్కువ భారతదేశం. 2050లో 18.1 MT తలసరి మాంసం వినియోగం 13.8 కిలోల అంచనాగా ఉందని NABARD చీఫ్ జనరల్ మేనేజర్ సుశీల చింతల అన్నారు. గోదావరి కట్స్లో 25 కిలోల ఎల్లోఫిన్ ట్యూనా అనే అరుదైన చేపలను ప్రదర్శించారు. ఎల్లోఫిన్ ఆరు లేదా ఏడు సంవత్సరాల వరకు జీవించగలదు. ఇవి అధిక వలసలు, పసిఫిక్, అట్లాంటిక్ -హిందూ మహాసముద్రాల అంతటా కనిపిస్తాయి. ప్రపంచవ్యాప్తంగా అతిపెద్ద జీవరాశి అయిన ఎల్లో ఫిష్ ట్యూనా అంతరించిపోతోంది. భారత ప్రభుత్వంలోని సూక్ష్మ, చిన్న, మధ్యతరహా పరిశ్రమల మంత్రిత్వ శాఖ అదనపు డెవలప్మెంట్ కమీషనర్ డి. చంద్ర శేఖర్ మాట్లాడుతూ.. ''భారతదేశంలో 46 (23 మంది స్థానిక, 23 మంది స్థానికేతర) సూక్ష్మ, చిన్న వ్యాపారవేత్తలు పాల్గొనేందుకు మంత్రిత్వ శాఖ వీలు కల్పించింది. రిటైర్డ్ బ్యూరోక్రాట్ సబ్జెక్ట్ ఎక్స్పర్ట్ అయిన డబ్ల్యువిఆర్ రెడ్డి మాట్లాడుతూ మనమందరం చిన్నతనం నుండే పశువులతో ముడిపడి ఉన్నాం. కానీ మన యువత ఇప్పుడు దానిపై ఆసక్తి చూపడం లేదు. యువతను ఆకర్షించేందుకు వీలుగా ఈ రంగాన్ని బ్లూ కాలర్ లాంటి రంగంగా మార్చాలి. మీరు సాంకేతికతపరమైన ఆవిష్కరణలను తీసుకురావాలని ఆయన పిలుపునిచారు.దళిత బంధు లబ్ధిదారులు కూడా అవకాశాలను అన్వేషించడానికి ఎక్స్పోను సందర్శించాలని ప్లాన్ చేస్తున్నారు. ఎక్స్పోలో కంట్రీ చికెన్ వంటి అనేక స్టాల్స్ ఉన్నాయి. దీనిని ఇద్దరు యువ పారిశ్రామికవేత్తలు సాయికేష్ గౌండ్, మొహమ్మద్ సమీ ఉద్దీన్ స్థాపించారు. ఆధునిక,పరిశుభ్రమైన మాంసం దుకాణాలు అవసరమని చాలా మంది తెలియచేశారు. కూరగాయలకు మంచి, పరిశుభ్రమైన దుకాణాలు ఉన్నప్పటికీ, పరిశుభ్రమైన మాంసం దుకాణాలు ఎక్కువగా కనిపించవు. గడ్డకట్టిన చేపలను కొనడానికి ప్రజలు నిరాకరిస్తారు. ఇప్పుడు అలాంటి పరిస్థితులు అన్నీ క్రమంగా మారుతూ వస్తున్నాయి. అందరూ తమ వ్యాపారాలకి ప్రజలను ఆకర్షించే కొత్త దారులను వెతుకుతున్నారు. -
‘యశోభూమి’కి తరలిరండి
న్యూఢిల్లీ: ప్రపంచంలోనే అతిపెద్ద కన్వెన్షన్ సెంటర్లలో ఒకటైన ఇండియా ఇంటర్నేషన్ కన్వెన్షన్ అండ్ ఎక్స్పో సెంటర్ ‘యశోభూమి’ మొదటి దశను ప్రధాని మోదీ ఆదివారం లాంఛనంగా ప్రారంభించారు. విశ్వకర్మ జయంతి సందర్భంగా ఇదే వేదికపై ‘పీఎం విశ్వకర్మ’ పథకానికి శ్రీకారం చుట్టారు. ఢిల్లీలోని భారత్ మండపం, యశోభూమిలో సకల సౌకర్యాలున్నాయని, వీటిని ఉపయోగించుకోవాలని, ఇక్కడ కార్యక్రమాలు నిర్వహించేందుకు ముందుకు రావాలని సినిమా, టీవీ పరిశ్రమను, అంతర్జాతీయ ఈవెంట్ మేనేజ్మెంట్ కంపెనీలను ప్రధాని ఆహా్వనించారు. పీఎం విశ్వకర్మ పథకంలో సంప్రదాయ వృత్తి కళాకారులకు, కార్మికులకు లబ్ధి చేకూరుతుందని అన్నారు. 18 మంది లబి్ధదారులకు ‘విశ్వకర్మ సర్టిఫికెట్లు’అందజేశారు. వారు ఎలాంటి పూచీకత్తు లేకుండానే తక్కువ వడ్డీకే రూ.3 లక్షలదాకా రుణం పొందవచ్చు. కాన్ఫరెన్స్ టూరిజంకు పెద్దపీట దేశంలో సదస్సుల పర్యాటకానికి ఉజ్వలమైన భవిష్యతు ఉందని మోదీ స్పష్టం చేశారు. యశోభూమి కన్వెన్షన్ సెంటర్ ప్రారం¿ోత్సవంలో ఆయన ప్రసంగించారు. భారత్లో ఈ రంగం విలువ రూ.25,000 కోట్లకుపైగా ఉందన్నారు. అనంతరం ‘యశోభూమి ద్వారక సెక్టార్ 25’మెట్రో రైల్వే స్టేషన్ను మోదీ ప్రారంభించారు. ప్రధాని మోదీకి జన్మదిన శుభాకాంక్షల వెల్లువ ప్రధాని మోదీ 73వ జన్మదినం సందర్భంగా ఆదివారం రాష్ట్రపతి ముర్ము, కేంద్ర మంత్రులు అమిత్ షా, రాజ్నాథ్, ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, బీజేపీ అధ్యక్షుడు జేపీ నడ్డా ఆయనకు శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సందర్భంగా అధికార బీజేపీ ‘సేవా పఖ్వారా’ను ప్రారంభించింది. అక్టోబర్ 2 దాకా ఇది కొనసాగుతుంది. రూ.13 వేల కోట్లతో ‘విశ్వకర్మ’ పథకానికి శ్రీకారం దేశంలో పౌరుల రోజువారీ జీవనంలో విశ్వకర్మల పాత్ర చాలా కీలకమని మోదీ ఉద్ఘాటించారు. ఎంతటి ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం అందుబాటులోకి వచ్చినా సమాజంలో వారి స్థానం చెక్కుచెదరని ప్రశంసించారు. రూ.13,000 కోట్లతో పీఎం విశ్మకర్మ పథకాన్ని అమలు చేస్తామని, సంప్రదాయ వృత్తి కళాకారులకు, కారి్మకులకు అండగా నిలుస్తామని అన్నారు. ఈ పథకంతో వడ్రంగులు, స్వర్ణకారులు, కమ్మరులు, శిల్పకారులు, కుమ్మరులు, దర్జీలు, తాపీ మేస్త్రీలు, రజకులు, క్షురకులు తదితరులకు మేలు జరుగుతుందన్నారు. -
సెప్టెంబర్ 14 నుంచి గ్లోబల్ స్టెయిన్లెస్ స్టీల్ ఎక్స్పో
న్యూఢిల్లీ: స్టెయిన్లెస్ స్టీల్ రంగంలో ఉన్న అవకాశాలు, డిమాండ్పై కంపెనీలు చర్చించనున్నాయి. ముంబైలో సెప్టెంబర్ 14 నుంచి మూడు రోజుల పాటు జరగనున్న ‘గ్లోబల్ స్టెయిన్లెస్ స్టీల్ ఎక్స్పో 2023’ ఇందుకు వేదికగా నిలవనుంది. పరిశ్రమకు చెందిన 500 మందికి పైగా ఇందులో పాల్గొననున్నారు. ఈ వివరాలను విగ్రో కమ్యూనికేషన్స్ అండ్ ఎగ్జిబిషన్స్ (వీసీఈ) ప్రకటించింది. డిమాండ్ను సృష్టించడం, కాలుష్య ఉద్గారాల నియంత్రణ లక్ష్యాలు, కొత్త టెక్నాలజీలపై పరిశోధన, అభివృద్ధి తదితర అంశాలపై స్టెయిన్లెస్ స్టీల్ కంపెనీల ప్రతినిధులు చర్చించనున్నారు. ‘‘భారత్ 5 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా అవతరించే విషయంలో స్టెయిన్లెస్ స్టీల్ కీలక పాత్ర పోషించనుంది. గ్లోబల్ స్టెయిన్లెస్ స్టీల్ ఎక్స్పోలో భాగంగా సీఈవోలతో రౌండ్ టేబుల్, బిజినెస్ టు గవర్నమెంట్ సమావేశాలు జరుగుతాయి. వీటికితోడు పరిశ్రమ తరఫున సాంకేతిక సదస్సులు కూడా ఉంటాయి’’అని వీసీఈ డైరెక్టర్ అనితా రఘునాథ్ తెలిపారు. -
హైదరాబాద్లో అతిపెద్ద అంతర్జాతీయ ప్లాస్టిక్ ఎక్స్పో ప్రారంభం
దేశంలో మూడో అతిపెద్ద ప్లాస్టిక్ ఎక్స్పో హైప్లెక్స్-2023 హైదరాబాద్లో శుక్రవారం (ఆగస్ట్ 4) ప్రారంభమైంది. తెలంగాణ రాష్ట్ర పారిశ్రామిక మౌలిక సదుపాయాల సంస్థ టీఎస్ఐఐసీ ఎండీ, వైస్ చైర్మన్ వెంకట నర్సింహా రెడ్డి ఇతర ప్రముఖులతో కలిసి ప్రారంభించారు. ఆగస్టు 4 నుంచి 7వ తేదీ వరకు నాలుగు రోజుల పాటు నగరంలోని హైటెక్స్లో ఈ ప్రదర్శన జరగనుంది. ఎనిమిది సంవత్సరాల తర్వాత హైప్లెక్స్ అనే పేరుతో దీన్ని ఏర్పాటు చేశారు. ఇంతకుముందు ఐప్లెక్స్గా వ్యవహరించేవారు. ప్రారంభోత్సవ కార్యక్రమానికి ఎంఎస్ఎంఈ డెవలప్మెంట్ అండ్ ఫెసిలిటేషన్ ఆఫీస్ అడిషనల్ డెవలప్మెంట్ కమిషనర్ చంద్ర శేఖర్, హెచ్ఎంఈఎల్ ఎండీ, సీఈవో ప్రభుదాస్, గెయిల్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ శ్రీవాస్తవ, ఇండియన్ ప్లాస్టిక్స్ ఇన్స్టిట్యూట్ నేషనల్ ప్రెసిడెంట్ అనిల్ రెడ్డి వెన్నం, ఎఫ్టీసీసీఐ ప్రెసిడెంట్ మీలా జయదేవ్ గౌరవ అతిథులుగా హాజరై ప్రసంగించారు. షో డైరెక్టరీ, డైలీ షో మ్యాగజైన్ను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా టీఎస్ఐఐసీ ఎండీ, వైస్ చైర్మన్ వెంకట నర్సింహా రెడ్డి మాట్లాడుతూ టీఎస్ ఐపాస్ చట్టం తెలంగాణ ప్రభుత్వ మైలురాయి నిర్ణయమని పేర్కొన్నారు. పరిశ్రమల స్థాపనకు అవసరమైన లైసెన్సుల జారీ ప్రక్రియను ఈ చట్టం వేగవంతం చేస్తోందన్నారు. దీని కింద గత ఎనిమిదిన్నర సంవత్సరాలలో 24000 పరిశ్రమ ప్రతిపాదనలను ఆమోదించినట్లు చెప్పారు. మొదటి ప్లాస్టిక్ పార్క్ విజయవంతమైందని, రెండోది కావాలన్నా భూమి ఇచ్చేందుకు టీఎస్ఐఐసీ సిద్ధంగా ఉందని తెలిపారు. దాదాపు 20,000 చదరపు మీటర్ల విస్తీర్ణంలో ఏర్పాటు చేసిన ఈ ఎక్స్పోలో ప్రపంచవ్యాప్తంగా 400 సంస్థలు తమ ఉత్పత్తులను ప్రదర్శిస్తున్నాయి. తెలంగాణ అండ్ ఆంధ్రా ప్లాస్టిక్స్ మ్యాన్యుఫ్యాక్చరర్స్ అసోసియేషన్ (టాప్మా) ఆధ్వర్యంలో నాలుగు రోజుల పాటు నిర్వహించనున్న ఈ ప్రదర్శనలో రూ.500 కోట్ల మేర వ్యాపారం జరుగుతుందని అంచనా వేస్తున్నట్లు తాప్మా అధ్యక్షుడు విమలేష్ గుప్తా తెలిపారు. -
రియల్ రంగంలో హైదరాబాద్ టాప్
మాదాపూర్: రియల్ ఎస్టేట్ రంగం హైదరాబాద్లో శరవేగంగా అభివృద్ధి చెందుతోందని తెలంగాణ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్కుమార్ తెలిపారు. మాదాపూర్లోని హైటెక్స్లో శనివారం రెండు రోజుల పాటు నిర్వహించనున్న టైమ్స్ ప్రాపర్టీ హైదరాబాద్ ప్రాపర్టీ ఎక్స్పో–2022ను ఆయన నిర్వాహకులతో కలసి ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ రెరా(తెలంగాణ రియల్ ఎస్టేట్ రెగ్యులేటరీ అథారిటీ) ను ప్రారంభించినప్పటి నుంచి 5299 కంటే ఎక్కువ రిజిస్ట్రేషన్లను తెలంగాణ ప్రభుత్వం క్లియర్ చేసిందన్నారు. ప్రస్తుతం దేశంలో ఐదవ స్థానంలో ఉన్నామని, అతి త్వరలో మరింత ఉన్నత స్థానాన్ని చేరుకుంటామని చెప్పారు. నగరంలో నిరంతరం విద్యుత్ సదుపాయం ఉండడంతో ఇన్వర్టర్లు, జనరేటర్ల వ్యాపారం అంతరించిపోయిందని ఆయన వ్యాఖ్యానించారు. తెలంగాణలో నిరంతరం అభివృద్ధి పనులు జరుగుతుండటంతో రియల్ రంగంలో హైదరాబాద్ టాప్గా నిలవనుందని చెప్పారు. కార్యక్రమంలో ఏఎస్బీఎల్ సీఈఓ అజితేష్ కొరుపోలు, మ్యాండేట్ ఎండీ బిస్వజిత్ పట్నాయక్, రాంకీ ఎండీ నందకిషోర్, కాన్సెప్ట్ అంబెన్స్ డైరెక్టర్ ముకుల్ అగర్వాల్, క్రెడాయ్ రాంరెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
శివానంద ‘యోగ’
-
80 బిలియన్ డాలర్లకు ‘బయో–ఎకానమీ’
న్యూఢిల్లీ: దేశాన్ని వృద్ధి బాటలో నడిపే క్రమంలో ప్రతీ రంగానికి తోడ్పాటు అందించాలని తమ ప్రభుత్వం విశ్వసిస్తుందని ప్రధాని నరేంద్ర మోదీ తెలిపారు. గతంలో కొన్ని రంగాలకు మాత్రమే ప్రాధాన్యం లభించేదని, తమ ప్రభుత్వ హయాంలో అన్ని పరిశ్రమలను ప్రోత్సహిస్తున్నామన్నారు. ఈ నేపథ్యంలోనే గత ఎనిమిదేళ్లలో భారత ’బయో–ఎకానమీ’ ఎనిమిది రెట్లు పెరిగిందని, 10 బిలియన్ డాలర్ల నుంచి 80 బిలియన్ డాలర్లకు చేరిందని ప్రధాని పేర్కొన్నారు. బయోటెక్ వ్యవస్థలో టాప్ 10 దేశాల్లో భారత్ కూడా ఒకటిగా నిలిచే రోజు ఎంతో దూరం లేదన్నారు. బయోటెక్ స్టార్టప్ ఎక్స్పోను గురువారం ప్రారంభించిన సందర్భంగా ఆయన ఈ విషయాలు తెలిపారు. గడిచిన ఎనిమిదేళ్లలో దేశీయంగా అంకుర సంస్థల సంఖ్య వందల స్థాయి నుంచి 60 పైగా పరిశ్రమల్లో 70,000 పైచిలుకు చేరిందని మోదీ చెప్పారు. కొన్ని రంగాల ఎగుమతులు రికార్డు స్థాయికి చేరాయని పేర్కొన్నారు. ’బయోటెక్ స్టార్టప్స్ ఆవిష్కరణలు: స్వావలంబన భారత్ సాధన దిశగా’ అంశంపై ఈ ఎక్స్పో సదస్సు రెండు రోజుల పాటు (జూన్ 9, 10) జరుగుతుంది. ఔత్సాహిక వ్యాపారవేత్తలు, ఇన్వెస్టర్లు, పరిశ్రమ దిగ్గజాలు, శాస్త్రవేత్తలు, పరిశోధకులు, తయారీదారులు మొదలైన వారం తా కలిసేందుకు ఇది వేదికగా నిలవగలదని ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. -
120 ఎగ్జిబిటర్లు..500 బ్రాండ్లు, ప్రారంభమైన ఇంటీరియర్ ఎక్స్పో!
సాక్షి, హైదరాబాద్: ప్రస్థుతం ఇంటీరియర్ డిజైనింగ్ విభాగం ఎంతో అభివృద్ధి చెందినదని, ఇందులో భాగం గా స్థానిక కళాకారుల నుంచి సేకరించిన కళాఖండాలతో డిజైన్లను రూపొందిస్తే అన్ని రకాల కళలు ప్రయోజనం పొందుతాయని తెలంగాణ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేష్ కుమార్ తెలిపారు. ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఇండియన్ ఇంటీరియర్ డిజైనర్స్ (ఐఐఐడి) హైదరాబాద్ ప్రాంతీయ విభాగం ఆధ్వర్యంలో శుక్రవారం హైటెక్స్ ఎగ్జిబిషన్ సెంటర్ వేదికగా ‘‘ఐఐఐడి షోకేస్ ఇన్సైడర్ ఎక్స్ 2022’’ నాల్గవ ఎడిషన్ను ఏర్పాటు చేశారు. తెలంగాణ ఆర్ట్ అండ్ క్రాఫ్ట్ ఇతివృత్తంతో 3 రోజుల పాటు ఈ ప్రదర్శన జరగనుంది. ఈ సందర్భంగా సీఎస్ సోమేష్ మాట్లాడుతూ., ప్రదర్శనలో ఏర్పాటు చేసిన ప్రతి స్టాల్ ఆసక్తికరంగా ఉందని, ఇంటీరియర్ డిజైనింగ్ రంగంలో జరుగుతున్న అభివృద్ధి గురించి మరింత తెలుసుకోవాలనే కుతూహలాన్ని పెంచిందని అన్నారు. ఈ ఎగ్జిబిషన్లో కళారూపాల్లో భాగంగా స్థానికంగా ప్రాచూర్యం పొందిన కళలను చేరదీయడం, ఇక్కడి ముడిసరుకు, కళాకారులను చేర్చుకోవడం అభినందనీయమని అన్నారు. హస్తకళాకారులు ఇతర కళలకు మరింత గుర్తింపు తీసుకురావడానికి ఆర్కిటెక్ట్లు, ఇంటీరియర్ డిజైనర్లు మరింత చొరవ చూపాలని సూచించారు. గతంలో తాను అనంతపురం జిల్లా కలెక్టర్గా ఉన్నప్పుడు ఆ జిల్లాలో తోలుబొమ్మలాటలో నిమగ్నమైన హస్తకళాకారుల అభివృద్ధికి కృషి చేశానని పేర్కొన్నారు. ఈ ఎక్స్పోలో ఫర్నిచర్, నిర్మాణాల కోసం వెదురు వంటి ప్రత్యామ్నాయ వస్తువులను ఉపయోగించడం వినూత్నంగా ఉందని అన్నారు. ప్రతిష్టాత్మకంగా ఏర్పాటు చేసిన ఈ ప్రదర్శన ఆర్కిటెక్ట్లు, ఇంటీరియర్ డిజైనర్లు, ఎగ్జిబిటర్లకే కాకుండా సాధారణ ప్రజలకూ మరింత ఆసక్తిని పెంపొందిస్తుందని పేర్కొన్నారు. ఐఐఐడి హెచ్ఆర్సి, చెర్మైన్ మనోజ్ వాహి మాట్లాడుతూ., కరోనా మహమ్మారి ఇబ్బంది పెట్టినా ఇంటీరియర్ డిజైనింగ్ పరిశ్రమ వేగంగా అభివృద్ధి చెందుతున్నదని అన్నారు. వినియోగదారులు, డిజైనర్ల నుంచి పెరుగుతున్న డిమాండ్ను దృష్టిలో పెట్టుకుని వీరందరినీ ఒకచోటుకు చేర్చడానికి ఐఐఐడి ఈ వేదికను ఏర్పాటు చేసిందని తెలిపారు. ఇందులో 120 ఎగ్జిబిటర్లు, యైభైకు పైగా కేటగిరీల నుంచి 500 బ్రాండ్లు పాల్గొన్నాయని అన్నారు. చేర్యాల్, పోచంపల్లి, పెంబర్తి నుంచి వచ్చిన కళాకారులు వర్క్షాప్లు నిర్వహిస్తుండగా, అనంతపురం నుంచి వచ్చిన కళాకారులచే తోలుబొమ్మలాట ప్రదర్శిస్తున్నారని, ఇందులో భాగంగా ఆర్కిటెక్చర్, ఇంటీరియర్ డిజైనింగ్ కాలేజీల భాగస్వామ్యాన్ని తీసుకున్నామని అన్నారు. ఈ కార్యక్రమంలో ఐఐడి–హెచ్ఆర్సి కోశాధికారి ఎఆర్. రాకేష్ వాసు, చీహైదరాబాద్ చాప్టర్ కార్యదర్శి ఎఆర్. ప్రవీణ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు. -
ఏపీ పెవిలియన్ను అట్టహాసంగా ప్రారంభించిన మంత్రి గౌతమ్రెడ్డి
-
అవకాశాలున్నాయ్.. అందిపుచ్చుకోండి
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో పారిశ్రామిక రంగానికి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి పెద్ద పీట వేస్తున్నారని రాష్ట్ర పరిశ్రమల శాఖ మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి చెప్పారు. ముఖ్యంగా వైద్యం, వ్యవసాయ రంగాలకు సీఎం అత్యంత ప్రాధాన్యతనిస్తున్నారని తెలిపారు. ఈ అవకాశాన్ని వినియోగించుకొని రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టాలని పారిశ్రామికవేత్తలకు పిలుపునిచ్చారు. పారిశ్రామిక మౌలిక వసతుల కల్పనలో రాష్ట్ర ప్రభుత్వం ముందుందని తెలిపారు. రాష్ట్రంలో మూడు పోర్టులు, 9 ఫిషింగ్ హార్బర్లు, నాలుగు లాజిస్టిక్ పార్కులను అభివృద్ధి చేస్తోందన్నారు. రాష్ట్రం నుంచి వెళుతున్న మూడు పారిశ్రామిక కారిడార్లలో పెద్ద ఎత్తున మౌలిక వసతులు కల్పిస్తోందని తెలిపారు. రాష్ట్రంలో పెట్టుబడుల అవకాశాలను వివరిస్తూ దుబాయ్ ఎక్స్పోలో ఏర్పాటు చేసిన ఏపీ పెవిలియన్ను యూఏఈ విదేశాంగ శాఖ మంత్రి తనిబిన్ అహ్మద్ ఆల్ జియాది, ఇండియాలో సౌదీ అరేబియా అంబాసిడర్ అహ్మద్ అబ్దుల్ రెహమాన్, యూఏఈలో భారత దౌత్యాధికారి సంజయ్ సుధీర్, రాష్ట్ర విదేశీ పెట్టుబడుల సలహాదారు జుల్ఫీలతో కలిసి మంత్రి మేకపాటి లాంఛనంగా ప్రారంభించారు. రాష్ట్రంలో పెట్టుబడులకు ఉన్న అవకాశాలను వివరిస్తూ 12 థీమ్లతో ఏపీ పెవిలియన్ ఏర్పాటు చేశారు. ఘనంగా జరిగిన ఈ కార్యక్రమంలో మంత్రి మాట్లాడుతూ ఇప్పటికే యూఏఈకి చెందిన అల్లానా గ్రూపు రాష్ట్రంలో ఫుడ్ ప్రాసెసింగ్ రంగంలో పెట్టుబడులు పెట్టిందని తెలిపారు. ఇదే విధంగా మరిన్ని కంపెనీలు ముందుకు రావాలని కోరారు. దుబాయ్ ఎక్స్పో సందర్భంగా ఆటోమొబైల్, టెక్స్టైల్, ఇన్ఫ్రా, స్కిల్, పెట్రోకెమికల్స్, ఎలక్ట్రిక్ వెహికల్స్ వంటి రంగాల్లో పెట్టుబడులపై దృష్టి సారించినట్లు తెలిపారు. ఏపీ పెవిలియన్కు మంచి స్పందన వస్తోందని, ఇప్పటికే 12 సంస్థలు రాష్ట్రంలో పెట్టుబడి అవకాశాలపై చర్చించడానికి ఆసక్తిని వ్యక్తం చేసినట్లు తెలిపారు. ఈ ఎక్స్పోలోనే మూడు భారీ పెట్టుబడులపై ఒప్పందాలు కుదిరే అవకాశం ఉందన్నారు. రాష్ట్రంలో ఐటీ, ఫైనాన్షియల్ సేవల రంగంలో పెట్టుబడులు పెట్టాలని కోరారు. ఏపీఐఐసీ చైర్మన్ మెట్టు గోవిందరెడ్డి, వైస్ చైర్మన్, ఎండీ జవ్వాది సుబ్రమణ్యం, ఏపీ మారిటైమ్ డిప్యూటీ సీఈవో రవీంద్రనాథ్ రెడ్డి, , కర్నూలు ఎమ్మల్యే హఫీజ్ ఖాన్ తదితరులు పాల్గొన్నారు -
చల్లని సాయంత్రం సరదాగా కాసేపు.. రండి ఎక్స్పో పోదాం.. ఎంజాయ్ చేద్దాం
-
ఎగ్జిబిషన్ను ప్రారంభించిన అందాల అనన్య
-
బిజినెస్ ఉమెన్ ఎక్స్ పో
-
ఎక్స్పో.. నెక్ట్స్ షో..
-
సర్వం ‘మహిళ’మయం...
కళకళలాడే డిజైనర్ దుస్తులు, ఆభరణాలు, చేనేత కళలు, మ్యూరల్ ఆర్ట్, యాక్సెసరీస్ వెరసి మహిళల కోసం కొలువుదీరే ఎక్స్పోల డిమాండ్ అంతా ఇంతా కాదు. పదేళ్ల క్రితం సంపన్నులకు మాత్రమే పరిచయమున్న ఎక్స్పోలు ట్రెండ్జ్ పేరుతో సిటీకి చెందిన శాంతి కతిరావన్ మధ్యతరగతికి చేరువ చేశారు. నిర్వహణలో సృజనాత్మక పోకడలకు నాంది పలికి, 130 పైగా ట్రేడ్ ఎక్స్పోలను నిర్వహించిన ఏకైక తెలుగు మహిళగా నిలిచారు. ఎక్స్పోల నిర్వహణ కోసం ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ ఏర్పాటుతో ట్రెండ్కు తెరతీశారు.విభిన్న కళల సమాహారమైన డిజైనర్ ఎక్స్పోట్రెండ్జ్ ప్రదర్శనతాజ్కృష్ణా హోటల్లోనిర్వహిస్తున్న సందర్భంగా ఆమె పంచుకున్నవిశేషాలు ఆమె మాటల్లోనే... సాక్షి, సిటీబ్యూరో :ఎంబీఏ కంప్లీట్ చేసి, బ్యాంక్లో ఉద్యోగం చేస్తూ బాబు పుట్టాక బ్రేక్ తీసుకున్నాను. ఆ బ్రేక్లో సరదాగా 2010 డిసెంబరులో విశాఖలోని ఫారŠూచ్యన్ శ్రీకన్య హోటల్లో ‘ట్రెండ్జ్’ స్టార్ట్ చేశా. అది విజయవంతం అయింది. 2011 జనవరిలో సిటీలో తొలి ఎక్స్పో శ్రీనగర్కాలనీలోని సత్యసాయి నిగమాగమంలో చేశాను. ఏడాది పాటు హాబీగా చేసినా తర్వాత దీన్ని పూర్తిస్థాయిలో టేకప్ చేశా. అప్పట్లో స్టార్ హోటల్స్కి మహిళలు ఒంటరిగా రావడానికి ఇబ్బంది పడే విశాఖ, విజయవాడల్లో ఎక్స్పో పరిచయం చేసింది నేనే. సర్వం ‘మహిళ’మయం... కలలు కనడంలోనే కాదు కళలను పసిగట్టడంలోనూ మహిళలే ముందుంటారు. ఉదాహరణకు కంచి పట్టు చాలా ఫేమస్...కానీ చీరాల పట్టు కూడా అంతే నాణ్యంగా ఉంటుంది. కుప్పడం వర్క్ మరింత అందుబాటు ధరలో ఉంటుంది. దాన్ని మహిళలు చక్కగా గమనించగలరు అందుకే సిటీలో ఈ వర్క్కు ఆదరణ ఎక్కువ. గతంతో పోలిస్తే ఇప్పుడు చేనేత, హస్తకళాకారుల వర్క్కు డిమాండ్ బాగా ఉంది అయితే కళ చేతిలో ఉన్నా వీవర్స్కి వ్యాపార మెళకువలు తెలియడం లేదు. కంచి, చీరాల కుప్పడం, గద్వాలకు చెందిన హస్తకళాకారుల వర్క్స్కి బాగా డిమాండ్ ఉంది. మనం ఎంత గొప్ప వర్క్ సృష్టించామనేది ఎంత ముఖ్యమో దాన్నెంత బాగా వినియోగదారుని దగ్గరకు చేర్చగలమనేది కూడా అంతే ముఖ్యం. ఉత్తర భారతదేశం నుంచి వచ్చే డిజైనర్లు, ఆర్టిజన్స్ విక్రయశైలి వల్ల వారికి స్పందన బాగా లభిస్తుంది. ఎక్స్పో వర్సెస్ షోరూమ్ ఎగ్జిబిషన్లో ప్రతి కస్టమర్కి రెడ్ కార్పెట్ పరుస్తాం. షోరూమ్స్లో ఎవరో ఒక కస్టమర్ రిలేషన్ ఆఫీసర్ని సంప్రదిస్తాం. ఇక్కడ తయారీదారులు/కస్టమర్లు ప్రత్యక్షంగా కలుస్తారు. అంతేకాదు మార్కెట్ కన్నా ముందు ఇక్కడ అందుబాటులోకి వస్తాయి. ఇప్పుడు షోరూమ్ల తరహాలోనే ఎక్స్పోలలో కూడా రూ.1500 నుంచీ ఉత్పత్తులు లభిస్తున్నాయి. దక్షిణాది వ్యాప్తంగా... తొలుత ఏడాదికి మూడు సార్లు చేసేవాళ్లం. సిటీలో ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ ఏర్పాటు చేసి ఇప్పుడు మన సిటీలోనే 20దాకా,అలాగే దక్షిణాది మొత్తం చేస్తున్నా.. కోయంబత్తూర్, కొచ్చిలో కూడా ఆఫీస్లు స్టార్ట్ చేశాం. భవిష్యత్తులో వైవిధ్యభరితమైన ఎక్స్పోలు నిర్వహించాలని ఉంది. -
షోయగం
-
‘ది హాత్’ షురూ
-
బుల్లితెర నటి నవ్య నవ్వు
-
రుపే కార్డుతో జాకెట్ కొనుగోలు చేసిన ప్రధాని
అహ్మదాబాద్ : ప్రధాని నరేంద్ర మోదీ గురువారం అహ్మదాబాద్ షాపింగ్ ఫెస్టివల్లో జాకెట్ను కొనుగోలు చేసి తన రుపే కార్డు ద్వారా చెల్లింపులు జరిపారు. షాపింగ్ ఫెస్టివల్లో కలియతిరిగిన ప్రధాని తనకు ఇష్టమైన ఖాదీ జాకెట్లను విక్రయించే కేవీఐబీ స్టాల్ వద్ద ఆగారు. తాను నిత్యం ధరించే జాకెట్ను ఆ స్టాల్లో నుంచి ఒకటి ఎంపిక చేసుకుని నేరుగా రుపే డెబిట్ కార్డు ద్వారా డిజిటల్ పద్ధతిలో బిల్లు చెల్లించారు. ఏటా జరిగే వైబ్రాంట్ గుజరాత్లో భాగంగా అహ్మదాబాద్ షాపింగ్ ఫెస్టివల్ను గుజరాత్ ప్రభుత్వం నిర్వహిస్తోంది. రాష్ట్రవ్యాప్తంగా వ్యాపారులు తమ ఉత్పత్తులతో ఈ ప్రదర్శనలో పాల్గొంటారు. 12 రోజుల పాటు జరిగే ఈ షాపింగ్ ఫెస్టివల్లో 15,000 మంది దుకాణదారులు, విక్రేతలు, తయారీదారులు పాల్గొని తమ ఉత్పత్తులను అమ్మకానికి ఉంచుతారు. పలు ఉత్పత్తులపై 60 శాతం వరకూ డిస్కాంట్లను వారు ఆఫర్ చేస్తున్నారు. -
కఠిన నిర్ణయాలుంటాయ్!
న్యూఢిల్లీ: జాతీయ ప్రయోజనాల రీత్యా కఠిన నిర్ణయాలు కొనసాగుతాయని ప్రధాని మోదీ స్పష్టం చేశారు. 2022 నాటికి దేశ ఆర్థిక వ్యవస్థ పరిమాణం రెట్టింపై 5 ట్రిలియన్ డాలర్లకు చేరుకుంటుందని ధీమా వ్యక్తం చేశారు. ఇందులో తయారీ, వ్యవసాయ రంగాల వాటా చెరో ట్రిలియన్ డాలర్ల వరకు ఉండొచ్చని అభిప్రాయపడ్డారు. మోదీ గురువారం ఢిల్లీలో ఇండియా ఇంటర్నేషనల్ కన్వెన్షన్ అండ్ ఎక్స్పో సెంటర్(ఐఐసీసీ)కు శంకుస్థాపన చేసిన అనంతరం మాట్లాడుతూ.. ఈ సెంటర్ భవిష్యత్లో పరిశ్రమలు, స్టార్టప్లకు కేంద్రంగా నిలుస్తుందని, 5 లక్షల కొత్త ఉద్యోగాలు సృష్టించేందుకు దోహదపడుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. ఐటీ, రిటైల్ రంగాల్లో ఉద్యోగ కల్పన శరవేగంగా పెరుగుతున్న దృష్ట్యా వృద్ధిరేటు 8 శాతం దాటుతుందని పేర్కొన్నారు. దేశ సూక్ష్మ ఆర్థిక మూలాలు పటిష్టంగా ఉన్నాయని చెప్పారు. మేకిన్ ఇండియా, జీఎస్టీ తదితర సంస్కరణలను ఈ సందర్భంగా ప్రస్తావించారు. అన్ని ప్రభుత్వ బ్యాంకులు అవసరమా?.. ప్రపంచవ్యాప్తంగా ఎన్నో సవాళ్లు ఎదురవుతున్నా భారత ఆర్థిక వ్యవస్థ బలం పుంజుకుంటోందని మోదీ అన్నారు. ప్రజా ప్రయోజనాల దృష్ట్యా కొన్ని కఠిన నిర్ణయాలు తీసుకున్నామని, భవిష్యత్తులోనూ అలాంటి చర్యలు కొనసాగుతాయన్నారు. మన ఆర్థిక వ్యవస్థ దశాబ్ద కాలంలో 10 ట్రిలియన్ డాలర్లకు చేరుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. దేనా బ్యాంకు, విజయా బ్యాంకు, బ్యాంక్ ఆఫ్ బరోడాల విలీనాన్ని ప్రస్తావిస్తూ..డజన్ల కొద్దీ ప్రభుత్వ బ్యాంకుల అవసరం ఏముందని ప్రశ్నించారు. బ్యాంకుల విలీనంపై చాలా ఏళ్లుగా చర్చ నడుస్తున్నా తమ ప్రభుత్వ హయాంలోనే ఈ దిశగా ముందడుగు పడిందని తెలిపారు. మేకిన్ ఇండియా పథకంతో భారత్ మొబైల్ పరిశ్రమకు కేంద్రంగా మారిందని, 4–5 లక్షల మంది యువతకు ఉపాధి దొరకడంతో పాటు రూ.3 లక్షల కోట్ల విలువైన విదేశీ మారక నిల్వలు ఆదా అయ్యాయని తెలిపారు. సులభతర వాణిజ్య విధానాలను ప్రోత్సహించడానికి జిల్లాస్థాయి ప్రణాళికలు రూపొందిస్తున్నామని చెప్పారు. 221.37 ఎకరాల విస్తీర్ణంలో ఐఐసీసీని రూ.25,703 కోట్లతో నిర్మించనున్నారు. 11 వేల మంది కూర్చునే సామర్థ్యం గల కన్వెన్షన్, ఎగ్జిబిషన్, స్టార్ హోటళ్లు తదితర వాణిజ్య కేంద్రాలకు ఇందులో చోటు కల్పించనున్నారు. మోదీని కలసిన ఆశా కార్యకర్తలు.. దేశం నలుమూలల నుంచి వచ్చిన 90 మంది ఆశా కార్యకర్తలతో మోదీ ముచ్చటించారు. తమ గౌరవ వేతనాలు పెంచడంతో పాటు ఉచిత బీమా సదుపాయం కల్పించినందుకు వారు ప్రధానికి కృతజ్ఞతలు తెలిపారు. ఇటీవల ఆశా, అంగన్వాడీ కార్యకర్తలతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా తాను జరిపిన సంభాషణను మోదీ గుర్తు చేసుకున్నారు. ఆశా కార్యకర్తల సేవలు, అంకితభావాన్ని కొనియాడిన మోదీ..కాలా అజార్ వ్యాధి నిర్మూలనకు వారు చేసిన కృషిని బిల్ గేట్స్ ఫౌండేషన్ ప్రశంసించిందని అన్నారు. గ్రామీణ ప్రజల జీవన ప్రమాణాలు పెంచేందుకు ఇతర ప్రభుత్వ సంస్థలతో కలసి పనిచేయాలని సూచించారు. పేదరిక నిర్మూలనకు కేంద్ర ప్రభుత్వ పథకాలు ఎలా ఉపయోగపడుతున్నాయో వివరించారు. మెట్రోలో మోదీ.. కన్వెన్షన్ సెంటర్ శంకుస్థాపన కార్యక్రమంలో పాల్గొనేందుకు మోదీ ఢిల్లీలోని ధౌలాకువాన్ నుంచి ద్వారకా వరకు మెట్రో రైలులో ప్రయాణించారు. ఈ ప్రయాణం సుమారు 18 నిమిషాలు సాగిందని అధికారిక వర్గాలు తెలిపాయి. ఈ సందర్భంగా ప్రయాణికులు మోదీతో సెల్ఫీలు దిగేందుకు ఉత్సాహం చూపారు. కార్యక్రమం ముగిసిన తరువాత మోదీ మళ్లీ మెట్రో రైలులోనే తిరుగు ప్రయాణమయ్యారు. ప్రముఖుల రాకపోకలతో రోడ్లపై ట్రాఫిక్ సమస్య తలెత్తకుండా మోదీ తరచూ మెట్రోరైలు సేవలను వినియోగించుకుంటున్నారు. -
హైటెక్ సిటీలో 7వ కేబుల్ ఎక్స్పో విజన్
-
ఫైనాన్స్ కమిషన్పై అనుమానాలొద్దు
సాక్షి ప్రతినిధి, చెన్నై/తిరువిడందై: 15వ ఆర్థికసంఘం నిబంధనలు కొన్ని రాష్ట్రాలకు వ్యతిరేకంగా ఉన్నాయంటూ వస్తున్న ఆరోపణలను ప్రధాని నరేంద్ర మోదీ ఖండించారు. కొందరు స్వార్థ ప్రయోజనాల కోసమే ఈ అంశాన్ని రాద్ధాంతం చేస్తున్నారని మండిపడ్డారు. జనాభా నియంత్రణకోసం పనిచేస్తున్న రాష్ట్రాలకు ప్రోత్సాహకాలివ్వాలంటూ కేంద్రమే ఆర్థిక సంఘానికి సూచించిందని గురువారం చెన్నైలో వెల్లడించారు. ఇటీవల కేరళలో దక్షిణాది రాష్ట్రాల ఆర్థిక మంత్రుల సమావేశంలో.. కేంద్రంపై విమర్శలు చేసిన నేపథ్యంలో మోదీ ఈ వివరణనిచ్చారు. అంతకుముందు, కాంచీపురం జిల్లా మహాబలిపురం సమీపం తిరువిడందైలో డిఫెన్స్ ఎక్స్పోను మోదీ లాంఛనంగా ప్రారంభించారు. భారత సాయుధ దళాలను మరింత బలోపేతం చేసేందుకే దేశాన్ని రక్షణ రంగ తయారీ కేంద్రంగా మార్చే దిశగా కృషిచేస్తున్నట్లు తెలిపారు. శాంతి, సామరస్యాల్లో ప్రపంచ దేశాలకు భారత్ ఒక ఆదర్శమని, అలాగని సమరానికి సన్నద్ధంగా రక్షణశాఖను బలోపేతం చేసుకోవడంలో తప్పులేదన్నారు. కాగా, కావేరీ బోర్డు ఏర్పాటుపై కేంద్రం ఇంతవరకు స్పందించకపోవటంతో ఈ పర్యటనలో తమిళులు మోదీకి నల్లజెండాలతో నిరసన తెలిపారు. మరోవైపు, విపక్షాలు పార్లమెంటు కార్యక్రమాలను జరగనివ్వకపోవటానికి నిరసనగా బీజేపీ ఎంపీలు దేశవ్యాప్తంగా గురువారం ఉపవాస దీక్ష చేపట్టారు. ప్రధాని మోదీ కూడా ఈ దీక్షలో ఉంటూనే తమిళనాడులో పర్యటించారు. తమిళనాడుకు లాభమే: మోదీ కేరళలో ఇటీవల జరిగిన భేటీలో కేరళ, కర్ణాటక, ఏపీ, పుదుచ్చేరి రాష్ట్రాల ప్రతినిధులు పాల్గొని.. 15వ ఆర్థిక సంఘం నిబంధనలు సమాఖ్య స్ఫూర్తికి విఘాతం కలిగిస్తున్నాయని విమర్శించారు. 1971 జనాభా లెక్కల ప్రకారం కాకుండా.. 2011 జనగణనను ప్రాతిపదికగా తీసుకోవటం వల్ల జనాభా నియంత్రణ పాటిస్తున్న రాష్ట్రాలకు కేంద్ర నిధుల్లో అన్యాయం జరుగుతోందన్నారు. అయితే.. ఈ సమావేశానికి తమిళనాడు హాజరుకాకపోయినా.. 2011 జనాభా లెక్కలను ఆధారంగా తీసుకోవటం ద్వారా కేంద్ర పన్ను ఆదాయం కేటాయింపులో రాష్ట్రానికి అన్యాయం జరుగుతోందని విమర్శించింది. అయితే ఈ నిబంధనల ద్వారా తమిళనాడు వంటి రాష్ట్రాలకు మేలే జరుగుతుందని గురువారం నాటి కార్యక్రమంలో ప్రధాని పేర్కొనటం గమనార్హం. ‘15వ ఆర్థిక సంఘాన్ని అడ్డంపెట్టుకుని ఓ ప్రాంతం, ఓ రాష్ట్రానికి అన్యాయం జరుగుతోందంటూ జరుగుతున్న దుష్ప్రచారం అర్థరహితం. సబ్కా సాథ్, సబ్కా వికాస్ మా మంత్రం. మనమంతా కలసి నవభారత నిర్మాణానికి పనిచేయాలి. స్వాతంత్య్ర సమరయోధులు గర్వపడేలా చేయాలి’ అని మోదీ పేర్కొన్నారు. యూపీఏ విధానాల వల్లే.. దేశ సరిహద్దులను కాపాడుకోవటంలో ప్రభుత్వానికి ఉన్న చిత్తశుద్ధే పొరుగుదేశాలతో శాంతి నెలకొల్పటంలోనూ ఉందని మోదీ స్పష్టం చేశారు. తమిళనాడులోని ఈ కార్యక్రమంలో పలు స్వదేశీ, విదేశీ రక్షణ రంగ తయారీ సంస్థలు పాల్గొన్నాయి. గత యూపీఏ ప్రభుత్వం అనుసరించిన విధానాల వల్ల దేశంలో రక్షణ రంగం చతికిలబడిందని మోదీ విమర్శించారు. దీని మూలంగా భారత మిలటరీ యుద్ధ సంసిద్ధతపై ప్రభావం పడిందన్నారు. ‘నాటి రాజకీయ అచేతనం కారణంగా దేశంలో అత్యంత కీలకమైన రక్షణ సంసిద్ధత మూలనపడింది. వారి సోమరితనం, అసమర్థత, బయటకు కనిపించని ఉద్దేశాల కారణంగా జరిగిన నష్టాన్ని మనం చూశాం. గత ప్రభుత్వం పరిష్కరించాల్సిన చాలా సమస్యలను ఇప్పుడు మేం పరిష్కరిస్తున్నాం’ అని మోదీ పేర్కొన్నారు. ‘ప్రపంచ శాంతి, ఐకమత్యం, సామరస్యం కోసం భారత్ ఎప్పుడూ త్యాగం చేస్తూనే ఉంది. 2వ ప్రపంచ యుద్ధంలో భారత సైనికుల త్యాగాలను గుర్తుచేసుకోండి. వేల ఏళ్ల భారత చరిత్రను చూసుకోండి. మా దేశం ఎప్పుడూ సామ్రాజ్యకాంక్షతో ఇతర దేశాలపై దండెత్తలేదు. రాజ్యాలను, దేశాలను గెలవటం కంటే ప్రజల మనసులు గెలవటాన్నే మేం విశ్వసిస్తాం. వైదిక కాలం నుంచి శాంతి, సోదరభావం వంటి సందేశాలను ప్రపంచానికి ఇచ్చిన పుణ్యభూమి ఇది’ అని మోదీ పేర్కొన్నారు. ఎగుమతిచేసే సామర్థ్యానికి.. ‘2014 మేలో రక్షణ రంగ ఎగుమతుల అనుమతుల సంఖ్య 118 అని.. దీని విలువ దాదాపు రూ.3,767 కోట్లు. కానీ మేమొచ్చాక నాలుగేళ్ల లోపలే 794 ఎగుమతుల అనుమతులిచ్చాం. వీటి విలువ దాదాపు రూ.84వేల కోట్లు. రక్షణ రంగ సేకరణ విధివిధానాలను కూడా ఇరువర్గాలకు మేలు చేసేలా సమీక్షించాం. స్వదేశీయంగా రక్షణ రంగ పరిశ్రమ వృద్ధి చెందాలనేదే మా లక్ష్యం’ అని ప్రధాని పేర్కొన్నారు. దేశ ఆర్థికాభివృద్ధిలో రక్షణశాఖ పరికరాల ఉత్పత్తుల పరిశ్రమలది ప్రధానపాత్ర అన్న మోదీ.. ఈ రంగంలో దిగుమతుల నుంచి ఎగుమతి చేయగల సామర్థ్యాన్ని సాధించామన్నారు. ఈ కార్యక్రమంలో రక్షణ మంత్రి నిర్మలా సీతారామన్, తమిళనాడు గవర్నర్ బన్వరీలాల్ పురోహిత్, ముఖ్యమంత్రి పళనిస్వామి, డిప్యూటీ సీఎం పన్నీర్ సెల్వంతోపాటు వివిధ దేశాల ప్రతినిధులు పాల్గొన్నారు. తమిళనాట ‘గోబ్యాక్ మోదీ’ చెన్నై: ప్రధాని మోదీ ఒక రోజు పర్యటన సందర్భంగా తమిళనాడులో తీవ్ర నిరసనలు వ్యక్తమయ్యాయి. కావేరి బోర్డు ఏర్పాటు చేయాలన్న డిమాండ్పై కేంద్ర వైఖరికి నల్లజెండాలతో నిరసన తెలిపారు. గోబ్యాక్ మోదీ అని రాసి ఉన్న బెలూన్లను ఎగురవేశారు. ప్రధాని మద్రాస్ ఐఐటీకి వెళ్లే సమయంలో కొందరు ఆయన వ్యతిరేక నినాదాలు చేశారు. డీఎంకేతోపాటు సీపీఐ, సీపీఎం, ఎండీఎంకే పార్టీల నేతలు నిరసనల్లో పాల్గొన్నారు. చెన్నైతోపాటు దిండిగల్, కరూర్, రామనాథపురం, విరుధునగర్, మదురై, కోయంబత్తూర్లలోనూ ఇదే విధంగా నిరసనలు వ్యక్తమయ్యాయి. డీఎంకే అధినేత కరుణానిధి, స్టాలిన్, ఎంపీ కనిమొళి తదితర నేతల ఇళ్ల వద్ద నల్లజెండాలు ఎగురవేశారు. ఎప్పుడూ తెల్లని దుస్తుల్లో కనిపించే కరుణానిధితోపాటు వర్కింగ్ ప్రెసిడెంట్ స్టాలిన్, కనిమొళి నల్లరంగు దుస్తులు ధరించి నిరసన తెలిపారు. చెన్నైలో మోదీ వ్యతిరేక నినాదాలిస్తున్నకనిమొళి, డీఎంకే నేతలు దేశీయంగా ఫైటర్ జెట్ల తయారీ తిరువిడందై: ఎఫ్ఏ–18 సూపర్ హార్నెట్ విమానాలను భారత్లోనే తయారుచేసేందుకు అమెరికా విమానయాన సంస్థ బోయింగ్ ముందుకొచ్చింది. ఈ మేరకు హిందుస్తాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్(హెచ్ఏఎల్), మహీంద్రా డిఫెన్స్ సిస్టమ్స్(ఎండీఎస్)లతో భాగస్వామ్యం కుదుర్చుకుంది. ప్రతిపాదిత ఒప్పందం ప్రకారం..మేకిన్ ఇండియా కార్యక్రమంలో భాగంగా అడ్వాన్స్డ్ మీడియం కంబాట్ విమానాల తయారీకి మన దేశంలో అధునాతన రక్షణ ఉత్పత్తి కేంద్రాన్ని నిర్మిస్తారు. ఈ భాగస్వామ్యం ద్వారా భారత్లోనే భవిష్యత్ సాంకేతికతలను రూపొందిస్తామని బోయింగ్ వెల్లడించింది. చెన్నైలో జరుగుతున్న డిఫెన్స్ ఎక్స్పోలో రెండో రోజైన గురువారం ఈ నిర్ణయం వెలువడింది. భారత వాయుసేనకు 110 యుద్ధ విమానాలను సరఫరా చేసే డీల్ రేసులో లాక్హీడ్ మార్టిన్, సాబ్, డసాల్ట్ తదితర దిగ్గజ కంపెనీలతో పాటు బోయింగ్ కూడా ఉంది. మేకిన్ ఇండియాలో భాగంగా ఇక్కడే తయారీని ప్రారంభిస్తే సుమారు 15 బిలియన్ డాలర్ల ఆ కాంట్రాక్టు కూడా బోయింగ్కే దక్కే అవకాశాలు మెండుగా ఉన్నాయి. -
రాశీఖన్నాకు రోబో షేక్హ్యాండ్
సాక్షి, హైదరాబాద్: అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా తెలంగాణ పోలీస్ శాఖ, షీ టీమ్స్ సంయుక్తంగా పోలీస్ ఎక్స్పోను ప్రారంభించారు. నగరంలోని పీపుల్స్ప్లాజాలో నిర్వహించిన ఈ ప్రదర్శనను రాష్ట్ర హోంమంత్రి నాయిని నర్సింహారెడ్డి ప్రారంభించారు. రెండు రోజుల పాటు జరుగనున్న ఈ ఎక్స్పోలో పలు విషయాలపై అవగాహన కల్సించనున్నారు. ఈ కార్యక్రమానికి నటి రాశీఖన్నాతో పాటు, తెలంగాణ డీజీపీ మహేందర్ రెడ్డి, షీటీమ్స్ ఇన్చార్జ్ స్వాతి లక్రా తదితరులు పాల్గొన్నారు. ఎక్స్ పో ప్రారంభం అనంతరం నాయిని నర్సింహారెడ్డి మాట్లాడుతూ పోలీస్ ఎక్స్పో ఏర్పాటు చేసినందుకు సంతోషంగా ఉందన్నారు. మహిళల భద్రతను తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా తీసుకుందని తెలిపారు. స్వాతిలక్రా నేతృత్వంలో షీ టీమ్స్ అద్భుతంగా పనిచేస్తున్నాయని.. షీ టీమ్స్ దేశానికే ఆదర్శమని కొనియాడారు. రోబో మిత్రా సందడి గతేడాది జరిగిన గ్లోబల్ ఎంటర్పెన్యూర్షిప్ సమ్మిట్లో(జీఈఎస్) ప్రారంభ వేడుకల్లో ప్రధాన ఆకర్షణగా నిలిచిన మర మనిషి ' మిత్ర' ఈ ఎక్స్పోలో ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. ఎక్స్పోకు వచ్చిన అతిథులకు స్వాగతం పలకడంతో పాటు స్వాగతోపన్యాసం కూడా చేసింది. కార్యక్రమంలో పాల్గొన్న రాశీఖన్నాకు రోబో షేక్హ్యాండ్ ఇచ్చి సందడి చేసింది. రెండు రోజుల పాటు స్టాల్స్ వద్దే ఉండి సందర్శకులతో మమేకం కానుంది. గంటకు 30 కిమీ వేగంతో పరుగెట్టే సామర్థ్యం కలిగిన మిత్ర ఆదివారం జరుగనున్న షీ టీమ్స్ రన్లోనూ పాల్గొననుంది. -
మెడి‘కాల్’ అదుర్స్..
-
వినిపించే బీపీ.. నిలబెట్టి సర్జరీ..
సాక్షి, హైదరాబాద్ : వైద్య రంగంలో అందుబాటులోకి వచ్చిన అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానం ఏమిటి..? మార్కెట్లో లభిస్తున్న సరికొత్త మెడికల్ ఉత్పత్తులు ఏవి? వాటిని ఎలా వినియోగించాలి? ఇలాంటి అనేక అంశాల గురించి భావివైద్యులకు పరిచయం చేసేందుకు ఏర్పాటు చేసిందే ప్రతిష్టాత్మక ‘మెడికాల్’హాస్పిటల్ నీడ్ ఎక్స్పో–2018. శుక్రవారం హైటెక్స్లో మెడికాల్ ఎక్స్పో ఘనంగా ప్రారంభమైంది. ఇండియన్ మెడికల్ అసోసియేషన్(ఐఎంఏ) తెలంగాణ అధ్యక్షుడు టి.నర్సింగారెడ్డి ముఖ్యఅతిథిగా హాజరై ఎక్స్పోను ప్రారంభించారు. దేశవిదేశాలకు చెందిన సుమారు వంద కంపెనీలు వివిధ రకాల ఆపరేషన్ టేబుళ్లు, లైట్లు, సీజర్లు, అనెస్థీషియా యంత్రాలతోపాటు పల్స్ ఆక్సోమీటర్లు, వెంటిలేటర్లు, గైనకాలజీ ఎగ్జామినేషన్ టేబుళ్లు, ఆర్థో, న్యూరో, ల్యాప్రోస్కోపిక్, కార్డియో థొరాసిక్ సర్జికల్, ఈసీజీ మిషన్లు, మానిటర్లు, పీడియాట్రిక్ వార్మర్లు, అత్యాధునిక హైడ్రాలిక్ పడకలు, రకరకాల డిస్పోజల్స్, మైక్రోస్కోపులు, గ్లౌజులు, మాస్కులు ఇలా ఐదు వేల రకాల సర్జికల్, నాన్ సర్జికల్ వైద్య పరికరాలను ప్రదర్శించాయి. భావి వైద్యులు, నర్సింగ్ విద్యార్థులు ఈ పరికరాలను చూసి.. వాటి వినియోగం గురించి తెలుసుకునేందుకు ఎక్స్పోకు భారీగా తరలివచ్చారు. టేబుల్పై నిలబెట్టి సర్జరీ.. సాధారణంగా రోగులను ఆపరేషన్ థియేటర్లోని టేబుల్పై పడుకోబెట్టి సర్జరీ చేస్తారు. కానీ ఊబకాయంతో బాధపడుతున్న రోగులను మాత్రం టేబుల్పై నిలబెట్టి బెరియాట్రిక్ సర్జరీ చేస్తారు. వీరి కోసం స్టాన్ కంపెనీ ప్రత్యేకంగా ఓటీ టేబుల్ను తయారు చేసింది. దీన్ని వైద్యుడు తనకు ఎలా కావాలంటే అలా ఉపయోగించుకోవచ్చు. దీని ధర రూ. 8.5 లక్షల వరకు ఉంది. వైద్యుడి పర్యవేక్షణ అవసరం లేకుండా.. శ్వాస కూడా తీసుకోలేని పరిస్థితుల్లో ఐసీయూలో చికిత్స పొందుతున్న రోగికి వెంటిలేటర్ సహాయంతో కృత్రిమ శ్వాసను అందిస్తుంటారు. రోగికి దీనిని అమర్చిన తర్వాత వైద్యులు, నర్సులు అక్కడే ఉండి మానిటర్ చేస్తుంటారు. ఇటీవల మార్కెట్లోకి వచ్చిన ‘హామిల్టన్ సి–3’రోబోటిక్ వెంటిలేటర్ను ఒకసారి రోగికి అమర్చితే చాలు.. ఆ తర్వాత వైద్యుల పర్యవేక్షణ అవసరం లేకుండా ఆటోమేటిక్గా వెంటిలేషన్ సపోర్ట్ను అందిస్తుంది. రోగి ఆరోగ్య పరిస్థితిపై దానికదే ఓ అంచనాకు వస్తుంది. ఆ మేరకు శ్వాసను అందిస్తుంది. స్విట్జర్లాండ్ నుంచి దిగుమతి అవుతున్న ఈ మిషన్ ఖరీదు రూ.20 లక్షల వరకు ఉంటుంది. అంధుల కోసం ప్రత్యేక బీపీ మిషన్.. ప్రస్తుతం మార్కెట్లో చాలా రకాల డిజిటల్ బీపీ మిషన్లు అందుబాటులో ఉన్నాయి. ఇంట్లోనే ఎప్పటికప్పుడు బీపీ చెక్ చేసుకునేందుకు వీలుగా అక్యుర కంపెనీ అందుబాటులోకి తెచ్చిన డిజిటల్ బీపీ మిషన్.. బీపీని మానిటర్పై నమోదు చేయడంతో పాటు ఆ విషయాన్ని వాయిస్ రూపంలో ప్రకటిస్తుంది. చదువురాని, కంటి చూపులేని రోగులకు ఇది ఎంతో ఉపయోగపడుతుంది. దీని ధర రూ.4,700. శ్రమించకుండానే బాడీ మసాజ్.. మనిషి పరిపూర్ణ ఆరోగ్యంగా ఉండాలంటే రోజూ శరీరానికి తగిన వ్యాయామం అవసరం. చాలా మంది వాకింగ్, రన్నింగ్, యోగా వంటివి సాధన చేస్తుంటారు. అయితే ఉదయాన్నే నిద్ర లేచి కిలోమీటర్ల కొద్దీ నడిచే ఓపిక, సమయం చాలా మందికి ఉండటం లేదు. ఇలాంటి వారి కోసం ఫుల్బాడీ మసాజ్ చైర్ అందుబాటులోకి వచ్చింది. చైర్లో అరగంట కూర్చుంటే చాలు బాడీమసాజ్ పూర్తయినట్లే. దీని కోసం రూ.3.5 లక్షల నుంచి రూ.5.5 లక్షల వరకు విలువ చేసే చైర్లు అందుబాటులో ఉన్నాయి. -
అంతర్జాతీయ వినియోగదారుల ఎక్సపో ప్రారంభం
బీచ్రోడ్: శుక్రవారం ఆర్కేబీచ్ వద్ద వున్న నోవెటల్లో అంతర్జాతీయ వినియోగదారుల ఎక్స్పో ఘనంగా ప్రారంభమైంది. ఈ ఎక్స్పోలో పలు అంతర్జాతీయ బ్రాడ్స్కు చెందిన వస్తువులు ఏర్పాటు చేశారు. ఈ ఎక్స్పో వివిధ రాష్ట్రలకు చెందిన వస్తువులు అందుబాటులో ఉంచారు.. -
14,15 తేదీల్లో హార్మోన్అండ్ హెల్త్ ఎక్స్పో–2016
సాక్షి, విశాఖపట్నం : మహిళలు, యువకులు, బాలికల్లో వస్తున్న హార్మొన్లసమస్యలు–శాస్త్రీయ పరిష్కారంపై విశాఖపట్నంలోని కళావాణిపోర్టు ఆడిటోరియంలో ఈ నెల 14, 15 తేదీల్లో హార్మోన్ అండ్ హెల్త్ ఎక్స్పో–2016 నిర్వహిస్తున్నట్టు సాయిస్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఎండోక్రినాలజీ ప్రతినిధి, ప్రొ.శ్రీవల్లి తెలిపారు. ఈసదస్సును రాష్ట్ర మానవవనరుల శాఖమంత్రి గంటా శ్రీనివాస్, పోర్టు చైర్మన్ ఎం.టి.కష్ణబాబులు ప్రారంభిస్తారన్నారు. అదేరోజు సాయంత్రం జరిగే మెడి కూచిపూడిని ఎంపీకంభంపాటి ప్రారంభిస్తారన్నారు. ఈసదస్సులో పాల్గొనదల్చిన వారు మరిన్ని వివరాల కోసం0891–2563969లో సంప్రదించాలని కోరారు. -
మీ ఇల్లు సింగారంగానూ...!
బీచ్రోడ్డు: స్మార్ట్ సిటీగా అభివద్ధి చెందుతున్న విశాఖ నగరంలో ఇలాంటి ఎక్స్పోను ఏర్పాటు చేసి నగర ప్రజలకు అందుబాటులోకి తీసుకువచ్చినందుకు అభినందనీయమని కలెక్టర్ ప్రవీణ్కుమార్ అన్నారు. బీచ్రోడ్డులో వున్న నోవెటల్లో ఆర్కిటెక్చర్, ఇంటిరియర్ ఎక్స్పో–2016ను కలెక్టర్ ప్రవీణ్ కుమార్ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈ ఆర్కిటెక్చర్ , ఇంటీరియర్ ఎక్స్పోను నగర ప్రజలు కచ్చితంగా సందర్శించాలన్నారు. ఈ కార్యక్రమంలో ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఆర్కిటెక్ట్స్ చైర్మన్ ఎస్ఎల్ఎన్ శాస్త్రి మాట్లాడుతూ నిర్మాణ రంగంలో కొత్తగా అందుబాటులోకి వస్తున్న నిర్మాణ సామగ్రి, ఆధునీకత నూతన విధానాలపై ప్రజలకు, విద్యార్థులకు అవగాహన కల్పించేందుకు ఐఐఏ కషి చేస్తుందని తెలిపారు. నిర్మాణ రంగంలో అందుబాటులోకి వచ్చిన నూతన పద్ధతులను తెలియజేయడమే ఈ ఎక్స్పో ప్రధాన ఉద్దేశమన్నారు. ఈ ఏడాది ఐఐఏ నిర్వహించనున్న అవగాహన కార్యక్రమంలో ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియన్ ఇంటీరియర్ డిజైనర్స్ భాగస్వామిగా ఉందన్నారు. వివిధ కాలేజీల ఆర్కిటెక్చర్ విద్యార్థుల పనితనాన్ని ఇందులో ప్రదర్శించనున్నారని తెలిపారు. ఈ ఎక్స్పోలో 50 సంస్థలకు చెందిన సుమారు 80 స్టాల్స్ను ఏర్పాటు చేశామని తెలిపారు. ఈ ఎక్స్పో శని,ఆదివారాల్లో ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 8 గంటల వరకు నిర్వహించనున్నట్లు పేర్కొన్నారు. ఈ ఎక్స్పోలో వినీర్స్, లామినేట్స్, ఏసీపీ, ఫ్లోరింగ్ అండ్ డెకరేటివ్ టైల్స్, శానిటరీ వేర్, టాయిలెట్లకు సంబంధించిన వస్తువులు ప్రదర్శించనున్నామని వివరించారు. ఈ కార్యక్రమంలో భాగంగా ఫొటోగ్రఫీ పోటీలు నిర్వహించనున్నామని తెలిపారు. ఆసక్తిగల వారు గూగుల్ ప్లే స్టోర్లో ‘ఆర్కిటెక్చర్ అండ్ ఇంటిరియర్ ఎక్స్పో’ పేరుతో ఉన్న యాప్ను డౌన్లోడు చేసుకొని మీరు తీసిన అందమైన భవనాల ఫొటోలను అప్లోడు చేయాలని కోరారు. విజేతలకు ఆదివారం బహుమతులు అందజేస్తామని తెలిపారు.ఈ కార్యక్రమంలో జీవీఎంసీ కమిషనర్ హరి నారాయణ న్, వుడా వైస్ చైర్మన్ బాబూరావు నాయుడు తదితరులు పాల్గొన్నారు. -
రాజధానిలో 'వరల్డ్ స్టేషనరీ ఎక్స్ పో'..!
న్యూఢిల్లీః పాఠశాల విద్యార్థులకు, కార్యాలయాలకు కావలసిన పరికరాలు, నోట్ బుక్ లు, డైరీలు మొదలైన ఉత్పత్తులతో కూడిన ప్రపంచ స్టేషనరీ ఎక్స్ పో దేశ రాజధాని నగరంలో ప్రారంభం కానుంది. జూలై 29న ప్రారంభమయ్యే అతిపెద్ద ఎక్స్ పో మూడురోజులపాటు కొనసాగనుంది. దేశ రాజధాని నగరం ఢిల్లీ ప్రగతి మైదానంలో ప్రపంచ స్టేషనరీ ఎక్స్ పో శుక్రవారం ప్రారంభం కానుంది. సుమారు 7000 నుంచి 8000 వరకూ స్టేషనరీ ఉత్పత్తులే లక్ష్యంగా ఈ ప్రదర్శన ఏర్పాటు చేస్తున్నారు. మెక్స్ ఎగ్జిబిషన్స్ ప్రైవేట్ లిమిటెడ్ ఈ ప్రత్యేక ప్రదర్శనను నిర్వహిస్తుంది. జూలై 29న ప్రారంభమై మూడు రోజుల పాటు అంటే 31వ తేదీ వరకూ జరిగే ఈ స్టేషనరీ ఫెయిర్ లో ప్రపంచవ్యాప్తంగా దొరికే వివిధ రకాల స్టేషనరీ ఉత్పత్తులు ఒకేచోట లభ్యమయ్యేట్లుగా.. వన్ స్టాప్ హబ్ ను ప్రారంభిస్తున్నట్లు నిర్వాహకులు చెప్తున్నారు. ఈ స్టేషనరీ ఎక్స్ పో లో వారి వారి బడ్జెట్ ను బట్టి చిన్న, మధ్య తరహా, భారీ కార్యాలయాలు, సంస్థలు, విద్యా సంస్థలు, మొదలైన అన్ని తరహాల వారికి అందుబాటులో ఉండేట్లుగా స్టేషనరీ ఉత్పత్తులను ఇక్కడ ఉంచనున్నారు. వినియోగదారులు ముఖ్యంగా ఆఫీసు, సంస్థలకు అవసరమైన పరికరాలను, ఉత్పత్తులను కొనుగోలు చేసేందుకు ఈ భారీ ఎక్స్ పో ప్రధాన కేంద్రంగా చెప్పొచ్చు. పెన్నులు, పెన్నిళ్ళు, కాగితాలు వంటి కార్యాలయాలు, విద్యాసంస్థలకు సంబంధించిన ఉత్పత్తులతోపాటు, పదిరూపాయలు మొదలుకొని వంద రూపాయల వరకూ అన్ని పరిథుల్లోనూ వస్తువులు అందుబాటులో ఉంటాయని మెక్స్ ఎక్స్ పో ఎగ్జిబిషన్ డైరెక్టర్ హిమానీ గులాటీ తెలిపారు. దీంతోపాటు గిఫ్ట్ ఎక్స్ పో, ఆఫీస్ ఎక్స్ పో పేరున మరో రెండు ప్రదర్శనలు కూడా ఇక్కడ ఏర్పాటు చేస్తున్నట్లు వెల్లడించారు. జాతీయ, అంతర్జాతీయ బ్రాండ్లతో కూడిన సుమారు 150 కంపెనీల వస్తువులు ఈ ప్రత్యేక వేదికలో లభ్యమౌతాయని గులాటీ తెలిపారు. -
హైదరాబాద్లో గాడ్జెట్ ఎక్స్పో
-
అబ్బురం..ఈ3 త్రీడీ గేమ్స్ ప్రపంచం
-
ఫ్యాషన్ లైఫ్ స్టైల్
ట్రెండ్జ్ ఎగ్జిబిషన్ పాఠశాల మూవీ టీమ్ సందడి చేసింది. బంజారాహిల్స్లోని తాజ్కృష్ణలో మంగళవారం ప్రారంభమైన ఎక్స్పో తారల సందడికి వేదికగా నిలిచింది. హీరో నందు, హీరోయిన్ శిరీష, నటులు శశాంక్, హమూద్ ఎక్స్పో ఓపెనింగ్లో పాల్గొన్నారు. ఈ రోజుతో ముగియనున్న ఈ మేళాలో 110 మంది డిజైనర్లు రూపొందించిన జ్యుయలరీ వెరైటీలు ఫ్యాషన్ ప్రియులను కట్టిపడేస్తున్నాయి. డిజైనర్ వేర్, బ్రైడల్ జ్యుయలరీ, కాంటెంపరరీ ఆభరణాలు, యాక్సెరీస్, కిడ్స్ వేర్, లెహంగాస్, ట్రెడిషనల్ హ్యాండ్లూమ్స్ సిటీవాసులను అలరిస్తున్నాయి. దీపావళి ఫెస్ట్ కోసం ప్రత్యేకంగా పూజా సెట్స్ కూడా ఎక్స్పోలో అందుబాటులో ఉన్నాయి. -
ఆకట్టుకున్న హార్టికల్చర్ ఎక్స్పో