ఐఐసీటీ శాస్త్రవేత్తలకు అరుదైన గుర్తింపు | Hyderabad: CRSI Honour For 3 IICT Scientists | Sakshi
Sakshi News home page

ఐఐసీటీ శాస్త్రవేత్తలకు అరుదైన గుర్తింపు

Published Wed, Jul 13 2022 3:27 AM | Last Updated on Wed, Jul 13 2022 3:27 AM

Hyderabad: CRSI Honour For 3 IICT Scientists - Sakshi

డాక్టర్‌ దేబేంద్ర, డాక్టర్‌ ప్రథమ, డాక్టర్‌ డి.శ్రీనివాసరెడ్డి 

సాక్షి, హైదరాబాద్‌: ఇండియన్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ కెమికల్‌ టెక్నాలజీ (ఐఐసీటీ)కి చెందిన ముగ్గురు శాస్త్రవేత్తలకు కెమికల్‌ రీసెర్చ్‌ సొసై­టీ ఆఫ్‌ ఇండియా (సీఆర్‌ఎస్‌ఐ) నుంచి అరుదైన గుర్తింపు లభించింది. దేశ­వ్యా ప్తంగా రసాయన శాస్త్ర పరిశోధనలు చేస్తున్న 30 మంది శాస్త్రవేత్తలను కాంస్య పతకాలకు ఎంపిక చేయగా అందులో ఐఐసీటీలో సీనియర్‌ ప్రిన్సిపల్‌ సైంటిస్ట్‌లుగా పని­చేస్తున్న డాక్టర్‌ ప్రథమ ఎస్‌.­మైన్‌కర్, డాక్టర్‌ దేబేంద్ర కె.మహాపాత్ర, ఐఐసీటీ డైరెక్టర్‌ డాక్టర్‌ డి.శ్రీనివాసరెడ్డి ఉన్నారు.

డాక్టర్‌ డి.శ్రీనివాసరెడ్డికి దర్శన్‌ రంగనాథన్‌ స్మారక ఉపన్యాసకుడిగా గుర్తింపు లభించింది. మొహాలీలో ఇటీవల జరి­గిన 29వ సీఆర్‌­ఎస్‌ఐ జాతీయ సదస్సులో ఈ అవార్డులను అందజేశారు. మెడిసినల్‌ కెమి­స్ట్రీ, కృత్రిమ సేంద్రియ రసాయన శాస్త్రం, కొత్త మందుల ఆవిష్కరణ వంటి రంగా­ల్లో డాక్టర్‌ ప్రథమ పరిశోధనలు చేస్తుండగా.. వైద్యానికి కీల­కమైన సంక్లిష్ట­మైన సహజ రసాయనాలు గుర్తిం­చేందుకు డాక్టర్‌ దేబేంద్ర కృషి చేస్తు­న్నారు. ఫార్మా రంగంతోపాటు సీఎస్‌ఐఆర్‌ వ్యవస్థలోనూ అనుభవం గడించిన డాక్టర్‌ డి.శ్రీనివాసరెడ్డి సేంద్రియ, మెడిసినల్‌ రసాయన శాస్త్ర రంగాలను మానవ సంక్షేమానికి వర్తించే దిశగా కృషి చేస్తున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement