
నవీన్కుమార్
ఏన్కూరు: ఖమ్మం జిల్లాకు చెందిన వైద్య విద్యార్థి ఏపీలోని విజయవాడలో ఆత్మహత్య చేసుకున్నాడు. ఖమ్మం జిల్లా ఏన్కూరు మండలం భగవాన్ నాయక్ తండాకు చెందిన బానోతు నవీన్కుమార్ (23) విజయవాడలోని సిద్ధార్థ మెడికల్ కళాశాలలో మెడిసిన్ తృతీయ సంవత్సరం చదువుతున్నాడు.
ఈ నెల 15వ తేదీన అతను విజయవాడలోని తన గదిలో పురుగు మందు తాగగా స్నేహితులు ఆస్పత్రిలో చేర్పించి తల్లిదండ్రులకు సమాచారం ఇచ్చారు. అప్పటి నుంచి చిక్సిత పొందుతున్న నవీన్ శనివారం ఉదయం మృతి చెందగా మృతదేహాన్ని స్వగ్రామానికి తీసుకొచ్చారు. కాగా, నవీన్ ఆత్మహత్యకు కారణాలు తెలియల్సి ఉందని అంటున్నారు.