
సాక్షి, హైదరాబాద్: కోకాపేట జీఏఆర్ బిల్డింగ్లో భారీ అగ్ని ప్రమాదం జరగలేదని నార్సింగి ఏసీపీ రమణ గౌడ్ తెలిపారు. బిల్డింగ్లో రెస్టారెంట్ పనులు జరుగుతున్నాయని.. గ్యాస్ లీక్ అయ్యిందని తెలిపారు. దీంతో గ్యాస్ పీల్చి కార్మికులు అపస్మారక స్థితిలోకి వెళ్లారన్నారు. వారిని వారిని కాంటినెంటల్ ఆసుపత్రికి తరలించామని తెలిపారు. కాంటినెంటల్ ఆస్పత్రి నుంచి నార్సింగి పోలీసులకు సమాచారం అందడంతో ఘటనా స్థలికి చేరుకున్న నార్సింగి పోలీసులు దర్యాప్తు చేపట్టారు.
కాగా, మొదట కోకాపేట జీఏఆర్ బిల్డింగ్లో భారీ అగ్ని ప్రమాదం జరిగిందని.. ఈ ఘటనలో పలువురు ఐటీ ఉద్యోగులు గాయపడ్డారంటూ ప్రచారం జరిగింది. కొందరి పరిస్థితి విషమంగా ఉందని.. బిల్డింగ్లో ఉన్న రెస్టారెంట్లో గ్యాస్ సిలిండర్ పేలడంతో ఈ ప్రమాదం జరిగినట్లు వార్తలు వచ్చాయి.
Comments
Please login to add a commentAdd a comment