
యాదాద్రిలో ఆదివారం నుంచి కొత్త నిబంధన ప్రభుత్వం అమలు చేయనుంది.
సాక్షి, యాదాద్రి జిల్లా: యాదాద్రిలో ఆదివారం నుంచి కొత్త నిబంధన ప్రభుత్వం అమలు చేయనుంది. కొండపై వాహనం పార్క్ చేస్తే గంటకు రూ.500, ఆ తర్వాత ప్రతి గంటకు రూ.వంద చొప్పున వసూలు చేయాలని నిర్ణయించినట్లు ఆలయ ఈవో తెలిపారు. వీఐపీలు, ప్రజాప్రతినిధులకు వాహన రుసుము నుంచి మినహాయింపు ఇచ్చారు. వాహనాల పార్కింగ్ ఫీజు వసూళ్లపై భక్తులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
చదవండి: తెలంగాణ సీఎస్పై సీజేఐ జస్టిస్ ఎన్వీ రమణ ఆగ్రహం