చేనేత కార్మికుల రుణమాఫీకి రూ.33 కోట్లు మంజూరు | Rs 33 Crore Released For Loan Waiver Scheme For Handloom Workers In Telangana, More Details Inside | Sakshi
Sakshi News home page

చేనేత కార్మికుల రుణమాఫీకి రూ.33 కోట్లు మంజూరు

Jul 2 2025 6:10 AM | Updated on Jul 2 2025 11:16 AM

Rs 33 Crore Released For Loan Waiver Scheme For Handloom Workers: Telangana

ఉత్తర్వులు జారీ చేసిన ప్రభుత్వం

సాక్షి, హైదరాబాద్‌: రాష్ట్రంలోని చేనేత కార్మికులకు ఊరట కలిగించేలా ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ‘చేనేత కార్మికులకు రుణమాఫీ పథకం’కింద రూ.33 కోట్లు మంజూరు చేస్తూ పరిశ్రమలు, వాణిజ్య శాఖ తరఫున ముఖ్యకార్యదర్శి శైలజారామయ్యర్‌ ఉత్తర్వులు జారీ చేశారు. 2025–26 బడ్జెట్‌ నిధుల నుంచి ఈ మొత్తాన్ని విడుదల చేయనున్నారు. చేనేత కార్మికులపై ఉన్న అప్పులను తీర్చేందుకు ఈ నిధులను వినియోగిస్తారు. హ్యాండ్లూమ్స్, టెక్స్‌టైల్స్, అప్పారెల్‌ ఎక్స్‌పోర్ట్‌ పార్క్స్‌ కమిషనర్‌కు ఈ నిధులను విడుదల చేసి, లబ్ధిదారులకు చెల్లించేందుకు పూర్తి అధికారం ఇచ్చారు.

రూ.33 కోట్లను చేనేత కార్మికులకు రుణమాఫీగా చెల్లించేందుకు అవసరమైన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ఆర్థికశాఖ ఇచ్చిన అనుమతితో 2025 జూన్‌ 24న విడుదలైన నోటు ఆధారంగా ఈ ఆదేశాలు జారీ అయినట్టు తెలిపారు. ఈ నిర్ణయం చేతివృత్తులను ఆధారంగా చేసుకొని జీవిస్తున్న వేలాది చేనేత కార్మికులకు పెద్ద ఊరటగా నిలుస్తుందని, వడ్డీల భారంతో సతమతమవుతున్న నేతన్నలకు ఇది ఊరట కలిగించే నిర్ణయమని ప్రభుత్వం పేర్కొంది. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement